• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2017

కొన్ని ఆలోచనలు-ఒక అవలోకన !

28 Friday Jul 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, Opinion, RELIGION, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

BR Ambedkar, caste discrimination, caste system, cristianity, Hinduism, Hinduthwa, Indian conistitution, manuvadam, RELIGION, Rule of reservations, scheduled castes

ఎం కోటేశ్వరరావు

2017 జూలై 28వ తేదీ ప్రజాశక్తిలో అరుణ గోగులమండ గారు ఆలోచనలు కలిగించటమే నా లక్ష్యం అని ముందే ప్రకటించుకొని కొన్ని ఆలోచనల పేరుతో కొన్ని అంశాలను పాఠకుల ముందుంచారు.http://www.prajasakti.com/Article/Prajagalam/1949493 అసలు బుర్రలకు పని పెట్టటమే మరచిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రయత్నం చేయటం అభినందనీయం. వాటిపై అవలోకన గురించి కూడా ఆలోచించాలని మనవి.

ప్రపంచంలో అనేక ఆలోచనా విధానాలున్నాయి. నూరు పువ్వులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న లోకోక్తి తెలిసిందే. దళితుల పట్ల సామాజిక వివక్షను అంతం చేసేందుకు, వారిని దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు అంబేద్కర్‌ ఆలోచనా విధానమొక్కటే చాలదు, అందువలన సకల పీడితుల విముక్తికి చెబుతున్న ఇతర ఆలోచనా విధానాలను కూడా ప్రజల్లోకి వీలైనంతగా చేరవెయ్యాలేమో ?

మన విధి(డెస్టినీ)ని మనమే నిర్ణయించుకోవాలి అని చెప్పారు. ఇది సాధారణ అర్ధంలో అయితే అభ్యంతరం, ఇబ్బంది లేదు. దళితుల విధిని దళితులే నిర్ణయించుకోవాలి అనే ఒక పరిధి అర్ధంలో అయితే ఆలోచనలకు అడ్డుకట్ట వేయటమే. సంపదలకు మూలమైన వారిలో దళితులు కూడా ఒక భాగమే తప్ప దళితులే సర్వస్వం కాదు. సామాజికంగా వివక్ష లేకపోవటం లేదా అంత తీవ్రంగా లేకపోవచ్చు గాని దళితేతర కులాల్లోని పేదలందరూ సంపదలకు మూలమైన వారిలో భాగమే. సంఖ్యాపరంగా చూస్తే దోపిడీకి గురవుతున్నవారిలో వారే అధికులు. మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న కులాల్లో కూడా దళితులతో కలసి గని,వని,ఖార్ఖానాలో పని చేసే వారు వున్నారు. వారికి వూరడింపు సామాజిక వివక్ష లేకపోవటం, వూరి మధ్యలో కూడా వుండనివ్వటం తప్ప మిగతా వన్నీ సేమ్‌ టు సేమ్‌. అరుణగారు చెప్పినట్లు ఆధిపత్య కులాల ఫ్యాక్టరీలు, గనులు, పొలాల్లో పని చేసే దళితులే కాదు, ఆధిపత్య కులాల్లోని పేదలు కూడా తమకూ హక్కులున్నాయన్న సంగతే తెలియక బలౌతూనే వున్నారా లేదా ? దళిత కులానికి చెందిన వారు కూడా పెట్టుబడిదారులుగా వున్నారు. వారి సంస్ధలలో దళితుల పరిస్ధితి ఏమైనా మెరుగ్గా వుందా? సామాజిక వివక్ష తప్ప దోపిడీ సేమ్‌ టు సేమ్‌ కాదా ?

ఆధిపత్య వాదులందరికీ కుల గోడలను కూల్చటం సుతరామూ ఇష్టం లేదన్నారు. కులాల హెచ్చు తగ్గుల వల్ల వచ్చే ఆడంబరాలను, ఐశ్వర్యాలను ఎప్పటికీ వారే అనుభవించాలనే దుర్బుద్ధి అందుకు కారణం అని అరుణగారు చెప్పారు. కులాన్ని బట్టి ఐశ్వర్యాలు వచ్చి వుంటే స్వాతంత్య్రానికి ముందు తెలంగాణా, ఆంధ్రా ప్రాంతంలో వేలు, లక్షల యకరాలపై ఆధిపత్యం కలిగిన భూస్వాములు, జాగీర్దార్లు, దేశ ముఖులు, జమిందార్లు కేవలం వేళ్లమీద లెక్కించదగిన వారు మాత్రమే ఎందుకున్నారు.ఆ కులాలో పుట్టిన వారందరికీ అదే మాదిరి సంపదలు ఎందుకు దక్కలేదు. దొరలు, జమిందార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారితో కలసి అదే ఆధిపత్య కులాలకు చెందిన వారు ఎందుకు పోరాడినట్లు ? అలా పోరాడిన వారిలో ఆధిపత్య కులాలని పిలిచే వాటిలో వారి ప్రమేయం లేకుండా పుట్టిన ఎందరో భూస్వామిక కుటుంబాలకు చెందిన వారు కూడా వున్నారు. అలాగే క్రైస్తవం, ఇస్లాం ఇతర మతాలు మెజారిటీగా వున్న దేశాలలో ఆ మతాలలోని కొద్ది మందే దేశాలను సైతం శాసించగలిగిన కార్పొరేట్‌ సంస్ధల అధిపతులుగా వుండగా మెజారిటీ పౌరులు వాటిలో పని చేసే కార్మికులు, లేదా వుద్యోగులుగా ఎందుకున్నారు. రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఆధిపత్యం వహించింది క్రైస్తవులు, వారిని కూల్చి వేసిందీ క్రైస్తవులే కదా ? అంతెందుకు క్రైస్తవుడైన హిట్లర్‌ ఫాసిస్టుగా మారితే వాడిని సమర్ధించింది ఎవరు, వాడిని, వాడి ముష్కర మూకలను హతమార్చింది ఎవరు ? క్రైస్తవులే కదా ? అందువలన అరుణ గారు, ఆమె మాదిరి అభిప్రాయం కలిగిన వారందరూ కుల, మత పరిధి దాటి ఆలోచించటం అవసరం.

సామాజిక వివక్షకు గురవుతున్న కులాల జాబితాల్లో వున్నవారికి రిజర్వేషన్లు ఇస్తూ వారు మతం మారితే రద్దు చేయటం అన్యాయం అనటంలో ఎలాంటి పేచీ లేదు. ఎందుకంటే మతం మారినా వారి సామాజిక స్ధితిలో మార్పుండటం లేదు. కానీ అరుణగారు క్రైస్తవం పుచ్చుకున్న ఆధిపత్య కులాల వారు కూడా తమ కులం కోల్పోయి దళితులుగా మారిపోవాలి కదా అంటున్నారు. మతం మారినా దళితుల రిజర్వేషన్లు కొనసాగాలి, కుల విభజన గోడలు కూలిపోవాలని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఇలాంటి వాదనలు చేయటం గందరగోళ ఆలోచనకు నిదర్శనం. ఇక్కడ క్రైస్తవం దళితుల మతం కాదని గ్రహించటం అవసరం. హిందూమతంలో శైవులు, వైష్ణవులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి వివిధ తాత్విక విభజనలు వున్నట్లే ఇస్లాం, క్రైస్తవంలో కూడా ప్రబోధకులను బట్టి కొన్ని రకాల విభజనలు వున్నాయి తప్ప కులాల ప్రస్తావన, విభజన లేదు.

దళితుల సాధికారత కోసం, రిజర్వేషన్ల కల్పనలో అంబేద్కర్‌ చేసిన కృషిని ఎవరైనా తక్కువ చేసే చూస్తే అది పాక్షిక దృష్టి తప్ప వేరు కాదు. అనేక మంది రిజర్వేషన్లు అనే భావన అంబేద్కర్‌తోనే ప్రారంభమైందనే అభిప్రాయంతో వున్నారు. ఇది కూడా పాక్షిక దృష్టే. అంబేద్కర్‌ కంటే ముందే కొల్లాపూర్‌ సంస్ధాన అధిపతి సాహు మహరాజ్‌ 1882,1891లోనే బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారు. తరువాత కాలంలో అంబేద్కర్‌ మరింత నిర్ధిష్టంగా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుతో సహా అనేక ప్రతిపాదనలపై కృషి చేశారు. దళితులు మతం మారితే వెనుకబడిన తరగతిగా పరిగణించబడటానికి కూడా ఆ అంబేద్కర్‌ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగమే వీలు కల్పించిందని గుర్తించటం అవసరం. ఇదొక సంక్లిష్ట సమస్య. అందువలన ఆరుణగారు చెబుతున్నట్లు అది కుట్రే అయితే అందుకు వీలు కల్పించిన అంశాలేమిటి ? రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దమే అయినప్పటికీ అవి శాశ్వతం కాదు, అంబేద్కర్‌ కూడా రిజర్వేషన్లును పది సంవత్సరాలు అమలు చేసిన సమీక్షించి మరో పదిసంవత్సరాలు పొడిగించమని చెప్పారు తప్ప శాశ్వతంగా వుంచాలని అభిప్రాయపడలేదు. అందువలనే ఎంతకాలమనే ప్రశ్న పదే పదే తలెత్తుతున్నది. సామాజిక వివక్ష అంతమయ్యే వరకు వాటిని కొనసాగించాలనటం న్యాయబద్దం. ఎంత త్వరగా దానిని అంతం చేస్తే అంత త్వరగా రిజర్వేషన్లను ముగించ వచ్చు.

ఇక మతం మారిన హిందూ దళితులకు రిజర్వేషన్లు వర్తించపోవటం సమస్య. దీన్ని కుట్రగా అభివర్ణించవచ్చునా ? రాజ్యాంగం అమలులోకి రాకముందే దీనిపై చర్చ జరిగింది. సిక్కు మతంలో కూడా దళితులు వున్నందున వారికి కూడా హిందూ దళితులకు వర్తించే సౌకర్యాలను వర్తింప చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. సిక్కు మతంలోకి మారేందుకు ఎవరూ ఎవనీ బలవంత పెట్టలేదని, సిక్కు మతం అంటరాని తనాన్ని గుర్తించలేదని, అందువలన సిక్కు మతాన్ని అవలంభించాలంటే రిజర్వేషన్లు వదులు కోవాలి, రిజర్వేషన్లు కావాలంటే సిక్కు మతాన్ని వదులుకోవాల్సి వుంటుందన్న వాదనలు వచ్చాయి. క్రైస్తవం, ఇస్లాం కూడా అలాంటివే. అవేవీ అంటరానితనాన్ని గుర్తించలేదు. అందువలన రిజర్వేషన్‌ అవసరం లేదనుకున్న వారు హిందూ మతం నుంచి మారవచ్చు లేదా కావాలనుకున్నవారు అదే మతంలో వుండాలన్నది లాజిక్కు. అయితే మతం మారినా వివక్ష కొనసాగుతున్నందున వారికి కూడా హిందూ దళిత రిజర్వేషన్లే అమలు జరపాలన్న వాదన ముందుకు వచ్చిందని గమనించాలి. అందువలన ఆలోచనకు చర్చ పెట్టే ముందు పూర్వపరాలను కూడా సమగ్రంగా వివరించకపోయినా ప్రస్తావించటం అవసరం? కాదంటారా ?

కుల వివక్ష, అంటరానితనం వంటి మాయని మచ్చలను సహించిందీ, అమలు జరిపిందీ హిందూమతం లేదా దాని పరిరక్షకులమని చెప్పుకొనే వారు. దానికి ప్రాతిపదిక మనువాదం. ఇప్పటికీ దానిలో ఎలాంటి సంస్కరణలు లేవు. అందువలన హిందూమతంలో వుండాలా లేదా అన్నది ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన అంశం. మతం అన్నది మత్తు మందు. అది ఏమతానికైనా వర్తించే సాధారణ సూత్రం. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని చూసేవారు, మత విభజనతో సమాజాన్ని వెనక్కు తిప్పాలని చూసే వారు అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా సమాజానికి వ్యతిరేకులే. ప్రతి మతం తన మత్తు మందును తీసుకొనే జనాలు తగ్గకుండా చూసుకోవాలని చూస్తుంది. రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని హిందూమత శక్తులు దళితుల మతమార్పిడికి ఎలా అడ్డంపడుతున్నాయో, మతం మారినా దళితులకు రిజర్వేషన్లు అమలు జరపాలని క్రైస్తవమత శక్తులు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవటానికి చూస్తున్నాయి.

చివరిగా ఒక్క మాట. దళితుల అభ్యున్నతికి అంబేద్కర్‌ కృషి అమోఘం. ఇదే సమయంలో ఆయన ఆధ్వర్యాన ఏర్పాటయిన రాజ్యాంగం దళితుల సమస్యలకు జిందా తిలిస్మాత్‌ కాదని ఇప్పటికే రుజువైంది. స్వాతంత్య్రవుద్యమ ఆకాంక్షలను ఇంతవరకు అమలు జరపలేదు, అనేకానికి తూట్లు పొడిచారు. అందువలన ఈ రాజ్యాంగం జనానికి, ప్రత్యేకించి దళితులకు కల్పించిన రక్షణలను కాపాడుకొంటూనే వారితో పాటు ఇతర కష్టజీవుల విముక్తికి అవసరమైన ఆలోచనలు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జిందా తిలిస్మాత్‌ స్ధానంలో ఆవు పేడ, మూత్రం !

22 Saturday Jul 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized

≈ Leave a comment

Tags

cow, cow dung, cow sciences, Gujarat model, Narendra Modi, narendra modi bhakts, Science, Vedic sciences

ఎం కోటేశ్వరరావు

ఎందరో యువత, మధ్యతరగతి మేథావులు బిజెపి అంటే ఇష్టం లేకపోయినా కాంగ్రెస్‌ మీద కోపంతో నరేంద్రమోడీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయనను చూసి చెప్పినవారికల్లా ఓటు వేశారు. ఆ బలహీన క్షణంలో అలా జరిగింది అన్నట్లుగా ఓటింగ్‌ రోజు జరిగిందేదో జరిగిపోయింది. తరువాత ఆ ప్రభుత్వం ఏమి చేస్తుందో, ఆ పార్టీ వారు, వారికి వెన్నుదన్నుగా వున్న సంస్ధలకు చెందిన వారు ఏమి చేస్తున్నారో అని ఒక్క క్షణమైనా వెనుదిరిగి చూశామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మూడు సంవత్సరాలు గడిచాయి. ఎన్నో విజయాలు సాధించామని ఇప్పటికే వూదరగొడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నికల ప్రణాళిక, ప్రచారంలో చెప్పినవి మినహా ఇతర అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే, సమాజాన్ని చీల్చే అంశాలను బిజెపి, దాని చుట్టూ వుండే శక్తులు ముందుకు తెస్తున్నాయి. ఆ గోమాత సాక్షిగా మూడు సంవత్సరాలకు ముందున్నదాని కంటే దేశం ఏ రంగంలో ముందుకు పోయిందో ఆధార సహితంగా ఎవరైనా చెబితే సంతోషం. అంతరిక్షంలోకి అత్యధిక వుపగ్రహాలను పంపి విజయం సాధించిన శాస్త్రవేత్తలు ఒకవైపు మరోవైపు ఆవు పేడ, మూత్రంలో ఏముందో తెలుసుకొనేందుకు కాలం వృధా చేసే శాస్త్రవేత్తలు. మొదటి వారిని చూసి గర్వపడాలా రెండో వారిని చూసి సిగ్గుతో తలవంచుకోవాలా? యధారాజా తధా శాస్త్రవేత్త !

వాట్సాప్‌ గ్రూపులలో ఆ మధ్య గుజరాత్‌లోని రాజ్‌కోటలో అంతర్జాతీయ విమానాశ్రయం స్ధాయిలో ఒక బస్టాండ్‌ నిర్మించారంటూ ఏప్రిల్‌ నెలలో ఫొటోలతో సహా సమాచారం తిరిగింది. బాబూలాల్‌ సుప్రియ అనే కేంద్ర మంత్రి ఆ బస్టాండ్‌ను ప్రారంభించారంటూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి ? ఇప్పటి వరకు ఆ బస్టాండ్‌ నిర్మాణమే జరగలేదు. ప్రతిపాదిత కట్టడటం గురించి తయారు చేసిన నమూనా ఫొటో అది. పోనీ అది దేశంలో పెద్ద బస్టాండా అంటే కానే కాదు. దానికంటే మూడు నాలుగు రెట్లు పెద్దవి మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరుల్లో ఇప్పటికే నిర్మితమై వున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వ అభివృద్ధి గురించి కూడా ఇలాంటివే అనేకం ప్రచారంలో వున్నాయని తెలుసుకోవాలి.

గోరక్షణ, గోమాంసం తింటున్నారనే పేరుతో మైనారిటీలు, దళితులను మూకుమ్మడిగా హత్యలు చేయటం వెనుక తమ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను పక్కదారి పట్టించే కుట్ర వుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మరత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ బుధవారం నాడు రాజ్యసభలో చెప్పారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ ఆయనను ఆవహించినట్లుగా కనిపిస్తోంది. గో రక్షకుల ముసుగులో సంఘవ్యతిరేకశక్తులు దుకాణాలు తెరిచారనో, వారి చర్యలను సహించరాదనో, కఠిన చర్యలు తీసుకుంటామనో కోహినూరు వజ్రం వంటి మాటలతో మౌనబాబా ప్రధాని నరేంద్రమోడీ వుత్తరాయణానికో దక్షిణాయానానికో సెలవిస్తుంటారు. ఆయన శిష్యులు మరోవైపు ఇలా నోరు పారవేసుకుంటారు. అసలు అభివృద్దే బూటకం అయితే దానిని అడ్డుకొనేందుకు గోరక్షకుల పేరుతో ఎవరో దాడులు చేస్తున్నారని చెప్పటం అంతకంటే దారుణం. ఆ దాడులు ఎక్కడైతే జరిగాయో, జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలన్నింటా అధికారంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. తమ ప్రభుత్వ అభివృద్దిని అడ్డుకొనే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. దాదాపు అన్ని వుదంతాలలో బాధితులు, వారి కుటుంబాలపైనే తప్పుడు కేసులు బనాయించిన ఘనుల ప్రతినిధి అయిన కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో అలా మాట్లాడారంటే గుండెలు తీసిన బంట్లకే సాధ్యం అని స్పష్టం కావటం లేదూ ?

ముఖ్యమంత్రిగా తాను అభివృద్ధి చేసిన గుజరాత్‌ నమూనాను దేశమంతటికీ విస్తరిస్తానని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు ఊరూ వాడా ప్రచారం చేశారు. తరువాత విలేకర్లు ప్రశ్నించటానికి వీలులేకుండా ఇంతవరకు ప్రధాని హోదాలో ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టి కూడా నిర్వహించకుండా ఒక రికార్డు సృష్టించారు. అసలా గుజరాత్‌ అభివృద్ధి అనేదే పెద్ద బూటకం. అందుకే చివరికి మన్‌కీ బాత్‌లో కూడా దాని ప్రస్తావన తేవటం లేదు.2003 నుంచి అంటే గుజరాత్‌లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి గుజరాత్‌ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అది కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల సంఖ్య 51,378, అమలు జరిగినవీ, అమలులో వున్న పధకాల పెట్టుబడుల విలువ రు. 84లక్షల కోట్లని చెప్పారు. ప్రస్తుతం మన దేశ మొత్తం స్ధూలాదాయం రు.170లక్షల కోట్లరూపాయలని అంచనా. అంటే ఒక్క గుజరాత్‌కు వచ్చిన పెట్టుబడులే 84లక్షల కోట్లంటే మొత్తం జిడిపిలో గుజరాత్‌ విలువ ఎంతో లెక్కవేసుకోవాల్సింది.ఇవన్నీ చెప్పింది మూడు సంవత్సరాల క్రితం వరకు నరేంద్రమోడీ, తరువాత ఆయన వారసులు అని తెలిసిందే. కానీ అసలు వాస్తవం ఏమంటే 1983 నుంచీ అంటే మోడీ కంటే రెండు దశాబ్దాల ముందునుంచీ 2016 సెప్టెంబరు వరకు గుజరాత్‌లో అమలయిన పధకాలు 6,251 వచ్చిన పెట్టుబడుల విలువ రు.2.76లక్షల కోట్లు, కల్పించిన వుపాధి 10.67లక్షల మందికి, ఇవిగాక మరో 4033 పధకాలు మధ్యలో వున్నాయి, వాటి మొత్తం పెట్టుబడి రు.9.52లక్షల కోట్లని, మరో 9.3లక్షల మందికి వుపాధి కల్పించబడుతుందని సాక్షాత్తూ గుజరాత్‌ అధికారిక సమాచారమే వెల్లడించింది. మోడీ భక్తులు నిజాలను తట్టుకొనే ధైర్యం వుంటే దిగువ లింక్‌లోని వివరాలు చదివి, వాస్తవం కాదని గోమాత సాక్షిగా నిరూపిస్తే సంతోషం.http://www.moneylife.in/article/the-gujarat-model-ndash-some-facts/51106.html ఈ వివరాలు సేకరించింది కమ్యూనిస్టులు కాదు, సీతారాం ఏచూరి అంతకంటే కాదు.

గోవాలో గొడ్డు మాంసానికి కొరత లేదని, అటువంటి పరిస్ధితే వస్తే పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి దిగుమతికి ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మనోహర్‌ పారికర్‌ ఏకంగా అసెంబ్లీలోనే చెప్పారు. ఇలా మాట్లాడిన ముఖ్యమంత్రి బిజెపి పరువు తీశారని, రాజీనామా చేయాలని, బిజెపి అంటే బీఫ్‌ జాయ్‌ పార్టీ అని విశ్వహిందూ పరిషత్‌ నేత డాక్టర్‌ సురేంద్ర జైన్‌ ఎద్దేవా చేశారు.

గోరక్షకులకు ఆయుధాలు, శిక్షణ ఇస్తామని విశ్వహిందూపరిషత్‌ నేతలు ప్రకటించారు. కాబోయే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రచారంలో వున్న ఆ సంస్ధ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా గోరక్షకులను సాయుధులను చేస్తామని అలీఘర్‌లో చెప్పారు. తాము ఇప్పటికే తమ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చామని, గుంపులతో ప్రతికూల పరిస్ధితులు ఎదురైతే ఎలా వ్యవహరించాలో కూడా దానిలో నేర్పించామని ఒక నేత చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక రాసింది.

ఆవుల దొంగ రవాణాను అరికట్టేందుకు, లవ్‌ జీహాద్‌ నిరోధానికి ఒక్క ఆలీఘర్‌ జిల్లాలోనే ఐదువేల మంది ‘మత సైనికుల’ ను తయారు చేయాలని అలీఘర్‌లో ఈనెల 14-16 తేదీలలో అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వహిందూ పరిషత్‌ ప్రకటించింది.భజరంగదళ్‌ కార్యకర్తలు మాత్రమే ఈ సైనికుల్లో చేరటానికి అర్హులట. ఈ సైనికులు ఆవుల దొంగరవాణాతో పాటు లవ్‌ జీహాద్‌ నిరోధం, హిందూ యువకులు, యువతులు, మఠాలు, దేవాలయాలు, సంత్‌ సమాజం, దేశాన్ని కూడా రక్షిస్తారట.

గత పది సంవత్సరాలలో 50 మందికి పైగా పోలీసులు, గోరక్షకులను గోహంతకులు చంపివేశారని విహెచ్‌పి అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్‌ చెప్పారు. గోరక్షకులు బాధితులు తప్ప ప్రజా పీడకులు కాదని, గో రక్షకులకు కూడా ఆత్మరక్షణ హక్కుందని కూడా అన్నారు.

వేదాల్లోనే అన్నీ వున్నాయని చెప్పే మనువాదులు, వాటిని సమర్ధించే వారు గాని వాటి నుంచి పెట్రోలు, పైలట్లతో పనిలేని, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమాన, కార్ల, ఎన్ని ప్రయోగించినా తరగతని అస్త్రాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర వాటిని గానీ ఇంతవరకు బయటకు తీయలేదంటే వారి దేశ భక్తిని అనుమానించాల్సి వస్తోంది. మనమే వాటిని తయారు చేసి ఎగుమతి చేసి ప్రపంచంలో మన దేశాన్ని మొదటి స్ధానంలో నిలబెట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకొనేందుకు బడా కార్పొరేట్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా అన్నది సందేహం. మరోవైపు కౌపతి లేదా గో వేదం. లాభాల వేటలోని కార్పొరేట్‌ సంస్ధలు ఇప్పటికే ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం చేస్తున్నాయి. వాటి మార్కెట్‌ను మరింత పెంచేందుకు మోడీ సర్కార్‌ చర్యలు తీసుకుంది. బహుశా అది మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగం కావచ్చు.

ప్రస్తుతం మన దేశ జిడిపిలో 0.8శాతం సైన్సు కోసం ఖర్చు చేస్తున్నారు. దానిని మూడుశాతానికి పెంచాలన్నది మన శాస్త్రవేత్తల చిరకాల డిమాండ్‌. సైన్సు పరిశోధనల మీద ఖర్చు పెట్టని, యువత నైపుణ్యాన్ని పెంచని ఏదేశమైనా పరాధీనంగా వుంటుంది తప్ప పురోగమించలేదు. సైన్సుకోసం భారత్‌ పురోగతి పేరుతో ఆగస్టు తొమ్మిదిన దేశ వ్యాప్తంగా నిరసన,డిమాండ్లతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఏ చేయబోతోంది.

పంచగవ్యం(ఆవు పేడ, మూత్రం, పాలు, పాలనుంచి వచ్చే పెరుగు, వెన్న లేదా నెయ్యి)లోని సుగుణాలను నిర్ధారించేందుకు అవసరమైన పరిశోధనలు చేయాలంటూ పందొమ్మిది మంది ప్రముఖులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఇప్పటికే అరకొరగా వున్న నిధులను వీటికోసం మళ్లించనుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు. సంస్కృత గ్రంధాలలో వున్న విజ్ఞానాన్ని దాన్ని వెలికి తీసేందుకు ఆ భాష తెలిసిన పండితులుండగా వాటిపై పరిశోధనలు చేసేందుకు మరొక కమిటీ, శాస్త్రవేత్తలు ఎందుకు ? ఇప్పటికే మార్కెట్లో సర్వరోగనివారిణి పేరుతో జిందాతిలిస్మాత్‌ను విక్రయిస్తున్నారు. దానికి పోటీ లేదా దాని స్ధానంలో కొత్తదానిని తయారు చేస్తే ఎలా వుంటుందన్నట్లుగా పంచగవ్యాలకు బెల్లం, అరటి పండ్లు, లేత కొబ్బరినీరు, చెరకు రసాలను తగు మోతాదులో కలిపి ఆరోగ్యం నుంచి పంటల సాగుకు అవసరమైన ఎరువుల వరకు ఒకే మాత్రలో వుండే విధంగా ఆ పరిశోధనలు చేస్తారట. ఇలాంటి చర్యలతో దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతుంటే చెవుల్లో పూలు పెట్టుకొని తలాడిస్తే అంతకంటే దేశద్రోహం, నగుబాట్ల వ్యవహారం మరొకటి వుండదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మరో జండా పండుగ-మన కర్తవ్యం !

16 Sunday Jul 2017

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

beef, cow politics, independence day, INDIA, india 71st independence day, India Independence Day, Mahatama Gandhi, pig politics, RSS

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ?

ఎం కోటేశ్వరరావు

ఆగస్టు 15 సందర్భంగా మరోసారి టీవీలు, వీధులన్నీ దేశ భక్తి గీతాలతో మార్మోగనున్నాయి. జాతర్లలో పూనకం వచ్చినట్లుగా కొందరు దేశ భక్తితో వూగిపోతారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సాంప్రదాయ గూండాలు, రౌడీలు, కొత్తగా వునికిలోకి వచ్చిన కాషాయ గో గూండాలు, కాషాయ, ఆకుపచ్చ తాలిబాన్లు, మనువాదులు, మెజారిటీ, మైనారిటీ మతవాదులు, భావ ప్రకటనా స్వేచ్చా, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, స్వాతంత్య్ర వుద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి అన్ని రకాల వారసులు, రాజకీయ ప్రవేశానికి సోపానంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రయత్నించే సకల అవాంఛనీయ శక్తులు ఆరోజున వీధుల్లో దర్శనమివ్వబోతున్నాయి. నిజమైన స్వాతంత్య్రపోరాటానికి, స్వాతంత్య్ర భావనలకు వారసులుగా వున్నవారు కూడా అక్కడక్కడా బిక్కుబిక్కు మంటున్నట్లుగా జెండా పండగలను నిర్వహిస్తారు. అవాంఛనీయ శక్తులను వ్యతిరేకించే లేదా ఇష్టపడని వారు వారితో మనకెందుకు గొడవ అనుకుంటూ వారి ఆధీనంలో జండా కార్యక్రమం జరిగే ప్రాంతం నుంచి తప్పుకొని వెళ్లిపోయే దృశ్యాలు మరోసారి చూడబోతున్నాం.

వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించుకొని తమ వలసగా చేసుకున్నారని, వారికి వ్యతిరేకంగా పోరాడి అశేష త్యాగాలు చేసిన ఫలితంగానే ఇప్పుడు సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా మన పాలన మనమే చేసుకుంటున్నాం అనే విషయం ఎంత మందికి తెలుసు ? అసలు ఏదేశానికైనా స్వాతంత్య్రం ఎందుకు ? ఎవరినైనా ఈప్రశ్న అడిగితే, స్వాతంత్య్రమా చట్టుబండలా 70 ఏండ్ల క్రితం మనం తెచ్చుకున్న స్వాతంత్య్రం కూడు పెట్టిందా, నీడ నిచ్చిందా అని నిట్టూర్పు లేదా ఈసడించుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి భావం సమాజంలో వుండటం అంటే నిరంకుశత్వం పెరగటానికి అనువైన పరిస్థితులు ఏర్పడినట్లుగా భావించాల్సి వుంటుంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం, సోషలిస్టు చైతన్యం కలిగించటంలో చేసిన తప్పిదాలు లేదా లోపాల కారణంగా అంతకు ముందు తమ పూర్వీకులు కూల్చివేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధను అక్కడి జనాలు కోరి పున: ప్రతిష్టించుకున్నారు. మొత్తంగా చూసినపుడు చరిత్ర ముందుకు పోయినప్పటికీ ఇలాంటి తిరోగమన వుదంతాలు కూడా జరుగుతాయని మన కళ్ల ముందు కనిపించిన పరిణామమిది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే దాని వలన లబ్ది పొందిన జనం కూడా ప్రేక్షక పాత్ర వహించారు. నియంతృత్వశక్తులు ప్రజాస్వామిక, ప్రగతిశీల అవతారాలెత్తితే గుడ్డిగా నెత్తినెక్కించుకున్నారు. మబ్బులను చూసి చేతుల్లో వున్న ముంత నీళ్లు పారబోసుకున్నారు.

సోషలిజమే కాదు, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన, జీవన స్వేచ్చలకు సైతం అలాంటి ముప్పే ముంచుకు వస్తోంది. అనేక దేశాలలో పచ్చి మితవాద శక్తులు ప్రజాకర్షక నినాదాలతో ఎన్నికలలో విజయాలు సాధిస్తున్నాయి. నిప్పును ముట్టుకుంటే కాలుతుందని తెలియని పసివారి సంగతి అటుంచుదాం. తెలిసిన వారు కూడా ఒకసారి పట్టుకొని చూద్దాం అన్నట్లుగా ఒక విధమైన వున్మాద స్ధితిలో వ్యవహరిస్తున్నారు. అదానీ, అంబానీల వంటి లాభాలే పరమావధిగా వున్న వారికి ఎవరైనా ఒకటే అనుకోండి. మంచి వాళ్లనుకున్నవారు ఏం ఒరగబెట్టారని, వీరికి కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేముంది అన్నట్లుగా మితవాద, తిరోగామి శక్తుల గురించి తెలిసిన మేథావులు, సామాన్యులు కూడా వుదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

చరిత్ర పునరావృతం అవుతుంది. అంటే దాని అర్ధం హిట్లర్‌ లాంటి వాడే తిరిగి జర్మనీలోనే పుట్టి ఫాసిజాన్ని అమలు జరపనవసరం లేదు. ప్రతి చోటా కొత్త రూపాల్లో కొత్త శక్తులు పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని ఆక్రమించుకోవటంలో జర్మన్లు వెనుకబడ్డారు కనుక తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు హిట్లర్‌ ప్రయత్నించాడు. ప్రపంచంలో వలసరాజ్యాలు అంతరిస్తున్న దశలో చరిత్ర గతికి విరుద్దమది. అయినా అలా మొరటు పద్దతులలో నడపాలని చూసి ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రాణాలు పోవటానికి, జీవితాలు నాశనం కావటానికి కారకుడయ్యాడు. ఇప్పుడు అమెరికా తన కార్పొరేట్‌ శక్తులకు మార్కెట్‌ కోసం కొత్త పద్దతులు, కొత్త రూపాలలో యుద్ధాలు, అంతర్యుద్ధాలను, వుగ్రవాదం, వుగ్రవాదులను సృష్టించి మార్కెట్లను హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో తమతో కలసి వచ్చే దేశాలను కూడగట్టి ప్రతి అమెరికా అధ్యక్షుడు నిత్యం ఏదో ఒక మూలన యుద్ధాలు చేస్తూ జనం ప్రాణాలను బలిగొంటూ, జీవితాలను నాశనం చేస్తూనే వున్నాడు. దీన్ని చరిత్ర పునరావృతం కావటం అనిగాక మరేమనాలి ?

మన ఏడుపదుల స్వాతంత్య్రాన్ని కూడా ఈ నేపధ్యంలోనే అవలోకించాలి. బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి తప్పుకున్న సమయంలో మన నేతలు ఏం చెప్పారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించటం అవసరం. మన స్వాతంత్య్రానికి ముందే మన దేశంలో వుట్టిన అనేక సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకటి. వారేమి చెప్పుకున్నప్పటికీ స్వాతంత్య్ర వుద్యమానికి దాని నేతలు, అనుచరులు వ్యతిరేకంగా, దూరంగా వున్నారు. సావర్కర్‌ వంటి నాయకుడు బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవలు చేసుకుంటానని లేఖలు రాశాడు.

సరిగా నిర్వహించారా లేదా అన్న చర్చ ఎలా వున్నప్పటికీ గాంధీ, నెహ్రూ వారి అనుచరులు స్వాతంత్య్ర వుద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహించారు. వారి విధానాలతో ఏకీభవించని వారు కమ్యూనిస్టులుగా మారారు తప్ప కాషాయ శక్తుల మాదిరి బ్రిటీష్‌ వారి చంకనెక్కలేదు. మన పాలనను మనం చేపట్టిన తరువాత వారి నాయకత్వంలోని కాంగ్రెస్‌ అధికారంలో వుంది, అనేక అక్రమాలకు పాల్పడింది, స్వాతంత్య్ర లక్ష్యాలకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఒక బిడ్డ పుట్టిన తరువాత బతికి వయస్సు వచ్చిందా లేదా అంటే రాకుండా ఎలా వుంటుంది. అలాగే కాంగ్రెస్‌ వారు మా పాలనలో అసలేమీ అభివృద్ధి జరగలేదా అని అడ్డు సవాళ్లు విసురుతారు. పుట్టిన తరువాత బతికి వుంటే వయస్సు రావటానికి ఎవరూ తోడ్పడనవసరం లేదు. ఆ బతికిన బిడ్డ ఆఫ్రికాలో అకలితో మాడే జీవచ్చంలా వుందా ఆరోగ్యంగా పెరిగిందా లేదా అన్నది చూడాలి. అలా చూసినపుడు ఆఫ్రికా అంతగాక పోయినా మన దేశంలో మెజారిటీ జనజీవితాలు జీవచ్చవాలకు దగ్గరగానే వున్నాయి. పోషకాహారలేమితో గిడసబారిపోవటం, ఇరవైల్లోనే అరవై లక్షణాలు రావటం, శరీరాన్ని కప్పుకొనేందుకు తగినన్ని బట్టలు లేకపోవటం, వుండటానికి ఇళ్లు లేకపోవటం వంటి అనేక సమస్యలు ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత కూడా వుండబట్టే అనేక మంది దానిని అభివృద్ధిగా చూడటం లేదు, అందుకే స్వాతంత్య్రం మనకేమి తెచ్చింది, మాకేమిచ్చింది అని అడుగుతున్నారు.

ఇన్ని అనర్ధాలకు కారణం కాంగ్రెస్‌, దానికి నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ వారి అనుచరులే కారణమని ఆరోపించే బిజెపి దేశ చరిత్రలో వారి పాత్రను పూర్తిగా చెరిపివేసే లేదా వక్రీకరించేందుకు పూనుకుంది. తమకెలాగూ మంచి చరిత్ర లేదు కనుక వున్నవారిపై బురదజల్లి తమ నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకొనే యత్నమిదని విమర్శకులు భావిస్తున్నారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి తెలిసిందే. ఒకవైపు మహాత్ముడిని పొగుడుతూనే మరోవైపు ఆయన ఒక చతురుడైన కోమటి అని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చేసి వ్యాఖ్యను నరేంద్రమోడీతో సహా ఏ బిజెపి సీనియర్‌ నేతా తప్పు పట్టలేదు, గడ్డి పెట్టలేదు, ముసి ముసి నవ్వులతో చోద్యం చూశారు. ఇక నెహ్రూ గురించి చేస్తున్న ప్రచారం గురించి చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలు, అసమానతలు,అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం, సామాజిక న్యాయలేమి వంటి సకల అవలక్షణాలకు మహాత్ముడు అధికారంలో ఎన్నడూ భాగస్వామి కాలేదు కనుక, నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ విధానాలు, వ్యవహరించిన తీరే కారణం అనటంలో ఎలాంటి పేచీ లేదు. అవన్నీ విధానాల కారణంగా వచ్చాయి తప్ప మరొకటి కాదు. వాటిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న, ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తున్న వామపక్షాలు, శక్తులు నెహ్రూ లేదా ఆయన వారసుల విధానాలను విమర్శిస్తే అర్ధం వుంటుంది.అధికారం కోసం ఆరాటం తప్ప ఏనాడూ ప్రత్యామ్నాయ విధానాల వూసులేని, ఏ కాంగ్రెస్‌నైతే విమర్శిస్తున్నారో దాని విధానాలనే మక్కీకి మక్కీ అనుసరిస్తున్న బిజెపి,ఎన్‌డిఏ పక్షాలకు అర్హత ఏమిటి అన్నది ప్రశ్న.

స్వాతంత్య్రం సందర్భంగా 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూ చేసిన ప్రసంగంలో ‘ఆమె బిడ్డలందరూ నివశించాల్సిన స్వేచ్చా భారతాన్ని మనం నిర్మించాల్సి వుంది’ అని చెప్పారు. ఏడు పదుల స్వాతంత్య్రం తరువాత రాజధాని ఢిల్లీ రైలులో గడ్డం, టోపీ పెట్టుకోవటాన్ని చూసి నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావు, పాకిస్ధాన్‌ వెళ్లిపో అంటూ ఒక కుటుంబ సభ్యులపై వున్మాదంతో కొందరు దాడి చేసి రైలు నుంచి తోసి వేస్తుంటే దానిని అడ్డుకొనేందుకు ఒక్కరు కూడా ముందుకురాని ‘సహనపరుల’ సేచ్చా భారతంలో నేడు మనం వున్నాం. ఆ దాడిలో జునైద్‌ అనే 15 ఏండ్ల యువకుడు కత్తిపోట్లతో సోదరుడి ఒడిలో రైల్వే ఫ్లాట్‌ఫారంపై మరణించాడు. మతోన్మాద కోణాన్ని మూసి పెట్టేందుకు దాన్ని సీట్ల గొడవగా చిత్రించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తే దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా మన మీడియా దానిని జనానికి అందించిందంటే ఏమనుకోవాలి?

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ? మన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్నామనుకుంటున్న ప్రతివారూ కింది మెట్టులోని వారిని తక్కువగా చూస్తున్న స్ధితిలో పేరు,వేష భాషలను బట్టి అణచివేతకు పూనుకోరన్న గ్యారంటీ ఏమిటి ?

ఆధునికత విలసిల్లే ప్రాంతాలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకటి. అలాంటి చోట గరగపర్రు అనే గ్రామంలో మిగతా నేతల విగ్రహాల సరసన అంబేద్కర్‌ విగ్రహాన్ని అనుమతించం వేరే చోట పెట్టుకోండి అంటూ కొంత మంది అడ్డుకోవటంలో అర్ధం ఏమిటి? అంబేద్కర్‌ విగ్రహాన్ని వేరే చోట పెట్టుకోమనటానికి ముస్లింలను చూసి పాకిస్ధాన్‌ పొమ్మనటానికి తేడా ఏముంది. ఈ రోజు ముస్లింలు అయితే రేపు దళితులు,గిరిజనులు, వెనుక బడిన వారూ, మహిళలకూ అదే గతి పడుతుంది. వూరి మధ్యలో ఎవరైనా దళితులు, గిరిజనులు వుంటే గొడ్డు మాంసం తినేవారు మీరు, ఖాళీ చేసి మీ వాడలకు పోండి అనరన్న గ్యారంటీ ఏముంది ?(గొడ్డు మాంసం తినని దళితులు, గిరిజనులను కూడా సహించరని మనవి) విగ్రహాన్ని అడ్డుకోవటాన్ని ప్రశ్నించినందుకు దళితులను సాంఘిక బహిష్కరణ చేయటమే గాక అందుకు పాల్పడిన వారే తమకు న్యాయం చేయండి అంటూ గరగపర్రులో మాదిరి పోటీ దీక్షలకు దిగే పరిస్దితికి, దానిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పరిస్ధితికి కారకులెవరు ?నాడు అంబేద్కర్‌ అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడినపుడు దానిని పాటించే హిందువులలోని అనేకశక్తులు ఆ అనాచారానికి వ్యతిరేకంగా మద్దతుగా నిలిచాయి కనుకనే మనువాదులు మౌనంగా వున్నారు. అదే అంబేద్కర్‌ ఈ రోజు గరగపర్రులో అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడి వుంటే పోటీ దీక్షలకు దిగిన వారు సహించి వుండేవారా ? ఇలాంటి వుదంతాలు, ప్రశ్నలను 70 ఏండ్ల స్వాతంత్య్రం తరువాత చర్చించుకోవాల్సి రావటం గురించి ఆవేదన చెందటం కాదు, రానున్న ముప్పు గురించి ఆందోళనపడాలి. ఎదుర్కోవటానికి కార్యాచరణకు దిగాల్సిన తరుణం ఆసన్నం కాలేదా ?

దక్షిణాఫ్రికాలో ఎక్కడైతే రైలు నుంచి తోసివేశారో ఆ పట్టణ కేంద్రంలో అక్కడి ప్రభుత్వం మహ్మాతుడి విగ్రహాన్ని ప్రతిష్టించి వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు నివాళి అర్పించింది. మన రాజ్యాంగ నిర్మాతగా కీర్తించబడే అంబేద్కర్‌ విగ్రహాన్ని వూరి మధ్యలో ప్రతిష్టించి తెలుగుదేశం ప్రభుత్వం, దాడి అనంతరం రైలు నుంచి తోసివేతకు గురై మరణించిన జునైద్‌ విగ్రహం లేదా చిహ్నాలను రైల్వే ఫ్లాట్‌ఫారంపై ప్రతిష్టించి నరేంద్రమోడీ సర్కార్‌ తమకు కులం, మత వివక్ష లేదని ప్రదర్శించుకుంటాయా ?

ఆవు, పంది కొవ్వులను తుపాకి తూటాల తొడుగులకు(కాట్‌రిడ్జ్‌) పూసిన బ్రిటీష్‌ వారి చర్య హిందూ-ముస్లింలను ఏకం చేసి 1857లో ప్రధమ స్వాతంత్య్ర యుద్దానికి తిరుగుబాటు కారణాలలో ఒకటని చరిత్రలో చదువుకున్నాం. తూటాలను తుపాకిలో నింపాలంటే నోటితో తొడుగులను కొరికి తొలగించాల్సి వచ్చేది. అణుబాంబును కనిపెట్టాం, అంతరిక్షంలో జయప్రదంగా వుపగ్రహాలను ప్రయోగిస్తున్నాం, క్షిపణులను తయారు చేశాం, అయితేనేం

నూట అరవై సంవత్సరాల తరువాత కూడా అదే ఆవు, పంది సమస్యలను డెబ్బయి సంవత్సరాల స్వతంత్రభారతంలో పరిష్కరించుకోలేక వుద్రిక్తతలు, మారణకాండకు కారణం అవుతున్నాయి. అన్ని మతాలవారూ గొడ్డు మాసం తింటున్నది వాస్తవం, అయినా కొన్ని శక్తులు ఒక మతం వారిని వెంటాడి తరిమి దాడులు, హత్యలు చేస్తుంటే మనం చోద్యం చూస్తున్నామంటే ముందుకు పోతున్నట్లా తిరోగమిస్తున్నట్లా ? దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముస్లింలు విదేశీయులు, విదేశీ మతం అంటూ ప్రచారం, దాడులు చేస్తున్న కాషాయ దళాల గురించి తెలియందెవరికి ? అదే ప్రచారం, దాడులు కాశ్మీరులో చేయగలరా ? గొడ్డుమాంసం, అలాగే క్రైస్తవ మతవ్యాప్తి గురించి రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్న వారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి అదే చేయగలరా ? నాడు బ్రిటీషు వాడిది రాజకీయం అన్నాం మరి నేడు చేస్తున్నదానినేమనాలి ?

బ్లాక్‌ మార్కెటీర్లను లైటు స్ధంభాలకు కట్టి వురి తీయాలని ఒక సందర్భంగా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రధాని నెహ్రూ చెప్పారు. ఆయన లేదా వారసుల హయాంలో ఒక్క బ్లాక్‌ మార్కెటీరుకు కూడా ఆ గతి పట్టలేదు. ఆ నెహ్రూను నిత్యం విమర్శించే బిజెపి నేతల పాలనలో జరిగిందేమిటి ? 2015లో పప్పుల ధరలు ఆకాశానికి అంటినపుడు ఎవరూ నియంత్రించలేకపోయారు. ఆకస్మికంగా ధరలు రెట్టింపు కావటం గురించి ఆదాయపన్నుశాఖ చేపట్టిన దర్యాప్తులో విదేశీ-స్వదేశీ పప్పుధాన్యాల వ్యాపారులు, దిగుమతిదారుల కుమ్మక్కు ఇందుకు దారితీసినట్లు రెండువేల పేజీల నివేదిక వెల్లడించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పప్పులను ముంబై, చెన్నయ్‌ రేవుల్లో దొంగనిల్వలు చేసినట్లు తేలింది. అందుకు బాధ్యులపై ఇంతవరకు నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణమిది. పోనీ కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటో కూడా మనకు తెలియదు.ఎవరు ఎవరిని రక్షిస్తున్నట్లు ?

1991లో కాంగ్రెస్‌ పాలనా కాలంలో ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక విధానాలు అనేక అక్రమాలకు తెరతీశాయి. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు. శతకోటీశ్వరులు పెరిగారు, అదాయ అసమానతలు పెరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత వుంటాయి. ఇవన్నీ మన స్వాతంత్య్ర వుద్యమ ఆకాంక్షలకు విరుద్ధం. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వ్యవస్ధను అమలులోకి తీసుకు రావటం మరొక స్వాతంత్య్రం అన్నట్లుగా పాలకపక్ష నేతలు చిత్రిస్తున్నారు. గతంలో కూడా రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో, భూసంస్కరణల బిల్లుల సందర్భంగా కూడా నాటి పాలకులు జనంలో ఇలాంటి ఆశలనే కల్పించారు. ఆ కోవకు చెందిందే ఇది తప్ప మరొకటి కాదు. విదేశీ, స్వదేశీ కంపెనీలు రాష్ట్రానికొక పన్ను చెల్లింపు విధానం లేకుండా వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఏ విధానం అయినా జనానికి చేసే మేలు ఏమిటన్నదే గీటురాయి. జిఎస్‌టి వ్యాపారులకు వుద్ధేశించింది తప్ప జనంపై భారాలు తగ్గించేది కాదు.నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దే వుంటే పెట్రోలియం వుత్పత్తులను కూడా దాని పరిధిలో చేర్చి వుండాల్సింది. కనీసం గత మూడు సంవత్సరాలలో పెట్రోలియం వుత్పత్తులపై అదనంగా పెంచిన పన్ను మొత్తాన్ని తగ్గించినా ఎంతో మేలు జరిగేది. జిఎస్‌టి వలన సామాన్య మానవుడి కుటుంబ బడ్జెట్‌లో పెద్ద మార్పులేమీ లేవన్నది ప్రాధమిక పరిశీలన.వ్యాపారం చేసుకొనేందుకు అనుమతి పేరుతో మన గడ్డపై కాలు పెట్టి క్రమంగా రాజకీయ అధికారాన్నే తెల్లవారు స్వాధీనం చేసుకున్నారు. మన సంపదలను కొల్లగొట్టారు. సారం వారు పీల్చుకొని మనకు పిప్పి మిగిల్చారు. ఇప్పుడు ప్రపంచంలోని కార్పొరేట్‌ శక్తులన్నీ మనదేశంలో కాలు పెట్టేందుకు కాంగ్రెస్‌ పాలకులు తలుపులను కొద్దిగా తెరిస్తే బిజెపి పాలకులు బార్లా తెరిచి ఎర్రతివాచీ పరచి స్వాగతాలు పలుకుతున్నారు. ఇది తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన షరతులపై విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే అది మన అధికారానికి చిహ్నం, అదే వారి షరతులకు అంగీకరిస్తే స్వాతంత్య్రాన్ని వారి కాళ్ల ముందు పెట్టటం తప్ప వేరు కాదు.

దీర్ఘకాలం పాటు అటు సోవియట్‌ కూటమిలోనూ ఇటు అమెరికా కూటమిలో చేరకుండా మన దేశం అవలంభించిన అలీన విధానం నుంచి మన ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతూ క్రమంగా అమెరికా కౌగిట్లోకి చేరుతోంది. శకుని రాజకీయానికి కౌరవులు బలైనట్లుగా అమెరికాతో చేతులు కలిపిన ఏదేశం కూడా బాగుపడలేదు. మన పక్కనే వున్న పాకిస్ధాన్‌ ఎలా నియంతలపాలనలో మగ్గిందీ చూశాం, అప్పుడప్పుడు పౌరపాలకులు అధికారానికి వచ్చినా సైన్యం కనుసన్నలలోనే వారు పని చేయాలి. ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత పాకిస్ధాన్‌ ఎంత దుస్ధితిలో వుందో చూశాము. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో అమెరికాతో చేతులు కలిపిన దేశాలన్నింటా సైనిక నియంతలు, ప్రజాద్రోహులు తప్ప మంచివారెవరినీ అధికారంలోకి రానీయలేదు. పాలస్తీనాను ఆక్రమించి అరబ్బులను వారి ప్రాంతాల నుంచి తరమివేసిన ఇజ్రాయెల్‌ను ఇప్పటికీ ప్రపంచమంతా చీదరించుకొంటోంది, అధికారికంగా ఐక్యరాజ్యసమితిలో దానిని వ్యతిరేకిస్తోంది. అలాంటి దేశంతో తొలిసారిగా మన ప్రధాని నరేంద్రమోడీ చేతులు కలపటం అంటే అమెరికాతో మన స్నేహం ఎక్కడికి దారితీయించిందో అర్ధం అవుతోంది. నువ్వు ఎలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న విషయం తెలిసిందే.

డెబ్బయి ఒకటవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గతాన్ని నెమరు వేసుకొంటే మన మహత్తర లక్ష్యాల నుంచి ఎలా వైదొలిగామో, దాని పర్యవసానాలేమిటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వాటిని చూసి గుండెలు బాదుకోవటం గాక వర్తమానంలో కర్తవ్యాలను గుర్తెరగటం, అందుకోసం పని చేయటమే స్వాతంత్య్ర వుద్యమంలో అశేష త్యాగాలు చేసిన వారికి సరైన నివాళి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

టిబెట్‌, చైనా వస్తు బహిష్కరణపై కాషాయ సేన వంచన !

13 Thursday Jul 2017

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

China goods boycott, Indo-China standoff, Indo-China trade, RSS, RSS China goods, RSS Duplicity, RSS Hypocrisy, Tibet

ఎం కోటేశ్వరరావు

చైనా-భూటాన్‌ మధ్య వివాదంలో భారత్‌ జోక్యం చేసుకున్న కారణంగా చైనా-భారత్‌ మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా వుభయ దేశాలలో పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వార్తలు వెలువడటం అవాంఛనీయ పరిణామం. తన ఆధీనంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా ప్రారంభించిన రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని భూటాన్‌ తరఫున మన దేశ మిలిటరీ అడ్డుకోవటంతో చైనా-మన మధ్య ఒక ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఆ ప్రాంతంలో వుభయ దేశాల సైనికులు ఎదురెదురుగా గుడారాలు వేసుకొని మకాం వేశారు. సంప్రదింపుల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవటం అంత అసాధ్యమేమీ కాదు. వుద్రిక్తతలు తగ్గిన తరువాత ఏదో ఒక రూపంలో చర్యలు ప్రారంభమౌతాయి. ఈ లోగా ఎటు వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు వున్నప్పటికీ అది సమర్ధనీయం కాదు.

ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు మనం కూడా సంమయనం పాటించాల్సిన అవసరం లేదా ? నరేంద్రమోడీ సర్కారుకు నిత్యం మార్గదర&శనం చేసే సంఘపరివార్‌ సంస&ధల ప్రతినిధులు చేసే వ్యాఖ్యలుచ్చగొట్టేవిగా వున్నాయి. గత వారంలో ఇండో-టిబెట్టు సహకార వేదిక(బిటిఎస్సెమ్‌) ఆగ్రా సమావేశంలో మాట్లాడిన ఆరెసెస్సు నాయకుడు ఇంద్రేష్‌ కుమార్‌ చైనా నుంచి టిబెట్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని, చైనా ఆధీనంలోవున్న మానస సరోవర ప్రాంతాన్ని విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మశాల(హిమచల్‌ ప్రదేశ్‌)లో వున్న టిబెట్టు ప్రవాస ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో ఇంద్రేష్‌ ప్రసంగాన్ని పెట్టారు. దాని ప్రకారం ప్రస్తుతం భారత్‌కు పాకిను కంటే చైనా ఎక్కువ ప్రమాదకారిగా మారింది. అందువలన టిబెట్‌ నాయకుడు దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పర్యటనను గౌరవించటం ద్వారా ఇంకేమాత్రం చైనా గురించి భయపడటం లేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు చైనా ఆక్రమణలోని టిబెట్‌ విముక్తికోసం పోరాడుతున్న టిబెటన్లకు సామాజికంగా, నైతికంగా, రాజకీయంగా మద్దతు ఇవ్వాలని కూడా చెప్పారు.ఆర్‌ఎస్‌ఎస్‌ విషయానికి వస్తే అది చేసే అనేక తప్పుడు ప్రచారాల్లో టిబెట్‌ అంశం ఒకటి. అసలు మన దేశం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించలేదని గతేడాది కూడా అదే నాయకుడు చెప్పాడు.http://www.tibetanreview.net/india-has-never-recognized-tibet-as-historically-chinese/

మన ప్రభుత్వం అధికారయుతంగా ఐక్యరాజ్యసమితిలో ఒకే చైనాను గుర్తిస్తున్నది. (చాలా కాలంపాటు చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్నే చైనా ప్రతినిధిగా సామ్రాజ్యవాదులు, వారి మద్దతుదారులు గుర్తించారు. తరువాత అనివార్యమై కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పలేదు) ఈ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో మన విదేశాంగశాఖ ప్రతినిధి ఒక వివరణ ఇస్తూ చైనాలో టిబెట్‌ అంతర్భాగం అన్న మన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.http://timesofindia.indiatimes.com/india/no-change-in-indias-position-on-tibet-being-part-of-china-mea/articleshow/58182984.cms?TOI_browsernotification=true మన ప్రభుత్వం అధికారయుతంగా ఐక్యరాజ్యసమితిలో ఒకే చైనాను గుర్తిస్తున్నది. (చాలా కాలంపాటు చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్నే చైనా ప్రతినిధిగా సామ్రాజ్యవాదులు, వారి మద్దతుదారులు గుర్తించారు. తరువాత అనివార్యమై కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పలేదు) కాశ్మీరు వేర్పాటు వాదులు తమకు స్వాతంత్య్రం కావాలని కోరుతున్న విషయం తెలిసిందే. వారికి ఇప్పటి వరకు పాక్‌ పాలకులు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. ఇప్పటి వరకు కాశ్మీరును మన అంతర్భాగంగానే చైనా గుర్తిస్తున్నది, దొంగ భక్తుడికి పంగనామాలెక్కువన్నట్లుగా దేశ భక్తి గురించి అతిగా చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మాటలు విన్న తరువాత అది పాలక పార్టీ పరోక్ష అభిప్రాయంగా చైనీయులు పరిగణించి కాశ్మీరు వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తే పరిస్ధితి ఏమిటి ?

అందువలన సమస్యలను మరింత సంక్లిష్టం చేయటం ఎవరికీ మంచిది కాదు. అన్ని రంగాలలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ వచ్చే ఎన్నికలలో జనం దృష్టి మళ్లించటానికి అవకాశాలను వెతుకుతున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది. దానిలో భాగంగా సరిహద్దులలో వుద్రిక్తతలను రెచ్చగొట్టి ఆపేరుతో గట్టెక్కుదామనుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది.

మరోసారి దేశంలో చైనా వస్తువులను బహిష్కరించి గుణపాఠం చెప్పాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల రెచ్చగొట్టుడు మాటలు వినిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా అధికారంలో వున్నది దాని నేతలే. ఒకవైపు వారే దిగుమతులను అనుమతిస్తారు, మరోవైపు బహిష్కరించమని పిలుపు ఇస్తారు. ఇంతకంటే మోసం, నాటకం మరొకటి ఏముంటుంది? ఎన్నికలలో నిధులు ఇచ్చే వ్యాపారుల కోసం దిగుమతులను అనుమతిస్తారు, చైనా వ్యతిరేక మనోభావాలకు రెచ్చిపోయే మధ్యతరగతి ఓట్ల కోసం చెవుల్లో పూలు పెడుతూ బహిష్కరణ పిలుపులు ఇస్తుంటారు. http://retail.economictimes.indiatimes.com/news/industry/boycott-of-chinese-goods-how-it-wont-help-india-but-can-harm-china/59543718 ఈ లింక్‌లోని విశ్లేషణను ప్రచురించిన ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పత్రికను కూడా దేశ ద్రోహిగా చిత్రించి ఆ పత్రికను కూడా బహిష్కరించమని పిలుపు ఇస్తారేమో తెలియదు. వస్తుబహిష్కరణ ద్వారా చైనాపై వత్తిడి తేగలమనేది పొరపాటు, దాని వలన భారత్‌కు ఒరిగేదేమీ లేదని, చైనా దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు హానికరమని పేర్కొన్నది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2016లో భారత్‌కు చైనా దిగుమతులు 0.2శాతం మాత్రమే పెరిగి 58.33 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఇదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు 12శాతం పడిపోయి 11.76 బిలియన్లకు తగ్గి వుభయ దేశాల మధ్య వాణిజ్య అంతరం 46.56 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని ఆ విశ్లేషణలో తెలిపారు. చైనా ప్రపంచ దేశాలకు వంద వస్తువులను ఎగుమతి చేస్తే దానిలో కేవలం రెండు మాత్రమే భారత్‌కు వస్తున్నాయి. అందువలన ఆ రెండింటిని మన ఆర్‌ఎస్‌ఎస్‌ యోధులు, దేశీయ ‘బాణ సంచా జాతీయో యోధులు’ బహిష్కరింపచేస్తే చైనీయులు కాళ్ల బేరానికి వస్తారని భావిస్తే అంతకంటే పిచ్చి వూహ మరొకటి వుండదు. ఇదే సమయంలో ఆ విశ్లేషణలో పేర్కొన్నట్లు చైనా దిగుమతులపై ఆధారపడిన మన ఔషధ పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజు చైనా ఒక చెరువు మాదిరి వుంది. అగ్రరాజ్యమైన అమెరికాయే దానితో మరిన్ని రాయితీలు పొందేందుకు బేరసారాలు చేస్తోంది తప్ప అలగటం లేదని గ్రహించటం అవసరం.

అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సేకరించిన సమాచారం ప్రకారం 2016లో 2011 బిలియన్‌ డాలర్లతో చైనా ప్రపంచ ఎగుమతులలో అగ్రస్ధానంలో వుంది.దీనిలో హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్లను కలపలేదు. తరువాత అమెరికా, జర్మనీ, 1471, 1283 బిలియన్లతో రెండు, మూడు స్ధానాల్లో వున్నాయి. మన దేశం 271 బిలియన్లతో 17వ స్ధానంలో వుంది. అందువలన మన 58 బిలియన్‌ డాలర్ల దిగుమతులను ఆపేస్తే తెల్లవారేసరికి చైనా దిగివస్తుందని అనుకోవటం మరుగుజ్జు ఆలోచన మాత్రమే. రెండవది తన వుత్పత్తికి ఎలాంటి ఢోకా లేకుండా చైనా తన అంతర్గత వినియోగాన్ని పెంచేందుకు పూనుకుందని అందరూ చెబుతున్నారు. ఇంతకూ చెప్పవచ్చేదేమంటే వాస్తవాల ప్రాతిపదికన ఆలోచించటం అవసరం.

చైనాతో మన కంటే ఎక్కువగా అమెరికా,జపాన్‌లు వివాదపడుతున్నాయి. సైనిక సమీకరణలు సాగిస్తున్నాయి. వుత్తర, దక్షిణ కొరియాలు ఏకం కాకుండా అడ్డుపడుతూ వుత్తర కొరియా నుంచి రక్షణ పేరుతో దక్షిణ కొరియాలో 30వేలకు పైగా సైన్యాన్ని, ఆధునిక క్షిపణులు, ఆయుధాలతో అమెరికన్లు తిష్టవేశారు. జపాన్‌తో రక్షణ ఒప్పందం ముసుగులో అక్కడ కూడా సైనిక స్ధావరాలను ఏర్పాటు చేసి మిలిటరీ, దానిపై ఆధారపడే వారిని లక్ష మందిని జపాన్‌లో దశాబ్దాల తరబడి అమెరికన్లు మకాం వేశారు. ఇవన్నీ చైనాకు వ్యతిరేకంగానే అన్నది స్పష్టం. ఇవేగాదు, సాధ్యమైన మేరకు చైనా చుట్టూ తన సేనలను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. అయినా చైనా వస్తువులను బహిష్కరించాలని అమెరికాలోని వారెవరూ పిలుపునివ్వటం లేదు.జపాన్‌ తన సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకొంటోంది. చైనాతో వివాదాలను పరిష్కరించుకొని మన ప్రయోజనాలను పరిరక్షించుకోవటం అవసరం. ఇవాళ వున్న పరిస్ధితుల్లో భారత్‌ – చైనా రెండూ యుద్ధాన్ని కోరుకోవటం లేదు.రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించగల క్షిపణులు వున్నాయి, అందువలన విజేతలెవరూ వుండరు. మన నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పేరుతో ఎన్ని పిలుపులు ఇచ్చినా సమీప భవిష్యత్‌లో వాణిజ్యంలోభారత దేశం చైనాకు పోటీ అవుతుందని ఎవరూ భావించటం లేదు. ఎవరైనా అలా చెబితే మనలను వుబ్బేసి తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి తప్ప వేరు కాదు. నరేంద్రమోడీ ఇంతవరకు చైనా వస్తువుల దిగుమతి నిషేధం లేదా బహిష్కరణ గురించి తన మనసులోని మాటల్లో కూడా బయట పెట్టటం లేదు. అమాయకులను తప్పుదారి పట్టించి, మోసం చేసి ఫేసుబుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నగుబాట్ల పాలు చేయటానికి తప్ప రాజును మించిన రాజభక్తి మాదిరి అగ్రరాజ్యం అమెరికా వంటి వాటికే లేని దురద మన కాషాయ సేనకెందుకు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా- భూటాన్‌ మధ్య వివాదంలో భారత్‌ !

08 Saturday Jul 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, Bhutan, Chicken neck, China, Indo-China, Indo-China standoff, Nathu La

ఎం కోటేశ్వరరావు

వర్తమాన ప్రపంచంలో జరిగే యుద్ధాలలో జనాలకు నష్టాలు, కష్టాలే తప్ప విజయాలు ఎక్కడా కనిపించటం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో అంత పెద్ద అమెరికా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని ఆయుధాలు కుమ్మరించి కూడా తాను పెంచి పెద్ద చేసిన తాలిబాన్లు చివరకు ఏకు మేకైనట్లుగా మారటంతో వారిని అణచలేక అలసిపోయి వెనుదిరిగి వచ్చింది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తోటి తోడేలు రాజ్యాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి అనేక దేశాలను కూడా ఏదో రూపంలో ఆ యుద్ధంలో దించి వాటి చేత కూడా భారీగా ఖర్చు చేయించిన విషయం తెలిసిందే. క్యూబా, వుత్తర కొరియా, వియత్నాం ఇలా ఏ చిన్న దేశం కూడా అమెరికా సైనిక పాటవాన్ని చూసి భయపడలేదు, భవిష్యత్‌లో భయపడవు. తాజాగా వుత్తర కొరియా పరీక్షించిన ఖండాంతర క్షిపణిని నిజంగా గురి పెడితే వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికాలోని ఒక ప్రాంతంలో కావాల్సినంత విధ్వంసం సృష్టించగలదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీకు మా వూరెంత దూరమో మాకు మీ వూరూ అంతే దూరం అన్నది వుత్తర కొరియా ప్రయోగ సందేశం. ఇటు వంటి పరిస్ధితులలో ఇక్కడి కోడి కూస్తే అక్కడకు, అక్కడి కోడి కూత ఇక్కడకు వినిపించే దూరంలో వున్న చైనా-మన దేశం మధ్య తలెత్తిన వివాదం ఎంత వరకు దారితీస్తుందన్నది దేశంలో ఒక పెద్ద చర్చగా వుంది. నిజానికి ఇది చైనా-భూటాన్‌ మధ్యలో భారత్‌ దూరటం అంటే సముచితంగా వుంటుంది.అందుకు గాను http://thebhutanese.bt/understanding-the-doklam-border-issue/  ది భూటానీస్‌ పత్రిక సంపాదకుడు టెన్సింగ్‌ లామ్‌సాంగ్‌ రాసిన పై వ్యాఖ్య పూర్తి పాఠాన్ని ఆసక్తి వున్నవారు చదువుకోవచ్చు.

తాజా వివాదంపై చైనా-భారత మీడియా వార్తల తీరు తెన్నులు, సామాజిక మీడియాలో వుభయ దేశాల మధ్య మైత్రిని గాక శతృత్వాన్ని కోరుకొనే వారి పోస్టులు, వ్యాఖ్యలను కాసేపు పక్కన పెట్టి వివాద పూర్వరంగాన్ని చూడటం అవసరం. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరేవారు దేశద్రోహులు కాదు, అవకాశం వచ్చినపుడు అమీ తుమీ తేల్చుకోవాలని చెప్పే వారు దేశ భక్తులు అంతకంటే కారు. మన సైనికుల ప్రాణాలు, వారి కుటుంబాల వేదన, రోదనలు, యుద్ధాలు జరిగితే మన జనంపై పడే భారాల వంటి అనేక విషయాలను ఆలోచించాల్సి వుంటుంది. దీని అర్ధం మన జాగ్రత్తలు మనం తీసుకోవద్దని, వివాదం లేని మన భూభాగాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవద్దని కాదు. వివాదాలు లేని రోజుల్లో కూడా మన రక్షణ యంత్రాంగం నిరంతరం అదే పనిలో నిమగ్నమై వుంటుంది.

అనేక వుదంతాలను చూసిన తరువాత యుద్ధాలు వద్దు, శాంతి కావాలి, ఆయుధాలకు తగలేసే ఖర్చును అభివృద్ధికి వినియోగించాలి అన్న భావం ప్రపంచ వ్యాపితంగా ఏదో ఒక మూల రోజూ వినిపిస్తూనే వుంది. అదే విధంగా చంపు, కొట్టు, నరుకు అనే వున్మాదం తలకెక్కిన వారు కూడా గణనీయంగా వున్నారు గనుకే హిట్లర్‌ వంటి నరహంతకులు తయారవుతున్నారు. ఆ కారణంగానే లాభాల కోసం పని చేసే ప్రపంచ యుద్ధ పరిశ్రమలలో ఎలాంటి సంక్షోభం కనిపించటం లేదు. వాటికోసం అమెరికా సామ్రాజ్యవాదులు ప్రపంచంలో ఏదో ఒకచోట నిత్యం యుద్ధాలను కొనసాగిస్తూనే వున్నారు. తిరుగుబాట్లను రెచ్చగొడుతూ అటు తీవ్రవాదులు-ప్రభుత్వాలకు కూడా ఆయుధాలు విక్రయిస్తూ లాభాలు పోగేసుకుంటున్నారు. ఆయుధ వుత్పత్తి సంస్ధలలో అత్యధికం సామ్రాజ్యవాదుల వెన్నుదన్ను వున్న కార్పొరేట్ల చేతులలో వున్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మన దేశంలో వున్న పరిస్ధితులలో చైనా లేదా పాకిస్ధాన్‌తో యుద్ధం, యూదు మత దురహంకారి అయిన ఇజ్రాయెల్‌తో సంబంధాలు వద్దు అని చెప్పేవారిని దేశ ద్రోహులుగా చిత్రిస్తారని, వెంటాడి వేధిస్తారని తెలుసు. నేనయితే రక్తం ఏరులై పారాలని, యుద్ధం కావాలని కోరుకొనే పని పాటలు లేని దేశ భక్తుడిని కాదు. మీడియాలో రాస్తున్న వార్తలలో తమకు అనుకూలంగా వున్న వాటిని చూసి ఆవేశం తెచ్చుకొనే రకాన్ని అంతకంటే కాదు. సామాజిక మీడియాలో వీరావేశం ప్రదర్శించేవారందరూ సరిహద్దులకు కాదు కదా ఫేస్బుక్‌ దాటి బయట కాలు పెట్టరు. యుద్ధానికి ముందు సమాధి అయ్యేది నిజం. ఏదేశానికి ఆదేశ పాలకులు, అధికార యంత్రాంగం తమకు అనుకూలమైన సమాచారాన్ని, టీకాతాత్పర్యాలను మాత్రమే జనం ముందుంచుతుంది.

వుదాహరణకు జూన్‌ 19న వాతావరణం సరిగా లేని కారణంగా మన దేశంలోని సిక్కిం నుంచి బయలు దేరాల్సిన మానస సరోవర యాత్రికులు నిలిచిపోయారని తొలి వార్తలు వచ్చాయి. తరువాత 23న రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా చైనా వారు నాథూలా కనుమ గేట్లు తెరవలేదని, తరువాత యాత్రికులను వారు అనుమతించటం లేదని వార్తలు వచ్చాయి. ఎందుకిలా జరిగిందో తెలియదని మన విదేశాంగశాఖ అధికారులు వ్యాఖ్యానించారు. అసలు విషయాన్ని చైనా లేదా మన ప్రభుత్వం గానీ 30వ తేదీ వరకు వెల్లడించలేదు. తన ఆధీనంలో వున్న డోక్లాం ప్రాంతంలోని డోక్లాలో చైనా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. అది తమ ప్రాంతమని భూటాన్‌ వాదిస్తోంది. అయితే అది చైనా ఆధీనంలో వుంది. రోడ్డు నిర్మాణంపై భూటాన్‌ అభ్యంతరాలను చైనా ఖాతరు చేయలేదు. దాంతో భూటాన్‌ అధికారులు మన దేశానికి నివేదించారు. భూటాన్‌తో మనకు రక్షణ ఒప్పందం వుంది కనుక వివాదాస్పద భూటాన్‌ ప్రాంతాన్ని రక్షించే పేరుతో మన సేనలు డోక్లాం ప్రాంతంలో వ్రవేశించి చైనా సిబ్బంది వేస్తున్న రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. దానికి ప్రతిగా మానస సరోవర యాత్రను చైనా నిరాకరించింది. నాథులా కనుమ మానస సరోవరానికి దగ్గరి దారి, దీనిని రెండు సంవత్సరాల క్రితం చైనా అనుమతించింది. సరిహద్దులలోని ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన వివాదం దృష్ట్యా భద్రతాపరమైన కారణాలతో ఈ మార్గాన్ని మూసివేశామని, ఇతర మార్గాల ద్వారా అనుమతిస్తున్నామని చైనా ప్రకటించింది. తమ భూ భాగంలో తాము నిర్మించుకుంటున్న రోడ్డును భారత బలగాలు అడ్డుకోవటమేగాక, బంకర్లు కూడా నిర్మించాయని, తమ ప్రాంతంలో తిష్ట వేశాయని చైనా ప్రకటించింది. చైనా సైనికులే మన భూ భాగంలో ప్రవేశించి మప బంకర్లను కూల్చివేశారని మన దేశంలోని మీడియా వార్తలను అందించింది.

భారత్‌-చైనా- భూటాన్‌ సరిహద్దు మూడు ప్రాంతాల కూడలి కోడి మెడ ఆకారంలో వుంటుంది. ఆ ప్రాంతంలోని సిక్కిం దగ్గరి సరిహద్దుతో మనకూ చైనాకు వివాదాలు లేవు. అయితే భూటాన్‌- చైనాల మధ్య ప్రాంతాల విభజనపై ఆ రెండు దేశాల మధ్య వివాదం వుంది. ప్రస్తుతం మన సేనలు ప్రవేశించినట్లు చెబుతున్న ప్రాంతం తనదని భూటాన్‌ వాదిస్తుండగా తమ ఆధీనంలో వున్న తమ ప్రాంతమని చైనా చెబుతున్నది. దానిని భూటాన్‌ గుర్తించలేదు. ఈ వివాదానికి సంబంధించి భూటానీస్‌ పత్రిక సంపాదకుడు రాసిన వ్యాఖ్య సారాంశం ఇలా వుంది.’ సరిహద్దు గురించి అంతిమ పరిష్కారం జరిగే వరకు యథాతధ స్ధితితో పాటు ఆ ప్రాంతంలో శాంతి, సామరస్యాలను పాటించాలని 1988,1998లో వుభయ(చైనా-భూటాన్‌) దేశాలు చేసుకున్న రాతపూర్వక ఒప్పందాలను భూటాన్‌ ప్రాంతంలో రోడ్డు నిర్మించటం ద్వారా చైనా అతిక్రమించిందని భూటాన్‌ విదేశాంగశాఖ జూన్‌ 29న ప్రకటించింది. భూటాన్‌ సైనిక శిబిరం వున్న జొంపెలిరీ వైపునకు దారితీసే విధంగా డోక్లా ప్రాంతంలో చైనా జూన్‌ 16న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ఢిల్లీలో వున్న భూటాన్‌ రాయబారి ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి దీనిపై అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాల గురించి ఎప్పటికప్పుడు భారత్‌కు భూటాన్‌ తెలియచేస్తున్నది. డోక్లా సాధారణ ప్రాంతంలో వున్న భారత సైన్యం భూటాన్‌ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రోడ్డు నిర్మాణం జరుపుతున్న చైనా సిబ్బంది వద్దకు వెళ్లి నిర్మాణం నిలిపివేసి యథాతధ స్ధితిని కొనసాగించాలని కోరింది. ఆ నిర్మాణం యథాతధ స్దితిలో గమనించదగిన మార్పునకు దారితీయటమే గాక భారత్‌ రక్షణకు తీవ్రమైన పర్యవసానాలు ఎదురవుతాయని చైనాకు తెలియచేసింది. 2012లో భారత్‌-చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మూడు దేశాల కూడలి సరిహద్దులపై వుభయ దేశాలతో పాటూ మూడవ పక్ష దేశాలతో కూడా సంప్రదించి ఖరారు చేసుకోవాల్సి వుండగా ఈ అవగానకు విరుద్దంగా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టిందని భారత్‌ అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాంతం తమదే అంటూ చైనా తన చర్యను సమర్ధించుకుంది.

సంఘటన జరిగిన ప్రాంతం గురించి గందరగోళం వున్నట్లు కనిపిస్తోంది. అది మూడు దేశాల కూడలి. కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే మూడు దేశాలు కలుసుకోగలిగిన ఇరుకైన ప్రాంతం. ఎవరికి వారు తమ దైన పేరుతో దానిని సాధారణ ప్రాంతంగా పిలుస్తున్నారు. సంఘటన జరిగిన డోక్లాంలో పెద్ద ప్రాంతం భూటాన్‌దే. సామాజిక మీడియాను అనుసరిస్తున్న కొందరు భూటానీయులు మరో వివాదాస్పదమైన ఫూటెగాంగ్‌ ప్రాంత రోడ్డుపై వివాదం జరిగినట్లు గందరగోళపరుస్తున్నారు. దానికి ఒకవైపు చైనా మరోవైపు భూటాన్‌ అవుట్‌పోస్టులున్నాయి. అక్కడెలాంటి సంఘటన జరగలేదు.డోక్లాం ప్రాంతంలో నిర్మిస్తున్న రోడ్డును నిలిపివేయాలని భూటాన్‌ సైన్యం చేసిన ప్రయత్నానికి చైనా నిరాకరించింది. తరువాత ఆ ప్రాంతానికి వచ్చిన భారతీయ సైన్యం రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసింది. దానికి ప్రతిగా తరువాత వచ్చిన చైనా సైన్యం ఇరుకుగా వున్న ఆప్రాంతంలో భారత సైనికులు నిర్మించిన చిన్న మిలిటరీ అవుట్‌పోస్టులను ధ్వంసం చేసింది.

చైనా విషయానికి వస్తే చుంబీ లోయలోని యాడోంగ్‌ పట్టణం వరకు పెద్ద రోడ్డు నిర్మాణం జరిపింది. భూటాన్‌, భారతవైపు అనేక రోడ్ల నిర్మాణానికి పూనుకుంది. అయినప్పటికీ ముఖ్యంగా భారత్‌కు కోడి మెడ కూడలి ప్రాంతంవైపు దక్షిణదిశగా నిర్మించే రోడ్డు దాని భద్రతకు హాని కలిగిస్తుందని భావిస్తోంది. ఆ ప్రాంతం దాని ఏడు ఈశాన్య రాష్ట్రాలను కలుపుతుంది.వాటిలో కొన్నింటిలో తీవ్రవాద సమస్యలున్నాయి. చుంబీలోయలో చైనా ప్రాంతం వున్నప్పటికీ ఇరుకుగా వుండటంతో చైనాకు స్ట్రాటజిక్‌ షోల్డర్స్‌ (భుజంతో కాచుకొనే, మార్చుకొనే వీలు) లేవు. అందుకే అది భూటాన్‌కు చెందిన 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కావాలని, దానిలో సులభంగా మసల వచ్చని చైనా భావిస్తోంది. అదే జరిగితే తనకు పెద్ద ముప్పని భారత్‌ భావిస్తోంది. భూటాన్‌ విషయానికి వస్తే ఏ ప్రాంతాన్ని కోల్పోవటానికి, చొరబాట్లను అంగీకరించటానికి సిద్దంగా లేదు. వ్యూహాత్మక ప్రాధాన్యత రీత్యా 1996లో చైనా ఒకప్యాకేజ్‌ను ప్రతిపాదించింది. దాని ప్రకారం డోక్లాంలో తనకు 269 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వదిలితే భూటాన్‌ వుత్తర ప్రాంతంలో తమదిగా వున్న 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్‌కు బదలాయిస్తామని చైనా ప్రతిపాదించింది.

భూటాన్‌-చైనా సరిహద్దు వివాదం 1959లో చైనా సైన్యం టిబెట్‌, భూటాన్‌లో ప్రవేశించి తదుపరి భూటాన్‌ వుత్తర సరిహద్దులను మూసివేసినప్పటి నుంచి ప్రారంభమైంది. అప్పటి పరిణామాలలో భారత్‌కు భూటాన్‌ చేరువైంది. భూటాన్‌-టిబెట్‌ మధ్య పారేనీటి వాలును బట్టి సరిహద్దులనిర్ణయం జరగాలన్న సాంప్రదాయ పద్దతిని చైనా అంగీకరించటం లేదు. తొలుత సరిహద్దు సమస్యను భారత్‌తో సంప్రదించి, దాని ద్వారా చైనాతో భూటాన్‌ చర్చలు జరిపింది. 1984 నుంచి చైనాతో నేరుగా భూటానే చర్చలను ప్రారంభించింది. అప్పటి నుంచి 2016 వరకు 24సార్లు వుభయ దేశాల మధ్య చర్చలు జరిగాయి.’

చైనా నిర్మిస్తున్న రోడ్డు భూటాన్‌ -చైనా మధ్య వున్న వివాదాస్పద ప్రాంతమైనప్పటికీ మూడు దేశాల సరిహద్దు కూడలికి దగ్గరగా రోడ్డు వున్నందున, అది మిలిటరీ రీత్యా కీలక ప్రాంతమైనందున మన దేశం ఆందోళన వెలిబుచ్చటం సహేతుకమే. అలాంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి వుంది. భూటాన్‌ తరఫున మన సైన్యం రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవటమే మన దేశం-చైనా మధ్య వివాదానికి కారణంగా కనిపిస్తోంది. రెండు దేశాల ప్రతినిధులు పరిమితులకు మించి చేసిన వ్యాఖ్యలు దానిని మరింత పెంచాయి. తమ భూ భాగం నుంచి భారత సైనికులు వైదొలిగితేనే తాము చర్చలు జరుపుతామని చైనా షరతు విధించింది.

గత కొంత కాలంగా చైనా పట్ల మనం, దానికి ప్రతిగా చైనా మనపట్ల అనుసరిస్తున్న వైఖరి రెండు దేశాల మధ్య పరస్పర అనుమానాలను పెంచుతున్నది. మనకు ప్రత్యక్షంగా సంబంధంలేని దక్షిణ చైనా సముద్ర వివాదం వంటి విషయాలలో కూడా మన దేశం అనుసరిస్తున్న వైఖరి చైనాకు మింగుడు పడటం లేదు. అందుకే అది మన దేశానికి సంబంధించిన కొన్ని విషయాలలో వేరే విధంగా స్పందిస్తున్నది. తమ చుట్టూ అమెరికన్లు బిగిస్తున్న మిలిటరీ వ్యూహానికి ప్రతిగా స్వయం రక్షణ చర్యలలో భాగంగా చైనా కూడా తనదైన పద్దతులలో ముందుకు పోతున్నది. ఈ పూర్వరంగంలోనే తాజా సమస్యను చూడాల్సి వుంది. ప్రపంచంలో ఏ దేశానికి ఆదేశం తన ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకొనేందుకు అనేక చర్యలను తీసుకొంటోంది. వాటిలో రాజకీయ కోణాన్ని చొప్పిస్తేనే సమస్యలు సంక్లిష్టంగా మారతాయి.

దలైలామా చైనాపై తిరుగుబాటు చేసి మన దేశానికి వచ్చి ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌పై చైనా అధికారాన్ని సవాలు చేస్తున్నాడు. టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగంగా మన దేశం గుర్తిస్తూనే దలైలామాకు ఆశ్రయం కల్పించటం, చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించటాన్ని చైనా అభ్యంతర పెడుతున్నది. తమ టిబెట్టులోని దక్షిణ ప్రాంత మంటూ మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ను గుర్తించేందుకు చైనా నిరాకరిస్తున్నది. అక్కడ పర్యటించటానికి దలైలామాను అనుమతించవద్దని అభ్యంతరం చెప్పింది. అరుణాచల్‌ మన భూ భాగమని దానిలో ఎవరు పర్యటించాలో వద్దో చెప్పే అధికారం చైనాకు లేదంటూ మన సార్వభౌమత్వాన్ని వెల్లడించే చర్యలో భాగంగా మన ప్రభుత్వం దలైలామా పర్యటనకు ఏర్పాట్లు చేసింది. అంతే కాదు దాని రక్షణకు అవసరమైతే సత్వరం సైన్యాన్ని, ఇతర సామాగ్రిని తరలించేందుకు వీలుగా అరుణాచల్‌ తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు మన ప్రభుత్వం పొడవైన వంతెనను కూడా నిర్మించింది. ఇది చైనా సరిహద్దులకు చేరువలో వుంది. అదే విధంగా రైలు మార్గ నిర్మాణానికి కూడా తలపెట్టింది. చైనా కూడా మన సరిహద్దులకు దగ్గరగా సైనిక రవాణాకు వీలు కల్పించే ఒక ముఖ్యమైన రైలు మార్గాన్ని టిటెట్‌లో నిర్మించిన విషయం బహిరంగమే. అందువలన ఎవరి రక్షణ చర్యలు వారు తీసుకోవటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వుదాహరణకు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయాలని మన దేశంపై పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో వత్తిడి చేస్తున్నాయి. ప్రపంచశాంతి కావాలని మన దేశంలో కోరుకొనే శక్తులు కూడా ఆ ఒప్పందంపై సంతకం మన దేశం చేయవద్దనే చెబుతున్నాయి. మన సార్వభౌమత్వ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును మనం అట్టిపెట్టుకోవాలని తప్ప ఆయుధాలు తయారు చేసి అమెరికా మాదిరి మిగతా దేశాల మీద ప్రయోగించాలని కాదు. అణుయుద్దమే వస్తే ఏ ఒక్కదేశమూ మిగలదు. మిగతా దేశాలు కూడా అణ్వాయుధాలు తయారు చేశాయి గనుకనే అమెరికా ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తోంది.

చైనాతో సంబంధాల విషయాన్ని కూడా మన ప్రయోజనాలను కాపాడుకొంటూ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం ప్రయోజనదాయకమని గత అనుభవాలు నిరూపించాయి.1962లో రెండు దేశాల మధ్య జరిగిన యుద్దం సందర్భంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని వెల్లడించినందుకు నాటి ప్రభుత్వం వుమ్మడి కమ్యూనిస్టుపార్టీ నుంచి ఆతరువాత సిపిఎంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని నాటి ప్రభుత్వం అరెస్టు చేసింది. సిపిఎంను చైనా అనుకూల పార్టీగా ముద్రవేశాయి. ఇప్పటికీ రాజకీయ ఓనమాలు తెలియని వారు అదే విధంగా నిందలు వేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు దేశభక్తి పేరుతో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాయి. తరువాత జరిగిన పరిణామాలలో సిపిఎం నాయకత్వం చెప్పినట్లు వుభయ దేశాలు సరిహద్దు సమస్యపై సామరస్యపూర్వక చర్చలను ప్రారంభించటంతో పాటు సంబంధాలను మెరుగుపరచుకోవటం చూశాము. చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాజ్‌పేయి జనతాపార్టీ హయాంలో విదేశాంగ మంత్రిగా, తరువాత ప్రధానిగా పని చేసినప్పటికీ చైనాతో సంబంధాల మెరుగుదలకే కృషి చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ అదే ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే వుంది. ఇప్పుడూ దాని శ్రేణులు అదే చేస్తున్నాయి. తాజా వివాదాన్ని కూడా పరస్పర విశ్వాసం పాదుకొల్పే చర్యలతో పరిష్కరించుకోవటం తప్ప ఆయుధాలతో పరిష్కారమయ్యేది కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గో గూండాలకు గాంధీ సూక్తులు-నరేంద్రమోడీ పిట్ట, కట్టు కథలు !

01 Saturday Jul 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Acharya Vinoba Bhave, bjp cow politics, cow goondas, cow protectors, gandhi good words, Mahatma Gandhi, Narendra Modi, narendra modi cock and bull stories

నరేంద్రమోడీ చెప్పిన సరికొత్త ఆవు పశ్చాత్తాప కథ మా దొరగారి పొలంలో పండే మిరియాలు తాటి కాయలంతుంటాయి బాబయ్యా అని చెప్పినట్లుగా వుంది.

ఎం కోటేశ్వరరావు

భూమ్మీద మే నెలలో మాత్రమే పుష్పించే మొక్కలున్నాయి. అందుకే వాటిని వాడుక భాషలో మే పుష్పాలు అన్నారు. అది ప్రకృతి ధర్మం. మన ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు నోరు విప్పుతారో తెలియదు.దీన్ని వికృతి ధర్మం అనవచ్చా. ఏ గొప్ప సందేశమిచ్చారన్నదానితో నిమిత్తం లేకుండా తాము నమ్మే మౌన బాబా నోరు విప్పటమే భక్తులకు పరమానందం. నరేంద్రమోడీ కూడా భక్తులకు అలాంటి అనూహ్య సందేశం వినిపించారు. తిరిగి ఎపుడు నోరు విప్పుతారో తెలియదు. ఆయన నోటి ముత్యాల కోసం దేశం యావత్తూ ఎదురు చూడాల్సిందే తప్పదు మరి !

గతేడాది అంటే 2016 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని అమెరికా నేతలను అనుకరిస్తూ కొత్తగా ప్రారంభించిన ‘టౌన్‌ హాల్‌ ‘ కార్యక్రమంలో మాట్లాడుతూ (తరువాత అలాంటి కార్యక్రమాలు జరిగినట్లు, మాట్లాడినట్లు వార్తలేమీ లేవు) గో రక్షణ పేరుతో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నవారిపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరారు.( ఒక్క రాష్ట్రమైనా ప్రధాని వినతిని పట్టించుకొని తీసుకున్న చర్యల గురించి తెలిసిన వారు ఎవరైనా వివరాలు అంద చేయాలని మనవి) ‘ గో రక్షణ వ్యాపారానికి పూనుకున్న వారిని చూసి నాకు తీవ్ర కోపం వస్తోంది. గో భక్తి వేరు, గో రక్షణ వేరు. పగలు గో రక్షకుల ముసుగులు వేసుకొని రాత్రంతా నేరాలు చేస్తున్న కొంత మందిని నేను చూశాను. గో రక్షకుల అవతారమెత్తిన వారిలో 70-80శాతం మంది సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, వారి తప్పులను కప్పి పుచ్చుకొనేందుకు గో రక్షకులుగా నటిస్తున్నారు. వారు నిజమైన రక్షకులైతే అత్యధిక ఆవులు ప్లాస్టిక్‌ కారణంగా మరణిస్తున్నాయి తప్ప వధించటం వలన కాదని తెలుసుకోవాలి. ఆవులు ప్లాస్టిక్‌ను తినకుండా వారు నిరోధించాలి.’ అని ఎంతో స్పష్టంగా చెప్పారు. తన స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఒక చచ్చిన ఆవుతోలు తీసినందుకు నలుగురు దళితులపై జరిపిన దాడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లడైన పూర్వరంగంలో వారిని బుజ్జగించే యత్నంలో భాగంగా ప్రధాని నోటి వెంట ఆ సుభాషితాలు వెలువడ్డాయి.

ఆ తరువాత మోడీ చెప్పినట్లు గో రక్షకుల ముసుగులో వున్న వారి ఆగడాలు ఆగలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి నిత్యకృత్యంగా మారాయి. ఎప్పుడు, ఎక్కడేం జరుగుతుందో తెలియదు. తరువాత జూన్‌ 29 గురువారం నాడు రెండు రోజుల గుజరాత్‌ పర్యటనలో మరోసారి నోరు విప్పి ‘ఆవు పేరుతో చేసే హత్యలను మహాత్మా గాంధీ అంగీకరించరు, అవి ఆయన సిద్దాంతాలకు వ్యతిరేకం ‘ అని సెలవిచ్చారు. రంజాన్‌ సందర్భంగా వస్తువులను కొనుగోలు చేసి దేశ రాజధాని ఢిల్లీ నుంచి రైలులో హర్యానాలోని స్వగ్రామానికి ప్రయాణిస్తున్న ముస్లిం కుటుంబంపై ముస్లిం వ్యతిరేక వున్మాదులు దాడి చేసి వారిని కొట్టి రైలులో నుంచి తోసివేసిన దుర్మార్గ వుదంతంలో పదిహేనేండ్ల ఒక యువకుడు మరణించిన విషయం తెలిసిందే. దానికి నిరసనగా దేశ వ్యాపితంగా అనేక నగరాలలో తీవ్ర నిరసన ప్రదర్శనలు వ్యక్తమైన ఒక రోజు తరువాత నరేంద్రమోడీ నోరు విప్పారు. అంటే తీవ్ర ఘటనలు, వాటిపై వ్యతిరేకత వ్యక్తమై అధికారపక్షం గబ్బు పట్టే పరిస్ధితులు తలెత్తినపుడే ప్రధాని నోరు విప్పుతారన్నది స్పష్టమైంది. అంతకు ముందే జరిపిన విదేశీ పర్యటన వార్తల కంటే ఎక్కువగా నిరసన ప్రదర్శనల గురించి అంతర్జాతీయ మీడియా స్పందించిన తీరు కూడా నరేంద్రమోడీని కలవరపరచి వుంటుంది.

‘ గోరక్షణ, గో ఆరాధన గురించి మహాత్మాగాంధీ, వినోభా భావే కొన్ని విషయాలు చెప్పారు. అవెలా చేయాలో వారు మనకు చూపారు.దేశానికి, ప్రగతికి అది మార్గం. గో భక్తి పేరుతో జనాన్ని చంపటం ఆమోదయోగ్యం కాదు, మనకు వినోభా భావే జీవితం అలాంటి సందేశం ఇవ్వదు. ఒకసారి వినోభానే కలిసే అదృష్టం నాకు కలిగింది. ఆయన నన్ను చూసి మరణించు, మరణించు అన్నారు. ఇదేమిటి ఇలా అంటారు అని దిగ్భ్రాంతి చెందాను. ఆవు కోసం మరణించు అని ఆ తరువాత ఆయనే చెప్పారు.మా గ్రామంలో నా చిన్నతనంలో ఒక ఆవు ప్రమాదవశాత్తూ ఐదు సంవత్సరాల బాలుడిని చంపింది. తరువాత అది మేతమేయటం మానుకొని ఆ బాలుడి తలిదండ్రుల ఇంటి ముందే పశ్చాత్తాపంతో మరణించింది. http://indianexpress.com/article/india/killing-in-name-of-cow-unacceptable-its-not-something-mahatma-gandhi-would-approve-pm-modi-4728580/ గాంధీ గురువుగా తెలిసిన జైన ఆధ్యాత్మికవేత్త శ్రీమద్‌ రాజచంద్ర 150వ జయంతి,ఆశ్రమ శతవార్షికోత్సవం జరుగుతున్నది, ఈ సందర్భంగా ఒకటి చెప్పదలచుకున్నాను, మనది అహింసాత్మక భూమి, మహాత్మాగాంధీ పుట్టిన నేల, ఏ సమస్యను కూడా ఎన్నడూ హింస పరిష్కరించజాలదు.నేను సబర్మతి ఆశ్రమంలో వున్నాను, ప్రస్తుతం దేశంలో వున్న పరిస్ధితి గురించి నా ఆగ్రహం, విచారం, బాధను వ్యక్తం చేయదలచుకున్నాను. చీమలకు కూడా తినబెట్టాలని నమ్మేదేశం మనది, వుదయమే చెరువుల దగ్గరకు వెళ్లి చేపలకు మేత వేసేటువంటి సంస్కృతి కలిగినట్టి ఒక దేశం, దానిలో మహాత్ముడు మనకు అహింస గురించి పాఠాలు చెప్పారు. అలాంటిది ఏమైంది మనకు ? విఫలమైన ఆపరేషన్‌ కారణంగా రోగి మరణిస్తే బంధువులు ఆసుపత్రులను తగులబెడుతున్నారు. ప్రమాదమంటే ప్రమాదమే. ప్రమాదాలలో ఎవరైనా మరణించినా లేక గాయపడినా జనం వచ్చి వాహనాలను తగులబెడుతున్నారు. మనమందరం కలసి కట్టుగా పని చేయాలి, గాంధీ కలలను నిజం చేయాలి. మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడేట్లు చేయాలి.’ అని నరేంద్రమోడీ తన సందేశంలో చెప్పారు.

మోడీగారి ఈ మాటలు విన్న, చదివిన తరువాత చెవుల్లో పూలేమన్నా మొలిచాయా అని ఎవరైనా తడిమి చూసుకోవాల్సి వుంటుంది. ఆవు పేరుతో జరిగే హత్యలను మహాత్మాగాంధీ సహించరు అని నరేంద్రమోడీ ఎవరికి చెబుతున్నట్లు ? గాంధీ పేరు చెప్పుకొని ఎవరైనా అలాంటి దుర్మార్గానికి పాల్పడుతుంటే అలా చెబితే అర్ధం వుంటుంది. సాధు జంతువైన ఆవు రక్షణ పేరుతో చెలరేగుతున్న సాయుధ వున్మాదులకు ఆవు కోసం చంపు,చంపు అన్నవి తప్ప చావు, చావు అన్నవి రుచిస్తాయా ? అయినా విపరీతం గాకపోతే ఆవు కోసం మరణించటం ఏమిటి? సంఘపరివార్‌ లేదా అది ఏర్పాటు చేసిన ప్రత్యక్ష బిజెపి వంటి రాజకీయ పార్టీలు, సంస్ధలు లేదా పరోక్షంగా వేరే ముసుగులతో పని చేస్తున్న సంస్ధల వారు గానీ ఇంతవరకు గాంధీని జాతిపితగా గుర్తించలేదు. ప్రధాని నరేంద్రమోడీ- బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయపు శరీరాలు వేరు తప్ప ఆత్మలు, ఆలోచనలు ఒక్కటే అని అందరికీ తెలుసు. అలాంటి ఒక ఆత్మ అయిన అమిత్‌ షా మహాత్ముడిని ఒక చతురుడైన కోమటిగా వర్ణించటాన్ని తన మౌనం ద్వారా మరో ఆత్మ అయిన నరేంద్రమోడీ సమర్ధించారు. అదే పెద్దమనిషి ఆవు పేరుతో జరిగే వాటిని మహాత్ముడు అంగీకరించడు అంటున్నారు. ఇలాంటివి ఆత్మను చంపుకొని లేదా వంచనలో భాగంగా మాట్లాడేవి తప్ప మరొకటి కాదు. హిందూ-ముస్లిం మతసామరస్యతను దెబ్బతీయటమే పరమ ధర్మంగా పెట్టుకున్న పరివార సంతతి సామరస్యత కోసం తన ప్రాణాలనే బలి ఇచ్చిన ఆయన కలలను నిజం చేయాలి అని చెబితే చెవుల్లో పూలు పెట్టుకున్నవారు తప్ప అన్యులెవరూ ఆవగింజంతైనా విలువ ఇవ్వరు. అమిత్‌ షా నాయకత్వంలోని బిజెపి అనుయాయులు, ఆర్‌ఎస్‌ఎస్‌లో కొంతకాలం పని చేసి ఆ మహాత్ముడిన చంపిన గాడ్సేకు గుడులు, గోపురాలు కట్టాలంటూ కీర్తిస్తున్న శక్తుల చెవులకు అవి ఇంపుగా వుంటాయా ? ఎందుకీ రెండు నాలుకల వైఖరీ, ఎందుకీ వంచన ? మనుషులను చంపితేనే వురి శిక్షలు వద్దని సభ్య సమాజం ఒకవైపు కోరుతుంటే ఆవును చంపిన వారిని వురితీసే విధంగా చట్టాలను సవరించాలని బిజెపి, దాని ప్రత్యక్ష, పరోక్ష అనుబంధ సంఘాల వారు చెలరేగుతున్న స్ధితి. అరవై ఆరు సంవత్సరాల నరేంద్రమోడీ, 87 సంవత్సరాల వయస్సులో 1982లో మరణించిన వినోభావేను ఎప్పుడు, ఎక్కడ కలిశారో, ఈయనను చూసి అవు కోసం చావు చావు అని తన మౌనవ్రతం వీడి ఆయనెందుకు చెప్పారో, దానిలో అంత సుగుణం ఏమి వుందని ఆవుకోసం హత్యలకు సైతం వెనకాడని వున్మాదం ప్రబలిన స్ధితిలో మోడీ ఎందుకు ప్రత్యేకించి చెప్పారో అని ఆలోచిస్తే అనేక కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మహాత్ము డు ఆవు గురించి ఏం చెప్పినా గొడ్డు మాంస నిషేధం గురించి చెప్పలేదు.https://thewire.in/12170/what-mahatma-gandhi-said-to-those-who-wanted-beef-banned-in-india/ పశు విక్రయాలపై కేంద్రం చేసిన నిర్ణయం పరోక్షంగా గొడ్డు మాంసాన్ని నిషేధించే దిశగా వుంది తప్ప వేరొకటి కాదు. ‘ఎవరికి వారికి బుద్ధి పుట్టకుండా ఆవును చంప వద్దని నేను బలవంతం ఎలా చేయగలను ? దేశంలో హిందువులు మాత్రమే లేరు. ముస్లింలు, పార్సీలు, క్రిస్టియన్లు, ఇతర మతాల వారు వున్నారు’ అని చెప్పారు. అయినప్పటికీ దేశంలో బిజెపి నేతలు గొడ్డు మాంసానికి వ్యతిరేకంగా మాట్లాడటం, రెచ్చగొట్టటాన్ని గాంధీ అంగీకరిస్తారా ? గాంధీని పొగుడుతూ అపహాస్యం చేయటమే ఇది. ఇక వినోభా భావే గో రక్షణ గురించి చెప్పారు తప్ప అందుకోసం చావు లేదా చంపు అన్న తీవ్రవాది మాదిరిగా మాట్లాడినట్లు, రాసినట్లు ఇంటర్నెట్‌లో నాకు దొరకలేదు. ఎవరైనా వాటి గురించి శోధించి చెప్పవచ్చు. తమ బుర్రల్లో వున్నవాటిని ఇతరుల పేర్లతో ప్రచారం చేస్తున్న వర్తమానంలో నరేంద్రమోడీ ఒక ప్రధానిగా వుంటూ తననెప్పుడో ఆవు కోసం ప్రాణాలిమ్మని కోరినట్లు చెప్పటం గో రక్షణ పేరుతో చెలరేగుతున్నవారికి రివర్సులో అర్ధమై ప్రాణాలు ఇవ్వటానికి బదులు ప్రాణాలు తీయమని మరింత ప్రోత్సాహమిస్తుంది తప్ప వారిని దాడుల నుంచి, హత్యలు చేయటం నుంచి వెనక్కు మరల్చదు.

నరేంద్రమోడీ చెప్పిన సరికొత్త ఆవు పశ్చాత్తాప కథ మా దొరగారి పొలంలో పండే మిరియాలు తాటి కాయలంతుంటాయి బాబయ్యా అని చెప్పినట్లుగా వుంది. ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెలు(బర్రెలు) కొన్ని సందర్భాలలో వాటి దగ్గరకు వెళ్లిన మనుషులను పొడుస్తాయి, తంతాయి. గాయాలు తీవ్రమైనవి లేదా ఆయువు పట్టులో తగిలితే ఎవరైనా మరణించ వచ్చు. ఆవుకు లేని లక్షణాలను ఆపాదించే వారి కోవలో భాగంగా మోడీ ఈ కథను వినిపించారన్నది స్పష్టం. బహుశా గుజరాత్‌ గోవులకు అంతటి మహత్తర గుణం వుందనుకుందాం. మోడీ చెప్పారు కనుక ‘పక్కా నిజం’ కూడా అయి వుంటుందనుకుందాం. గోధ్రా రైలు ఘటన అనంతరం జరిగిన ముస్లింల వూచకోతలో పాల్గొన్నవారు మోడీ గారి వూరి ఆవు మాదిరి ఆప్తులను కోల్పోయిన వారి ఇళ్ల ముందు తిండి మానుకొని మరణించకపోయినా కనీసం మోడీతో సహా ఒక్కరంటే ఒక్కరు కూడా పశ్చాత్తాపం తెలిపిన వుదంతం మనకు కనపడదు. మెదడు అంతగా ఎదగని, తింటున్నది ప్లాస్టిక్కో కాదో కూడా తెలియని ఆవు పశ్చాత్తాప గుణం మెదడు బాగా ఎదిగిన వారిలో మృగ్యమైంది. సిగ్గు పడాల్సిన విషయం కదా ! ప్రపంచంలో రెండో పెద్ద దేశానికి ప్రధానిగా వున్న ఒక వ్యక్తి ఇలాంటి కాకమ్మ కథలు వినిపిస్తున్నారంటే ప్రపంచంలో మన పరువేంగాను? ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాల నాడే ఎలాంటి పెట్రోలు లేకుండా, పైకీ కిందికీ, వెనక్కు ముందుకు ఎటు కావాలంటే అటు, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే విమానాలను భారతీయులు తయారు చేశారని, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలను మహాభారత కాలంలోనే పుట్టించారని, మనిషికి ఎనుగు తలను అతికించి ఎప్పుడో ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, ఇవన్నీ సంస్కృత గ్రంధాలు,వేదాలలో వున్నాయని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకుంటుంటే విదేశాల్లో భారతీయలు తలెత్తుకోలేకుండా వున్నారు. ఇప్పుడు మోడీ వాటికి మరో ఆవు కథను తోడు చేశారు.

ఒకవైపు నరేంద్రమోడీ ఆవు పశ్చాత్తాప కథలు, గోవు పేరుతో హత్యలను గాంధీ సహించరని చెబుతున్న సమయంలోనే బిజెపి పాలిత రాష్ట్రమైన ఝర్ఖండ్‌లో ఒక ముస్లిం ఒక వాహనంలో నిషేధిత గొడ్డు మాంసాన్ని తరలిస్తున్నాడంటూ ఒక గుంపు దాడి చేసి చచ్చేట్లు కొట్టటమే గాక ఆ వాహనాన్ని కూడా తగుల బెట్టారు. అంతకు ముందు ఒక ముస్లిం ఇంటి ముందు ఆవు తల కనిపించిందంటూ అతడిపై దాడి చేయటమే గాక ఆ ఇంటిని గో గూండాలు తగుల బెట్టారు. ఆవు పేరుతో ముస్లింలు, దళితులను ఏం చేసినా తమనేం చేసే వారుండరనే భరోసా పెరగటమే ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోవటానికి కారణం. గత మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రులతో సహా బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి అనుయాయుల చర్యలకు, నరేంద్రమోడీ సుభాషితాలకు ఎక్కడా పొంతన కుదరటం లేదు.https://thewire.in/152839/modi-cow-violence-gap-words-bjps-deeds/

గత ఏడు సంవత్సరాలలో (2010-17జూన్‌ 25వరకు) దేశంలో జరిగిన పశు సంబంధ హింసాకాండలో 51శాతం ముస్లింలే లక్ష్యంగా జరిగాయని ఇండియా స్పెండ్‌ విశ్లేషణ తెలిపింది. అరవై మూడు సంఘటనలలో28 మంది మరణించగా 124 మంది గాయపడ్డారు, మరణించిన వారిలో ముస్లింలు 86శాతం వున్నారు.ఈ మొత్తం వుదంతాలలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక జరిగినవి 97శాతం వున్నాయి. ఎనిమిది సంవత్సరాలలో 63 జరగ్గా 2014-17లో 61 వున్నాయి, 2016లో 25 జరగ్గా, ఈ ఏడాది ఆరునెలల్లోనే 20 జరిగాయి. అరవై మూడు సంఘటనల్లో 32 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగాయి. యాభై రెండు శాతం దాడులకు పుకార్లే ప్రాతిపదిక. 2016 మొత్తంలో నమోదైన ఘటనల సంఖ్యలో 2017 తొలి ఆరునెలల్లోనే 75శాతం జరిగాయని ఆ విశ్లేషణ తెలిపింది. ఇదంతా గతేడాది ఆగస్టులో నాకు కోపం వస్తోంది, చర్యలు తీసుకోండంటూ గో గూండాలపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత నెలకొన్న పరిస్ధితి ఇది. గో గూండాయిజం ఘటనలు వుత్తర ప్రదేశ్‌లో 10, హర్యానా 9, గుజరాత్‌ 6, కర్ణాటక 6, మధ్య ప్రదేశ్‌, రాజస్ధాన్‌, ఢిల్లీలలో నాలుగేసి చొప్పున జరిగాయి. దక్షిణాది, బెంగాల్‌, ఒడిషాతో సహా ఈశాన్య రాష్ట్రాలలో 13 సంఘటనలు జరిగితే ఒక్క కర్ణాటకలోనే ఆరున్నాయి.63 వుదంతాలలో 32 బిజెపి పాలిత రాష్ట్రాలలో జరగ్గా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎనిమిది, మిగతావి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలలో జరిగాయి.

ఇండియా స్పెండ్‌ విశ్లేషణలోని మిగతా వివరాల ప్రకారం జరిగిన ఘటనలలో 50.8శాతం ముస్లింలు లక్ష్యంగా జరిగితే 7.9శాతం దళితులు, 4.8శాతం సిక్కులు లేదా హిందువులు, 1.6శాతం క్రైస్తవుల లక్ష్యంగా జరిగాయి. 20.6శాతం కేసులలో మతం ఏమిటో పేర్కొనలేదు. మన శిక్షా స్మృతిలో గుంపులు చేసే లించింగ్‌ అంటే చిత్రవధ చేయటం లేదా విచారణ లేకుండా చంపటం, చంపించటం అనే అంశాల ప్రస్తావన లేదు. ఐదుశాతం వుదంతాలలో దాడి చేసిన వారి అరెస్టుల వివరాలు లేవు, 21శాతం కేసులలో దాడులకు పాల్పడిన వారితో పాటు బాధితులపై కూడా కేసులు నమోదు చేశారు. 36శాతం కేసులలో గుంపులుగా పాల్గొన్న వారు భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ లేదా స్ధానిక గోరక్షణ దళాల పేరుతో వున్నవారే వున్నారు.

హింసాకాండ తీరు తెన్నులు ఎలా వున్నాయంటే, 2012 జూన్‌ 10 పంజాబ్‌లోని జోగా పట్టణంలోని ఒక ఫ్యాక్టరీ సమీపంలో 25 ఆవు కళేబరాలు కనిపించాయి. విశ్వహిందూ పరిషత్‌, గోశాల సంఘాల నాయకత్వంలో ఒక గుంపు ఆ ఫ్యాక్టరీలో ప్రవేశించి దానిని ధ్వంసం చేశారు. ఆ ఫ్యాక్టరీని నడుపుతున్నవారిలో ఇద్దరి ఇండ్లను తగుల బెట్టారు, ఈ వుదంతంలో నలుగురు గాయపడ్డారు. గతేడాది ఆగస్టులో గొడ్డు మాంసం తింటున్నారనే పేరుతో హర్యానాలోని మేవాట్‌లో ఒక మహిళ, 14 ఏండ్ల మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టటంతో పాటు ఇద్దరు బంధువులను హత్య చేశారు.

ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ చెప్పిన సుభాషితాలు, కట్టుకథలు, పిట్ట కథలు ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలను తప్పించుకోవటానికి తప్ప నిజంగా దోషులను అదుపు చేసేందుకు కాదన్నది స్పష్టం. ఢిల్లీ నుంచి హర్యానా వెళ్లే రైలులో ముస్లిం కుటుంబంపై దాడి చేసి వారిని రైలు నుంచి తోసివేసిన వున్మాద చర్యలో ఒక యువకుడు మరణించిన వుదంతంపై అనేక చోట్ల ‘నాట్‌ ఇన్‌ మై నేమ్‌ ‘పేరుతో జరిగిన నిరసన ప్రదర్శనలలో అనేక సంస్ధలు, పార్టీలకు చెందిన వారు పాల్గొన్నారు. నిజంగా ఆ వుదంతాన్ని బిజెపి ఖండిస్తున్నట్లయితే వారు కూడా వాటిలో పాల్గొని తమ వైఖరిని వెల్లడించి వుండాల్సింది. కానీ అందుకు భిన్నంగా రైలులో కూర్చునే దగ్గర తలెత్తిన గొడవలో ఆ యువకుడు మరణించాడని బిజెపి చెప్పింది, నిరసనలలో పాల్గొన్నవారంతా నరేంద్రమోడీ వ్యతిరేకులని ఆరోపించింది. రైళ్లలో సీట్ల దగ్గర గొడవలు జరగటం మన దేశంలో సర్వసామాన్యమే. అవి దాడులు, హత్యలు, రైళ్ల నుంచి తోసివేయటానికి దారితీస్తే ప్రతి రోజూ ప్రతి సాధారణ ప్రయాణీకుల రైళ్లలో అలాంటి వుదంతాలు అసంఖ్యాకంగా నమోదయ్యేవి. సమస్య తీవ్రతను, దేశంలో పెంచుతున్న ముస్లిం వ్యతిరేకత తీవ్రతను తగ్గించటానికి ‘సీటు దగ్గర గొడవని’ పోలీసులు, ఇతరులు సృష్టించిన కట్టుకధ తప్ప మరొకటి కాదు. ఢిల్లీ, హర్యానా, వుత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు రైల్వే పోలీసులు కూడా బిజెపి పాలిత అధికార యంత్రాంగం కింద పని చేసే వారే. ఆ దాడికి పాల్పడ్డ నిందితులెవరో, వారిని అరెస్టు చేశారో లేదో ఇంతవరకు బయట పెట్టలేదు. ఇలాటి వుదంతాలను, గొడ్డు మాంసం, గోవుల పేరుతో చేస్తున్న వున్మాద చర్యలను అడ్డుకోకపోతే వారి దాడులు ఒక్క ముస్లింలు, దళితులకు మాత్రమే పరిమితం గావు. ఇస్లామిక్‌ దేశాలలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు సృష్టించి వదిలిన ఇస్లామిక్‌ తాలిబాన్లు అన్ని జీవన రంగాలలోకి, అందరి జీవితాలలో జోక్యం చేసుకొని నియంత్రించేందుకు పూనుకొని యావత్‌ సమాజానికే ముప్పుగా తయారు కావటాన్ని చూస్తున్నాము. మన దేశంలో హిందూత్వ శక్తులు తయారు చేస్తున్న కాషాయతాలిబాన్లు వారి కంటే తీసిపోరు. అందుకే హిట్లర్‌ పాలనా కాలంలో నాజీల చేతులలో జైలు పాలైన ఒక ప్రొటెస్టెంట్‌ మతాధికారి రాసిన కవితను పదే పదే గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక మిన్నకున్నాను

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక పట్టించుకోలేదు

చివరికి వారు నా కోసం వచ్చారు

పట్టించుకొనేందుకు నా వెనుక ఎవరూ మిగల్లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: