• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: December 2015

అమెరికా ఎందుకు వామపక్షం వైపు పయనిస్తోంది ?

31 Thursday Dec 2015

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, USA

≈ Leave a comment

Tags

Atlantik, Occupy Wall Street, PETER BEINART, US Elections, US Left, US Political Debate

 

మారుతున్న ప్రపంచం-3

పీటర్‌ బెయినార్ట్‌

అమెరికా ఎందుకు వామపక్షం వైపు పయనిస్తోంది అనే శీర్షికతో అమెరికాలోని అట్లాంటిక్‌ పత్రికలో పీటర్‌ బెయినార్ట్‌ రాసిన విశ్లేషణ గురించి గత భాగంలో కొన్ని అంశాలు చెప్పుకున్నాం. పాఠకులకు మరిన్ని వివరాలు, పూర్వరంగాన్ని తెలియచేసేందుకు సుదీర్ఘమైన ఆ వ్యాసాన్ని సంక్షిప్తీకరించి ముఖ్యాంశాలను ఇవ్వటం అవసరమన్న సూచనల మేరకు ఇక్కడ ఇస్తున్నాను.అందువలన ఇంతకు ముందు భాగంలో పేర్కొన్న అంశాలు పునశ్చరణ చేయటం లేదు. దీనిలోని అంశాలన్నీ మూల రచయిత అభిప్రాయాలే.: ఎంకెఆర్‌

రిపబ్లిక్లన్లు పార్లమెంట్‌ మరియు దేశంలోని ప్రభుత్వకార్యాలయాలను తాళాలతో కట్టడి చేయవచ్చు, అధ్యక్ష ఎన్నికలో మంచి విజయం సాధించగలరేమో కానీ బరాక్‌ ఒబామా హయాంలో ప్రవేశ పెట్టబడిన వుదారవాద యుగం ప్రారంభం మాత్రమే. గత పద్దెనిమిది నెలలుగా సంభవించిన దిగువ ఘటనలు దేశాన్ని నిశ్చేష్టితురాలిని చేశాయి. 2014 జూలైలో చట్టవిరుద్దంగా సిగిరెట్లు అమ్ముతున్నాడనే పేరుతో ఆఫ్రికన్‌ అమెరికన్‌ యుకుడు ఎరిక్‌ గార్నర్‌ను న్యూయార్క్‌ పోలీసులు వూపిరి ఆడకుండా చేసి చంపివేశారు. అదే ఏడాది ఆగస్టులో డారెన్‌ విల్సన్‌ అనే శ్వేతజాతి పోలీసు అధికారి మైకేల్‌ బ్రౌన్‌ అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ కుర్రవాడిని ఫెర్గూసన్‌ పట్టణంలో కాల్చి చంపాడు.దీంతో తలెత్తిన రెండు వారాల నిరసనల కారణంగా పట్టణం యుద్ధ ప్రాంతం మాదిరి కనిపించిందని మిసౌరీ రాష్ట్ర గవర్నర్‌ స్వయంగా వ్యాఖ్యానించాడు. అదే ఏడాది డిసెంబరులో గార్నర్‌, బ్రౌన్‌ల మరణానికి ప్రతీకారంగా నేర చరిత్ర వున్న ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ ఇద్దరు న్యూయార్క్‌ నగర పోలీసులను మట్టుపెట్టాడు.వారి అంత్యక్రియలకు హాజరైన నగర మేయర్‌ వుదారవాద మేయర్‌ బిల్‌ డి బ్లాసియోకు వెన్ను చూపి పోలీసులు నిరసన తెలిపారు.

గతేడాది ఏప్రిల్‌లో మరొక ఆఫ్రికన్‌ అమెరికన్‌ యువకుడు ఫ్రెడ్డీ గ్రే పోలీసు కస్టడీలో మరణించాడు.దాంతో తలెత్తిన నిరసనలలో బాల్టిమోర్‌లో 200 వాణిజ్య సంస్ధలు నాశనమయ్యాయి, 113 మంది పోలీసులు గాయపడ్డారు, 486 మంది పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. జూలైలో నల్లజాతి వుద్యమ కార్యకర్తలు ఇద్దరు డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్ధుల వుపన్యాసాలను అడ్డుకోవటం ద్వారా జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఒక వేళనేను పోలీసు కస్టడీలో మరణిస్తే దానికి ప్రతీకారంగా ఏ పద్దతిలో అయినా మరొకరిని మట్టుపెట్టండి, ప్రతిదాన్నీ తగుల పెట్టండి అంటూ నల్లజాతి వుద్యమ కార్యకర్తలు నినదించారు. దాంతో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి మార్టిన్‌ ఓ మల్లీ మాట్లాడుతూ నల్లజాతీయులవైనా తెల్లజాతీయులవైనా ప్రాణాలు ప్రాణాలే అని మాట్లాడి నిరసనలను ఎదుర్కొని తరువాత క్షమాపణలు చెప్పాడు.

రోనాల్డ్‌ రీగన్‌ దేశాన్ని మితవాదం వైపు ఎలా నడిపాడో నేను చూశాను, బిల్‌ క్లింటన్‌ దానిని కొనసాగిస్తూ తమ పార్టీ నేరాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తుందని శ్వేతజాతి అమెరికన్లకు హామీ ఇచ్చారు.నల్లజాతీయుల జీవిత సమస్య గురించి ఈ ఏడాది డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులు నలిగిపోవటాన్ని, వాటిని వామపక్ష అంశాలుగా హిల్లరీ క్లింటన్‌ సైద్దాంతిక హెచ్చరిక ముద్రవేయటం చూసిన తరువాత తీవ్రమైన మితవాద ప్రతిస్పందనకు దేశం సిద్దం కావాల్సి వుంటుందని నేను వూహించాను. కానీ నేను వూహించింది తప్పు. ఒబామా వుదారవాదానికి వెల్లడైన వ్యతిరేకత బలం కంటే గొంతు పెద్దదిగా వుంది. దేశం మితవాదం వైపు కంటే మొత్తంగా చూస్తే వామపక్షం వైపు తిరుగుతోంది.

1960 దశకం చివరిలో 70 దశకం మధ్యలో మిలిటెంట్‌ వామపక్షం మరియు జాతి పరమైన జగడాల మధ్య వుదారవాద యుగం అంతమైంది.ఈ రోజు మిలిటెంట్‌ వామపక్షం మరియు జాతి పరమైన జగడాల మధ్య వుదారవాద యుగం కేవలం ప్రారంభమైంది. డెమోక్రటిక్‌ పార్టీ మరియు ముఖ్యంగా దేశం మొత్తం మీద మరింత వుదారంగా ఎందుకు తయారవుతోందో అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంది. డెమోక్రటిక్‌ పార్టీ వామపక్ష దిశగా ప్రయాణ కధలో రెండు ఆధ్యాయాలు వున్నాయి. మొదటిది జార్జి డబ్ల్యు బుష్‌ అధ్యక్షత గురించి. బుష్‌కు ముందు డెమోక్రటిక్‌ పార్టీలో బలమైన మధ్యేవాద విభాగం వుంది.అది రోనాల్డ్‌ రీగన్‌ మిలిటరీ చర్యలను ఎక్కువగా సమర్ధించింది. స్వలింగ సంపర్కులకు మిలిటరీలో అవకాశం కల్పించాలన్న బిల్‌క్లింటన్‌ ప్రయత్నాలను పడకుండా చేసింది. కనీసవేతన పెంపుదలను వ్యతిరేకించింది. ఆదాయ పన్ను రేటును 70నుంచి 50శాతానికి తగ్గించటం, ప్రభుత్వ నియంత్రణలను మరింత సడలించిన రీగన్‌ నిర్ణయాల కారణంగా ఆర్ధిక అభివృద్ధి జరిగిందని 1980దశకం చివరిలో 1990దశకంలో ఈ విభాగం వాదించింది. పన్నురేటును బుష్‌ 2001లో 35శాతానికి తగ్గించటం, నియంత్రణలను బలహీన పరచారు, అయినప్పటికీ అసమానత, లోటు బడ్జెట్‌ మరింత పెరిగింది, ఆర్ధిక వ్యవస్ధ పురోగమించింది లేదు ఆ తరువాత ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. డెమోక్రాట్‌ మధ్యేవాదులు 1980ల చివరిలో 1990దశకంలో మరికొన్ని వాదనలు కూడా చేశారు. రక్షణ ఖర్చును పెంచి,ఆఫ్ఘన్‌ ముజాహిదీన్‌లకు సాయం చేసి సోవియట్‌ను కూల్చివేసేందుకు రీగన్‌ నిర్ణయాలు సాయం చేశాయని చెప్పారు. కానీ 2003లో బుష్‌ ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధం ప్రకటించి వియత్నాం యుద్ధం(దురాక్రమణ) తరువాత అత్యంత పెద్ద విదేశాంగ విధాన విపత్తుకు కారకుడయ్యాడు.

వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం ఆరిపోయి వుండవచ్చుగానీ అది అమెరికన్‌ రాజకీయ చర్చలో ఆర్ధిక అసమానత అంశాన్ని చొప్పించిందని అసోసియేటెడ్‌ ప్రెస్‌ వ్యాఖ్యానించింది. రీగన్‌ విధానాల కొనసాగింపు మాదిరే జరుగుతుందని డెమోక్రటిక్‌ మధ్యేవాదులు భావించిన కారణంగా 2001లో బుష్‌ పన్నుల తగ్గింపు ప్రతిపాదనను సెనెట్‌లో 12మంది, ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధ ప్రతిపాదనను 29 మంది డెమోక్రాట్ల మద్దతుతో నెగ్గించకున్నాడు. దీని పర్యవసానాలతో మధ్యేవాదులపై తిరుగుబాటు కారణంగా పార్టీలో అది నాశనమైంది. దానికి నాయకత్వం వహించిన వారిలో ఒకడైన వెర్‌మాంట్‌ గవర్నర్‌ హోవార్డ్‌ డీన్‌ డెమోక్రటిక్‌ నాయకత్వం ఏకపక్ష దురాక్రమణ యుద్దాన్ని ఎందుకు సమర్ధించిందో, పన్నుల తగ్గింపునకు ఎందుకు మద్దతు పలికిందో తెలుసుకోవాలనుకుంటున్నానని 2003 ఫిబ్రవరిలో ధ్వజమెత్తాడు. అదే ఏడాది చివరిలో యుద్ధాన్ని సమర్ధించిన వాషింగ్టన్‌ డెమోక్రాట్లకు వ్యతిరేకంగా పార్టీలో అధ్యక్ష పదవి అభ్యర్దిగా అదే ఏడాది చివరిలో డీన్‌ ముందుకు వచ్చాడు.

ఆయన ప్రచారం డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్గతంగా మేథోపరమైన తిరుగుబాటుకు దారితీసింది. అతని తిరుగుబాటు వుదారవాదుల వెన్ను బలపడేందుకు డెయిలీ కోస్‌(ఇంటర్నెట్‌ పత్రిక) అంకితమయ్యేందుకు కారణమైంది, పార్టీలో ముందుకు పదండి అనే పురోగామి కార్యకర్తల బృందానికి శక్తినిచ్చింది. ఇదే సమయంలో అమెరికాలో అత్యంత పలుకుబడి కలిగిన వుదారవాద పత్రికా రచయితగా పాల్‌ క్రగ్మన్‌,టీవీ వ్యాఖ్యాతగా జాన్‌ స్టీవార్ట్‌ ముందుకు వచ్చారు.ఇదే విధంగా 2003లో ఎంఎస్‌ఎన్‌బిసి మీడియా సంస్ధ కెయిత్‌ ఒల్బర్‌మన్‌ను నియమించటమేగాక వుదారవాద నెట్‌వర్క్‌గా మారిపోయింది. ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధాన్ని సమర్ధించినందుకు న్యూ రిపబ్లిక్‌ పత్రిక 2004లో క్షమాపణలు చెప్పింది. డ్రడ్జ్‌ రిపోర్టుకు వుదారవాద ప్రత్యామ్నాయంగా 2005లో అఫింగ్టన్‌ పోస్టు పత్రిక అవతరించింది. డెమోక్రటిక్‌ పార్టీలో నోటి దురద వ్యక్తిగా పేరుమోసిన జో లిబర్‌మన్‌ సెనెట్‌ అభ్యర్ధిత్వ పోటీలో ఓడిపోయాడు,2011నాటికి గతంలో పార్టీపై పెత్తనం చేసిన డెమోక్రటిక్‌ లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ పూర్తిగా తన పలుకుబడిని కోల్పోయి మూదపడింది. అధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి ఎన్నికలలో ఇరాక్‌పై దురాక్రమణ యుద్ధాన్ని సమర్ధించిన కారణంగా హిల్లరీ క్లింటన్‌ను బరాక్‌ ఒబామా ఓడించాడు, పార్టీలో అంతర్గత ధోరణిలో మౌలికంగానే మార్పు వచ్చింది.అందుకు నిదర్శనంగా ఒకప్పుడు వుదారవాదులను విమర్శించాలని కోరిన వారు నేడు వారిని గట్టిగా సమర్ధించనందుకు విమర్శిస్తున్నారు. ఎలాంటి క్షమాపణలు చెప్పే పనిలేకుండా డెమోక్రాట్లను వుదారవాదులుగా జార్జి డబ్ల్యు బుష్‌ ప్రభుత్వం మారిస్తే బరాక్‌ ఒబామా ప్రభుత్వం అత్యంత వాస్తవిక ఫలితాన్ని ఇచ్చింది. కానీ ఇది కధలో సగం మాత్రమే. ఎందుకంటే జార్జి డబ్ల్యు బుష్‌ ప్రభుత్వ వైఫల్యాలు డెమోక్రటిక్‌ పార్టీని వామపక్షం వైపు నెట్టాయి, బరాక్‌ ఒబామా సర్కార్‌ మరింతగా నెట్టింది. బుష్‌ వుదారవాద ప్రాధమిక వ్యవస్ధ రూపకల్పనకు కారణం అనుకుంటే అది ఒబామా ఎన్నికయ్యేందుకు దోహదం చేసింది. ఒబామా అజాగ్రత్త ఒకటి వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం మరియు నల్లజాతీయుల జీవిత సమస్య వుద్యమాలు ముందుకు వచ్చేందుకు కారణమైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పోప్‌ ఏ కులంలో పుట్టాలనుకుంటున్నారో చెబితే సంతోషం

31 Thursday Dec 2015

Posted by raomk in Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Face book, Hinduthwa, misuse of facebook, pope, religions

పేర్లకీ, పుకార్లకీ కేంద్రంగా ఫేస్‌బుక్‌

ఎంకెఆర్‌

ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ‘ పోప్‌ సంచలన వ్యాఖ్యలు…’అనే శీర్షిక కింద ఒకరు ఒక పోస్టు పెట్టారు. దానిలో ఇలా వుంది.’ నాకు ఏసుక్రీస్తు మీద నమ్మకం లేదు, కేవలం ఈ సుఖానికి బానిసలా గడుపుతున్నాను, మళ్లీ జన్మంటూ వుంటే భారతీయుడిగా హిందువుగా పుట్టాలని వుంది….పోప్‌, పోప్‌ వ్యాఖ్యల్ని సమర్ధించిన బ్రిటన్‌ ప్రధాని, తాను కూడా అదే కోరుకుంటున్నానని వెల్లడి ‘

దీనికి సంబంధించిన ఆధారాల న్యూస్‌ లింక్‌ తెలియచేయమని,లేనట్లయితే పోస్టు పెట్టిన వారిని హైదరాబాద్‌ ఎర్రగడ్డ లేదా విశాఖ ఆసుపత్రులలో చికిత్సకోసం చేర్చాల్సి వుంటుందని వ్యాఖ్యానించాను. దానికి సదరు వ్యక్తి ఇంక వేరే చోట్ల పిచ్చాసుపత్రులు లేవా, నేను ఈ పోస్టు పెట్టటానికి కారణం నేను ఏ మతానికీ మద్దతు ఇవ్వటం లేదు అని చెప్పటానికే అని ప్రత్యుత్తర మిచ్చారు. పిచ్చి ముదిరి రోకలిని తలకు చుట్టమన్నాడట వెనకటి కెవడో . ప్రశ్నకు సమాధానానికి ఏమైనా పొంతన వుందా ? ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సామాజిక మాధ్యమం ఏదైనా కానివ్వండి ఎలాంటి ఆధారాలు, హేతువు లేకుండా సమాచారం పేరుతో ఏదిబడితే దానిని పోస్టు చేస్తున్నారు.చాకుతో నోటిని తీపి చేసే మామిడి కాయలు కోసుకోవచ్చు,జీవితాలను అంతం చేసే మెడకాయలనూ వుత్తరించవచ్చు. సామాజిక మీడియాను కూడా ఇలాగే దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం పతాకశీర్షికను చూసి లైక్‌ లేదా షేర్‌ చేయటం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

నేను ఏ మతానికీ మద్దతు ఇవ్వటం లేదని చెప్పటానికి ఈ పోస్టు అన్న సమాధానం తప్పించుకోవటానికి ఆపద్ధర్మంగా ఏదో ఒకటి చెప్పటం తప్ప దానిలో నిజాయితీ లేదు.ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టేది మతోన్మాదులు తప్ప మరొకరు కాదు. అది మెజారిటీ లేదా మైనారిటీ ఎవరైనా కావచ్చు. పోప్‌, బ్రిటన్‌ ప్రధాని వంటి పెద్దల పేరుతో ఇలాంటి ఆధారం లేని అభూత కల్పనలు ఆపాదించి చౌకబారు ప్రచారాలు చేస్తున్నారు. మతం,కులం, ప్రాంతం వంటి కొన్ని అంశాలు వుద్రిక్తతలను రెచ్చగొట్టటానికి జనం మెదళ్లను కలుషితం చేయటానికి గాను పని గట్టుకొని ప్రచారం చేయటానికి మతశక్తులు పెద్ద యంత్రాంగాలనే నిర్వహిస్తున్నారు. వాటిని గమనించలేకపోతే సామాజిక మీడియాలో తమపేరు పదే పదే చూసుకోవాలి లేదా కనిపించాలని కోరుకొనే వారు పోప్‌ వ్యాఖ్యల వంటి అవాస్తవాన్ని బాధ్యతా రహితంగా లేదా తమకు తెలియకుండానే మండుతున్న మంటకు ఒక చితిని చేర్చటం తప్ప మరొకటి కాదు. దీనివలన ప్రజలకు ఒక ఆయుధంగా వున్న ఈ మీడియాకు ఇప్పటికే విస్వసనీయత తగ్గిపోయింది. ఫేస్‌బుక్‌ అంటే గర్ల్‌ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటీ, పోసుకోలు కబుర్ల వేదికగా మారిందనేది అనేక మంది అభిప్రాయం, అలాంటివారందరూ క్రమంగా తమ ఖాతాలను మూసివేస్తున్నారు.ఎదుటివారి మీద బురదచల్లేందుకు , తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టాలనుకొనే ప్రమాదకర శక్తులు దీనిని వుపయోగించుకొనేందుకు ఎక్కువగా ముందుకు వస్తున్నాయి. అందువలన ఆధారంలేని పోస్టులు పెట్టి ప్రజల ఆయుధాన్ని పనికిరాకుండా చేయ వద్దని , బాధ్యతా యుతంగా వుండాలని మనవి.

పోప్‌కు ఆపాదించిన వ్యాఖ్యల విషయానికి వస్తే హిందూయిజం లేదా హిందూ మతాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తులు కేంద్రంలో అధికారంలో తిష్టవేశాయి. హిందూమతం పేరుతో వేల సంవత్సరాలుగా వునికిలోకి తెచ్చిన ఆచారాలు, నియమాలు, నిబంధనలన్నీ వర్తమాన కాలానికి తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన సమాజానికి అవి చేసిన హాని అంతా ఇంతా కాదు.అన్నీ వేదాల్లోనే వున్నాయష అంటూ కొత్త విషయాలకు దూరం చేశారు. అది ఘనీభవింపచేసిన కుల వ్యవస్ధ కర్ణుడు, ఏకలవ్యుల వంటి ఎందరో ప్రతిభావంతులను తెరమరుగు చేసింది. సమాజంలో శాస్త్రీయ ఆలోచనను మొద్దుబారచేసింది. పర్యవసానంగా పారిశ్రామిక విప్లవానికి దరిదాపుల్లో కూడా మన సమాజం లేకపోయింది.కులాల నిచ్చెన మెట్లతో అగ్ర, అధమ కులాలంటూ తోటి మానవులను పశువులకంటే హీనంగా ఇప్పటికీ చూస్తున్న ఈ దేశంలో నిజంగా పోప్‌ వంటి వారు పుట్టాలనుకుంటే ఆయన ఏ కులాన్ని కోరుకుంటారు? ఆవును వధిస్తే అంతం చూస్తాం అని వూగిపోతున్న అగ్రకులాల వారు అది ముసలిదయ్యో, జబ్బుచేసో చస్తే దాన్ని తీసి గోతిలో పాతిపెట్టటానికి మాత్రం ముందుకు రారు. తరతరాలుగా ఆ పనిచేస్తున్న దళితులు, గిరిజనులు ఎక్కడైనా మేం అలాంటి పని చెయ్యం అని నిరాకరిస్తే చచ్చిన ఆవు కోసం కూడా దాడులు చేసే అగ్రకులాల్లోనా వారి దాడులకు, అత్యాచారాలకు నిత్యం బలౌతున్న దళితుల, గిరిజనుల కడుపులోనా ? అటు దరి చేరనివ్వని అగ్రకులాలతో చెట్టపట్టాలు వేసుకోలేక ఇటు అనేక అంశాలలో తమకు దగ్గరగా వుండే దళితులు, గిరిజనులతో మమేకం కాలేక అటూ ఇటూ గాకుండా వుండే బీసీల్లోనా ? ఎక్కడ పుట్టాలనుకుంటున్నారో కూడా చెబితే సంతోషం. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్లుగా వివేకానందుడి పేరును వుపయోగిస్తూ ఆచరణలో ఆయన స్ఫూర్తికి, ఆచరణకు పూర్తి భిన్నంగా వ్యవహరించే నేటి కుహనా హిందూత్వ నాయకుల మాటలు, చేష్టలను విన్న కన్నవారెవరూ భారత దరిదాపులకే రారు, అలాంటిది తిరోగమన హిందువుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ?

ఇక్కడ మరొక విషయాన్ని చెప్పుకోకపోతే అపార్ధం చేసుకొనే అవకాశం వుంది. మతాల చరిత్రను పరిశోధిస్తే,, పరిశీలిస్తే రోసిపోయిన ప్రతి మతంపై తిరుగుబాటుగానే కొత్త మతాలు వచ్చాయి. హిందూమతాన్ని వ్యతిరేకించి బౌద్ధం, క్రైస్తవాన్ని వ్యతిరేకించి ఇస్లాం పుట్టుకు వచ్చిన విషయం దాస్తే దాగదు. ప్రతి తిరుగుబాటు మతం ప్రారంభంలో పూర్వం వున్నదానికంటే అభ్యుదయంగానే వున్నకారణంగానే జనాలు ఆదరించారు.కొన్నాళ్లకు అవి కూడా పాత మతాల మాదిరే తిరోగమన స్వభావాన్ని సంతరింపచేసుకున్నాయి. జనానికి మత్తుమందు మాదిరి తయారై పురోగతికి ఆటంకంగా మారుతున్నాయి.

నాకు ఏసుక్రీస్తు మీద నమ్మకం లేదు, కేవలం ఈ సుఖానికి బానిసలా గడుపుతున్నానని పోప్‌ చెప్పినట్లుగా కూడా పైన పేర్కొన్న పోస్టులో పెట్టారు. పోప్‌ అలా మాట్లాడినట్లు ఆధారం లేదు కనుక దాన్ని పక్కన పెడదాం. ఈ రోజు అది హిందు, క్రైస్తవం, ఇస్లాం, బౌద్దం ఏమతాధికారి అయినా ఆ మతాలు చెప్పినట్లు చిత్తశుద్దితో సాదా సీదాగా గడుపుతున్న పెద్దను ఒక్కరినైనా ఎవరైనా చూపగలరా ? ప్రతి మత లేదా మతం పేరుతో జనం ముందుకు వచ్చే బాబా, స్వామీజీ, ఫాదర్‌లు, ముల్లా పేరు ఏదైతేనేం ఒక్కొక్కరు ఒక్కొక్కొ కుంభకోణానికో మరొక అక్రమానికో కేంద్రంగా మారుతున్నారా లేదా ? అందువలన దయచేసి ఇప్పటికే మన దేశం మతోన్మాద చిచ్చుతో మగ్గిపోతోంది. దానికి మరింత ఆజ్యం పోసే, రెచ్చగొట్టే పోస్టులు పెట్టి లేదా వాటిని అభిమానించి, పంచుకొని (లైక్‌లు, షేర్‌లు) ఆ చిచ్చును పెంచవద్దని మనవి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా రాజకీయ చర్చలో వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమ అంశాలు

30 Wednesday Dec 2015

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, USA

≈ Leave a comment

Tags

Occupy Wall Street, US Elections, US Left, US Political Debate

మారుతున్న ప్రపంచం-2

ఎం కోటేశ్వరరావు

అట్లాంటిక్‌ అనే ఒక పత్రికలో పీటర్‌ బెయినార్ట్‌ అనే రచయిత అమెరికా ఎందుకు వామపక్షం దిశగా ప్రయణిస్తోంది అనే పేరుతో ఒక విశ్లేషణ చేశారు. 1960,70 దశకాలలో వామపక్ష భావజాలపై జనంలో ఆగ్రహం కనిపించేది, ఇప్పుడు నూతన అభ్యుదయ వుద్యమాన్ని దేశం అక్కున చేర్చుకుంటోందని బెయినార్ట్‌ పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించాను. ఆ వి శ్లేషణలో 1960,70 దశకాలలో మిలిటెంట్‌ పోరాటాలతో పోల్చితే నల్లజాతీయుల వుద్యమాల వెల్లడైన ప్రతిస్పందన ప్రభావం, ఆర్ధికాంశాల చర్చలో అసమానతల పరిస్ధితి ప్రధానంగా ముందుకు రావటం, ఎల్‌బిజిటిల హక్కుల గురించి ప్రధాన అంశంగా వుండటాన్ని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌లోని సెనేట్‌లో 2001లో నాటి అధ్యక్షుడు ప్రతిపాదించిన పన్నుల కోతకు 12 మంది, ఇరాక్‌పై యుద్ధానికి అనుమతించే నిర్ణయంపై 29 మంది డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు మద్దతు ఇచ్చారని ఈ దౌర్బాగ్యకరమైన ఓటింగ్‌కు పార్టీలో వెల్లడైన వ్యతిరేకత డెమోక్రటిక్‌ పార్టీలోని మధ్యేవాద విభాగాన్ని నాశనం చేసిన పర్యవసానం స్పష్టంగా వుంది. డెమోక్రటిక్‌ పార్టీలోని ప్రజాస్వామిక విభాగ తిరుగుబాటును హోవార్డ్‌ డీన్‌ ప్రారంభించారని, బ్లాగర్‌ (ఇంటర్‌నెట్‌లో అభిప్రాయాలను వెల్లడించటం) వుద్యమం పెరగటం, డెయిలీ కోస్‌ డెమోక్రటిక్‌ పార్టీ వాణిగా ఎదగటం, అఫింగ్టన్‌ పోస్ట్‌ కూడా అదే బాటలో నడవటం, ఎంఎస్‌ఎన్‌బిసి కొద్ది మంది వుదారవాదులను నియమించటం, జార్జి డబ్ల్యు బుష్‌ కన్సర్టేవ్‌లను బుద్దిలేని వారిగా కనిపించేట్లు చేశారని, తరువాత ఒబామా వాల్‌స్ట్రీట్‌వైపు మొగ్గటం అది చివరకు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమానికి దారితీసి అమెరికా రాజకీయ చర్చలోకి ఆర్ధిక అసమానతను చొప్పించిందని బెయినార్ట్‌ పేర్కొన్నారు.

‘అమెరికన్‌ ప్రజాప్రతినిధుల సభలో ఒబామా రిపబ్లికన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు, ఆర్ధిక సంక్షోభాన్ని వుపయోగించుకొని వాల్‌స్ట్రీట్‌ శక్తిని నాటకీయంగా తగ్గించి వుండగలిగేవారా లేదా అన్నది అస్పష్టం, ఆయన ఆ పని చేయలేదు అన్నది సుస్ఫష్టం…….వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమంలో పాల్గొనవారిలో 40శాతం మంది 2008 ఆధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామా కోసం పనిచేసిన వారే. వారిలో అనేక మంది అలాచేస్తారని ఆశించారు. ఒక అధ్యక్షుడిగా మౌలిక మార్పులను ఆయన చేయవచ్చు.ఇప్పుడు వారిలో ఆ ఆశ కుప్పకూలిపోవటంతో వాల్‌స్ట్రీట్‌ను నేరుగా సవాలు చేసే విధంగా వారిని పురికొల్పింది.’ అని పేర్కొన్నారు.

అఫింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో బ్లేక్‌ ఫ్లీట్‌వుడ్‌ అనే వ్యాఖ్యాత ‘డెమోక్రటిక్‌ పార్టీ చర్చలో ముందుకు వచ్చిన వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ మీమాంస’ అనే వ్యాసంలో ‘వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం ఎలిజబెత్‌ వారెన్‌ ఎన్నికకు దారితీసింది, ఆమె వాణి శాండర్స్‌ అభ్యర్ధిత్వాన్ని ముందుకు తెచ్చింది, హిల్లరీ క్లింటన్‌ను శాండర్స్‌ పక్కకు నెట్టారు. వీటన్నిటి కారణంగా డెమోక్రటిక్‌ పార్టీ తొలి చర్చలో శాండర్స్‌ మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా వదలించుకోవాలని గాకుండా తాను పెట్టుబడిదారీ విధానపు అతికి కళ్లెం వేసేందుకు మొగ్గుచూపుతానని హిల్లరీ చెప్పాల్సివచ్చింది’ అని పేర్కొన్నారు. ‘ ఈనాడు రంగంలో వున్న ముగ్గురు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులు కూడా ఒకే పాట పాడుతున్నారు. అదేమంటే వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమంలో ముందుకు వచ్చిన ప్రధాన అంశాలైన ఆర్ధిక అసమానత, గత మూడు దశాబ్దాలుగా మధ్యతరగతి దిగజారిపోవటం, ఎన్నికల ప్రచార నిధుల చట్టాల అవినీతి అనే అమెరికా తరహా జీవన విధానానికి ముప్పుగా పరిణమించి మూడు అంశాలు. రిగ్గింగ్‌కు గురైన రాజకీయ వ్యవస్ధ, మరింత బలిసిన ధనికులు, వాల్‌స్ట్రీట్‌పై పన్ను విధింపు అనే కీలకమైన వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమ ముఖ్యమైన నినాదాలనే హిల్లరీ క్లింటన్‌, బెర్నీ శాండర్స్‌, మార్టిన్‌ ఓ మల్లీ పదే పదే తాజా చర్చలో పునరుద్ఘాటించారు. నిజానికి ధనికులపై పన్ను వేయాలనే ఆలోచనలు, తరగిపోతున్న మధ్యతరగతి సంపదలు అన్నవి చివరకు రిపబ్లికన్‌ పార్టీలో కూడా అధ్యక్ష రాజకీయ చర్చను ప్రభావితం చేస్తున్నాయి.అయితే కార్పొరేట్‌, బిలియనీర్ల డబ్బు రాష్ట్రాలలో రిపబ్లికన్లను అధికారంలోకి తెస్తున్నది. ఒక పురోగామి దేశంలో సామాన్య ప్రజల అభిప్రాయాలను చేరనివ్వకుండా నల్లధనం, ఓట్ల రిగ్గింగ్‌ ద్వారా గెలిచిన పార్లమెంట్‌ వుంది,జనం వామపక్షం వైపు మొగ్గుచూపుతుండవచ్చు గానీ డబ్బు కాదు, కాబట్టి కేంద్ర విధానాలు ఎటూ కదలటం లేదు, 2016 ఎన్నికలలో తగినంత మంది జనం ఓట్లేయటానికి వస్తే మనం వాటిని కూడా మార్చవచ్చు అని బెయినార్ట్‌ పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అభ్యుదయ వుద్యమాన్ని అక్కున చేర్చుకుంటున్న అమెరికా !

27 Sunday Dec 2015

Posted by raomk in International, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

america, Left

మారుతున్న ప్రపంచం-1

ఎం కోటేశ్వరరావు

తరతరాల చరిత్రను చూసినపుడు ప్రపంచం ముందుకు పోతోందే తప్ప కొంత మంది కోరుకుంటున్నట్లుగా వెనక్కు నడవటం లేదు. పాతను పక్కకు నెట్టి కొత్తదనాన్ని అదీ తనకు తోడ్పడేదానిని అక్కున చేర్చుకోవటం అన్నది ప్రపంచ చరిత్రలో మనకు అడుగడుగునా కనిపిస్తుంది. ఎక్కడైనా తిరోగామి పరిణామాలు లేవా ఎదురు దెబ్బలు తగల లేదా అంటే, అవి మఖలో పుట్టి పుబ్బలో అంతరించాయి తప్ప బతికి బట్టకట్టలేదు.

ఎవరు అవునన్నా, కాదన్నా ఈ రోజు ప్రపంచ రాజకీయాలను, ఆర్ధికాంశాలను ప్రభావితం చేస్తున్నదీ, శాసిస్తున్నదీ, తీవ్రమైన ఎదురు దెబ్బలు తింటున్నది, ప్రపంచాన్ని ప్రమాదపు అంచుకు తీసుకుపోతున్నది కూడా అమెరికాయే. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత దానిని సవాలు చేసే మరొక అగ్రదేశం లేదా ప్రత్యామ్నాయ అధికార ధృవం లేకుండా పోయింది.సోషలిస్టు చైనా అచిర కాలంలోనే పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగినప్పటికీ సోవియట్‌ స్ధాయిలో అది ఇంకా బలపడలేదన్నది వాస్తవం. అమెరికాను ఒక దశలో సవాలు చేసిన జపాన్‌ దీర్ఘకాల పక్షవాత రోగిగా మారిపోయి రక్షణ ఒప్పందం చేసుకొని అమెరికా అండతోనే కాలం వెళ్లబుచ్చుతున్నది. ఒంటరిగా ఏ ఒక్కరమూ ఎదుర్కోలేమని గ్రహించిన ఐరోపా అగ్రదేశాలు ఐరోపా యూనియన్‌ పేరుతో ఒక్కటైనప్పటికీ చివరికి అమెరికా నాయకత్వానే పయనించక తప్పని స్ధితి.

పాతికేళ్ల క్రితం కమ్యూనిజంపై ప్రచ్చన్న యుద్ధం(కోల్డ్‌వార్‌)లో తామే గెలిచామని ప్రకటించుకుంది అమెరికా. దీంతో ప్రపంచంలో కమ్యూనిజం, సోషలిజం, వామపక్ష వాదానికి కాలం చెల్లిందని కూడా చెప్పుకుంది. దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా కొందరు ఈ ప్రకటనను ఆధారం చేసుకొని ఇంక ఇజాలు లేవు వున్నవేమైనా వుంటే టూరిజాలే అని చెప్పిన వారు కూడా లేకపోలేదు.

ఏది ఏమైనప్పటికీ కావమ్మ మొగుడు అంటే కామోసనుకొని కాపురం చేశా, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్ర తీసుకొని పోతా అన్న సన్యాసి మాదిరి కొన్ని దేశాలలో కమ్యూనిస్టుపార్టీలే తమ దుకాణాలను మూసుకొని కొత్త దుకాణాలను తెరిచిన పూర్వరంగంలో ప్రపంచ వ్యాపితంగా మిగిలి వున్న కమ్యూనిస్టు పార్టీలకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. శ్రామికవర్గ, కమ్యూనిస్టు సిద్ధాంతాలనే కొందరు యువతరం ప్రశ్నించే పరిస్ధితి తలెత్తింది.

ఎక్కడైతే కమ్యూనిజం, వామపక్షం అనే మాటే వినిపించకుండా సమాధి చేశాం అని చెప్పారో అదే అమెరికాలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా అక్కడ అధ్యక్ష ఎన్నికల ప్రచార హంగామా ప్రారంభమైన తరువాత అమెరికన్లు వామపక్షం వైపు మొగ్గుతున్నారా అనే చర్చ మీడియాలో ప్రారంభమైంది. అది పరిమితమే కావచ్చు కానీ ఏ వృక్షం లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం కదా ? ఆముదం చెట్టుబతికిందంటే తరుణం వస్తే మిగతా చెట్లు కూడా మొలవటానికి, పెరిగి పెద్ద కావటానికి అనువైన నేల వున్నట్లే !

అనేక మంది 2015 అమెరికాలో పురోగామి మార్పు వైపు దిశ మారింది అని చెబుతున్నారు. అదే సమయంలో అమెరికా ఏంటి వామపక్ష భావజాలం గురించి చర్చ ఏమిటి అంటున్నవారు కూడా మీడియాలో వున్నారు. అసలు వామపక్ష భావజాలం ఏమిటి ? కమ్యూనిజం ఒక్కటేనా ఇంకేమైనా వున్నాయా ? సమాజం వెనక్కి పోవాలని లేదా వున్నది వున్నట్లుగా వుండాలని గానీ కోరుకుండా ఏ ఒక్క మిల్లీ మీటరైనా ముందుకు పోవాలని కోరుకొనే ఆలోచన, భావజాలం కూడా వామపక్షం పెరుగుదలకు తోడ్పడేదే. కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌కు ముందు తరాలు కూడా వామపక్షం వుందా లేదా సమసమాజం కావాలని, అన్యాయాలు అంతం కావాలని కోరుకున్నారా లేదా ? అలాంటి వారిని ఊహాజనిత సోషలిస్టులని పిలిచారా లేదా ? వారందరి అనుభవాలు, సారాన్ని తీసుకొని శాస్త్రీయ మైన శ్రామికవర్గ సిద్ధాంతాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ ప్రతిపాదించారు. కొంత మంది వారి సిద్ధాంతం పాతబడి పోయింది అంటున్నారు, నిజమే దానికి బాధ పడాల్సింది ఏముంది? రెండు రెళ్లు నాలుగు అన్న ఫలితం సాధించటానికి గతంలో పలక మీద వేసి చూపేవారు, ఆ పద్దతి ఇప్పుడు పాతపడి పోయిందా లేదా? ఇప్పుడు ఎవరినైనా అడగండి, వెంటనే చేతిలో సెల్‌ఫోన్‌ తీసి దానిలో కాలుక్యులేటర్‌ను ఓపెన్‌ చేసి రెండు రెళ్లు నాలుగు అని చెబుతున్నారు.

అలాగే శ్రామికవర్గ సిద్ధాంతాన్ని కూడా పాత పద్దతికి బదులు కొత్త పద్దతిలో చెప్పవచ్చా లేదా ? అలా చెప్పకపోతే కొత్త తరాలకు ఎక్కదు, పాత పద్దతిలో చెప్పాలంటే వెంటనే మనకు పలకా, బలపాలు దొరకవు, మోటబావి గిలకలూ, మార్కాపురం పలకలు ఇప్పుడసలు కనిపించటం లేదు. ఒకటవ తరగతి ముందు నుంచే నుంచే తెల్లకాగితాల నోట్సులు, పెన్సిల్స్‌ వుపయోగంలోకి వచ్చాయి. రెండు రెళ్లు నాలుగు అన్న మౌలిక విషయంలో ఎలాంటి మార్పు వుండదు. అలాగే మౌలిక దోపిడీ విషయంలో మార్పు లేదు కదా !

ఇక అమెరికా వామపక్షాల విషయానికి వస్తే గత ఎన్నికలన్నీ వామపక్ష అభిమానులకు ఏమంత వుత్సాహాన్ని ఇచ్చినవి కాదు, 2015 కూడా అందుకు మినహాయింపు కాదు, కానీ కొన్ని ఆశ్చర్యకర విజయాలు ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. సియాటిల్‌, మెయినే, ఓహియోలలో పురోగామి శక్తులకు సంభవించిన విజయాలు అమెరికా రాజకీయ ఆటతీరునే మార్చివేసే విధంగా వున్నాయని, మరింత మంది అమెరికన్లు కార్యాచరణలోకి వచ్చే విధంగా వున్నాయని, ప్రజా వుద్యమాల శక్తి ఏమి చేయగలదో వెల్లడించాయని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.

అమెరికా రాజకీయాలలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గత చరిత్ర వుంది. ఇంగువ కట్టిన బట్ట మాదిరి వ్యవహారమే ప్రధానంగా వున్నప్పటికీ వున్నంతలో వుదారవాదులు, వామపక్షాలు, కమ్యూనిస్టులు కూడా రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరొక ప్రత్యామ్నాయం లేని కారణంగా డెమోక్రాట్లనే బలపరుస్తున్నారు.గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008లో ఆర్ధిక సంక్షోభం ప్రారంభమైన తరువాత గత మూడు సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాలలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో కార్మిక, వుద్యోగ సంఘాలు తమ ఎజెండాకు కట్టుబడని డెమోక్రటిక్‌ అభ్యర్ధులను తోసి పుచ్చి తమ అభ్యర్ధులను స్వయంగా నిలపటం ఒక కొత్త పరిణామం. దీని ప్రభావం లేదా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో డెమోక్రాట్ల వైఫల్యాలు, అనేక నగరాలలో కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు ప్రతిఘటన వంటి అంశాలే కావచ్చు ఏది ఎంత మేరకు అన్నదానిని పక్కన పెడితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో ప్రైమరీలలో చర్చలు, పురోగామి ఎజెండాలే ప్రధానంగా ముందుకు వచ్చాయని, గతంలో అలాంటి చర్చలు వినపడేవి కాదని కొందరు వ్యాఖ్యానించారు.

థింక్‌ ప్రోగ్రెస్‌ అనే ఒక విశ్లేషణ ప్రకారం 2015లో ఏడు ప్రధాన విజయాలు సంభవించాయి. 1.కనీస వేతన పెంపుదలకు పురోగామి శక్తుల చొరవ వత్తిడి కారణంగా అనేక మంది కార్మికుల ఆదాయాలు పెరిగాయి.ఓవర్‌ టైమ్‌పై కొత్త నిబంధనలు వచ్చాయి.2.స్వలింగ వివాహాలు చట్టబద్దం చేయబడ్డాయి. ఎవరైనా కోరుకుంటే వివాహం చేసుకోవచ్చు.3. ఆరోగ్య బీమా, ఒబామాకేర్‌గా ప్రసిద్ధిగాంచిన ఆరోగ్య బీమాను దెబ్బతీసేందుకు మితవాదులు చేసిన ప్రయత్నాలకు సుప్రీం కోర్టు మద్దతు ఇవ్వలేదు. కనుక ఇప్పుడు జనం తమకు ఇష్టమైన లేదా అందరికీ వైద్య పథకాన్ని గానీ ఎంచుకోవటానికి అవకాశం వుంది.4.(ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలను తమకు అనుకూలంగా పునర్విభజించటానికి మన దేశంలో అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటం తెలిసిందే. స్ధానిక సంస్ధలలో వార్డుల విభజన అంశాలను అనేక చోట్ల చూస్తున్నాము. అలాగే) తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేసిన చోట కొన్ని రాష్ట్రాలలో వాటిని అడ్డుకొనే అవకాశం కొన్ని రాష్ట్రాలకు వచ్చింది, కొన్ని చోట్ల ఎన్నికలలో డబ్బు ప్రభావానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కొన్ని చర్యలు తీసుకొనేందుకు వీలు కలిగింది.5. వాతావరణ మార్పులపై పోరాడేందుకు ప్రపంచం ఒక్కటైంది.6.గ్రాడ్యుయేషన్‌ రేటు పెరిగింది.7. ఇరాన్‌తో చారిత్రాత్మక అణు ఒప్పందం కుదిరింది.

ఇక్కడ పాఠకులు ఒక విషయాన్ని గమనంలో వుంచుకోవాలి.ఏది అభ్యుదయం ఏది కాదు అన్నది నిరంతర మారుతూ వుండే అంశం.ఒకరు పురోగామిగా భావించిన దానిని మరొకరు అంగీకరించకపోవచ్చు, దీనికి గీటు రాయి ఏమంటే దేనికి ప్రజలు మద్దతు. పాప్యులిస్టు మెజారిటీ సపోర్ట్‌ (అధిక ప్రజాబాహుళ్య మద్దతు) అనే వెబ్‌ నిర్వహించిన ఒక సర్వేలో రాజకీయాలలో డబ్బు ప్రభావం, విద్య ప్రయివేటీకరణ,వాణిజ్య ఒప్పందాలు,అసమానతలు, సామాజిక భద్రత, ఆరోగ్యబీమా, బడా బ్యాంకులపై చర్యలు తీసుకోవటం వంటి వాటిపై వెల్లడైతున్న అభిప్రాయాలు పురోగామిశక్తుల వైఖరి తప్ప మితవాదులు వారికి మద్దతుదారులుగా వున్న బిలియనీర్లది కాదు. అట్లాంటిక్‌ అనే ఒక పత్రికలో పీటర్‌ బెయినార్ట్‌ అనే రచయిత అమెరికా ఎందుకు వామపక్షం దిశగా ప్రయణిస్తోంది అనే పేరుతో ఒక విశ్లేషణ చేశారు. 1960,70 దశకాలలో వామపక్ష భావజాలపై జనంలో ఆగ్రహం కనిపించేది, ఇప్పుడు నూతన అభ్యుదయ వుద్యమాన్ని దేశం అక్కున చేర్చుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బాల నేరం – ‘మూక’ న్యాయం!

23 Wednesday Dec 2015

Posted by raomk in Current Affairs, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

16-year-olds, adults, Juvenile Justice, murder, rape

– జీవీకే ప్రసాద్
నేరాలకు పాల్పడుతున్న బాలలలో పేదరికం, నిరక్షరాస్యత కోరల్లో చిక్కుకున్న వారే ఎక్కువని ఇటీవల వెల్లడైన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సిఆర్బి) 2014 గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే నేరం ప్రవృత్తిగా మారి, పదే పదే నేరాలు చేసే బాలల సంఖ్యలో తగ్గుదల నమోదవడం ఒక ఊరట! 2014లో వేర్వేరు నేరాలలో అరెస్టయిన 48,230 బాలలలో వేలం 2,609 మంది మాత్రమే పాత నేరస్థులు. 2013లో వీరిది 9.2 శాతం కాగా, 2014లో 5.4 శాతానికి తగ్గింది. తాజా గణాంకాల నేపథ్యంలో రేప్, హత్య వంటి క్రూర నేరాలకు పాల్పడే బాలల వయస్సు పరిమితిని తగ్గించే ప్రభుత్వ ప్రతిపాదన ప్రశ్నార్థకం కానున్నది. ‘పదే పదే నేరాలు చేసే బాలల సంఖ్యలో తగ్గుదల ఉందని చూపుతున్న ఈ గణాంకాలు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రతిపాదిస్తున్న చట్ట సవరణ అనవసరమనే చాటి చెబుతున్నాయి’ అని బాలల హక్కుల కోసం పని చేసే హెచ్ఎూ్య అనే సంస్థకు చెందిన భారతీ అలీ అన్నారు.
అయితే, నిరుపేద కుటుంబాల బాలలు నేరాల బాట పడుతుండడం అన్నింటికన్నా బాధాకరమైన అంశం. మొత్తం బాల నేరస్థుల్లో 55.6 శాతం రూ. 25,000 కన్నా తక్కువ వార్షిక ఆదాయం గల కుటుంబాలకు చెందిన వారే. అంటే సగటున నలుగురు సభ్యులున్న ఈ కుటుంబాలు రోజుకు రూ. 70 కన్నా తక్కువ ఆదాయంతో బతుకులీడ్చేవన్న మాట! 2014లో పట్టుబడ్డ బాల నేరస్థుల్లో 53 శాతం 5వ తరగతి లేదా అంతకన్నా తక్కువ చదువుకున్న వారే. వీరిలో సగం మంది ఐదవ తరగతి లోకి అడుగిడకుండానే స్కూలు మానేశారు. 36.6 శాతం బాలలు ప్రైమరీ కన్నా ఎక్కువ, పదవ తరగతి లోపు చదువుకున్న వారు. వీరెవరూ మోడీ ప్రభుత్వం చెబుతున్న ‘స్కిల్ ఇండియా’ శ్రేణిలోకి కూడా రారు. ఎందుకంటే ఈ పథకంలో కనీస విద్యార్హత పదవ తరగతి. పేదరికం, నిరక్షరాస్యతలు బాలలను నేరాల వైపు నెట్టివేస్తున్నాయనడానికి ఈ గణాంకాలకు మించిన సాక్షం మరొకటి అక్కర లేదు. వీటిపై దృష్టి ంద్రీకరించడానికి బదులు నరేంద్ర మోడీ ప్రభుత్వం బాల నేరాల చట్టంలో సవరణ తేవడం ద్వారా జరిగేది బాలల హక్కుల హననమేనని విశ్లేషకుల అభిప్రాయం.
బాలన్యాయ చట్టంలో మార్పు నేపథ్యం
2012 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన తర్వాత బాల నేరస్థులకు సంబంధించిన చట్టాలపై చర్చ మొదలైంది. ఈ దారుణ సంఘటనలో నిందితులుగా ఉన్న వారిలో ఒక వ్యక్తి వయస్సు 18 సంవత్సరాలకన్నా కొద్ది నెలలు తక్కువ. దీనితో అతనిపై బాల న్యాయస్థానంలో విచారణ చేపట్టారు. అతడిపై వయోజనులను విచారించే కోర్టులో విచారణ జరపాలని కోరుతూ, బిజెపి నేత సుబ్రమణ్యన్ స్వామి 2013 జులైలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. సుప్రీంకోర్టు దీనికి స్పందిస్తూ, తీర్పును ఆపాలని జువెనైల్ కోర్టు (బాల నేరస్థుల్ని విచారించే కోర్టు)ను కోరింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుమతిపై కోర్టు అతడికి సంస్కరణ గృహంలో 3 ఏళ్ల శిక్ష విధించింది. దీని పట్ల బాధితురాలి తల్లి తీవ్ర నిరసన తెలిపారు. అతడికి తగిన శిక్ష విధించకపోవడం ద్వారా టీనేజర్లకు ఇలాంటి నేరాలు చేసేలా ప్రోత్సహించినట్టే అయ్యిందని ఆమె ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ పూనికతో 2014 జులైలో ఒక బిల్లు తయారైంది. 16-18 ఏళ్ల మధ్య వయసు గల బాలలు రేప్, హత్య వంటి ూర నేరాలకు పాల్పడినట్టయితే, వారిని వయోజనుల్ని విచారించే న్యాయస్థానాల్లో విచారించే విధంగా 2000 నాటి ప్రస్తుత బాల నేరస్థుల చట్టంలో సవరణ చేయడం కోసం ఈ బిల్లు రూపొందింది.
సవరణల సారం
క్రూరమైన నేరం జరిగితే, ఆ నేరానికి పాల్పడ్డ వ్యక్తి వయసు 16-18 ఏళ్ల మధ్య ఉంటే, ఆ వ్యక్తి ‘బాలుడా’ లేక ‘వయోజనుడా’ అని పరిశీలించేందుకు బాల న్యాయ మండలి ఉంటుంది. ఈ మండలిలో మనస్తత్వవేత్తలు, సామాజిక నిపుణులు సభ్యులుగా ఉంటారు. నేరం చేసింది ‘బాలుడా’ లేక ‘వయోజనుడా’ అనే దాని ఆధారంగానే ఏ కోర్టులో విచారణ జరిపించాలో వారు నిర్ణయిస్తారు. ఇలా రెండు దశల్లో నిర్ధారణ, విచారణ ప్రక్రియను చేపట్టడం ద్వారా బాలల హక్కులను పరిరక్షించగలుగుతామని మహిళా, శిశు అభివృద్ధి శాఖ అభిప్రాయపడింది. అట్లాగే, మహిళలపై క్రూర నేరాలకు పాల్పడకుండా నిరోధించడం వీలవుతుందని ప్రభుత్వం అభిప్రాయం. ఇంకా ఈ బిల్లులో పిల్లలను దత్తత తీసుకోవడానికి సంబంధించిన పలు సవరణలు కూడా ఉన్నాయి.
లోక్‌సభ ఆమోదం
ప్రభుత్వం ఈ బిల్లును 2014 అగస్టలోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత, బిల్లును స్టాండింగ్ కమిటీకి నివేదించారు. స్టాండింగ్ కమిటీ చట్టపరంగా బాలల వయసు పరిమితిని 18 సంవత్సరాలుగానే ఉంచాలని సిఫారసు చేసింది. కానీ కమిటీ అభిప్రాయాన్ని పక్కన పెడుతూ ప్రభుత్వం ఈ బిల్లును మళ్లీ లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ూర నేరాలకు పాల్పడే 16-18 సంవత్సరాల వయస్సు గ్రూపు వారు, 21 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత పట్టుబడితే వారిపై వయోజనుల కోర్టులోనే విచారణ జరిపిస్తారు. ఈ బిల్లుకు మే 7న లోక్సభ ఆమోదం లభించింది. జువైనల్ చట్ట సవరణల బిల్లుకు రాజ్యసభలో 22న ఆమోదం లభించింది.. బాల న్యాయం (పిల్లల సంరక్షణ, రక్షణ) బిల్లు, 2014గా పిలుస్తున్న ఈ చట్టంలో స్వల్ప, తీవ్ర, క్రూర నేరాలకు స్పష్టమైన నిర్వచనాలిస్తూ, వాటిని వర్గీకరించారు. అట్లాగే వేర్వేరు నేరాల శ్రేణులలో అనుసరించే ప్రక్రియలలో తేడాలను కూడా నిర్వచించారు.
గోరంతలు కొండంతలుగా…
ఇందులో నేరం చేసిన వారిని సంస్కరణ, పునరావాసం ద్వారా మార్చాలనే విధానానికి బదులు వారిపై ప్రతీకారం తీర్చుకొనే భావన ప్రబలంగా ఉందని విమర్శకులు అంటున్నారు. 2012 ఢిల్లీ గ్యాంగ్రేప్ దరిమిలా వెల్లువెత్తిన ‘గుంపు’ (మూక) మనస్తత్వపు ఉదారరహిత ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ బిల్లు రూపొందింది. 16-18 ఏళ్ల వయసు బాలలు రేప్ వంటి క్రూర నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నారనేది మరో బలమైన అభిప్రాయం కూడా దీనికి నేపథ్యంగా పని చేసింది. కానీ, 16-18 ఏళ్ల బాల నేరస్థులలో 3.4 శాతం మందిపై మాత్రమే రేప్ కేసులున్నాయని ఎన్సిఆర్బి గణాంకాలు చెబుతున్నాయి. నమోదైన ఎఫ్ఐఆర్లే ఈ గణాంకాలకు ఆధారం అనేది గమనార్హం. ప్రేమ వ్యవహారాల్లో టీనేజర్లు అమ్మాయిలతో పారిపోయిన సందర్భాల్లో కూడా రేప్, కిడ్నాప్ వంటి సుేలు నమోదు చేస్తారని తెలిసిందే. కాబట్టి టీనేజర్లు అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడుతున్నారనే అవగాహనలో అపోహ పాలే ఎక్కువ. ఇక, మరో అంశం పరిపక్వతకు సంబంధించినది. క్రూర నేరాలకు పాల్పడ్డారంటేనే మానసికంగా వారు వయోజన నేరస్థుల స్థాయిలో ఉన్నారని, క్రూరమైన నేరమే వారి పరిపక్వతకు నిదర్శనమని ఈ బిల్లు సమర్థకులు వాదిస్తున్నారు. కానీ కిషోరప్రాయంలో ఎంతకైనా తెగించగల మనస్తత్వం ఎక్కువ ఉంటుందని ఇటీవల టిఐఎస్ఎస్ చేసిన మెదడు సంబంధిత అధ్యయనంలో వెల్లడైంది. పథకరచన, తర్కబద్ధత, ఆవేశాన్ని నియంత్రించుకోవడం వంటి కార్యకలాపాలకు మూలమైన మెదడులోని ముందు భాగం 25 ఏళ్ల తర్వాతే వృద్ధి చెందుతుందని న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు.
బాలల హక్కుల హననం
ఈ బిల్లు 18 ఏళ్ల లోపు పిల్లలందరినీ సమంగా చూడాలని చెప్పే బాలల హక్కుల యుఎన్ సదస్సు తీర్మానాలకు ఉల్లంఘన అవుతుంది. సమానత్వ హక్కుకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు కూడా ఇది ఆ మేరకు ఉల్లంఘనే అవుతుంది. అంతకన్నా ముఖ్యమైనది, నేరం చేసిన వ్యక్తి 21 ఏళ్ల తర్వాత పట్టు బడినప్పుడే సమాన నేరానికి హెచ్చు శిక్ష విధించాలని చెప్పే ఆర్టికల్ 20(1)కు కూడా ఇది భిన్నమే అవుతుంది. ఇంకా కొన్ని సాంతిేకపరమైన ఇబ్బందులు కూడా ఇందులో ఇమిడి వున్నాయి. క్రూరమైన నేరం చేయడానికి కొందరు బాలలలో మానసిక పరిపక్వత నిజంగానే ఉండొచ్చు. కానీ దానిని నిరూపించే మనస్తత్వశాస్త్ర పరీక్షలు పూర్తిగా ఏకపక్షంగా, నిర్హేతుకంగా ఉంటాయి. కొందరు తెలివైన బాల నేరగాళ్లు ఈ పరీక్షల్లో అమాయకులుగా రుజువు కావచ్చు. కొందరు అమాయకులు పొరపాటుగా పరిపక్వత గలవారిగా రుజువు కావచ్చు. ఈ చట్టం వల్ల నేరాలు తగ్గుతాయనేది ప్రభుత్వం చేసే మరో వాదన. నిజానికి ఇది అమెరికాకు కార్బన్ కాపీనే. కానీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఇది ప్రభావయుతమైన నేర నిరోధకంగా పని చేయలేదని రుజువైంది. అక్కడ జైళ్లను మూసేసి బాల ఖైదీలకు సముదాయ ఆధారిత చికిత్స అందించే కార్యక్రమాల వైపు ఆలోచిస్తున్నారు. అన్నింటికన్నా కీలకమైంది, ప్రారంభంలోనే చెప్పినట్టుగా బాలలను నేరమయం చేస్తున్న పరిస్థితులను మార్చడం. కానీ మోడీ ప్రభుత్వం బాలల సంక్షేమం కోసం కేటాయించింది వేలం రూ. 633 కోట్లు. ఇది మొత్తం కేటాయింపులో 0.8 శాతం మాత్రమే!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

IT IS POLITICAL STONE THAT VHP IS TAKING TO AYODHYA: HINDU MAHASABHA

22 Tuesday Dec 2015

Posted by raomk in Communalism, Current Affairs, NATIONAL NEWS, Others, RELIGION

≈ Leave a comment

Tags

AYODHYA, HINDU MAHASABHA, POLITICAL STONE, VHP

New Delhi, 22 Dec 2015: Two days after media reports about first lot of stones having reached Ayodhya allegedly for construction of Ram Temple, Hindu Mahasabha has come out opposing the move and termed it as ‘political stone’ that Vishwa Hindu Parishad is taking there.

Addressing a press conference in Delhi on Tuesday, Swami Chakrapani, National President, Akhil Bharat Hindu Mahasabha, said: “It is political stone that (they are taking to Ayodhya). I want to tell VHP, Sangh Parivar and BJP to stop searching for political stone.”

Swami Chakrapani said he believes in law and wants Ram Temple under the law not through communal politics.

“Even before the verdict (of Allahabad High Court) came, I had said in 2010 that I can never support construction of a temple on dead bodies. I demanded fast-track court for the (Babri Masjid-Ram Janmabhoomi) case so that judgment can come fast. Leave aside the stone and bricks of Vishwa Hindu Parishad. It is their internal politics. If verdict comes in our favour today we will construct the temple with gold, leave aside stone. But that should be done under the law” he said.

“Leave aside the issue of stone (being sent to Ayodhya). It is political stone that (they are taking to Ayodhya). I want to tell VHP, Sangh Parivar and BJP to stop searching for political stone.”

Swami Chakrapani also condemned the alleged blasphemous remarks of a person called Kamlesh Tiwari.

“I was saddened with remarks of Kamlesh Tiwari about Prophet Muhammad. I felt sad as much as I was when Aamir Khan disrespected gods and goddesses in PK film. We opposed him and asked our office to find about his details. We found he was removed from our organisation in 2008. If he were with it today, I would have removed him. He does not deserve to be called Hindu. Similarly if a Muslim disrespects other’s religion cannot be Muslim,” said Swami.

Sharing the dais with leaders from Muslim, Sikh and Christian communities including Maulana Tauqeer Raza Khan, Swami Chakrapani demanded a strong anti-blasphemy law in the country.

“There is a need for religious communities – Hindus, Muslims, Christians, Sikhs – to take a vow that they would not allow anyone to hurt other’s religion. We demand strong anti-blasphemy law and such people should be strongly punished.”

“Such people are of no worth. They make such statement for which they can’t get respect even in their family, leave aside the society. It becomes an issue between Hindus and Muslims and the man becomes hero. We should not allow this thing to happen. It is the duty of us religious leaders to join hands and stop such people,” he said.

No indication from PM on Ram temple: VHP

The Vishwa Hindu Parishad (VHP) has said that there was no indication from Prime Minister Narendra Modi on the construction of Ram temple in Ayodhya.

In a statement on Monday, VHP general secretary Champat Rai said: “VHP is of the view that Ram Mandir at Ayodhya should be built through an act of parliament. VHP has always respected the court and have faith in it.”

“Time has come for the construction of Ram Mandir in Ayodhya. Lot of stones arrived. And now the arrival of stones will continue. We have signals from Modi government that the construction of temple would be done now,” media reports had quoted Mahant Nritya Gopal Das, president of Ram Mandir Nyas, as saying.

“Reports published in media are false. Arrival of stones is a common practice and since 1990, thousands of trucks full of stones have arrived and kept at Ramghat Karyashala after fretwork (nakkashi),” Rai said.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మనం ఎక్కడున్నాం ! నికితా అజాద్‌కు జేజేలు !!

22 Tuesday Dec 2015

Posted by raomk in Current Affairs, NATIONAL NEWS, Social Inclusion, Women

≈ Leave a comment

Tags

happytobleed, menstruation, Nikita Azad, sabrimala, temples

Sabrimala temple nikita azad

సత్య

మనం ఎక్కడున్నాం, మధ్యయుగాలలోనా ? ఇంకా అంతకు ముందు ఆటవిక దశలోనా ? ఆధునికంగా ఎంతో ముందుకు పోయాం, స్త్రీని భారత్‌లో మాదిరి మరే దేశంలోనూ గౌరవించరు అని చంకలు కొట్టుకొనే మనం ఎక్కడున్నాం ?

గౌరవం సంగతి దేవుడెరుగు ! అసలు ఒక మనిషిగా గౌరవిస్తున్నామా ? అదే నిజమైతే ప్రకృతి సిద్ధమైన రుతుక్రమ సమయంలో దూరంగా అంటరాని వ్యక్తిగా ఎందుకు చూస్తున్నాం ? ఆ సమయంలో దేవాలయాలలో ప్రవేశానికి ఎందుకు నిషేధిస్తున్నాం ? కొద్ది వారాల క్రితం కేరళలోని అయ్యప్ప స్వామి దేవస్ధాన బోర్డు అధ్యక్షుడు గోపాలకృష్ణన్‌ మహిళలను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్య సామాజిక మీడియాలో తీవ్ర నిరసనలకు వేదికగా మారింది. సాహస యువతి నికితా అజాద్‌ ‘హేపీ బ్లీడ్‌ ‘ (సంతోష రుతుక్రమం) అన్న నినాదంతో రాసిన లేఖకు అపూర్వ స్పందన లభిస్తోంది.

మహిళలలో రుతు క్రమం అనేది ఒక ప్రకృతి ధర్మం. సకాలంలో అది ప్రారంభం కాకపోతే, సక్రమంగా నియమిత కాలంలో రాకపోతే అలాంటి యువతుల గురించి తలిదండ్రులు ఎంత ఆందోళన పడతారో, సమాజం అలాంటి వారిని ఎలా చూస్తుందో మనకు తెలియని అంశం కాదు. అలాంటి ప్రకృతి ధర్మం, పునరుత్పత్తికి నాంది అయిన ఆ క్రమాన్ని ఎవరైనా ఆహ్వానించాలి, అది లేకపోతే అలాంటి వారికి అవసరమైన వైద్య చికిత్సను అందించాలి. అలా ఆందోళన వ్యక్తం చేసే వారే మరోవైపున రుతుక్రమ సమయంలో మహిళల పట్ల వివక్షను కూడా ప్రదర్శించటం ద్వంద్వ స్వభావానికి నిదర్శనం. రుతు క్రమం సమయంలో దేవాలయాలకు వెళ్లవద్దని తల్లులే పిల్లలకు చెప్పటంలో ఎలాంటి హేతుబద్దత లేదు, అది సాంప్రదాయం, అది అంతే అన్న బండవాదన తప్ప మరొకటి చెప్పలేరు. ఇది తరతరాలుగా కొనసాగుతోంది. కొంత మంది భావిస్తున్నట్లుగా రుతుక్రమం మైల కాదు, ప్రతినెలా పునరుత్పత్తికి అండం విడుదల అవుతుంది. గర్భాశయ లోపలి గోడలలో ఒక పొర మాదిరి గర్భధారణకు అనుకూలంగా తయారవుతుంది. విడుదలైన అండం ఫలదీకరణ చెందనట్లయితే అప్పటి వరకు తయారైన పొర బహిష్టు స్రావరూపంలో బయటకు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమయంలో ప్రకృతి విరుద్ధంగా అధిక స్రావం అయితే వైద్యపరమైన సమస్య తప్ప పాపమో, మలినమో మరొకటో కాదు.

ఒక వేళ మహిళలను అనుమతించాల్సి వస్తే అందుకు సరైన సమమా కాదా అని ఒక యంత్రంద్వారా పరీక్షించి,పరిశుద్ధులని తేలిన తరువాత అనుమతిస్తామని ఆలయ బోర్చు అధ్యక్షుడు అందునా అక్షరాస్యతలో అందరి కంటే ముందున్నదని పేరున్న కేరళవాసిగా చెప్పటం గర్హనీయం. దేవుడి దృష్టిలో అందరూ సమానమే అని చెబుతూ మరోవైపు మహిళలు మైల పడ్డారని ఎవరు చెప్పారు. అయ్యప్ప ఆలయ బోర్డు అధ్యక్షుడి అనుచిత ప్రకటన తరువాత కొంత మంది దానికి సమర్ధనగా పాతపడిన రోత వాదనలు ముందుకు తెస్తున్నారు. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, వివాహం చేసుకోని యోగి కనుక వయస్సులో వున్న యువతులకు ప్రవేశం నిషిద్ధమని టీకా తాత్పర్యం చెబుతున్నారు. అదే అయితే వివాహం అయిన పురుషులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? అయ్యప్ప దీక్ష పూనిన రోజులలో తప్ప మిగతా సమయాలలో ఎంతమందికి ఎలాంటి దురలవాట్లు వున్నాయో అందరికీ తెలుసు. వివాహం మానుకున్న లేదా వివాహం చేసుకోని వారికే పరిమితం చేయాలికదా ? వారికి దురలవాట్లు లేవని యంత్రాలను వుపయోగించి పరీక్ష చేయనపుడు యువతుల పట్ల వివక్ష ఎందుకు? అయ్యప్ప బ్రహ్మచారి అయినా ఒక అమ్మకొడుకే కదా ?

కేరళలోని కాశ్యప వేద పరిశోధనా సంస్ధను స్దాపించిన ఆచార్య రాజేష్‌ రుతు క్రమంలో వున్న మహిళలు మైలపడినట్లుగా ఏ వేదాల్లోనూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. పందొమ్మిదవ శతాబ్ది సామాజిక సంస్కరణ వాది దయానంద సరస్వతి కూడా మహిళా భక్తులను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని చెప్పారు.

రుతు క్రమం సమయంలో యువతులు ఏ పని చేయటం లేదు, పరీక్షలు రాస్తున్నారు, పరుగు పందాలలో పాల్గొంటున్నారు, అది ఇది అని లేకుండా చేయగలిగినవన్నీ చేస్తున్నపుడు భక్తి భావంతో దేవాలయాలకు వెళ్లటం తప్పెలా అవుతుంది. పుట్టుకతోనే మైలపడలేదు, పుట్టుక అన్నది ఒక యాదృఛ్చికం తప్ప కోరుకొని పుట్టింది కాదు. అందువలన ఏదో సంప్రదాయం దాన్ని మనం వుల్లంఘించటం ఎందుకు అని కాకుండా ప్రతి ఒక్కరూ శాస్త్రీయంగా ఆలోచించాలి. మూఢనమ్మకాలను మూలన పెట్టాలి తప్ప మైలపేరుతో మూలన కూర్చోవటం ఏమిటి ? అందుకే అందరూ నికితా అజాద్‌ మాదిరి తమ ప్రకృతి ధర్మానికి సిగ్గుపడకూడదు, సంతోషపడాలి.

అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్తకు నికితా అజాద్‌ రాసిన బహిరంగ లేఖ

(దీనిని యూత్‌కి అవాజ్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది)

గౌరవనీయులైన అయ్యా,

నేను 20 సంవత్సరాల యువతిని, భూమ్మీద వున్న ఇతర మానవులకు మాదిరే నాకు కళ్లు, ముక్కు, చెవులూ, పెదవులు, చేతులు, కాళ్లు వున్నాయి. కానీ దురదృష్టం కొద్దీ నాకు స్తనాలు, పిరుదులు, రుతుస్రావం అయ్యే యోని కూడా వుంది. నా రక్తం శబరిమల ఆలయాన్ని కలుషితం చేస్తుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను మరియు నేను రుతు క్రమంలో వున్న కారణంగా ఆలయ ప్రవేశానికి నన్ను నిరోధించారు.దీనిని ప్ర శ్నించినపడు మీరు ఇలా అన్నారు, ‘ ఏడాది పొడవునా మహిళలను దేవాలయంలోకి అనుమతించకుండా చూస్తే ఎలా వుంటుంది అని జనం అడిగే సమయం వస్తుంది. ఈ రోజుల్లో దేవాలయాల్లోకి ప్రవేశించేవారి దగ్గర ఆయుధాల కోసం శరీరాలను పరీక్షించే యంత్రాలు వున్నాయి. ఏదో ఒక రోజు మహిళలు కూడా ప్రవేశించటానికి ఇది సరైన సమయం( రుతు క్రమానికి కాదు) అని స్కాన్‌ చేసేందుకు అవసరమైన యంత్రాన్ని కనుగొనే రోజు వస్తుంది, అలాంటి యంత్రం కనుగొన్న తరువాత మహిళలను అలయంలోకి ప్రవేశించటం గురించి మనం మాట్లాడుకుందా అన్నారు.’

మీ ప్రకటనపైనేను ఆగ్రహించటం లేదు కానీ విచార పడుతున్నాను.నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను. అనేక మంది దేవుళ్లు,దేవతల ముందు ప్రార్ధించమని నా తలిదండ్రులు ఎప్పుడూ చెబుతుంటారు. ప్రతి ఏడాది నా కుటుంబంతో కలసి నేను చింతా పుర్ణి, నైనాదేవి, వైష్ణోదేవి, చాముండా దేవి, జ్వాలా జీలను దర్శించటానికి వెళతాను. పురుషులు, స్త్రీలను దేవుడు సమానులుగా ఎలా సృష్టించాడో , ఎలా మానవులందరూ దేవుని పిల్లలో మా తలిదండ్రులు నాకు చెప్పారు. మీ ప్రకటన నాకు దేవుడిపై వున్న ప్రతి విశ్వాసాన్ని దెబ్బతీయటం ద్వారా షాక్‌ తిన్నాను.

ఆ సమయంలో(రుతుక్రమం) మహిళలు దేవాలయాలలో ప్రవేశించకూడదని మా అమ్మ చెప్పటం నేను విన్నాను. కానీ ఈ విశ్వాసం అర్ధంలేనిదని ఇటీవలి వరకు దీనిని నేను సాధారణంగా వదలివే శాను. ప్రత్యేక తరగతికి చెందిన మహిళలు రుతుస్రావంతో మైలపడవచ్చునేమో అని నేను ఆలోచించాను.కానీ ఇండియాలోని చారిత్రాత్మక దేవాలయలలో ఒకటైన దానిలో రుతుస్రావం పాపం అని పరిగణించటం విని నా హృదయం ముక్కలైంది.

నా గౌరవాన్ని కాపాడు కొనేందుకు నేను నల్ల ప్లాస్టిక్‌ కవర్‌లో శానిటరీ నాప్‌కిన్స్‌ తీసుకువెళుతూ వుంటాను. రక్తం నా దుస్తులకు అంటకుండా చూసుకొనేందుకు వాటిని జాగ్రత్తగా అమర్చుకుంటాను. ఆ సమయంలో ఒక వేళ మరక పడిందేమోనని చూసుకొనేందుకు పలుసార్లు మరుగుదొడ్డికి వెళతాను.ఎవరైనా ఎక్కడికి వెళుతున్నావని అడిగితే సిగ్గుతో చిరునవ్వులు విసురుతాను. మానాన్న, సోదరులు చూడకుండా వుండేందుకు చెత్తడబ్బా దగ్గరకు హడావుడిగా పరుగుదీస్తాను.మహిళలు పనిదుకాణాలలో శానిటరీ నాప్‌కిన్స్‌ కొనుగోలు చేసేందుకు పనిగట్టుకొని దుకాణాలను వెతుకుతాను.మన సమాజ పవిత్ర సంస్కృతిని నిలబెట్టేందుకు నేను ప్రయత్నించాను. నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు.

కానీ నేను ఒకందుకు విచార పడుతున్నాను. నాశరీరం నుంచి స్రవించే రక్తాన్ని నేను ఆపగలిగిన స్ధితిలో లేను. రుతుక్రమాన్ని చారిత్రాత్మకంగా సమర్ధించుకోవటం ద్వారా బ్రాహ్మణ హత్యా పాతకంగా నేను సంపాదించుకున్న శాపాన్ని నేను పోగొట్టుకోలేను. రక్తం స్రవిస్తూనే వుంటుంది. ఇది నా తప్పు, కరెక్టేనా ? తగు గౌరవంతో నా తప్పు గురించి కొన్ని ప్రశ ్నలు అడగటానికి సాహసిస్తున్నాను.

ఆలయాలలో ప్రవేశించే పురుషులందరూ స్త్రీ, పురుష సంభోగం ద్వారా పుట్టినవారే.బిడ్డను తొమ్మిది నెలలు స్త్రీ తన కడుపులో దాచుకుంటుంది, తన గర్బ సంచిద్వారా పోషకాహారాన్ని అందిస్తుంది, తన యోని ద్వారా బిడ్డకు జన్మనిస్తుంది.ఆలయాలలో ప్రవేశించే పురుషులందరూ తమ తల్లుల గర్బసంచులలో ఏర్పడే రక్తం ద్వారా పుట్టినవారు కాదా ?

ఒక చిన్న బిడ్డగా అష్టమి నాడు ఒక దేవిగా పరిగణించారు. కానీ నేను పెరిగిన తరువాత నేను అపవిత్రమైనట్లు చెప్పారు. తమ భారాన్ని వదిలించుకొనేందుకు నేను వివాహం చేసుకోవాలని పదే పదే నా తలిదండ్రులు కోరారు. సమాజం ఎంపిక చేసిన ఒక పురుషుడి వీర్యంతో నా అండం ఫలదీకరణం చెందాలని నాకు చెప్పారు. స్వయంగా వీర్యాన్ని ఎంపిక చేసుకోవటానికి నేను సాహసం చేస్తే నన్ను అనుమతించరు.అలాగే నా లుషితమైన రక్తాన్ని ఆలయంలోకి తీసుకురాకూడదని మీరు నిర్ణయించారు. నారక్తంతో నేను ఏం చేయాలో నిర్ణయించటానికి కొంత మందికి ఏ దేవుడు అధికారం ఇచ్చినట్లు ?

అయ్యా

తన స్వంత బిడ్డలను అపవిత్రులుగా పరిగణించే దేవుడిని నమ్మటానికి నేను అంగీకరించను, అలాంటి దేవాలయాలలోకి ప్రవేశించటానికి నాకు ఆసక్తి లేదు. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏ దేవుడి అనుమతితో మీరు నా స్వచ్చతÛను పరీక్షించాలని ప్రతిపాదిస్తున్నారు ? ఒక నాడు మీ దేవుడి ద్వారా వృద్ధిలోకి వచ్చి ఒక దేవుడు లేదా దేవాలయం ఒక యువతిని వివాహం చేసుకొని తరువాత అగ్రకులాల వారికి వ్యభిచారిణిగా చేసి దానిని క్రమంగా ఒక వ్యవస్దగా మార్చిన దేవదాసీ వ్యవస్ధ గురించి మీకు తెలిసే వుంటుందనుకుంటున్నాను. అమానుషమైన పూర్వకాలపు ఈ కుల వ్యవస్ధను ఎంతో కష్టంతో వదిలించుకున్నాము. కానీ స్వచ్ఛతను తనిఖీ చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేయటం ద్వారా మీరు అలాంటి వ్యవస్దనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

ఎక్కడైతే ప్రతి ఇరవై నిమిషాలకు ఒక మహిళ మానభంగం, ప్రతి క్షణానికి ఒక మహిళ గృహ హింసకు గురయ్యే ఒక దేశంలో మనం నివశిస్తున్నాము, ఒక ప్రజాస్వామ్య దేశం. మీ అభిప్రాయం ప్రకారం దీని వెనుక కారణం కూడా రక్తమే అయి వుంటుంది. రుతుస్రావం అ య్యే మహిళలను దేవాలయంలోకి ప్రవేశించనివ్వకుండా దాని పవిత్రను కాపాడేందుకు ఒక పరిష్కారమార్గాన్ని సూచించినట్లుగా , అలాంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు రుతుస్రావం అయ్యే మహిళలను ఇళ్లలో బందిఖానాలలో వుంచాలని మీరు ప్రతిపాదిస్తున్నారా ? బహుశా మీరు చేయండి. మీరు మీ స్నేహితుడు,ఢిల్లీలో సామూహిక మానభంగం చేసిన ముఠాను నిర్భయ గనుక అన్నా అని పిలిచి వుంటే అది జరిగేది కాదని చెప్పిన ఆశారాంబాపును మర్చిపోయి వుంటారనుకుంటున్నాను.

చివరి ప్రశ్న. రుతుక్రమాన్ని ఒక మైల కార్యక్రమంగా వర్ణించి మీరు మహిళలను మొత్తంగా అపహాస్యం చేశారు.కానీ అదే సమయంలో మా తోటి సోదరులు, సోదరీ మణులు రూపొందించిన దేవాలయాన్ని మీ పూర్వీకుల ఆస్తిగా చెప్పుకున్నారు. ఏ అధికారంతో శబరిమల ఆలయాన్ని మీ దేవాలయంగా చెప్పుకుంటారు? ఏ అధికారంతో నేను దేవాలయ ప్రవేశం చేయకూడదని చెబుతారు ?

చివరిగా , నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఊహాజనితమైన వుదారవాద స్వేచ్ఛను వదిలించుకొనేందుకు మహిళలకు ఒక అవకాశం ఇచ్చినందుకు, సమాజంలో వారి స్దితి గురించి పునరాలోచన చేసేందుకు తోడ్పడినందుకు మీకు కృతజ్ఞతలు.అంతే కాదు మీరు చెప్పినట్లుగా స్వచ్చతను నిర్ధారించే యంత్రాలను పెట్టలేరు కానీ ఇలాంటి తిరోగమన, అమానుష, మహిళా వ్యతిరేక ఆచారాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాడేందుకు అవకాశం కల్పించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను.

మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్న

మీ విధేయురాలైన

రుతుక్రమంలో వున్న ఒక యువతి

నికితా అజాద్‌

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మెయ్యబోతే ఆవుల్లో దున్నబోతే దూడల్లో అంటే కుదురుతుందా ?

20 Sunday Dec 2015

Posted by raomk in AP NEWS, BJP, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, call money, CHANDRABABU, tdp

ఎంకెఆర్‌

కాంగ్రెస్‌ అంటే కుంభకోణాలకు మారుపేరు, సందేహించేవారే లేరు. వేల కోట్ల రూపాయలున్న (కొందరు ఐదువేలంటారు మరికొందరు రెండువేలంటారు) నేషనల్‌ హెరాల్డ్‌ అనే ఒక పత్రిక ఆస్ధులను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. దానిని అమలు జరిపారు. సుబ్రమణ్యస్వామి అనే ఒక నాయకుడో కార్యకర్తో స్థాయో అసలు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియని ఒక లిటిగెంట్‌ బిజెపిలో చేరక ముందు నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం అంటూ ఒక కేసు వేశాడు. దానిలో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు శనివారం నాడు న్యూఢిల్లీలో ఎలాంటి హంగామా చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా టీవీలలో చూశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది కనుక జైలుతో పనిలేకుండా బెయిల్‌ వచ్చింది. విచారణ వాయిదా పడింది. మనం కూడా దాన్ని కాసేపు పక్కన పెడదాం.

ఆసలు ఆ కేసుతో దానిని వేసిన సుబ్రమణ్యస్వామితో మాకు సంబంధం ఏమిటి అంటుందేమిటి బిజెపి? సదరు స్వామి బిజెపిలో లేనపుడు వేశారని ఇప్పుడు బిజెపిలో వున్నప్పటికీ అది స్వంత కేసు తప్పకేసు తప్ప పార్టీకి సంబంధం లేదని నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో వున్న బిజెపి మాజీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు, ఆ పార్టీ ఇతర నాయకులు బల్లచరిచి మరీవాదిస్తున్నారు. ఇక్కడ సమస్య స్వామి ఇప్పుడు ఏ గంగలో వున్నాడన్నది కాదు. ఆ కేసు విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? పార్టీలో చేర్చుకొనే ముందు బిజెపి లేదా స్వామి ఆ కేసుల గురించి చెప్పలేదు. స్వామి తప్ప కేసులతో తమకు సంబంధం లేదని అనటం వింతగా వుంది. పాత కేసులు వున్న అనేక మందిని బిజెపి తన కండువా కప్పి వారిని ఎన్నికలలో నిలబెడుతున్నది. అయినంత మాత్రాన వారు అఫిడవిట్లలో ఆ కేసులను ప్రస్తావించకుండా వుంటున్నారా? వుంటే కుదురుతుందా ? ఏదో ఒక వైఖరి చెప్పాలా లేదా ?

కాల్‌ మనీ మాఫియా వ్యవహారంలో అసెంబ్లీలో జరిగిన చర్చ తీరుతెన్నులను పరిశీలిస్తే అధికారపక్షం ఆబురదను పూసుకుందా ప్రతిపక్షం పైచేయి సాధించిందా అన్నది జనం బేరీజు వేసుకుంటున్నారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ తనకు తెలియకుండానే తానే మకిలి అంటించుకుంది అన్న అభిప్రాయం బలంగా వుంది. దీనిలో తెలుగు కాల్‌ మనీ మాఫియా వ్యవహారాలను పోలీసుల దృష్టికి తెచ్చిన తెలుగుదేశం ఎంపీ ఈ సమస్య అసెంబ్లీ సమావేశాల స్దంభనకు దారితీస్తుందని, అధికారపక్షాన్ని ఇంతగా ఇరుకున పెడుతుందని, పరిణామాలు ఈ విధంగా వుంటాయని ఊహించి వుండరు. దీన్ని గురించి బయట పెట్టిన నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెంటనే పది రోజులపాటు సెలవుపై వెళుతున్నారనే వార్తలు రావటంతో ప్రభుత్వం, పాలకపార్టీ ప్రతిష్ట దిగజారింది. కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వమే ఆ పని చేయించిందని వూరూ వాడా గుప్పు మంది. తెలుగుదేశం పార్టీని కాపాడటమే తమ కర్తవ్యంగా పెట్టుకున్న మీడియా కూడా ఈ విషయంలో ఆయన ప్రతిష్టకు మచ్చ రావటాన్ని నివారించలేకపోయింది. నష్ట నివారణ చర్యలు కూడా సరిగా చేపట్టలేదు. తన సెలవును తానే రద్దు చేసుకున్నట్లు సవాంగ్‌ మీడియాతో చెప్పగా ముఖ్యమంత్రి రద్దు చేయించారని తెలుగుదేశం నాయకులు ప్రకటించి అభాసుపాలయ్యారు.

కాల్‌ మాఫియా దురంతాలపై అసెంబ్లీలో చర్చ చేయకుండా పాలకపక్షాన్ని రచ్చకు ఈడ్వకుండా ప్రతిపక్షం ఎలా వుంటుంది. రాష్ట్రాన్ని కుదిపివేసిన కాల్‌ వ్యవహారంపై ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అంగీకరించి వుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నది కనుకే వెంటనే చర్చకు అంగీకరించినట్లు చెప్పుకోవటానికి ఒక మంచి సందేశం పంపటానికి అవకాశం వుండేది. నిజానికి దీని గురించి అధికారపార్టీ అంత ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ జరిగినన్ని రోజులూ ఈ అంశం తప్ప మరొకటి లేదు. ఈ అం శాన్ని రచ్చ చేయటం వలన రాజధానికి చెడ్డపేరు వచ్చిందని చంద్రబాబు నాయుడు వాపోవాల్సిన అవసరం వచ్చి వుండేది కాదు. చంద్రబాబు నాయుడి పాలనలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయా అని జపాన్‌, సింగపూర్‌ పాలకులకు తెలిసి వుండేది కాదు. ఈ మాఫియాలో వున్న తమ పార్టీ వారిపై తెలుగుదేశం పార్టీ వెంటనే చర్య తీసుకోకపోగా ఇతర పార్టీల వారూ వున్నారనే ప్రచారం కోసం రాష్ట్రంలో పలుచోట్ల దాడులు చేయించిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత జరిగిన తరువాత అసెంబ్లీలో వైసిపి సభ్యురాలు రోజా అనుచితంగా ప్రవర్తించిందని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు తప్ప కాల్‌మాఫియాలో వున్న వారిని తెలుగుదేశం లేదా వైసిపీ గానీ ఎవరూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. అలాంటి వారితో ఫొటోలు దిగటంలో తప్పులేదన్నట్లుగా మాట్లాడిన వైసిపి నేత జగన్‌ తమ పార్టీ వారూ ఫొటోల ప్రదర్శనకు దిగిన విషయాన్ని మరిచిపోతే ఎలా ?

తెలుగుదేశం పార్టీకి అంబేద్కర్‌పై ఎక్కడలేని ప్రేమ ఆకస్మికంగా వుట్టుకువచ్చినట్లు ప్రవర్తించింది. ఒకవైపు రిజర్వేషన్లు అమలు జరపాల్సిన ప్రభుత్వ రంగ సంస్దలను నిర్వీర్యం చేసి వుద్యోగ నియామకాలను నిలిపివేస్తున్నది. ప్రభుత్వ వుద్యోగాలలోనూ అదే పరిస్ధితి. ప్రయివేటు రంగంపై నియంత్రణల ఎత్తివేతలో భాగంగా కార్మిక చట్టాలను నీరు గార్చేందుకు మద్దతు ఇస్తున్నది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేయటమంటే అంబేద్కర్‌ సామాజిక న్యాయాన్ని కాదని చెప్పటమే. అంబేద్కర్‌పై అసెంబ్లీలో నిజంగా చర్చజరపాలనుకుంటే దానికోసం ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించి జరిపితే ఎవరూ గొడవ చేయరు. ఆ పని ఎందుకు చేయలేదు. రెగ్యులర్‌ సమావేశాలలో ఆ అజెండాను మిళితం చేయటం ఒక రాజకీయం. దాన్ని అడ్డుకున్నారని ప్రతిపక్షంపై నెపం వేసేందుకే దాన్ని ముందుకు తెచ్చారనిపిస్తోంది. నిజంగా అంబేద్కర్‌పై, ఆయన పోరాడి, సంఘటితపరచిన దళితులు, గిరిజనులపై ప్రేమ వంటే గత ఇరవైనెలలుగా ఎస్సీ కమిషన్‌ ఎందుకు నియామకం జరపలేదు?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాల్‌ మనీ కహానీలు

19 Saturday Dec 2015

Posted by raomk in AP NEWS, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, call money, telugudesam, Ycp

సత్య

శాసన సభలో కాల్‌ మనీ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు రెండూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆ దుమ్ములో జనానికి ఏం జరుగుతోందో, ఏ జరగనుందో తెలియటం లేదు. ఒక గీతను చిన్నదానిని చేయాలంటే దాని పక్కన పెద్ద గీతను గీయటం పాత విద్యే.కాల్‌మనీ, అప్పు ఇచ్చి అత్యాచారాలు చేశారన్న ఆరోపణ, దందాలో చిక్కుకున్న విజయవాడ తెలుగుదేశం పార్టీ పరివారాన్ని కాపాడుకొనేందుకు, ఈ సమస్యను దారి మళ్లించేందుకు ఇప్పటికే చేయాల్సింది చేశారు. దానిలో భాగంగానే అన్ని పార్టీలకు తలాకాస్త బురద పూసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల వారూ వున్నారని, వారిలో వైసిపి వారే ఎక్కువగా వున్నారని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తం 188 మందిలో తమ వారు 20 మంది మాత్రమే వున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంలో ఆంతర్యం ఏమిటి ? దీనిలో నిజం కూడా వుండవచ్చు.

తమ వారు అంత తక్కువగా వున్నపుడు ఇతర పార్టీల వారూ ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి వారు ఎక్కువ మంది వున్నట్లు ఇప్పుడు చెబుతున్న సర్కార్‌ తమ వారిపై ఫిర్యాదు వచ్చేంత వరకు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న అధికారం పక్షం ఇంత తీవ్ర విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు ? వడ్డీ వ్యాపారులందరూ విజయవాడలో వారి మాదిరి మాఫియా లేదా సెక్స్‌రాకెట్‌లో నిమగ్నమైనవారు కాకపోవచ్చు. వడ్డీ వ్యాపారం చేసేవిగా పేరుపడిన పట్టణాలు,గ్రామాలకు చెందిన వారందరినీ ఈ సందర్బంగా పోలీసులు రౌండప్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా సమస్యను పలచపడేట్లు చేయటానికి వేసిన ఎత్తుగడ మాత్రమే అని జనం భావిస్తున్నారు.

విజయవాడలో ఆరోపణలు వచ్చిన వారి వివరణలు చూస్తే ముఖ్య ంగా అధికార పార్టీ వారివి కహానీలుగా కనిపిస్తున్నాయి. పెనమలూరు ఎంఎల్‌ఏ బోడె ప్రసాద్‌ రాజకీయాలలోకి రాకముందు తనకు 23 ఎకరాల పొలం వుందని ఇప్పుడు రెండున్నర ఎకరాలకు తగ్గిపోయిందని స్వయంగా చెప్పారు కనుక మనం నమ్మాలి. ఎందుకంటే అనేక మంది అలా పోగొట్టుకున్నవారు వున్నారు. ఈ రోజుల్లోనా అని ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం కష్టం. అదే ఎంఎల్‌ఏ గారు మరొక మాట కూడా చెప్పారు బ్యాంకుల నుంచి పది కోట్ల రూపాయల అప్పు తీసుకొని వ్యాపారం చేస్తున్నానని అన్నారు. రెండున్నర ఎకరాల ఆసామికి పది కోట్ల రూపాయల అప్పు ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు ఎంతో వుదారంగా అప్పులిస్తున్నట్లు మనం నమ్మాలి. ఇంత తక్కువ ఆస్ధి వున్నవారికే బ్యాంకులు పదికోట్ల రూపాయల అప్పులిస్తుంటే అంతకంటే ఎక్కువ ఆస్థులున్నవారు కూడా కాల్‌మనీ మాఫియా చేతుల్లో ఎందుకు చిక్కుకున్నారో, మాన మర్యాదలు ఎందుకు పోగొట్టుకున్నారో ఎంఎల్‌ఏగారు చెపితే బాగుంటుంది. ఇంకొకటి కాల్‌మనీ కేసులో తప్పించుకుతిరుగుతున్న తన ఇంటి పక్క స్నేహితుడితో కలసి విదేశాలకు వెళితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అన్న లోకోక్తి ఒక్క వైసిపి నేతలకే కాదు అందరికీ వర్తిస్తుంది. ఫిర్యాదు చేసింది స్వంత పార్టీ ఎంపి కేశినేని నాని అని అసలు కాల్‌మాఫియా గురించి బయట పెట్టింది తామేనని చెప్పుకుంటున్న ఎంఎల్‌ఏ గారు అలాంటి మాఫియాలోని ఒకడైన తన స్నేహితుడిని గుర్తించలేకపోయారా ? స్నేహితులతో విదేశాలకు వెళ్లటమే తప్పా అని ఇప్పుడు అమాయకంగా అడిగితే ఎవరైనా నమ్ముతారా ?

మరో అధికార పార్టీ ఎంఎల్‌సి బుద్ధా వెంకన్న తాను ఇరవై సంవత్సరాలుగా తన తమ్ముడితో కలసి లేనని చెప్పారు. ఇది అంతగా అతుకుతుందా ? పోనీ లెండి తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పినట్లు కాల్‌ ముఠాలో లేడు అని చెప్పలేదు. తమ్ముడు తప్పుదారి పట్టినపుడు అన్నగా ఎందుకు మందలించలేదు, దాన్నుంచి ఎందుకు తప్పించలేదు అన్నదే సమాధానం రాని ప్రశ్న. కేశినేని నాని ఫిర్యాదు చేసేంత వరకు ఆపని మిగతావారు ఎందుకు చేయలేకపోయారు అన్నది అపూర్వ చింతామణి లేదా తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి ఒక్కలౌతుందన్న భేతాళుడి ప్రశ్న. తాను వైసిపి అరాచకాలను ఎదుర్కొంటున్న కారణంగానే జగన్‌ తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పటం కొంచెం ఎక్కువగా వుంది. మిగతా ఎంఎల్‌ఏలు వైసిపిని ఎదుర్కోవటం లేదా ? వైసిపి కాల్‌ మనీ మాఫియాను మీరు ఎందుకు వుపేక్షించినట్లు ?

కాల్‌ మనీ వార్తలు చదువుతుంటే రామాయణంలో పిడకల వేటలా ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ ఎన్‌ పటేల్‌ బ్యాంకర్లకు ఇది మంచి బేరాలు వచ్చే సమయం అని తిరుపతిలో వెంకన్న సన్నిధిలో చెప్పారు. మరిచి పోయా అసలు వెంకన్న పెద్ద వడ్డీ కాసులవాడు కదా ! జనానికి అప్పులు ఎలా తీసుకోవాలి అన్న విద్య తక్కువగా వున్న కారణంగా వారు కాల్‌ నాగుల వలలోచిక్కుకుంటున్నారని, దీన్ని చూస్తుంటే తమ బ్యాంకులకు మంచి బేరాలు తగిలే అవకాశాలున్నాయని చెప్పారు. జనానికి రుణ విద్య తెలియక కాదు, బ్యాంకర్లు పెట్టే నస, తిరగలేక లేక మాత్రమే వడ్డీ వ్యాపారుల వలలో పడుతున్నారు. ఆస్ది తనఖా పెట్టినా సామాన్యులకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లు కావూరి సాంబశివరావు వంటి వారికి వేల కోట్ల రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇస్తారు. సామాన్యులు గడువులోగా కట్టకపోతే సామాన్లు బయటపడవేసి చుట్టుపక్కల వారి ముందు అవమానాల పాలు చేసే బ్యాంకర్లు సాంబశివరావు వంటి వారిని బాబ్బాబు అని బతిమిలాడుకుంటారు. ఏమైనా మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో జనం ఎదుర్కొంటున్న ఒక ముఖ్య సమస్యపై అసెంబ్లీలో గొడవల రూపంలో అయినా చర్చ జరుగుతోంది. కనీసం ఒక్కరినైనా శిక్షించి పుణ్యం కట్టుకుంటే అదే పదివేలు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

త్వశుంఠ ! త్వశుంఠ !!

18 Friday Dec 2015

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, call money, Vijayawada

సత్య

కాల్‌ మనీ అత్యాచారాల గురించి రోజు రోజుకూ కొత్త వుదంతాలు వెలువడుతున్నాయి. దీనికి బలైంది పేద, మధ్యతరగతి వారే కాదు, ధనికులు కూడా వున్నట్లు స్పష్టమౌతోంది. దీనిలో వడ్డీ మాఫియా, వాటికి బలైన అనేక కుటుంబాల మానవతుల మర్యాదలు మంట గలవటం గురించి బయటకు చెప్పుకోలేని వారెందరో వున్నారు. ఆ బలహీనతను ఆసరా చేసుకొని మాఫియాలు తమ పంజా విసురుతున్నాయన్నది స్పష్టం. ఈ దారుణాల గురించి అసెంబ్లీలో తొలి రోజే ప్రతిపక్షం, అధికారపక్షం బాహా బాహీ తలపడ్డాయి. ఇదెలా వుందంటే త్వశుంఠ అంటే త్వశుంఠ అన్నట్లుగా తయారైంది. బాధితులను రక్షించటం ఎలా, నేరగాళ్లపై చర్యలు తీసుకోవటం, ఇలాంటి దారుణాలను రాబోయే రోజుల్లో ఆపటం ఎలా అనే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మీ పార్టీ వారు, మీ అనుచరులే ఎక్కువ మంది వున్నారంటూ పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. అంటే అసలు సమస్యను రెండు పక్షాలూ పక్కదారి పట్టిస్తున్నాయి. వారి అనుచరులు కోరుకుంటున్నది ఇదే. ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఏ పార్టీ వారు ఎందరున్నా వారంతా గతంలోనో, ఇప్పుడో అధికార ప్రాపకం వున్న వారు, లేదా సంఘవ్యతిరేక శక్తులు తప్ప మరొకరు కాదు. అలాంటి విభజన చేసేందుకు ప్రయత్నించటమంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలను ఏరే యత్నం తప్ప మరొకటి కాదు. రెండు పక్షాలకు మద్దతుదారులుగా పేరు పడిన మీడియా పత్రికలు లేదా టీవీ ఛానల్స్‌ తమ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఎదుటి పక్షానికి చెందిన నేరగాళ్లనే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. అంటే అందరి గురించి తెలుసుకోవాలంటే రెండు పక్షాల మీడియా వార్తలను చదువుకోవాల్సి వుంటుంది.

గతంలో మద్యం, ఇసుక మాఫియాలు, వాటి అక్రమాల గురించి సంచలన వార్తలు వచ్చిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. వాటిలో శిక్షలు పడిన వారెందరు? ఏ పార్టీ వారెందరో వున్నారో ప్రభుత్వం ప్రకటిస్తే తాజా కాల్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం బాధితుల్లో కలుగుతుంది, మరిన్ని దారుణాలను నివేదించటానికి, ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. అది చేయటానికి బదులు ఫలానా నిందితుడు ఫలానా నాయకుడితో ఫొటోలు దిగాడు, ఫలానా నిందితుడు ఫలానా నేత పర్యటనలకు ఏర్పాట్లు చేశాడు వంటి వాదనల ద్వారా సాధించేదేమీ వుండదు. ఇలాంటి నిందితులందరూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఫిరాయించటం జగమెరిగిన సత్యం. అలాంటి వారని తెలిసిన తరువాత కూడా పార్టీల కండువాలు కప్పుతున్నారా లేదా ? ఏదో సాకుతో సమర్ధిస్తున్నారా లేదా ?ఎక్కడ తిరిగినా సరే మా దొడ్లే ఈనితే చాలంటున్నారా లేదా ? అందువలన అసెంబ్లీలో,వెలుపలా పాలక, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం అంతా లాలూచీ కుస్తీ తప్ప మరొకటి కాదని జనం అనుకుంటే తప్పేముంది?

విజయవాడ, కృష్ణాజిల్లాలోని తెలుగు దేశం పార్టీలోని ముఠా గొడవల్లో భాగంగా ప్రత్యర్ధి వర్గాన్ని ఇరుకున పెట్టేందుకు కాల్‌ మనీ దందాను ఒక వర్గం వుపయోగించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిదే ! ప్రతిపక్షం చేయలేని పనిని ఎవరో ఒకరు చేశారు, వారు ఎందుకు చేసినా ‘అభినందిం’చాల్సిందే. ఇంకా అలాంటి విషయాలను బయటపెట్టేందుకు ప్రోత్స హించాల్సిందే. అప్పుడే అవతలి ముఠాలో ఏవైనా అక్రమాలుంటే ఇవతల ముఠా కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బయటపెడుతుంది. జనానికి వాస్తవాలు తెలుస్తాయి, మీడియాకు సంచలన వార్తలు దొరుకుతాయి. విజయవాడకు అలాంటి చరిత్ర గతంలో వున్నది. కాంగ్రెస్‌లో జిఎస్‌ రాజు, వంగవీటి రంగా వర్గాలు అలా అనేక విషయాలను బయటపెట్టాయి. ఆ మంచి సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగించినా అభినందించాల్సిందే.ఎందుకంటే అధికార యంత్రాంగం తానుగా అక్రమాలను వెలికితీసి, అక్రమార్కుల పని బట్టదు అని తేలిపోయింది. ఎందుకంటే వారికి ఎంతసేపూ పాలకపార్టీ సేవ తప్ప మరొకటి చేసే తీరిక వుండదు.

ఈ సందర్బంగా జనం బలహీనతలను చెప్పుకోకుండా సంపూర్ణం కాదు. విజయవాడ, రాష్ట్రం, దేశం ఎక్కడైనా ఇలాంటి మాఫియాలు, నేరగాళ్ల గురించి జనానికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అయినా సరే ఎన్నికలలో వారికి మద్దతు ఇస్తున్నారు. దీని వెనుక వున్న లాజిక్కు ఏమిటి ?ఏటిఎం మిషన్‌లో కార్డు అలా పెట్టి ఇలా డబ్బు తీసుకున్నంత సులభంగా తెల్లవారే సరికి డబ్బు సంపాదించాలి, నువ్వు ఎంత డబ్బు సంపాదించావన్నది ముఖ్యం తప్ప ఎలా సంపాదించావన్నది కాదు అన్నది నీతి నేడు సమాజాన్ని నడిపిస్తున్నది. అందువలన డబ్బు సంపాదించే వారే సమర్ధులు, జనం, సమస్యలు, పరిష్కారాలంటూ వీధుల్లో తిరిగే కమ్యూనిస్టుల వలన ప్రయోజనం లేదు. మనం కూడా ఎప్పుడైనా డబ్బు సంపాదించాలంటే మార్గం అధికార పార్టీని బలపరచటం, దాని నాయకుల చుట్టూ తిరగటం తప్ప మరొక మార్గం లేదు.

దీనికి తోడు వినియోగదారీ సంస్కృతి జన నరనరాల్లో ప్రవేశించింది. అత్యాశలకు పోవటం, ఆడంబరాలను పదర్శించటం, లేనిగొప్పలు చెప్పుకోవటం, పిల్లలకు వాస్తవాలు తెలియకుండా దాచటం, అందుకోసం అందినకాడికి అప్పులు చేయటం ఇలాంటి మాఫియాల చేతుల్లో చిక్కుకోవటం. దీన్నుంచి బయటపడనంత వరకు ఈ రోజు కాల్‌ మనీ రేపు మరొక మనీ, మరొక మాఫియా చేతుల్లో చిక్కుకోవటం. దీన్ని గురించి ఆలోచించకుండా, మంచి చెడ్డల వివేచన చేయకుండా రాజకీయాలలో నేరగాళ్లను, వారిని వెంటవేసుకు తిరిగే వారిని సమాజం అసహ్యించుకొని దూరంగా పెట్టనంత కాలం ఎండమావుల వెంట పరుగుపెడుతూనే వుంటారు, మోసపోతూనే వుంటారు. కాల్‌ మాఫియా చేతుల్లో అత్యాశకు పోయిన ఒక కుటుంబం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. అదే నిజమైతే జనం ఎంతటి ప్రమాదకర పోకడలలో వున్నారో ఆందోళన కలిగిస్తోంది.

షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టటానికి కోట్ల రూపాయల అప్పుతీసుకొని కాల్‌మనీ మాఫియా వలలో చిక్కుకున్న ఒక కుటుంబం గురించి మీడియాలో వచ్చింది. లక్షల రూపాయలు తీసుకుంటేనే తీర్చలేని స్ధితి వున్నపుడు కోట్ల రూపాయలు అప్పు చేసి కాంప్లెక్సులు కట్టాలనుకోవటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: