• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: November 2016

మోడీ అడుసు తొక్కారు ! కాళ్లు కడిగే విధము చెప్పండి !!

30 Wednesday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

demonetization, demonetization mesh, Modi, modi government

ఎం కోటేశ్వరరావు

    తాంబోలం ఇచ్చేశాను యిహ తన్నుకు చావండి అంటాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు, మా మోడీ అడుసు తొక్కారు, కాళ్లు కడిగే విధము చెప్పండీ అంటున్నారు నమో ప్రహసనంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ .

    మొదటిది నాటకం. కరటకశాస్త్రి, ఆయన శిష్యుడు, మధురవాణి నాటకం ఆడి బాల్యవివాహాన్ని తప్పిస్తారు. కధను సుఖాంతం చేస్తారు. రెండవది వాస్తవం. ఎలా ముగుస్తుందో తెలియదు. అన్నింటికంటే ఎలా ముగించాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి ముందుగానే వుప్పందిన కారణంగా పెద్ద నోట్ల రద్దును రద్దు చేయాలని లేఖ రాసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందినట్లు అనుకుంటున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తరువాత ఆ లేఖను చూపి ఆ ఖ్యాతిలో తమ నేతకు భాగముందన్నట్లుగా మీడియాలో ప్రచారం వచ్చేట్లుగా తెలుగుదేశం వారు మేనేజ్‌ చేశారు. రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు నగదు రహిత లావాదేవీలపై సూచనలు చేసే పేరుతో ఐదుగురు ముఖ్య మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయతలపెట్టినట్లు, దానికి చంద్రబాబు నాయుడిని సారధ్యం వహించమని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌జైట్టీ ఫోన్లో కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

     కేంద్రం నుంచి అలాంటి ఆఫరు వచ్చినపుడు మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఎగిరి గంతేసి వుండేవారు.అనుకున్నదొకటి అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా తగిన సన్నాహం, పర్యవసానాలను వూహించకుండానే నరేంద్రమోడీ నోట్ల రద్దును ప్రకటించేశారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే సర్వేల లోగుట్టు గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటపుడు నరేంద్రమోడీ తాను చేయించిన సర్వేలో నోట్ల రద్దుకు 93శాతం మద్దతు వుందని చెబితే నమ్మేంత అమాయకంగా చంద్రబాబు వుంటారా ? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు, ఆ విషయాలలో, అలాంటి రాజకీయ చాణక్యంలో సరిలేరు నీకెవ్వరూ సరసాల సుధాకరా అన్నట్లుగా చంద్రబాబు పండిపోయారు. కేంద్రం ప్రతిపాదించిన కమిటీకి సారధ్యం వహించే విషయాన్ని కాదన్నట్లుగా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసే మీడియాలో వార్తలు వచ్చాయి. అవునంటే కాదనిలే అని ఆడవారి గురించి అనవసరంగా ఆడిపోసుకుంటారు గానీ చంద్రబాబు కాదు అన్నారంటే నరేంద్రమోడీ దగ్గర దేనికో టెండరు పెట్టి వుంటారని గుసగుసలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే నోట్ల రద్దు పర్యవసానాలపై తలుపు చెక్కతో కాకుండా తమలపాకుతో కొట్టినట్లుగా జనం కోసమైనా తన అసంతృప్తిని వెల్లడించారు. కేంద్రం వద్ద తన పలుకుబడిని వుపయోగించి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో నోట్లు తెప్పిస్తా అన్నట్లు హడావుడి చేసి అవాక్కయ్యారు. ఇనుము బాగా కాలినపుడే దానిని కావలసిన విధంగా మలచుకొనేందుకు సుత్తి దెబ్బలు వేయాలి. నోట్ల రద్దు గురించి మాట్లాడటానికి పార్లమెంట్‌కు వెళ్ల కుండా ముఖంచాటేయటం ఒక బలహీనత. దానిని ప్రదర్శించిన మోడీని ఎలాంటి ప్రతిఫలం లేకుండా -అదేలెండి రాష్ట్ర అభివృద్ధికే సుమా- వూరికే ఆదుకుంటే ప్రయోజనం ఏముంటుంది ? అది పరిష్కారం అయితే ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించటానికి చంద్రబాబు క్షణంలో సిద్దం అవుతారు.

    నోట్ల రద్దు పర్యవసానాల గురించి జనం అర్ధరాత్రుళ్లు ఎటిఎంల ముందు క్యూలు కడుతుంటే , బ్యాంకుల్లో తమ డబ్బును తాము తీసుకోవటానికి వీల్లేక జనం అవస్తలు పడుతుంటే వాటిని పరిష్కరించాల్సిన కేంద్రం దాని గురించి స్పష్టంగా చెప్పకుండా తక్షణమే నగదు రహిత బదిలీ గురించి సలహాలు చెప్పాలని ముఖ్య మంత్రుల కమిటీని ప్రతిపాదించటం అర్ధంలేని విషయం. నగదు రహిత లావాదేవీల గురించి ఎవరికీ అభ్యంతరం లేదు. దానికి తగిన పరిస్థితులు వున్నాయా లేవా అన్నదే సమస్య. దయ్యాలు తిరిగే సమయంలో ఒక నాయకుడికి ఒక ఆలోచన వస్తే తెల్లవారేసరికి దానిని అమలు జరపాలని పట్టుబడితే కుదరదు. అనేక అభివృద్ది చెందిన దేశాలలో ఇప్పటికీ నగదు లావాదేవీలు గణనీయంగా వున్నాయి. కొన్ని దేశాలలో ఇటీవలి కాలంలో అవి పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందువలన తగిన సన్నాహాలు చేసుకొని చేయాల్సిన మార్పులను తొందరపడితే పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలే ఏర్పడతాయి. ముందు ప్రభుత్వంతో మొదలు పెట్టి దశలవారీగా అమలు జరిపి అవినీతిని అరికడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

నీవు నేర్పిన విద్యయే కదా మోడీ !

     ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటంలో కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఎలాంటి తేడా లేదని తేలిపోయింది. ఓటింగ్‌కు అనుమతించే నిబంధన కింద చర్చకు అధికారపక్షం తిరస్కరించటంతో బుధవారం నాడు లోక్‌సభ పరిమితంగానే కార్యకలాపాలు చేపట్టి గురువారం నాటికి వాయిదా పడింది. గతంలో 2జి స్కామ్‌పై చర్చ సందర్భంగా ప్రధాని మన్మోహస్‌ సింగ్‌ సభకు హాజరై, ఓటింగ్‌కు అనుమతించే నిబంధనల ప్రకారం చర్చ జరగాలని బిజెపి పెద్దలు పట్టుపట్టారు. ఇప్పుడు వారు వీరయ్యారు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. పోయినోడే మంచోడనిపిస్తున్నారు. ఎలాగంటే అప్పుడు చర్చ అవినీతి గురించి కనుక కాంగ్రెస్‌ ప్రధాని సభకు రావటానికి సిగ్గు పడ్డారు, సమర్ధించుకోలేని దుస్థితిలో ఆపని చేశారు. ఇప్పుడు నరేంద్రమోడీ సభకు రావటానికి బిడియమెందుకు ? ఇదేమీ అవినీతి అంశం కాదే. నోట్ల రద్దును అవినీతి అని ఎవరూ అనటం లేదే ! ఓటింగ్‌ జరిగేందుకు వీలు కల్పించే నిబంధనల కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్‌లో పాలక కూటమికి పూర్తి మెజారిటీ వుంది. అయినా వ్యతిరేకిస్తున్నది. ఈ కారణంగా 16వ తేదీ నుంచి జరుగుతున్న వుభయ సభలలో ఈ అంశంపై ముందుకు సాగటం లేదు.ఒక వేళ ఓటింగ్‌ గీటింగ్‌ జరిగితే దాని వలన ప్రభుత్వం పడిపోయే పరిస్థితులేమీ లేవే ! నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా ఓటు చేస్తే ఎందుకు అలా చేశారో వారే చెప్పాల్సి వుంటుంది.

     తాను చేసిన నోట్ల రద్దుకు 93శాతం జనం మద్దతు పలికారని ప్రధానే స్వయంగా చెబుతున్నారు. వందకు రెండువందల మంది మద్దతు వుందనే వంది మాగధుల సంగతి సరేసరి. జనం మద్దతు లేకపోతే మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపి పెద్ద పార్టీగా ఎలా సీట్లు సంపాదించింది అని కొత్త పాయింటును దొరకబుచ్చుకున్నారు. జనం మద్దతు వుందా లేదా అన్నది తేలాలంటే ఆ సమస్య మీదే ఓటింగ్‌ జరగాలి. నోట్ల రద్దుతో తలెత్తిన జన ఇబ్బందులను ఎప్పటిలోగా తీరుస్తారు, ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఇబ్బంది పెట్టే చర్య ఎందుకు తీసుకున్నారని కదా ప్రతిపక్షాలు అడుగుతోంది. ఏ పార్టీ అయినా నోట్ల రద్దును వ్యతిరేకించిందా ? లేదే ! దాని పర్యవసానాల గురించి అడగటానికి ప్రతిపక్షానికి అర్హత లేకపోతే పార్లమెంట్‌కు హాజరై ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్రమోడీ వివరించాలి కదా ! పార్లమెంట్‌తో పని లేకుండా నరేంద్రమోడీ ప్రధాని కాలేదు, ఆయన లోక్‌సభా నాయకుడు. ప్రతిపక్షం చర్చకు అంగీకరిస్తే ప్రధాని సభకు వస్తారు అని పాలకకూటమి వాదిస్తోంది. ప్రధాని రాక నెపంతో పార్లమెంట్‌ను జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షానికి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? జనం సొమ్మును ఎందుకు వృధా చేయాలి? యాభై రోజులలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని, ధరలు తగ్గుతాయని అనటం తప్ప నిర్ధిష్టంగా ఏదీ చెప్పటం లేదు. బంగారం ధరలు తగ్గాయి, జనం దానితో కడుపు నింపుకోలేరు కదా ! కడుపు నింపే పప్పుల ధరలు పెరిగాయి. అలాంటపుడు పాలకులు చెప్పే మాటలను జనం ఎలా నమ్మాలి ?

అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు

       అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ( ఇది మహిళలను కించపరచటంగా భావించవద్దని మనవి ) చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు బ్యాంకర్లపై నిందమోపి తన పరిధిని అతిక్రమించారు. మధ్యలో వారేమి చేస్తారు. ఒక చెక్కు తీసుకొని ఒక రోజు బ్యాంకుకు వెళ్లి వుంటే సిబ్బంది ఎంత వత్తిడితో గత కొద్ది రోజులుగా పని చేస్తున్నారో చంద్రబాబుకు తెలిసి వుండేది. రిజర్వుబ్యాంకు నోట్లు పంపితే కదా పంపిణీ చేసేది. తెలుగు నేలలో కొన్ని మీడియా సంస్ధలు ఒక కొత్త లాజిక్‌ను తయారు చేశాయి. అదేమంటే తెలుగుదేశం అధికారంలో వున్నపుడు తమకు మంచివి అనిపించిన అంశాలను చంద్రబాబు ఖాతాలో జమ చేయటం, వైఫల్యాలన్నింటికి అధికారులను బాధ్యులుగా చేసి వారి ఖాతాలో వేయటం. నోట్ల రద్దు పర్యవసానాలకు నరేంద్రమోడీ నిర్వాకాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా సానుకూలంగా కూడా విమర్శించలేదు. బ్యాంకర్లపై నిందలు మోపి, వారిపై వత్తిడి పెంచి ముఖ్యమంత్రి సాధించేదేమీ వుండదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Draft Model GST Law

28 Monday Nov 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Draft Compensation Law, Draft IGST Law, Draft Model GST Law, GST, IGST

Draft Model GST Law, Draft IGST Law and Draft Compensation Law placed in the public domain for information of trade, industry and other stake holders.

The Draft Model GST Law, Draft IGST Law and Draft Compensation Law which would be considered by the GST Council for approval are placed in the public domain for information of trade, industry and other stake holders. The Draft Model Laws can be accessed at the following websites: www.cbec.gov.in, www.dor.gov.in and www.gst.gov.in

 Earlier, the Draft Model GST Law was put in public domain in the month of June, 2016 for comments. A large number of comments were received on the Draft Model GST Law from various stake holders including the trade and industry associations and public.

A Technical Committee of officers from some of the States and the Central Government was constituted to examine the inputs from the stake holders and make suitable amendments in the Draft Model GST Law. The Revised Draft submitted by this Technical Committee on law was further discussed in a meeting held on 21st and 22nd of November, 2016 in Delhi where officers from all States and Central Government were present. The revised and improved version of this Model GST laws shall now be considered by the GST Council for approval on 2nd and 3rd of December, 2016.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నోట్ల రద్దు పర్యవసానాలపై నిరసన విఫలమైందా ? సఫలమైందా ?

28 Monday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, Demonetisation, Demonetisation standoff, Narendra Modi, opposition protest on demonetisation, protest on demonetisation

కేరళ హర్తాళ్ దృశ్యమ్

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సందర్భంగా పౌరుల మీద రుద్దిన ఇబ్బందులకు నిరసనగా అనేక పార్టీలు విడివిడిగా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు (నవంబరు 28న) దేశ వ్యాపితంగా వచ్చిన స్పందన గురించి రకరకాల వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అది ఏ రూపంలో జరిగింది ? జయప్రదమైందా విఫలమైందా అన్న లెక్కలు వేయబోవటం లేదు. జయప్రదమైంది అంటే దాని అర్ధం బిజెపి చిత్రిస్తున్నట్లు నిరసనకు మద్దతు ఇచ్చిన వారందరూ నల్లధనాన్ని, అవినీతిని సమర్ధించేవారు కాదు. విఫలమైంది అంటే ముందు చూపులేకుండా, అనాలోచితంగా నరేంద్రమోడీ చేసిన పిచ్చిపనిని ఆందరూ ఆమోదించినట్లూ కాదు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యను పక్కదారి పట్టించేందుకు గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాణీగారి ప్రతిపక్షం, రాణీగారీ అనుకూల పక్షాల మాదిరి వ్యవహరిస్తున్న మీడియా సంస్ధలు, వాటిలో పనిచేసే షార్ట్‌ హాండ్‌ జర్నలిస్టులు ఈ సమస్యపై కూడా తమ పాత్రలను చక్కగా పోషిస్తున్నారు.

   గత ఇరవై రోజులుగా దేశ విదేశాల విశ్లేషకుల నుంచి వెలువడుతున్న వ్యాఖ్యలు, సమాచారం ప్రకారం నోట్ల రద్దు వలన నల్లధనం రద్దు పెద్ద ప్రహసనంగా మారనున్నట్లు కేంద్రంలోని పెద్దలు గ్రహిస్తున్న కారణంగానే దానినొక రాజకీయ అంశంగా ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు, నగదు రహిత ఆర్ధిక లావాదేవీల పెంపుదల ప్రచార అంశంగా మార్చి వేస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంత రచ్చ జరిగినా బయట తప్ప అక్కడ మాట్లేడేందుకు నరేంద్రమోడీ ఇప్పటికీ విముఖంగానే వున్నారు. అంటే అసలు సమస్య నుంచి జనం దృష్టిని వేరే వివాదంపైపు మార్చేందుకు చూస్తున్నట్లుగానే భావించాలి. నోట్ల రద్దును స్వాతంత్య్రానంతర తొలి విప్లవాత్మక చర్య అన్నంత గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ దాని గురించి మాట్లాడటానికి, చర్చించటానికి పార్లమెంట్‌కు హాజరు కాకపోవటమే పెద్ద వైఫల్యం. ఎంతకాలం మౌనంగా వుంటారు, ఎంతకాలం తప్పించుకుంటారు ? గతంలో ఏదైనా ఒక అంశంపై పాలకపార్టీని నిలదీయాలంటే భిన్న ధృవాలుగా వున్న పార్టీలు సైతం పార్లమెంట్‌లో సమన్వయం చేసుకొనేవి. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్‌లో ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించటమే కాదు, నోట్ల సమస్యపై వెలుపల కూడా ఒకే రోజు వివిధ రూపాలలో విడివిడిగా ఆందోళనకు పిలుపు ఇవ్వటం బహుశా ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. నోరు వుంది కదా, మీడియాలో ఎక్కడ లేని ప్రచారం దొరుకుతోంది కదా అని పాలకపార్టీ నేతలు సంబర పడవచ్చు. ఎందుకైనా మంచిది, భవిష్యత్‌లో ఎటుబోయి ఎటువస్తుందో ఒక అవకాశం అట్టిపెట్టుకుందామని చంద్రబాబు నాయుడి వంటి వారు ఒకవైపు మంచిదని చెబుతూనే మరోవైపు అసంతృప్తి గళం వినిపించటం మామూలు విషయం కాదు.

    సమస్య తీవ్రత కారణంగా సామాన్యులే కాదు చివరికి ఆర్ధిక మంత్రి కుటుంబం కూడా ఎలా ఇబ్బంది పడుతుందో చూడండి అని నమ్మించేందుకు వండి వార్చిన కట్టుకధలలో భాగంగా కొన్ని పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గారు ఒక వంద మందికి విందు ఏర్పాటు చేయమని తన సతీమణికి చెప్పారట. తీరా ఆమె తన, భర్త ఖాతాల నుంచి 24వేల చొప్పున తీసుకున్న డబ్బుతో 50 మందికి మాత్రమే ఏర్పాటు చేయవచ్చని చెప్పారట. సరే పెద్ద వారు అంత ఖరీదైన విందులు ఇస్తారు వదిలేద్దాం. నరేంద్రమోడీ, చంద్రబాబు గారు నగదుతో పని లేకుండా అంతా కార్డులతో ఎంత సులభంగా నడిపించవచ్చో జనానికి చెబుతున్నారు. కేంద్రమంత్రి కుటుంబం వంద మంది విందుకు సరిపడా అవసరమైన ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడ్డారంటే వారికి కూడా అలాంటి కార్డులు లేనట్లే కదా ? ఒక వేళ వుంటే ఇలాంటి కట్టుకధలు ఎందుకు పుట్టినట్లు ?

    మరొక కధ. ఇది స్వయంగా నరేంద్రమోడీ చెప్పిన పిట్ట కధ. తాను టీ అమ్మిన సమయంలో పేదలు స్ట్రాంగ్‌ టీ అడుగుతుండేవారట. అలాగే ఇప్పడు నల్లధనంపై గట్టి చర్య తీసుకున్నా అన్నారు. ఒకే. ఆయన టీ అమ్మినట్లు చెబుతున్న ప్రాంతాలు రైల్వే స్టేషన్‌, బస్టాండ్లలో అమాయకులు తప్ప రోజూ టీ తాగే వారు ఎవరైనా స్ట్రాంగ్‌ టీ అడుగుతారా ? అలాంటి చోట్ల స్ట్రాంగ్‌ టీ దొరకటం ఎంత నిజమో పెద్ద నోట్ల రద్దుతో గట్టి చర్య కూడా అంతే నిజం !

   సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియాలో అనేక మంది ఈ నిరసనను భారత బంద్‌ పిలుపుగా వర్ణించారు. బంద్‌లు జరపకూడదని, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా 1997లో సమర్ధించిన తరువాత ఏ పార్టీ కూడా బంద్‌ పిలుపులు ఇవ్వటం లేదు. అయితే తరువాత మరొక కేసు సందర్భంగా బంద్‌లు జరపటం ప్రజాస్వామ్య బద్దమే అని అదే కోర్టు 2009లో చెప్పిందనుకోండి. సోమవారం నాడు స్ధానిక పరిస్థితులను బట్టి వివిధ రూపాలలో నిరసన తెలపమని వామపక్షాలు పిలుపు ఇచ్చాయి.http://cpim.org/pressbriefs/observe-november-28-all-india-protest-day ఈ లింక్‌లో సిపిఎం అధికారిక ప్రకటన వుంది. దానిలో ఎక్కడా బంద్‌ అన్న పదం లేదు.

    ఇక నిరసన రూపం గురించి పాక్షికం, విఫలం, తీవ్ర అంతరాయం ఇలా రకరకాలుగా వర్ణించటాన్ని చూడవచ్చు. తొంభై బస్‌లు ఆగిపోయి ప్రయాణీకులు లేకుండా పంతానికి పది తిప్పినా, రోజంతా మూసి సాయంత్రం కొద్ది సేపు దుకాణాలు తెరిచినా పాక్షికం అని చిత్రించ వచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో అనేక బంద్‌లు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్ని నిరసనలలోనూ అందరికీ సంబంధించిన సమస్యలు ఎప్పుడూ వుండవు. నోట్ల రద్దు అందుకు మినహాయింపు. సామాన్యుడైనా, ముకేష్‌ అంబానీ అయినా రోడ్డు మీదకు వచ్చి ఒక చాయ్‌ తాగాలంటే స్వయంగా లేదా డ్రైవర్‌ ద్వారా అయినా డబ్చిచ్చి తాగాలే తప్ప చెక్కు లేదా కార్డు గీక్కో మంటే కుదరదు. అందువలన ఇది అందరికీ సంబంధించిన సమస్య కనుక దీనికి ఒక ప్రత్యేకత వుంది. చిత్రం ఏమంటే తాను పేదలకు టీ అమ్మానని చెప్పిన మోడీ ఆ పేదలు టీ డబ్బులను కార్డులు, చెక్కుల రూపంలో ఇవ్వలేరని అర్దం చేసుకోలేకపోయారు. అందువలన నిజంగా అమ్మారా అని ఎవరైనా సందేహించే ఆస్కారం కూడా వుంది.

   నోట్ల రద్దు నల్లధనం రద్దుకు అని చెప్పారు. తీరా ఇప్పుడు పెద్ద లందరూ అసలు నోట్లతో పని లేకుండా మీ చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోనుంటే చాలు, దాని మీద మీటలు నొక్కటం నేర్చుకుంటే అంతా అయి పోతుందని వూదర గొడుతున్నారు. నోట్ల రద్దును వేల కోట్ల సంపదలున్న పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు సమర్ధిస్తూ ప్రకటనలు చేయటాన్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

   ఒకటి. నోట్ల రద్దు మరుసటి రోజు నుంచి జరిగిన పరిణామాలను చూస్తే డబ్బుతో పని లేకుండా కార్డులు గీకి వస్తువులు అమ్మే చోట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి, డబ్బుతీసుకొని అమ్మే దుకాణాలలో తగ్గాయి. అంటే పెద్ద దుకాణాల వారు ఈ నోట్ల రద్దు వెనుక చక్రం తీప్పారా ? కారణం ఏదైనా తనకు కూడా అలాంటి కార్డులు గీకే హెరిటేజ్‌ దుకాణాలు వున్నాయి కనుక ముందు చూపుతో పెద్ద నోట్లు రద్దు చేయాలని అందరి కంటే ముందే కేంద్రానికి లేఖ రాశారా ? చంద్రబాబు నాయుడు కార్డుల ద్వారా లావాదేవీలు జరిపించేందుకు నాలుగు కమిటీలను కూడా వేశామని ప్రకటించారు. మంచిదే. త్వరలో కార్డులు కూడా ఇప్పిస్తారు. ఫోన్లు కూడా ఇప్పిస్తామంటున్నారు కనుక సందేహం లేదు. ( వుద్యోగాలకు బదులు ఫోన్లు, గీకే కార్డులు కావాలని జనాన్ని తిప్పించుకోవచ్చు ) అవి వచ్చిన తరువాత ఏ రోజు పని చేస్తే వచ్చిన ఆరోజు కూలి డబ్బులతో వస్తువులను కొనుగోలు చేసే వారు పల్లె టూళ్ల నుంచి సాయంత్రానికి బ్యాంకులున్న పెద్ద గ్రామాలు లేదా పట్టణాలకు వెళ్లి తమ కూలి డబ్బులను బ్యాంకుల్లో వేయాలి. ఆ సమయానికి బ్యాంకులు మూసివేస్తారు కనుక ఆ రాత్రికి అక్కడ వుండి మరుసటి రోజు వుదయం లేదా వేరే వారికి ఇచ్చి తమ ఖాతాలలో వేయించుకొని మరుసటి రోజు సాయంత్రానికి కార్డుపై సరకులు కొనుక్కోవాలి. ప్రతి రోజు కూలి డబ్బులను అలానే చేయాల్సి వుంటుంది. లేదా కులానికొక కార్పొరేషన్‌ పెట్టినట్లుగా బ్యాంకులు కూడా పెట్టించి వాటి శాఖలను ప్రతి వూరిలో లేదా ఏ కులపు వారికి ఆ కులవీధులలో ఏర్పాటు చేసి అక్కడే వేయించవచ్చు.

   రెండు. బ్యాంకుల వద్దకు చలామణిలో వున్న సొమ్ము పెద్ద మొత్తంలో చేరింది. వెంటనే అనేక బ్యాంకులు తమ వద్ద సొమ్ము దాచుకున్నవారి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటను తగ్గించేశారు. అంటే ఆ మేరకు సుజనా చౌదరి, రాజగోపాల్‌ వంటి పెద్దల కుటుంబాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు ఇచ్చే రుణాల రేట్లు కూడా తగ్గిపోతాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి కంపెనీలకు వడ్డీ రేట్లు తగ్గించాలని సుబ్రమణ్యస్వామి వంటి వారు వారందరూ పని గట్టుకొని రఘురామ్‌ రాజన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వకుండా వుర్జిత్‌ పటేల్‌ను తెచ్చి పెట్టుకోవటం, ఆయన ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్దల హస్తం కూడా వుందా ?

   మూడు. బ్యాంకులలో దోపిడీలు జరుగుతున్నాయని ఎవరైనా బ్యాంకులను మూసి వేస్తారా ? ఎలుకలున్నాయని ఇంటినే తగుల పెట్టుకుంటారా ? రొట్టెను ముక్కలుగా కోయటానికి చాకు బదులు పెద్ద కత్తులను వాడతామా ? పెద్ద సుత్తులతో బాదుతామా ? నరేంద్రమోడీ సర్కార్‌ అదే చేసింది. అసలు మన దేశంలో పాకిస్థాన్‌ లేదా మరొక దేశం నుంచి గానీ వస్తున్న లేదా మన దేశంలో మేకిన్‌ ఇండియా ‘ముద్రణ పరిశ్రమల’ నుంచి వస్తున్న కోయంబత్తూరు నోట్లుగా పిలిచే దొంగ నోట్లు ఎన్ని వున్నాయి? నల్లధనం ఎంత?

    నల్లధనం ఎంత అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు. రెండవది నల్లధనం మొత్తం కూడా నగదు రూపంలో దొంగ నిల్వలుగా లేదు.అధిక భాగం నల్లధనం స్విట్జర్లాండ్‌, పనామా వంటి పన్నులు లేని ప్రాంతాలకు తరలిపోయింది. అక్కడి నుంచి కేవలం తపాల పెట్టె చిరునామా లేదా సూట్‌కేసు కంపెనీల పేరుతో వున్న వాటాల రూపంలో, రియలెస్టేట్‌, బంగారం తదితర రూపాలలో ప్రపంచమంతటికీ పోతోంది. అలాంటి చోట్ల, వివిధ రూపాలలో డబ్బు దాచుకున్న పెద్దలందరూ మోడీ చర్య మంచిదేనని పొగడటమే విషాదం. వారిని వదలి జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్న, విమర్శిస్తున్నవారిని నల్లధనులను బలపరిచేవారిగా బిజెపి, దాని మిత్రపక్షాలు చిత్రిస్తున్నాయి. మన దేశంలోకి విదేశీ పెట్టుబడుల రూపంలో వస్తున్న మొత్తాలలో కూడా నల్లధనం వుంది. ఎంత వంతే అంత ఎర్రతివాచీ పరచి ఆహ్వానించటం తప్ప వాటి మంచి చెడ్డలను కనుగొనేందుకు పాలకులు ప్రయత్నించటం లేదు.

    ఒక గీత పెద్దదా చిన్నదా పెద్దదా అని చెప్పటానికి మరో గీత అవసరం. అలాగే నల్లధనం సమస్య కూడా. షిండర్‌ అంచనా ప్రకారం ఖండాలవారీగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలలో నల్లధనం 41-44శాతం మధ్య వున్నది.ఆసియాలో అది 28-30శాతం. అధికారికంగా ప్రకటించిన జిడిపి లెక్కల ప్రకారం 96 అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు 38.7శాతం. అదే అంచనా ప్రకారం మన దేశంలో 23-26శాతం మధ్య వుంది. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులలో 35శాతం మారిషస్‌ నుంచి 14శాతం సింగపూర్‌ కంపెనీల పేరుతో వస్తోంది. దీనిలో ఎక్కువ భాగం మన దేశం నుంచి తరలిన నల్లధనమే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాకు ఒక్క హాంకాంగ్‌ నుంచే 73శాతం వస్తోంది. అది చైనా నుంచి తరలి వెళ్లిన నల్లధనం అనుకోవచ్చు లేదా హాంకాంగ్‌లో విదేశీయులు దాచుకున్నది కావచ్చు.

   ఇక నకిలీ నోట్ల విషయానికి వస్తే ఇది ప్రపంచవ్యాపిత సమస్య. అమెరికా డాలర్లనే పెద్ద ఎత్తున ముద్రిస్తున్నారు. అయినా డాలర్లను అమెరికా రద్దు చేయలేదు. మన దేశంలో చలామణిలో వున్న నోట్ల మొత్తం 16లక్షల కోట్లు. వాటిలో నకిలీ నోట్లు 400 కోట్లు. అంటే 0.03శాతం. అనేక దేశాలలో వాటి నివారణకు నిరంతరం చర్యలు తీసుకుంటూనే వుంటారు.అనుమానం వచ్చిన సిరీస్‌ నోట్ల వుపసంహరణ వాటిలో ఒకటి.మన దేశంలో కొద్ది నెలల క్రితం ఐదువందల నోట్లపై ముద్రించిన సంవత్సరం వుందా లేదా అని చూసుకోమని జనాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రెండువేలు, ఐదు వందల నోట్లకు సైతం నకిలీలను తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. వాటిపై నిరంతర నిఘాతప్ప ఇప్పుడు చేసిన మాదిరి చర్యలు కాదు.

    సోమవారం వారం నాటి నిరసన సమర్ధనీయమా, కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే నోట్ల రద్దు చేసిన నాడు వున్న మద్దతు తరువాత క్రమంగా తగ్గిపోయిందన్నది వాస్తవం. ఒక వైపు మోడీని సమర్ధిస్తూనే చేసిన పని బాగాలేదని విమర్శించేవారి సంఖ్య పెరిగింది. ప్రతిపక్షాల విమర్శలకంటే సామాన్యుల్లో వచ్చిన విమర్శనాత్మక స్పందనే బిజెపి వారిని భయపెడుతోంది. దాన్ని దాచుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అల్లుడికి బుద్ది చెప్పి మామ అంతకంటే పెద్ద తప్పు చేసినట్లు !

25 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP U TURN, Narendra Modi, Rupee, Rupee Fall, UPA

ఎం కోటేశ్వరరావు

‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించండి. గురువారం(24వ తేదీ) మోడీ తన ఘన చరిత్రలో ఒక రికార్డును బద్దలు చేశారు. 2013 ఆగస్టు 28న రూపాయి విలువ డాలరుకు రు.68.85కు పడిపోయి ఒక రికార్డు నమోదు చేసింది. నరేంద్రమోడీ సర్కార్‌ 2016 నవంబరు 24న దాని రు.68.86కు దిగజార్చి పాత రికార్డును బద్దలు చేసింది. మరి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారు ?http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html 2013 ఆగస్టు 19న, అప్పటికే రూపాయి విలువ పతన అవుతున్నది, దాని గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రి హోదాలో చేసిన విమర్శ అది.మరి ఇపుడేమంటారు ? ఈ నెలాఖరులో మనసులోని మాటలో అయినా ఏదైనా చెబుతారేమో చూద్దాం ! అంతకు ఒక నెల రోజుల ముందు రూపాయి విలువ రు.60.15కు పతనమైన సమయంలో లాయరూ, ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుండి, అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.http://www.firstpost.com/politics/bjp-blames-upas–gross-mismanagement-for-rupee-fall-946409.html ‘పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని చమత్కరించారు.

     ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది, యుపిఏ పాలనా విధానాలను మార్చి రూపాయి విలువను పెంచకుండా లేదా కనీసం పతనం చేయకుండా నిలువరించటంలో ఎవరు మోకాలడ్డారు ? ఎవరైనా సూటిగా సమాధానం చెప్పేవారున్నారా ?http://inr.fx-exchange.com/usd/2014_05_26-exchange-rates-history.html నరేంద్రమోడీ అధికారం స్వీకరించిన 2014 మే 26వ తేదీన డాలరుకు రూపాయి విలువ రు.58.73 వున్నట్లు పై ఆధారం తెలియ చేస్తున్నది. ఇప్పుడు మన ప్రధాని వయస్సు 66, రూపాయి విలువ ఇది రాస్తున్న సమయానికి రు.68.44 వుంది. ఇంతగా పతనం కావటానికి ఏ స్టెరాయిడ్స్‌ ఇచ్చారు ? యుపిఏ కంటే ఏ భిన్న విధానాలు అనుసరించిన కారణంగా ఈ పతనం సంభవించింది. త్వరలో 70 రూపాయలకు చేరనున్నదని విశ్లేషకులు ఎందుకు జోశ్యం చెబుతున్నట్లు ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాలోని మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్‌ 2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తరువాత ఇప్పుడే పట్టాలపైకి వస్తున్నదని మోడీ స్టీరింగ్‌ పట్టుకుంటే మరింత వేగం అందుకుంటుందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యాతలు చెప్పారు. బిజెపి పెద్ద పార్టీగా రావటం ఖాయమని, సంపూర్ణ మెజారిటీకి 40 స్థానాలు తగ్గితే మిత్ర పక్షాలపై ఆధార పడాల్సి వుంటుందని ఎన్నికల జోశ్యాలు పేర్కొన్నాయి. వాటిని అధిగమించి బిజెపి ఒక్కటే సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఆ సమయానికి 2013 ఆగస్టు 28తో పోల్చుకుంటే రూపాయి విలువ 13శాతం పెరిగింది.

    రూపాయి విలువ పెరుగుతున్నదని, అది డాలరుకు 40కి పెరిగితే 2008 ఏప్రిల్‌ నుంచి బలమైన స్ధాయికి చేరినట్లు అవుతుందని ఈ తరుణంలో డాలర్లను అమ్ముకోవటం మంచిదని ఎన్నికల వరకు ఆగితే ఆది ఆలస్యం కూడా కావచ్చని గిల్‌మౌర్‌ జోస్యం కూడిన సలహా ఇచ్చారు. అయితే అది ఎంత కాలంలో జరుగుతుందన్నది ఆయన చెప్పలేదని, బ్లూమ్‌బెర్గ్‌ జరిపిన సర్వే ప్రకారం 2014 డిసెంబరు నాటికి రు.61.21 అవుతుందని 2016 చివరికి 58.50లకు పెరుగుతుందని ఆ సంస్థ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఎందుకు జరుగుతోంది? కారణాలేమిటి ?

    నిత్యం బలమైన కరెన్సీ గురించి బోధనలు చేయటం తప్ప మోడీ-జైట్లీ ద్వయం బ్రిటీష్‌ వలసవాద ఆర్ధిక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, ఇంకా బలహీనమైన రూపాయి కొనసాగటం జాతి సిగ్గుపడాల్సిన అంశమని అంశుమన్‌ తివారీ అనే ఆర్ధిక వ్యవహారాల వ్యాఖ్యాత పేర్కొన్నారు.http://www.dailyo.in/business/rupee-narendra-modi-arun-jaitley-rbi-manmohan-singh-pv-narasimha-rao-dollar/story/1/6138.html ఒక దేశ కరెన్సీ జాతి గర్వించదగిన లేదా దగని అంశంగా వుండకూడదు, చేయకూడదని తెలిసినప్పటికీ బిజెపి 2013లో రూపాయి విలువ ఎదుర్కొన్న సంక్షోభాన్ని జాతి సిగ్గుపడే అంశంగా ప్రదర్శించిందని తివారీ పేర్కొన్నారు.

   ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అని 1991లో రూపాయి విలువను భారీగా తగ్గించిన సమయంలో ఆర్ధిక మంత్రిగా వున్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన తర్కాన్ని అంగీకరించాలంటారు తివారి. మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. నరేంద్రమోడీ సర్కార్‌ విధానం ఏమిటి ?

   1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా జైరాం రమేష్‌, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రంగరాజన్‌ వున్నారు.

    గతంతో అంటే 2013 రికార్డు పతనంతో పోల్చితే నాటికీ నేటికీ ఎంతో బేధం వుంది. అప్పుడు రూపాయి విలువ పతనం దేశ బలహీనతగా బిజెపి ప్రచారం ప్రారంభించింది. అ సమయంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే చమురు పీపా ధర 100 డాలర్లకు పైగా వుంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 40-50 డాలర్ల మధ్య వుంటోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా వివిధ కారణాలతో రికార్డు స్దాయిలో నవంబరు 11వ తేదీతో ముగిసిన వారంలో 368 బిలియన్‌ డాలర్లు వున్నాయి. అయినప్పటికీ 2013 నాటి మాదిరి రూపాయి విలువ పతనమౌతోంది. ఎందుకిలా జరుగుతోంది?

    రూపాయి పతనమైతే మనకు కలిగే లాభ నష్టాలు ఏమిటి ? మన దేశంలో చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసే సమయంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరల పెరుగుదల తగ్గుదల వుంటుందని ప్రభుత్వం జనానికి చెప్పింది. ఈ విధానం ప్రకారం పీపా వంద డాలర్లు వున్నప్పటి కంటే సగానికి సగం ధర తగ్గినందున మన దేశంలో పెట్రోలు ధర కూడా సగానికి తగ్గాలి. ఎందుకు తగ్గలేదో ఎప్పుడైనా మనం ఆలోచించామా? చమురుపై కేంద్ర సుంకాన్ని మోడీ సర్కార్‌ లీటరుకు పన్నెండు రూపాయల వరకు పెంచింది. దీనికి తోడు రూపాయి పతనంపై గుడ్లప్పగించి చూస్తుండటంతో దిగుమతి చేసుకొనే పెట్రోలు ధర పెరిగింది.

    మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.

     నాడు మన్మోహన్‌ సింగ్‌ కరెన్సీ విలువ తగ్గింపును సమర్ధించుకుంటూ ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అన్నారంటే దాని అర్ధం తక్కువగా వుంచాలనే కదా. అప్పటి నుంచి చూస్తే 1970 నుంచి 1989 వరకు వాణిజ్య లోటుతో వున్న చైనా ఆ తరువాత నుంచి నేటి వరకు తన మిగులును పెంచుకుంటూ పోతూనే వుంది.1990 నుంచి 8.74 బిలియన్‌ డాలర్ల మిగులుతో ప్రారంభమై 2014లో 382 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. మరి మనం ఎక్కడ వున్నాం ? మన వాణిజ్యలోటు పెరగటం తప్ప ఏ ఒక్క సంవత్సరంలోనూ మిగులు లేదు. మన రూపాయి విలువను తగ్గించుకున్నా మన వస్తువులను ఎగుమతి చేయలేని స్ధితి. అయినప్పటికీ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. అందునా ప్రపంచ ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యం వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.

   విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?

Image result for On Rupee Fall: modi u turn

    ఏతా వాతా తేలేదేమంటే మన కరెన్సీ విలువ పతనాన్ని అలాగే కొనసాగనిస్తే అది మనకు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా అసలే అంతంతమాత్రంగా మన జీవితాలను మరింత దిగజార్చుతుంది. మోడీ మహాశయుడి అచ్చే దినాలకోసం ఎదురు చూస్తున్న జనానికి ఆకస్మికంగా బ్యాంకుల ముందు పడిగాపులు పడే చచ్చే దినాలు దాపురించాయి. రాబోయే రోజుల్లో రెండు వేల నోట్లు మార్చుకోవటం ఒక సమస్యగా మారే అవకాశం వుంది. ఇప్పుడు రూపాయి మరింతగా పతనమైతే తట్టల్లో డబ్బులు తీసుకు వెళ్లి బుట్టల్లో సరకులు తెచ్చుకొనే రోజులు వస్తాయి. మన సరకులను విదేశాల వారు చౌకగా కొనుక్కుపోతారు. వారిలో పాకిస్తాను వారు కూడా వుంటారని కాషాయ దేశభక్తులు గ్రహించాలి.ఎంకి పెళ్లి సుబ్సిచావుకు వచ్చిందన్నట్లుగా నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చంద్రబాబుకు నోట్ల రద్దు ‘సంక్షోభ ‘ సెగ

24 Thursday Nov 2016

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Chandrbabu, Demonetisation

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలంటూ ముందుగానే ప్రధానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి ఆ చర్యతో తలెత్తిన సంక్షోభ సెగ తగిలింది.ఈనెల 20న సమాచార శాఖ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఇన్ని రోజులైనా నోట్ల రద్దుతో తలెత్తిన సమస్య పరిష్కారం కాకపోవటం పట్ల తనకే అసహనం కలుగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఒక సమస్య పరిష్కారం కాకపోవటం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటి సారని, తుపాన్ల తీవ్రత వలన తలెత్తిన నష్టాలను ఎనిమిది రోజుల్లోనే అధిగమించామని, గోదావరి పుష్కరాలలో మొదటి రోజు ఇబ్బంది వచ్చినా తరువాత 14 రోజులు సమర్ధవంతంగా నిర్వహించామని, అలాంటిది పన్నెండు రోజులైనా నోట్ల రద్దు సమస్య అపరిష్కృతంగా వుండటం బాధాకరమని, తనకే అసహనం కలుగుతోందని అలాంటిది ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్నారు. తన సహజ శైలిలో తన పరిధిలోని బ్యాంకర్లు ఎలా పనిచేయాలో కూడా చెప్పారనుకోండి.

    తాజాగా గురువారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్సు (24న) వుపన్యాసం గురించి సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటనలో ప్రతిరోజు తాను నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, ఎస్‌ఎల్‌బిసి, బ్యాంకర్లతో సమీక్ష జరుపుతున్నానని, దీనిని ఒక సంక్షోభంగా తీసుకుంటే అది అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గదని, సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందన్నారు. ప్రతి గ్రామం, వార్డుల్లోని కిరణాదుకాణాలలో కూడా పాస్‌ మిషన్‌ వుపయోగించి నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించాలని కోరారు. మొబైల్‌ కరెన్సీ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం ద్వారానే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని చంద్రబాబు వివరించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ – నీరో చక్రవర్తికి తేడా ఏమిటి ?

24 Thursday Nov 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Demonetisation, Demonetisation standoff, Narendra, Narendra and Nero, Nero, Rajyasabha

ఎంకెఆర్‌

    ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ మడమ తిప్పరు అని మన వెంకయ్య ప్రకటించి ఒక రోజు కూడా గడవక ముందే వెనక్కు తిరిగి గురువారం నాడు రాజ్యసభలో అడుగు పెట్టాల్సి వచ్చింది.మౌన మునిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చాలా కాలం తరువాత రాజ్యసభకు హాజరై నోట్ల రద్దుపై నోరు తెరిచారు. బయట హావభావ ప్రదర్శనలతో జనాన్ని ఆకట్టుకొనే న్రరేంద్రమోడీ కొద్ది సేపు రాజ్యసభలో కంటి చూపుతప్ప నోట మాటలేకుండా కూర్చున్నారు. రాజ్యసభలో కొద్దిసేపు ఇబ్బంది పడుతూ కూర్చున్నట్లు కనిపించిన ప్రధాని భోజన విరామం తరువాత హాజరు కాలేదు. దాంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిన శుక్రవారం నాటికి రాజ్యసభ వాయిదా పడింది.

    ప్రతి అంశాన్ని నరేంద్రమోడీ చుట్టూ తిప్పుతూ ఆయన ప్రతిష్టను పెంచేందుకు ఒక పధకం ప్రకారం ఆయన చుట్టూ వున్నవారు నిరంతరం ఆలోచిస్తున్నారు. అందుకు ఏ అవకాశం వస్తుందా అని చూసే మంత్రాంగపు యంత్రాంగానికి దూరదృష్టి, పర్యవసానాల గురించి ఆలోచన లేదా లేక సమస్య వచ్చినపుడు చూసుకుందాం లెమ్మని పప్పులో కాలేశారా ? పాకిస్ధాన్‌పై సర్జికల్‌ దాడులు జరిపింది సైన్యం అయినప్పటికీ వాటి ఖ్యాతి ప్రధానికి దక్కించేందుకు చేసిన ప్రయత్నం తెలిసిందే. గతంలో కూడా అలాంటి దాడులు జరిపినప్పటికీ వాటికి పని గట్టుకొని ప్రచారం కల్పించలేదు. చరిత్రలో తొలిసారిగా మన మిలిటరీ సర్జికల్‌ దాడులు జరిపినట్లు, దానికి ప్రధాని రాజకీయ నిర్ణయమే కారణమని అందువలన ఆ ఖ్యాతి ప్రధానికి దక్కాలని బిజెపి నేతలు వాదించారు. దాడుల వీడియోలు కూడా తీశామని సైనికాధికారుల చేత చెప్పించారు. అయితే వాటిని బయట పెట్టాలని కోరటం, అవి రహస్యం కనుక బయట పెట్టేది లేదని ప్రభుత్వం తప్పించుకుంది.

    పెద్ద కరెన్సీ నోట్లను చరిత్రలో అనేక దేశాలలో రద్దు చేశారు. ఎక్కడా ఇలా రచ్చయినట్లు ఒక్క వుదంతం కూడా కనిపించటం లేదు. ఇదేదో నల్లధనాన్ని వెలికి తీసే పెద్ద చర్య అని ఆ ఖ్యాతి నరేంద్రమోడీ ఖాతాలో వేయాలని అట్టహాసంగా ఆయన చేత రద్దు ప్రకటన చేయించారు. కీర్తి కండూతి గురించి మోడీ పడుతున్న తిప్పలుగా వాటిని అర్ధం చేసుకుందాం. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం చేసిన తరువాత దాని గురించి అధికారులు విలేకర్ల సమావేశాలలో వివరణ ఇవ్వటం ఒక ఆనవాయితీ. ఎందుకంటే బడ్జెట్‌ రూపకల్పన చేసేది వారే గనుక. నోట్ల రద్దు నిర్ణయం రిజర్వుబ్యాంకు ప్రమేయం లేకుండా జరగదు కదా ! ప్రధాని ప్రకటన చేసిన కొత్త నోట్ల మార్పిడి సమస్యల గురించి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ పటేల్‌ ఇంతవరకు ఎందుకు నోరు విప్పలేదు. ప్రకటన చేసి రాజకీయ ఖ్యాతి పొందేందుకు మాత్రం సిద్దం సుమతీ అన్నట్లు నరేంద్రమోడీ తయారా ? తలెత్తిన సమస్యల గురించి వివరణ ఇవ్వటానికి మాత్రం నోరు విప్పరా? పోనీ మీడియా ముందుకు రావటానికి బిడియమైతే పార్లమెంట్‌ చర్చలో పాల్గొని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టి దేశ ప్రజలకు భరోసా ఇవ్వటానికి కూడా ముందుకు రారా ? ఇదెక్కడి చోద్యం. ఇబ్బందులు పడుతున్న వారంతా తమకు ఓటేయని వారని లేక నల్లధనం వున్నవారని భావిస్తున్నారా ?

   చరిత్రలో రోమ్‌ నగరం తగులబడుతుంటే చక్రవర్తి నీరో ఫిడేల్‌ వాయించుకుంటూ కాలక్షేపం చేశారని, జనం నరకయాతన అనుభవించారని చదువుకున్నాం. ఇప్పటికి 60 మంది వరకు నోట్ల మార్పిడి, నగదు తీసుకొనే సందర్భంగా మరణించినట్లు వార్తలు. రోజూ లక్షల మంది ఆఫీసులు, ఫ్యాక్టరీలకు సెలవులు పెట్టి బ్యాంకులు, ఏటిఎంల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం. వివాహాలు చేసుకొనే వారికి ఆ ఆనందమే లేకుండా పోతోంది. ఎందుకు పెట్టుకున్నామురా ముహూర్తాలు అని నిట్టూర్చుతున్నారు. రోగులు చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు ? ఆరునెలలని కొందరు, ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతుందని మరికొందరు, వున్న పాత నోట్లను మార్చుకోవటం ఒక సమస్య అయితే ఇస్తున్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవటం ఎలా అన్నది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో రిజర్వుబ్యాంకు అధిపతి చెప్పరు. యాభై రోజులు ఓపిక పట్టమని, పరిష్కారం అవుతుందని ప్రధాని పార్టీ సమావేశాలు, ప్రయివేటుగా చెప్పటం తప్ప బహిరంగంగా నోరు పిప్పరు. చివరకు వారాల తరబడి పార్లమెంట్‌కూ రారు. మరి ఏం చేస్తున్నట్లు ? పార్లమెంట్‌లో సమాధానం చెప్పటం అప్రతిష్టగా భావిస్తున్నారా ? పోనీ అదైనా ఏ వెంకయ్య నాయుడో మరొకరి చేతో చెప్పించండి,జనం అర్ధం చేసుకుంటారు.

   ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కచోటైనా ఒక్కరంటే ఒక్కరు కరెన్సీ మార్పిడికి వచ్చి ఇలాంటి దిక్కుమాలిన చావుకు గురయ్యారా ? వుంటే బిజెపి సామాజిక మీడియా సైనికులు బయటపెట్టగలరా ? లేక అది కూడా రహస్యం అంటారా ? కార్మికులు ఒక రోజు సమ్మె, లేదా హర్తాళ్‌కు పిలుపు ఇస్తే రోజు ఎంత నష్టమో లెక్కలు వేసి రోజంతా బ్రేకింగ్‌ న్యూస్‌ పేరుతో సంచలనంగా ప్రకటించే మీడియాకు నవంబరు తొమ్మిది నుంచి పని పాటలు మాని వరుసలలో నిలబడుతున్న జనం కనిపించటం లేదా ? వారంత పని పాటలు లేనివారిగా కనిపిస్తున్నారా ? ఏడాది ఆఖరులో సెలవులు వుండవు, పెట్టాల్సి వస్తే జీతం నష్టం తప్ప మరొక మార్గం లేదు. నోట్ల రద్దు వలన వచ్చే లాభం ఏమిటో చెప్పరు. కనీసం క్యూల్లో నిలబడే జనానికి వచ్చే జీతం నష్టం గురించి మీడియా ఎందుకు మౌనం వహిస్తోంది?

     నోట్ల రద్దు కారణాలను రోజూ ఒకటే చెబితే జనానికి బోరు కొడుతుందనేమో రోజుకో కొత్త అంశాన్ని చేరుస్తున్నారు. దాన్నొక రాజకీయ క్రీడగా మార్చివేశారు. పార్లమెంట్‌లో పంతాలకు పోవటం, అధికార పార్టీ సభ్యులే రాజ్యసభలో పోడియం ముందుకు వచ్చి కేకలు వేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? నక్సలైట్లను దెబ్బతీయటానికి నోట్ల రద్దు అన్నది ఒక ప్రచారం. ఇంత విశాల భారతంలో వారెంత మంది, ఎన్ని ప్రాంతాలకు విస్తరించారు? టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌, ఈశాన్య భారతంలో తప్ప ఆ సమస్య వున్న రాష్ట్రాలెన్ని ? ప్రపంచంలో అనేక చోట్ల మన కంటే వామపక్ష తీవ్రవాదులు, లాటిన్‌ అమెరికా వంటి చోట్ల వామపక్ష తిరుగుబాటు వుద్యమాలు, ఇతర చోట్ల ఐఎస్‌, తాలిబాన్‌ తీవ్రవాదుల సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న దేశాలు వున్నాయి. ఇరాక్‌, సిరియా, లిబియా వంటి చోట్ల విస్తారమైన ప్రాంతాలే వారి చేతుల్లో వున్నాయి. మన పక్కనే వున్న శ్రీలంకలో దశాబ్దాల తరబడి తమిళతీవ్రవాదులు కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలో వుంచుకున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో టర్కీతో సహా అనేక దేశాలలో కుర్దు తిరుగుబాటుదారుల సమస్య వుంది. వారిని ఎదుర్కొనేందుకు ఆ దేశాలేవీ తమ కరెన్సీ నోట్లను రద్దు చేయలేదు, వారి సమస్యను నోట్ల రద్దుతో పరిష్కరించలేదు.

    పొరుగు దేశం పాకిస్ధాన్‌ నకిలీ నోట్లను ముద్రించి మన దేశంలోకి పంపుతున్నదని చెబుతున్నారు. ఇదేమీ కొత్త సమస్య కాదు. మన దేశంలో కోయంబత్తూరు నోట్ల పేరుతో దొంగనోట్ల ముద్రణ చెలా మణి ఎప్పటి నుంచో వుంది. ఒక అంచనా ప్రకారం ప్రతి పదిలక్షల కరెన్సీ నోట్లలో 250 నకిలీవి వుండగా వాటిలో పట్టుకుంటున్నది పదహారింటినే అని కేంద్ర ప్రభుత్వ సమాచారమే వెల్లడిస్తున్నది. దేశంలో 2015-16లో 90.26 వందల కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో వుంటే వాటిలో పట్టుకున్న దొంగ నోట్ల సంఖ్య 0.63 మిలియన్లు మాత్రమే అంటే మొత్తం నోట్లలో 0.0007 శాతమే. అందువలన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి పోయిన ఈరోజుల్లో కొత్త నోట్లకు నకిలీవి తయారు చేయటం అసాధ్యమా ?

   పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయటానికి నరేంద్రమోడీకి స్ఫూర్తి నిచ్చింది పూనా నగరానికి చెందిన ‘అర్ధక్రాంతి ప్రతిష్టాన్‌ ‘ సంస్ధను నిర్వహిస్తున్న అనిల్‌ బొకిల్‌ అని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడా పెద్దమనిషి నేను చెప్పిందొకటి నరేంద్రమోడీ చేసిందొకటి, ఆయన మంచి వాడే కానీ చేసిందాని వలన నల్లధనం బయటకు రాదని మొత్తుకుంటున్నాడు. http://economictimes.indiatimes.com/news/economy/policy/banning-notes-will-not-curb-black-money-says-thinktank-that-called-for-demonetisation/articleshow/55550552.cms మరి ఎవరి సలహాతో ఈ పని చేసినట్లు ? ఒకవేళ పొరపాటు చేస్తే దేశ ప్రజల ముందుకు ఒప్పుకోవటానికి ఇబ్బంది ఏమిటి ? ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా వ్యతిరేక ‘దేశభక్తులూ ‘ దీని కేమంటారు ?

23 Wednesday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, China, china boycott, RSS Outfits anti china, RSS Outfits anti china feets

సత్య

    డబ్లు నల్లదీ తెల్లదీ వుంటుందా ? వుండదు. పన్ను కట్టకుండా తప్పించుకొనేందుకు లెక్కలలో చూపనిదానిని నల్లధనం అంటున్నాం. అలాగే కమ్యూనిస్టు చిచ్చుబుడ్లు, కానివారి చిచ్చుబుడ్లు వుంటాయా ? వుండవు. మొన్న దీపావళి సందర్భంగా చైనా బాణ సంచా కాల్చటం దేశద్రోహ చర్యగానూ, కాల్చకపోవటం దేశభక్తిగానూ అన్ని రకాల మీడియాలో రాతలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాలన్నీ జై భజరంగ భళీ అంటూ వీధుల కెక్కి చైనా వస్తువులను దగ్దం చేయటం, వాటిని నిషేధించాలంటూ వీరంగం వేయటాన్ని చూశాము. అలా చేయటమే దేశభక్తిగా ప్రచారం చేశారు. అనేక మంది నిజమే అనుకొని వాట్సప్‌ గ్రూపులలో అలాంటి సందేశాలు పెట్టారు. తెల్లవారే సరికి చైనా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసి దేశభక్తిని చాటుకోవాలని వుపదేశాలు చేశారు. ఇదంతా మన దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న తీవ్రవాదులకు పాకిస్థాన్‌ మద్దతు ఇస్తున్నదని, దానికి చైనా మద్దతు ఇస్తున్న కారణంగా చైనాను వ్యతిరేకించాలనే వాదనలను ముందుకు తెచ్చారు. ఇంకా కొందరైతే చైనాను నాశనం చేసేందుకు గాను మన పురాణాలు, సంస్కృత గ్రంధాలు, వేదాలలో గట్టి శాపాలు ఏమైనా వున్నాయోమో వెతికితీసేందుకు కూడా ప్రయత్నించారంటే అతిశయోక్తికాదు. ‘దేశభక్తి ‘ అంతగా పెరిగిపోయింది మరి !

   ఎంత వారలైనా కాంత దాసులే అని చెప్పారు. దాని సంగతి ఏమోగాని ఈ రోజుల్లో డాలర్ల ముందు మోకరిల్లేందుకు ఎంతకైనా తెగించేవారు వున్నారు. అమెరికా అంతటి కమ్యూనిస్టు వ్యతిరేకే తాను కట్టుకున్న మడిని విప్పి గట్టున పెట్టి చైనా వెంటపడింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున వుంటుందా ? చైనా వ్యతిరేకతను విపరీతంగా రెచ్చగొట్టిన సంఘపరివార్‌ నాయకత్వం కూడా ఇప్పుడు అదే చేస్తున్నది. అమెరికా ఒక వైపున కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే మరోవైపున చైనా, వియత్నాం, క్యూబా వంటి కమ్యూనిస్టు దేశాలతో సంబంధాలను పెంపొందించుకుంది. ఇప్పుడు మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అదే గేమ్‌ ఆడుతోంది.

    మన పురాణాలలో ‘సరసింహుడు’ వున్నట్లే చైనా పురాణాలలో రెక్కలున్న భయంకర సర్పం వుంది.దాన్ని ‘డ్రాగన్‌ ‘ అంటున్నారు. అది మనలను కబళించి వేస్తున్నదని చెప్పిన వారికి ఇప్పుడు దేవతగా మారిపోయిందట.http://retail.economictimes.indiatimes.com/news/industry/boycott-china-dragon-now-angel-for-indian-startups/55522378 నిక్కర్‌ నుంచి పాంట్స్‌కు మారినంత సులభంగా, ఇది కూడా వేదాల్లో వుంది, దీన్ని కూడా వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అన్నట్లుగా కాషాయ తాలిబాన్లు సమర్ధిస్తున్నారు. ఎందుకంటే వ్యతిరేకించినట్లు , నరేంద్రమోడీ దిష్టి బొమ్మలు తగుల బెట్టినట్లుగానీ ఎక్కడా వార్తలేమీ కనిపించటం లేదు. కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా జాడ లేదు.ఎంత అవకాశవాదం !

    నేడు ఎవరి దగ్గర డాలరు వుంటే వారి హవా నడుస్తోంది. చివరకు అమెరికా వాడు కూడా తనకు డాలర్లు కావాలంటే చైనా దగ్గర అప్పుతీసుకొనే దుస్ధితిలో పడిపోయాడు. చైనా కంపెనీలు ఇప్పుడు డాలర్లను పట్టుకొని ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులకు అవకాశం వుంటే అక్కడకు వెళుతున్నాయి. వాటిలో ప్రయివేటువి, ప్రభుత్వ రంగానికి చెందినవీ వున్నాయి. ఎందుకంటే 2050 వరకు ఒకే దేశం రెండు వ్యవస్ధలు అన్న విధానానికి అనుగుణంగా చైనా ప్రధాన భూభాగంలో ప్రయివేటు పెట్టుబడులు పెట్టటానికి, హాంకాంగ్‌, మకావూ ప్రాంతాలు విలీన సమయానికి అక్కడ వున్న ప్రయివేటు పెట్టుబడులు కొనసాగటానికి అనుమతించేందుకు విధానపరంగానే నిర్ణయించింది. పెట్టుబడి ప్రధాన లక్షణం లాభం. అది ఎక్కడ వుంటే అక్కడకు ప్రవహిస్తుంది. అది కమ్యూనిస్టు దేశమా, వ్యతిరేక దేశమా, బిజెపి ఏలుబడిలో వుందా, కాంగ్రెస్‌ పాలనా అన్నదానితో నిమిత్తం లేదు. ఎకనమిక్‌ టైమ్స్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం దివ్యాంక్‌ తురాఖియా ఏర్పాటు చేసిన మీడియా.నెట్‌ అనే మన దేశ కంపెనీని 90 కోట్ల డాలర్లకు బీజింగ్‌ మిటెనో కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ కంపెనీ కొనుగోలు చేసింది. అలీబాబా కంపెనీ పేటిమ్‌, స్నాప్‌డీల్‌ కంపెనీలలో భారీ పెట్టుబడులు పెట్టింది. దిదీ చుక్సింగ్‌ అనే కంపెనీ ఓలా టాక్సీ కంపెనీలో భాగస్వామిగా చేరింది. ఇలా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, భాగస్వాములుగా వుండేందుకు ముందుకు వస్తున్నాయి. దీని వలన లాభమా నష్టమా అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ భక్తులు సమాధానం చెప్పాలి. ముందే చెప్పుకున్నట్లు చైనా అయినా మరొక దేశ కంపెనీ పెట్టుబడులు పెట్టినా లాభాలు ఎవరికి చెందుతాయన్నదే గీటు రాయిగా వుండాలి. చైనాలో విదేశీ పెట్టుబడులు, లేదా ప్రయివేటు రంగంపై అక్కడి ప్రభుత్వానికి పూర్తి పట్టువుంది. వాటి వలన వస్తున్న లాభాలలో గణనీయ వాటా అక్కడి జనానికి చేరుతున్నది. మన దేశంలో చైనా ప్రభుత్వ రంగ సంస్ధలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. వాటి మీద వచ్చే లాభాలు చైనా ప్రజలకు చేరతాయి.మన దేశంలో అటువంటి విధానాలు, పరిస్ధితి వుందా ? పెట్టుబడిదారీ విధానాలు అనుసరిస్తున్నంత కాలం సంస్కరణలతో వచ్చే లాభాలు పెట్టుబడిదారులకు తప్ప సామాన్యులకు కాదని గత పాతికేండ్ల మన దేశం అనుభవం రుజువు చేసింది. చైనాలో పరిస్ధితి అందుకు భిన్నంగా వుంది.

     చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని వున్నాయి. మనకు చైనా వ్యతిరేకమైతే అక్కడి కంపెనీలు మన దేశంలో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయి ? చంద్రబాబు నాయుడు వంటి వారు చైనా వెళ్లి బుల్లెట్‌ రైలు ఎక్కి మన దేశంలో కూడా అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టమని ఎందుకు కోరుతున్నారు ? మన దేశానికి చైనా వ్యతిరేకమైతే ప్రధాని నరేంద్రమోడీ ఆ విషయాన్ని ఎందుకు బహిరంగంగా దేశ పౌరులకు తెలియచెప్పటం లేదు? చైనా నుంచి దిగుమతులు మాత్రమే నష్టదాయకమని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోందా ? అన్ని దేశాల దిగుమతులు నష్టం అని చెబుతోందా ? ఏటేటా చైనా నుంచి దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి ? దిగుమతి చేసుకొనే వారందరూ దేశ ద్రోహులేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్న పెదరావూరు ఖాతాలు !

19 Saturday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Bad loans, defaulters, Modi, RBI, Reserve Bank of India, vijay mallya, wilful defaulters, write off

అరే నేనేమిటో మీరు చూసింది చాల తక్కువే

ఎం కోటేశ్వరరావు

     పేరులో ఏమున్నది పెన్నిధి అని చులకనగా మాట్లాడారు గానీ పేరులోనే వుంది పెన్నిధి. ఇప్పుడు కుంభకోణాన్ని ఆ పేరుతో పిలవకూడదు. మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు, కుంభకోణం అంటే కుంభకోణం కాదు, నరేంద్రమోడీ అని కొత్త అర్ధాలు రాసుకోవాల్సిన రోజులు వచ్చాయంటున్నారు. కాంగ్రెస్‌ పాలకులు అనేక కుంభకోణాలకు తెరతీశారు. వాటిని దేశమంతా చూసింది. అదే బాటలో బిజెపి పాలకులు నడిస్తే కిక్కేముంటుంది? అంతకంటే పెద్ద కుంభకోణాలకు వారు తెరతీశారు. వాటినింకా జనం చూడలేదు. అంతే తేడా ! కాంగ్రెస్‌ రుణాలిచ్చి విజయమాల్య వంటి వారిని పెద్దలుగా మారిస్తే జనానికి కిక్కు ఎక్కించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ విజయ మాల్యను మర్యాదగా దేశం దాటించటానికి తన తెలివి తేటలను వుపయోగించింది. అలాంటి వారు దేశం విడిచి పోతుంటే ఎక్కడకు పోతున్నారో తెలుసుకోవాలి తప్ప పోవటాన్ని అడ్డగించకూడదన్న మార్గదర్శకాల కారణంగా నిఘాసిబ్బంది అదే పని చేశారు. కాంగ్రెస్‌ పాలకులు రుణాలు ఇస్తే బిజెపి పాలకులు గత రెండున్నర సంవత్సరాలుగా వాటిని ఎడా పెడా రద్దు చేస్తున్నారు. మాల్య వంటి 63 మంది పెద్దలు తమ బ్యాంకులకు ఎగవేసిన మొత్తాలలో తాజా విడతగా 7016 కోట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) రద్దు చేసింది. ఇది గత 23 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇప్పుడు పెద్ద రగడ కావటంతో ఇక్కడే పేచీ వచ్చింది. దాన్ని రద్దు అన కూడదు, లెక్కలలో సర్దుబాటు అనాలని,ఆ మొత్తాలను వసూలు చేస్తారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ సెలవిచ్చారు.ఆంగ్లంలో రైట్‌ ఆఫ్‌ అన్న పదానికి అర్ధం ‘బే వుమ్మేజు, రానిబాకీగా లెక్కలలో తీసివేయుట ‘ అని దిగవల్లి వెంకటశివరావు 1934లో, ‘రద్దు చేయు, తీసివేయు ‘ అని బూదరాజు రాధాకృష్ణ 2008లో అర్ధం చెప్పారు.

     ఈ పేరు, అర్ధం వివాదం రేగగానే మా ప్రాంత పెద రావూరు ఖాతాల వ్యవహారం గుర్తుకు వచ్చింది. నా చిన్నతనంలో మా వూర్లో ఒక వృద్ధుడు నాకు ఫలానా వారి కుటుంబం నుంచి ఇంత బాకీ రావాలి, అంతరావాలి అని కనిపించిన వారందరికీ పెద్ద మొత్తంలో లెక్కలు చెబుతుండే వాడు. అది నిజమేనా అని అడిగితే నిజమే అవన్నీ పెద రావూరు ఖాతాలో వున్నాయి అని పెద్దల నుంచి సమాధానం వచ్చింది. అర్ధం అయ్యేట్లు చెప్పమంటే అవి వచ్చేవి కాదు, పెట్టేవి కాదు, ఆ ముసలోడు అలాగే చెబుతూనే వుంటాడు అన్నారు. ఇప్పుడు జెట్లీ చెబుతున్నది కూడా పెదరావూరు ఖాతాల గురించే మరి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్ధితి నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎస్‌బిఐ రుణాల రద్దు వార్త కూడా తోడైంది. అయితే సామాన్యులకు తప్ప కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. తమదంతా ‘పారదర్శపాలన’ అని చెప్పుకుంటారు గనుక దానికి అనుగుణంగా ‘మూసి’పెట్టారు. ప్రభుత్వం ఇబ్బందులలో పడింది అనగానే ఎస్‌బిఐ దానికి ఒక చిట్కాను కనిపెట్టింది. ఆ ఏడువేల కోట్ల రూపాయల మొత్తాన్ని రైటాఫ్‌ (రద్దు) చేయలేదు, మేము అసలు ఆ పదాన్ని వుపసంహరించుకుంటున్నాము. ఆ మొత్తాన్ని ‘వసూలులో వున్న ఖాతా'(ఎయుసి-ఎకౌంట్‌ అండర్‌ కలెక్షన్‌) సొమ్ము అని పిలుస్తున్నాము అంటూ ఒక వివరణ ఇచ్చింది. సామాన్య రైతులు పంటలు పోయి తీసుకున్న రుణం చెల్లించకపోతే వూరంతా టాంటాం వేయిస్తారు.ఇంట్లో సామాను బయటకు వేసి అవమానాలు పాలు చేస్తారు. ఇండ్ల కోసం రుణాలు తీసుకున్నవారు కిస్తీలు చెల్లించకపోతే వారి పేర్లజాబితాను పత్రికలలో ప్రకటించి ఆస్ధులను వేలానికి పెడతారు. బ్యాంకులు వారి మొత్తాలను కూడా ఎయుసి ఖాతాలలో వేసి శక్తి వచ్చినపుడు ఎందుకు వసూలు చేసుకోవు ? బడాబాబుల పేర్లు పత్రికలలో ప్రకటించి ఆస్ధులను ఎందుకు వేలం వేయటం లేదు ?

    సాంకేతికంగా రైట్‌ ఆఫ్‌ అంటే రద్దు కాదన్నది వాస్తవమే. అయితే ఆచరణలో జరుగుతున్నదేమిటో ఆరుణ్‌ జెట్లీ వంటి పెద్దలు, లేదా బ్యాంకర్లు చెప్పటం లేదు. మాల్య వంటి పెద్ద మనుషులకు వేల కోట్ల రూపాయలను అప్పులు, అడ్వాన్సులుగా ఇవ్వటం వారు వాటిని తప్పుడు మార్గాలలో దారి మళ్లించి దాచుకోవటం, తరువాత చెల్లించటంలో విఫలమయ్యారనే పేరుతో కొంత కాలం గడిచిన తరువాత నిరర్ధక ఆస్థుల జాబితాలో ఎక్కించటం, తరువాత రాని బాకీల ఖాతాలో రాయటం, ఆ మేరకు జనం సొమ్మును బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరితేరింది. అది వారి హయాంలో పిల్లకాలువగా వుండేది. దానిని నరేంద్రమోడీ సర్కార్‌ దానిని ఓడలు ప్రయాణించే పనామా, సూయజ్‌ కాలువల సైజుకు పెంచింది. నరేంద్రమోడీ అనుయాయులైన సరికొత్త దేశభక్తులకు ఇలా అన్నందుకు ఆగ్రహం కలగవచ్చు.http://www.slideshare.net/deepakshenoy/kc-chakrabarty-on-npas-in-india ఇది రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన కెసి చక్రవర్తి తయారు చేసి 2013లో ఒక సమావేశంలో సమర్పించిన పత్రం. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం 2001 మార్చినెలతో అంతమైన ఆర్ధిక సంవత్సరం నుంచి 2013 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రయివేటు, విదేశీ అన్ని బ్యాంకులు రైట్‌ ఆఫ్‌ (రద్దు ) చేసిన మొత్తం అక్షరాలా ఒక లక్షా 98వేల అరవయ్యారు( 1,98,066) కోట్ల రూపాయలు. ఇదే కాలంలో వసూలు చేసిన మొత్తం కేవలం 37,955 కోట్లు మాత్రమే. దీనికి తనది బాధ్యత ఎలా అవుతుంది అని నరేంద్రమోడీ అమాయకంగా హావభావాన్ని ప్రదర్శించవచ్చు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత గత రికార్డులను తిరగరాస్తూ భారీ మొత్తాలలో పెద్దల బకాయిలను రైటాఫ్‌ లేదా రద్దు చేసి అతి పెద్ద భారీ కుంభకోణానికి తెరతీశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిని తిప్పికొట్టాలంటే తాను అధికారాన్ని స్వీకరించిన తరువాత అన్ని బ్యాంకులు ఎంత మొత్తాన్ని రైటాఫ్‌ చేశాయి, పాత బకాయిలను ఎంత మొత్తం వసూలు చేశాయి అన్న విషయాలను ప్రకటిస్తే చాలు. మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడకూడదని నరేంద్రమోడీ ఒక వ్రతాన్ని పాటిస్తున్నందున ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ అయినా ఆపని చేయాలి. ఎందుకో గానీ ఇంతవరకు వివరాలు చెప్పకుండా అభిమానుల్లో కూడా అనుమానాలకు తెరలేపుతున్నారు.

     ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం 2013,14,15 ఆర్ధిక సంవత్సరాలలో 29 ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం లక్షా 14వేల కోట్ల రూపాయలు. రిజర్వుబ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2012 మార్చి ఆఖరుకు పారు బాకీలు రు.15,551 కోట్లు కాగా 2015 మార్చినాటికి రు.52,542 కోట్లకు పెరిగాయి. వంద కోట్లు అంతకంటే ఎక్కువ ఎగవేసిన వారి వివరాలు తమ వద్ద లేవని ఆర్‌బిఐ తెలిపింది.2004-15మధ్య రు.2.11లక్షల కోట్లను రద్దు చేయగా వాటిలో లక్షా 14వేల 182 కోట్లు 2013-15 మధ్య చేసినవే వున్నాయి. తొమ్మిది సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని పనిని మూడు సంవత్సరాలలో మోడీ చేశారన్నమాట. ఎంత అభివృద్ధి ? అందుకే పెద్ద కరెన్సీ నోట్ల రద్దును బడా పారిశ్రామికవేత్తలంతా ఆకాశానికి ఎత్తుతున్నారా ? కాంగ్రెస్‌ హయాంలో ఏటా నాలుగు శాతం చొప్పున పెరిగితే 2014,15 సంవత్సరాలలో దేశంలో రెండవ పెద్ద బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రద్దు చేసిన బాకీలు 2013-14 మధ్య 98శాతం అయితే మరుసటి ఏడాది 238శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం ఏటా 50వేల కోట్లకు పైగానే బకాయిలు పెదరావూరు ఖాతాలోకి పోతున్నాయి.

    ఇలా రద్దు చేయటం అంతా వుత్తిదే, అంకెల గారడీ, బ్యాంకులు చెల్లించాల్సిన ఆదాయపన్ను తగ్గించేందుకు, ఆర్‌బిఐ నిబంధనలను పాటించేందుకు చేసిన లెక్కల సర్దుబాటు తప్ప మరేమీ కాదు, బ్యాంకుల ప్రధాన కార్యాలయాల స్ధాయిలో పారు బాకీలను రద్దు చేసినట్లు చూపినా దిగువ శాఖలలోని పుస్తకాలలో అలాగే వుంటాయని కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు, పెద్దదైన ఎస్‌బిఐ చెప్పాయి. బకాయిల వసూలు సంగతి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అనేక బ్యాంకుల పారు బాకీల వసూలు శాతాలు పడిపోతున్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వుదాహరణకు ఎస్‌బిఐ 2012-13లో 19.06శాతం వసూలు చేస్తే 2014-15 నాటికి 10.88శాతానికి పడిపోయినట్లు దాని లెక్కలే వెల్లడించాయి.ఐసిఐసిఐ బ్యాంకులో 26.74 నుంచి 15.96శాతానికి పడిపోయాయి. కెసి చక్రవర్తి తన పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం రద్దు చేసిన రుణాలలో కేవలం పదిశాతం లోపుగానే వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల విలువను తక్కువగా చూపి అయినకాడికి తెగనమ్మే ప్రభుత్వం పారుబాకీల వసూలు విషయంలో మాత్రం తక్కువ ధరలకు ఆస్థులను విక్రయించటానికి నిబంధనలు ఒప్పుకోవు అని చెబుతోంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎంత వసూలు చేశారనేది బ్యాంకులో, ప్రభుత్వమో వెల్లడిస్తే తప్ప వివరాలు లేవు. నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన మొత్తాలు నరేంద్రమోడీ విజయాలకు సూచికగా కొండల్లా పెరిగిపోతున్నాయి. గతేడాది అంతకు ముందున్న రు.3,24,300 కోట్ల నుంచి 2016 మార్చినాటికి రు.4,26,400 కోట్లకు పెరుగుతాయని అంచనా వేశారు. లెక్కల ఆల్జీబ్రాలో సర్దుబాటు, పునర్వ్యస్తీకరించిన మొత్తాలను కూడా కలుపుకుంటే పారు బాకీల మొత్తం రు.9,28,000 కోట్లని చెబుతున్నారు. వుద్ధేశ్యపూర్వకంగా ఎగవేసిన కార్పొరేట్ల రుణాల రద్దు ఈ శతాబ్దంలోనే ఇప్పటికి పెద్ద కుంభకోణంగా వర్ణిస్తున్నారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు డాక్టర్‌ కెసి చక్రవర్తికి రుణాల రద్దు గురించి బాగా తెలుసు. ఆయన చెప్పిన ప్రకారం ఒక కంపెనీ కేవలం ఎనిమిదివేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు మాత్రమే కలిగి వుండి 20వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుందనుకుంటే ఒక వేళ బ్యాంకులు రద్దు చేయాల్సి వస్తే పన్నెండువేల కోట్ల రూపాయలకు మాత్రమే అనుమతించాలి.కానీ పుస్తకాలలో వున్న గడువు మీరిన బకాయిలు మొత్తాన్ని రద్దుచేస్తున్నారు. సాంకేతిక కారణాలతో రద్దు చేయటానికి ఎలాంటి నియమనిబంధనలు, పద్దతులు లేవు, అందువలనే అదొక పెద్ద కుంభకోణంగా పరిగణించాలి. ఇది సరళీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత 1993 నుంచి అనుసరిస్తున్నారు. రుణాలే కాదు, అడ్వాన్సులను కూడా రద్దు చేస్తున్నారు. మీరు ఒక చార్టడె ఎకౌంటెంట్‌ను సలహాదారుగా పెట్టుకొని అడ్వాన్సులను టెక్నికల్‌గా రద్దు చేయటానికి అవసమైన విధి విధానాలను రూపొందించుకోవచ్చని బ్యాంకులకు రిజర్వుబ్యాంకే స్వయంగా చెప్పటం విశేషం. గత పదిహేను సంవత్సరాలలో సాంకేతిక కారణాలతో చేసిన రద్దుల మొత్తం మూడున్నరలక్షల కోట్ల రూపాయలు, దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని, ఈ మొత్తాలకు వడ్డీని కూడా కలిపితే రద్దు చేసిన మొత్తాలు నాలుగు రెట్లు వుంటాయని చక్రవర్తి చెప్పారు. ఎగవేసిన పెద్దల పేర్లు బయట పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ పని చేయకుండా తప్పించుకుంటున్నారు.వారి నుంచి బాకీలు వసూలు చేయకపోవటం ఒకటైటే 2018 నాటికి బాసెల్‌-3 నిబంధనల ప్రకారం బ్యాంకులకు ప్రభుత్వం మరో 2.4లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులు సమకూర్చాల్సి వుంటుందని చెబుతున్నారు. అంటే ఇది కూడా ప్రజల సొమ్మే.దీన్ని ఎలా సమకూర్చుతారనేది చూడాల్సి వుంది. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ అధికారంలో వుండగా ప్రతిపక్ష బిజెపి నేత యశ్వంతసిన్హా ఆర్ధికశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా వున్నారు. రుణాల రద్దును సమీక్షించేందుకు ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని రిజర్వుబ్యాంకును ఆ కమిటీ కోరింది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నర్‌గా వున్న రఘురాం రాజన్‌ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూడటానికి, దాడి చేయటానికే తన సమయాన్ని వెచ్చించింది తప్ప ఆ కమిటి ఏమైందో తెలియదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మొన్న పప్పు షాక్‌ ! నిన్న వుప్పు షాక్‌ !! మరి రేపు ?

17 Thursday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, rumors, salt shortage, salt shortage rumors

ఎంకెఆర్‌

    దేశంలో వుప్పు కొరత ఏర్పడిందనే పుకారుతో కొద్ది రోజుల క్రితం కిలో ఏడు వందల రూపాయల వరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంత మంది అతిశయోక్తి అని కొట్టివేసినా మూడు వందల రూపాయల వరకు ధరలను పెంచినట్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వార్తలు వెల్లడించాయి. కొంత మంది ఏడాది, రెండు సంవత్సరాలకు సరిపడే పరిమాణంలో వుప్పు బస్తాలను మోసుకుపోవటాన్ని కూడా చూశాము. ఏడున్నరవేల కిలోమీటర్ల పొడవు సముద్రతీరం వున్న దేశంలో వుప్పు కొరత ఏమిటనే ప్రాధమిక ఆలోచన కూడా రాకుండా జనం ఎగబడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?

   ప్రధాని నరేంద్రమోడీ ‘ఎంతకైనా సమర్ధుడే ‘ అనే గట్టి విశ్వాసం జనంలో వుండటం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. గుజరాత్‌లో గోద్రా రైలు వుదంతం దరిమిలా మైనారిటీలపై మారణ కాండ దగ్గర నుంచి తాజా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వరకు అనేక అంశాలు మోడీ ‘ఖ్యాతిని’ అంతర్జాతీయస్ధాయికి తీసుకుపోయాయి. ప్రతిపక్షాలు ఏమని వర్ణించినా, వ్యాఖ్యానించినా చాలా మంది జనంలో ‘ఎంతకైనా సమర్ధుడే ‘ అనే అభిప్రాయం వుంది. ఆయనపై ఈగను కూడా వాలనివ్వకుండా కాపుకాసే ఆయన భక్తులు పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని బయటకు తీశామన్న సంబరాలలో మునిగిపోయి, సామాజిక మీడియాలో అనుకూల ప్రచారంలో మునిగిపోయారు తప్ప వుప్పు బ్లాక్‌ మార్కెట్‌లోకి పోతుంటే, విపరీత ధరలకు అమ్ముతుంటే, జనాన్ని నిలువు దోపిడీ చేస్తుంటే ఎక్కడా రోడ్ల మీద కనపడలేదు. పుష్కలంగా వుప్పు వుందని మంత్రులు చెప్పినా జనం విశ్వసించలేదెందుకని? అనేక వుదంతాలను చూసినపుడు ఒక విషయం స్పష్టం అవుతోంది. మన వంటి వెనుకబడిన దేశాలలో గుడ్డినమ్మకాలు ప్రబలినపుడు ఇలాంటి పుకార్లు షికార్లు చేయటం చాలా సులభం. నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వంటి వారు తమ మాంత్రిక దండాలతో అద్బుతాలు చేస్తారని చాలా మంది గత రెండున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారు ఏమైనా చేయగలరనే విశ్వాసం ఇంకా బలంగానే వుంది.

    నల్లధనాన్ని వెలికి తీసేందుకంటూ 500,1000 రూపాయల నోట్లను రద్దు చేయటం, వాటి స్ధానంలో తక్షణమే కొత్త కరెన్సీని ప్రవేశపెట్టలేకపోవటం, చిల్లర నోట్ల కొరత కారణంగా సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో నాటకీయంగా నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాన్ని అనేక మంది తొలుత ఎంతగానో సమర్ధించారు. తీరా నోట్ల కొరత ఏర్పడి సామాన్యజనం ఇబ్బందులు పడటాన్ని చూసిన తరువాత వేళ్లమీద లెక్కించదగిన నల్లధనులను గాక కేంద్ర ప్రభుత్వం కోట్లాది తెల్లధనులను ఇబ్బందులకు గురి చేస్తోందని అర్ధం చేసుకున్నారు. ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికే నిప్పు పెట్టినట్లుగా నల్లధనులు ఎవరో అందరికీ తెలిసినప్పటికీ వారిని పట్టుకోవటం చేతగాని ప్రభుత్వం తమను ఇబ్బందుల పాల్జేయటాన్ని జీర్ణించుకోలేని జనం మోడీ ఎంతకైనా సమర్ధుడే ఏమో గతంలో పప్పుల మాదిరి వుప్పు ధర కూడా కొండెక్కుతుందేమో అని జనం గట్టిగా విశ్వసించటంలో ఆశ్చర్యం ఏముంది? అన్నింటి కంటే ఏదైనా ఒక వస్తువు బ్లాక్‌ మార్కెట్‌లోకి పోతోందంటే ప్రభుత్వాలు దానిని అరికడతాయనే విశ్వాసాన్ని జనం ఎప్పుడో కోల్పోయారు. భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పటికీ వ్యాపారుల ప్రతినిధిగానే చూసేవారు తక్కువేమీ కాదు. దొంగ వ్యాపారులను ఒక్కరిని కూడా శిక్షించిన వుదంతం గత రెండున్నర సంవత్సరాలలో గానీ అంతకు ముందుగానీ జనం చూడలేదు. తమ పార్టీ ప్రత్యేకమైంది అని బిజెపి స్వంత ప్రచారం చేసుకోవటం తప్ప జనంలో అలాంటి భావం లేదని తాజా వుప్పు వుదంతం నిరూపించింది. వుండి వుంటే వుప్పు బ్లాక్‌ మార్కెట్‌ను మోడీ, ఆయన అనుయాయులైన చంద్రబాబు నాయుడు వంటి ముఖ్యమంత్రులు అరికడతారని భరోసాగా వుండేవారు.

    గతేడాది నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన పప్పు షాక్‌ నుంచి జనం తేరుకోలేదు. కోడి మాంసం కంటే పప్పుల ధరలు పెరిగిపోయి చరిత్రలో రికార్డును స్ధాపించిన ఘనత నరేంద్రమోడీదే. జనం ప్రస్తుతం ఆ ధరలకు అలవాటు పడిపోయారు. పప్పుధరలను అరికట్టలేని వారు వుప్పుధర విషయంలో పని చేస్తారన్న విశ్వాసం జనంలో ఎలా కలుగుతుంది? గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో పప్పుల వుత్పత్తిలో పెద్ద హెచ్చు తగ్గులు లేవు. తొలిసారిగా గరిష్ట మొత్తంలో 2014లో పప్పులను దిగుమతి చేసుకున్న పూర్వరంగం వుంది.కాంగ్రెస్‌ హయాంలో అనేక కుంభకోణాలు జరిగి లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా పోయింది. నరేంద్రమోడీ హయాంలో ఇప్పటివరకు దాదాపు అంతకంటే పెద్ద కుంభకోణమే జరిగింది. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే మోడీ హయాంలో జనం జేబుల నుంచి సొమ్ముకొట్టి వేశారు. అది వుల్లి , పప్పుల ధరల బ్లాక్‌మార్కెట్‌, ధరల పెంపుదల రూపంలో జరిగింది. ఇలాంటి వాటిలో జనం కోల్పోయిన మొత్తం తక్కువేమీ కాదు.http://indiatoday.intoday.in/story/the-great-indian-dal-scam-revealed/1/527130.html ప్రధాని నరేంద్రమోడీ గట్టి మద్దతుదారైన అదానీ విదేశాల నుంచి చౌకగా పప్పులను దిగుమతి చేసుకొని అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్న విషయం తెలిసిందే.http://www.khabarbar.com/politics/explosive-adani-snatched-dal-from-your-plate-potential-scam-worth-%E2%82%B9190000-crore-unearthed/ . వుల్లి ధరలు కూడా కిలో వందరూపాయల వరకు పెరిగి జనానికి కన్నీళ్లు తెప్పించిన విషయం తెలిసిందే. కొన్ని వేల కోట్ల రూపాయలను కొన్ని వారాలలోనే వ్యాపారులు జనం జేబుల నుంచి లూటీ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇవన్నీ కళ్ల ముందే జరిగాయి.http://www.rediff.com/business/interview/interview-once-in-two-years-onion-crisis-is-bound-to-arise-in-india/20150824.htm అలాగే వుప్పు విషయంలో కూడా ఏదైనా జరుగుతోందో ఏమో అని సామాన్యులకు ఆందోళన కలగకుండా ఎలా వుంటుంది.

   పప్పుల సంగతి జనం మరిచిపోతున్నారు. నోట్ల రద్దు గురించి చేసిన ప్రకటనలు, ఆచరణలో తాము పడిన ఇబ్బందుల పూర్వరంగాన్ని కూడా వుప్పు పుకార్లలో చూడాలి. దొంగ సొమ్ము దాచుకున్న వారి పని పట్టేందుకు రద్దు అని మీడియాలో వూదరగొడుతుంటే బ్యాంకుదగ్గర బారులు దీరిన జనానికి ఒక్క నల్లధన కుబేరుడు కూడా వరసల్లో కనపడలేదు. అందరూ తమబోటి సామాన్యులే. పంటల ధరలు ఆస్మాత్తుగా పడిపోయినపుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు జరిగే నష్టాన్ని తలచుకొని రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం అందరికీ తెలుసు. పాత నోట్లను మార్చుకొనేందుకు వరుసల్లో నిలబడి కూలిపోయిన వృద్దులు, పొలం పుట్రా అమ్ముకొని శుభకార్యాలకు దాచుకున్న సొమ్ము పనికిరాకుండా పోయిందని ఆవేదనతో ప్రాణాలు పొగొట్టుకున్న వారి గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. నల్లకుబేరులను దెబ్బతీశానని మోడీ, బిజెపి నేతలు చెప్పటమే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా రైతుల మాదిరి నల్లడబ్బు పనికిరాకుండా పోయిందని జీవితాన్ని చాలించిన వుదంతాలు, కనీసం ఆసుపత్రి పాలైన ఘటనలు మీడియాలో రాలేదెందుకని? గంటల తరబడి వరుసల్లో నిలబడి తమ వద్ద వున్న నోట్ల మార్పిడి లేదా చెక్కుల ద్వారా బ్యాంకులలో డబ్బు తీసుకొనేందుకు వచ్చిన వారు వుబుసుపోక నల్లధనులు తమ వద్ద వున్న నోట్లను ఎంత సునాయాసంగా తెల్లధనంగా మార్చుకుంటున్నారో కథకథలుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న సామాన్య జనం వుప్పు కొరత ఏర్పడిందంటే నమ్మటంలో, పదులకొద్దీ కిలోలు అధిక ధరలకు కొనేందుకు ఎగబడటంలో ఆశ్చర్యం ఏముంది ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

MSP for Rabi Crops of 2016-17 season

16 Wednesday Nov 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Minimum Support Prices, MSP, MSP for Rabi Crops, MSP for Rabi Crops of 2016-17 season

Cabinet approves enhanced MSP for Rabi Crops of 2016-17 season
Announces Bonus for Gram, Masur, Rapseed/Mustard and Safflower cultivation  

The Cabinet Committee on Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for the increase in the Minimum Support Prices (MSPs) for all Rabi Crops of 2016-17 Season. Further, to incentivise cultivation of pulses and oilseeds, in the country Government has announced a bonus on these crops, payable over and above the following approved MSP.

 

Commodity MSP for 2015-16 Season (Rs / Quintal) MSP approved for 2016-17 (Rs / Quintal) Increase
Absolute (Rs / Quintal) percentage
Wheat 1525 1625 100 6.6
Barley 1225 1325 100 8.2
Gram 3500 (includes bonus of Rs.75 per quintal) 4000 (includes bonus of Rs.200 per quintal) 500 14.3
Masur (Lentil) 3400

(includes bonus of Rs.75 per quintal)

3950 (includes bonus of Rs.150 per quintal) 550 16.2
Rapeseed / Mustard 3350 3700 (includes bonus of Rs.100 per quintal) 350 10.4
Safflower 3300 3700 (includes bonus of Rs.100 per quintal) 400 12.1

The approval to increase MSPs is based on the recommendations of Commission for Agricultural Costs and Prices (CACP) which while recommending MSPs takes into account the cost of production, overall demand-supply, domestic and international prices, inter-crop price parity, terms of trade between agricultural and non-agricultural sectors, the likely effect on the rest of the economy, besides ensuring rational utilization of production resources like land and water.

The recommendation of CACP being the expert body, are generally accepted as such.  However, to incentivise cultivation of pulses and oilseeds, the Cabinet has decided to give a bonus of Rs.200/- per quintal for Gram, a bonus of Rs 150/- per quintal for Masur/Lentil and a bonus of Rs 100/- per quintal each for Rabi oilseeds viz. Rapeseeds/Mustards and Safflower, over and above the recommendations of the CACP. There is an increasing gap between the domestic demand and supply of pulses and oilseeds as a result of which reliance on import is increasing. Government has, therefore, announced this bonus on pulses and oilseeds to give a strong price signal to farmers to increase acreage and invest for increase in productivity of these crops. The increase in cultivation of leguminous pulses and oilseeds will also have additional environmental benefits as these crops are less water consuming and help in nitrogen fixation in the soil.

Food Corporation of India (FCI) will be the designated central nodal agency for price support operations for cereals, pulses and oilseeds. To supplement the efforts of FCI, the National Agricultural Cooperative Marketing Federation of India Limited (NAFED), National Cooperative Consumers’ Federation (NCCF), Central Warehousing Corporation (CWC) and Small Farmers Agri – Business Consortium (SFAC) may also undertake procurement of oilseeds and pulses as per their capacity.

Background:

 Besides increase in Minimum Support Prices (MSP) of Rabi crops, Government has taken several farmer friendly initiatives. These, inter-alia, include the following:

  • The Government had declared a bonus, over and above the MSP, of Rs 75 per quintal for Rabi pulses of 2016-17 marketing season, a bonus of Rs. 425 per quintal for Kharif pulses viz. Arhar, Moong and Urad, a bonus of  Rs 200 per quintal for Sesamum and a bonus of Rs. 100 per quintal for Groundnut, Sunflower, Soyabean and Nigerseed.
  • A new crop insurance scheme ‘Pradhan Mantri Fasal Bima Yojana’ has been launched by the Government. Under this scheme, the premium rates to be paid by farmers; are very low- 2% of sum insured for all Kharif crops, 1.5% for all Rabi crops’ and 5% for commercial and horticulture crops. The new insurance scheme involves use of simple and smart technology through phones & remote sensing for quick estimation and early settlement of claims. The Government has also launched a Mobile App “Crop Insurance” which will help farmers to find out complete details about insurance cover available in their area and to calculate the insurance premium for notified crops.
  • The Government has also launched a scheme to develop a pan India electronic trading platform under ‘National Agriculture Market’ (NAM) aiming to integrate 585 regulated markets with the common e-market platform. Each State is being encouraged to undertake three major reforms – allow electronic trading, have a single license valid throughout the State and a single entry point market fee. It will also enable farmers to discover better prices for their produce. 221 markets in 11 States| have already been brought on the e-NAM platform.
  • Soil Health Cards are being issued to farmers across the country. These will be renewed every two years. The card provides information on fertility status of soil and a soil test based advisory on use of fertilizers. As on 30th September, 2016, 295.56 lakh Soil Health Cards have been distributed.
  • Under Pramparagat Krishi Vikas Yojna (PKVY), the Government is promoting organic farming and development of potential market for organic products.
  • The Pradhan Mantri Krishi Sinchai Yojana is being implemented with the vision of extending the coverage of irrigation ‘Har Khet ko Pani’ and improving water use efficiency ‘Per Drop More Crop ‘ in a focused manner with end to end solution on source creation, distribution, management, field application and extension activities.
  • Government is focusing on improving production and productivity of crops such as rice, wheat, coarse grains and pulses under the National Food Security Mission.
  • A dedicated Kisan Channel has been started by the Doordarshan to provide 24 x 7 information in the hands of farmers regarding weather updates, agri-mandi data etc.
  • Government is encouraging formation of Farmer Producer Organisations.
  • To stabilize prices of pulses and onions, Government has decided to create buffer stocks of pulses and has imported pulses and onions under the Price Stabilization Fund.
  • A handbook for women farmers ‘Farm Women Friendly Hand Book’ containing special provisions and package of assistance which women farmers can claim under various on-going Missions/ Submissions/ Schemes of Department of Agriculture] Cooperation & Farmers Welfare has been brought out. Women farmers/beneficiaries could approach the nearest Project Director (ATMA) / Deputy Director (Agriculture) office at District or Block Technology Manager/Assistant Technology Managers at Block level for instant help and facilitation for availing the benefits.
  • With the above measures taken, the Government has set a target to double the farmers’ income by 2022.

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: