• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: June 2017

పెజావర్‌ మఠం- ఇప్తార్‌ విందు-హిందూ మతవాదుల వంచన !

29 Thursday Jun 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

buddism, Hinduism, hindutva, iftar, Iftar At The Pejawar Mutt, Islam, Pejawar Mutt, sankaracharya

ఎం కోటేశ్వరరావు

ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుంది అన్న నాజీ గోబెల్స్‌ జర్మనీలో అదేపని చేశాడు. వాడి నాయకుడైన హిట్లర్‌ జర్మనీ ఔన్నత్యాన్ని పునరుద్ధరించే పేరుతో జర్మనీలో, ప్రపంచంలో ఎంతటి మారణకాండకు కారకుడయ్యాడో తెలిసిందే. ప్రపంచమంతా అసహ్యించుకోవటంతో జర్మన్లు హిట్లర్‌ పేరును వుచ్చరించటానికే ఇష్టపడరు. చెప్పాల్సి వస్తే ఆ కుక్క అన్నట్లుగా సంబోధిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి శక్తులు తామరతంపరగా పెరుగుతున్నాయి. వారిని ఎలా సంబోధించాలో వాటి దుష్ఫలితాన్ని అనుభవించబోయే తరాల నిర్ణయానికి వదలివేద్దాం.

ఏ మతాన్ని అవలంభించాలో, మత రహితంగా వుండాలో నిర్ణయించుకొనే హక్కు ఎవరికైనా వుంటుంది. ఇక్కడ పుట్టావుగనుక హిందువుగానే వుండాలనే నిరంకుశ భావం పెరుగుతోంది కనుకనే సమస్య వస్తోంది. సహజంగానే తాము నమ్మిన మతం గొప్పతనం గురించి చెప్పుకోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇబ్బంది లేదు. తమ మతానికి లేని గొప్పలను ఆపాదించి, ఇతర మతాలను ద్వేషించే వున్మాదానికి గురైతే మాత్రం సహించకూడదు. ప్రపంచంలో అనేక అభూతకల్పనలు, అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చారు. వాటంతటవే పుట్టవు. హిందూ మతం సహనశీలి, హిందువులకు సహనం పుట్టుకతో వస్తుంది అన్నది అలాంటి వాటిలో పెద్దది.

కర్ణాటక వుడిపిలోని పెజావర్‌ మఠాధిపతి శ్రీ విశ్వేష తీర్ధ స్వామీజీ రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు మఠ ప్రాంగణంలో ఇప్తార్‌ విందు ఏర్పాటు, వారి ప్రార్ధనలకు అనుమతివ్వటం మతోన్మాద శక్తులకు మింగుడుపడటం లేదు. అది హిందూమత గొప్పతనానికి చిహ్నం అంటూనే కొందరు ఇతర మతాలకు లేని సహనం మనకెందుకు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి కొందరు మింగలేక కక్క లేక తేలు కుట్టిన దొంగల మాదిరి వున్నారు. వుమ్మెత్త కాయలు తిన్నవారు ఆ చర్య హిందూమతానికి అవమానం అంటున్నారనుకోండి. ముస్లింలను మఠానికి ఆహ్వానించటం, వారికి భోజనం పెట్టటాన్ని ఒక సమస్యగా చేయవద్దని, ఇదేమీ కొత్తగా జరిగింది కాదని ఆ స్వామీజీ తన చర్యను సమర్ధించుకున్నారు. మఠంలో అందరికీ భోజనాలు పెడతారు, ఈసారి ప్రత్యేకతేమంటే నేనే ముస్లింలను ఆహ్వానించాను అని స్పష్టం చేశారు. అన్ని సందర్భాలలో తనకు వారు సహకరించారని, మఠానికి మద్దతుగా నిలిచారని చెప్పారు. భక్తల్‌,గంగావతి వంటి చోట్ల ముస్లింలు తమ ఇండ్లకు తనను ఆహ్వానించటంతో పాటు మసీదుల ప్రారంభానికి పిలిచారని కూడా చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ప్రార్ధనలను ఎలా అనుమతించారన్న ప్రశ్నకు ముస్లింలు తమ దేవుడిని ప్రార్ధించేందుకు నమాజ్‌ చేశారు, దానిలో హిందూమతాన్ని కించపరచలేదన్నారు. గొడ్డు మాంసం తినేవారిని ఎలా ఆహ్వానించారన్న ప్రశ్నకు ముస్లింలే కాదు అనేక మంది హిందువులు గొడ్డు మాంసం తినటం లేదా అని ఎదురు ప్రశ్నించి హిందువులైనా ముస్లింలనైనా గొడ్డు మాంసం తినవద్దని శాంతియుత పద్దతులలో ఒప్పించాలని అన్నారు.

ఇతర సందర్భాలలో ముఖ్యంగా దళితుల పట్ల, బ్రాహ్మణులకు ప్రత్యేక పంక్తులు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టటం వంటి విషయాలలో పెజావర్‌ మఠనిర్వాహకుల వైఖరిని సమర్ధించకూడదు కానీ ప్రస్తుతం దేశంలో వున్న పరిస్ధితులలో హిందూ మతోన్మాదులు రెచ్చిపోతారని తెలిసి కూడా ఇప్తార్‌ విందు ఇవ్వటం, ప్రాంగణంలో ప్రార్ధనలను అనుమతించటం అభినందనీయమే. ఇదే సమయంలో ఈ చర్యను సమర్ధిస్తున్నట్లు కనిపిస్తూ కొందరు చేస్తున్న వాదనలు, ప్రచారాన్ని ఎండగట్టక తప్పదు.

ముఖం మీదే పచ్చబొట్టు పొడిపించుకొని ప్రదర్శించుకున్నట్లు ఏ మాత్రం సిగ్గుపడకుండా తాము భారతీయ మితవాదులమని రాసుకొనే ‘స్వరాజ్య’ పత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ ఆర్‌ జగన్నాధన్‌ సదరు మఠ స్వామీజీ తానేమిటో, ఎటువైపో తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు ‘ కులంతో సహా హిందూయిజంలో అనేక బేధాలున్నాయి. దౌర్జన్యపూర్వక మతమార్పిడి అజెండాలతో వున్న చర్చి, మసీదులతో సహా అనేకం నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిపై కేంద్రీకరించి, హిందూయిజాన్ని అంతర్గతంగా పట్టిష్టపరచటమా లేక తన లౌకికవాదాన్ని ప్రదర్శించేందుకు మసీదులను ప్రారంభించటమో తేల్చుకోవాలి’ అంటూ ఎద్దేవా చేస్తూ తన వ్యాసాన్ని ప్రారంభించారు. ఇస్లాం, క్రైస్తవం ఇతర విశ్వాసాలలోని నిజాన్ని అంగీకరించవని, హిందూమతం దేవుళ్లను నమ్మటాన్ని నమ్మకపోవటాన్ని కూడా అంగీకరించే వుదారత్వం కలిగి వుందని, స్వామీజీ మసీదులకు వెళ్లి భగవద్గీత, వేదాలను చదవటాన్ని అంగీకరిస్తే అది ముస్లిం సమాజపు వుదారత్వానికి చిహ్నం అవుతుందని, ఒక్కరిని అయినా హిందూమతంలోకి మార్చగలిగితే స్వామీజి పెద్ద విజయం సాధించినట్లేనని ఎద్దేవా చేశారు. ఇంకా తన పాండిత్యాన్నంతటినీ ప్రదర్శించి స్వామీజీని హిందూమతావలంబకుల ముందు దోషిగా నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డారు.

హిందూ మత పునరుద్ధరణ, దాని పెత్తనాన్ని రుద్దాలనే శక్తులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. అందుకు సామాజిక మీడియాను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇతర అన్ని వనరులను వాడుకుంటున్నాయి. ఏ మతమైనా సామాన్యులకు దూరమైందంటే దానిలోని తిరోగామి లక్షణాలే కారణం. ఒకవైపు హిందూమత పెత్తన పునరుద్ధరణకు కొందరు పూనుకుంటే దానిలోని తిరోగామి ధోరణులను, కులాల కుంపట్లను సజీవంగా వుంచే ధోరణులు కూడా సమాజంలో పెరుగుతున్నాయి.మన దేశానికే పరిమితం కాకుండా ఏ దేశం వెళితే ఆ దేశానికి కూడా కుల గజ్జి, మతోన్మాదాన్ని తీసుకుపోతున్నారు. ఇంతకాలంగా ఇతర మతాలవారితో సంబంధాలను వ్యతిరేకించిన ఫ్యూడల్‌ శక్తులు ఇప్పుడు కుల, కుటుంబ మర్యాదలను కాపాడే పేరుతో హిందూ మతంలోని అంతర కుల వివాహాలను అంగీకరించటం లేదు. ఎవరైనా ముందడుగేస్తే అలాంటి యువతీ యువకులను అత్యంత కిరాతకంగా చంపివేస్తున్న దుర్మార్గ పరిస్ధితులు నేడున్నాయి. ఒక ముస్లిం, క్రైస్తవుడు మతం మారితే హిందూ మతంలో వారికి ఏ కులాన్ని కేటాయిస్తారు? అన్న చిన్న ప్రశ్నకు ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు. ఇంకా ఇలాంటివే ఎన్నో వున్నాయి.

పెజావర్‌ స్వామీజీ ముస్లింలను మఠానికి పిలిచి వుపవాస దీక్ష విరమణ తరువాత భోజనం లేదా పండ్లు పలహారాలు పెట్టారు. దాన్ని ముస్లింలు ఇప్తార్‌ అంటారు. గొడ్డు మాంసం పెట్టలేదు. హలీం రుచి చూపించలేదు. మఠ ప్రాంగణంలో అల్లా గురించి ప్రార్ధన చేసుకోమన్నారు తప్ప ఖురాన్‌ పఠనం చేయించలేదు. ఈ మాత్రం కూడా సహించని మతోన్మాదులు నిజంగా గొడ్డుమాంసం, ఖురాన్‌ పఠనాన్ని అనుమతిస్తే స్వామీజీని ఏం చేసి వుండేవారో ?

ఇతర మతాలకు లేదని, తమకు మాత్రమే వుదారత్వం వుందని చెప్పుకొనే హిందూత్వ వాదులు దాన్ని రుజువు చేసుకోవాలంటే దేవాలయాల్లో బైబిలు, ఖురాన్‌ పఠనాలను అనుమతించిన తరువాత భగవద్గీత గురించి ఆ మతాల వారికి, ఇతరులకు అడ్డు సవాళ్లు విసరాలి. ఒక మత ప్రార్ధనలు, ప్రవచనాలు మరొక మత కేంద్రం నుంచి చేయటం లేదనే చిన్న సాంకేతికాంశం తప్ప ఆచరణలో జరుగుతున్నదేమిటి ? పొద్దున లేస్తే రాత్రి పొద్దు పోయే వరకు, దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి చెవులు చిల్లులు పడేలా వినిపించే వాటిని, వీధుల్లో చేసే భజనలు, ఇతర హంగామాలను అన్ని మతాల వారు, మతాలను విశ్వసించని వారు కూడా సహించటం లేదా ? దేవాలయాల నుంచి వినిపించేవి మసీదులు, చర్చీలలో వుండేవారికి వినిపించటం లేదా, వారివి వీరికి వినిపించటం లేదా ? ఈ గోల భరించలేకపోతున్నామని మొత్తుకొనే అన్ని మతాలకు చెందిన రోగులు, చెప్పలేని పసి పిల్లలు, ఇతర సమస్యలున్న వారి గోడు ఏ ప్రార్ధనా స్ధలమైనా, మతమైనా పట్టించుకొంటోందా ? మైకుల సౌండ్‌ తగ్గిస్తోందా ? ఎందుకీ ఆత్మవంచన? ఓట్ల కోసం గతంలో ఒక రాజకీయం నడిస్తే ఇప్పుడు సులభంగా ఓటు బ్యాంకులు ఏర్పాటు చేసుకొనేందుకు మత రాజకీయాలను ముందుకు తెస్తున్నారు తప్ప ప్రస్తుతం జనానికి కావాల్సింది మతమా ? మానవత్వమా, గౌరవప్రదమైన జీవనమా ?

ఇక హిందూమత విశాల, వుదారత్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అనేక మంది మన దేశంలో మసీదులు, చర్చిల నిర్మాణాల గురించి చెబుతారు. వాటికి వెళ్లే జనాభా పదుల కోట్లలో వున్నారు. కొన్ని లక్షల మంది హిందువులు నివశించే లేదా పనులకోసం వలస వెళ్లే పశ్చిమాసియా , ఐరోపా, అమెరికాలలో హిందూ దేవాలయాల నిర్మాణాలను అక్కడ కూడా అనుమతిస్తూనే వున్నారుగా అది విశాల, వుదారత్వం కాదా ? http://www.catchnews.com/world-news/west-asia-temples-hindu-1439789867.html బౌద్దమతాన్ని అవలంభించే తూర్పు ఆసియా, ఇస్లాం దేశమైన ఇండోనేషియాలో పురాతన హిందూ దేవాలయాలు ఇప్పటికీ భద్రంగానే వున్నాయిగా ! అది ఆయా దేశాల మెజారిటీ మతాల విశాల వైఖరికి చిహ్నం కాదా ?

ఎంతో విశాలమైనది అని చెప్పుకొనే మన దేశ చరిత్రను చూస్తే అనేక జైన, బౌద్ధ ఆలయాలను శైవ, వైష్ణవ దేవాలయాలుగా మార్చిన విశాల వైఖరి మనకు కనిపిస్తూనే వుంది.మన కళ్ల ముందే బాబరీ మసీదును కూల్చిన వుదారత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు.http://bapumraut.blogspot.in/2013/02/how-adi-shankara-destroyed-buddhism-and.html ,
http://rupeenews.com/2010/10/how-adi-shankara-destroyed-buddhism-and-founded-hinduism-in-the-8th-century/  శంకరాచార్యుడు బౌద్దాన్ని నాశనం చేసి హిందూయిజాన్ని ముందుకు తెచ్చిన చరిత్రను విశాల హృదయులైన హిందువులకు వేరుగా చెప్పనవసరం లేదు. ఆ ‘ఘన ‘చరిత్రలను కమ్యూనిస్టులు రాయలేదు.

మానవ సమాజాలు ఎక్కడ వునికిలోకి వస్తే అక్కడ ఆయా కాలాల్లో ఏదో ఒక తత్వశాస్త్రం దానిని అనుసరించి ఏదో ఒక మతం వునికిలోకి వచ్చింది. సామాజిక అభివృద్ధి క్రమంలో ఆదిమ కమ్యూనిజం అంతరించిన తరువాత వునికిలోకి వచ్చిన ప్రతి దోపిడీ వ్యవస్ధ అంతకు ముందున్న వ్యవస్ధ కంటే పురోగామి లక్షణాలతోనే ప్రారంభమైంది. దానితో పాటు ఒక దశలో అది సమాజపురోగతికి ఆటంకమైనపుడు దానిని కూల్చివేసే శక్తులను కూడా అదే వ్యవస్ధ తయారు చేసిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. బానిసలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు ఆ కోవకు చెందినవారే. అక్రమంలోనే వునికిలోకి వచ్చిన మతాలు కూడా ఒక దశలో అవి సమాజ పురోగతికి అడ్డుపడినపుడు వాటిపై తిరుగుబాటుగా కొత్త తత్వశాస్త్రాలు వాటికి అనుగుణంగా చిన్నవో పెద్దవో కొత్త మతాలు వచ్చాయి. అనేక మతాలు ప్రారంభమైన చోట అంతరించి కొత్త చోట్ల మెజారిటీ మతాలుగా మారాయి. కొన్ని ప్రాంతాలలో అంతరించాయి, పరిమితంగా మారాయి. యూదు మతంపై తిరుగుబాటుగా క్రైస్తవం, క్రైస్తవంలోనే అంతర్గతంగా ప్రొటెస్టెంట్‌ వంటి కొన్ని అంశాలపై ఏకీభవించే శాఖలు, మొత్తంగా క్రైస్తవంపై తిరుగుబాటుగా ఇస్లాం వునికిలోకి వచ్చింది. కొత్త మతాలన్నీ పాతమతాలతో ఘర్షణ పడ్డాయి. ఒకదానినొకటి అంతం చేసుకొనేందుకు ప్రయత్నించాయి. అయితే ఇవి అన్ని చోట్లా ఒకే విధంగా జరగలేదు.

మన దేశంలో కూడా మత చరిత్ర అదే చెబుతోంది. క్రైస్తవానికి ఏసు క్రీస్తు-బైబిల్‌, ఇస్లాముకు మహమ్మద్‌ ప్రవక్త-ఖురాన్‌ మాదిరి హిందూ మతం అని పిలుస్తున్నదానికి ఆద్యుడునదగిన పేరు గాని, నిర్ధిష్ట గ్రంధంగానీ లేదు. వేదాలు, వుపనిషత్తులు, రామాయణ, మహాభాగవతాల వంటివెన్నింటినో హిందూ మత గ్రంధాలుగా చెబుతున్నారు. వేదాలను ప్రమాణంగా పరిగణించిన వేదమతం, తరువాత వునికిలోకి వచ్చిన జైన, బౌద్ధ మతాలు, వాటిలో శాఖోపశాఖలు, వాటి మధ్య జరిగిన ఘర్షణలు, రక్తపాత చరిత్రను చూస్తే ఈనాడు చెబుతున్న హిందూమతం పరమతాలను సహించిన వుదారవాది అన్నది వాస్తవం కాదన్నది స్పష్టం. క్రీస్తుశకం 788లో పుట్టి 820లో మరణించారని చరిత్ర చెబుతున్న శంకరాచార్య గురించి కంచి మఠ వెబ్‌ సైట్‌ పేజీలలో ఫ్రొఫెసర్‌ పి సూర్యనారాయణ తన వ్యాసంలో ఇలా రాశారు. ఆయనేమీ విదేశీయుడు కాదు, కమ్యూనిస్టు అంతకంటే కాదు. ‘వేద మతం మరియు తత్వశాస్త్రం,దేవుడు, ఆత్మలను వ్యతిరేకించిన తిరుగుబాటు బిడ్డే బుద్ధిజం. వేదాల ఆలోచన మూలాలకే అది గొడ్డలిపెట్టుగా తయారై దాని వునికికే పెద్ద ప్రమాదకారిగా మారింది. ఈ దాడిని వీలైనపుడల్లా ఎదుర్కొని కట్టడి చేయటం వల్లనేే బుద్ధిజం ఇతర ప్రాంతాలలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ ఖ్యాతి ప్రాధమికంగా మీమాంసక, కుమారిల భట్టులకు చెందాలి. దానికి కారణం శ్రీ శంకరాచార్య తార్కిక పద్దతి, తిరుగులేని వాదనలు, అవి వేద మత వారసుల మనస్సులను ఆకట్టుకొని వూగిసలాటలను పోగొట్టాయి.’ మన దేశంలో బౌద్దాన్ని నాశనం చేయటంలో శంకరాచార్య బోధనలను అనుసరించిన వారితో పాటు అదే సమయంలో మన దేశంపై దండయాత్రలు చేసిన ముస్లిం పాలకులు కూడా బౌద్ధంపై దాడి చేశారన్నది ఒక అభిప్రాయం. శైవుడైన బెంగాల్‌ రాజు శశాంకుడు బౌద్దాన్ని నాశనం చేయటంలో భాగంగా బుద్ద గయలోని బోధి చెట్టును కొట్టి వేయించాడని, అనేక బౌద్దారామాలను ధ్వంసం చేయించటంతో పాటు చివరి బౌద్ద రాజును హత్య చేయించాడని కూడా చరిత్రలో వుంది.

ముస్లిం దండయాత్రలకు ముందు మన దేశంలో శివ, వైష్ణవ మతాలను అవలంభించిన రాజులు, వారు రెచ్చగొట్టిన మతోన్మాదం, జరిగిన రక్తపాత చరిత్ర దాస్తే దాగని సత్యం. అశోకుడు బౌద్ద మతాన్ని అనుసరించాడు కనుక ఆయన కాలంలో బౌద్ద పరిఢవిల్లింది, విదేశాలకూ వ్యాపించింది. ఇప్పుడు ఇస్లామిక్‌ దేశంగా వున్న ఇండోనేషియాలో, బౌద్ధమతం అవలంభించే ధాయ్‌లాండ్‌ వంటి దేశాలలో ఇప్పటికీ హిందూ పురాణాలు, ఇతి హాసాలలో కనిపించే పేర్లను పెట్టుకోవటం చూస్తున్నాం. ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో(సుకర్ణుడు) ఆయన ఒక భార్య పేరు పట్మావతి(పద్మావతి) కుమార్తె పేరు మేఘావతి పుత్రి కూడా దేశాధ్యక్షురాలిగా పని చేశారు. ఇది విశాల దృక్పధమా, సంకుచితమా ?

మన దేశంపై ముస్లింలకు ముందు ఇతర దేశాల నుంచి వచ్చిన వారి దండయాత్రలు జరిగాయి. ఒక దేశంపై మరొక పెద్ద రాజ్యం దండయాత్రలు చేయటం రాజరిక లక్షణాలలో ఒకటిగా పరిగణించటమే కాదు, మహా సామ్రాజ్యాలను నెలకొల్పటం గొప్పగా భావించిన చరిత్ర ప్రపంచమంతటా కనిపిస్తుంది. ముస్లిం దండయాత్రలు, తరువాత వారి స్ధానాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుల పాలనలో వారి మతాలైన ఇస్లాం, క్రైస్తవాన్ని వ్యాపింప చేసేందుకు ప్రయత్నం జరిగింది. హిందూ మతాలను అవలంభించే రాజులు తమ రాజ్యాలను కాపాడుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు గనుక కాల క్రమంలో ఇస్లాం, క్రైస్తవ మతాల ధాటిని తట్టుకోవటానికి శైవులు, వైష్ణవులు అందరూ రాజీపడ్డారు. ఈ మతాలకు మూలమైన మనువాదం సమాజాన్ని కులాల వారీగా చీల్చటమే గాక గణనీయ సంఖ్యలో వున్న అణగారిన వర్గాలను అంటరాని వారిగా మార్చి గ్రామాలకు దూరంగా పంపింది. అలాంటి సామాజిక అణచివేత పీడితులు అనేక మంది ఇస్లాం, క్రైస్తవ మతాలను ఆశ్రయించి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు. ఇలాంటి పరిణామం ఎంతో విశాలమైదని చెప్పుకొనే హిందూ మతం వ్యాపించిన మన దేశంలో తప్ప మరెక్కడా కనపడదు.

ప్రలోభాలు పెట్టి క్రైస్తవం మతమార్పిడులు చేయించిందని అనేక మంది గుండెలు బాదుకొనే వారు అంటరానితనం గురించి మాట్లాడరు. ఇప్పటికీ దానిని పాటిస్తూనే వున్నారు. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో సామాన్య దళితులతో పాటు అగ్రవర్ణాలుగా పరిగణించబడే వారు కూడా క్రైస్తవ మతంలోకి మారారు. నిజానికి వారికి సామాజిక అణచివేత లేదా అంటరానితనం సమస్య లేదు. వారెందుకు మారినట్లు ? ఎలాంటి మార్పు లేకుండా, అన్నీ వేదాల్లోనే వున్నాయష అని చెప్పేవారి ప్రభావానికిలోనై నూతన ఆవిష్కరణలకు దూరమైన వారు ఆంగ్ల విద్య, పారిశ్రామిక విప్లవ ఫలాలను చూసి క్రైస్తవ మతం, అది ఏర్పాటు చేసిన ఆధునిక విద్యా సంస్ధలకు ఆకర్షితులయ్యారు. అనేక ప్రాంతాలలో క్రైస్తవ విద్యా సంస్ధల పేరుతో ప్రఖ్యాతి గాంచిన వన్నీ వారి వారసులు ఏర్పాటు చేసినవే. అంటే ఆ మార్పిడి ద్వారా కూడా ఆర్దికంగా లబ్దిపొందవచ్చని గ్రహించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవమతంలోని ప్రధాన అధికారులుగా అగ్రవర్ణాలనుంచి మతం మారిన వారే కనిపిస్తారు. వారి వివాహాలు కూడా అదే తరగతులకు చెందిన వారి మధ్య జరుగుతాయి.

హిందూమతం గత ఘనతను చూడండి, దాన్ని పునరుద్దరించండి అంటూ మతరాజకీయాలు చేయటంలో భాగంగానే పెజావర్‌ మఠ స్వామిని కొందరు విమర్శించుతున్నారు.హిందూమతానికి లేని విశాల దృక్పధాన్ని ఆపాదిస్తున్నారు.ఆత్మవంచన, పరవంచనకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారతీయ మహిళలు ఆవు ముసుగులెందుకు ధరిస్తున్నారు ?

28 Wednesday Jun 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP’s trolling army, cow masks, Hindu Fundamentalism, Hindu supremacy, Hinduthwa, Indian women wearing cow masks, Narendra Modi, trolling army

గీతా పాండే బిబిసి న్యూస్‌, ఢిల్లీ

భారత దేశంలో పశువుల కంటే మహిళలు తక్కువ ప్రాధాన్యత కలిగిన వారా అనే తుపాకి మందులా పేలే ప్రశ్న వేస్తూ ఆవు ముసుగులు ధరించిన మహిళల ఫొటోలు దేశంలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. వాటిని తీసిన 23 సంవత్సరాల ఫొటో గ్రాఫర్‌ హిందూ జాతీయవాద మరుగుజ్జు యోధుల(ట్రోల్స్‌) ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు.

‘ఒక మహిళకంటే ఆవులను ప్రాముఖ్యత కలిగినవిగా పరిగణించటాన్ని చూసి నేను విహ్వలనయ్యాను. అనేక మంది హిందువులు పవిత్రమైనదిగా భావించే ఆవు కంటే అత్యాచారం లేదా దాడికి గురైన ఒక మహిళకు న్యాయం జరగటానికి ఎక్కువ కాలం పడుతోంది.’ అని ఢిల్లీకి చెందిన ఫొటోగ్రాఫర్‌ సుజాత్రో ఘోష్‌ బిబిసితో చెప్పారు. మహిళలపై నేరాల విషయంలో భారతదేశం తరచూ వార్తలకు ఎక్కుతోంది.ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి పదిహేను నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది.

‘నిందితులకు శిక్ష పడటానికి ముందు కోర్టులలో ఈ కేసులు సంవత్సరాల తరబడి నడుస్తున్నాయి. అదే ఒక ఆవును వధిస్తే హిందూ వుగ్రవాద బృందాలు తక్షణమే వెళ్లి ఆవును వధించినట్లు అనుమానించిన వారిని చంపటమో కొట్టటమో చేస్తున్నాయి.’ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ 2014 వేసవిలో అధికారానికి వచ్చిన తరువాత ధైర్యం తెచ్చుకున్న గో రక్షక బృందాల ప్రభావం పెరిగిపోవటంపై తాను తీసిన ఫొటోల కార్యక్రమం ‘తనకు తోచిన పద్దతిలో నిరసన’ అని అతడు చెప్పాడు.

‘విచారణ చేయకుండా చంపిన దాద్రీ వుదంతం( గొడ్డు మాంసాన్ని తిని, నిలవ చేశాడనే పుకార్లతో ఒక హిందూ గుంపు ఒక ముస్లింను హత్య చేసినవుదంతం) ఇంకా అలాంటివే ముస్లింలపై గోరక్షకులు చేసిన ఇతర మతపరమైన దాడులతో ఆందోళన చెందా’ అన్నాడు ఘోష్‌.

ఇటీవలి నెలల్లో భారత్‌లో సమీకరణలకు ఆవు అత్యంత ముఖ్యమైన జంతువుగా మారింది.ఆ జంతువు పవిత్రమైనదని, దానిని రక్షించాలని బిజెపి నిర్దేశిస్తోంది. అనేక రాష్ట్రాలలో గోవధను నిషేధించాయి, నేరం చేసిన కఠిన శిక్షలను ప్రవేశపెట్టాయి మరియు ఆ నేరం చేసినందుకు మరణశిక్షను విధించేందుకు వీలుగా ఒక బిల్లు పెట్టటం గురించి పార్లమెంట్‌ పరిశీలిస్తోంది.

అయితే ముస్లింలు, క్రైస్తవులు మరియు కోట్లాది మంది తక్కువ కుల దళితులకు( గతంలో అంటరానివారు) గొడ్డు మాంసం ముఖ్యమైనది. గో రక్షణ గుంపులు చేస్తున్న దుష్కార్యాలకు వారే గురి అవుతున్నారు. ఆవు పేరుతో గత రెండు సంవత్సరాలలో దాదాపు డజను మంది హత్యకు గురయ్యారు.తరచుగా నిరాధారమైన పుకార్ల ప్రాతిపదికన లక్ష్యాలను నిర్ణయిస్తున్నారు అంతే కాదు పాలకోసం ఆవులను తరలిస్తున్నపుడు కూడా ముస్లింలపై దాడులు చేశారు.

ఘోష్‌ తూర్పు ప్రాంత పట్టణమైన కొల్‌కతాకు( గతంలో కలకత్తా) చెందిన వారు.’కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చిన తరువాతే ‘ ప్రమాదకరమైన మతం మరియు రాజకీయాల కలగలుపు గురించి ‘ తెలిసిందన్నారు.’ఈ ఫొటోల కార్యక్రమం మౌనంగా జరిపే ఒక నిరసన రూపం, అది తగిన ప్రభావం చూపుతుందని నేను అనుకుంటున్నా’ అన్నారు. ఈనెల ప్రారంభంలో న్యూయార్క్‌ సందర్శన సందర్భంగా ఒక దుకాణంలో ఆవు ముసుగును కొనుగోలు చేశారు. తిరిగి వచ్చిన తరువాత సందర్శకులు సంచరించే ముఖ్యకేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, వీధులు, ఇళ్లు, పడవలు, రైళ్లలో ఆవు ముసుగులు ధరించిన మహిళలతో ఫొటోలు తీశారు. ఎందుకంటే ప్రతి చోటా మహిళలు దాడికి అనువుగా వుంటారు.

‘ సమాజంలోని అన్ని భాగాల నుంచి మహిళల ఫొటోలు తీశాను. రాజకీయాలు, మతం ఎక్కువ చర్చలు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతాయి రాజధాని నగరం కేంద్రం కనుక ఈ కార్యక్రమాన్ని నేను ఢిల్లీ నుంచి ప్రారంభించాను. భారత్‌లో ఎక్కువ మంది సందర్శించే స్ధలాలో ఒకటైన సరూపమైన ఇండియా గేట్‌ దగ్గర తొలి చిత్రం తీశాను. తరువాత రాష్ట్రపతి భవనం ఎదుట ఒక మోడల్‌తో తీశాను.మరొకటి కొలకతాలోని హుగ్లీ నదిలో పడవపై హౌరా వంతెన నేపధ్యంలో తీశాను.’ అన్నాడు. అతడు ఎంచుకున్న మోడల్స్‌ ఇంత వరకు అందరూ స్నేహితులు, బాగా తెలిసిన వారే ఎందుకంటే ‘ ఇది ఒక సున్నితమైన అంశం, దీనికి కొత్త వారిని సంప్రదించటం కష్టం అవుతుంది’ అన్నాడు.

రెండు వారాల క్రితం ఇనస్టాగ్రామ్‌లో అతను ప్రారంభించిన ఫొటోల కార్యక్రమానికి ‘అంతా సానుకూల ‘ స్పందనే వచ్చింది. తొలి వారంలో అది వైరస్‌ మాదిరి వ్యాపించింది. నా శ్రేయోభిలాషులు, చివరికి నాకు తెలియని వారు కూడా నన్ను అభినందించారు.’ అయితే భారతీయ మీడియా వాటిని ప్రచురించి ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో వాటి కధనాలను పెట్టిన తరువాత ప్రతి క్రియ ప్రారంభమైంది.’ కొంత మంది నన్ను బెదిరిస్తూ వ్యాఖ్యలు రాశారు.ట్విటర్‌ మీద నన్ను వెంటాడటం ప్రారంభించారు. నన్ను, నా మోడల్స్‌ను ఢిల్లీ జమా మసీదుకు తీసుకువెళ్లి వధిస్తామని, మా మాంసాన్ని ఒక మహిళా జర్నలిస్టు, రచయిత్రికి తినిపిస్తామంటూ జాతీయ వాదులు తమ ఏహ్య భావాన్ని వెల్లడించారు. నా శవాన్ని చూసి నా తల్లి ఏడవటాన్ని చూడాలని వుందని వారు చెప్పారు.’ కొందరు ఢిల్లీ పోలీసులను కూడా సంప్రదించారు.నేను కొట్లాటలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నానని అరెస్టు చేయాలని కోరారు.’

తీవ్ర వ్యాఖ్యలు వెలువడటంపై ఘోష్‌ ఆశ్చర్యపడలేదు,తీవ్ర వ్యంగ్యంతో కూడిన తన ఫొటోలు పరోక్షంగా బిజెపిపై చేసిన వ్యాఖ్య అని ఘోష్‌ అంగీకరించారు.నేను రాజకీయ ప్రకటన చేస్తున్నాను, ఎందుకంటే అది రాజకీయ అంశం కనుక, అయితే మనం విషయాలలోకి లోతుగా వెళితే అక్కడ మనకు ఎల్ల వేళలా హిందూ ఆధిపత్యం కనిపిస్తుంది. గత రెండు సంవత్సరాలలో ఈ ప్రభుత్వంతో అది బహిర్గతమైంది.’ బెదిరింపులు అతనిని భయపెట్టలేదు.’ నేను భయపడలేదు, ఎందుకంటే ఒక మంచి కోసం నేను పని చేస్తున్నాను’ అన్నాడు.

ఈ ఫొటోల కార్యక్రమం తరువాత ఒక సానుకూల అంశమేమంటే ప్రపంచమంతటి నుంచి అనేక మంది మహిళలు తాము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములం అవుతామని సందేశాలు పంపారు. అందువలన ఆవు ప్రయాణిస్తూనే వుంటుంది అన్నాడతడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తప్పుడు సంకేతాల గురించి మీరు కూడా చెప్పటమా చంద్రబాబూ ? హతవిధీ !

28 Wednesday Jun 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, chandababu, dalits

ఎం కోటేశ్వరరావు

తప్పుడు సంకేతాల గురించి చెప్పిన చంద్రబాబు షేక్స్పియర్‌ ప్రఖ్యాత నాటకం జూలియస్‌ సీజర్‌లో బ్రూటస్‌ పాత్రధారిని గుర్తుకు తెచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారుల వుపాధికి, అంతకు మించి అనేక గ్రామాలను కాలుష్యానికి గురి చేసే తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీని తరలిస్తే ‘తప్పుడు’ సంకేతాలు వెళతాయి గనుక తరలించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఈ ప్రకటన ద్వారా అలాంటి హానికరమైన పరిశ్రమలను చివరకు ప్రజల పడక గదుల్లో పెట్టినా తమకు మద్దతు ఇస్తారని పౌరుల ఆరోగ్యాలు, ప్రాణాల నుంచి కూడా లాభాలు పిండుకోవాలనే పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లయింది. అందువలన తేల్చుకోవాల్సింది జనమే. చంద్రబాబుకు, అలాంటి కాలుష్యకారక, ప్రమాదకర పరిశ్రమలకు మద్దతు తెలిపే వారికి ఎలాంటి సంకేతాలు పంపాలో తేల్చుకోవాలి. ఫ్యాక్టరీని తరలించేది లేదన్న ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతల, ప్రభుత్వ యంత్రాంగ మొండి వైఖరి సంకేతాలను గత మూడు సంవత్సరాలుగా జనం చూస్తూనే వున్నారు. అయినను పోయి రావలె అమరావతికి అన్నట్లుగా ఆ ప్రాంత జనం వెళ్లారు.ఐదూళ్లు కాదు సూది మోపినంత కూడా స్ధలం ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి చంద్రబాబు ఇచ్చిన సందేశం స్వయంగా విన్నారు. ఇప్పటివరకు సాగించిన పోరాటాన్ని మరో రూపంలో సాగించటమా ఆ కాలుష్యానికి తామే గాక తమ ముందు తరాల వారిని కూడా బలి చేయటానికి ఫ్యాక్టరీ యాజమాన్యం, వారికి మద్దతు పలుకుతున్న పాలకులు, పార్టీల ముందు సాగిల పడటమా అన్నది జనం ముందున్న ప్రశ్న. ఈ సమస్య పరిష్కారానికి దగ్గర దారులు లేవు అని గ్రహించటం అవసరం.

స్వాతంత్య్ర పోరాటం మనకు అనేక అనుభవాలు నేర్పింది. తెల్లవారికి తొత్తులుగా, జనానికి నష్టం చేకూర్చే శక్తులు, వ్యక్తులకు సహాయ నిరాకరణ ఒక మార్గం. ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ప్రజల వాంఛలకు వ్యతిరేకంగా దానిలో పని చేసేందుకు ఎవరైనా వెళితే వారి గురించి ఆలోచించాల్సి వుంటుంది. మనల్ని చంపటానికి ఎవరైనా పూనుకున్నపుడు ఆత్మరక్షణ కొరకు అలాంటివారి ప్రాణాలు తీసినా అది నేరం కాదు. తుందుర్రు ఫ్యాక్టరీ కూడా అలాంటిదే అని భావించుతున్నారు నుకనే మూడున్నర సంవత్సరాలుగా అనేక అక్రమ కేసులు, జైళ్లకు వెళ్లటానికి అలవాటు పడ్డారు. లొంగిపోయి అనారోగ్యాలతో ఆ ప్రాంతంలో ఈసురో మంటూ గడిపే కంటే దూరంగా వున్న జైళ్లే నయం కదా ! అంతకంటే పాలకులు ఏం చేస్తారు. లేదా పాలకుల మద్దతు వుంది కనుక యాజమానులు గూండాలను పంపి కొంత మందిని హత్య చేయిస్తారు. వుపాధిపోయి, రోగాలపాలై, నిత్యం బతుకు భయంతో చచ్చే కంటే అది నయం. ఇతర ప్రాంతాలలో అలాంటి ఫ్యాక్టరీలు రాకుండా జనం ముందే మేలుకొనేందుకు ధృవతారలుగా మారతారు.

చంద్రబాబు వైఖరిని అర్ధం చేసుకొని తుందుర్రు ప్రాంతం వారే కాదు, ఆ జిల్లా, యావత్‌ రాష్ట్ర ప్రజలు నిరసన తెలపాల్సిన అవసరం వుంది. నిరంకుశత్వానికి బలి అయిన సందర్భంగా జనం జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ చర్యలను పట్టించుకోని పర్యవసాల గురించి ఒక జర్మన్‌ కవి రాసిన కవితను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు

ఆ తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక మౌనంగా వున్నారు

తరువాత నా కోసం వచ్చారు

తీరా చూస్తే నా గురించి మాట్లాడేవారు ఎవరూ లేరు

అందువలన తుందుర్రు ఫ్యాక్టరీ వలన మనకేం నష్టం అని ఎవరైనా అనుకుంటే వారి చైతన్యస్ధాయి గురించి విచారపడటం తప్ప చేసేదేమీ లేదు. ప్రతి ప్రాంతంలోనూ ఆక్వా గాకపోతే మరో ఫ్యాక్టరీ తుందుర్రు రూపంలో వస్తుంది. అయ్యో పాపం అనేవారు మిగలరు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నీరు, చెట్టు, పేరుతో అధికారపక్షం, వారితో చేతులు కలిపిన శక్తులు దళితుల భూములను తవ్వి మట్టిని డబ్బుగా మార్చుకుంటున్న , భూములను ఆక్రమించుకుంటున్న వుదంతాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా దేవరాపల్లి, గుంటూరు జిల్లా వేలూరు, గొరిజవోలు ఇలా ప్రతిఘటించిన గ్రామాలే కాదు, వెలుగులోకి రానివి, పెత్తందార్లకు భయపడి చేతులు మూడుచుకొని చేతలుడిగి కూర్చున్నవి చాలా వున్నాయి. తుందుర్రు పక్కనే వున్న గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహం పెట్టటాన్ని వ్యతిరేకించటమే గాక, ఇదేమని ప్రశ్నించిన దళితులపై సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్య తీసుకొనేందుకు చంద్రబాబు సర్కార్‌ మీన మేషాలు లెక్కించటమే కాదు, అన్యాయం అన్నవారిని అరెస్టులు చేయిస్తోంది. ఈ వైఖరి ఎలాంటి ‘సంకేతాలు, సందేశాలను ‘ పంపుతోందో తెలుగుదేశం నేతకు తెలియదనుకుంటే పొరపాటు. ఓట్ల జాతర సమయంలో ఐదువేలయినా ఇవ్వగలమని స్వయంగా చంద్రబాబే నంద్యాలలో సెలవిచ్చిన సంగతి తెలిసిందే. నిద్రపోయేవారిని లేపగలం గాని నటించేవారిని లేపటం సాధ్యం కాదు. గరగపర్రు వుదంతం గురించి తాము ఇప్పుడే మేలుకున్నట్లు, మేలుకోగానే తెలిసినట్లు అధికార పార్టీకి చెందిన దళితనేతలు కొత్త పాట పాడుతున్నారు. ఇదే సమయంలో అనేక దళిత సంస్ధలు, వ్యక్తులు ఇంతకాలంగా దళితులను చైతన్య పరిచేందుకు చేసిన యత్నాలు మరోదారి తొక్కాల్సి వుంది. దళితుల సమస్యలను దళితులే పరిష్కరించుకోవాలని, మరొకరు జోక్యం చేసుకోకూడదని, రిజర్వేషన్ల సమస్యపై చీలిపోయి గిరిగీసుకుంటే నష్టపోయేది దళితులే. ఇలాంటి పరిస్ధితులు వున్నాయి గనుకనే గ్రామాలలో పెత్తందారీ శక్తులు చెలరేగుతున్నాయి.

ఇక చంద్రబాబు స్వంత రాష్ట్రం, పొరుగు తెలంగాణా, యావత్తు దేశానికి పంపిన ‘సంకేతాలు, సందేశాలు’ ఎలాంటివో తెలిసిందే. నోట్లతో ఓట్లు, అధికారాన్ని ఎరచూపి ఫిరాయింపులు, ఫిరాయింపు చట్టాన్ని ఎలా వుల్లంఘించవచ్చో మొదలైన ఎన్నో ‘ఆదర్శనీయ’ చర్యలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజి ప్రహసనం ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణ, మహాభారతాలు, పురాణాలు, వేదాలను మించిపోతాయి. నవ్వటానికి జనానికి నోళ్లు చాలవు. తన స్నేహితుల బృందంలో వున్న బ్రూటస్‌ తన హంతకులతో చేతులు కలిపిన వైనాన్ని తెలుసుకొని హతాశుడైన జూలియస్‌ సీజర్‌ యూ టూ బ్రూస్‌ (బ్రూటస్‌ చివరికి నువ్వుకూడా !) అంటాడు. ఇందులేడని అందుకలడని సందేహము వలదు ఎందెందు చూసినా అందందు కలడు చక్రి సర్వోపగతుడున్‌ అన్నట్లు తప్పుడు సంకేతాలు, సందేశాలను పంపటంలో, అన్ని రకాల అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటంలో దేన్నీ వదలలేదని విమర్శకులు చంద్రబాబు నాయుడు గురించి చెబుతారు. అలాంటి పెద్ద మనిషి ప్రాణాంతక తుందుర్రు ఫ్యాక్టరీని తరలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సుభాషితం చెప్పటాన్ని చూస్తే కొందరి విశ్వాసం ప్రకారం పైన వున్నాయని చెబుతున్న స్వర్గంలోనో నరకంలోనో వున్న జూలియస్‌ సీజర్‌ చివరికి చంద్రబాబూ నువ్వు కూడా సుభాషితాలు పలుకుతున్నావా అని ఆశ్చర్యపోతాడు.దీని కంటే బ్రూటస్‌ చేసిన ద్రోహం పెద్దది కాదని క్షమించేసి వుంటాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎందుకు రైతులు ఆందోళనకు దిగుతున్నారు ?

18 Sunday Jun 2017

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

BJP, bjp cow politics, Farm prices, Farmers, Farmers agitations, indian farmers

ఎం కోటేశ్వరరావు

ఎందుకిలా జరుగుతోంది ? రాబోయే (ముందస్తు లేదా నిర్ణీత గడువు ప్రకారం జరిగే) ఎన్నికలలో కూడా తమదే అధికారం అని కలల పడవలో ప్రశాంత అలల మధ్య తేలి పోతున్న బిజెపి నేతలకు అనుకోని రీతిలో రైతుల ఆందోళనలనే కుదుపులు ఎందుకు తగులున్నాయి? అవీ మూడేండ్ల సంబరాల సమయంలో అని ప్రతిపక్షాల కంటే బిజెపి అభిమానులు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలు నిలదీసి ఎందుకు అని ప్రశ్నించకుండా మనకెందుకులే అని తప్పుకోవటాన్నే మన పురాతన నాగరికత, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర నేర్పాయా ? మన వివేచనను నీరుగార్చాయా అన్న అనుమానం కలుగుతోంది. తమ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా సమృద్ధిగా పంటలు పండాయని మూడు సంవత్సరాల విజయ గాధలలో మోడీ సర్కార్‌ పేర్కొన్నది. వ్యవసాయం వుమ్మడి జాబితాలో వుంది. ప్రధానంగా రాష్ట్రాల అంశం, అయినప్పటికీ ఘనత తనదే అని మోడీ చెప్పుకున్నారు. మరి అలాంటి ఘనత సాధించిన వారి హయాంలో రైతులు రోడ్లెక్కటం ఏమిటి? దానికి ఎవరు బాధ్యత వహించాలి. ఆకాశాన్ని అంటిన పప్పుల ధరలు తగ్గగానే సామాజిక మాధ్యమాలలోని మోడీ భక్తులు ఆ ఘనత తమ నేతదే అని ప్రచారం చేశారు. ఆ తగ్గుదలకు మూల్యం చెల్లించింది ఎవరు ? ధరలు పతనమై నష్టాలు వచ్చాయని ఒక్క వ్యాపారీ దివాళా ప్రకటించలేదు, ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు లేవు.ఆ దుర్గతి రైతులకే ఎందుకు పట్టింది. పప్పు ధాన్యాల ధర తమకు గిట్టుబాటు కాని రీతిలో పతనమైందనే కదా మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ రైతులు ఆందోళనకు దిగింది. పప్పుల ధరలు పెరగగానే వాటిని తగ్గించే పేరుతో బిజెపికి అన్ని విధాలుగా సాయపడిన పారిశ్రామిక, వాణిజ్యవేత్త అదానీ కంపెనీలకు పప్పుల దిగుమతికి, వాటిని అధిక ధరలకు అమ్ముకొని విపరీత లాభాలు సంపాదించేందుకు అవకాశం కల్పించింది ఎవరు ? రైతులకు గిట్టుబాటు కాని రీతిలో ధరలు పతనమైతే మోడీ సర్కార్‌ లేదా బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోలేదు ? ఎవరు ఆదుకోవాలి? తాజా రైతు ఆందోళన ఏమి తెలియ చేస్తున్నది? అతివృష్టి, అనావృష్టికి బలయ్యేది రైతులే, అలాగే పంటలు బాగా పండినా, పండకపోయినా ప్రభావితులవుతున్నదీ రైతులే. ఏది జరిగినా నష్టాలే వస్తున్నాయి.

ఖమ్మంలో పతనమైన ధర గురించి ఆందోళన చేసిన మిర్చి రైతులు సంఘవ్యతిరేశక్తులని మంత్రులు, వారి వంది మాగధులు ప్రకటించారు. తీరా సామాన్య రైతులకు బేడీలు వేసి వీధులలో తిప్పి జైలుకు పంపారు. మధ్య ప్రదేశ్‌ పాలకులు మరొక అడుగు ముందుకు వేసి రైతులు పోలీసులు కాల్పులలో మరణించలేదన్నారు, వారసలు రైతులే కాదు పొమ్మన్నారు, మరణించిన వారిలో గంజాయి స్మగ్లింగ్‌ కేసులున్న నేరగాళ్లున్నారని ప్రచారం చేశారు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి తరువాత మరణించిన ప్రతి రైతు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? రైతులను కాల్చి చంపించటమే గాక ఎదురుదాడి వ్యూహంలో భాగంగా రైతులు హింసాకాండకు స్వస్ధి చెప్పాలని ఒక బిజెపి ముఖ్య మంత్రి స్వయంగా నిరాహార దీక్ష చేస్తారని పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారో లేదో తెలియదు గానీ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆపని చేశారు. అంతకంటే విచిత్రం, విపరీతం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు విభాగం భారతీయ కిసాన్‌ సంఘ్‌ తాము కూడా రైతు సమస్యలపై ఆందోళన జరపనున్నట్లు ప్రకటించింది. అంతరించిపోగా అవశేషాలు మిగిలినట్లు ఇంకా బుర్రలు మిగిలిన వారికి ఎందుకిలా జరుగుతోంది ? అనే ప్రశ్న ఎదురవుతోంది.

2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ కిసాన్‌ సంఘ్‌ వుపాధ్యక్షుడు ప్రభాకర్‌ కేల్కర్‌ ఫస్ట్‌ పోస్ట్‌ అనే వెబ్‌ పత్రికతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అమలు జరపని కారణంగా రైతులలో ఆగ్రహం పేరుకుపోయినందున ఆందోళన అనివార్యమని అయితే హింసా పద్దతులకు తాము వ్యతిరేకమని చెప్పుకున్నారు. రైతులు కనీస మద్దతు ధరలను పొందటం లేదని, తదుపరి సాగునిమిత్తం పెట్టుబడుల కోసం తమ వుత్పత్తులను తెగనమ్ముకోవటం వంటి పరిణామాలు రైతుల ఆందోళనకు కారణాలని ఆ పెద్దమనిషి చెప్పాడు. అయినా బిజెపి సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు. తొలుత రైతుల ఆందోళనలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం మధ్యలో చర్చల పేరుతో శకుని పాత్ర పోషించి వైదొలిగింది. వాస్తవాలు ఇలా వుంటే కాంగ్రెస్‌ను భూస్తాపితం చేశామని, వామపక్షాలు వునికి కోల్పోయాయని ఒకవైపు ఇప్పటికే ప్రకటించేసి, అదే నోటితో రైతుల ఆందోళనల వెను వారున్నారని బిజెపినేతలు ఆరోపించారు. అవి నోళ్లా లేక మరేవైనానా ?

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయాయి. అవి సబ్సిడీలు కావచ్చు, మరొక సేవ రూపంలోని కావచ్చు. అదే సమయంలో నియంత్రణలు ఎత్తివేసిన కారణంగా ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. రెండో వైపు మార్కెట్‌ను ప్రయివేటు వ్యాపారులు అదుపు చేస్తున్న కారణంగా రైతాంగానికి ఒక స్ధిరమైన ఆదాయాలు వుండటం లేదు. పంటలు దెబ్బతినటంతో పాటు విద్య, వైద్యం వలన కూడా అన్ని తరగతుల వారితో పాటు రైతాంగం అదనంగా అప్పులపాలవుతున్నారు.ఈ ఏడాది రైతులకు పత్తి ధరలు గతేడాది కంటే కాస్త మెరుగ్గా వున్నాయి.దాంతో నూలు, వస్త్ర మిల్లు యజమానుల లాభాలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అని భయపడిన నరేంద్రమోడీ సర్కార్‌ గత కాంగ్రెస్‌ పాలకులను పక్కకు తోసి పత్తి దిగుమతులలో సరికొత్త రికార్డును సాధించింది. గత మూడు సంవత్సరాలలో(2013-14 నుంచి 2016-17) మన దేశం నుంచి జరిగిన పత్తి ఎగుమతులు 363.75 నుంచి 162.71 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దిగుమతులు 39.44 నుంచి 94.66 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఒక్క పత్తి విషయంలోనే కాదు ఇదే కాలంలో మొత్తం మన వ్యవసాయ, అనుబంధ వుత్పత్తుల ఎగుమతులు 4236.26 నుంచి 3382.14 కోట్ల డాలర్లకు పడిపోగా దిగుమతులు 1552.89 నుంచి 2563.64 కోట్ల డాలర్లకు పెరిగాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో రైతుల వుద్యమం తలెత్తిన ప్రాంతాలు పప్పుధాన్యాల సాగుకు ప్రసిద్ది. ఈ మూడు సంవత్సరాలలో వాటి దిగుమతి 182.81 నుంచి 424.42 కోట్ల డాలర్లకు పెరిగాయి. అంటే ప్రభుత్వ దిగుమతి విధానాలు ఈ రెండు రాష్ట్రాల పప్పుధాన్యాల రైతుల నడ్డి విరిచాయి. అందుకే గత ఎన్నికలలో బిజెపికి పూర్తి మద్దతు ఇచ్చిన రైతాంగం నేడు విధిలేక రోడ్డెక్క వలసి వచ్చింది. ఇదంతా వ్యవసాయ రంగంలో ఘనవిజయాలు సాధించామని, వుత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటూ కేంద్ర ప్రభుత్వ విజయగానాలు చేస్తున్న సమయంలోనే జరిగింది. ఇటువంటి విధానాలతో బిజెపి 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు మాటేమోగాని రుణభారం, ఆత్మహత్యలను రెట్టింపు చేసేదిగా కనిపిస్తోంది.

వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మొత్తం వుత్పత్తి ఖర్చుపై 50శాతం అదనంగా ఆదాయం వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రఖ్యాత వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ 2008లోనే రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ నివేదికలో చెప్పారు. దానికి అనుగుణంగా కనీస మద్దతు ధరల ప్రకటన లేకపోగా ఈ ఏడాది ప్రకటించిన ధరలకంటే పతనమైనా ప్రభుత్వాలు ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోలేదు. తాజా రైతుల ఆందోళన వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా వుందని, దాని గురించి సరైన అధ్యయనం లేదని స్వామినాధన్‌ క్వింట్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా చెప్పారు. ఇప్పుడు ఏర్పడిన పరిస్ధితుల కారణంగా రైతుల రుణాలను ప్రస్తుతానికి రద్దు చేసినప్పటికీ వ్యవసాయం గిట్టుబాటు కావటానికి దాన్నొక పద్దతిగా మార్చరాదని, రైతుల ఆదాయాలను స్ధిరపరచటానికి పద్దతులను రూపొందించాలని, రుణాల రద్దు వలన పేదల కంటే ధనిక రైతులే ఎక్కువ లబ్దిపొందుతున్నారని ఆయన చెప్పారు. సామాజిక రక్షణలు లేని కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వ్యవసాయం జీవితాన్ని ఇవ్వాలే తప్ప ప్రాణాలు తీసేదిగా వుండకూడదని ప్రస్తుతం లండన్‌లో వున్న 92 సంవత్సరాల స్వామినాధన్‌ చెప్పారు.

ఆవును వధిస్తే జీవితకాల జైలు లేదా మరణశిక్ష విధించాలన్నట్లుగా తమ పాలిత రాష్ట్రాల శాసనసభలన్నీ (ఒక పధకం ప్రకారం) తీర్మానాలు చేస్తున్నాయి తప్ప ఆ ఆవులను సాకే రైతుల గురించి ఎందుకు ఆలోచించటం లేదని బిజెపి వారు తమ తలలు తామే పట్టుకోవటం అవసరం. మాంసం కోసం ఆవులను వధిస్తున్నారంటూ జై భజరంగ ‘బలీ’ అని(ముస్లింలపై) దాడులకు తెగబడుతున్న హిందూత్వ ‘కారుణ్యమూర్తులు’ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వారిపై కాల్పులు జరుగుతుంటే ఒక్క వీధిలో కూడా వారి జాడలేదేం? నిజానికి ఈ ప్రశ్నలు అటు బిజెపి అనుకూలురు లేదా వ్యతిరేకులే కాదు మేం ఎటు న్యాయం వుంటే అటు వుంటాం అనే తటస్ధులు కూడా తీవ్రంగా ఆలోచించాల్సినవి కాదా. వాటి గురించి తమలో తాము తర్కించుకొనేందుకు, ఎవరినైనా ప్రశ్నించేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అశాస్త్రీయ ప్రచారాలు-ఆవు, పేడ రాజకీయాలు !

17 Saturday Jun 2017

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Others, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, bjp cow politics, cow, cow dung, cow politics, cow sciences, cow urine, subhash palekar

ఎం కోటేశ్వరరావు

శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటం ద్వారా ఎవరైనా విరుద్ధ భావాలను వ్యాపింపచేయగలరు అని ఇటాలియన్‌ శాస్త్రవేత గెలీలియో ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ప్రపంచంలో రెండే అనంతమైనవి. ఒకటి విశ్వం, రెండవది మానవుల బుద్దిహీనత, అయితే మొదటిదాని గురించి నేను అంత ఖాయంగా చెప్పలేను అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐనిస్టీన్‌ అన్నాడు.లోకం పోకడలను కాచి వడపోసిన వారే ఇలాంటి తిరుగులేని అంశాలను గతంలో చెప్పారు. ఇప్పుడు ఎలాంటి అనుభవం లేకుండానే ‘ఆణిముత్యాలను’ ప్రవచించటానికి అనంతమైన బుద్ధి హీనులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. మనకు కావాల్సింది కాస్త బుర్రకు పని పెట్టి వారి లోకాన్ని విమర్శనాత్మకంగా చూడటమే !

భూమి చుట్టూ సూర్యుడు తిరగటం కాదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోందని తొలిసారిగా చెప్పింది గెలీలియో. అప్పటివరకు వేల సంవత్సరాలుగా వున్న విశ్వాసాలను పటాపంచలు చేశాడు. అయితే బైబిల్‌ చెప్పిందానికి భిన్నంగా తమ మనోభావాలను గాయపరిచాడంటూ నాటి క్రైస్తవ మతోన్మాదులు గెలీలియోను గృహనిర్బంధం కావించారు. చివరికి కళ్లు పోయిన స్ధితిలో కూడా ఆ కరుణామయులు ఆయనను విడుదల చేయలేదు. ఆయనను తరువాతి తరాల వారు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో శాస్త్రీయంగా రుజువైన వాటిని కూడా తిరస్కరించే వున్మాదం క్రమంగా వ్యాపిస్తోంది. అది ఆవు ఆక్సిజన్‌ గ్రహించి దాన్నే విడుదల చేస్తుందని చెప్పటం కావచ్చు, వేదాల్లోనే అన్నీ వున్నాయట అనే రుజువు కాని శాస్త్రీయ భావాలు, విమానాలు,టెస్టుట్యూబ్‌ బేబీలు, ప్లాస్టిక్‌ సర్జరీ వంటి ఆధునిక ఆవిష్కరణలన్నీ వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో వున్నాయని చెప్పటం కావచ్చు. ఈ అశాస్త్రీయ వాదనలను సవాలు చేసే, వ్యతిరేకించే వారు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వసుధైక కుటుంబం, సర్వేజనాసుఖినో భవంతు, నీవు ఎవరు నేను ఎవరు సర్వం నేనే అని సుభాషితాలు పలికే కొందరు దాడులు, హత్యలకు దిగుతున్నారు.

అలాంటి వారిని పాలకులు ప్రోత్సహిస్తున్నారు, రక్షణ కల్పిస్తున్నారు. గెలీలియో కొత్త విషయాన్ని చెప్పినందుకు అక్కడి మతవాదులు భగ్గుమంటే, రుజువులున్నా పాత విషయాన్నే ఆమోదించాలంటూ ఇక్కడి మతవాదులు దాడులు చేస్తున్నారు. మన సమాజం ముందుకు పోతోందా? తిరోగమనంలో వుందా? నూతన ఆవిష్కరణలను నిరుత్సాహపరిచే ఇలాంటి ధోరణులతో ఇప్పటికే మనం ఎంతో నష్టపోయిన విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా ? విషాదం ఏమంటే శాస్త్రీయ అంశాలను చదువుకొని వాటి ఆధారంగా పని చేస్తున్న పెద్దలు ఎక్కడో ఒకరో అరా తప్ప మనకెందుకులే అన్నట్లుగా ఇలాంటి శక్తుల పట్ల మౌనం దాలుస్తున్నారు. బుద్ది హీనత మనలో పెరుగుతోందా ? ఇవన్నీ వేదాల్లోనే వున్నాయా? పోతులూరి వీరబ్రహ్మంగారు దీని గురించి ఏం చెప్పారు ?

గతంలో పది సంవత్సరాలు అధికారంలో వున్న కాలంలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీ – కుప్పం ప్రాజెక్టు అంటూ వ్యవసాయం గురించి వూదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఘోరంగా విఫలమైన ఆ పధకం, టెక్నాలజీ వూసే ఎత్తటం లేదు. సూక్ష్మంలో మోక్షం మాదిరి ఇప్పుడు ఆవు పేడ వ్యవసాయ టెక్నాలజీ గురించి రైతులకు చెప్పేందుకు కాబినెటు హోదా ఇచ్చి ఒక సలహాదారును నియమించేశారు. కేంద్రంలోని పాలకులు ఆవు రాజకీయం చేస్తున్నారు గనుక వారితో స్నేహం కారణంగా చంద్రబాబు సరికొత్త పల్లవి అందుకున్నారు. అదే మంటే ఆవు మూత్రం, ఆవు పేడతో ప్రకృతి వ్యవసాయం చేయిస్తానంటూ ముందుకు వచ్చిన సుభాష్‌ పాలేకర్‌ అనే పెద్ద మనిషికి వంద ఎకరాలు, వంద కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చిన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను అవమానించటం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదు. తమకు డబ్బులిస్తే బంగారం తయారు చేసే చిట్కాలు చెబుతామని, లంకె బిందెలను చూపిస్తామంటూ మోసాలకు పాల్పడే దొంగబాబాలను చంద్రబాబు గుర్తుకు తెస్తున్నారు. చివరికి ఈ పిచ్చి ముదిరి వేదాల్లోనే అన్నీ వున్నాయి, విమానాలు, క్షిపణులు తయారు చేసే పరిజ్ఞానం మన దగ్గరే వుంది అని చెబుతున్నవారికి కూడా భూములు, డబ్బు ఇచ్చి అమరావతిలో తిష్ట వేయించినా ఆశ్చర్యం లేదు.

అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచారంలోకి పెట్టటంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారందరికీ పెద్ద దిక్కుగా వుంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రచురించిన ఒక ప్రచార కరపత్రం. జూన్‌ 21న యోగా దినం సందర్బంగా మాతాశిశు సంరక్షణ కోసమంటూ రాసిన దానిని మంత్రి శ్రీపాద నాయక్‌ విడుదల చేశారు. గర్భం దాల్చిన తరువాత మాంసం తినవద్దు, శృంగారానికి దూరంగా వుండాలి. దుష్టులను దూరంగా వుంచాలి, దైవపరమైన ఆలోచనలతో వుండాలి, గదులలో మంచి, అందమైన బొమ్మలను అలంకరిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అన్నది ఆ కరపత్ర సారాంశం. ఈ వార్తలను చదివిన వారు కొందరు నిషేధిత జాబితాకు ఖర్జూరాలను, మరికొన్నింటిని కూడా చేర్చి ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి విపరీతం ? అనేక పేద దేశాలతో పోల్చితే మన దేశంలో రక్తహీనత సమస్య అధికంగా వుంది. దానిని అధిగమించేందుకు అవసరమైన ప్రొటీన్లు, ఇనుము మాంసంలో లభిస్తాయి. అలాంటి మాంసాన్ని గర్భిణులు తినకూడదన్నది ఒక అశాస్త్రీయ సలహా. అనేక మూఢనమ్మకాలకు నిలయమైన మన దేశంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అలా చెబుతుంటే దానిని పాటిస్తే ప్రసూతి మరణాలు ఇంకా పెరగటం తప్ప తగ్గవు. ఆరోగ్యవంతులైన తల్లీ పిల్లల కోసం ప్రభుత్వాలు చేయాల్సిందెంతో వుంది. వాటిన్నింటినీ వదలి పెట్టి శాస్త్రీయంగా రుజువు కాని, అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం గర్హనీయం. ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రచురించిన కరపత్రంలోని అంశాలపై తీవ్ర విమర్శలు రావటంతో తమ కరపత్రలో కామాన్ని(లస్ట్‌) అదుపు చేసుకోవాలని పేర్కొన్నామే తప్ప శృంగారం( సెక్స్‌) అనే పదం వాడలేదని సదరుశాఖ ఒక వివరణ ఇచ్చింది. ఇది చిల్లు కాదు తూటు అని సమర్ధించుకొనే అతి తెలివి తప్ప మరొకటి కాదు. సమస్యాత్మక కేసులలో గర్భిణులే కాదు సాధారణ మహిళలను కూడా కొన్ని సందర్భాలలో శృంగారానికి దూరంగా వుండాలని నిపుణులు చెప్పటం వేరు, కానీ కేంద్ర ప్రభుత్వ కరపత్రంలో దానిని సాధారణీకరించటమే విమర్శలకు గురైంది.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనికిరాని అంశాలను ప్రచారం చేయటం ఎక్కువైంది. సమాజంలో శాస్త్రీయ దృష్టి, ఆసక్తిని పెంచటంపై దాని పురోభివృద్ధి ఆధారపడి వుంటుంది. దానికి బదులు అన్నీ వేదాల్లోనే వున్నాయంటూ మెదళ్లను కలుషితం చేయటంలో తిరోగమన వాదం జయప్రదమైంది. మన దేశానికి అది చేసిన హాని అంతా ఇంతా కాదు. ఆధునిక ఆవిష్కరణలకు మన యువతను దూరం చేశారు.ఎందుకు అనే ప్రశ్నను వేయనివ్వకుండా నోళ్లను మూయించారు ఇప్పుడు మరోసారి అలాంటి శక్తులు చెలరేగిపోతున్నాయి. అధికారంలో వున్నవారే వాటికి సాధికారత చేకూర్చేందుకు పూనుకున్నారు.

గతంలో కాంగ్రెస్‌ ఒక తరహా ఓట్ల రాజకీయాలకు పాల్పడితే, ఇప్పుడు దాని స్ధానాన్ని ఆక్రమించిన బిజెపి హిందూత్వ, రామాలయం, గోమూత్రం, పేడ, గొడ్డు మాంస రాజకీయాలతో లబ్ది పొందాలని చూస్తోంది. దానిలో భాగంగానే బిజెపిని బలపరిచే సంస్ధలు,శక్తులు, వ్యక్తులు ఆవుకు లేని ప్రాధాన్యత, పవిత్రత, మహత్తులను ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారు. వారి చర్యలు, వాదనలను చూస్తే చీకటి యుగాల రోజులను గుర్తుకు తెస్తున్నారు. వారి ప్రచారాంశాల శాస్త్రీయత,అధారాలను ప్రశ్నించే, విబేధించేవారు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ అనేక రకాల దాడులకు తెగబడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే 2016 ఆగస్టులో గో సంరక్షకుల మంటూ తెగబడుతున్నవారి గురించి ఇలా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవటం అవసరం. ‘ గో సంరక్షణ పేరుతో జనాలు దుకాణాలు నడపటం నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొంత మంది పగలు గో రక్షకులుగా ముసుగు వేసుకొని రాత్రుళ్లు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.’ అన్నారు. చిత్రం ఏమంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా అలాంటి ఒక్క దుకాణదారును శిక్షించిన దాఖలాలు లేవు. దాంతో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవులను రవాణా చేస్తున్న లారీలపై కూడా గో గూండాలు దాడి చేస్తే వాటిని పోలీసు రక్షణతో రాజస్ధాన్‌ బిజెపి సర్కార్‌ రాష్ట్ర సరిహద్దులను దాటించాల్సిన తీవ్ర పరిస్ధితులు అక్కడ నెలకొన్నాయి. స్వయంగా ప్రధాని, ఆయన అనుచరగణం నిరూపితం కాని, శాస్త్రవిరుద్దమన, అతిశయోక్తులను ప్రచారం చేయటం వారి ద్వంద్వ ప్రవృత్తి, చతురతకు నిదర్శనం.

మన కేంద్రమంత్రి రాజనాధ్‌ సింగ్‌ గారు ఒక సందర్భంలో అమెరికా వ్యవసాయశాఖ నివేదికను వుటంకిస్తూ దాని ప్రకారం ఆవులో కనుగొన్న జీన్స్‌లో 80శాతం మానవులలో కూడా వున్నాయని అందువలన ఆవును రక్షించి పూజించాలని చెప్పారు. పొద్దున లేస్తే ముస్లిం, క్రైస్తవ మతాలను, వాటిని అవలంభించే వారికి వ్యతిరేకంగా ప్రచారం, దాడులు చేస్తున్నారు. వారిలో కూడా అదే మోతాదులో ఆవు జీన్సు వున్నాయని అందువలన వారికి వ్యతిరేకంగా వున్మాదాన్ని రెచ్చగొట్టం గోవును అవమానించటమే అని గుర్తించటం అవసరం. సరే వున్మాదాన్ని రెచ్చగొట్టటం కూడా ఓటు బ్యాంకు రాజకీయాలనుకోండి. ఇక్కడ మెదళ్లను వుపయోగించాల్సిన అవసరం వుంది. అందరికీ సుపరిచితమైన సైన్సు అనే పత్రికలో వెల్లడించినదాని ప్రకారం మానవులలో వుండే జీన్సును పోలినవి చింపాంజీలు, పిల్లులు, ఎలుకలు, కుక్కలలో వరుసగా 96,90,85,84 శాతాల చొప్పున వున్నాయట. అంటే అవు కంటే ఎక్కువ శాతం. అరటి వంటి అనేక పండ్లలో కూడా అలాంటి జీన్సు వున్నాయి, మరి వాటికి లేని పవిత్రత ఆవు కెందుకు అంటే సమాధానం వుండదు. ఆవు పేడ, మూత్రం, అది పీల్చే, విడిచే వాయువుల గురించి కూడా అతిశయోక్తులు, కట్టుకధలను ప్రచారం చేస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదని పేరు పెట్టాలన్నట్లుగా ఓట్లు దండుకొనేందుకు ఆవుకు లేని పవిత్రతను ఆపాదించటం కూడా అలాంటిదే.

దాని కొనసాగింపులో భాగంగా రాజస్ధాన్‌ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవలనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దానిని చంపితే మరణశిక్ష విధించాలని చెప్పారు. న్యాయమూర్తులు చట్టంలో వున్నదానికి భాష్యం చెప్పటానికి తప్ప లేని దానిని, తమ స్వంత బుర్రలలో వున్నవాటిని న్యాయ పీఠాలపై కూర్చొని చెప్పటానికి వీలులేదు. దేశమంతా ఆవు రాజకీయం నడుస్తోంది, ఆ పేరుతో కొందరు చట్టవిరుద్దమైన గూండాయిజానికి పాల్పడుతున్నారు. సదరు న్యాయమూర్తి చర్య గూండాయిజం కాకపోవచ్చుగాని చట్టవిరుద్దమైనదే. ఇదే న్యాయమూర్తి మగనెమలి కంటి నీటిని తాగిన ఆడ నెమళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభమౌతుందని,మగ నెమళ్లు ఆజన్మ బ్రహ్మచారులని కూడా సెలవిచ్చారు. ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్పటానికి గెలీలియో చెప్పినట్లు శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటమే అర్హత. వాటికి చదువులతో పని లేదు. ఇందుకు కొన్ని వుదాహరణలను చూద్దాం. మనం కొద్దిగా ఆలోచిస్తే కర్ణుడి జన్మను చూస్తే ఆరోజుల్లోనే మనకు జన్యుశాస్త్రం, వినాయకుడికి ఏనుగుతలను అతికించటాన్ని బట్టి ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసని అర్ధం అవుతుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బిజెపికి చెందిన వుత్తరాఖండ్‌ మాజీ ముఖ్య మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఎంపీగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ పదిలక్షల సంవత్సరాల నాడే రుషి కణాదుడు అణుపరీక్షలను నిర్వహించాడని చెప్పాడు.పైథాగరస్‌ కంటే మూడువందల సంవత్సరాల ముందే ఆ సూత్రాన్ని మన వారు కనుగొన్నారని ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహిలీకర్‌ సెలవిచ్చాడు. విమానాలు, మోటారు కార్లు, అంతరిక్ష ప్రయాణాల వంటి వన్నీ మన పూర్వీకులెప్పుడో ఆచరించి వదలివేసినవే అని చెప్పేవారికి కొదవ లేదు.

తినే తిండిని బట్టి కొంతమంది మానభంగాలకు పాల్పడుతున్నారని ఒకడు, చికెన్‌, చేపలు తిన్నవారే ఎక్కువగా రేపులు చేస్తున్నారని ఒక బీహార్‌ మంత్రి, దక్షిణాది స్త్రీలు అందంగా వుండటానికి కారణ వారికి డ్యాన్సు తెలిసి వుండటమే అని ఒక రాజకీయనేత, హిందువుల జనాభాను పెంచేందుకు ప్రతి మహిళ కనీసం నలుగుర్ని కనాలని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌, రాసిఫలాలను బట్టి ఏ మహిళ అత్యాచారానికి గురవుతుందో తాను చెప్పగలనని ఒక జ్యోతిష్కుడు, ఒక లీటరు ఆవు మూత్రంలో మూడు నుంచి పది మిల్లీ గ్రాముల బంగారం లభించిందని చెప్పే విశ్వవిద్యాలయ పరిశోధకులు, తమ వుత్పత్తులు చక్కెర వ్యాధిని సహజంగానే నయం చేస్తాయని పతంజలి సంస్ధ ప్రచారం, యజ్ఞం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని, కొన్ని పరీక్షల ద్వారా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారిని తిరిగి బ్రతికించగలనని ఒక వైద్యుడు, ఐనిస్టీన్‌ సిద్ధాంతం పరీక్షకు నిలవదని చెప్పే మేథావులు మనకు ఎక్కడబడితే అక్కడ కలుపు మొక్కల్లా పెరిగిపోయారు.

గో లేదా పశు మాంసం తినటం విదేశీ ముఖ్యంగా ముస్లింలు మన దేశం మీద దండయాత్రలు చేసిన తరువాతే ప్రారంభమైందన్నది ఒక తప్పుడు ప్రచారం. దీనిని కూడా గుడ్డిగా నమ్ముతున్నవారు లేకపోలేదు. పండ్ల అమరిక తీరుతెన్నులను చూస్తే మాంసాహార జీవుల కోవకే మానవులు చెందుతారన్నది తిరుగులేని సాక్ష్యం. వివేకానందుడు హిందూమతావలంబకుడు అనటంలో సందేహం లేదు, అది తప్పు కూడా కాదు. కానీ నేడు కాషాయ వేషాలు వేసుకు తిరిగే అనేక మంది స్వామీజీలు, వారిలో కనిపించే పరమత ద్వేషం ఎక్కడా ఆయన వుపన్యాసాలలో కనపడదు. కాలిఫోర్నియాలోని షేక్స్పియర్‌ క్లబ్బులో 1900 ఫిబ్రవరి రెండున చేసిన ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు.’నేను దాని గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు, పురాతన క్రతువుల ప్రకారం గొడ్డు మాంసం(బీఫ్‌) తినకపోతే అతను మంచి హిందువు కాడు.కొన్ని సందర్భాలలో అతను విధిగా ఎద్దును బలిచ్చి తినాల్సిందే.’ అంతే కాదు వేదకాలం గురించి పరిశోధన చేసిన చరిత్రకారుడు సి.కున్హన్‌ రాజా ఇలా చెప్పారు.’బ్రాహ్మణులతో సహా వేదకాలపు ఆర్యన్లు చేపలు, మాంసం చివరికి గొడ్డు మాంసం కూడా తిన్నారు.ప్రముఖులు వచ్చినపుడు వారి గౌరవార్ధం గొడ్డు మాంసం వడ్డించేవారు. వేదకాలపు ఆర్యులు గొడ్డు మాంసం తిన్నప్పటికీ పాలిచ్చే ఆవులను తినేవారు కాదు. ఒక వేళ గొడ్డు మాంసం పెట్టాల్సి వస్తే ఎద్దులు, వట్టిపోయిన ఆవులు, దూడలను మాత్రమే వధించాలనే నిబంధనలు వుండేవి ‘ అని చెప్పారు.

నాజీ జర్మనీ కాలంలో జైలు పాలైన ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ మతాధికారి మార్టిన్‌ నియోమిల్లర్‌ హిట్లర్‌ చర్యలను వ్యతిరేకించినందుకు జైలు పాలు చేశారు. అక్కడ నాజీల ఎత్తుగడలు, నాటి జనం వాటిని వుపేక్షించి చివరికి ఎలాంటి దుస్ధితికి లోనయ్యిందీ వివరిస్తూ ఒక కవితను రాశాడు. ఆ కవిత ఇలా సాగుతుంది. ఆరోజుల్లో జర్మన్‌ కమ్యూనిస్టులను సోషలిస్టులని పిలిచారు.

తొలుత వారు సోషలిస్టుల కోసం వచ్చారు

నేను సోషలిస్టును కాదు కనుక మిన్నకుండి పోయాను

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం ఎవరూ మిగలలేదు

ముస్లింలు మాత్రమే ఆవు మాంసం తింటారని ప్రచారం చేసిన మతశక్తులు గోవధ నిషేధం గురించి చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. వారి వత్తిడికి లొంగి రాజ్యాంగంలో దానిని ప్రస్తావించినప్పటికీ నిషేధ అంశాన్ని రాష్ట్రాలకు వదలివేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మొదలైన ప్రచారం తరువాత అన్ని మతాలవారు తినే పశుమాంసానికి కూడా వర్తింప చేశారు. దేశమంతటా గోవధ, పశుమాంస నిషేధం గురించి చెప్పే బిజెపి గోవా, కేరళ, గిరిజనులు ఎక్కువగా వున్న ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఓట్ల కోసం భిన్న గళం వినిపిస్తోంది. పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలు గొడ్డు మాంసం తినే అన్ని మతాల వారికే గాక మెజారిటీ హిందూమతం వారికి, జీవన భృతికోసం పశుపాలన చేసే పేదవారికి అందరికీ నష్టదాయకంగా మారాయి. అందువలన మతశక్తులకు కావాల్సింది సెంటిమెంట్ల ద్వారా కొల్లగొట్టే ఓట్ల కోసం ఎవరినీ వదలవు అని గుర్తించటం అవసరం. గతంలో రాజులు, రంగప్పలు యజ్ఞ, యాగాదుల పేరుతో ప్రజాధనాన్ని ఎంతగా తగలేసిందీ చదువుకున్నాం. ఇప్పుడు నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి పాలకులు కూడా మరో రూపంలో అదే చేస్తున్నారు. ఆశాస్త్రీయమైన వాటిని నిరూపించేందుకు పరిశోధనల పేరుతో జనం సొమ్మును వుదారంగా ఖర్చు చేస్తున్నారు.

రామాయణంలో చెప్పిన సంజీవని మొక్కలను కనుగొనేందుకు వుత్తరాఖండ్‌ సర్కార్‌ 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలాగే అనేక విశ్వవిద్యాలయాలలో సంస్కృతంలో నిక్షిప్తమైన పరిజ్ఞానాన్ని వెలికితీసే పేరుతో డబ్బు, మానవ శ్రమ, మేధస్సును కూడా దుర్వినియోగపరిచేందుకు పూనుకున్నారు. చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతున్న సుభాష్‌ పాలేకర్‌ చెబుతున్నట్లు ఎలాంటి ఎరవులు, పురుగుమందులు వేయకుండా ఆవు పేడ, మూత్రంతో సాగు చేస్తే ఎకరానికి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. నరేంద్రమోడీ వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయల నల్లధనం సొమ్ము బదిలీకోసం ఎవరూ ఎదురు చూడరు. చంద్రబాబు చెప్పే ఐటి వుద్యోగాల జోలికి యువత అసలే పోదు. ఆవు మూత్రాన్ని సేకరించి బంగారాన్ని, పేడను వాడి వ్యవసాయం చేస్తారు. చంద్రబాబు హెరిటేజ్‌ కంటే ఎక్కువ లాభాలు పొంది ఆయనకంటే ఎక్కువగానే సంపాదించగలరు.సుభాష్‌ పాలేకర్‌ మాటలను చూస్తుంటే నాకు లక్ష రూపాయలిస్తే మీకు కోట్ల రూపాయల బంగారాన్ని తెచ్చిపెట్టే ఫార్ములా చెబుతా అనే మాయగాళ్లను గుర్తుకు తెస్తున్నారు. వారికి ఆ ఫార్ములా తెలిస్తే ఆ బంగారమేదో వారే సంపాదించుకోవచ్చు. పశువుల పేడ, మూత్రంతో కూడిన ఎరువులను పొలాల్లో చల్లటం రైతాంగానికి కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం దానితోనే పంటలు పండుతాయని చెప్పటమే అభ్యంతరకరం. అలాగే ప్రకృతి సాగు చేస్తున్నా అంటున్న పాలేకర్‌ చెప్పేది నిజమైతై ఆయన వ్యవసాయం చేశానంటున్న మహారాష్ట్రలో రైతులు అప్పులపాలై ఆత్మహత్య లెందుకు చేసుకుంటున్నట్లు ? ఆవు పేడ వ్యవసాయాన్ని వారెందుకు చేయటం లేదు, అసలు పాలేకర్‌ చెప్పేదానికి రుజువులేమున్నాయి అని అడగాల్సిన అవసరం లేదా ? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏ రూపంలో అయినా కనీసం ఒక రూపాయి అయినా చెల్లించే ప్రతి ఒక్కరికీ పాలేకర్‌కు చేసే ఖర్చు గురించి అతని చర్యల శాస్త్రీయత గురించి ప్రశ్నించే హక్కు వుందా లేదా ?

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సీతయ్య ఎవరి మాటా వినడు !

06 Tuesday Jun 2017

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, Andhrapradesh, ap special asistance, ap special status, chandrababu naidu, Congress party, Rahul gandhi

ఎంకెఆర్‌

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా పండే రొయ్య మీసాల పొడవు- విస్తృత ప్రచారం పొందిన చంద్రబాబు నాయుడి సీనియారిటీ గురించి ఎవరైనా విబేధిస్తే అంతకంటే అమాయకులు మరొకరు వుండరు. అయితే ఎవరూ వివాదం చేయకపోయినా ఈ మధ్యకాలంలో, తాజాగా తన సీనియారిటీ గురించి తానే చెప్పుకుంటున్న చంద్రబాబు గురించి ప్రస్తావన రాకుండా ఎలా వుంటుంది? అసలా అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. తాను మారానని మూడో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అంతకు ముందు చంద్రబాబు చెప్పారు. చూస్తుంటే ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతీ అన్న నీతి బాగా వంట పట్టించుకున్నట్లు తేలిపోయింది.

గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మోడీ భయం పట్టుకుందని విమర్శించారు. ఆ మాటకు వస్తే నరేంద్రమోడీ, చంద్రబాబు కూడా సభలలో తాము చెప్పదలచుకున్నవి చెప్పారు, అతి వినయం ప్రదర్శించి చేయాల్సిన నటన చేయలేదా, ఎవరు తక్కువ ? అలాగే రాహుల్‌ చెప్పిన మాటలు వినటమా లేదా, చేసిన విమర్శలను పట్టించుకోవటమా లేదా సూచనలను పాటించటమా లేదా అన్నది వేరే విషయం. తాను ఎవరికీ భయపడటం లేదని, దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తను కనుక ఇప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న వారు చెబితే వినేది లేదని చంద్రబాబు చెప్పాల్సిన పనేముంది. నిజానికి అది నరేంద్రమోడీకి ఎక్కడో మండే మాట. మరో విధంగా అలా అనటం అంటే జ్ఞాన ద్వారాన్ని మూసుకోవటమే. ఆ మాట అన్న తరువాత ఈగలు, చీమలు, దోమల మాదిరి అధికారం చుట్టూ మూగే ఇతర పార్టీల వారూ, తెలుగుదేశం పార్టీలోని సహచరులు, జూనియర్లు చెప్పిందానిని కూడా చంద్రబాబు ఎలా వింటారు. ఇప్పటికే ‘సీతయ్య నివాస్‌’ మాదిరి తెలుగు దేశం పార్టీలో అసలు అలా చెప్పే వాతావరణం ఎక్కడుంది. గతంలో ఒక్క పెదబాబే అనుకుంటే తండ్రికి తగ్గ తనయుడు చినబాబు కూడా తోడయ్యారు. దీంతో చంద్రబాబు తప్ప తెలుగుదేశంలోని సీనియర్లందరూ నారావారి కుటుంబంలో పుట్టబోయే వారికి అన్నలుగానూ పుట్టిన వారికి తమ్ములుగానూ మారిపోయారు. గతంలో పది సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు శైలిని దగ్గరగా చూసిన వారికి ఆయనకు సీనియారిటీతో నిమిత్తం లేకుండానే ఇతరులు చెప్పేదానిని పరిగణనలోకి తీసుకొనే తత్వం లేదన్నది బాగా తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మహాకవి కాళిదాసు గర్వభంగం కథను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. సరస్వతి దేవి పెట్టిన పరీక్షలో సున్నా మార్కులు తెచ్చుకున్న కాళిదాసుకు కనువిప్పు కలగగానే విద్యతో వినయం వృద్ధి చెందాలి గాని అహంకారం కాదు నాయనా కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధిని మార్చటానికే ఈ పరీక్ష అని దాహంతో వచ్చిన కాళిదాసుకు మంచినీరు ఇచ్చి అనుగ్రహిస్తుంది.

అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ, బయట ప్రతిపక్షాలకు తాను చెప్పటం తప్ప ఇతరులు చెప్పింది వినే అలవాటు లేదనే విమర్శలు వున్న చంద్రబాబు ఎవరూ చూడకుండా అయినా వేమన, సుమతీ శతకాలు ఒక్కసారి తిరగేసుకుంటే మంచిది.

వినదగు నెవ్వరు చెప్పిన,

వినినంతనే వేగపడక వివరింపదగున్‌,

గని కల్లనిజము లెరిగిన,

మనుజుడే పో నీతిపరుడుడు మహిలో సుమతీ

అన్న ప్రబోధ పద్యాన్ని చంద్రబాబు మరిచి పోయి వుంటారు.

మూడు సంవత్సరాల పాలనలో సున్నా మార్కులు తెచ్చుకున్న చంద్రబాబు వైఫల్యాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే మండిపడుతున్నారు. తానే చెప్పుకున్నట్లు ఒక సీనియర్‌గా గోబెల్స్‌ ప్రచారంలో కూడా ఆయనను మించిన వారు లేరు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్నది హిట్లర్‌ ప్రచార మంత్రి గోబెల్స్‌ సూత్రం. చంద్రబాబుకు గోబెల్స్‌ను మించిన బిజెపి తోడు కావటంతో ఇక చెప్పాల్సిందేముంది.

రాష్ట్ర విభజన సమయంలో వ్యతిరేకించింది ఒక్క సిపిఎం తప్ప మరొకపార్టీ లేదు.అందుకే ఆ పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా ఫలాన వరం ఇవ్వాలని కోరలేదు. గతంలో అలా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలా అడగటం అంటే విభజనను అంగీకరించినట్లే. ఆసుపత్రులలో పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వచ్చినపుడు సంభవించే పర్యవసానాలకు అంగీకారం తెలుపుతూ రోగి లేదా సమీప బంధువుల సంతకాలతో లేఖలు తీసుకుంటారు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడవటానికి ఆమోదం తెలిపి ఒకటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు. ఆపరేషన్‌ చేసే వైద్యుడు కోరిన కత్తులు, కటార్లు అందించి సహకరించే సిబ్బంది మాదిరి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడిచే సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసి కాంగ్రెస్‌కు అన్ని విధాలుగా సహాయపడింది బిజెపి. తిరుపతి సభలో ప్రత్యేక హోదా గురించి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసింది నరేంద్రమోడీ. తరువాత దానిని తిరస్కరించిందీ ఆ పెద్ద మనిషే. మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని జరిగితే వాటన్నింటినీ వదలి పెట్టి చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్‌ మీదే ఎదురుదాడులకు దిగారు. రాష్ట్రానికి హాని చేయటంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో బిజెపిదీ అంతే. హోదా బదులు ప్రత్యేక పాకేజీ ఇచ్చారని, దాని కంటే హోదా వలన అదనంగా వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని కూడా చంద్రబాబు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు సమస్య పాకేజి వలన కలిగిన ప్రయోజనం ఏమిటన్నదే, ఆ ప్రశ్నకు ఇంతవరకు ఆ పెద్ద మనిషి లేదా బిజెపి నేతలు గానీ నోరు విప్పటం లేదు.

ఏ పార్టీలో ఎంతకాలం వుంటారో, ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని విశ్వసనీయతలేని నాయకులతో తెలుగుదేశం పడవ నడుస్తోంది. అలాంటి పార్టీ నేతగా దానిని నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఆయన చెప్పే కాంగ్రెస్‌ అడ్డగోలు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఎలా నష్టపోయిందో, ఆ నష్టాన్ని పూడ్చేందుకు మిత్రపక్షం బిజెపి ఇచ్చిన ప్రత్యేక పాకేజి కారణంగా వచ్చే లాభాలు ఏమిటో, తెలుగుదేశం పార్టీ చెప్పే న్యాయబద్ద విభజన కోసం తాము చెప్పిందేమిటో, చేసిందేమిటో ప్రభుత్వం తరఫున ఒక శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు చెప్పటం తప్ప మరొక మార్గం లేదు. అదేమీ లేకుండా అడ్డగోలు రాజకీయాలు, దాడులు చేస్తే రాష్ట్ర ప్రజలకు పూచికపుల్ల ప్రయోజనం కూడా వుండదు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆ కాంగ్రెస్‌లో చివరి వరకు వుండి తెలుగు దేశం పడవలోకి ఎక్కిన నేతలను మాత్రం ఎలాంటి క్షమాపణ అడగకుండానే పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి అందలమెక్కించారు. అదే కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో కూడా చేరి దానిని కూడా పునీతం చేశారు. తెలుగుదేశం సరసన కూర్చొని వారిపుడు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపికి కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా వున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ విషయాన్ని నొక్కి వక్కాణిస్తే ఆయనకే నష్టం. ఒక రాజకీయపార్టీ పట్ల మరొక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలనేది అది వారిష్టం.కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆని చెబుతున్నారు కనుక సాధించిన అదనపు ప్రయోజనాలేమిటో కూడా చెప్పాలి.ప్రతి ఏటా నవనిర్మాణ దీక్షలంటూ ప్రత్యర్ధులపై ఎదురుదాడులు తప్ప జనానికి సానుకూల అంశాలను వివరించిన పాపాన పోలేదు. కులం, మతం, ప్రాంతీయ భావనలను తలకెక్కించుకున్న జనంలోని ఒక తరగతి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర వైఫల్యాల గురించి పట్టించుకోకపోవచ్చు. ఎల్లకాలం ఇదే పరిస్ధితి వుండదు. అటు బిజెపి తెలుగుదేశం పార్టీని ముందుగదిలో కూర్చో పెట్టి దాని ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వెనుక ద్వారం తెరిచింది. శ్రీకృష్డుడి రాజకీయం మాదిరి ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జునుడిని చూచితి నేను అన్నట్లుగా బిజెపి తనకు ఏది వాటంగా వుంటే అది చేసేందుకు పావులు కదుపుతోంది. చంద్రబాబు అస్త్రాలు తుప్పు పట్టటం లేదా ఒక్కొక్కటిగా మొద్దుబారి పనికి రాకుండా పోతున్నాయి. అవ్వతో వసంతమాడినట్లు కాంగ్రెస్‌ క్షమాపణలతో కాలక్షేపం చేస్తే కుదురుతుందనుకుంటే పొరపాటు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: