• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: January 2017

నల్లధనం వెలికితీతపై రాష్ట్రపతి మౌనరాగం !

31 Tuesday Jan 2017

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

black money, Demonetisation, Economic Survey, NPA;s, PARA, President pranab mukherjee

Image result for President pranab mukherjee parliament speech

ఎం కోటేశ్వరరావు

   బుధవారం నాడు ప్రవేశపెట్ట నున్న బడ్జెట్‌ సందర్బంగా ఆనవాయితీ ప్రకారం ముందురోజు మంగళవారం నాడు వుభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అంటే ప్రభుత్వం రాసి ఇచ్చేది తప్ప మరొకటి కాదు. వాటిలో జనానికి బాగా తెలిసిన అంశాలను మరింత వివరంగా చెప్పారు. దేశమంతా ఎదురు చూస్తున్న అంశాన్ని విస్మరించటం విస్మయం కలిగిస్తోంది. నల్లడబ్బును అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామని స్వయంగా నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. గడువు ముగిసి నెల రోజులు దాటి పోయింది. అయినా ఇంతవరకు ఎంత మొత్తంలో నల్లడబ్బును వెలికి తీశారో, అసలు బ్యాంకులకు తిరిగి వచ్చిన సొమ్మెంతో, మోడీ సాధించిన విజయాలేమిటో చెబుతారనుకుంటే ఇక్కడా ‘మౌనమే ‘ పాటించారు. ఆర్థిక సర్వేలోని అనేక అంశాలను తరువాత పరిశీలించవచ్చు. గత పార్లమెంట్‌ సమావేశాలలో పట్టుమని పదినిమిషాలు కూర్చోకుండా, చర్చలో పాల్గొనకుండా తప్పించుకున్నారనే విమర్శలను మూటగట్టుకున్న ప్రధాని నోట్ల రద్దు గురించి ఆర్ధిక సర్వే ఏం చెప్పిందో చూద్దాం.

     దేశంలో నల్లధనం ఎంత వుంది అన్నదానికి ఇప్పటి వరకు మౌనంగా వున్న సర్కార్‌ ఆర్ధిక సర్వేలో మన్‌కీ బాత్‌ను(మనసులోని మాట) కొత్త భాషలో బయటపెట్టింది. వంద రూపాయలు, అంతకంటే తక్కువ విలువ వున్న నోట్లు ప్రతి ఏటా వంద అచ్చువేశారనుకుంటే ఏడాది తిరిగే సరికిలో వాటిలో 33 పాతబడిపోయి, వినియోగంలోంచి తీసివేసి కొత్త నోట్లు వేస్తారు. అలాంటివి ఐదు వందల నోట్లు 22శాతం, వెయ్యి రూపాయలవి 11శాతం వుంటాయట. పెద్ద నోట్లు పాతబడటం తక్కువ శాతం వుండటం అంటే వాటిని వినియోగించకుండా దాచివేస్తున్నట్లు పరిగణిస్తే ఆ మొత్తం 7.3లక్షల కోట్ల రూపాయలని, దానిని నల్లధనంగా పరిగణిస్తారట. నలిగిపోయి పనికిరాకుండా పోయే నోట్లను అమెరికాతో పోల్చి చూస్తే నల్లధనాన్ని మూడులక్షల కోట్ల రూపాయలుగా అంచనా అని ఇది జిడిపిలో రెండుశాతమని పేర్కొన్నారు. మరి ఈ మొత్తమైనా బయటకు వచ్చిందా అంటే జవాబు లేదు. పార్లమెంట్‌ సమావేశాలలో అయినా చెబుతారా ? వేచి చూద్దాం !

   ఈ సమావేశాలకు ముందు తొమ్మిదివేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసి, అందరి కళ్ల ముందునుంచే విదేశాలకు పారిపోయిన విజయ మాల్యకు రుణాల మంజూరు, పారిపోయేందుకు అవకాశం ఇవ్వటం గురించి పరస్పరం బిజెపి, కాంగ్రెస్‌లు విమర్శించుకున్నాయి. ఇలాంటి మాల్యలు ఎందరో తీసుకున్న రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో పేరుకు పోయిన నిరర్ధక ఆస్థుల తగ్గింపుకు చర్యలు తీసుకొనేందుకు ఆస్థుల పున:నిర్మాణ కంపెనీల(ఎఆర్‌సి)తో పాటు ప్రభుత్వ రంగ ఆస్థుల పునరావాస సంస్ధ(పిఏఆర్‌ఏ)ను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఈ సర్వేలో వెల్లడించింది. అతి పెద్ద, అత్యంత క్లిష్టమైన వుదంతాలలో ప్రభుత్వ రంగ సంస్ధల నిరర్ధక ఆస్థురుల తగ్గింపునకు రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా ఈ సంస్ద పని చేస్తుందట.

    మంచిదే. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులను బిజెపి ఏలుబడిలో ఇబ్బడి ముబ్బడిగా పారుబాకీలుగా ప్రకటించి రద్దు చేశారనే తీవ్ర విమర్శలను నరేంద్రమోడీ సర్కారు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నెల ఏడున అప్పుల రద్దుకు నిరసన తెలుపుతూ బ్యాంకు వుద్యోగుల సంఘాలు ఆందోళనకు పిలుపు ఇచ్చిన పూర్వరంగంలో కారణం ఏదైనా మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సరే ఆచరణలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో దేశం చూడబోతోంది. ఎందుకంటే ఇటీవల ప్రతి కార్పొరేట్‌ కంపెనీ అధిపతీ నరేంద్రమోడీ చర్యలకు మద్దతు ప్రకటించి ‘దేశభక్తి ‘ సర్టిఫికెట్‌ను తమకు తామే ఇచ్చుకుంటున్నారు.

    నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు గనుక వాటి వివరాల్లోకి పోనవసరం లేదు. ఆ ప్రచారంలో చోటుదొరకని అంశాలలో బ్యాంకుల నిరర్దక ఆస్థుల పెరుగుదల ఒకటి. గతేడాది సెప్టెంబరు 30 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్థుల విలువ ఆరులక్షల 30వేల 323 కోట్ల రూపాయలు. అవెంత వేగంగా పెరుగుతున్నాయంటే జూన్‌-సెప్టెంబరు కాలంలో 79,977 కోట్లు పాత బాకీలకు తోడయ్యాయి. ఈ మొత్తం ఎంత అంటే బ్యాంకులు వంద రూపాయల రుణం ఇచ్చాయనుకుంటే 12 రూపాయలు నిరర్ధక ఆస్థులుగా తేలాయి. ఇవన్నీ కేంద్ర మంద్రి సుజనా చౌదరి వంటి ఘరానా పెద్దలు తీసుకున్న వందల కోట్ల రూపాయల మొత్తాలకు చెందినవే. ఒక్క రష్యాతప్ప ఇంత మొత్తంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కార్పొరేట్‌ పెద్దలు మరొక ఏ వర్ధమాన దేశంలోనూ లేరట. సరే రష్యా అంటే సోషలిస్టు వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించిన సమయంలో దొంగలదోపిడీ జరిగిందనుకోండి.

   వ్యవసాయం గిట్టుబాటు గాక లేదా పంటలు పోయి, రకరకాల కారణాలతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దౌర్బాగ్య పరిస్థితి రైతాంగంలో వుంది. ఎక్కడా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న పారిశ్రామిక, రాజకీవేత్తల గురించి మనం ఎక్కడా వినం, కనం. ఎందుకంటే వారు స్వంత డబ్బులతో లావాదేవీలు నిర్వహించరు గనుక. ప్రభుత్వ రంగ ఆస్థుల పునరావాస సంస్ధ(పిఏఆర్‌ఏ)ను ఎందుకు ఏర్పాటు చేయవలసి వస్తోందో ఆర్ధిక సర్వేలో చెప్పారు. ‘ రుణాల ఎగవేత సమస్య గురించి ప్రజలు చేస్తున్న చర్చలలో బ్యాంకుల పెట్టుబడి గురించి కేంద్రీకరించారు. ఈ రుణాల సమస్యకు పరిష్కారం కనుగొనటం పెద్ద సమస్యాత్మకంగా వున్నందున దానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంది. కొన్ని వుదంతాలలో నిధుల మళ్లింపు వలన సమస్యలు తలెత్తాయి. అయితే అత్యధిక వుదంతాలలో ప్రపంచ ద్రవ్య సంక్షోభం తరువాత ఏర్పడిన ఆర్ధిక వాతావరణంలో అనూహ్య మార్పులు దీనికి కారణమయ్యాయి. దాని వలన టైమ్‌టేబుల్స్‌, కరెన్నీ మార్పిడి రేట్లు, అభివృద్ధి అంచనాలు తీవ్రంగా తారుమారయ్యాయి. పెద్ద కేసులను పరిష్కరించటం పెనుసవాలుగా మారినందున దీనితో కేంద్రీకరించవచ్చు. రాని బకాయిలను ఆస్థులుగా చూపుతున్నందున వాటిని తగ్గించి ప్రభుత్వ రంగ సంస్ధల ద్రవ్య ఆరోగ్యాన్ని పునరుద్దరించాల్సి వుంది. సరే ఇలా ఎంతో అందమైన భాషలో చెప్పారనుకోండి. ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలున్నాయి.

    రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఇలాంటి పరిష్కార చర్యలను వ్యవసాయరంగ సంక్షోభం పరిష్కారానికి ఎందుకు తీసుకోదు? ఎవరు అడ్డుపడుతున్నారు. అమెరికా వంటి ధనిక దేశాలలో 2008లో తలెత్తిన సంక్షోభం మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిపిఎం వంటి వామపక్షాలు, ఎందరో ఆర్ధిక వేత్తలు చేసిన హెచ్చరికలను నాడు అధికారంలో వున్న యుపిఏ పెద్దలు కొట్టివేశారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పెద్దలకు అసలు దాని గురించి పట్టలేదు. ఎక్కడో అమెరికాలో జరిగిన దివాళా పర్యవసానాలు ఎనిమిది సంవత్సరాల తరువాత మన బ్యాంకుల ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసినట్లు మన ప్రభుత్వమే అంగీకరించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ అనుసరించిన దివాళాకోరు ఆర్ధిక విధానాలనే బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ అనుసరిస్తున్నది. వాటిని వారు బాగా అమలు జరపలేదు, మేం పక్కాగా చేస్తాం అని మరీ చెబుతున్నది. పాలకంటే మంచినీళ్ల ధరలు మోడీ హయాంలో కూడా ఎక్కువగానే వున్నాయి. నీళ్ల వ్యాపార కంపెనీలు తెలివి మీరి ఒక లీటరు బదులు ముప్పావు లీటరు సీసాలను అధిక ధరలకు అమ్ముతున్నాయి. మరి మార్పు ఏమి వచ్చినట్లు ? అందువలన ప్రపంచీకరణ పేరుతో అమలు జరుపుతున్న దివాలాకోరు, ప్రజా వ్యతిరేక ఆర్ధిక విధానాల పర్యవసానాలు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రం కానున్నాయి. వాటిని జనం వుమ్మడిగా కాకపోతే ఎవరు పట్టించుకుంటారు. ప్రపంచీకరణతో వచ్చిన సమస్యలను ప్రపంచవ్యాపిత కార్యాచరణతోనే ఎదుర్కోవాలి. కులాలు, మతాలు, బంధుత్వాల పేరుతో జనం మొత్తానికి శఠగోపం పెట్టే విధానాలను వ్యతిరేకించకపోతే నష్టపోయేది జనమే. బ్యాంకుల్లో మన డబ్బు మనం రోజుకు 50వేల కంటే ఎక్కువ తీసుకుంటే పన్ను వేయాలని మన చంద్రబాబు గారి కమిటీ సిఫార్సు చేసింది. వారానికి 24వేల పరిమితిని ఆర్‌బిఐ ఇంకా ఎంత కాలం కొనసాగిస్తుందో తెలియదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో డబ్బున్న మారాజులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రాజకీయ వత్తిడికి లొంగి కరెంటు ఖాతాలపై పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది. ఇలాంటి పనులు సామాన్యుల విషయంలో ఆర్‌బిఐ ఎందుకు తీసుకోలేదు?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు బెర్లిన్‌ గోడ బద్దలు-నేడు మెక్సికో గోడ నిర్మాణం !

30 Monday Jan 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti Muslim, ban on refugees, Berlin wall, Donald trump, Mexico wall, Muslim, Trump’s visa ban

Image result for Then who supported the dismantle of the Berlin wall now constructing Mexico wall

ఎం కోటేశ్వరరావు

    అధికారంలో వున్న వారి మాటలకు అర్ధాలే వేరు ! పెద్ద పెద్ద జలాశయాలకు పడే గండ్లు తొలుత చిన్నవిగానే వుంటాయి, తరువాత పూడ్చలేని విధంగా తయారవుతాయి. అమెరికా అధ్య్ష పీఠంపై కూర్చున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఏ రోజు ఏం మాట్లాడతారో, ఏ పిచ్చి పనులు చేస్తారో తెలియని స్ధితి. ఆతగాడి చర్యలు ఎటు దారితీస్తాయో వెంటనే వూహించటం కష్టం. పాలకవర్గాలు తాము ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని జనం మీదో, మరొక దేశం మీదో నెట్టాలని నిర్ణయించుకుంటే రెచ్చగొట్టుడు, పిచ్చిపనులు చేయటం గత చరిత్ర అనుభవం. ప్రస్తుతానికి రెండు దృశ్యాలను వూహించ వచ్చు. ఒకటి, ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసిన ట్రంప్‌ తనకు ఓటు వేసిన జనాన్ని సంతృప్తి పరచాలంటే ఏదో ఒకటి చేస్తున్నట్లు నటించటం అవసరం కనుక ఆ స్క్రిప్టులో భాగంగా ఇలా చేస్తుండి వుండాలి. రెండవది, ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటోంది, దానికి పెద్ద దిక్కుగా వున్న అమెరికా తన స్ధాయికి తగిన రీతిలో సమస్యలను ఎదుర్కొంటోంది. అందువలన తన బలాన్ని వుపయోగించి ప్రపంచాన్ని తన చెప్పుచేతల్లో, తన పెరటి దొడ్డిగా మార్చుకొనేందుకు పూనుకొని వుండి వుంటే ట్రంప్‌ను ఒక పావుగా వుపయోగించి తన జూదాన్ని అయినా ప్రారంభించి వుండాలి. ఏది అనేది కొద్ది వ్యవధిలోనే తేలిపోతుంది. ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై ప్రయాణ నిషేధం విధిస్తూ ట్రంప్‌ శుక్రవారం నాడు ఒక వుత్తరువును జారీ చేశాడు. శనివారం నాడు ఆ దేశాల నుంచి వచ్చిన వారు అమెరికా గడ్డపై అడుగుపెట్టకుండా అధికారులు అడ్డగించటంతో వచ్చిన వారు పలు విమానాశ్రయాల్లో నిరసనలకు దిగారు. వారం రోజుల పాటు ఆ వుత్తరువులను నిలిపివేయాలని శనివారం నాడు (జనవరి 28న) న్యూయార్క్‌ కోర్టు ఆ నిషేధాన్ని ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని రాష్ట్రాల కోర్టులు కూడా ఇదే మాదిరి ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా పౌర హక్కుల యూనియన్‌ (ఎసిఎల్‌యు) న్యూయార్క్‌లోని కెనడీ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ఇరాకీ ప్రయాణీకుల తరఫున కోర్టుకు వెళ్లినప్పటికీ తాను జారీ చేసిన వుత్తరువు అమెరికా అంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నది. కొంత మంది ట్రంప్‌కు ఇది తొలి ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ‘మన దేశానికి బలమైన సరిహద్దులు మరియు తీవ్రమైన నిఘా వుండాలి. ఇప్పుడు ఐరోపా, ప్రపంచమంతటా వాస్తవంగా ఏం జరుగుతోందో చూడండి-భయం కరమైన గందర గోళం ‘ అంటూ ఆదివారం వుదయం ట్వీట్‌ ద్వారా వ్యాఖ్యానించాడు. అంతకు ముందు ఏడు దేశాల ప్రయాణీకులపై ఆంక్షలు విధించాను తప్ప ముస్లింల మీద విధించిన నిషేధం కాదంటూ ఎప్పటి నుంచో మన దేశం గట్టి నిఘా వేసి వుండాల్సింది, రాబోయే రోజులలో ఆ పని చేయబోతున్నాం అంటూ ఐఎస్‌ను ఓడించేందుకు 30రోజుల్లోగా ఒక పక్కా ప్రణాళికను తయారు చేయాలని ట్రంప్‌ ఆదేశించాడు.

Image result for mexico wall

     అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చున్నా నడిపేది అక్కడి బడా కార్పొరేట్లు తప్ప మరొకరు కాదు. నూతన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారం చూస్తుంటే తలతిక్క రాజు పనుల మాదిరి కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్బంగా ఏమి చెప్పినా కార్పొరేట్లకు ఇబ్బంది లేదు, ఓట్ల కోసం పడే పాట్లుగా వినోదం చూస్తారు. అధికారానికి వచ్చిన తరువాత ఎలా వ్యవహరిస్తారనేదే వారికి ముఖ్యం. ఆ రీత్యా చూసినపుడు ట్రంప్‌ పిచ్చి ప్రకటనలు ఎత్తుగడగా కేవలం జనాన్ని మభ్యపెట్టటానికేనా అని కూడా అనుమానించాల్సి వుంటుంది. తమ వస్తువులు, పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ బడితే అక్కడ ప్రవేశించటానికి ఎక్కడ ఎలా తిరిగినా మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లుగా ఏ దేశంలో తిరిగినా చివరకు తమ దొడ్లలో లాభాలను పదిల పరుచుకోవటానికే కార్పొరేట్లు సరిహద్దులు, ఆటంకాలు లేని ప్రపంచీకరణ భావనను ముందుకు తెచ్చారు. ఐరోపా యూనియన్‌ పేరుతో ఇప్పటికే ఐరోపా ధనిక దేశాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా ముందుకు పోవటం ఎలా అన్నది దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ స్ధితిలో అసలు సరిహద్దులు లేని దేశం ఒక దేశమా అంటూ ట్రంప్‌ ఐరోపా యూనియన్‌, ప్రపంచం ముందు ఒక కొత్త సవాలును విసిరారు.

    తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని, ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చని రామకృష్ణ పాత్రధారి చేత చెప్పించారు. ( ప్రాసకోసం వుపయోగించారు తప్ప నియోగులు అలాంటి వారని నేను అనుకోవటం లేదు ) పెట్టుబడిదారులు మాత్రం అలాంటి వారే. తమకు అవసరాలకు అనుగుణ్యంగా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. వారు తమకు అవసరం అనుకుంటే వున్న చోట గోడలు పడగొడతారు, లేని చోట కొత్త గోడలు కడతారు. పాతిక సంవత్సరాల క్రితం కమ్యూనిజాన్ని కూల్చివేశామని ప్రకటించిన అమెరికా పాలకులు దానికి చిహ్నంగా బద్దలు కొట్టించిన బెర్లిన్‌ గోడను చూపారు. దాని శిధిలాల ముక్కలను ఇండ్లకు తీసుకుపోయి విజయ చిహ్నాలుగా అలంకరించుకున్నారు. గత 70 సంవత్సరాలుగా పాలస్తీనా రాజ్యం ఏర్పడకుండా అడ్డుకోవటమే గాక, దాని భూభాగాలను క్రమంగా ఆక్రమిస్తూ, జనం రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఇజ్రాయెల్‌ నిర్మిస్తున్న గోడలను అమెరికా సమర్ధిస్తోంది. అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పని చేసినట్లు ఇప్పుడు అదే అమెరికన్లు స్వయంగా మిగతా వారి కంటే పెద్ద గోడను నిర్మించేందుకు పూనుకున్నారు. నాడు తూర్పు జర్మనీని బలవంతంగా పశ్చిమ జర్మనీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఆ పని చేస్తే ఇప్పుడు తమ సమాజంలో తలెత్తిన అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు మెక్సికో సరిహద్దులలో గోడ నిర్మాణానికి పూనుకున్నారు. నిజంగా ఆ పనిచేస్తారో లేదో తెలియదుగానీ గోడ నిర్మాణానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వుత్తరువులపై సంతకాలు చేశారు. అందుకు అవసరమయ్యే నిధులను పార్లమెంట్‌ మంజూరు చేసి, చట్టపరంగా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకపోతే గోడ నిర్మాణం ఏప్రిల్‌ తరువాత ప్రారంభమౌతుంది.

Image result for mexico wall cartoon

    మెక్సికో గోడ నిర్మిస్తే ఎవరికి లాభం-ఎవరికి నష్టం అన్న చర్చ గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది.ఇప్పుడు ఇంకా పెరిగింది. నిజానికి ఇది కేవలం ఒక గోడ నిర్మాణానికే పరిమితం కాదు.దానితో అమెరికా సమస్యలు పరిష్కారం కావు. ప్రపంచ మంతా ఎల్లలు లేని ఒక కుగ్రామం అని అందరూ ఒకవైపు చెబుతూనే ఏదో ఒక కారణం చూపి గోడలు లేదా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటివి వివిధ దేశాల మధ్య 45 గోడలు, కంచెలు వున్నాయి. వాటికి కారణాలుగా చెప్పిన సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదు. ట్రంప్‌ చెబుతున్నదాని ప్రకారం అమెరికన్లకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి వుద్యోగాలు కల్పించాలంటే విదేశాల నుంచి ముఖ్యంగా చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి వస్తున్న దిగుమతులపై పన్ను విధించి తద్వారా స్ధానికంగా వుత్పత్తిని ప్రోత్సహించి నిరుద్యోగ, ఆర్ధిక సంక్షోభ సమస్యను పరిష్కరించాలనే దగ్గర దారి ప్రయత్నమిది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో-మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అన్నట్లుగా మిగిలిన దేశాలు అమెరికా పెద్దన్న పెత్తనానికి తలవంచుతాయంటే అంతకంటే పిచ్చి వూహ మరొకటి వుండదు.

     అమెరికా-మెక్సికో సంబంధాలలో రెండు అంశాలున్నాయి. ఒకటి అమెరికా చెబుతున్నట్లు మెక్సికో నుంచి బతకటానికి వచ్చే వారు అడ్డదారుల నుంచి అమెరికాలో ప్రవేశించటం. 1994లో అమెరికా-మెక్సికో-కెనడాలు వుత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా) కుదుర్చుకున్నాయి. ఆ సమయంలో అమెరికా నుంచి మెక్సికో దిగుమతులు ఎక్కువగా వున్నాయి. వాటిని మరింతగా పెంచేందుకు ఆ ఒప్పందం వుపయోగపడుతుందని అమెరికా కార్పొరేట్‌ శక్తులు ముందుగా అంచనా వేశాయి. అయితే ఆ తరువాత అందుకు విరుద్దంగా జరిగింది. 1995-2016 మధ్య మెక్సికో నుంచి అమెరికా దిగుమతులు 65 నుంచి 295 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మెక్సికోకు ఎగుమతులు 68 నుంచి 235 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. అంటే నాఫ్టా ఒప్పందం వలన మెక్సికో లాభపడింది. ఈ అంకెలను చూపి నాఫ్టా ఒప్పందం ఏకపక్షంగా జరిగిందంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లు వ్యవహరించే పెద్దన్న అమాయకంగా ఒప్పందంపై సంతకం చేశారంటే ఎవరైనా నమ్ముతారా ?

   కార్పొరేట్‌ శక్తులకు కావాల్సింది లాభం. అది స్వంత దేశంలోని కార్మికులకు పని కల్పించి సంపాదించిందా, పొరుగుదేశంలోని కార్మికుల నుంచి పిండుకున్నదా అన్నది వారికనవసరం.ఆ క్రమంలో మెక్సికో నుంచి దిగుమతులు చేసుకోవటమే వారికి లాభసాటిగా మారిందన్నది అసలు విషయం. అదే చైనా, మెక్సికో, మిగతా పేద, వర్ధమాన దేశాల అనుభవం. అత్యంత పేద దేశాలలో ఒకటైన బంగ్లాదేశ్‌లో ప్రపంచంలోని ధనిక దేశాల వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలన్నీ తమ దుస్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. నిజానికి బంగ్లాదేశ్‌ వినియోగం కోసమైతే అన్ని అవసరం లేదు. అక్కడ తయారయ్యేవన్నీ ఎగుమతుల కోసమే. మెక్సికో సుంచి వలసల వలన అక్కడ సమస్య తలెత్తిందనుకుందాం, మరి ఐరోపా ధనిక దేశాల సంక్షోభ సమస్య మాటేమిటి ? అమెరికాలో ఆర్ధిక సమస్యలు తలెత్తి జనానికి అవసరమైన వుద్యోగాలు దొరకక పోవటానికి విదేశాల నుంచి అక్రమంగా వలస వస్తున్నవారే కారణమని అక్కడ వున్న రెండు పార్టీల వారూ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. అదొక ఎన్నికల సమస్యగా మారింది. ఎవరు ఆ సమస్య గురించి తక్కువ మాట్లాడితే వారు జనంలో పలుచనయ్యే స్థితి. అందువలననే ఎన్నికలకు ముందు, తరువాత హడావుడి చేయటం తరువాత ఏదో చేశామనిపించి జనాన్ని జోకొడుతున్నారు. ధనిక దేశాలలో 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ పర్యవసానాలు ఆ సమస్యను తాజా ఎన్నికలలో మరింత ఎక్కువగా ముందుకు తెచ్చాయి. ప్రతిపక్షంలో వున్న రిపబ్లికన్‌ పార్టీ తాము అధికారానికి వస్తే తెల్లవారే సరికి అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి పరిష్కరిస్తామని ప్రచారం చేసింది.

     నిఘా వేయటంలో ఎంతో ఆధునిక పరిజ్ఞానం వున్న అమెరికాకు అక్రమ వలసలను అరికట్టటం ఒక సమస్య కానే కాదు. మెక్సికో ద్వారా వివిధ లాటిన్‌ అమెరికా దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించి అధికారికంగా నమోదు కాని కార్మికులుగా పని చేయటం ఎప్పటి నుంచో జరుగుతోంది. ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్లు వదలి వేస్తున్నాయి. ఎందుకంటే చట్టబద్దమైన కార్మికులతో పాటు వీరు కూడా పన్నులు చెల్లిస్తారు. సామాజిక భద్రతా పధకాలు, పెన్షన్‌ వంటి వాటిని వారికి చెల్లించనవసరం లేదు. వలస వచ్చిన వారు తక్కువ వేతనానికి పని చేస్తారు. యజమానులకు అది అదనపు లాభం. స్ధానికులతో పని చేయించుకొనే యజమానులు ఎక్కువ వేతనాలను చెల్లించటంతో పాటు వారి సామాజిక భద్రతా పధకాలకు తమ వాటా చెల్లించాల్సి వుంటుంది. ఇది వారి లాభాలను, పోటీ శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పని చేసేందుకు ఎక్కువగా వీరిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్నట్లు వారి రాకను నిరోధించేందుకు నిఘా పెంచినా, అడ్డుకునేందుకు పెద్ద గోడను నిర్మిస్తే ఏం జరుగుతుంది?

   వలసలు ఆగిపోయి కొంతమేరకు స్ధానికులకు వుద్యోగ అవకాశాలు మెరుగుపడవచ్చు. ఇదే సమయంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ అన్నది ఎక్కువగా వినిపిస్తోంది.ప్రపంచ మార్కెట్‌లో ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే ఇప్పటికే అమెరికాలో వుత్పాదక ఖర్చులు ఎక్కువగా వున్నాయనే కారణంతో అమెరికా పెట్టుబడిదారులు కొత్తగా పెట్టే వాటితో పాటు పాత పరిశ్రమలను కూడా వేతన రేట్లు తక్కువగా వుండే దేశాలకు తరలించారు. ఆధునిక పరిజ్ఞానం ఇమిడి వుండే కొన్ని వస్తువులకు సంబంధించిన భాగాలు అమెరికాలో తయారు చేసి వాటిని ఇతర దేశాలకు తరలించి అక్కడ తయారైన వస్తువులను తిరిగి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. వుదాహరణకు జపాన్‌కు చెందిన మన దేశంలోని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీలో తయారయ్యే కార్లను జపాన్‌తో సహా మరో వంద దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాడి సెప్టెంబరు నాటికి పదిహేను లక్షల కార్లను ఎగుమతి చేశారు. అలాగే మెక్సికో నుంచి జరుగుతున్నాయి.

   ట్రంప్‌ చెబుతున్నట్లు గోడ నిర్మాణానికి లేదా దిగుమతుల నిరోధానికి 20శాతమో అంతకంటే ఎక్కువో దిగుమతి పన్ను విధిస్తే అది ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్దమే గాక అమెరికాకే నష్టం. మెక్సికో నుంచి ఏటా 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను అమెరికా దిగుమతి చేసుకొంటోంది. వీటిలో 40శాతం వరకు అమెరికా నుంచి విడి భాగాలను మెక్సికో పంపి అక్కడి నుంచి పూర్తిగా తయారైన వస్తువులు తిరిగి అమెరికాకు వచ్చేవి వున్నాయి. వాటి మీద, అలాగే పూర్తిగా మెక్సికో నుంచి వచ్చే వాటిమీద ఎంత పన్ను విధిస్తే, అవి దిగుమతి చేసుకోవటం అనివార్యం అయితే ఆ మేరకు భారం అమెరికా వినియోగదారులపైనే పడుతుంది. ఇది చైనా, కెనడా, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. దీని వలన తలెత్తే సమస్యలను అధిగ మించాలంటే మెక్సికో, ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై దిగుమతి పన్ను విధించటం వంటి చర్యలకు పాల్పడతాయి.అంటే అది వాణిజ్య యుద్ధంగా మారుతుంది. మెక్సికోతో వాణిజ్యంపై ఆధారపడి అమెరికాలో 60లక్షల మంది వుపాధి పొందుతున్నారు. ఒక వేళ మెక్సికోలో వాటి తయారీని నిలిపివేస్తే అమెరికాలోనే వాటిని తయారు చేస్తే కొంత మంది వుపాధి పోవటం, వినియోగదారులపై అదనపు భారం పడటం అనివార్యం. ఇలాంటి ఎన్నో సమస్యలున్న కారణంగానే అలాంటి పిచ్చిపనులు చేస్తే విజేతలంటూ వుండరు, అటూ ఇటూ నష్టపోతారని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ దవోస్‌ సమావేశంలో హెచ్చరించారు. అమెరికా కార్పొరేట్లు ట్రంప్‌ ప్రకటనల లాభ నష్టాలను బేరీజు వేసుకొని తమకు లాభం వచ్చే మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఏం చేస్తారో చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అసాధారణ ప్రపంచ వ్యాపిత నిరసనల మధ్య అందలమెక్కిన డోనాల్డ్‌ ట్రంప్‌

23 Monday Jan 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, protest, WomensMarch against Donald Trump

ఎం కోటేశ్వరరావు

    1860లో అమెరికా రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్‌ చరిత్ర సృష్టించాడు. ఆయన బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. వైట్‌ హౌస్‌లో ఆయన ఆశీనుడు కావటాన్ని సహించలేని దక్షిణాది రాష్ట్రాలలోని బానిసల యజమానులు ప్రత్యేక దేశ ఏర్పాటును ప్రకటించి అంతర్యుద్ధానికి కారకులయ్యారు. రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తిరుగుబాటుదార్లు లొంగిపోయి అంతర్యుద్ధం ముగిసింది అనుకుంటున్న తరుణంలో బానిసత్వాన్ని సమర్ధించే ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. ఆదే రిపబ్లికన్‌ పార్టీ తరఫున తాజాగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీస్వీకారం చేస్తున్న సమయంలో అమెరికాతో సహా అన్ని ఖండాలలో నిరసన ఎదుర్కొన్న వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వదరుబోతులకు అమెరికా సమాజం పెట్టింది పేరు. ఇంతవరకు అలాంటి వారెవరూ అధ్యక్ష స్ధానంలో కూర్చోలేదు. డోనాల్ట్‌ ట్రంప్‌తో అది కూడా జరిగిపోయింది. మహిళలు, కార్మికులకు, సామాన్య జనానికి, ముస్లింలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఒక ఫాసిస్టుగా ముద్రపడి ప్రపంచ వ్యాపితంగా నిరసనలకు కారకుడయ్యాడు. అమెరికా వంటి దేశాలలో సాధారణ నిరసన ప్రదర్శనలంటే బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని కొన్ని వందల మంది వీధులలోకి రావటం తప్ప సంఖ్య ఎక్కువగా వుండదు. యుద్ధవ్యతిరేక వుద్యమం వంటి సందర్భాలలోనే లక్షల సంఖ్యలో హాజరైన వుదంతాలు వున్నాయి. అలాంటిది ఇప్పుడు ఆ స్ధాయిలో ముఖ్యంగా మహిళలు లక్షల మంది వీధులలోకి వచ్చి అనేక నగరాలలో ప్రదర్శనలు జరిపారు. ఒక వ్యక్తి ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి దేశాధినేత ఎన్నికైనట్లు ప్రకటించగానే అనేక దేశాలలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తటం తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వున్నప్పటికీ అమెరికన్‌ సమాజం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలు, తీరు తెన్నులను చూసి ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే నిరసనలు వ్యక్తం చేశారు. అంతకంటే పెద్ద స్ధాయిలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావటం బహుశా ఆధునిక ప్రపంచ చరిత్రలో అమెరికా అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌తోనే ప్రారంభమై వుండాలి.ట్రంప్‌ తన పదవీకాలంలో ఎలా ప్రవర్తిసాడు, ఏవిధంగా ముగుస్తుందన్నది ఆసక్తికరం.

Image result for donald trump oath taking

   ప్రజాస్వామ్యం అంటే అమెరికాలో మాత్రమే వుంటుందన్నది కొందరి ప్రగాఢ నమ్మకం. అర్హత కలిగిన ఓటర్లలో కేవలం 25శాతం మాత్రమే ట్రంప్‌కు ఓటు చేశారు. జనం వేసిన ఓట్లు ట్రంప్‌ కంటే ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా వున్న హిల్లరీ క్లింటన్‌కు 28లక్షలు అదనంగా వచ్చాయి. కానీ అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్రరల్‌ కాలేజీలో ఎక్కువ స్ధానాలు రావటంతో ట్రంప్‌ గెలిచాడు.ఇదీ అక్కడి ప్రజాస్వామ్యం తీరు. ప్రపంచీకరణ గురించి ఇంతకాలం సుద్దులు చెప్పిన వారు ఇప్పుడు అమెరికా తరువాతే మిగతా దేశాలు (అమెరికా ఫస్ట్‌ ) అని ట్రంప్‌ మాట్లాడుతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు. అలాంటి పెద్ద మనిషి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అసాధారణరీతిలో తెలుగు మీడియా వార్తలు ఇచ్చిన తీరు ప్రమాదకర పోకడలను తెలియ చేస్తోంది.ఫాసిస్టులు జనం కోసం కబుర్లు చెప్పి ఆచరణలో కొద్ది మంది తమ చుట్టూ వుండే కుటుంబాలు, బినామీలు, కార్పొరేట్లు, విధేయులకు ఆచరణలో వుపయోగపడతారు. ఎన్నికల ప్రచారంలో అమెరికన్ల వుద్యోగాలు, వుపాధి వంటి అంశాల గురించి, ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు వచ్చిన వారు స్ధానికుల వుపాధిని దెబ్బతీస్తున్నారని, ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై పెద్ద మొత్తంలో పన్నులు, బయటి వారికి వుపాధి కల్పించే స్ధానిక పెట్టుబడిదారులపై చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ చెప్పటం జనం ఓట్ల కోసమే. ఇప్పుడు అధికారం స్వీకరించారు గనుక కార్పొరేట్లు, విధేయులు, కుటుంబ సేవ ప్రారంభిస్తారు. అత్యంత ధనికులు, పేరు మోసిన కార్మిక వ్యతిరేకులు, జాత్యహంకారులతో కూడిన పచ్చి మితవాద ప్రముఖులందరినీ తన మంత్రులుగా, సలహాదారులుగా నియమించుకొని నాంది పలికారు. ఎన్నికల ప్రచారంలో మెక్సికో, చైనా నుంచి వలసలు వచ్చిన వారి గురించి, ముస్లింలు, మీడియా, కార్మిక సంఘాల గురించి అవాకులు చెవాకులు పేలిన ట్రంప్‌ పదవీబాధ్యతల స్వీకారం సందర్భంగా వాటిని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా పరోక్షపద్దతులలో తన మద్దతుదారులకు అర్ధమయ్యే రీతిలో మాట్లాడి సంతృప్తి పరచారు. అమెరికా వస్తువులనే కొనాలి, అమెరికన్లకే వుద్యోగాలివ్వాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక పెద్ద రియలెస్టేట్‌ వ్యాపారి. తాజమహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరని శ్రీశ్రీ చెప్పినట్లుగా విదేశాల నుంచి వలస వచ్చి అమెరికా రికార్డులలో నమోదు కాకుండా తక్కువ వేతనాలకు పని చేసిన వారినే తాను నిర్మించిన అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, కార్యాలయాల నిర్మాణానికి వుపయోగించుకున్నాడన్నది జగమెరిగిన సత్యం. ఇక తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారందరూ ధరించిన కొత్త సూట్లు, కోట్లు, టైలు ఒకటేమిటి సర్వం కారు చౌకగా విదేశీ కార్మికులు తయారు చేస్తే ట్రంప్‌ స్వంత కంపెనీలు దిగుమతి చేసుకున్న సరుకే. ఇలాంటి వ్యక్తిని అమెరికన్లు ఎందుకు ఎన్నుకున్నారన్న ప్రశ్న తలెత్తటం సహజం. సంక్షోభంలో వున్న సమయంలో కార్పొరేట్‌ మీడియా పచ్చి మితవాదులను ఆకాశానికి ఎత్తుతుంది, ఓటర్లను ప్రభావితం చేస్తుంది, కార్పొరేట్‌ శక్తులు కూడా తమ ప్రయోజనాలను నిర్ధాక్షిణ్యంగా కాపాడేవారిని ఎంచుకుంటాయి. ప్రపంచ మంతా ఫాసిస్టు హిట్లర్‌ను వ్యతిరేకిస్తే 1940 అధ్యక్ష ఎన్నికలలో హిట్లర్‌ అనుకూల లిండ్‌ బెర్గ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకొని ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ను ఓడించారు. అందువలన వివిధ కారణాలతో జనం కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. గత 20 సంవత్సరాలుగా అమెరికా సమాజంలో ముఖ్యంగా రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదార్లుగా వున్న వారిలో నియతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. శ్వేత జాతీయల పార్టీగా అది తయారైంది. గత ఎన్నికలలో ట్రంప్‌కు తోడ్పడిన అంశాలలో అదొకటిగా పరిశీలకులు చెబుతున్నారు.

Protesters at the Women's March in Washington

   ట్రంప్‌ పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రపంచవ్యాపితంగా ఆరువందల నగరాలలో లక్షలాది మంది ప్రదర్శనలు చేసినట్లు ఒక వార్తా సంస్ధ కథనం. అమెరికాలో జరిగిన ప్రదర్శనలలో ఎంత మంది పాల్గొన్నారనేదానిపై తమ స్వంత లెక్కలు వేయలేదని, ప్రభుత్వ శాఖలు వేసిన అంచనాలను అందచేస్తున్నామని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. వాషింగ్టన్‌ నగరంలో అతి పెద్ద ప్రదర్శన జరిగింది. అత్తమీద కోపం దుత్త మీద చూపారన్న సామెత మాదిరి తనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న జనంపై విమర్శలకు దిగితే మరింతగా తన పరువు పోయే అవకాశం వున్నందున ఆ కోపాన్ని మీడియాపై ప్రదర్శించినట్లుగా వుంది. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రమాణాస్వీకారోత్సవంతో పోల్చి తన కార్యక్రమానికి జనం తక్కువగా వచ్చారని, కొన్ని ప్రాంతాలు ఖాళీగా వున్నాయని మీడియా రాయటం, చూపటంపై మరుసటి రోజు ట్రంప్‌ మండి పడ్డారు. సిఐఏ కార్యాలయ సందర్శన సందర్శన సందర్భంగా మాట్లాడుతూ భూమ్మీద నిజాయితీ లేని మనుషులు ఎవరంటే జర్నలిస్టులే అంటూ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పది, పదిహేను లక్షల మంది వచ్చినట్లుగా తనకు కనిపించిందని ట్రంప్‌ చెప్పారు. అయితే వాషింగ్టన్‌ మెట్రో రైళ్లలో ప్రయాణించిన వారి గురించి నమోదైన వివరాల ప్రకారం ఐదులక్షలకు పైగా వుండగా బరాక్‌ ఒబామా తొలిసారి ప్రమాణస్వీకారం సందర్భంగా పదకొండు లక్షలు, రెండవ సారి ఎనిమిది లక్షల వరకు ప్రయాణించినట్లు నమోదైంది. ఒక పత్రిక ట్రంప్‌ సభకు రెండున్నరలక్షల వరకు వచ్చినట్లు పేర్కొన్నది.దానిపై ట్రంప్‌ వ్యాఖ్యానిస్తూ అది అబద్దం తప్ప తప్పుకాదు, అంతకంటే ఎక్కువే వచ్చారు అన్నారు. ప్రమాణ స్వీకార సభకంటే నిరసన ప్రదర్శనకు ఎక్కువ మంది రావటం, మీడియాలో ప్రచారం రావటం ట్రంప్‌ ఆగ్రహానికి అసలు కారణం. ట్రంప్‌ అనుగ్రహం పొందే యత్నంలో భాగంగా అధ్యక్ష భవన సిబ్బంది అధిపతి రెయిన్స్‌ ప్రైబస్‌ కూడా మీడియాపై దండెత్తారు. ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ట్రంప్‌ను చట్ట విరుద్ధ అధ్యక్షుడిగా చిత్రించే మానసిక స్ధితికి మీడియా గురైందని దాన్ని చూస్తూ వూరుకోబోమని, ప్రతిరోజు చీల్చి చెండాడుతామని బెదిరింపులకు దిగారు. బరాక్‌ ఒబామా 2009 ప్రమాణ స్వీకార ఫొటోలను చూస్తే ట్రంప్‌ కార్యక్రమానికే ఎక్కువ మంది వచ్చినట్లు చూడవచ్చన్నారు. ట్రంప్‌ పత్రికా కార్యదర్శి సియాన్‌ స్పైసర్‌ మాట్లాడుతూ ఏడు లక్షల 20వేల మంది ప్రమాణ స్వీకారనికి వచ్చారంటూనే ఎవరి దగ్గరా లెక్కలు లేవన్నారు. స్పైసర్‌ లెక్కను అగ్రశ్రేణి మీడియా సంస్ధలు తప్పుడు లెక్కలుగా వర్ణించాయి. స్పైసర్‌ రుజువు చేయదగిన అవాస్తవాలు చెబుతున్నారని ఒక చర్చా కార్యక్రమంలో యాంకర్‌ చెప్పటంతో ట్రంప్‌ సహాయకురాలు కెలీయానే కాన్వే తమ ప త్రికా కార్యదర్శిని అలా సంబోధిస్తే మీడియాతో సంబంధాల గురించి పునరాలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు. వచ్చిన జనం నిజంగా ఎంత మందో లెక్క వేయటానికి అవకాశం లేదని ఆమె వ్యాఖ్యానించటంతో ఒక జర్నలిస్టు నవ్వాడు. దానికామె స్పందిస్తూ మీరు నన్ను చూసి నవ్వవచ్చు, మమ్మల్ని మీడియా ఎలా చూస్తున్నదో చెప్పటానికి మీ నవ్వే చిహ్నం అని వుడుక్కున్నారు. ఇలాంటి ట్రంప్‌, పరివార చర్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది వెండి తెరపై చూడాల్సిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా ప్రపంచీకరణ హీరోగా మారిందా ?

21 Saturday Jan 2017

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Chinese President, Donald trump, globalisation, Oxfam, WEF, World Economic Forum 2017, Xi Jinping

Image result for IS really China became Globalisation Hero

ఎం కోటేశ్వరరావు

   అమెరికా, బ్రిటన్‌ వేరే అజండాలతో ముందుకు పోతుంటే దవోస్‌ నిర్వాహకులు చైనా కమ్యూనిస్టుపార్టీ అనే కొత్త హీరోను ముందుకు తెచ్చారు అంటూ ప్రపంచ ధనికుల పత్రిక ఫోర్బ్స్‌ శీర్షిక పెట్టింది. వర్తమాన పరిస్థితులలో ఇలా రాసినందుకు ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు గర్వపడాలా లేక ప్రపంచ ధనికుల వేదికలో హీరోగా మారినందుకు లేదా మార్చినందుకు చైనా సోషలిజం గురించి అనుమానించాలా అన్న సందేహం ఎవరికైనా కలగటం సహజం. ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలలో పాల్గొన్న తొలి చైనా అధ్యక్షుడిగా చరిత్రకెక్కిన గ్జీ జిన్‌పింగ్‌ ప్రపంచీకరణను గట్టిగా సమర్ధించినట్లు వార్తలలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. వీటిని చూసిన తరువాత చూశారా మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం, చైనాలో పభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం, కమ్యూనిజం లేదు పాడు లేదు అని చెబుతున్నవారు మరింతగా రెచ్చి పోవచ్చు. రాబోయే రోజులలో చైనా కంటే మన దేశ అభివృద్ధి రేటు ఎక్కువగా వుంటుందని, అమెరికా తరువాత రెండో స్ధానంలో వున్న ‘మందుభాయీలను’ వెనక్కు నెట్టి ఆ స్ధానాన్ని ఆక్రమించాలని, పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రపంచంలో ఏ దేశాధినేత చేయని సాహసం చేశారని వంది మాగధుల పొగడ్తలు అందుకుంటున్న మన ప్రధాని నరేంద్రమోడీ ఈ సమావేశాల వైపు కన్నెత్తి చూడలేదు. మోడీగారు స్వదేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా ఎందుకు వుంటున్నారన్న విమర్శకు విదేశీ పెట్టుబడుల సాధనకు అని సిద్దం చేసుకున్న సమాధానం చెప్పారు. దవోస్‌ అంటే ప్రపంచ పెట్టుబడిదారులందరూ చేరే కేంద్రం. అలాంటి కేంద్రాన్ని సందర్శిస్తే అన్ని దేశాల పెట్టుబడిదారులను అక్కడే కలుసుకోవచ్చని నరేంద్రమోడీకి తట్టలేదా లేదా చెప్పిన వారు లేరా ? కనీసం చంద్రబాబును చూసైనా నేర్చుకోవచ్చు. చంద్రబాబూ ఆ సమావేశాలకు పోయి నేనూ వెళితే నా గొప్పేముంటుంది అనుకున్నారా ? సరే చంద్రబాబు నాయుడు తన పరివారంతో అత్యంత ఖరీదైన ఈ జాతరకు క్రమం తప్పకుండా వెళ్ళటం పెద్దలతో కలిసిన ఫొటోలు, ప్రకటనలు గుప్పించటం, తడిచి మోపెడు ఖర్చును జనంపై రుద్దటం గత ఆనవాయితీ, షరా మామూలే అనుకోండి. రాజుల సొమ్ము రాళ్లపాలైందన్న సామెతను తిరగరాసుకుంటే ఆంధ్రుల సొమ్ము చంద్రబాబు పరివార విదేశీ యాత్రలపాలు అని చెప్పాల్సి వుంటుంది. గతంలో చేసిన యాత్రలు, దిగిన ఫొటోలు, అయిన ఖర్చులు, పొందిన హామీలు, సాధించిన పెట్టుబడులపై శ్వేత పత్రం సమర్పిస్తే అసలు బండారం బయట పడుతుంది.

Image result for wef 2017

    ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు జరిగాయి. ‘ ప్రతి స్పందక మరియు జవాబుదారీ నాయకత్వం ‘ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలో అమలు జరుగుతున్న విధానాల పర్యవసానాల గురించి నేతలు ప్రతిస్పందించటం లేదని, జవాబుదారీయుతంగా వ్యవహరించ కుండా ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారనే విమర్శలు నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని భావించాలి. ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకు పోయే క్రమంలో ఎదురువుతున్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రపంచ బడా కార్పొరేట్‌ సంస్ధలు ఏర్పాటు చేసుకున్న వేదిక ఇది. కాల క్రమంలో కొన్ని మార్పులకు లోనైనప్పటికీ మౌలిక లక్ష్యం మారలేదు. ఏటా కనీసం ఐదువందల కోట్ల డాలర్లకు పైబడి లావాదేవీలు నిర్వహించే బడా కంపెనీలకు మాత్రమే దీనిలో సభ్యత్వం ఇస్తారు. ఎగ్జిబిషన్లలో ప్రవేశం పొందాలంటే ప్రవేశ రుసుం మాదిరి దీని సమావేశాలకు హాజరుకావాలంటే 68వేల స్విస్‌ ఫ్రాంక్‌లు (ఒక ఫ్రాంక్‌ మన రు 67.75 సమానం) అంటే 46లక్షల రూపాయలు చెల్లించాలి. ఇక ఎగ్జిబిషన్‌లోకి వెళ్లిన తరువాత జెయింట్‌ వీల్‌, రంగుల రాట్నం, ఫొటో తీయించుకోవటం ఇలా ప్రతిదానికి ఒక్కో రేటు చెల్లించాలి. దవోస్‌ సమావేశాలలో అలా అన్ని విభాగాలలో ప్రవేశం పొందాలంటే ఆరులక్షల ఫ్రాంకులు అంటే 40 కోట్ల 64లక్షల రూపాయలు చెల్లించాలి. అంత మొత్తం చెల్లించిన కంపెనీ సిఇఓ తనతో పాటు నలుగురిని తీసుకు వెళ్ల వచ్చు. అదనంగా తలకు 18వేల స్విస్‌ ఫ్రాంకులు చెల్లించాలి. చంద్రబాబు అండ్‌కోకు అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేదా ఆయన ద్వారా లబ్ది పొంద చూసే ఏ అనిల్‌ అంబానీయో, మరొక బడా కార్పొరేట్‌ కంపెనీయో ఆ ఖర్చులను భరించాల్సి వుంటుంది.

    దవోస్‌ వేదిక ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకుపోవాలని చూస్తుంటే ప్రపంచీకరణను వ్యతిరేకించే శక్తులు ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటం, నిరసనలు తెలపటం, పోటీ సమావేశాలు పెట్టటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కేవలం ఎనిమిదిమంది చేతులలో ప్రపంచంలోని 360 కోట్ల మంది పేదల దగ్గరున్న వాటికి సమానమైన సంపదలు కేంద్రీకృతమయ్యాయని ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించటం దీనిలో భాగమే. అటువంటి అంతరాలు పెంచే ప్రపంచీకరణను కమ్యూనిస్టు చైనా వ్యతిరేకించాలి కదా ? ఆ పని చేయకుండా జిన్‌పింగ్‌ అలా మాట్లాడటం ఏమిటి ? అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.

    ఐరోపా యూనియన్‌లో చేరితో ప్రయోజనం జరుగుతుందని అనుకున్నాము. అటువంటిదేమీ కనిపించటం లేదు కనుక బయటికి పోయి, విడిగా మా లావాదేవీలు మేము నిర్వహించుకుంటాం అంటూ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణే బ్రెక్సిట్‌ అన్నది తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో, ఎన్నికలు ముగిసిన తరువాత మెక్సికో, చైనా తదితర దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై పది నుంచి 50శాతం వరకు పన్ను విధిస్తామని, అమెరికా వుద్యోగాలను బయటికి పంపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఇంకా అనేక రక్షణ చర్యలు తీసుకోవటం తద్వారా వుద్యోగాలు కల్పిస్తానంటూ ఎన్నికల సందర్భంగా అమెరికా వూరూ వాడా అంతా తిరిగి చెప్పారు. ఇంకా అనేక ధనిక దేశాలలో అలాంటి మాటలు మాట్లాడేవారి వైపే మొగ్గేందుకు జనం సిద్ధ పడుతున్నారన్నది పరిణామాల విశ్లేషణ.( ప్రపంచ సంస్ధలకు మన మార్కెట్‌ తెరిచిన మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని ముఖ్యమైన యుపిఏ ప్రభుత్వ విధానాలన్నింటినీ, రూపాయి విలువ పతనాన్ని బిజెపి పదేళ్లపాటు వ్యతిరేకించి జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతకంటే దారుణంగా ఆ విధానాలనే మరింతగా అమలు జరుపుతోంది, దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది అది వేరే విషయం. ) నిజానికి ఇవన్నీ ప్రపంచ ధనిక దేశాలు ఇంతకాలం నుంచి చెబుతున్న ప్రపంచీకరణ , ప్రపంచ వాణిజ్య సంస్ధ, దాని తరఫున జరుగుతున్న చర్చల ప్రక్రియకు విరుద్దం.

    పెట్టుబడిదారీవర్గం, సామ్రాజ్యవాదులు వాణిజ్యం పేరుతో ప్రపంచం మీద వలసవాదాన్ని రుద్ధి ఎవరి బలం కొద్దీ వారు ప్రపంచాన్ని ముక్కలుగా చేసి పంచుకున్నారన్నది గత చరిత్ర. దానికి ప్రతిఘటన ఎదురుకావటం, చివరకు యుద్ధాలతో సామ్రాజ్యవాదులు చావు దెబ్బలు తిని తోక ముడిచారు. ఆ తరువాత తమ దోపిడీని కొనసొగించేందుకు రూపొందించిన నయా వలస లేదా నూతన దోపిడీ పద్దతులలో భాగమే ప్రపంచీకరణ. ఇది కమ్యూనిస్టులు కోరుకున్నది లేదా ముందుకు తెచ్చిన అవగాహన కాదు. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అన్న పిలుపు దోపిడీ సమాజాన్ని కూలదోయటానికి, సమసమాజాన్ని నిర్మించటానికి తప్ప దోపిడీకి కాదు.

    బ్రిటీష్‌ వారి స్ధానంలో ప్రపంచ సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల నాయకురాలిగా ముందుకు వచ్చిన అమెరికా ఒకవైపు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటంతో పాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో ఆవిర్బవించిన నూతన సోషలిస్టు రాజ్యాలను, వాటికి మార్గదర్శనం చేస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని దెబ్బతీయటం అనే లక్ష్యాన్ని కూడా ఎంచుకున్నారు. దానిలో భాగంగానే సోషలిస్టు దేశాలను దెబ్బతీయటానికి, వాటికి ఆధునిక పరిజ్ఞానం, అవసరమైన పెట్టుబడులు అందకుండా చేసి సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానమే దిక్కు అని చెప్పేందుకు గతంలో పెట్టుబడిదారీ దేశాలు అనేక చర్యలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.దానిలో భాగంగానే అమెరికన్లు దశాబ్దాల తరబడి క్యూబాను అష్టదిగ్బంధనం కావించారు. ఈ పూర్వరంగంలోనే చైనాతో సహా మిగిలిన సోషలిస్టు దేశాలు సోషలిస్టు సంస్కరణలకు తెరతీశాయి. వీటిపై కమ్యూనిస్టుపార్టీలు, లేదా వామపక్ష మేథావులలో కొన్ని భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ఫోర్బ్స్‌ వంటి పత్రికలు చైనా అధ్యక్షుడి ప్రసంగానికి ప్రపంచీకరణను సమర్ధించే హీరోగా వర్ణిస్తే చైనాలో అంతర్భాగంగా వుంటూ పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ మీడియా విలన్‌గా పేర్కొన్న విషయాన్ని గమనించాలి.

   చైనా సంస్కరణలతో నిమిత్తం లేకుండానే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే నూతన పరిస్థితులలో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు నూతన ఎత్తుగడలతో సామ్రాజ్యవాదులు నాంది పలికారు. దాని పర్యవసానమే బ్రెట్టన్‌ వుడ్‌ కవలలుగా పిలుస్తున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ. అవి రెండూ అంతర్జాతీయ ద్రవ్య విధానాన్ని రూపొందించాయి. ఆ విధానంలో అంతర్భాగంగా వుండే వాణిజ్యం సాఫీగా సాగేందుకు, పెట్టుబడులకు రక్షణ కల్పించటంతో పాటు వాణిజ్య సరళీకరణకు గాను వివిధ దేశాలు అప్పటి వరకు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలను సడలించేందుకు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌ (గాట్‌)పై 23 దేశాలు జెనీవాలో ఏడు నెలలపాటు చర్చలు జరిపి 1947 అక్టోబరు 30న సంతకాలు చేశాయి. తరువాత దాని అమలులో తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చలు ఎవరు ప్రారంభిస్తే లేదా ఎక్కడ ప్రారంభమైతే ఆ దఫా చర్చలు అని పిలిచేవారు. అలా ఫ్రాన్స్‌లోని అనెసీలో రెండవ దఫా చర్చలు 1949లో 34 దేశాలతో ప్రారంభమై ఐదు నెలల్లో ఐదువేల సరకులపై పన్నుల తగ్గింపునకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1950 టొరొక్వే(బ్రిటన్‌) ఎనిమిదినెలలు, 1956 జనీవా-2 ఐదునెలలు, 1960 దిలియాన్‌(అమెరికా మంత్రి) 11నెలలు, 1964 కెన్నడీ(అమెరికా అధ్యక్షుడు) 37నెలలు, 1973 టోక్యో 74నెలలు, 1986 వురుగ్వే 87నెలల చర్చల తరువాత ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చింది. దాని ఆధ్వర్యంలో 2001లో ప్రారంభమైన దోహా చర్చలు 16 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఎప్పుడు వస్తాయో తెలియని స్ధితి. దీనికి కారకులు ఎవరు? మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటి కొస్తూ మాకేం తెస్తావ్‌ అంటున్న ధనిక దేశాల అత్యాశ, పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరుగుతున్న సంక్షోభమే అన్నది కొందరి అభిప్రాయం.

   గాట్‌ ఒప్పందం చేసుకున్న తొలి 23 దేశాలలో చైనా ఒకటి అయినప్పటికీ ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన ఏడాదికి చైనాలో కమ్యూనిస్టుల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అందువలన ప్రపంచ వాణిజ్య చర్చలలో అది భాగస్వామి కాలేదు. 1978లో చైనా సంస్కరణలకు తెరతీసి విదేశీ పెట్టుబడులు, సంస్థల ప్రవేశానికి వీలు కల్పించిన తరువాత 1986లో పరిశీలక హోదాతో అనుమతించారు. తరువాత మిగతా ఏ దేశానికీ లేని విధంగా కఠినమైన షరతులు విధించి 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు పూర్తి సభ్వత్వం ఇచ్చారు.ఈ పూర్వరంగంలో చైనా అధ్యక్షుడి మాటలను పరిశీలించాల్సి వుంటుంది.

     పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది కీలకం అన్న చైనా సామెత మాదిరి తమ దేశంలోని 95 కోట్ల మంది జనాభా(1978)కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమదైన లక్షణాలతో కూడిన సోషలిస్టు సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది. అప్పటికే మార్కెట్లకోసం అర్రులు చాస్తున్న అమెరికా, తదితర పెట్టుబడిదారీ దేశాలు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే, అక్కడి సోషలిస్టు వ్యవస్ధను కూడా దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అందుకు చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. మంచి గాలి, వెలుతురు కోసం కిటికీలను తెరుస్తాము. వాటితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి. అయితే వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు. దానికి అనుగుణ్యంగా తియన్‌మెన్‌ స్క్వేర్‌ పేరుతో జరిగిన కుట్రను చైనా ప్రభుత్వం వమ్ము చేసింది.

   బ్రిటీష్‌ వారు తమ లాభాల కోసం వేసుకున్న రైళ్లలో వారిని దేశం నుంచి పంపివేసేందుకు స్వాతంత్య్ర పోరాటం సాగించిన మహాత్మాగాంధీకూడా ప్రయాణించారు. అవే రైళ్లు గాంధీతో పాటు ఆయన ప్రాణాలు తీసిన హిందూ మతోన్మాది గాడ్సేను కూడా మోశాయన్నదీ తెలిసిందే. అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ అన్నట్లుగా ప్రపంచీకరణను ధనిక దేశాలు ఒకందుకు ప్రారంభిస్తే దాని ద్వారా వచ్చిన నూతన అవకాశాన్ని చైనా, వియత్నాం సోషలిస్టు దేశాలు తమ జనాభా జీవన ప్రమాణాలు పెంచేందుకు వుపయోగించుకున్నాయి. ప్రపంచీకరణ విధానాల ద్వారా తమకు అందుబాటులోకి వచ్చిన చైనా మార్కెట్‌లో లాభాలు పిండుకోవాలని ప్రపంచ ధనిక దేశాలు ఆశించాయి. తమ దగ్గర వున్న అపార శ్రమశక్తిని, ప్రజానుకూల యాజమాన్య పద్దతులను పెట్టుబడిగా పెట్టి జనం కోసం పని చేయాలని కమ్యూనిస్టులు భావించారు. నలభై సంవత్సరాల లావాదేవీలు లేదా అనుభవాన్ని మదింపు చేస్తే తేలిందేమిటి? పశ్చిమ దేశాల ఎగుమతి మార్కెట్‌పై ఆధారపడిన చైనా అదిరిపోయే అభివృద్ది రేటుతో ముందుకు పోయింది. దాని నుంచి దిగుమతులు చేసుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్‌ శక్తులు లాభాలు ఆర్జించాయి. అందుకే మన దేశంలోని కార్పొరేట్‌ శక్తులు కూడా చైనా నుంచి లబ్దిపొందాలని చూస్తున్నాయి. అందుకే వాటికి ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌, బిజెపి వంటి జాతీయ పార్టీలతో పాటు చంద్రబాబు, కెసిఆర్‌ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా చైనా మోజుతో యాత్రలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. అమెరికా నుంచి అరువుతెచ్చుకున్న పద్దతులతో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం ఒకవైపు జనంలో కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను రెచ్చగొడుతూనే మరోవైపు అధికారికంగా ఆ మడి బట్టలను విప్పి గట్టున పెట్టి చైనాతో సంబంధాలను కొనసాగించక తప్పనివిధంగా కార్పొరేట్లు దాని మెడలను వంచాయి.

   పెట్టుబడిదారీ విధాన పంధాను అనుసరిస్తున్న దేశాల పాలకవర్గాలు ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్లను మాత్రమే పెంచి తమ కార్మికవర్గానికి హాని చేసే విధానాలు అనుసరిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం అదే. అందుకే అక్కడ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలను వ్యతిరేకించిన శక్తుల వెనుక జనం సమీకృతమయ్యారు. కొన్ని మినహాయింపులతో సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్న చైనా అదే ప్రపంచీకరణను తన కార్మిక వర్గ జీవన ప్రమాణాల మెరుగుదలకు వుపయోగిస్తున్నది. అందుకే ధనిక దేశాలలో తలెత్తిన సంక్షోభ ప్రభావం పడి కొంత మేర అభివృద్ధి వేగం తగ్గింది తప్ప సంక్షోభంలో పడలేదు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. చైనాలో బిలియనీర్లు ఎలా అభివృద్ధి చెందుతున్నారు? కార్మికవర్గాన్ని దోపిడీ చేయకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? వారు చైనా సోషలిస్టు వ్యవస్ధలను కొనసాగనిస్తారా? మరో సందర్భంలో వాటి గురించి చర్చించవచ్చు.ప్రపంచీకరణ పేరుతో మన వంటి దేశాలలో జనంపై రుద్దుతున్న భారాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక వర్గం పోరాటాలు చేయాల్సిందే. దానిలో ఎలాంటి రాజీ వుండనవసరం లేదు. చైనాలో కమ్యూనిస్టులు అధికారంలో వున్నారు. ప్రపంచీకరణ ఫలితాలను జనాలకు అందిస్తున్నారు. ఒకే దేశం రెండు వ్యవస్ధల పేరుతో 2050 వరకు హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని వాటి విలీనం సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు కనుక, సంస్కరణలలో భాగంగా పరిమితంగా అయినా ప్రయివేటు పెట్టుబడులను అనుమతించింది కనుక వారు కూడా లబ్ది పొందుతూ వుండవచ్చు. ఆ విధానాల వలన తలెత్తే సమస్యలతో రాబోయే రోజులలో ఏం చేస్తారన్నది చైనీయుల అంతర్గత వ్యవహారం.

   చైనా అధ్యక్షుడు దవోస్‌ సమావేశంలో రక్షణాత్మక చర్యల గురించి చెప్పిన అంశాలు తన వరకు వచ్చేసరికి అమలు జరపటం లేదని చైనాలో అంతర్భాగమైనా పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికలు, అక్కడి పెట్టుబడిదారీ మేథావులు జన్‌పింగ్‌ను ఒక విలన్‌గా వర్ణిస్తున్నారు. తమ దేశానికి చెందిన సంస్ధలను విదేశాలలో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్న చైనా ప్రభుత్వం స్వదేశంలో విదేశీ పెట్టుబడులపై అనేక ఆంక్షలను విధిస్తున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందచేస్తూ స్ధానిక కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలనే షరతులు పెడుతున్నదని వారు విమర్శిస్తున్నారు.

   దవోస్‌ సమావేశాలలో చైనా అధ్యక్షుడు ప్రపంచీకరణపై సిద్ధాంత చర్చ చేయలేదు. ప్రస్తుతం అమలులో వున్న దానికి భిన్నంగా రక్షణాత్మక చర్యలలో భాగంగా ఎవరైనా వాణిజ్య యుద్ధానికి తలపడితే విజేతలంటూ ఎవరూ వుండరన్నది ప్రధాన హెచ్చరిక. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఆకస్మికంగా వాటిలో మార్పులు చేస్తే అన్ని దేశాలూ నష్టపోతాయి. అంటే బయట గాలీ, వెలుతురు వుంటే ఎవరైనా అవి లేని ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూస్తే ఎలా వుంటుందో రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అలాగే వుంటుందని గ్జీ హితవు చెప్పారు. ద్రవ్య పెట్టుబడి అధిక లాభాల కోసం వెంటపడటం, ఏ మాత్రం క్రమబద్దీకరణ లేకపోవటం వల్లే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం అన్నారు. తాము ప్రపంచీకరణకు కట్టుబడి వున్నామని, మరింతగా క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తున్నామని, పెట్టుబడులు పెట్టేవారికి మెరుగైన సమాన అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తమది కమ్యూనిస్టు నమూనా అంటూ అందరికీ సరిపోయే ఒకే పద్దతి లేదన్నారు. సముద్రం మధ్యలో తుపానులొస్తే వెనక్కు తిరిగిపోయే అలవాటును ప్రోత్సహించకూడదని చెప్పారు.

   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట అంటూ రక్షణాత్మక చర్యలు చేపడితే అమెరికా-చైనా రెండూ నష్టపోతాయని, అందువలన మాటలు తప్ప రెండు దేశాలూ రాజీపడతాయని ఐరోపాలోని వారు భావిస్తున్నారు. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వాణిజ్య యుద్ధ పర్యవసానాల గురించి హెచ్చరించింది. చైనా తనకు కావాల్సిన వ్యవసాయ వుత్పత్తులను పెద్ద మొత్తంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే, చైనా నుంచి అమెరికన్లు దుస్తులు, బొమ్మలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందుతోంది. అమెరికాలో చైనా వాణిజ్యం, ఇతర ఆర్ధిక లావాదేవీల కారణంగా 26లక్షల వుద్యోగాలు కల్పిస్తున్నదని, అమెరికా జిడిపికి 1.2శాతం సమకూర్చిందని 2015 నివేదికలో అమెరికా-చైనా వాణిజ్య మండలి నివేదిక పేర్కొన్నది. చైనా నుంచి వస్తు దిగుమతుల కారణంగా అమెరికాలోని ప్రతి కుటుంబానికి సగటున ఏడాదికి 850 డాలర్లు ఆదాఅవుతున్నాయని ఒక విశ్లేషణ తెలిపింది. అన్నింటి కంటే అనేక అమెరికన్‌ కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలను పెట్టి తమకు అవసరమైన వస్తువులను చౌకగా తయారు చేసుకొని తిరిగి తమ దేశానికే దిగుమతి చేసుకుంటున్నాయి. అందువలన ట్రంప్‌ చెప్పినట్లు చైనా నుంచి వచ్చే వాటిపై దిగుమతి సుంకం విధిస్తే నష్టపోయే వాటిలో అమెరికన్‌ కంపెనీలు కూడా వుంటాయని గ్లోబల్‌ టైమ్స్‌ విశ్లేషకులు హెచ్చరించారు. అదే విషయాన్ని దవోస్‌లో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్‌ సామెతలతో, తమలపాకులతో కొట్టినట్లుగా చెప్పారు. దానిని గ్రహించకుండా ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగితే అది మన దేశంతో సహా ప్రపంచమంతటికీ తీరని నష్టాలకు దారి తీస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వుడకకే వుడకకే ఓ వుల్లి గడ్డా నీ వెంత వుడికినా నీ కంపు పోదు !

16 Monday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Father of the Nation, Gandhi's Charkha Pose, KVIC, KVIC calendar, Mahatama Gandhi, mahatma, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

    తెల్లగా వున్నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా, వుప్పు కప్పురంబు చూడ ఒక్కటిగ నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా అన్న ప్రఖ్యాత తెలుగు సామెతలు, సామ్యాల గురించి చాలా మంది వినే వుంటారు. నా చిన్న తనంలో ఫొటో తీయించుకోవటం అన్నది చాలా మందికి ఒక తీరని కల. తిరునాళ్లకు వెళ్లినపుడు లేదా పట్టణాలకు వెళ్లినపుడు అక్కడ స్టూడియోలకు వెళితే మోటారు సైకిలు మీద, గుర్రం మీద కూర్చున్నట్లు ఫొటోలు తీయించుకుంటే చెప్పలేని ఆనందం. ఎందుకంటే అవి ఆ నాడు సామాన్యులకు అందుబాటులో వుండేవి కాదు. ఎవరైనా గ్రామానికి మోటార్‌ సైకిల్‌ మీద వస్తే గ్రామం మొత్తం అబ్బో అన్నట్లుగా చూసేది, ఒకప్పుడు బైసికిలు(సైకిల్‌ను బైసికిలుగా ఆమె నోట మొదటిసారి విన్నాను) ఎక్కినపుడు కూడా అలాగే చూసేవారని మా తాతమ్మ చెప్పేది.

   ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీకి కూడా అలాంటి సరదాయే కలిగిందా అన్న అనుమానం వస్తోంది. లూధియానాలో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మా గాంధీ మాదిరి చరఖా ముందు కూర్చొన్నపుడు తీసిన ఫొటోను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌, డైరీలపై ముద్రించారు. అసలు ఖాదీ అంటే సామాన్యులు వాడే ముతక రకం వస్త్రం. ఇస్త్రీ లేకుండా ఖాదీ దుస్తులు ధరిస్తే అదేదో సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు. ఇప్పుడు ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీవరకు చిల్లర రాజకీయాలు చేసే వారు, ఫ్యాన్సీగా ధనికులు తప్ప సామాన్యులెవరూ వాడటం లేదు. వాటిని ధరించి పొలాల్లో, ఫ్యాక్టరీలలో పనిచేసే సామాన్యులెవరూ మనకు కనిపించరు. ఖద్దరు మాదిరి కనిపించే మర మగ్గాలు లేదా మిల్లు వస్త్రాలు మార్కెట్‌లో ఖాదీగా చెలామణి అవుతున్నాయన్నది కూడా వాస్తవమే.

    ఇక నరేంద్రమోడీ ఫొటోలంటే పడి చస్తారనేది ఇప్పటికి అనేక సందర్భాలలో రుజువైంది. ప్రధాన మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వున్న ఏ శాఖ లేదా సంస్ధ కాలండర్‌లో అయినా ఫొటో వేయటాన్ని తప్పుపట్టనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో జనంలో స్వాతంత్య్ర కాంక్ష రగిల్చేందుకు గాంధీ ఖాదీ తయారీని విదేశీ వ్యతిరేక స్వదేశీ వుద్యమంగా చేెపట్టారు, స్వయంగా వడికారు. గాంధీ అంటే ఖాదీ, ఖాదీ అంటే గాంధీ అన్న నానుడి వునికిలోకి వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీ విదేశీ వస్తువులకు మన తలపులను మరింత బార్లా తెరిచి తానొక బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాలనుకుంటున్నారు. దేశానికి ఏ మాత్రం వుపయోగపడినా కూడా తప్పులేదు. అంబానీ జియో వేదిక, ప్రకటనలు చూస్తే మనకు అది కనిపిస్తుంది. ఖాదీ విషయంలో ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో, ప్రధానిగా దేశంలో ప్రత్యేకంగా చేసిందేమీలేదు. ఖాదీ నూలు వడికే వారి బతుకుల దైన్య స్ధితే అందుకు నిదర్శనం. తాజా వివాదానికి వస్తే ఖాదీ సంస్ధ కాలెండర్‌పై గాంధీని అనుకరించిన ఫొటో వేయటమే అభ్యంతరకరం. చారిత్మ్రాత్మక గాంధీ ఫొటోకు, నరేంద్రమోడీ పాల్గొన్న ఒక సభలోని చిత్రానికి తేడా ఏమిటంటే ఆయన చొక్కా వేసుకోలేదు, సాదాసీదాగా నిజంగా నూలు వడుకుతున్నపుడు తీసింది. మోడీది డిజైన్డ్‌ చరఖా, ఖాదీ చొక్కా, కుర్తా వేసుకుకొని ఫొటో కోసం ఫోజిచ్చిన చిత్రం. అందుకే చూసే వారికి మొదటి ఫొటో సహజంగా కనిపించింది, రెండవ చిత్రం ఎబ్బెట్టుగా వుంది. బహిరంగ సభలలో మిత్రోం అంటూ సంబోధించే ఫొజుతో వున్న ఏ ఫొటోను అయినా ఒకవైపు, రెండవ వైపు గాంధీ ఫొటోను కాలండర్‌పై ముద్రించి వుంటే ఇంతటి వివాదం తలెత్తి వుండేది కాదు.

   ఖాదీ సంస్ధ కాలండర్‌పై గాంధీ చిత్రాన్ని తొలగించి మోడీ బొమ్మ ముద్రించటంతో అనేక మంది మనోభావాలు గాయపడ్డాయి . అయితే మాకేంటి అంటారా పోనీ అదైనా చెప్పండి. కాలండర్‌పై గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రం పెట్టటాన్ని ఖాదీ సంస్ధ సమర్ధించుకున్న తీరు చిత్రంగా వుంది. ప్రధాని బొమ్మ పెట్టి ఆయన అనుగ్రహం పొందేందుకు ఖాదీ సంస్ద అధికారులు ప్రయత్నిస్తే వారి చర్యను సమర్ధించి నరేంద్రమోడీ కార్యాలయం ప్రజల మనోభావాలను గాయపరిచింది. ఇక హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజె అర్‌ఎస్‌ఎస్‌ పరివార అంతరంగాన్ని బయటపెట్టారు.

   తమ చర్యను ఖాదీ కమిషన్‌ అడ్డంగా సమర్ధించుకొంటోంది. ‘ గాంధీ తత్వశాస్త్రం, ఆశయాలు, ఆలోచనల ప్రాతిపదికనే మొత్తం ఖాదీ పరిశ్రమ ఏర్పడింది. ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌ ఆత్మ ఆయన, అలాంటి గాంధీని విస్మరించే ప్రశ్నే లేదు. నరేంద్రమోడీ ఎంతో కాలం నుంచి ఖాదీని ధరిస్తున్నారు. ఖాదీతో తన స్వంత శైలిని అభివృద్ధి చేసుకుంటూ సామాన్య జనంలోనూ విదేశీ అతిధులలోనూ ఎంతో ప్రాచుర్యం కల్పించారు. వాస్తవానికి ఆయన ఖాదీకి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌, ఆయన భావనలు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌కు సరిపోయాయి. బొమ్మల ముద్రణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు, సాంప్రదాయాలు లేవు, గతంలో కూడా ముద్రించని సందర్భాలు వున్నాయని’ కమిషన్‌ చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా చెప్పారు. ప్రధాని కార్యాలయం కూడా అనవసరమైన రచ్చ అంటూ కొట్టి పారవేసిందని, 1996, 2005, 2011,12,13, 16లో గాంధీ ఫొటో లేదని, కాంగ్రెస్‌ యాభై సంవత్సరాల పాలనలో రెండు నుంచి ఏడుశాతం చొప్పున మాత్రమే ఖాదీ అమ్మకాలు పెరిగాయని అదే గత రెండు సంవత్సరాలలో 34శాతం పెరిగాయంటే ఖాదీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మోడీ చేసిన యత్నాలే కారణమని కార్యాలయ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానిలో వాస్తవాంశాల కొస్తే మోడీ హయాంలో పెరుగుదల ఏడుశాతమే తప్ప 34శాతం కాదని వార్తలు వచ్చాయి. మిగతా విషయాల కొస్తే కార్యాలయ వర్గాలు పేర్కొన్న ప్రకారమైనా కొన్ని తప్ప మిగతా సంవత్సరాలన్నీ గాంధీ బొమ్మనే ముద్రించారు, ఆయన బోధనలనే ప్రచురించారు తప్ప, దాని బదులు మరొక ప్రధాని బొమ్మను ముద్రించినట్లు , వేరే వారి సుభాషితాలను పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం, ఖాదీ కమిషన్‌గానీ చెప్పలేదు. మోడీ ఖాదీ ధరిస్తారు కనుక అమ్మకాలు ఎక్కువ అవుతాయన్నది మరొక వాదన, మిగతా ప్రధానులెవరూ ఖాదీ ధరించలేదా ? చేనేత, ఖాదీ ధరించమని ఏదో ఒక సందర్భంలో చెప్పలేదా ?

    సేనాని అయిన ప్రధాని కార్యాలయమే సమర్ధనకు దిగిన తరువాత సైనికులు మామూలుగా వుంటారా ? ఆదివారం నాడు హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజ్‌ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోతున్నదని, అందువలన వాటిపై కూడా క్రమంగా ఆ బొమ్మ అంతరించిపోతుందన్నాడు.ఖాదీతో గాంధీ పేరు ముడిపడివున్నంత కాలం దాని అమ్మకాలు పెద్దగా లేవు, తగ్గిపోయాయి. కాలండెర్‌పై బొమ్మ తీసివేయటం మంచి పని.మోడీ బొమ్మ పెట్టిన తరువాత 14శాతం పెరిగాయని అనిల్‌ వ్యాఖ్యానించాడు. వాటిపై విమర్శలు రావటంతో హర్యానా ముఖమంత్రి ఖట్టర్‌ ఒక ప్రకటన చేసి అవి అతని వ్యక్తిగత వ్యాఖ్యలని కొట్టిపారవేశారు. పార్టీకి సంబంధం లేదన్నారు. తరువాత తాను అన్న మాటలను వుపసంహరించుకున్నట్లు అనిల్‌ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. బిజెపి నేతలు ఇలాంటి వదరుబోతు వ్యాఖ్యలు చేయటం తరువాత వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించటం ఒక ఎత్తుగడ, ఒక అలవాటు. కడుపులో వున్నదే బయటికి వస్తుంది తప్ప వేరొకటి కాదు. వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ అవి తిరుగుతూ వాటిపని అవి చేస్తాయి.

  ఖాదీ వినియోగం పెంపుదలకు నరేంద్రమోడీ ఎంతగానో కృషి చేస్తున్నారనేది ఒక ప్రచారం మాత్రమే. గ్రామాలలో ఖాదీ దారాలను తయారు చేసే కార్మికులకు కనీసవేతనాలు కూడా రావటం లేదని రోజుకు 125-150 మాత్రమే వేతనం వస్తున్నట్లు కొందరు పరిశోధకులు మూడు నెలల క్రితం తమ పత్రంలో ప్రకటించారు.

   కాళ్లు తుడుచుకునే పట్టాలను మన జాతీయ పతాక రంగులు, చిహ్నంతో తయారు చేసి విక్రయించటాన్ని వెంటనే నిలిపి వేయాలని, భారతీయుల మనోభావాలను గౌరవించాలని అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజం అమెజాన్‌ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఈ మేరకు మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముందు ఒక ట్వీట్‌ చేసి పాలనా పద్దతుల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. వుపసంహరించకపోతే అమెజాన్‌ కంపెనీ అధికారుల వీసాలను పునరుద్ధరించబోమని హెచ్చరించారు. తరువాత విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని మన రాయబారిద్వారా అమెజాన్‌ కంపెనీకి నిరసన తెలియ చేయమని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని అమెజాన్‌ కంపెనీ చెప్పిందనుకోండి. నిజానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా ట్విటర్‌ ద్వారా హెచ్చరించటం విశేషం.మన జాతీయ జెండాను అలా వుపయోగించటం చట్టరీత్యా నేరమే కాకుండా, మన మనోభావాలను దెబ్బతీసిన అంతర్జాతీయ వాణిజ్య సంస్ధకు హెచ్చరికలు చేసిన పాలకులు గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రాన్ని పెట్టి మనోభావాలను గాయపరచటాన్ని ఏమనాలి?

    గాంధీని చంపిన గాడ్సే వారసులు తామరతంపరగా చెలరేగుతున్న ఈ తరుణంలో అలాంటి గౌరవం జాతిపితకు ఇస్తారని ఆశించటమే అసహజం. గాంధీ, గాంధీయిజానికి మేము వ్యతిరేకం, దాన్ని ఏడు నిలువుల లోతున పాతేస్తాం, అందుకే గాంధీని జనం మరిచిపోయేట్లు చేయదలచుకున్నాం అని నిజాయితీగా ప్రకటించి చేస్తే అదో పద్దతి. అలాగాక కొందరు అంటున్నట్లు చరఖా ముందు కూర్చొని గాంధీని అనుకరించి ఫొటోలు దిగితే నరేంద్రమోడీ మహాత్ముడు అవుతారా, ఆయనపై పడిన మచ్చలు తొలుగుతాయా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ట్రంప్‌ ద్వారా రష్యాతో రాజీకి అమెరికన్లు ప్రయత్నిస్తున్నారా ?

14 Saturday Jan 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

anti-Beijing, Beijing, China, Donald trump, Moscow, RUSSIA, Vladimir Putin, Washington, Washington’s new pro-Moscow

ఎం కోటేశ్వరరావు

    భవిష్యత్‌లో తమ దేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతుందని , దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి అబద్దాలకోరుగా పేరు తెచ్చుకున్న ఒక అధ్యక్షుడిని తమ వారసులు ఎన్నుకుంటారని గానీ 240 సంవత్సరాల క్రితం స్వాతంత్య్ర సాధనకు పోరాడిన అమెరికన్లు అస్సలు వూహించి వుండరు. వారి చరిత్రలో ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించకుండా, ఏ విధానాన్ని అమలు జరపకుండానే ప్రజలలో పలుకుబడి కోల్పోయి, వివాదాల మధ్య నూతన అధ్యక్షుడు వైట్‌ హౌస్‌లో ఆశీనుడౌతాడని గానీ ఏమాత్రం ఆలోచించి వుండరు. ఇదే సమయంలో ట్రంప్‌ వ్యవహరిస్తున్న అపారదర్శక తీరును చూస్తే తరుణం రాకుండానే ముందే కూసిన కోయిల మాదిరి కొంత మంది విశ్లేషకులకు రష్యాతో అమెరికా పాలకవర్గం సయోధ్యకు అమెరికా పాలకవర్గం పావులు కదుపుతోందా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. వర్తమాన పరిస్థితులలో అది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా బలంగానే వున్నాయి. ప్రతిదానికీ అయితే గియితే అనే మినహాయింపులు, బొమ్మా బొరుసులూ వున్నప్పటికీ ఎత్తుగడలు, తాత్కాలికంగానే అయినా అంతర్జాతీయ పరిణామాలలో ఏదీ అసాధ్యం కాదని గత చరిత్ర రుజువు చేసింది.

    సాధారణ జనం ఓట్లలో మైనారిటీ, అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో మెజారిటీ తెచ్చుకొని అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించబోయే డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి సారిగా, పదవి నుంచి దిగిపోయే బరాక్‌ ఒబామా కొద్ది రోజుల క్రితం చివరి విలేకర్ల సమావేశాలు నిర్వహించారు. గత ఎనిమిది సంవత్సరాల ఏలుబడిని అమెరికన్లతో పాటు ప్రపంచమంతా చూసింది గనుక పదవి నుంచి దిగిపోయే ఒబామా చెప్పిన దానిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. మొత్తం పదవీ కాలమంతా దేశాన్ని దురాక్రమణ యుద్ధాలలో నిమగ్నం చేసి, కోట్లాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేసి తగుదునమ్మా అంటూ ప్రపంచ శాంతి బహుమతి స్వీకరించి నోబెల్‌నే అపహాస్యం చేసిన పెద్దమనిషిగా చరిత్రకెక్కాడు. తొలి పత్రికా గోష్టి కంటే ముందే తన మంత్రులను ఎంపిక చేసిన తీరు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన విధానాలు ఎలా వుండబోతున్నాయో ట్రంప్‌ స్పష్టం చేశారు కనుక తనపై వార్తలు రాసిన కొన్ని మీడియా సంస్ధలకు హెచ్చరికలు చేయటం మినహా పత్రికా గోష్టిలో సరికొత్తగా చెప్పిందేమీ లేదు.

    నిత్యం అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడి కొట్టుకు చచ్చినట్లుగా అమెరికా గూఢచార సంస్ధల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ప్రతి దేశ అంతర్గత వ్యవహారాలలో ఏదో ఒక రూపంలో జోక్యం చేసుకొని, తన పలుకుబడి, ప్రభావాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు ఎదుర్కొనే అమెరికా ఇప్పుడు తమ వ్యవహారాలలో రష్యా జోక్యం గురించి అవుననీ, కాదనీ చెప్పలేక కొట్టుమిట్టాడుతున్న స్ధితిలో వుంది. అది కూడా నాటకంలో అంతర్నాటకం కూడా కావచ్చునని కొందరు అనుకోవచ్చు. నిత్యం మనం చూసే హాలీవుడ్‌ సినిమాలలో సిఐఏ, ఎఫ్‌బిఐ ఏజంట్లు ఎంతో తెలివిగలవారు , అంతిమ విజయం సాధించేవారుగానూ, మిగతా ప్రపంచ దేశాల వారంతా తెలివితక్కువ వాజమ్మలుగా చిత్రించి చూపుతారు. ఇప్పుడు రష్యన్ల ప్రమేయం గురించిన వివాదంలో అమెరికా నిఘా సంస్ధల అధికారులు పరస్పర విరుద్ధంగా చెబుతూ నగుబాట్ల పాలవుతున్నారు. ఎన్నికల సందర్భంగా రష్యన్‌ గూఢచారులు డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలకు సంబంధించిన వ్యక్తిగత రంకు బొంకులు, వ్యాపారలావాదేవీలు, ఇతర విషయాలన్నింటినీ సేకరించారట. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌కు విజయం చేకూర్చేందుకు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారి సమాచారాన్ని మాత్రమే బహిర్గతం చేశారన్నది ఒక కథనం. దౌత్యపరమైన ఎత్తులు జిత్తులలో అదొక భాగం కావచ్చు. అనేక ప్రపంచ వ్యవహారాలలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు అనుసరించిన రష్యా వ్యతిరేక వైఖరికి బదులు తీర్చుకొనేందుకు, తాము తలచుకొంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలనే ప్రభావితం చేయగలమని ప్రపంచానికి తెలియ చెప్పేందుకు కావచ్చు. తాము కోరుకున్న డెమోక్రటిక్‌ పార్టీ ఓడిపోయి డోనాల్ట్‌ ట్రంప్‌ ఎన్నికయ్యాడు కనుక అతగాడిని కూడా అదుపులో పెట్టుకొనేందుకు ఆ పెద్దమనిషి బలహీనతలు, రంకు, బొంకులు తదితర సమాచారం కూడా తమ దగ్గర వుందని సంకేతాలు, శాంపిల్‌ సమాచారాన్ని పంపి బ్లాక్‌ మెయిలు చేసేందుకు పూనుకుందన్నది మరొక ఆరోపణ.

   అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లు ఇప్పుడు అమెరికాలో ఎవరు ఏం మాట్లాడినా చివరికి దీని దగ్గరకే వస్తున్నది. ఏ యుద్ధంలో అయినా ముందు బలయ్యేది సత్యం. ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరుగుతోంది. విరుద్ధ కథనాలు, సమాచారాలతో జుట్టుపీక్కొనే పరిస్థితి. జోక్యం చేసుకున్నట్లు గూఢచార సంస్ధలు నివేదించాయి, అయితే వాటి దగ్గర ఆధారాలు లేవు. నిజమే అని అంగీకరించటం ట్రంప్‌కు ఇబ్బంది, అమెరికా పరువు పోతుంది. కాదని ఖండిస్తే డెమోక్రటిక్‌ పార్టీ, దాని అనుకూల మీడియా వెల్లడిస్తున్న కధనాలకు సరైన సమాధానం లేదు. తనపై రష్యా సేకరించిందన్న సమాచారం గురించి కథనాలు గుప్పించిన మీడియా సంస్ధలపై ట్రంప్‌ తన అధికారిక తొలి పత్రికా గోష్టిలో విరుచుకుపడ్డారు.బజ్‌ఫీడ్‌ అనే ఆన్‌లైన్‌ మీడియా ట్రంప్‌కు సంబంధించి రష్యన్ల దగ్గర వున్నదనే పేరుతో 35పేజీల సమాచారాన్ని ప్రచురించింది. అదంతా చెత్త అంటూ దీనికి గాను ఆ సంస్ధ పర్యవసానాలను అనుభవిస్తుందని ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. ఆ సమాచారమంతా పిల్లలు ఆడుకొనేందుకు దుకాణాల్లో కొనే ఆట కరెన్సీ నోట్ల వంటిది తప్ప మరొకటి కాదని సిఐఏ మాజీ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అది వాస్తవమేనని ఎఫ్‌బిఐ అభిప్రాయపడినట్లు మీడియా రాసింది. తాము ప్రచురించిన అంశాలకు కట్టుబడి వున్నామని, ఏది నిజమో కాదో పాఠకులకు వదలి వేస్తున్నామని బజ్‌ఫీడ్‌ సంపాదకుడు ప్రకటించాడు. ప్రజావేగు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఇచ్చిన ఆశ్రయానికి కృతజ్ఞతగా అతనే రహస్య సమాచారాన్ని రష్యన్లకు అందచేసినట్లు కొందరి అనుమానం. రష్యన్లు తమ వద్ద వున్న సమాచారాన్ని అమెరికన్‌ ఏజన్సీలకు చేరవేసే ముందు ట్రంప్‌ వ్యతిరేకులకు కూడా అందించినట్లు వార్తలు వచ్చాయి. తమ అధ్యక్షుడికి రష్యాతో వున్న సంబంధాల గురించి స్పష్టత వచ్చేంతవరకు మీరు ఎలాంటి సమాచారాన్ని అధ్యక్ష భవనం, జాతీయ భద్రతా మండలికి గానీ అందచేయవద్దని, అ సమాచారం రష్యా ద్వారా ఇరాన్‌కు చేరే అవకాశం వుందని అమెరికా నిఘా సంస్ధల అధికారులు ఇజ్రాయెల్‌ సంస్ధలకు చెప్పినట్లు, అది తెలిసి ఇజ్రాయెలీలు నెత్తీనోరు బాదుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. నాటకాన్ని రక్తి కట్టించేందుకు , ట్రంప్‌ను కాపాడేందుకా అన్నట్లు ఆ సమాచారం వాస్తవం కాదని రష్యన్‌ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అయినా సరే దాని మీద రగడ కొనసాగటాన్ని చూస్తే మొత్తం మీద ఎంతో సమర్ధులమని విర్రవీగే అమెరికన్లను ప్రపంచం ముందు వెర్రివారిగా మార్చి రష్యన్లు వినోదం చూస్తున్నారన్నది స్పష్టం.

   రష్యన్లు ట్రంప్‌కు అనుకూలంగా , తమకు వ్యతిరేకంగా వ్యవహరించారనే వుక్రోషంతో హాకింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ 35 మంది దౌత్య సిబ్బందిని తన చివరి చర్యగా ఒబామా సర్కార్‌ బహిష్కరించింది. మామూలుగా అయితే అంతే సంఖ్యలో అమెరికా సిబ్బందిని కూడా రష్యా బహిష్కరించి వుండాలి. అయితే తనదైన దౌత్యనీతిని ప్రదర్శించిన పుతిన్‌ ఆపని చేయకుండా ట్రంప్‌ ఎలా వ్యవహరిస్తాడో చూస్తామంటూ బంతిని ట్రంప్‌ కోర్టుకు నెడుతూ ప్రకటన చేశాడు. పుతిన్‌ ఎంతో హుందాగా వ్యవహరించాడంటూ ట్రంప్‌ స్పందించాడు. ఈ వ్యవహారంలో వెలువడుతున్న పలు విశ్లేషణలు అనేక కొత్త కోణాలను జనం ముందుంచుతున్నాయి. వాటిని పూర్తిగా నమ్మటం లేదా కొట్టి పారవేయకుండా పరిశీలించటం అవసరం.

   అధికారమే పరమావధిగా వుండే పార్టీలు, శక్తులకు శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఎవరూ వుండరు. సరే సిద్దాంతాలు, కట్టుబడి వుండటాల గురించి ఆశించకూడదనుకోండి. ఏదో ఒక సాకుతో ఆయారాం గయారాంలు ఎక్కడ అధికారం వుంటే అక్కడికి చేరతారు. తమ మంద పెద్దదిగా వుందా లేదా అని తప్ప చేర్చుకొనే వారికి కూడా సిగ్గూ ఎగ్గూ వుండదు. అలాంటి వారిని జనం ఎందుకు ఎన్నుకుంటున్నారన్న ఒక ప్రశ్న ఎలాగూ వుండనే వుంటుంది. అధికారం, దాని కొమ్ముకాసే కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కమ్యూనిస్టు మినహా మిగిలిన పార్టీలన్నీ దేనికైనా పాల్పడతాయి. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు తమ ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి తమ లాభాలకు వుపయోగమా కాదా అని చూస్తారు, సత్తా వుందనుకుంటే దెబ్బలాడుకుంటారు, లేదనుకుంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ రాజీపడతారన్నది ప్రపంచ చరిత్ర సారం. కొందరి విశ్లేషణ ప్రకారం ప్రపంచ పరిణామాలలో అమెరికా సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నదనే అనుమానం కూడా వ్యక్తమౌతున్నది.

    రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్లు ఆసియాలో జపాన్‌పై దాడి చేశారు. అవసరం లేకపోయినా అణు బాంబులు వేసి ప్రపంచం మొత్తాన్ని బెదిరించారు. జపాన్‌ , ఐరోపాలో జర్మనీ మిలిటరీనికూడా రద్దు చేసి నాటో పేరుతో రక్షణ, పునరుద్ధరణ బాధ్యతల్లో అమెరికా తెరవెనుక వుండి పెద్దన్న పాత్ర పోషిస్తోంది. మిలిటరీ ఖర్చు లేకపోవటంతో అందుకయ్యే మొత్తాన్ని పరిశోధన-అభివృద్ధి, పారిశ్రామిక రంగానికి మరల్చి ఆర్ధిక రంగంలో అమెరికాతో ధీటుగా జపాన్‌,జర్మనీలు తయారయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అంతరించటంతో వర్ధమాన దేశాల మార్కెట్లలో కొత్త పద్దతులలో ఎలా ప్రవేశించటమా అన్న ప్రపంచ బడా పెట్టుబడిదారుల ఆలోచన నుంచి పుట్టిందే ప్రపంచీకరణ. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌-చైనాల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల సమస్యల పూర్వరంగంలో తమ దేశంలో ప్రయివేటు పెట్టుబడులను అనుమతించేందుకు చైనా సంస్కరణల బాట చేపట్టింది. దాంతో అతి పెద్ద చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు ఐక్యరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాను అసలైన ప్రతినిధిగానే గాక, తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమనే వైఖరిని తీసుకున్నారు.

   పెట్టుబడిదారులు ఎప్పటికప్పుడు లాభాల కోసం తమ పద్దతులను మార్చుకుంటూ వస్తున్నారు. మార్కెట్లను పంచుకొనే పోటీలో భాగంగా సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల కాలానికే రెండవ ప్రపంచ యుద్ధానికి సామ్రాజ్యవాదులు తలపడ్డారు. ఆ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసల శకం ముగియటం, బలమైన సోషలిస్టు శిబిరం ఏర్పడటంతో సామ్రాజ్యవాదులు తమ దురాక్రమణ ఎత్తుగడలను, రూపాలను మార్చారు. గతంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటివి తమ దేశాలలో తయారైన పారిశ్రామిక వస్తువులను మన వంటి తమ వలస దేశాలలో విక్రయించి, అవసరమైన ముడిసరకులను దిగుమతి చేసుకొని రెండువైపులా లాభాలను ఆర్జించేవి. ఇప్పుడు తాము ప్రత్యక్షంగా వస్తూత్పత్తిని చేయకుండా, ముడి సరకులను దిగుమతి చేసుకోకుండా కేవలం ఆయుధాల వంటి వాటిని మాత్రమే తయారు చేసి విక్రయిస్తూ పెట్టుబడిని, కొంత మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు తరలించి అక్కడి కార్మికుల చౌక శ్రమ శక్తితో వస్తూత్పత్తి చేసి వాటిని తమ మార్కెట్లకు దిగుమతి చేసుకొని లాభాలు పొందటం ప్రారంభించారు. అందుకే అమెరికా, ఐరోపా ధనిక దేశాల దుకాణాలన్నింటా చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాల తయారీ వస్తువులే వుంటున్నాయి. తమ వద్ద ఇంకా మిగిలి వున్న డాలర్లను వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్లలో వాటాల క్రయ విక్రయాలతో ఎలాంటి పరిశ్రమలు, వ్యాపారాలు, కార్మికులు, వుద్యోగులు లేకుండానే లాభాలు సంపాదిస్తున్నాయి.

    ఈ క్రమంలో ధనిక దేశాలలో వస్తూత్పత్తి పడిపోయి, ఆధునిక పరిశ్రమలలో రోబోట్ల వినియోగం పెరిగి కార్మికులకు వుపాధి తగ్గిపోయి సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. చైనా తన వద్ద వున్న అపార మానవ శక్తిని పెట్టుబడిగా పెట్టి జనానికి వుపాధి కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచటంతో పాటు ప్రపంచం సంపదలలో రెండవ స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టింది. ఆ పోటీలో అమెరికాతో పోటీ పడుతూ దాని మొదటి స్దానానికి సవాలు విసురుతోంది. అంతర్జాతీయ పరిణామాలలో తనకు పోటీగా మారవచ్చనే భయం అమెరికన్లకు పట్టుకుంది. ఈ పూర్వరంగంలో దానిని కట్టడి చేసేందుకు సైనికంగా చైనా చుట్టూ తన స్థావరాలతో పాటు మిత్రులను సమీకరిస్తోంది.

    ప్రస్తుతం పెద్ద సరిహద్దు వున్న రష్యాతో చైనాకు ఎలాంటి పేచీలు లేవు. రెండు దేశాల మధ్య శతృత్వం కూడా లేదు. ఈ పూర్వరంగంలో రష్యాను కూడా తనతో కలుపుకొనే అవకాశాల గురించి అమెరికన్లు ఆలోచిస్తున్నారనేది ఒక విశ్లేషణ. దానిలో భాగంగానే ట్రంప్‌ ఒకవైపు పుతిన్‌ను పొగుడుతూ చైనాతో బస్తీమే సవాల్‌ అన్నట్లుగా రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నాడు. చైనాలో అంతర్భాగమైనా విడిగా వున్న తైవాన్‌ పాలకులతో మాట్లాడటమే గాకుండా ఒకే చైనా విధానానికి ఎందుకు కట్టుబడి వుండాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. చైనా వస్తువులపై పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తామని కూడా బెదిరింపులకు దిగాడు. అయితే ఇవన్నీ అంత తేలిక కాదు. రష్యా ఆర్ధికంగా ఇబ్బందులలో వున్నప్పటికీ సిరియా, టర్కీ పరిణామాలలో అమెరికాకు తన సత్తాఏమిటో చూపటమే గాక సవాలు కూడా విసిరింది. రష్యా ఇదే విధంగా కొనసాగితే ఐరోపామీద తన పట్టు, పలుకుబడికి విఘాతం కలగవచ్చనే భయం కూడా అమెరికా పాలకవర్గానికి వుంది. మొత్తం మీద ప్రపంచ పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో వున్న పరిస్థితుల్లో ఒక పెట్టుబడిదారీ దేశం మరొక పెట్టుబడిదారీ దేశంతో ఘర్షణ పడే అవకాశాలు లేవు. మార్కెట్లను పంచుకోవటంలో రష్యన్‌ పెట్టుబడిదారీ వర్గం కూడా పోటీ పడుతోంది. చైనా, భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమి ఏర్పాటు చేయటం దానిలో భాగమే. అమెరికన్ల ఎత్తుగడలు బాగా తెలిసిన రష్యా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. రష్యన్‌ పెట్టుబడిదారులు కూడా అదే కోరుకుంటారు.

  చైనాను రెచ్చగొట్టేందుకు ట్రంప్‌ వినియోగిస్తున్న అస్త్రాలతో పోల్చితే రష్యాను ప్రసన్నం చేసుకొనేందుకు విసురుతున్న పూలదండలు ఆసక్తి కరంగా వున్నాయి. తన విదేశాంగ మంత్రిగా రష్యా అనుకూలుడిగా ముద్రపడిన ఎక్సాన్‌ మోబిల్‌ సిఇవో రెక్స్‌ టిల్లర్సన్‌ను నియమించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎక్సాన్‌ కంపెనీకి రష్యాలోని సైబీరియాలో 50 కోట్ల డాలర్ల చమురు ఒప్పందం వుంది. త్వరలో రష్యాపై వున్న ఆంక్షలను ట్రంప్‌ ఎత్తివేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి అంశాలకు సంబంధించి వస్తున్న వార్తలలో ఎక్కువ భాగం చీకట్లో వేస్తున్న బాణాల వంటివి. ఒక్కోసారి అవే కొత్త పరిణామాలకు నాంది పలుకుతాయి. కొందరు వూహిస్తున్నట్లు రష్యా-అమెరికాలు ప్రపంచ మార్కెట్లను పంచుకొనేందుకు సయోధ్య కుదుర్చుకుంటే ప్రపంచ రాజకీయాలు మరోమలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మార్పు కోసం మోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు !

12 Thursday Jan 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP's social media, BJP’s IT cell, BJP’s trolling army, I am a troll, Narendra Modi, Rahul gandhi, Trolls

సాధ్వి ఖోస్లా

    స్వాతంత్య్ర సమర యోధుల పరంపరనుంచి వచ్చిన కొంత మందికి రెండు విషయాలు మాత్రమే -దేశ భక్తి మరియు గాంధీజీ సిద్ధాంతాలు-ఎరుకలో వుంటాయి. నాకైతే నా రాష్ట్రం పంజాబ్‌ కూడా. పంజాబ్‌ మీద నాకున్న ప్రేమ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు మరియు వాటికి అనుకూలంగా వున్న రాష్ట రాజకీయ పరిసరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు శక్తి నిచ్చింది. ద్వేష పూరితమైన భారతీయ జనతా పార్టీ మరియు తమను తాము వీరులుగా చెప్పుకొనే దాని సామాజిక మీడియా మరుగుజ్జు యోధులపై పోరాడేందుకు దేశం మీద నాకున్న ప్రేమ బలాన్నిచ్చింది.

    గత మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ మీద నన్ను అసుసరిస్తున్నారు.ఈ రోజు నేనేమీ కాదు మరియు బిజెపితో నా అనుబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. స్వాతి చతుర్వేది పుస్తకం అయామ్‌ ఏ ట్రోల్‌ (నేనో వెంటాడే మరుగుజ్జును )లో నేను వెల్లడించిన వాస్తవాలతో మండిపడుతున్న బిజెపి సామాజిక మీడియా సేనలోని అజ్ఞాత ముఖాలు నన్నొక దుష్టశక్తిగా చిత్రిస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు పలికే గొంతులేమైనా వుంటే వాటిని మూయిస్తారని నేను చెప్పింది వాస్తవమని వారు రుజువు చేస్తున్నారు.నేను బయటపడి వాస్తవాలను బహిరంగ పరచాలన్న నా నిర్ణయం కాంగ్రెస్‌తో నాకున్న స్వల్పకాల అనుబంధం వలన కాదు, అసత్యాలను వేద వాక్యంగా మార్చటాన్ని అపేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నమిది. ఎప్పటికప్పుడు వార్తలు అందుతున్న నేటి యుగంలో నిజం కంటే వ్యతిరేక సమాచార ప్రచారాన్ని వాట్సాప్‌, ట్విటర్‌ మరియు ఫేస్‌బుక్‌లలో జనం ఎక్కువగా నమ్ముతున్నారు. ఆ సమయానికి నిజం అడుగున పడిపోయి జరగాల్సిన హాని జరుగుతుంది.

    మన గొప్ప దేశాన్ని గత ప్రభుత్వాలు మలుచుతున్న తీరుతో ఇతర తరుణ వయస్సు భారత పౌరుల మాదిరే నేను కూడా 2013లో అసంతృప్తి చెందాను. నేను మొదటి సారిగా నా ఓటు హక్కును మోడీకి అనుకూలంగా వినియోగించాను, ఎందుకంటే మెరుగైన భారత్‌ గురించి ఆయన దర్శన కోణాన్ని, ఆయనను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను 272 మంది మరియు వారితో పాటు వున్న వలంటీర్లతో కూడిన బిజెపి మిషన్‌ (ప్రచార దళం)లో చేరేందుకు ప్రేరణనిచ్చింది.ఆ ప్రచార దళపు ‘సరికొత్త ప్రచార పద్దతులు ‘ వెంటాడటంతో సహా అప్రతిష్టపాలు చేయటం, వాస్తవానికి వక్రభాష్యాలు చెప్పి జనాల న్యాయనిర్ణయాలను అయోమయంలోకి నెట్టటం గురించి నాకు ముందుగా ఏమాత్రం తెలియదు.

     2015 నవంబరులో అమీర్‌ ఖాన్‌ దేశంలో నాడున్న పరిస్ధితుల గురించి తన మనోభావాలను వ్యక్తం చేసినపుడు అరవింద గుప్తా నాయకత్వంలోని బిజెపి ఐటి విభాగం ఎలక్ట్రానిక్‌ వాణిజ్య సంస్ధ అయిన స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్న ఆ నటుడిని తప్పించేందుకు గాను ఒత్తిడి చేస్తూ ఒక సామాజిక మీడియా ప్రచారాన్ని నిర్వహించింది. ఆ నటుడిని వెంటాడాలని, వివిధ వేదికలపై అతనిపై బురద చల్లాలని, అతని సినిమాలు చూడకుండా జనాన్ని రెచ్చగొట్టాలని మాకు (బిజెపి ఐటి విభాగంలోని వలంటీర్లకు) ఆదేశాలు జారీ చేశారు. నా భావజాలం మరియు ఆత్మ బిజెపి మతోన్మాద దళంలో భాగస్వామి అయ్యేందుకు అనుమతించలేదు.భ్రమలు తొలిగిన నేను దాని నుంచి బయటపడ్డాను. వత్తిడి కారణంగా 2016 జనవరిలో స్నాప్‌డీల్‌ అమీర్‌ ఖాన్‌తో తన సంబంధాలను రద్దు చేసుకుంది.

     అటువంటి చర్యల తీవ్ర పర్యవసానాలను మనం గుర్తించలేదు. ఒక నటుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండ్లలో వుంటూ మన హృదయాలను దోచుకున్న వ్యక్తి ఆకస్మికంగా ఒక ‘ముస్లింగా’ మారిపోయాడు. ద్వేషాన్ని వ్యాపింప చేయటానికి సామాజిక మాధ్యమం ఒక ప్రమాదకర సాధనంగా మారిపోయింది, అదికొన్ని సందర్భాలలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కూడా దారితీయవచ్చు. చివరికి మతం కూడా రాజకీయాల మాదిరి మనల్ని విడదీయలేదు.

జాతి వ్యతిరేకిగా ముద్ర

     దాదాపు రెండు సంవత్సరాలు తీవ్ర స్ధాయిలో ప్రధాన మంత్రికి ట్విటర్‌ మీద మద్దతు పలికాను, చురుకుగా బిజెపికి ప్రచారం చేశాను, వారి ఎజండాలలో భాగంగా స్మృతి ఇరానీ, కిరణ్‌ ఖేర్‌ వంటి బిజెపి నాయకులకు తోడ్పడ్డాను. నేను వ్యతిరేకించిన సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ కూటమికి నాయకత్వం లేకపోవటాన్ని, దిగజారిన విధానాలను కూడా విమర్శించాను. ఇదే సమయంలో పంజాబ్‌ మీద వున్న నా అభిమానం రాష్ట్రంలో వున్న భయంకరమైన మాదకద్రవ్యాల వ్యాప్తిని వెల్లడిస్తూ దాని మీద ఒక డాక్యుమెంటరీని తీయించేందుకు కూడా నడిపించింది. ఆందోళన కలిగించే వాస్తవాలను ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చేందుకు ట్విటర్‌ ద్వారా ఒక వర్తమానం కూడా పంపాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని మోడీ వాగ్దానం చేశారు, అయితే అందుకు సహాయం చేసేందుకు నేను చేసిన వినతులను విస్మరించారు.

  ప్రధాన మంత్రి నిర్లక్ష్యం నన్ను కాంగ్రెస్‌ వైపు తిరిగేట్లు చేసింది. నేను గట్టిగా బలపరిచిన నరేంద్రమోడీ విస్మరిస్తే నా వినతులను రాహుల్‌ గాంధీ విన్నారు. కాంగ్రెస్‌ వుపాధ్యక్షుడితో కలిసినప్పటి నా చిత్రాలను సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి వెంటాడే సేనకు నా కృతజ్ఞతలు. రహస్యంగా వుంచిన వారి క్రీడను నేను బయట పెట్టటాన్ని నా రాజకీయ అజండాలో భాగంగా చూపుతున్నారు. నేను నిర్మించిన డాక్యుమెంటరీని 2016 మార్చి 18న రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్‌తో నా ఏకైక సంబంధం అది మాత్రమే.

   2014 ఎన్నికలు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. మీడియాలో ప్రచారం ఎలా పొందాలో తెలిసిన ప్రధాన మంత్రి ఇంటర్నెట్‌ ద్వారా జనాలకు చేరువ అవుతున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా జనానికి తెలియచేస్తున్నారు. ఆయనను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు, కానీ ఆయన మాత్రం కొద్ది మంది ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుసరిస్తారు. వారిలో ఎక్కువ మంది దూషిస్తూ వెంటాడతారని బాగా తెలిసిన వారే. ప్రధానిని సందర్శించి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా దూషించే వారిని ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూ వుంటారు. ఇలా వెంటాడే వారిని ప్రోత్సహించనని బిజెపి చెప్పుకునేట్లయితే ఇలాంటి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యంగా తమ కార్ఖానా నుంచి తయారై బయటకు వస్తున్న వాటి గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?

   సామాజిక మాధ్యమ వేదికను నిర్మాణాత్మక అభివృద్ధికి వినియోగించుకోవటానికి బదులు తమ వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించించిన వారిని అవమానించే విధంగా తన దిగువ సేనను వినియోగించుకుంటోంది. ఏ వ్యక్తి, సంస్ధ లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే సానుకూల విమర్శలు ఆరోగ్యకరమైనవి, కానీ అసహ్యంగా విమర్శించటం, వ్యక్తిత్వాలను దెబ్బతీయటం అవాంఛనీయం. ప్రధానిని సమర్ధించే పేరుతో జనాలను మరియు వారి వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల చీకటి చిత్రాన్ని మాత్రమే ఇది బయట పెడుతోంది. వ్యతిరేకుల, జర్నలిస్టుల, రాజకీయనేతలు మరి ఇతరులెవరి ప్రతిష్టనైనా దెబ్బతీయాలని కిరాయి వలంటీర్లకు మార్గదర్శనం చేశారు. భిన్నమైన వైఖరి కలిగి వున్న ఎవరినైనా మోడీ మరియు జాతి వ్యతిరేకిగా వర్ణించారు. ఎంత అసహ్యంగా అయితే అంతగా మహిళలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ,ఆయన తల్లి సోనియాగాంధీలపై తప్పుడు ప్రచారం చేశారు, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులను చంపేస్తామని, మాన భంగం చేస్తామని బెదిరింపులు చేశారు.

  బిజెపి ప్రచారాన్ని బయటపెట్టిన మాకు అన్ని జీవన రంగాల నుంచి ప్రజామద్దతు వెల్లువెత్తుతున్నది. ఈ అంశం దేశంలోని మారుమూలలకు కూడా ప్రయాణించింది. వ్యతిరేక భావజాలాన్ని అణచివేసేందుకు పాలకపార్టీ సామాజిక మీడియాను వినియోగించుకోవటాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.అంతిమంగా బిజెపి సామాజిక మీడియా సేన మరియు మద్దతుదారుల లక్ష్యంగా పుస్తక రచయిత్రి స్వాతి చతుర్వేది మరియు నేను వుంటాము. వారు మాపై బూతులు, కించపరిచే ప్రచారం, బెదిరింపులతో దాడి చేస్తారు. ఇదంతా ఎందుకంటే వారి చీకటి రహస్యం బట్టబయలైంది, నిజం గాయపరుస్తుంది.

   నేను నా ఆత్మ చెప్పినట్లు నడిచాను. వ్యతిరేక భావాలు కలిగి వున్న వ్యతిరేకులు లేదా ప్రముఖులకు వ్యతిరేకంగా కించపరిచే ప్రచారం చేయటానికి సామాజిక మీడియాను ఎలా సాధనంగా చేసుకుంటున్నారో నా అందమైన దేశం, దాని ప్రజలు తెలుసుకోవాలన్నది నా ఆలోచన మరియు విధి.

ప్రేమ కంటే ద్వేషం త్వరగా విస్తరించటం విచారకరం !

నేను మార్పు కోసం నరేంద్రమోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు. !

నేను చెప్పాల్సింది చెప్పాను, నేను నమ్మిందే చేశాను, చేసిందే చెప్పాను. ఇది నేను చెబుతున్న నిజం !

స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ పెంపకంలో రక్షణలేని రూపాయి పాపాయి !

07 Saturday Jan 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi rule, Rupee, Rupee Fall, rupee value

ఎం కోటేశ్వరరావు

    మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. రెండున్నర సంవత్సరాల తరువాత జనవరి ఆరవ తేదీన రు.67.96కు చేరింది, డిసెంబరు నాటికి రు.69.50 పెరగవచ్చని కొందరి అంచనా. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్క బిజెపికే సంపూర్ణ మెజారిటీతో నరేంద్రమోడీ సంఖ్యరీత్యా అత్యంత బలమైన ప్రధానిగా అవతరించారు. అయితేనేం రూపాయి విలువ పెరగలేదు కదా పతనమై రు.68.86పైసలను తాకి 2016 నవంబరు 25న సరికొత్త రికార్డును సృష్టించింది. అప్పటి నుంచి 67-68కి అటూ ఇటూగా కదలాడుతోంది.ఈ ఏడాది డిసెంబరు నాటికి నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టగలరని రూపాయి మరింత పతనమై 69.50కి చేరవచ్చని రాయిటర్‌ వార్తా సంస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నది. అది పక్కా పెట్టుబడిదారులు నడిపే కంపెనీ తప్ప కమ్యూనిస్టులకు, మోడీ విమర్శకులకు ఎలాంటి సంబంధం లేనిది.

    ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తప్పు పట్టే వారు బిజెపి, దానిని సమర్ధించే పార్టీలు అధికారంలోకి రాకూడదని కోరుకొనే వారే అనటంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. మోడీ ప్రభుత్వ విధానాలు బాగు, బాగు , బహు బాగున్నాయి, వెనక్కు తిరిగి చూడనవసరం లేదని పొగిడేవారి గురించే అనుమానించాలి. ఇటీవలి కాలంలో ఇలాంటి వారు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. మోడీ విధానాలు బాగులేకపోతే ఆయనను అంత ఎక్కువ మంది ఎలా సమర్ధిస్తున్నారు అన్నది వాటిలో ప్రధానమైనది. బలపరిచే, వ్యతిరేకించే సర్వేల బండారం, బాగోతం అందరికీ తెలిసిందే. వాటిని పక్కన పెడితే మోడీని సమర్ధిస్తున్న వారందరూ ఆయన విధానాలకు ఆమోద ముద్ర వేశారనే నిర్ణయానికి వస్తే పప్పులో కాలువేసినట్లే. పెద్ద నోట్ల రద్దు విషయమే తీసుకుంటే తాము ఇబ్బందులు పడినా జనం రెచ్చి పోలేదంటే అర్ధం దేశంలో తొలిసారిగా ఏదో మంచి చేస్తున్నాడు, యాభై రోజులే అంటున్నారు కదా చూద్దాం అని సహించారు తప్ప ఆ నిర్ణయ పర్యవసానాలన్నీ తెలిసి మద్దతు ఇవ్వలేదు. అసలు వాటి పర్యవసానాల గురించి రద్దు చేసిన నరేంద్రమోడీి గానీ, ఆయనకు సలహా ఇచ్చిన అంతరంగికులు, చివరకు తానే సలహాయిచ్చానని చెప్పుకున్న , మోడీ కంటే మేథావి అని ఆయన చుట్టూవున్నవారు భావించేే చంద్రబాబు నాయుడు, అంతిమంగా అమలు జరిపిన రిజర్వుబ్యాంకు సైతం నిర్దిష్టంగా ఫలానా ప్రయోజనం లుగుతుంది అని చెప్పలేదని తెలుసుకోవటం అవసరం. ఈ జన్మలో కష్టాలు అనుభవించినా పరలోకంలో స్వర్గ సుఖాలు దక్కుతాయి అన్నట్లుగా తాత్కాలికంగా నష్టం జరిగినా భవిష్యత్‌లో మంచి జరుగుతుంది అని తప్ప అధికార పక్షం లేదా దానిని సమర్ధిస్తున్నవారు గానీ తాత్కాలిక నష్టాలు , శాశ్వత లాభాలు ఎలా వుంటాయో ఎవరైనా చెప్పారా ?

     చైతన్యం, మూఢత్వం, అసంతృప్తి, అభిమానం అనేక కారణాలతో తరతమ స్థాయిలలో వుండే మన దేశంలో గుడ్డిగా నమ్మినట్లే, గుడ్డిగా వ్యతిరేకించటం కూడా సాధారణ విషయమే. అందువలన జనం వ్యతిరేకతలు, సమర్ధనలను కాసేపు పక్కన పెడదాము. కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని అన్ని రంగాలలో గాడి తప్పించారు, మేము వస్తే తిరిగి గాడిలో పెడతామనే కదా బిజెపి అండ్‌ కో పార్టీలు, వాటిని భుజాన వేసుకొని మోసిన పవన్‌ కల్యాణ్‌ వంటి పెద్దలు చెప్పింది. తాను పదవిని స్వీకరించగానే విదేశాలలో పోయిన పరువును తిరిగి రాబట్టానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం మరి దేశం సంగతేమిటి? ఆర్ధిక వ్యవస్ధ విషయమేమిటి?

     అన్ని విషయాలను ఒకేసారి చర్చించటం కుదరదు గనుక రూపాయి విలువ- పతనం, పటిష్టత పర్యవసానాల గురించి చూద్దాం. మన్మోహన్‌ సింగ్‌ గారి పాలనలో ఆయన వయస్సు పెరుగుతున్న మాదిరి రూపాయి విలువ పడిపోతున్నదని బిజెపి, నరేంద్రమోడీ విమర్శించారు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ హయాం మొత్తం మీద గరిష్టంగా ఒక డాలరుకు 68.85 రూపాయల వరకు పడిపోయింది.

     2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తే https://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

    రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే రెండున్నర సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో పది రూపాయలకు అటూ ఇటూగా వుంది. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

    రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? పోనీ నరేంద్రమోడీకి ఏదైనా లాభం వుంటుందా ? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

 

  మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము.పీపాకు వంద లీటర్ల పెట్రోలు అనుకుంటే లీటరు రు.63.14 పడుతుంది. డాలర్లలో లీటరుకు 1.07 , ఇప్పుడు అంటే 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు కొనుగోలు చేశాము. అంటే లీటరుకు రు.36 పడుతుంది. డాలర్లలో ధర 0.53. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే లీటరుకు రు.31.38కే వచ్చి వుండేది.అదే ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే మరో పది రూపాయలు తగ్గి వుండేది. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు. మరింతగా దిగజారనుందని ఆర్ధిక విశ్లేషకులు ఎందుకు అంచనా వేస్తున్నారు? అరికట్ట లేకపోగా తన హయాంలో పెట్రోలుపై పదకొండు రూపాయల పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

    రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. రూపాయి విలువ పతనం కారణంగానే ఇటీవలనే అనేక కంపెనీల కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు వలన తాత్కాలికంగా ఇబ్బందులంటే ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే, దాని వలన మూడు నుంచి ఐదులక్షల కోట్ల నల్లధనం వెలికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వాదాయం పెరుగుతుందని వేసుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయని 40-50వేల కోట్లకు మించి రావని వార్తలు వస్తున్నాయి. ఏ రోజు లావాదేవీలను ఆరోజు సాయంత్రానికి బ్యాంకులు ఖరారు చేస్తాయి. అలాంటిది పెద్ద నోట్ల డిపాజిట్ల గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా బ్యాంకులకు చేరిన సొమ్మెంతో ఇంకా లెక్కలు వేస్తున్నామని రిజర్వుబ్యాంకు చెప్పటం ఆశ్చర్యంగా వుంది. నోట్ల రద్దు వలన కలిగే లాభం సంగతేమోగాని రెండుశాతం జిడిపి అంటే రెండులక్షల కోట్ల రూపాయల నష్టం ఖాయంగా రానుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

టిప్పు లేదా సేవా రుసుములపై ప్రభుత్వ వైఖరేమిటి ?

05 Thursday Jan 2017

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, STATES NEWS

≈ Leave a comment

Tags

Department of Consumer Affairs, hotels service charges, National Restaurant Association of India, tip

సత్య

    హోటళ్లకు వెళ్లినపుడు ‘టిప్పు’ ఇవ్వాలా వద్దా అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. ఇవ్వటం ఇష్టం లేని నాన్నలు లేచి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కాలర్‌ పట్టి మరీ లాగి కూర్చోపెట్టి పర్సు తీసి టిప్పు ఇచ్చే భార్య, పిల్లలను చూసే వుంటారు. టిప్పు ఇవ్వకుండా వెళ్లే వారిని సర్వర్లు చూసే చూపు తట్టుకోలేక, అవమానంగా భావించి ఇలా చేస్తారని తెలిసిందే. ఇప్పుడా టిప్పు ఇవ్వటమా లేదా అన్నది మీ ఇష్టం ఇష్టముంటే ఇవ్వండి, విధిగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ మృదువుగా ప్రకటించింది. టిప్పు చెల్లించాల్సిందే, ఇష్టమైతేనే తినండి లేకుంటే దొబ్బేయండి మీ ఇష్టం అని హోటల్‌ యజమానుల ప్రతినిధి మొహమాటం లేకుండా తెగేసి చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు మాదిరి కేంద్ర ప్రకటన ప్రయోజనం లేకుండా పోయింది. ఇష్టమైతే టిప్పు ఇవ్వండి లేకుంటే లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే టిప్పు అని సేవా ఛార్జీలు అని వసూలు చేసే యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకొనే అవకాశాలు లేవన్నది స్పష్టం. అందువలన ఇక్కడ తేలాల్సిన అంశం ఏమంటే వుదారంగా ఇచ్చే టిప్పు లేదా విధిగా వసూలు చేసే సేవా రుసుముపై అసలు ప్రభుత్వ వైఖరి ఏమిటి ? తాను ఇచ్చిన వివరణ ప్రకారం హోటళ్లలో అమలు చేయించే దమ్ము ప్రభుత్వాలకు వుందా అన్నది ప్రశ్న. వసూలు విచక్షణ యజమానులకు, సేవలు నచ్చితే చెల్లించాలా లేదా అనే విచక్షణ వినియోగదారులదీ అని చెప్పటం అదీ కరెక్టే ఇదీ కరెక్టే అని చెప్పటం తప్ప మరొకటి కాదు.

    ‘ బుర్ర వుపయోగించకుండా ఇలాంటి ప్రకటనలు చేయటం వుద్యోగులకు తీవ్ర నష్టదాయకం. యజమానులే కాదు సర్వీసు ఛార్జీలపై ఆధారపడిన హోటల్‌ వుద్యోగులందరూ దీనితో ప్రభావితులౌతారు.మంచి చెడ్డలను ఆలోచించకుండా వారి భుక్తిని ఎలా దెబ్బకొడతారు ‘ అని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రియాజ్‌ అమ్లానీ వ్యాఖ్యానించారు. ఆహార సేవారంగంతో సంబంధం వున్న 85లక్షల మంది దీనితో ప్రభావితులౌతారని అమ్లానీ చెప్పారు. సేవా చార్జీలు వసూలు చేయాలా లేదా అన్నది రెస్టారెంట్ల యజమానుల ఇష్టం. ఒక వేళ వసూలు చేయాలనుకుంటే ఆ విషయాన్ని పదార్ధాల పట్టికలో లేదా ఇతర విధాలుగా స్పష్టంగా ప్రకటించాలి. దీంతో ఆ సేవలను కోరుకొనే వినియోగదారులకు ఆ విషయం ముందే తెలుస్తుంది.రెస్టారెంట్లు అందుబాటులో వుంచిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలా లేదా అన్నది తేల్చుకుంటారు అని ప్రభుత్వ వినియోగదారుల వ్యవహరాలశాఖ పేర్కొన్నది. హోటళ్లు ఎలాంటి సేవలు అందించినా సేవా ఛార్జీల పేరుతో ఐదు నుంచి ఇరవై శాతం వరకు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు రావటంతో కేంద్ర ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.

     దీంతో అనేక మంది హోటల్‌ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవా రుసుము వసూలు గురించి తెలిపే ఏర్పాట్లు చేయటం అనేక పర్యవసానాలకు దారితీస్తుంది. ఇప్పటికే 15 శాతం వాట్‌, ఇతర సెస్సులతో వెనుకా ముందు చూసుకొనే వినియోగదారులు అంత మొత్తం టిప్పుకూడా చెల్లించాలంటే అది లేని రెస్టారెంట్లకు వెళతారు. యజమానులు ఇచ్చే నామ మాత్ర జీతాలతో ఎవరు పని చేస్తారు, జీతం కంటే టిప్పు ఎక్కువ వస్తుందనే ఆశతో పని చేస్తున్న కార్మికులకు సమస్యలు వస్తాయి. అమెరికాలో కొందరు యజమానులు టిప్పు రద్దు చేసిన సందర్భాలలో పని చేసేందుకు కార్మికుల లభ్యత సమస్యలు ఏర్పడ్డాయని, హొటళ్లలో పని చేసే వారి వేతనాలు చాలా తక్కువగా వుంటాయి కనుక వారికి కాస్త అదనంగా చెల్లించేందుకు టిప్పు వసూలు చేస్తామని అక్కడి యజమానులు నమ్మ బలుకుతారు. ప్రపంచవ్యాపితంగా టిప్పు ఒక సమస్యగా తయారైంది.

    ఐరోపా కులీన కుటుంబాలలో విందులు, వినోదాలు ఏర్పాటు చేసినపుడు వచ్చిన అతిధులు మెచ్చుకోలుగా పనివారికి కొంత సొమ్మును ఇవ్వటంతో ప్రారంభమైన టిప్పు ఇప్పుడు విధిగా చెల్లించాల్సిన వాటి జాబితాలో చేరిపోయింది. అయితే ప్రపంచమంతటా ఇది ఒకే విధంగా లేదు. అసలు టిప్పు తీసుకోవటం అనేది కార్మికుల గౌరవ మర్యాదలకు సంబంధించిన అంశం. ప్రభుత్వాలు లేదా మార్కెట్‌ ప్రతి పనికీ ఒక వేతనం లేదా విలువ నిర్ణయిస్తున్నాయి. ప్రతి వారు తాము ఏ పని చేసినా గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు అవసరమైన వేతనం లేదా ప్రతిఫలం పొందటం న్యాయం. ఆ విధంగా చూసినపుడు ఒక హోటల్లో పని చేసే కార్మికులకు అలాంటి వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత యజమానులదే. వారి వేతనాల ఖర్చు, ప్రభుత్వ పన్నులను కూడా కలుపుకొని ఆహార పదార్ధాల ధరలను నిర్ణయించాలి. ఆ ధరలకు సిద్దపడిన వినియోగదారులే వస్తారు. అలాగాకుండా కార్మికులకు నామమాత్ర వేతనాలిచ్చి, వారిని ఆదుకొనే పేరుతో టిప్పు లేదా సేవా రుసుము అంటూ అదనంగా వసూలు చేయటాన్ని మరొక విధంగా చెప్పాలంటే కార్మికులకు వేతనాలు చెల్లించే బాధ్యతను వినియోగదారులపై నెట్టి యజమాని వుచితంగా లేదా నామమాత్ర వేతనాలతో పని చేయించుకోవటం, కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ చెల్లింపుల వాటాను యజమానులు ఎగవేయటమే. దీని వలన అంతిమంగా నష్టపోయేది కార్మికులే. మన దేశంలో హొటళ్లు అసంఘటిత రంగంగా వున్నందున వాటిలో పని చేసే వారు కూడా శాశ్వతంగా వుండటం లేదు. రుచిగా వంట చేసే వారికి మంచి డిమాండ్‌ వున్నందున అలాంటి వారికి ప్రభుత్వ నిర్ణయించిన వేతనాలకు కొన్ని రెట్లు అదనంగా ఇచ్చి నియమించుకుంటారు. ఇతర పని వారికి నామ మాత్ర లేదా రోజువారీ వేతనాలతో పనులకు పెట్టుకుంటారు. యజమానికి కోపం వచ్చినా, కార్మికులకు కోపం వచ్చినా పని గోవిందా. నిరుద్యోగులు ఖాళీగా వుండకుండా ఏదో ఒక పని చేయాలి కనుక తాత్కాలిక వెసులుబాటుగా హోటళ్లను ఎంచుకుంటారు.ఈ బలహీనతను యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.

    చివరిగా ఒక ప్రశ్న. హోటళ్లలో సేవ నచ్చకపోతే టిప్పు చెల్లించాలా లేదా అన్నది వినియోగదారుడి ఇష్టమని చెబుతున్న ప్రభుత్వం అది తాను అందించే సేవలకు సైతం వర్తింప చేస్తుందా ? సేవలకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటి మీద అదనంగా రుసుముల పేరుతో వసూలు ఎందుకు చేయాలి? చెత్త సెస్సు వసూలు చేస్తున్నా రోడ్లు శుభ్రంగా వుండటం లేదు, అలాంటపుడు దాన్నెందుకు చెల్లించాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మసూద్‌ అజార్‌ను చైనా, దలైలామాను మనం ఎందుకు కాపాడుతున్నాం ?

01 Sunday Jan 2017

Posted by raomk in BJP, CHINA, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

anti china, anti india, China, Dalai Lama, INDIA, masood azhar

Image result for masood azhar,  Dalai Lama

ఎం కోటేశ్వరరావు

    ఈ ప్రశ్న రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వుండాలని కోరుకొనే అనేక మందికి ఆవేదన కలిగిస్తోంది, అదే సమయంలో శత్రుపూరిత సంబంధాలుండాలని కోరుకొనే వారికి ఆనందం కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. అసలేం జరుగుతోంది ? ఐక్యరాజ్యసమితి పరిభాషలో సాంకేతిక అంశాలు ఎలా వున్నప్పటికీ ఆచరణలో మన దేశానికి వ్యతిరేకంగా వుగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లుగా మన ప్రభుత్వం చెబుతున్న మౌలానా మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా పరిగణిస్తూ తీర్మానం చేయకుండా ఏప్రిల్‌, అక్టోబరులో భద్రతా మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకుంది. దాని అభ్యంతరాల గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అయితే రెండు రోజుల ముందే చర్చకు వచ్చిన ఈ అంశాన్ని మరోసారి అడ్డుకొన్నది. దీంతో వుగ్రవాదం పట్ల చైనా ద్వంద్వ ప్రమాణాలను అసుసరిస్తోందని మన దేశం విమర్శించింది. సరిగ్గా ఈ సమయంలోనే అంటే బుధవారం నాడు కజకస్తాన్‌, మంగోలియా, మన దేశ (కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతాన్ని అనుకొని వుండే) -చైనా సరిహద్దులలో వున్న చైనా రాష్ట్రం గ్జిన్‌జియాంగ్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంపై వుగ్రవాదులు దాడి చేసి ఒక కార్యకర్త, భద్రతా సిబ్బంది ఒకరిని హత్య చేశారు. వెంటనే పోలీసులు దాడిలో పాల్గొన్నవారిలో ముగ్గురిని కాల్చివేశారు. అనేక సార్లు ఇస్లామిక్‌ తీవ్రవాదులు అక్కడ దాడులకు పాల్పడిన కారణంగా ఇప్పుడు కూడా వారే అయి వుండవచ్చని వార్తలలోని వ్యాఖ్యలను బట్టి అనుకోవాలి. ఆ వుగ్రవాదులను ఇరుగు పొరుగు దేశాల వారు పెంచి పోషించి రెచ్చగొడుతున్నందున దాడులు చేస్తున్నట్లు చైనా గతంలో విమర్శించింది. చైనా కూడా వుగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది కదా అలాంటపుడు మసూద్‌ అజార్‌పై చర్యను ఎందుకు అడ్డుకుంటున్నట్లు అన్న సందేహం కొంత మందికి కలుగటం సహజం.

    ఈ సమస్య గురించి గురించి ఏకపక్షంగా ఒక వాదననే సమర్ధిస్తూ చర్చించిన వారిని దేశ భక్తులుగానూ, భిన్న కోణాల గురించి వివరించే వారిని దేశ ద్రోహులు లేదా చైనా అనుకూలురుగానో చిత్రించే వాతావరణంలో వున్నాం. ప్రస్తుతం ముస్లిం పాకిస్థాన్‌, కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే అసలు సిసలైన దేశ భక్తిగా కాషాయ సర్టిఫికెట్లు ఇస్తున్న రోజులివి. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన సిపిఎంను చైనా అనుకూల పార్టీగా చిత్రించిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌, అది గతంలో తన రాజకీయ విభాగంగా నడిపిన జనసంఘం ముందు వరుసలో వున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సిపిఎం తన వైఖరిని మార్చుకోలేదు. సరిహద్దు గురించి సంప్రదింపులు జరిపేందుకు అర్హత కేంద్రంలో అధికారంలో వున్నవారికి మాత్రమే వుంటుంది. సిపిఎంకు అటువంటి అవకాశం రాలేదు. అంతకు ముందు చైనాతో యుద్ధానికి అవసరమైతే తాము రంగంలోకి వస్తామంటూ వీధులలో ప్రదర్శనలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు జనతా పార్టీ ముసుగులో ఒకసారి అధికారానికి వచ్చారు, రెండవ సారి బిజెపి పేరుతో, మూడవ సారి కూడా అదే పేరుతో అధికారానికి వచ్చి చేసిందేమిటయ్యా అంటే సామరస్య పూర్వరంగా చైనాతో చర్చలు జరపటమే కాదు, కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా చైనా కమ్యూనిస్టుపార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకొని చైనా యాత్రలు చేసి వస్తున్నారు. అదనంగా వ్యాపారలావాదేవీలతో మునిగి తేలుతున్నారు. చైనాతో ఒకవైపు సంబంధాలు నెరుపుతూనే మరోవైపు చైనా వ్యతిరేక రాజకీయాలలో కూడా భాగస్వాములు అవుతున్న పెద్దలు దేశ భక్తులుగా చెలామణి అవుతున్నారా లేదా ? దీనికి నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, ఇతర బిజెపి మిత్రపక్ష నేతలెవరూ మినహాయింపు కాదు. అలాంటపుడు మసూద్‌ అజార్‌ను చైనా కాపాడటం కూడా అదే రాజకీయాలలో అంతర్బాగమే అని అభిప్రాయపడిన వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు ఎలా అవుతారు ?

     అవన్నీ కాదు మన ప్రయోజనాలే ముఖ్యం, చైనా అయినా మరొక దేశమైనా మనకు అనుకూలంగా వున్నంత వరకు వుపయోగించుకోవాలి, లేనపుడు వ్యతిరేకించాలి అని అనుకోవటానికి ఎవరికైనా హక్కుంది తప్ప భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారి మీద రంగులు చల్లితే, బురద వేస్తే కుదరదు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అనే అతి తెలివి అనాలి. కొంచెం కటువుగా వున్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటివి పని చెయ్యవు అని చెప్పక తప్పదు. ఇరుగు పొరుగుతో స్నేహం చేసేటపుడు రెండువైపులా స్నేహ ధర్మం పాటించాలి. ఈ పూర్వరంగంలో మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు కాపాడుతోందో వారి వైపు నుంచి కూడా చూడటం అవసరం.

Image result for masood azhar,  Dalai Lama

      మసూద్‌ అజార్‌, ఆ వరుసలో వున్న ఇంకా అనేక మంది టెర్రరిస్టులను అంతర్జాతీయంగా గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలనటం నిర్వివాదాంశం. ప్రపంచంలో అనేక దేశాలలో టెర్రరిస్టులు, తిరుగుబాటుదారులు, వేర్పాటు వాదులు ఎందరో వున్నారు. వారు మతాధికారులు, మరొకరు ఎవరైనా కావచ్చు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. అలాంటి అభ్యంతరాలున్న జాబితాలు ప్రతి దేశంలోనూ వుంటాయి. మనకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం వుంది. వాటిలో లడఖ్‌ ప్రాంతంలోని ఆక్సాయ్‌ చిన్‌, ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ వున్నాయి. బ్రిటీష్‌ పాలకులు మనకు తెచ్చిన అనేక సమస్యలలో ఇదొకటి. బ్రిటీష్‌ ఇండియా విదేశాంగ కార్యదర్శిగా పని చేసిన బ్రిటీష్‌ అధికారి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో గీసిన సరిహద్దు లైన్ల ఆధారంగా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం-టిబెట్‌ ప్రభుత్వం మధ్య ఒక సరిహద్దు ఒప్పందం కుదిరింది. టిబెట్‌కు అలాంటి అధికారం లేదని వాదించిన చైనా ఆ హద్దును తాను గుర్తించటం లేదని అప్పుడే స్పష్టం చేసింది. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా వుంచటానికి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కుట్ర చేసినట్లే , సామ్రాజ్యవాదులు టిబెట్‌ను కూడా స్వతంత్ర రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు. మిలిటరీ చర్య ద్వారా కాశ్మీర్‌ను మన దేశంలో అంతర్భాగంగా చేసినట్లే టిబెట్‌ను కూడా చైనా సైనిక చర్య ద్వారా టిబెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ సమయానికి మనదిగా బ్రిటీష్‌ వారు మ్యాపులలో చూపిన ఆక్సాయ్‌ చిన్‌ చైనాలో, చైనాకు చెందినదిగా పేర్కొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో వుంది. దాంతో ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అగత్యం కలిగింది. కాశ్మీర్‌ మన దేశ అంతర్బాగమని కమ్యూనిస్టు చైనా గుర్తించినట్లే, టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని మన దేశం కూడా గుర్తించింది. అయితే చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, టిబెట్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించిన మత పెద్ద దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటును సైతం అనుమతించింది. అయితే దౌత్యపరంగా వాటికి గుర్తింపు ఇవ్వలేదు తప్ప దలైలామా అండ్‌కో చేసే చైనా వ్యతిరేక కార్యక్రమాలు, కార్యకలాపాలన్నింటినీ మన ప్రభుత్వం అనుమతిస్తున్నది.దీనికి కాంగ్రెస్‌, జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. ఒక వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నవారెవరైనా దానికి కొత్త పీఠ ముడులను వేయకుండా చూడాలి. కానీ పరిణామాలు అలా లేవు.

    ఒక శరణార్ధిగా దలైలామాను మన దేశంలో అనుమతించటం వేరు, ఒక తిరుగుబాటు ప్రవాస ప్రభుత్వ నేతగా కార్యకలాపాలను పదే పదే అనుమతించటాన్ని చైనా సహించదని తెలిసి కూడా అనుమతించటాన్ని ఏమనాలి? మన దేశానికి మసూద్‌ అజార్‌ ఎలాంటి ప్రమాదకర వ్యక్తో చైనాకు దలైలామా అంతకంటే ఎక్కువ ప్రమాదకర వ్యక్తి. 1959లో చైనా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి అనేక మంది టిబెట్‌ తిరుగుబాటుదార్లు వుగ్రవాదులుగా మారి అనేక దేశాలలో చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ చివరి వారంలో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో తొలిసారిగా నాలుగు రోజుల పాటు చైనా వ్యతిరేక సంస్ధల అంతర్జాతీయ సమావేశాన్ని జరుపుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. దలైలామాకు ఎప్పటి నుంచో మన దేశం ఆశ్రయం కల్పించి మద్దతు ఇస్తున్నా బహిరంగంగా అమెరికా, ఇతర దేశాలలో ప్రభుత్వేతర సంస్ధల ముసుగులో పనిచేసే చైనా వ్యతిరేకుల సమావేశాన్ని అనుమతించిన ఘనత నరేంద్రమోడీకే దక్కింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతంగా చైనా అంటోంది. అక్కడి తవాంగ్‌ పట్టణం ఆరవ దలైలామా జన్మ స్ధలం. ఈ ఏడాది మార్చి నెలలో తవాంగ్‌ పర్యటన జరపాలని దలైలామా నిర్ణయించుకున్నారు. చైనాకు అభ్యంతరమని తెలిసి కూడా దేశంలో దలైలామా ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్ల వచ్చని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించటం, గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో అమెరికా రాయబారి పర్యటనను అనుమతించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? కాశ్మీర్‌ సమస్యలో మూడో దేశ జోక్యాన్ని మనం అనుమతిస్తామా ?

     దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి మన దేశానికి ఎలాంటి వివాదం, సంబంధం లేదు, మన నౌకలు వెళితే చైనా అడ్డుకున్న వుదంతాలు లేవు. ఆ ప్రాంతంలోని కొన్ని దీవులపై చైనా, జపాన్‌, వియత్నాం, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. ఆ సమస్యను అవే పరిష్కరించుకోవాలి. ఆ ప్రాంతంలో అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తమ నౌకలు స్వేచ్చగా తిరగటానికి వున్న హక్కును అమలు చేసుకొంటున్నామనే పేరుతో అమెరికా-జపాన్‌ కార్యాచరణ బృందం తమ యుద్ధ నౌకలతో ఆ ప్రాంతంలో 2016 మే-జూలై మధ్య రెండున్నర నెలలపాటు విన్యాసాలు నిర్వహించి చైనాతో కయ్యానికి కాలుదువ్వాయి. వాటితో కలసి జలకాలాడేందుకు మన నాలుగు నౌకలను మోడీ సర్కార్‌ పంపటం ఏమిటి ? అమెరికా, జపాన్‌లకు జూనియర్‌ భాగస్వామిగా మన దేశాన్ని మార్చినట్లా, వాటితో పాటు కలిసి చైనాపై బస్తీమే సవాల్‌ విసిరినట్లా ? జపాన్‌తో అమెరికాకు రక్షణ ఒప్పందం వుంది కనుక అమెరికన్లు ఆ ముసుగులో జోక్యం చేసుకుంటున్నారు. మనకు సంబంధం ఏమిటి ? ఎవరిని సంతోష పెట్టటానికి ఈ పని చేసినట్లు ? మసూద్‌ అజార్‌ విషయంలో చైనా అనుసరిస్తున్నదానికి దెబ్బకు దెబ్బ అని మన దేశంలోని చైనా వ్యతిరేకులు వాదించ వచ్చు. అటువంటి వారికి మసూద్‌తో సహా ఇతర వివాదాలపై చైనాను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది ? మనం చైనా వ్యతిరేకికి ఆశ్రయం ఇచ్చిన మాదిరి మన వ్యతిరేకి మసూద్‌ అజార్‌కు చైనా ఆశ్రయం కల్పించలేదు, అలాంటి వారితో మనకు వ్యతిరేకంగా తన గడ్డపై సభల నిర్వహణకు ఏర్పాటు చేయలేదు. మసూద్‌ అజార్‌ను వుగ్రవాదిగా తీర్మానించబోయే ముందు ఆ సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకుంటున్నారేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా కోరింది తప్ప అతను తీవ్రవాది కాదని గానీ అవుననిగానీ చెప్పలేదు. అయితే ఆ వైఖరి ఆచరణలో తీర్మానానికి అడ్డుపడినట్లే అన్నది స్పష్టం. ఇటువంటి వైఖరులతో సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని వుభయ దేశాలు చేసే ప్రకటనలకు అర్ధం వుండదు. ఎవరు ముందు తప్పు చేశారు, ఎవరు తరువాత చేశారు అనే వాద ప్రతివాదాలలోకి పోతే పరిష్కారం కుదరదు.

    గత పాతిక సంవత్సరాలలో ముఖ్యంగా గత పది సంవత్సరాలలో మన దేశాన్ని అమెరికాకు దగ్గరగా తీసుకుపోతున్న కొద్దీ ఆ మేరకు పాకిస్థాన్‌ చైనాకు దగ్గర అవుతోంది. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య వున్న విబేధాలను మన పాలకవర్గం వుపయోగించుకొని లబ్ది పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా-అమెరికా మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొని పాకిస్థాన్‌ అదేపని చేస్తోందన్నది స్పష్టం. ఒకవైపు పాకిస్థాన్‌ అమెరికన్లతో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో రోజు రోజుకూ సంబంధాలను పెంచుకొంటోంది. మనకు చైనాతో వివాదాలు పెంచుకొని అమెరికాతో దగ్గర కావటం లాభమా, చైనాతో వివాదాలను తగ్గించుకొని లాభపడటం మంచిదా అని ఆలోచించుకోవాలి. మనకు, పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించి లబ్ది పొందుతున్న అమెరికా ఇప్పుడు చైనాతో మరోసారి మన వివాదాలు పెంచుకోవాలని కోరుకుంటోంది. మన దేశానికి వారి ఆయుధాలను మరింతగా విక్రయించాలంటే చైనాతో లడాయి పెరగాలి. అప్పుడే వారి ఆయుధ పరిశ్రమలు మూడు పూవులు ఆరు ఆయుధాలుగా వర్ధిల్లుతాయి. ఈ పరిణామాల పూర్వరంగాన్ని అర్ధం చేసుకుంటే చైనా తిరుగుబాటుదారుడు దలైలామాను మన దేశం ఎందుకు సమర్ధిస్తుందో, వుగ్రవాది మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు రక్షిస్తుందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: