• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: November 2017

జర్మనీలో అనిశ్చితిపై ఐరోపాలో ఆందోళన !

30 Thursday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Angela Merkel, European Union, German elections, Germany

Image result for germany political uncertainty

ఎం కోటేశ్వరరావు

జర్మనీ, ఐరోపాయూనియన్‌ అనే ఒక రైలు బండికి ఇంజను వంటిది. గత రెండు నెలలుగా అది ఆగిపోయి ముందుకు కదలటం లేదు. దాన్ని తిరిగి ఎలా నడుపుతారో ప్రస్తుతానికైతే తోచటం లేదు. బండి ప్రయాణించకపోతే జర్మన్లకే కాదు, మొత్తం ఐరోపా ప్రయాణీకులందరికీ ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కొందరు విశ్లేషకులు పేర్కొన్నట్లు జర్మనీ రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎరుగనంత రాజకీయ అనిశ్చితి, సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నది. సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగాయి. ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా పచ్చిమితవాదులు పన్నెండుశాతంపైగా ఓట్లతో మూడవ పెద్ద పార్టీగా పార్లమెంటులో ప్రవేశించారు. క్రిస్మస్‌ నాటికి ఒక కొలిక్కి రానట్లయితే మహాసంఘటన చర్చలు విఫలమైనట్లుగా భావించాలని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ తరువాతే మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుంది. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనుక తన రాజకీయ సంక్షోభాన్ని జర్మనీ ఎలా పరిష్కరించుకుంటుందనేదే ఆసక్తికరం. మొత్తం ఐరోపా పధకాలే గందరగోళంలో పడతాయని బ్రస్సెల్స్‌(ఐరోపా యూనియను ప్రధాన కేంద్రం) భయంకరమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.ఐరోపా యూనియను సముద్రంలో వుంది, దాన్ని ఆదుకొనే పెద్ద స్నేహితుడు మధ్య ఐరోపాలో మనకు లేడు అంటూ ఐరోపా ప్రపంచం అనే పత్రిక ప్రచురణకర్త చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. అమెరికా ట్రంప్‌ తప్పుడు అంతర్జాతీయ విధానాల ఫలితంగా భద్రత మరియు విదేశీ వ్యవహారాలలో ఐరోపా యూనియను కలసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం వుంది, అందుకు గాను ఇంజను వంటి బలమైన జర్మనీ అవసరం అని భావిస్తున్నారు. అలాంటి జర్మనీలో ప్రభుత్వం ఏర్పడుతుందో లేదో తిరిగి ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని స్ధితి ఏర్పడింది. మరోవైపు యూనియన్‌ నుంచి విడిపోయేందుకు 50బిలియన్‌ పౌండ్లు చెల్లించేందుకు సిద్ధపడి బ్రిటన్‌ తనదారి తాను చూసుకుంటున్నది.ఐరోపా అంతటా పచ్చి మితవాద, నయా ఫాసిస్టు, నాజీ శక్తులు తలెత్తటం ఐరోపా యూనియన్‌ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. సహజంగానే ఈ పరిస్ధితి అమెరికన్లకు సంతోషం కలిగిస్తుంది.

తమ విధానాలకు ప్రత్యామ్నాయం లేదని విర్రవీగిన పెట్టుబడిదారీ కావలి బంట్లలో ఏంజెలా మెర్కెల్‌ ఒకరు. వరుసగా మూడు సార్లు ఛాన్సలర్‌గా ప్రభుత్వాలను నడిపిన ఆమెకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఆమె ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు భాగస్వామిగా చేరిన సోషలిస్టులం అనిచెప్పుకొనే సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి వెన్నుదన్నుగా వుండే కార్మికులు ఈ ఎన్నికలలో దూరం, కావటం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతి తక్కువ ఓట్లు తెచ్చుకోవటం శరాఘాతం వంటిది. మెర్కెల్‌తో జతకడితే రానున్న రోజుల్లో వున్న ఓట్లుకూడా పోతాయోమోననే భయం ఆ పార్టీని వెన్నాడుతున్నది. అయితే తాజా వార్తలను బట్టి వారు సంకీర్ణ సంప్రదింపులకు తలుపులను పూర్తిగా మూసివేయలేదు. అదే సమయంలో 20శాతం బలంతో వందశాతం డిమాండ్లు పెడితే అంగీకరించేది లేని మెర్కెల్‌ శిబిరం హెచ్చరికలు జారీ చేసింది. ఈ పూర్వరంగంలో ఎవరు ఎంత మేరకు రాజీపడినప్పటికీ కార్మికవర్గానికి జరిగే మేలు ఏమిటన్నది అసలు సమస్య.

ఆల్‌ ఈజ్‌ వెల్‌(అంతా మంచిగా వుంది) అనుకుంటున్న జర్మనీలో ఎన్నికలు అధికార కూటమిని అనూహ్యకుదుపునకు గురిచేశాయి.నిజానికి జర్మనీలో ఒక విధంగా చెప్పాలంటే ఒక్క వామపక్షపార్టీ తప్ప మిగిలినవన్నీ అవి తెచ్చుకొనే సీట్లను బట్టి, అక్కడి పాలకవర్గ వాంఛలను బట్టి అధికార-ప్రతిపక్ష పాత్రలను పోషిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో 2013లో రెండు పెద్ద పార్టీలైన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌(సిడియు), దానితో కలసి వుండే క్రిస్టియన్‌ సోషలిస్టు యూనియన్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా ఎన్నికలలో రెండు పార్టీలకు దిమ్మదిరిగే విధంగా గతంలో ఎన్నడూరానన్ని తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌లోని 709 స్థానాలకు గాను మెజారిటీ 355కాగా ఈ మూడు పార్టీలకు 399 వచ్చినప్పటికీ తాము ప్రతిపక్షంలో వుంటామని 143 సీట్లు తెచ్చుకున్న ఎస్‌డిపి ప్రకటించటం జర్మనీలో రాజకీయ అనిశ్చితికి దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పార్లమెంట్‌కు 18సార్లు ఎన్నికలు జరిగాయి.ఇరవై అయిదు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటిలో అత్యధికం సిడియు, దాని మిత్రపక్ష ప్రభుత్వాలు. ఎస్‌పిడి దాని మిత్రపక్షాలతో కలసి అధికారానికి వచ్చింది. ఈ రెండు పార్టీలు కలసి ఐదుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర వుంది.

ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీతో కలసి మరోసారి అధికారాన్ని పంచుకొనేందుకు తొలి స్పందనగా ససేమిరా అని పేర్కొన్నది. ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం పదవ సంవత్సరంలోకి ప్రవేశించనుంది. దాని దెబ్బకు ఐరోపాలోని మితవాద పార్టీలతో పాటు సోషలిస్టులుగా వున్నవారు కూడా ఎన్నికలలో చావు దెబ్బలు తింటున్నారు. ఒకసారి అధికారానికి వచ్చిన వారు మరోసారి మట్టికరుస్తున్నారు.జర్మనీలో మితవాద సిడియు, వామపక్షంగా చెప్పుకొనే ఎస్‌డియు రెండూ గత నాలుగు సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా రెండుపార్టీల ఓట్లు, సీట్లు పడిపోయాయి.1998లో గరిష్టంగా 40.9శాతం ఓట్లు తెచ్చుకున్న ఎస్‌పిడి తరువాత అధికారానికి వచ్చి ఇప్పుడు 20.5శాతానికి పడిపోయింది. అందువలన మరోసారి సిడియుతో జతకట్టవద్దని ఆ పార్టీలో పైనుంచి కింది వరకు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఐరోపాలోని మిగతా ధనిక దేశాలతో పోల్చితే జర్మనీ ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగ్గా వున్నప్పటికీ సాంఘిక సంక్షేమ పధకాలకు కోతపెట్టటంలో రెండుపార్టీలు ఏకాభిప్రాయంతో వ్యవహరించాయి. ఈ అసంతృప్తి కార్మికవర్గంలో వుంది. అందుకే వెంటనే తాము ప్రతిపక్షంలో వుంటామని చెప్పింది. అయితే అది కూడా ఒక బూర్జువాపార్టీయే గనుక కార్పొరేట్‌ శక్తుల వత్తిళ్లకు లంగి సంకీర్ణం గురించి చర్చించేందుకు సిద్ధం అంటున్నది.తొలిసారిగా ముస్లిం, వలసకార్మికుల వ్యతిరేక నినాదాలతో ఎన్నికలలో పోటీచేసి మూడవ పెద్ద పార్టీగా ఆవిర్భవించిన జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని బూచిగా చూపి మరోసారి మెర్కెల్‌తో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోలేదు.

పార్లమెంట్‌లోని 709 స్ధానాలకు గాను 299 సీట్లకు ప్రత్యక్ష పద్దతిలో 410 సీట్లకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. వివిధ పార్టీలు దిగువ విధంగా సీట్లు సంపాదించాయి.(బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికలలో సాధించిన సీట్లు) క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(సిడియు),క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సిఎస్‌యు) 246(311), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) 153(193), జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎడి) 94(కొత్త పార్టీ), ఫ్రీ డెమోక్రటిక్‌ పార్టీ 80(0), వామపక్ష పార్టీ 69(64), గ్రీన్‌ పార్టీ 67(63). మిగతా ఐరోపా దేశాలలో మాదిరే జర్మనీలో కూడా ఈ ఎన్నికలలో తొలిసారిగా పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నా పార్టీ మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష,గ్రీన్‌ పార్టీలు గతం కంటే కొద్దిగా సీట్లు పెంచుకున్నా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవటంలో విఫలమయ్యాయి.

మెర్కెల్‌ నాయకత్వంలోని సిడియుతో జతకట్టేందుకు ఎస్‌డిపి తిరస్కరించటంతో ఒక సంక్లిష్ట పరిస్ధితి ఏర్పడింది. ఎస్‌పిడి,వామపక్ష,గ్రీన్‌ పార్టీలతో కూటమి ఏర్పడినా మెజారిటీ సాధించే అవకాశం లేదు. సిడియు పరిస్ధితి కూడా అంతే పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని, ఫ్రీడెమోక్రటిక్‌ పార్టీని కలుపుకుంటే తప్ప మెజారిటీ సాధించే పరిస్ధితి లేదు.ఆ మూడు కలిసే అవకాశం లేదు. అయితే జర్మనీ పాలకవర్గం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీల మీద వత్తిడి చేస్తోంది. మరోసారి ఎన్నికలు జరిపినా పరిస్ధితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేకపోగా సిడియు పరిస్ధితి మరింత దిగజారినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్ధితుల్లో ఏకైక పెద్ద పార్టీగా సిడియు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మినహా మరొక మార్గం లేదు. అందుకు సిద్దపడటం కంటే తిరిగి ప్రజాతీర్పు కోరటం మేలనే వైఖరితో మెర్కెల్‌ వున్నారు. అయితే అందుకు ఆ పార్టీనాయకత్వం అంగీకరిస్తుందా, లేక ఆమెను పక్కకు నెట్టి కొత్తనేతతో సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది వచ్చే ఏడాది జనవరిలో గానీ స్పష్టం అయ్యే అవకాశం లేదు.ఎస్‌డిపితో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సుమఖత తెలియచేస్తూ సిడియు తీర్మానించింది. మరోవైపు ఎస్‌డిపి యువజన విభాగం కూడా ఒక తీర్మానం చేసి మహా సంఘటన ఏర్పాటుకు ప్రయత్నించటం కంటే ప్రతిపక్షంలోని పార్టీలతో సంకీర్ణానికి ప్రయత్నించాలని తీర్మానించి పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చింది.

దేశ జనాభాలో గణనీయ భాగం 2000 సంవత్సరంలో సంపాదించిన ఆదాయ మొత్తంలో సగం కూడా ఇప్పుడు పొందటం లేదని విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఇటువంటి స్ధితిలో వామపక్షాలు ప్రత్యామ్నాయంగా లేకపోతే జనం పచ్చిమితవాద, నయా ఫాసిస్టు శక్తులవైపు మొగ్గుతారని జర్మనీతో సహా అన్ని ఐరోపా దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. ఇవి వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలకు కూడా మేలుకొలుపు వంటివే. పెట్టుబడిదారీ వ్యవస్ధ జరుపుతున్నదాడులు, నయావుదారవాద విధానాలను నిఖరంగ ఎదిరించే మొనగాళ్లుగా వామపక్షాలు జనానికి కనిపించకపోతే మితవాదులే మెరుగని జనం భావిస్తారు. తాజా ఎన్నికలలో పూర్వపు పశ్చిమ జర్మనీ ప్రాంతంలో వామపక్ష పార్టీ కొంత మేరకు ఓట్లు పెంచుకుందిగానీ, తూర్పు జర్మనీలో ఆరుశాతం కోల్పోయింది, ఆ ఓట్లు ఎడి పార్టీకి పడ్డాయి. స్వల్పంగా ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ మిగతాపార్టీలకంటే తాము భిన్నం అనే గుర్తింపును జనంలో తెచ్చుకోలేకపోయింది. కొన్ని రాష్ట్రాలలో సమతూక బడ్జెట్‌ పేరుతో కోతలకు, రోడ్ల ప్రయివేటీకరణకు అంగీకరించటం వంటి చర్యలు అందుకు నిదర్శనం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ముగాబే అనంతర జింబాబ్వే పయనమెటు ?

29 Wednesday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

crocodile, Emmerson Mnangagwa, robert mugabe, Zimbabwe

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర జింబాబ్వేలో 37 సంవత్సరాల పాటు తిరుగులేని నేతగా వెలిగిపోయిన రాబర్టు ముగాబే(93) రాజీనామాతో అక్కడ మరో అధ్యాయం మొదలైంది. వుపాధ్యక్షుడిగా వుద్వాసనకు గురైన మాజీ గెరిల్లా నేత ఎమర్సన్‌ మంగాగ్వా(75) నవరబరు 24న దేశాధ్యక్షపదవిని చేపట్టారు. ముగాబే అనంతరం జింబాబ్వే పరిణామాలు ఎలా వుంటాయోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిగిలిపోయిన వలసలు, శ్వేతజాతి మైనారిటీ పాలకుల చేతిలో మగ్గిపోయిన దేశాలలో జింబాబ్వే ఒకటి. జాతీయవాదులుగా, తరువాత మార్క్సిస్టులుగా మారి దేశ విముక్తి కోసం ఆయుధాలు పట్టిన సంస్ధలకు నాయకత్వం వహించిన ముగాబే, మంగాగ్వా వంటి వారు అధికారంలోకి వచ్చిన తరువాత చీలికలు పేలికలై అధికార కుమ్ములాటలలో నిమగ్నం కావటం ఏమిటనే ప్రశ్నలు కొంత మందిలో తలెత్తుతున్నాయి. సుదీర్ఘరాజకీయ, అధికారిక బాధ్యతల్లో వున్న ముగాబే ఏ జనం చేత జేజేలు కొట్టించుకున్నారో వారి చేతే అధికారపు చివరి రోజుల్లో ఛీ ఛీ అనిపించుకోవటం నిజంగా ఒక విషాదమే. ఒక జాతీయవాది, ఒక మార్క్సిస్టు ఇలా దిగజారిపోతే మిగతా నేతలకు వీరికి తేడా ఏమిటి, ఎవరిని చూసి స్ఫూర్తి పొందాలి అనే నిర్వేదం కొంత మందిలో కలగటం సహజం.1924 ఫిబ్రవరి 21న ఒక కార్పెంటర్‌ కుటుంబంలో జన్మించిన ముగాబే విద్యాభాస అనంతరం ఒక టీచర్‌గా 1945లో జీవితం ప్రారంభించారు. టీచర్‌గా వుండగానే దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ హరే విశ్వవిద్యాలయంలో బిఏ చదివేందుకు స్కాలర్‌షిప్పు రావటంతో 1949 నుంచి 52వరకు అక్కడ వున్నారు. ఆ క్రమంలోనే ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుపార్టీలతో సంబంధాలు ఏర్పడ్డాయి. తిరిగి స్వదేశం చేరుకొని టీచర్‌ వృత్తిలో చేరారు.1960దశకం ప్రారంభంలో జాతీయోద్యమంలో భాగస్వామి అయ్యారు.1980లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రధానిగా, తరువాత అధ్యక్షుడిగా 37 సంవత్సరాలు పదవిలో వున్నారు.

ఆఫ్రికా ఖండంలో వలసపాలకులకు వ్యతిరేకంగా సాగిన వుద్యమాలలో జాతీయవాదులు,కమ్యూనిస్టులు కలసి పోరాడటం ఒక ప్రత్యేక పరిణామంగా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుపార్టీ, కొసాటు(కార్మిక సంఘాల సమాఖ్య) శ్వేతజాతి దురహంకార పాలనకు వ్యతిరేకంగా జరిపిన సమిష్టి పోరాటం ఆ ప్రాంత దేశాల జాతీయోద్యమాలను ఎంతగానో ప్రభావితం చేసింది. 1990దశకం ముందు వరకు( సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేయనంత వరకు) ఒక మార్క్సిస్టు-లెనినిస్టుగా వర్ణించుకున్న ముగాబే తరువాత ఒక సోషలిస్టును అని, తాను అనుసరించే విధానాలను ముగాబేయిజంగా చెప్పుకున్నాడు.పదవి నుంచి దిగిపోయే నాటికి ఒక ప్రజావ్యతిరేకిగా తేలాడు.

ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో అనేక మంది నేతలు ఇలా మారిపోవటం, చరిత్ర చెత్తబుట్టలోకి జారిపోవటం కనిపిస్తుంది. ఈ పరిణామాలను జీర్ణించుకోవటం కాస్త కష్టమే, ఆయా దేశాలలో పురోగామి శక్తులకు నష్టం జరిగినప్పటికీ ఎత్తిన జండా దించని అభ్యుదయగాములు ఎందరో వున్నారు. పరిస్ధితులకు అనుగుణ్యంగా వుద్యమాలు నివురు కప్పిన నిప్పులా వున్నాయి. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో తలెత్తిన మితవాద, అతివాద ధోరణులతో పాటు జాతీయవాద నాయకత్వాలపై నయా వుదారవాద ధోరణుల ప్రభావం వంటి అనేక అంశాలు ముగాబే వంటి వారు దిగజారిపోవటానికి కారణమయ్యాయి. ఏ కారణం, ఎక్కడ ఎంత ప్రభావం చూపిందనేది ఆయా దేశాల నిర్ధిష్ట పరిస్ధితులు, ధోరణులను కూలంకషంగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేము. వుదాహరణకు దక్షిణాఫ్రికా అధికార కూటమిలోని ఎఎన్‌సి, కమ్యూనిస్టుపార్టీ, కార్మిక సంఘాల సమాఖ్యలకు చెందిన వారు ఎఎన్‌సి అభ్యర్ధులుగానే పార్లమెంట్‌కు ఎన్నికవుతున్నారు. జాతీయోద్యమంలో కలసి పని చేసిన శక్తులు స్వాతంత్య్రం రాగానే ఎవరిదుకాణాన్ని వారు ఏర్పాటు చేసుకోవటం చూశాము. కానీ దక్షిణాఫ్రికాలో గత 23 సంవత్సరాలలో జరిగిన ఐదు ఎన్నికలలో కూటమి ఐక్యంగా వుండటం ఒక విశేషం. అయితే అదే దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన సంస్ధలకు కమ్యూనిస్టులు, కాని వారు కూడా నాయకత్వం వహించారు. కమ్యూనిస్టులుగా ముద్రపడిన వారు అనేక మంది అక్కడ కమ్యూనిస్టులతో విబేధించటం చూస్తున్నాము.నెల్సన్‌ మండేలా తరువాత అధ్యక్షుడిగా ఎన్నికైన తాబో ఎంబెకీ, తరువాత ప్రస్తుత అధ్యక్షుడు జాకబ్‌ జుమా కూడా కమ్యూనిస్టులుగా వున్నవారే. కానీ వారిద్దరూ కమ్యూనిస్టు పాలకుల మాదిరి వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం జాకబ్‌ జుమా-కమ్యూనిస్టుపార్టీ మధ్య తీవ్ర విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు పార్టీ మంత్రి ఒకరిని మంత్రి వర్గం నుంచి తొలగించారు. జుమాను తొలగించాలని కమ్యూనిస్టుపార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఇదే సమయంలో ఎవరు అధ్యక్షులుగా వున్నప్పటికీ దక్షిణాఫ్రికా పాలక కూటమి మొత్తంగా నయా వుదారవాద విధానాల ప్రభావంలోకి పోయిందనే విమర్శలు కూడా లేకపోలేదు. దక్షిణాఫ్రికా ఎఎన్‌సి నుంచి స్ఫూర్తి పొంది రంగంలోకి వచ్చిన జింబాబ్వే నాయకత్వంలో అలాంటి ఐక్యత కానరాదు, ముగాబేతో విబేధించిన వారిని రాజకీయంగా, ఇతరంగా కూడా అణచివేశారనే విమర్శలు లేకపోలేదు. వీటికితోడు నయావుదారవాద విధానాలతో పూర్తిగా దేశాన్ని సర్వనాశనం చేశారనే విమర్శలు వచ్చాయి.

జింబాబ్వే తాజా పరిణామాలలో చైనా పాత్ర గురించి కొంత మంది కమ్యూనిస్టులుగా చెప్పుకొనే వారు(నక్సల్స్‌) తప్పుడు ప్రచారానికి దిగారు. గతంలో అలాంటి బాపతే సోవియట్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదిగా వర్ణించిన విషయాన్ని మరచిపోరాదు. జింబాబ్వే విముక్తి పోరాటంలో పాల్గన్న శక్తులు, సంస్ధలకు నాటి సోవియట్‌ యూనియన్‌, చైనా కూడా ఆయుధాలతో సహా అన్ని రకాల సాయం అందించాయి. 1960దశకంలో ముగాబే నాయకత్వంలోని శక్తులు చైనా సాయం తీసుకున్నాయి, అక్కడ శిక్షణ కూడా పొందాయి. అలాంటి వారిలో ప్రస్తుత అధ్యక్షుడు మంగాగ్వా ఒకరు.రొడీషియాగా పిలిచిన జింబాబ్వేలో శ్వేత జాతి దురహంకారపాలనను శాశ్వతం కావించేందుకు, అక్కడున్న తమ పెట్టుబడులను కాపాడుకొనేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం 1965లో ఏకపక్షంగా స్వాతంత్య్రం ప్రకటించింది. అప్పటి వరకు అక్కడ పోరాడుతున్న శక్తులకు సోవియట్‌ సాయం అందించింది. స్వాతంత్య్రప్రకటన అనంతరం పోరాట సంస్ధలలో తలెత్తిన నూతన ఆలోచనల్లో భాగంగా గెరిల్లా పోరాటం జరిపేందుకు చైనా సాయం కోరాలని కొందరు నిర్ణయించుకొని ఆమేరకు మద్దతుతీసుకున్నారు. అందువలన ఇటీవలి కాలంలో చైనా కంపెనీలు పెట్టిన పెట్టుబడులను రక్షించుకొనేందుకు ముగాబేకు వ్యతిరేకంగా సమీకృతమైన శక్తులకు చైనా మద్దతు ఇచ్చిందని, సైనిక జనరల్‌ చైనా పర్యటన జరిపిన తరువాత సైన్యం జోక్యం చేసుకున్నదని ప్రచారం చేస్తున్నారు. సైనికజనరల్‌ నవంబరు 8,9 తేదీలలో చైనా పర్యటించారు. ఏడవ తేదీన మంగాగ్వాను ముగాబే పదవీచ్యుతుని కావించారు. అంటే జనరల్‌ చైనా ప్రయాణంలో వుండగా అది జరిగింది. అందకు కొద్ది నెలల ముందే మంగాగ్వాకు మద్దతు ఇచ్చే వారిగా అనుమానిస్తున్న జనరల్‌ చివెంగాతో సహా అనేక మంది సైన్యాధికారులకు వుద్వాసన పలికేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనంతటికీ కారణం ముగాబే భార్య గ్రేస్‌ను వుపాధ్యక్షరాలుగా నియమించేందుకు పూనుకోవటం, ఆచర్యను వ్యతిరేకించే రాజకీయ, మిలిటరీ అధికారులకు వుద్వాసన పలకటం అనే ప్రమాదకర ఆలోచనలోకి ముగాబే వెళ్లినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తన స్ధానంలో తన భార్యను గద్దెనెక్కించేందుకు పూనుకోవటం, విబేధించిన వారిపై చర్యలకు పూనుకోవటమే తాజా పరిణామాలకు మూలంగా కనిపిస్తోంది.Image result for mnangagwa swearing

సైన్యాధికారులకు చైనా కంపెనీలలో వాటాలు వున్నట్లు వూహాగానాలు తప్ప నిర్ధారణగా ఎలాంటి ఆధారాలు ఇంతవరకు బయటకురాలేదు. విదేశీ కంపెనీలలో స్వదేశీ సంస్ధలకు వాటాల గురించి ముగాబే సర్కార్‌ తీసుకున్న విధానానికి అనుగుణంగా ఎవరైనా బినామీలుగా కంపెనీలలో వాటాలు కలిగి వుండటాన్ని కాదనలేము. కానీ ముగాబే వుద్వాసనకు అదే అసలైన కారణాలని చెప్పలేము. ఎందుకంటే చైనా పెట్టుబడులకు ముగాబే వ్యతిరేకమేమీ కాదు. ఆ మాటకు వస్తే తన మార్కెట్‌ను, రాజకీయ సంబంధాలను పెంచుకొనే క్రమంలో ఇటీవలి సంవత్సరాలలో చైనా ఆఫ్రికాపై దృష్టి సారించింది. అమెరికా, ఐరోపాలతో తన వాణిజ్య మిగులను అక్కడ పెట్టుబడులుగా అందచేస్తోంది. అదేమీ రహస్యం కాదు. చైనాను రాజకీయంగా వంటరిపాటు చేసేందుకు అమెరికా తన మిలిటరీ, రాజకీయ, ఆర్ధిక శక్తులను వుపయోగించి ప్రపంచ దేశాలను ప్రభావితం చేయటం నిరంతరం కొనసాగిస్తుండగా దానికి వ్యతిరేకంగా, తనను తాను కాపాడుకొనేందుకు తన వ్యూహాన్ని చైనా అమలు జరుపుతున్నది. ఒకే దేశం-రెండు వ్యవస్ధలు అనే విధానం కింద హాంకాంగ్‌, మకావో దీవులలో వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను, కంపెనీలను 2050 వరకు కదలించేది లేదని వాటి విలీనం సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ హామీ ఇచ్చింది. అందువలన జింబాబ్వేలో లేదా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టే చైనా కంపెనీలన్నీ చైనా ప్రధాన భూభాగానికి చెందినవే కానవసరం లేదు.

దేశియం పేరుతో ముగాబే సర్కార్‌ ఆమోదించిన విధానాల ప్రకారం విదేశీ కంపెనీలు తమ వాటాను 49శాతానికి పరిమితం చేసి 51శాతం జింబాబ్వియన్లకు కేటాయించాలి.ఈ విధానాన్ని స్వదేశీ బూర్జువాశక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని దేశాన్ని గుల్లచేశారు. తాను సామ్రాజ్యవాదానికి,పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం అని ముగాబే చెప్పుకున్నప్పటికీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరించారు.1991 నుంచి నయావుదారవాద విధానాలను అమలులోకి తెచ్చారు. నూతన అధ్యక్షుడు మంగాగ్వా రాజీనామా చేసిన ముగాబేతో విధానాలపరంగా విబేధించినట్లు కనపడదు. తమ, తమ మద్దతుదార్ల గురించి తలెత్తిన సమస్యలతో వచ్చిన కుమ్ములాటలుగానే వున్నాయి. ఇంతవరకు మంగాగ్వా తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దానికంటే దేశాన్ని దివాలా తీయించిన విధానాల మార్పు గురించి ఇంతవరకు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రేటింగ్స్‌ మోజులో మోడీ ఆశాభంగం ?

26 Sunday Nov 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

india ratings, moody’s india ratings, Narendra Modi, rating fancy, s&p india rating

ఎం కోటేశ్వరరావు

అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఒక్కొక్కటీ ఎదురుతన్నుతుండటంతో గతంలో మాదిరి రొమ్ము విరుచుకొనే పరిస్థితులు లేవు. ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు అన్నట్లుగా రేటింగ్స్‌ మోజు నరేంద్రమోడీ పైకి చెప్పుకోలేని చోట మరో దెబ్బతగిలేట్లు చేసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. పద్నాలుగు సంవత్సరాలుగా రేటింగ్‌తో నిమిత్తం లేకుండా తెచ్చుకుంటున్న అప్పులు, వస్తున్నాయని చెబుతున్న పెట్టుబడులతో ముందుకు పోకుండా అత్యాశకు పోనేల, ఇలా ఇబ్బందులను కొని తెచ్చుకోవటం ఎందుకు అని మోడీ మంత్రాంగం, యంత్రాంగం ఇప్పుడు తలలు పట్టుకోవటం గురించి చెప్పనవసరం లేదు. మూడు వన్‌డే మాచ్‌ల సీరీస్‌లో ఒకటి అటు ఇటు అయితే మూడవది ఇరు జట్లపై ఎంతో వత్తిడి, అభిమానులలో వుత్కంఠను పెంచినట్లుగా ఇప్పుడు అగ్రశ్రేణి రేటింగ్‌ కంపెనీలో మూడవదైన ‘ఫిచ్‌’ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కారణాలు పైకి ఏం చెప్పినా మూడీస్‌ మన సార్వభౌమ రేటింగ్‌ను చెత్తకు దగ్గరగా వున్న స్ధానాన్ని ఒక మెట్టు పైకి పెంచింది. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌(ఎస్‌ అండ్‌ పి) మాత్రం గతంలో ఏ స్ధానంలో వుంచిందో దానిని మార్చాల్సినంత సీనేమీ లేదని శుక్రవారం నాడు స్పష్టం చేసింది.ఈ రెండు కంపెనీలు అమెరికావి, మూడవది బ్రిటన్‌ది.

సులభతర వాణిజ్య ర్యాంకును 130 నుంచి 100కు ప్రపంచబ్యాంకు పెంచింది. అలాగే అమెరికాకు చెందిన పూ పరిశోధనా సంస్ధ ఫిబ్రవరిలో చేసిన సర్వే ఫలితాలను నవంబరులో విడుదల చేసి నరేంద్రమోడీకి ఆదరణేమీ తగ్గలేదని, తిరుగులేని నేతని చెప్పింది.విశ్వసనీయ ప్రభుత్వంగా ప్రపంచంలో మోడీ సర్కార్‌ మూడో దేశంగా వుందని 2016లో చేసిన సర్వేలో ఓయిసిడి మరో రాంకు ఇచ్చింది. మూడీస్‌ సంస్ధ చెత్త పక్కన వున్న రాంకును కాస్త ఎగువకు జరిపింది. వాటిని మోడీ భజంత్రీలు ఆయన ఖాతాలో వేసి వీరుడు, శూరుడు అని పొగుడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలను కలిగి వున్న దేశాలు తీవ్ర సంక్షోభం, వాటి పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశానికి ఆ సంక్షోభ సెగ తగలటం ప్రారంభమయ్యే సమయంలో నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి మాజిక్‌ చేస్తానని జనాన్ని నమ్మించి సీట్ల రీత్యా తిరుగులేని మెజారిటీ సాధించారు. అలాంటి స్ధితిలో ఎస్‌ అండ్‌ పి వున్న ర్యాంకును కొనసాగించటం తప్ప పెంచే అవకాశం లేదని చెప్పి గాలితీసిందంటే అది దేశద్రోహం అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు.

ఇప్పుడున్న స్ధితిలో ఎవరెన్ని ర్యాంకులు ఇచ్చినా, తెచ్చుకున్నా, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఇంకా మరికొన్నింటిని జనం ముందు ప్రదర్శించినా స్ధాయి పెంచిన మూడీస్‌గానీ, యథాతధంగా వుంచిన ఎస్‌ అండ్‌పి గానీ లేవనెత్తున్న అంశాలేమిటి? మోడీ భక్తులు దాని గురించి మాట్లాడటం లేదెందుని? దేశంలో నేడున్న పరిస్ధితులలో అనేక కారణాల రీత్యా ప్రజాకర్షణలో నరేంద్రమోడీ మిగతా పార్టీల నేతల కంటే ఎంతో ముందున్న మాట నిజం. చరిత్రలో అనేక మంది నేతలు ఇలాగే ప్రజాకర్షణలో తారాజువ్వల మాదిరి దూసుకుపోయి అంతే వేగంతో పడిపోయిన వారు కూడా లేకపోలేదు. గత మూడున్నర సంవత్సరాలుగా ఇంతగా జనం విశ్వసిస్తున్న దేశ ప్రధానిని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్ధలు ఎందుకు నమ్మటం లేదు అని మోడీ భక్తులు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సంస్ధలకు చట్టబద్దత లేకపోయినా, లొసుగులున్నా, ఎవరు అవునన్నా కాదన్నా ఏ దేశానికైనా రుణం ఇవ్వాలన్నా,పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంస్ధల సిఫార్సులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందుకే కదా నరేంద్రమోడీ సర్కార్‌ తమ రేటింగ్‌ పెంచమని పైరవీలు కూడా జరిపింది. మరోవైపు అందని ద్రాక్ష పండ్లు పుల్లన అన్నట్లు ఫోజు పెడుతున్నారు.

మీ గురించి కావాలంటే ఎన్ని మెచ్చుకోలు మాటలైనా చెబుతాం గాని ఆ ఒక్కటీ అడగవద్దు అన్నట్లుగా రేటింగ్‌ సంస్ధలు మన దేశం పట్ల వ్యవహరిస్తున్నాయి. గత 14 సంవత్సరాలుగా రేటింగ్‌ను పెంచకపోయినా మేం అప్పులు తెచ్చుకోగలిగాం, అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, గతం కంటే ఇప్పుడు మా రుణభార శాతం తక్కువగా వుంది. మాకంటే ఎక్కువ రుణభారం వారికి మెరుగైన రేటింగ్‌ ఇచ్చారు, అలాంటపుడు మా రేటింగ్‌ ఎందుకు పెంచరు అని నరేంద్రమోడీ సర్కార్‌ గతేడాది మూడీస్‌ సంస్ధను నిలదీసింది. దీనిలో పాక్షిక సత్యం లేకపోలేదు.1991 నుంచి 2016 వరకు మన దేశ జిడిపి-రుణ నిష్పత్తి సగటున 73.42 శాతం వుంది. అంటే మన ఆదాయం 100 అయితే 73.42 అప్పు తీసుకుంటున్నాం. గతేడాది 2016లో ఇది 69.50 శాతం, గత పాతిక సంవత్సరాలలో కనిష్టంగా 1996లో 66, గరిష్టంగా 2003లో 84.20 శాతం నమోదైంది. రెండవ ఘనత బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయికి దక్కింది. ఆయన పాలనలోనే రుణభారం విపరీతంగా పెరిగింది. అంతకు ముందున్న కనిష్ట స్ధాయికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ హయాంలో అంతకు ముందున్నదాని కంటే ఒక శాతం పెరిగింది. రేటింగ్‌ లేకపోయినా అప్పులు తెచ్చుకుంటున్నాం అంటున్నారు. అది కూడా తిరుగులేని సత్యమే. ముందు అప్పు ఇవ్వండి వడ్డీ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోండి అంటున్నాం. ముందే చెప్పినట్లు మన అప్పు నూటికి నూరుశాతం స్ధాయికి పెరగలేదు.మిగతా దేశాలకు ఇస్తే వడ్డీ కంటే రెట్టింపునకు పైగా భారత్‌లో వస్తోంది. అందువలన రేటింగ్‌ను పక్కన పెట్టి ఇచ్చినా ఫరవాలేదు, కొంత వడ్డీ పోయినా ఇబ్బంది లేదు అని విదేశీ సంస్ధలు అనుకుంటున్నాయి. రోజువారీ అధిక వడ్డీలకు ఇచ్చే వారు తీసుకొనే వాడి జుట్టు చేతిలో పెట్టుకుంటున్నట్లే అలాంటి రుణాలకు మనం తప్పించుకోలేని షరతులను రుద్దుతాయి.https://tradingeconomics.com/india/government-bond-yield మన దేశం తీసుకొనే రుణాలకు చెల్లించే వడ్డీ (దాన్నే బాండ్‌ రేటు అంటున్నారు) పది సంవత్సరాల బాండ్‌కు దాదాపు 7 శాతం కాగా అదే చైనా 4.04, అమెరికా 2.33, బ్రిటన్‌ 1.25,ఫ్రాన్సు 0.68, జపాన్‌ 0.03 వుండగా మన కంటే ఎక్కువ వడ్డీలు చెల్లించి రుణాలు పొందే దేశాలు బ్రెజిల్‌ 10.09, మెక్సికో 7.26 వున్నాయి. అందువలన అప్పు తీసుకోవటం గొప్ప కాదు, దానిని ఎలా తీరుస్తామనేదే సమస్య.ష్https://thelogicalindian.com/story-feed/opinion/indias-debt-trap-25-of-the-budget-is-spent-on-paying-of-debts/ మనం తీసుకొనే అప్పులకు బడ్జెట్‌లో 25శాతం మొత్తం చెల్లిస్తున్నాము, అదే అమెరికా కేవలం ఆరుశాతమే. మన పాలకులు అప్పులు తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పేది ఒట్టిమాట, పాత అప్పులు, వాటి వడ్డీలు కట్టేందుకే మనం కొత్త అప్పులు తీసుకుంటున్నాం.

రేటింగ్‌ సంస్ధలు దీని గురించే పట్టుబడుతున్నాయి. అనధికారికంగా అధిక వడ్డీలకు ఆశపడి ఎవరైనా అప్పులు ఇచ్చి రిస్కుతీసుకుంటే అది వారి సమస్య, తమ రేటింగ్‌ను బట్టి అప్పు ఇచ్చేవారిని నట్టేట ముంచేందుకు సిద్ధంగా లేమంటున్నాయి ఆ సంస్ధలు. ఎందుకంటే అన్ని దేశాల పరిస్ధితులను అధ్యయనం చేసి తగు సలహాలనిచ్చేందుకు ఆ సంస్ధలు పెద్ద మొత్తంలో మదుపుదార్లనుంచి ఫీజులు వసూలు చేస్తాయి. మన దేశ తలసరి ఆదాయం కనిష్ట స్ధాయిలో వుండటం, రుణభారం పెరుగుతుండటం మదుపుదార్లకు ఆందోళన కలిగించే అంశమే. మూడు సంవత్సరాలలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మోడీ చేసుకుంటున్నది ప్రచారం తప్ప వాస్తవం కాదని చెప్పటమే గత రేటింగ్‌ను యథాతధంగా వుంచటానికి అర్ధం. అంటే మోడీ అభివృద్ధి, సంస్కరణల గాలితీసినట్లే.

గతేడాది చేసిన నోట్ల రద్దు ద్వారా సాధించిన ఫలితాలేమిటో ఏడాది పూర్తయిన సందర్భంగా అయినా మోడీ నోరు విప్పుతారేమోనని ఆశించిన దేశభక్తులను నిరాశపరిచారు. జిఎస్‌టి గురించి ఎలాంటి కసరత్తు, పర్యవసానాల గురించి ఆలోచించకుండా బలవంతంగా అమలు జరపటంతో జరిగిందేమిటో చూస్తున్నాం. ఒక పన్ను పద్దతిని రద్దు చేసి మరొక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టటం అంటే తెల్లచొక్కా తీసి వేసి కాషాయ చొక్కా తొడుక్కున్నంత సులభం అన్నట్లుగా చెప్పిన కబుర్లు ఏమయ్యాయి. గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు, గుజరాత్‌ వ్యాపారులు తీవ్ర నిరసనల కారణంగా జిఎస్‌టిలో మార్పులు చేశారని అందరూ ఎరిగిందే. ఆ పని పూర్తయిన తరువాత తిరిగి రేట్లు పెంచరన్న హామీ ఏముంది. భారత్‌లో పన్ను ఆదాయం తక్కువగా వుందని, దాన్ని పెంచకుండా, తగినంత ఆదాయం లేకుండా అప్పులు ఎలా తీరుస్తారని గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ మన ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. అందువలన నరేంద్రమోడీ మరింతగా మూసుకోవటం తప్ప నోరు తెరిచే అవకాశం లేదు. నిజానికి మోడీకి వాస్తవాలు తెలియక కాదు, జర్నలిస్టులలో చెప్పింది రాసుకొనే స్టెనోగ్రాఫర్లే కాదు, ఏమిటి, ఎందుకు, ఎలా,ఎవరు, ఎక్కడ అని ప్రశ్నలడిగే నోరున్న వారు కూడా వున్నారు గనుక ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మోడీ ఇంతవరకు పత్రికా గోష్టి పెట్టలేదు. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం మనది, అందులోనూ ప్రధాని విధిగా పత్రికా గోష్టి పెట్టాలని ఎక్కడా రాసిలేదు మరి. ఈ విషయంలో గిన్నిస్‌బుక్‌ రికార్డులకు ఎక్కుతారనేది జనాభిప్రాయం.

యధారాజా తధా ప్రజ సామెతలో ప్రజ బదులు సలహాదారులు అని మార్పు చేసుకోవాల్సిన అగత్యం కనపడుతోంది. ఈ మధ్య కాలంలో ప్రధాని, ముఖ్యమంత్రులు పుష్పకవిమానాలను నింపినట్లు తమ కార్యాలయాలను సలహాదారులతో నింపివేస్తున్నారు. వారు తమ ప్రావీణ్యత వున్న రంగాలలో గతంలో ఏం చేశారో తెలియదు గానీ సలహాదారులుగా మారిన తరువాత యజమాని మనసెరిగి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాదంటే వారి వుద్యోగాలుండవు మరి. మహాభారతంలో శకుని మామ గురించి తెలిసినదే. ప్రధాని నరేంద్రమోడీకి బయటి ప్రత్యర్ధులెవరో అందరికీ తెలిసిందే. సమస్య అంతర్గత శక్తులతోనే. అందుకని ఎవరే పాత్ర పోషిస్తున్నప్పటికీ అది ఆ పెద్ద మనిషి స్వయంకృతం. ‘చివరాఖరికి ‘ చెప్పొచ్చేదేమంటే నరేంద్రమోడీ అంతకంటే ఆయనను అనుసరించే గుడ్డి భక్తకోటి రోజు రోజుకూ ఇరకాటంలో కూరుకుపోతున్నారు. దానివలన ఎవరికీ నష్టం లేదు సమస్యల్లా సామాన్య జనం, దేశం అధోగతి పాలు కావటం గురించే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పడుచు పెళ్ళాం కోసం ముప్పు తెచ్చుకున్న ముగాబే !

22 Wednesday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Emmerson Mnangagwa, grace mugabe, robert mugabe, Zanu-PF, Zimbabwe

ఎం. కోటేశ్వరరావు

దేవుడు తప్ప తనను మరొకరు గద్దె దింపలేరని ఒక నాడు విర్రవీగి గత కొద్ది రోజులుగా తప్పుకొనేది లేదని బిర్రబిగిసిన జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే 37సంవత్సరాల తరువాత అవమానకరంగా మంగళవారం రాత్రి తనంతటతానే రాజీనామా చేసి గద్దె దిగాడు. ఆ వార్త వినగానే దేశంలో సంబరాలు మిన్నంటాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు జింబాబ్వే రాజకీయాలను అనధికారికంగా అధికారికంగా శాసించిన ముగాబే(93) శకం అంతమైంది. అంతకు ఒక రోజు ముందు వుద్వాసనకు గురై దక్షిణాఫ్రికాలో రక్షణ పొందుతున్న మాజీ వుపాధ్యక్షుడు ఎమర్సన్‌ మంగాగ్వాకు అధికారం అప్పగించేందుకు ముగాబే సిద్దపడినట్లు రక్షణ దళాల కమాండర్‌ జనరల్‌ కానస్టాంటినో చివెంగా జర్నలిస్టులతో చెప్పారు. అధికారపక్ష కేంద్రకమిటీ ఆదివారం నాడు సమావేశమై 24గంటలలోగా రాజీనామా చేయని పక్షంలో అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తామని హెచ్చరించింది. దానిని కూడా ముగాబే ధిక్కరించటంతో మిలిటరీతో బలప్రదర్శనకు దిగుతాడా అన్న సందేహాలు తలెత్తాయి. దేశంలో ఎలాంటి ప్రదర్శనలు జరపవద్దని మిలిటరీ జనరల్‌ కోరారు.శనివారం నాడు జింబాబ్వే జాతీయ విముక్తి పోరాట యోధుల సంఘం ఒక ప్రదర్శన జరిపి ముగాబే రాజీనామాను డిమాండ్‌ చేసింది. మరోమారు ప్రదర్శన జరుపుతామని హెచ్చరించింది. ముగాబే గద్దె దిగకపోతే తాము పరీక్షలను బహిష్కరిస్తామని విశ్వవిద్యాలయ విద్యార్ధులు చేశారు. మంగళవారం వుదయం విదేశాలలో ఒక గుర్తు తెలియని ప్రాంతం నుంచి చేసిన ప్రకటనలో ముగాబే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, తన ప్రాణ రక్షణకు హామీతో పాటు దేశంలోని రాజకీయ పరిస్ధితులపై చర్చకు ఆహ్వానం పంపాలని కోరినట్లు వార్తా సంస్ధలు పేర్కొన్నాయి. గృహనిర్బంధంలో వున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ముుగాబే గత శుక్రవారం నాడు జింబాబ్వే ఓపెన్‌ యూనివర్సిటీ పట్టాల ప్రదాన కార్యక్రమంలో ఛాన్సలర్‌ హోదాలో పాల్గనటం, తరువాత బయట కనిపించకపోవటం కూడా అనుమానాలకు తావిచ్చింది. తాము అధికారాన్ని స్వీకరించలేదని, నేరగాండ్లను ఏరివేయటానికి కొన్ని చర్యలు తీసుకున్నామని, ముగాబే, ఆయన కుటుంబం క్షేమంగా వుందని అంతకు ముందు మిలిటరీ ప్రకటించింది. తనపై ప్రతీకారం తీర్చుకోవటం, కక్ష్యపూరితంగా వుండటం వలన ఎలాంటి ప్రయోజనం వుండదని రాజధాని, దేశంలోని ప్రతి ఒక్కరిని తన అభిమానులు క్షమించివదలి వేయాలని ముగాబే విశ్వవిద్యాలయ ప్రసంగంలో పేర్కొనటాన్ని బట్టి గద్దె దిగేందుకు సుముఖంగా లేనని చెప్పటమే అని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో మంగళవారం నాడు పార్లమెంట్‌లో అభిశంసన ప్రక్రియ ప్రారంభమైన కొద్ది సేపటికే తాను రాజీనామా చేస్తున్నట్లు ముగాబే ప్రకటించటంతో పార్లమెంట్‌ వాయిదా పడింది.

గత కొద్ది వారాలుగా జరిగిన పరిణామాలను చూస్తే ముగాబే మాజీ కావటం ఖాయం అని తేలిపోయింది. మిలిటరీ అధికారులతో సన్నిహిత సంబంధాలున్న రాజకీయవేత్తగా పార్టీలో, మిలిటరీ, పోలీసుల్లో వుపాధ్యక్షుడి వర్గం ఆధిపత్యం రుజువైనా, లేక భార్య గ్రేస్‌ది పైచేయి అయినా ముగాబే ఆధిపత్యం ముగిసినట్లే. ఇప్పుడు మొదటిదే రుజువైంది. ముగాబేను మిలిటరీ గృహనిర్భంధంలో వుంచటంతో అక్కడి రాజకీయ సంక్షోభ తీవ్రత ప్రపంచానికి తెలిసింది. సైన్యాధికారులు తీసుకున్న రాజకీయ-మిలిటరీ చర్య ఒక కోణంలో ప్రమాద సూచికలను వెల్లడించినప్పటికీ మొత్తం మీద దేశవ్యాపితంగా ఆమోదం లభించటం విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు సంభవించిన పరిణామాలలో అధికారాన్ని మిలిటరీ తీసుకొనే సూచనలు లేవు.

తిరుగులేని నేతగా వున్న ముగాబే 1980 నుంచి 87వరకు ప్రధానిగా, తరువాత నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన పూర్వరంగంలో తొమ్మిది పదులు దాటిన ముగాబే అధికార వారసత్వం కోసం అధికారపక్షంలో పోరు మొదలైంది.ముగాబే తన కంటే 41 సంవత్సరాలు చిన్నదైన రెండవ భార్య గ్రేస్‌(52)కు పదవిని కట్టబెట్టేందుకు పూనుకోవటంతో పార్టీలో తిరుగుబాటుకు బీజం పడింది. వైమానిక దళ పైలట్‌ భార్య అయిన గ్రేస్‌ ఒక బిడ్డ పుట్టిన తరువాత అధ్యక్షకార్యాలయంలో వుద్యోగినిగా చేరింది. భర్తతో పాటు ముగాబేతో కూడా సంసారం చేసింది. వివాహేతర బంధంతో ముగాబే ద్వారా ఇద్దర్ని వివాహం తరువాత మరొకర్ని కన్నది. గ్రేస్‌కు విడాకులు ఇవ్వాలని ముగాబే అధికారబలంతో వత్తిడి తెచ్చి, తరువాత మొదటి భర్తతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు పైలట్‌ను విదేశాంగ శాఖ వుద్యోగిగా ఎంతో దూరంలో వున్న చైనాకు పంపించాడు. గ్రేస్‌తో సంబంధం వున్న మరో ఇద్దరిని అనుమానాస్పద స్ధితిలో హత్య చేయించినట్లు ఆరోపణలున్నాయి. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం భార్య బ్రతికి వుండగా విడాకులు తీసుకోకుండా మరో వివాహం చేసుకొనే అవకాశం లేదు. అందువలన ఏండ్ల తరబడి వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. తరువాత భార్య మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత దశాబ్దిలో కనీవినీ ఎరుగని రీతిలో అట్టహాసంతో గ్రేస్‌ను వివాహం చేసుకున్నాడని విదేశీ పత్రికలు రాస్తే శతాబ్దిలో ఇలాంటి ఆడంబరాన్ని చూడలేదని జింబాబ్వే మీడియా పేర్కొన్నది. ఇలాంటి వ్యక్తిత్వం కారణంగా ముగాబేను సహించినప్పటికీ గ్రేస్‌ను ఎన్నడూ పార్టీకార్యకర్తలు, సాధారణ పౌరులు గౌరవించలేదు. ముగాబే తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భార్య సారా పేరుతో ఐరోపాలో అక్రమ ఆస్థులను దాచాడు. ఆమె ఘనావియన్‌ కావటంతో 1992లో ఆమె మరణించినపుడు ఘనావియన్‌ చట్ట ప్రకారం ఆమె పేరుతో వున్న ఆస్థులు పుట్టింటి వారికి చెందుతాయి తప్ప మెట్టినింటికి దక్కవు. దాంతో భార్య మరణించగానే దాచుకున్న సంపదంతా పోయిందనే ఆక్రోశంతో తన నివాసంలోని కిటికీలన్నింటినీ ముగాబే పగలగొట్టినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. మొదటి భార్య సారాను ఆప్యాయంగా ఇప్పటికీ జింబాబ్వియన్లు తమ అమ్మగా పిలుచుకుంటారు. గ్రేస్‌కు అధికారాన్ని అప్పగించేందుకు పూనుకోవటంతో చివరకు ముగాబేను కూడా తోసిపుచ్చేందుకు పార్టీలోని వారికి అవకాశం దొరికింది. అయితే ఈ వ్యవహారం తక్షణ అంశంగా కనిపిస్తున్నప్పటికీ తిరుగుబాటు అసలు కారణంగా దేశం ఆర్ధికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోవటం వాటిని పరిష్కరించటంలో ముగాబే వైఫల్యం అని చెప్పాలి.

బ్రిటీష్‌ వలసపాలనలో రోడీషియాగా పిలిచిన జింబాబ్వే స్వాతంత్య్రపోరాటంలో ముగాబే కీలకపాత్ర పోషించాడు. పక్కనే వున్న దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు, ఎఎన్‌సి వుద్యమాలతో వున్న సంబంధాలు, నాడున్న అంతర్జాతీయ పరిస్ధితులలో ఒక వామపక్షవాదిగా వున్న ముగాబే తరువాత కాలంలో బూర్జువారాజకీయవేత్తగా మారాడు. శ్వేతజాతీయుల చేతులలో వున్న భూముల పంపకం వంటి కొన్ని చర్యలతో దేశంలో తిరుగులేని నేతగా మారాడు.వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నీ ఆయనకు మద్దతు ఇచ్చాయి.

ముగాబే పార్టీ, అధికార పదవుల నుంచి తప్పుకోవాలని కూడా అధికారపక్ష కేంద్రకమిటీ తీర్మానించింది.ఆయన స్ధానంలో ప్రస్తుతం ప్రవాసంలో వున్న మంగాగ్వాను నాయకుడిగా, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నుకున్నట్లు ఆదివారం నాడు ప్రకటించారు. సోమవారం లోగా పదవి నుంచి తప్పుకోనట్లయితే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ద్వారా పదవీచ్యుతుని గావిస్తామని హెచ్చరించింది. గడువు ముగిసినా ముగాబే అందుకు సిద్దపడకపోగా అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధంగా పడినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో వెనక్కు తగ్గేందుకు సుముఖంగా వున్నట్లు సైనికాధికారులు చెప్పటం తెరవెనుక యత్నాలు జరిగిన విషయాన్ని నిర్ధారించింది. మంగళవారం నాడు మంగాగ్వా చేసిన ప్రకటనలో ముగాబే తన హత్యకు పధకం వేసినట్లు పేర్కొన్నారు. తనను వుపాధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాత బందీగా తీసుకొని హతమార్చాలని పధకం వేసినట్లు గత నవంబరునెలలోనే తనకు స్నేహితులైన భద్రతా అధికారి హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. పదవి నుంచి తొలగించిన ప్రకటన వెలువడగానే మంగాగ్వా దేశం విడిచిపెట్టిన విషయం తెలిసిందే.

గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం దేశ ప్రజలలో మంగాగ్వా పట్ల కూడా అంతగా సదభిప్రాయం లేదు. ఒక నాడు తిరుగులేని నేతగా వున్న ముగాబేను వద్దని కోరుకుంటున్న జనం మరో ప్రత్యామ్నాయం లేకనే మంగాగ్వాను ఆహ్వానిస్తున్నారని చెప్పాల్సి వుంది. దేశాన్ని అస్తవ్యస్తం గావించటంలో ముగాబే పాత్ర ఎంతో ఇంతకాలం ప్రభుత్వ విధానాలను సమర్ధిస్తూ వచ్చిన మంగాగ్వాకూ దానిలో వాటా వుంది. మధ్యలో ముగాబే తన భార్యను రంగం మీదకు తేవటంతో పాలకపార్టీలో తిరుగుబాటుకు నాంది అయింది తప్ప విధానాల పరంగా ఎలాంటి తేడా లేదు. ముగాబేపై జనంలో తలెత్తిన విముఖత, మిలిటరీ మొగ్గు మంగాగ్వా వైపు వుందని పసిగట్టిన పశ్చిమ దేశాలు ఇంతవరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా మంగాగ్వాకు మద్దతు పలుకుతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.

మంగాగ్వాకు రాజ్యాంగబద్దంగా అధికారం అప్పగించాలంటే కొన్ని నిబంధనలు అడ్డువస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు పార్లమెంట్‌ స్పీకర్‌కు రాజీనామాను సమర్పించిన 24గంటల లోగా ప్రత్యామ్నాయంగా వుపాధ్యక్షుడికి బాధ్యతలను అప్పగించాల్సి వుంది. అయితే మంగాగ్వాను వుపాధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినకారణంగా ఆ స్ధానం ఖాళీగా వుంది. ఇప్పుడు రాజీనామా చేస్తే స్పీకరే ఆ బాధ్యతలను స్వీకరించాల్సి వుంటుంది. రాజ్యాంగ పద్దతుల ప్రకారం అధ్యక్షుడిగా ముగాబే తిరిగి మంగాగ్వాను వుపాధ్యక్షపదవిలో నియమించి తాను పదవినుంచి తప్పుకోవాలి.బహుశా ఈ కారణంగానే ముగాబే తననుఆహ్వానించాలని మంగాగ్వా మంగళవారం నాడు చేసిన ప్రకటనలో డిమాండ్‌ చేసి వుండాలి. మంగాగ్వా పునర్‌నియామకం జరగకుండానే ముగాబే రాజీనామా చేసినందున మరొక ప్రక్రియ ద్వారా కొత్త నేత ఎంపిక జరగాల్సి వుంది.

మిలిటరీచర్య దేశంలో ఏర్పడిన అల్లకల్లోలం ముఖ్యంగా అధికార పార్టీలో ఏర్పడిన అస్తవ్యస్థ పరిస్థితుల ఫలితమే అని ఇటీవలనే ఏర్పడిన జింబాబ్వే కమ్యూనిస్టు పార్టీ చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నఖబుతో మబెహెనా ఒక ప్రకటన చేస్తూ దేశ ప్రజలు దుర్భరదారిద్య్రంలో మగ్గుతుంటే అధికారపార్టీ ప్రముఖులు భోగలాలసులుగా తయారయ్యారని పేర్కొన్నారు. పరిశ్రమలు మూతబడ్డాయి, సంఘటిత రంగంలో 90శాతానికిపైగా నిరుద్యోగం వుంది. అధికార ప్రతిపక్షా వ్యక్తిగత రాజకీయాలలో మునిగిపోయాయి. గత 37 సంవత్సరాలలో ఎన్నడూ ఇలాంటి పరిస్ధితి ఏర్పడలేదు. రాజకీయ ప్రముఖుల సామూహిక దోపిడీతో కూడిన ఒక అప్రజాస్వామిక రాజకీయ వ్యవస్ధ అభివృద్ధి అయింది, ఫలితంగా అర్ధికదిగజారుడుకు దారితీసింది. సాధారణ పరిస్థితులలో మిలిటరీ చర్యను సమర్ధించకూడదు.అయితే అధికారం కొద్ధి మంది, అతి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావటం, ప్రజాబాహుళ్య అదుపు లేదా అసమ్మతి తెలిపేందుకు వున్న అవకాశాలన్నీ మూసుకుపోయిన స్థితిలో ఈ వుదంతంలో మిలిటరీ చర్యకు దారితీసింది, దీనిని అత్యధిక జింబాబ్వియన్లు ఒకే తీరులో కానప్పటికీ సంతోషంగా అంగీకరించారు. రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యంలో శాంతియుత,రాజ్యాంగ పద్దతుల్లో అధికారమార్పిడి జరగాలి, అందుకు అనువైన పరిస్ధితులను ఏర్పరచాలి అని కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. సహేతుకమైన కాల వ్యవధిలో స్వేచ్చ,అక్రమాలకు తావులేని ఎన్నికలు జరిపేందుకు ఒక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు జరగాలని సూచించింది.

దేశియం పేరుతో ముగాబే సర్కార్‌ ఆమోదించిన విధానాల ప్రకారం విదేశీ కంపెనీలు తమ వాటాను 49శాతానికి పరిమితం చేసి 51శాతం జింబాబ్వియన్లకు కేటాయించాలి.ఈ విధానాన్ని స్వదేశీ బూర్జువాశక్తులు తమకు అనుకూలంగా మార్చుకొని దేశాన్ని గుల్లచేశారు. తాను సామ్రాజ్యవాదానికి,పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం అని ముగాబే చెప్పుకున్నప్పటికీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరించారు.1991 నుంచి నయావుదారవాద విధానాలను అమలులోకి తెచ్చారు. ఈ పూర్వరంగంలో మంగాగ్వా లేదా మరొకరి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వం ఈ విధానాలను మార్చుకోనట్లయితే జనంలో వ్యతిరేకత రావటానికి ఎక్కువ కాలం పట్టదు. మరొక ముగాబేను దీర్ఘకాలం అధికారంలో తిష్ట వేయటానికి అంగీకరించే అవకాశాలు తక్కువ.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రేటింగ్స్‌ కోసం మోడీ సర్కార్‌ పైరవీలు జరిపిందా ?

18 Saturday Nov 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP’s trolling army, India economy, india ratings, moody’s india ratings, Narendra Modi, narendra modi bhakts

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి నేతలు జరిపిన విదేశీయాత్రలు, అందుకు అయిన విమానఖర్చుల మేరకు కూడా వారు విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులను సమీకరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మోడీ విదేశీ పర్యటనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో విమర్శకుల నోరు మూయించేందుకు వారికి ఒక అస్త్రం దొరికింది. గత పదమూడు సంవత్సరాలుగా మన స్ధానాన్ని చెత్త రేటింగ్‌ ఎగువన, పెట్టుబడి రేటింగ్‌కు దిగువున వుంచిన మూడీస్‌ అనే అమెరికా సంస్ధ దేశ ఆర్ధిక రేటింగ్‌ను ఒక మెట్టు పైకి పెంచింది. కొద్ది రోజుల క్రితం అదే అమెరికాకు చెందిన ప్యూ అనే సంస్ధ విడుదల చేసిన సర్వేలో కాస్త పలుకుబడి తగ్గినప్పటికీ ఇప్పటికీ నరేంద్రమోడీయే తిరుగులేని నాయకుడిగా వున్నాడని తేలిందని పేర్కొన్నారు.(ఆ సర్వే తొమ్మిదినెలల క్రితం చేసింది, ఇప్పుడు ఎందుకు విడుదల చేశారన్నది ఒక ప్రశ్న) వాణిజ్య సులభతర సూచికలో గతేడాది కంటే ఏకంగా 30పాయింట్లు తగ్గి ఎగువకు చేరింది. ఇప్పుడు మూడీస్‌ బూస్ట్‌ ఈజ్‌ద సీక్రెట్‌ ఆఫ్‌ అవర్‌ ఎనర్జీ అన్నట్లు దేశవ్యాపితంగా బిజెపి శ్రేణులు,నేతలు గంతులు వేస్తున్నాయి. దానికి వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికలలో ప్రచారానికి వీటిని వుపయోగించుకొని బయటపడగలమనే సంతోషమే కారణం. అయితే వీటి ప్రభావం ఎంత మేరకు వుంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఒక వేళ మోడీ-అమిత్‌ షా రేటింగ్‌ను ఓట్ల కోసం వాడితే మిగతా రెండు సంస్ధల మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా వూరుకుంటాయా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక చక్కటి డైలాగ్‌ వుంది. నేను నియోగిని ఎలా కావాలంటే అలా వినియోగపడతాను అంటాడు రామకృష్ణ(నిజానికి ఆ కవి అలాంటి వాడో కాదో తెలియదు) భజన మీడియా మాత్రం అలాంటిదే. కనుక దాని చిత్రణ చూసి గంతులేస్తే గోతిలో పడతారు. ఇప్పటికీ కాస్త విమర్శనాత్మకంగా చూసే విశ్లేషకులు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులేయాల్సినంతగా తాజా రేటింగ్‌లో ఏముందంటున్నారు.

మూడీస్‌ సంస్ధ రేటింగ్‌ చరిత్రలోకి వెళితే బిజెపి భజన బృందాలకు కాస్త ఇబ్బందేమరి. ఎందుకంటే తమ నేత వాజ్‌పేయి కాలంలో దేశం వెలిగిపోయిందని చెప్పుకున్న కాలంలో కూడా మన రేటింగ్‌ అధ్వాన్నంగానే వుంది మరి. పెట్టుబడిదారులు, భూస్వాములకు లబ్ది చేకూర్చేందుకు మన పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వళ్లు వంచి ఎంతో కష్టపడుతున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలతో బంధం ముడిపడిన తరువాత చేపట్టిన చర్యలకు సంస్కరణలు అని పేరు పెట్టారు. ప్రధానులుగా పని చేసిన వారిలో నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి తెచ్చుకున్న రాజీవ్‌ గాంధీ పాలనలో మూడీస్‌ సంస్ధ మన దేశానికి పెట్టుబడిలో ఆరవ ర్యాంకు(1988) ఇచ్చింది. విపిసింగ్‌ ఎనిమిది(1990) చంద్రశేఖర్‌ పది(1991) పివి నరసింహారావు పాలనలో పెట్టుబడేతర చెత్త రాంకులు పదకొండులో రెండోది(1991), ఆయన పాలనలోనే 1994లో పెట్టుబడిలో పదవరాంకు తరువాత దేవెగౌడ పాలనలో 1998లో కూడా దాన్నే కొనసాగించింది. అదే ఏడాది వాజ్‌పేయి అధికారానికి వచ్చిన తరువాత తిరిగి రెండవ చెత్త రాంకులోకి దిగజారింది. తరువాత ఒకటవ చెత్త రాంకులోకి, తరువాత 2004లో పెట్టుబడిపదవ రాంకులోకి పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో అదే కొనసాగి ఇప్పుడు నరేంద్రమోడీ మూడున్నర ఏండ్ల తరువాత పదినుంచి తొమ్మిదవ రాంకులోకి పెంచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాజ్‌పేయి హయాంలో చెత్తకు అటూ ఇటూగా వున్నందుకే తమ పాలనలో దేశం వెలిగిపోయిందంటూ బిజెపి వారు పెద్ద ఎత్తున వందల కోట్లతో ప్రచారానికి తెరతీసి జనం ముందుకు వచ్చి బక్కబోర్లా పడిన విషయాన్ని మరచి పోకూడదు. అందువలన ఈ మాత్రానికే మోడీ పరివారం పండగ చేసుకోవాలా అని కొందరు అంటున్నారు.

పిల్లి ఏ రంగుదని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా సంస్కరణలు ఏ ప్రధాని ఎలా అమలు జరిపారన్నది కాదు, దాని వలన జనానికి ఒరిగిందేమిటి అన్నదే గీటురాయి. రేటింగ్‌లో మార్పు కోసం నరేంద్రమోడీ సర్కార్‌ తెగతాపత్రయ పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా చివరకు పైరవీలకు ప్రయత్నించి విఫలమైందని రాయిటర్స్‌ సంస్ధhttps://in.reuters.com/article/india-ratings-moody-s/exclusive-how-india-lobbied-moodys-for-ratings-upgrade-but-failed-idINKBN14E09A   గతేడాది డిసెంబరు 25న ఒక వార్తను ప్రచురించింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ కూడా అదే పని చేసి భంగపడిందని వార్తలు వెలువడ్డాయి.

రాయిటర్స్‌ కథన సారాంశం ఇలా వుంది. మూడీస్‌ రేటింగ్‌ పద్దతులను భారత్‌ విమర్శించింది. రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సంబంధిత పత్రాలలో రాయిటర్స్‌ గమనించింది, అయితే దుర్బలంగా వున్న బ్యాంకుల తీరుతెన్నులను ఎత్తి చూపుతూ వత్తిడికి లంగేందుకు అమెరికా సంస్ధ తిరస్కరించింది. అధికారానికి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులను పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు, ద్రవ్య,కరెంట్‌ ఖాతాలోటు తేడాను తగ్గించేందుకు నరేంద్రమోడీ చర్యలు తీసుకున్నారు.అయితే ఇంకా చర్యలు తీసుకోవాలని మూడు రేటింగ్‌ సంస్దలు కోరాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ-మూడీస్‌ మధ్య నడిచిన వుత్తర ప్రత్యుత్తరాలలో రుణభారం,136బిలియన్‌ డాలర్ల విలువగల బ్యాంకుల పారుబాకీల గురించి రేటింగ్‌ సంస్ధలకు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు వెల్లడైంది. అక్టోబరులో రాసిన లేఖలు, ఇమెయిల్స్‌లో మూడీస్‌ సంస్ధ లెక్కలు కట్టే విధానాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్నంతా ఆశావహంగా రుణభార సమస్య లేదని, బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోందని మూడీస్‌ అ వాదనలను తిరస్కరించింది. రేటింగ్‌ సంస్ధలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసాధారణంగా వుందని, రేటింగ్‌ ఏజన్సీలపై వత్తిడి చేయలేమని ఆర్ధికశాఖ మాజీ అధికారి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు. బిఏఏ రేటింగ్‌ వున్న దేశాల జీడిపిలో ఆదాయం 21.7శాతం మీడియన్‌(మధ్యరేఖ) కాగా భారత్‌లో 21శాతమే వుందని అందువలన మూడీస్‌ సంస్ధ పెట్టుబడులలో కనిష్ట రేటింగ్‌ ఇచ్చింది. రేటింగ్‌ ఎక్కువ వున్న దేశంలో రుణాలు పొందటానికి అయ్యే వ్యయం తక్కువగా వుంటుంది కనుక పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. దేశంలో వచ్చే ఆదాయంలో ఐదోవంతుకు పైగా అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోంది.

అక్టోబరు నెలలో మూడీస్‌ ప్రతినిధికి పంపిన ఇమెయిల్‌లో సంస్ధ రేటింగ్‌ పద్దతిని మోడీ ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జపాన్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధల కంటే రెట్టింపు రుణభారం కలిగి వున్నప్పటికీ మెరుగైన రేటింగ్‌ ఇచ్చారని పేర్కొన్నది.2004 తరువాత భారత రుణభారం గణనీయంగా తగ్గినప్పటికీ రేటింగ్స్‌లో అది ప్రతిబింబించలేదని, విదేశీమారక ద్రవ్య నిల్వలు మెరుగ్గా వుండటం, ఆర్ధిక పురోగతిని కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని అభ్యంతరం తెలిపింది. దానికి మూడీస్‌ ప్రతినిధి వెంటనే సమాధానమిస్తూ భారత్‌తో సమాన రేటింగ్‌ వున్న దేశాలతో పోల్చితే రుణభారం ఎక్కువగా వుందని, అదే సమయంలో రుణాన్ని భరించగల స్ధితి కూడా తక్కువగా వుందని పేర్కొన్నారు.బ్యాంకుల పారుబాకీల సమస్య సమీప భవిష్యత్‌లో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదని పేర్కొన్నారు. సానుకూల వైఖరి కనిపిస్తున్నప్పటికీ గతంలో ఇచ్చిన బిఏఏఏ3 రేటింగ్‌ను మార్చే అవకాశం లేదని గ్రేడ్‌ పెంచే పరిస్ధితులు లేవని నవంబరు 16న మూడీస్‌ తెలిపింది.’

1980దశకం నాటి స్ధాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రేటింగ్‌ పెంచిన కారణంగా తక్కువ వ్యయ్యంతో విదేశాలలో భారత్‌ నిధులు తెచ్చుకొనే అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే మిగతా రెండు ప్రధాన రేటింగ్‌ సంస్ధలైన్‌ ఎస్‌అండ్‌పి, ఫిచ్‌కూడా రేటింగ్‌ పెంచితేనే అది సాధ్యం అవుతుంది. అవి కూడా వెంటనే ఆ పని చేయకపోతే మూడీస్‌ చర్యను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అనుమానించే అవకాశం వుంది. అదే జరిగితే రేటింగ్‌ను తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండవది ఈ రేటింగ్‌ను నిలుపుకొనే విధంగా ప్రభుత్వ చర్యల్లేకపోయినా తిరిగి తగ్గించే అవకాశాలు లేకపోలేదు. రేటింగ్‌ మెరుగ్గా లేకపోయినప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే గత పద మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులు కొంత మేరకు పెరిగాయి. దానికి తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే అని మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోడీ ఎవరికి వారు చెప్పుకోవటం సహజం. అయితే ఇప్పుడు ఈ రేటింగ్‌తో అదనంగా వచ్చేదేమిటి అన్నది ఒక ప్రశ్న. రేటింగ్‌ మెరుగైన కారణంగా ఇంకా విదేశీ నిధులు వచ్చిపడితే జరిగేదేమిటి? ఒకటి నిధులు, రుణాల వ్యయం తగ్గటం ఒక సానుకూల అంశం. ధనిక దేశాల బ్యాంకులలో మన కంటే వడ్డీరేట్లు మరీ తక్కువగా వున్నాయి. వాటితోపోల్చితే మన దగ్గర ఎక్కువ. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన హామీ వుంటే విదేశీ సంస్ధలు ముందుకు వస్తాయి.

అదే సమయంలో విదేశీ నిధుల ప్రవాహం మన రూపాయి విలువపై ప్రభావం చూపటం అనివార్యం. ఇప్పటికే రూపాయి విలువ పెరిగిన కారణంగా ఎగుమతిదార్లు పోటీని ఎదుర్కోలేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రూపాయి విలువ ఇంకా పెరిగితే ఎగుమతులు మరింతగా పడిపోతాయి. వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆ ప్రభావం మన కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రేటింగ్‌ వార్త వెలువడిన శుక్రవారం నాడు 30పైసల మేరకు విలువ పెరిగింది. అయితే రూపాయి విలువ ఎంత పెరిగితే ఆ మేరకు చమురు ధరలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలు, ప్రభావాల గురించి అనేక అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ రేటింగ్‌తో నిమిత్తం లేకుండానే విదేశీ నిధులు ఇప్పటికే వచ్చినందున రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం వుంటుందో చూడాల్సి వుంది.

ఒకటి మాత్రం స్పష్టం. ఏదో ఒక పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై పూర్తిగా సబ్సిడి ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై ఎత్తివేత క్రమంగా అమలు జరుగుతోంది. ఇలాంటి చర్యలు ద్రవ్యలోటును ఎంత మేరకు పూడ్చగలవనేది చూడాల్సి వుంది. నోట్ల రద్దు ద్వారా మూడు లక్షల కోట్ల మేరకు లబ్ది చేకూరుతుందన్న అంచనాలు పోయి నష్టాలు మిగిలాయి. దీనికి తోడు బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రభుత్వం 2.11లక్షల కోట్లను కేటాయించాల్సి వుంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వాన్ని పాలక ఎన్‌డిఏ కూటమి, దానితో జతకట్టాలని వుబలాటపడుతున్నవారికి ఆందోళన కలిగించే అంశం పెరుగుతున్న చమురు ధరలు. ఇప్పటికే 60డాలర్లున్న పీపా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే జోస్యాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రేటింగ్‌ ప్రయోజనాలన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. చమురు ధరల పెరుగుదల పర్యవసానాలను మోడీ సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. భారం మొత్తాన్ని జనంపై మోపితే ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానితో సంబంధం వున్న వేతనాలు,భత్యాల వంటివి పెరగాల్సి వుంది.

దేశాల రేటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలలో ఆ దేశాల రుణభారం ఒకటి. మన పొరుగునే వున్న చైనా జిడిపి వంద రూపాయలనుకుంటే దాని అప్పులు 43, అదే మన దేశానికి వస్తే 68 రూపాయలుగా వుంది. మన వంటి రేటింగ్‌ వున్న దేశాల మీడియన్‌ 44 మాత్రమే. అమెరికా, బ్రిటన్‌లకు 70శాతం వుంది. ఆ దేశాలకు అంత అప్పు వున్నప్పటికీ వాటికి తీర్చే సత్తా కూడా వుంది. మన పరిస్ధితి అది కాదు.ఎస్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ధ మన దేశ అప్పు దామాషా 60లోపుగా వుండాలని షరతు లాంటి వత్తిడి చేస్తోంది. రేటింగ్‌ పెంపుదల కోసం మూడీస్‌ సంస్ధతో మోడీ సర్కార్‌ లాబీయింగ్‌(పైరవీ) చేసిందని చెప్పిన రాయిటర్స్‌ మరో అమెరికన్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి, బ్రిటన్‌ కంపెనీ ఫిచ్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మూడీస్‌ చేసిన సవరణను మిగతా రెండు సంస్ధలు కూడా అనుసరిస్తాయా? అది తేలేంత వరకు మోడీ భక్తులకు బిపి పెరగటం ఖాయం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

16 Thursday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RELIGION, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, bible teachings, Bolshevik Revolution, communism, communist manifesto, Pope Francis

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

యాభయ్యేళ్ల నక్సలిజం – పాఠాలు

15 Wednesday Nov 2017

Posted by raomk in AP NEWS, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

50 years of naxalism, left adventurism, Left politics, left wing extremism, naxalism

కొండూరి వీరయ్య

నక్సలిజం ఒక సైద్ధాంతిక ఆచరణాత్మక ధోరణిగా మొదలై యాభయ్యేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నక్సలిజం సాఫల్య వైఫల్యాలపై విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వస్తున్నాయి. సమాజాన్ని మార్చాలన్న లక్ష్యంతో మొదలైన ఉద్యమ స్రవంతి ఆ లక్ష్య సాధన దిశగా సమాజాన్ని నడిపించగలిగిందా లేదా అన్నది అర్థం చేసుకోవటానికి దేశంలో విప్లవ సాధనకు అవసరమైన వ్యూహం, ఎత్తుగడల కోణంలో చర్చించాలి. విప్లవోద్యమానికి నాయకత్వం వహించే శక్తులు అనుసరించే సైద్ధాంతిక, ఆచరణాత్మక వైఖరి తప్పు అయితే అటువంటి సైద్ధాంతిక అవగాహన ప్రాతిపదికగా రూపొందించే వ్యూహాలు ఆశించిన ప్రయోజనం కంటే ప్రతికూల ప్రయోజనాన్ని సాధిస్తాయి. యాభయ్యేళ్ల నక్సల్బరీ అనుభవాలు విముక్తి ఉద్యమాలకు నేర్పుతున్న పాఠాలు ఇవే.

దేశంలో నక్సలిజం ఒక సైద్ధాంతిక స్రవంతిగా మొదలైంది అన్న నిర్ధారణను అవగాహన సరైనది కాదు. స్వాతంత్య్రోద్యమం నాటి నుండీ దేశ విముక్తికి సంబంధించి కమ్యూనిస్టులు ప్రత్యామమ్నాయ సైద్ధాంతిక స్రవంతిని ముందుకు తెచ్చారు. నక్సలిజంతో ముందుకొచ్చింది కేవలం ఆచరణకు సంబంధించిన కోణం మాత్రమే. స్వతంత్ర భారతదేశంలో పెట్టుబడిదారీ వర్గపు ఆధిపత్యాన్ని సంఘటితం చేసుకోవటానికి సామ్రాజ్యవాద శక్తులు సహకరిస్తాయని ఆశించిన వారికి శృంగభంగమైంది. పాలకవర్గాలు అనుసరించిన పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా 1960 దశకంలో తొలి సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలు ప్రజల మదిలో మెదులుతున్న ఈ సమయంలో ఆ లక్ష్యాలు సాధించటంలో పాలకవర్గం వైఫల్యం పట్ల సహజాంగానే ఆగ్రహావేశాలుకు దారితీశాయి. ఈ ఆగ్రహావేశాలను ఆధారం చేసుకుని ప్రజలు వ్యవస్థ మార్చటానికి సంపూర్ణ రాజకీయ చైతన్యవంతులై ఉద్యమిస్తున్నారన్న అంచనాకు నక్సలిజం పునాది పురుషులు వచ్చారు. స్వతంత్ర భారతదేశం తొలి దఫా సంక్షోభంలోకి అడుగుపెట్టింది. ఈ సంక్షోభం నుండి బయటకు రావటానికి భూసంబంధాల పున:నిర్మాణం తక్షణ పరిష్కారం. స్వాతంత్య్రం వచ్చిన పదిహేనేళ్లు గడుస్తున్నా భూసంబంధాల పునర్నిర్మాణాన్ని పాలకవర్గాలు నెరవేర్చేందుకు సిద్ధం కాలేదు. దాంతో సాగుచేయని యజమానులకు వేలాది ఎకరాల భూమిపై ఆధిపత్యం (ఆబ్సెంటీ లాండ్‌లార్డిజం) – కౌలు దోపిడీ పరస్పర పోషకాలుగా గ్రామీణ సామాజిక ఆర్థిక జీవితాన్ని నియంత్రించే ప్రధాన లక్షాలుగా ఉన్నాయి. ఆ సమయంలో వ్యవసాయ సంబంధాలను సమూలంగా మార్చటానికి దున్నేవానికే భూమి నినాదం అర్థవంతంగా ఉండటమే కాదు. ప్రజలను సమీకరించే సాధనంగా మారింది. ఈ నినాదం ప్రధానంగా భూమిపై సాగు చేస్తున్న కౌలు రైతులను భూములపై హక్కులు దఖలు పడేలా చేసింది. మరోవైపున పాలకవర్గాలు ఎదుర్కొంటున్న తొలి రాజకీయ సంక్షోభం వ్యవస్థాగతమై కాంగ్రెస్‌ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికింది. ఆ క్రమంలో బెంగాల్‌లో తొలి సంకీర్ణ ప్రభుత్వం ఉనికిలోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న సిపిఐ(ఎం) దున్నేవాడికే భూమి నినాదానికి రాజ్యాంగ పరిమితుల్లోనైనా ఆచరణ రూపం ఇవ్వటానికి నిర్ణయించింది. సాగు చేయని భూస్వాములు భూములు ఆక్రమించుకోవటం, సాగు హక్కులతో పాటు భూమిపై హక్కు కోసం ఉద్యమించటం ఈ కాలంలో గ్రామీణ బెంగాల్‌లో కనిపించిన సార్వత్రిక దృశ్యం. పార్టీ ఇచ్చిన పిలుపునందుకు గ్రామీణ బెంగాల్‌లో పెద్దఎత్తున భూ ఆక్రమణలు సాగాయి. సాధారణంగా పేదలు ఎక్కడన్నా భూమిని ఆక్రమించుకుంటే పోలీసు యంత్రాంగం యజమాని పక్షాన రంగ ప్రవేశం చేయటం మనకు కనిపించే సాధారణ లక్షణం. ప్రజాస్వామిక వ్యవస్థలో తటస్థమైనదిగా మనకు కనిపించే పోలీసు వ్యవస్థ, రాజ్యాంగ యంత్రాల ప్రధాన లక్ష్యం ప్రైవేటు ఆస్థిని కాపాడటం. దీనికి భిన్నంగా బెంగాల్‌లో యజమానుల తరపున పోలీసులు రంగ ప్రవేశం చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించటంలో కీలక భాగస్వామిగా ఉన్న సిపిఐ(ఎం) ముఖ్యమైన పాత్ర పోషించింది.

ఈ పరిస్థితుల్లో నక్సల్బరీలో పార్టీ నిర్ణయాలకు భిన్నంగా చారుమజుందార్‌ నాయకత్వంలో వర్గపోరాటాన్ని వర్గాలకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తుల మీద పోరాటంగా మార్చి వ్యక్తిగత హింసావాదం విప్లవ చర్యల్లో భాగం అన్న అవగాహనను ముందుకు తెచ్చింది. దీన్ని పార్టీ నాయకత్వం తిరస్కరించటంతో స్వీయమానసిక వాదానికి లోనైన కొద్ది మంది నాయకులు సిపిఐ(ఎం) నుండి బయటకొచ్చి స్వతంత్ర పంధా అనుసరించటం మొదలు పెట్టారు. దానికి గ్రామీణ ప్రాంతాలను విముక్తి చేసుకుంటూ విప్లవ ప్రస్థానం సాగించిన చైనా విప్లవాన్ని, మావో వ్యూహరచనను ఆదర్శనంగా తీసుకున్నారు. నిజానికి 1940 దశకం నాటి చైనాకు, 1970 దశకం నాటి భారతదేశానికి ఉన్న మౌలిక వ్యత్యాసాలు గమనించటంలో నక్సల్బరీ నాయకత్వం విఫలమైంది.

ప్రజా పునాది లేని పాలకవర్గంపై ప్రజా పునాది సమీకరించుకుంటూ సాగించిన సాయుధ పోరాటం మావోయిజం మౌలిక లక్షణం. భారతదేశంలో మావో ఆలోచనా ధోరణి పేరుతో అమలు జరిగిన నక్సల్బరీ విధానాలు విస్తృత ప్రజా పునాదిని సమీకరించుకోవటంలో విఫలమయ్యాయి. చారిత్రక పరిణామం కీలక దశలో ఉనికిలో వచ్చిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దోపిడీ వర్గాల పాలనకు అవసరమైన చట్టబద్ధత (లెజిటిమెసీ)ని కల్పించే సాధనంగా మారింది. దోపిడీ వర్గాలకు ఆమోదయోగ్యత సాధించటంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పాత్ర. ఐదేళ్లకొకసారి జరిగే ఎన్నికలు. లాంగ్‌ మార్చ్‌తో పోల్చి దేశంలో విముక్తి ప్రాంతాలను గుర్తించటం, కార్యాచరణ రూపొందించటంలో ఉన్న సత్యదూరమైన, వాస్తవ విరుద్ధమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మావోయే మా చైర్మన్‌ అన్న నినాదాలు అప్పుడప్పుడే ప్రజల్లో పట్టు సాధిస్తున్న వామపక్ష శ్రేణుల విస్తరణను అడ్డుకోవటంలో పాలక వర్గాలకు సాధనాలుగా మారాయి. కమ్యూనిస్టులందరినీ దేశ ద్రోహులుగానూ, విదేశీ శక్తుల పనుపున పనిచేసే వారిగానూ ముద్ర వేయటానికి అవకాశం అందించాయి. దాంతో కమ్యూనిస్టు ఆలోచన స్రవంతి అభివృద్ధికి ఆటంకం అన్న నానుడి ఘనీభవించటానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దోహదం చేశాయి. మరోవైపున 1960-70 దశకాల్లో దేశాన్ని మరోమారు ఉద్యమాల బాట పట్టిన తక్షణ సమస్య వ్యవసాయక సంబంధాలు అని గుర్తించిన పాలకవర్గాలు 1973లో తామే భూసంస్కరణలను అమలు చేస్తామని దేశానికి హామీ ఇవ్వటానికి ప్రణాళిక సంఘం ద్వారా భూసంబంధాలపై ఒక అధ్యయనం జరిపించింది. దాని ప్రాతిపదికన వరుసగా భూసంస్కరణ చట్టాలు ఆమోదిస్తూ వచ్చింది. దీంతో అప్పటి వరకు భూ సమస్య నేపథ్యంలో కమ్యూనిస్టులను అక్కున చేర్చుకున్న గ్రామీణ పేదలు క్రమంగా ఉద్యమాలు వదిలి పాలకవర్గాలు పీడిత వర్గాలను లోబర్చుకునే విధానాలకు (ఎకామడేటివ్‌ పాలిటిక్స్‌) బలయ్యారు. ఈ చర్యలన్నీ ఒక పాలకవర్గాలపై భ్రమలు పెంచి పోషించటంతో పాటు మరోవైపు ప్రజలు కమ్యూనిస్టు స్రవంతి నుండి దూరంకావటానికి దారితీశాయి.

అటువంటి సమయంలో ప్రజలకు దగ్గరకావటానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సిన నక్సలిజం తప్పుడు నిర్మాణపద్ధతులు, ఆచరణ, ఎత్తుగడలు, వ్యక్తిగత సాహస చర్యల పట్ల సాధారణంగా ఉండే ఆసక్తి, క్రేజ్‌ను సొమ్ము చేసుకునే ధోరణిలో చర్యలు అనుసరించటంతో దేశం కోసం ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమైన దేశభక్తుల ప్రాణాలకు, త్యాగాలకు విలువ లేకుండా పోయింది. ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కానవసరం లేదు, ఉద్యమకారులు ప్రజల అవసరాలు తీర్చి పెడతారు. మన తరపున త్యాగాలు చేసి పెడతారు. మనం కేవలం ఆ ఫలితాలను అనుభవించటానికి సిద్ధమైతే చాలు అన్న ధోరణికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో స్థానిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అటు బూర్జువా పార్టీల ద్వారాగానీ ఇటు వామపక్ష శక్తుల ద్వారాగానీ తమ సమస్యలు పరిష్కరించుకోవటం వరకే పరిమితమయ్యారు తప్ప తద్వారా అందుకోవాల్సిన వర్గ చైతన్యానికి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో నిజమైన విప్లవోద్యమం వ్యూహం, ఆచరణ,నిర్మాణం, సమీక్షించుకోకుండా లక్ష్య సాధన దిశగా ప్రయాణం సాగదు. బూర్జువా ప్రజాతంత్ర వ్యవస్థ పరిధిలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకోవటం, బూర్జువా ప్రజాస్వామ్యం పరిమితుల పట్ల చైతన్యంకలిగించకుండా జనతా ప్రజాస్వామ్యంపట్ల ఆసక్తిని సృష్టించలేము. నిర్దిష్ట పరిస్థితుల గురించి నిర్దిష్ట అంచనాకు లేకుండా క్యాకర్తలను త్యాగాలకు పురికొల్పటం విప్లవోద్యమ నాయకత్వ దక్షత కాబోదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ గూండాయిజం-అమెరికాను విస్మరించిన ఆసియన్‌ నాయకత్వం !

14 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

asean summit, Donald trump, Donald trump asia tour, donald trump's act of political vandalism, US leadership

ఎం. కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు ఆసియాను అవమానించారా? అవును, పన్నెండు మంది దేశాధినేతలు హాజరైన తూర్పు ఆసియా సభ ప్రారంభం కావటం రెండు గంటల పాటు ఆలస్యమైందంటూ చిందులు వేస్తూ సభను బహిష్కరించి విమానమెక్కి స్వదేశానికి చెక్కేయటం, వాషింగ్టన్‌ వెళ్లిన తరువాత తాను ఒక ప్రకటన చేస్తానని చెప్పటం అవమానం గాక మరేమిటి? ఆసియా పర్యటన చేస్తూ తూర్పు ఆసియా సభలో పాల్గనకపోతే ఆసియా పట్ల అమెరికన్లకు ఆసక్తి లేదనే విమర్శలు వస్తాయనే కారణంతో ఈకార్యక్రమాన్ని కూడా చివరిలో పర్యటనలో చేర్చారు.చివరికి ఆలస్యం సాకు చూపి సభను బహిష్కరించారు.నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందుగానే ట్రంప్‌ విమానం ఫిలిప్పైన్స్‌నుంచి బయలుదేరింది.

విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ మధ్యాహ్నభోజన సమయంలో చివరిగా తాను చెప్పదలచుకున్న అభిప్రాయాలను చెప్పేశానని, తన బదులు విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాల్గంటారని తెలిపారు.మనం పడ్డ కష్టానికి మంచి ఫలితాలే రానున్నాయని, 300బిలియన్‌ డాలర్ల మేరకు పరికరాలు, ఇతరాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని, త్వరలో లక్షకోట్ల డాలర్లకు పెరుగుతాయని చెప్పారు. తూర్పు ఆసియా సమ్మేళనంలో పాల్గనకపోవటం ట్రంప్‌ రాజకీయ గూండాయిజంగా మారుతుందని ప్రొఫెసర్‌ కార్ల్‌ థయర్‌ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అధికారం తగ్గిపోవటానికి,ఆసియన్‌ నేతలు ఆ స్ధానాన్ని భర్తీ చేయటానికి ఈ పర్యటన కీలకమైనదిగా చరిత్రకారులు ఈతేదీని నమోదు చేస్తారని మరో ప్రొఫెసర్‌ అనెలైస్‌ రైల్స్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే చేపట్టిన తొలి చర్యలలో భాగంగా పసిఫిక్‌ ఇరుసులో వున్న దేశాలతో వాణిజ్య ఒప్పందాన్ని వదలివేశారని, అమెరికా ప్రమేయం లేకుండా శనివారం నాడు ఆసియన్‌ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె చెప్పారు. పెద్ద ఒప్పందాలు మన చేతులను కట్టివేస్తాయని, ఏ దేశానికి ఆదేశంతో ఒప్పందాలు చేసుకోవటంపై తాను కేంద్రీకరిస్తానని అదేరోజు ట్రంప్‌ ప్రకటించారు. ఫసిపిక్‌ భాగస్వామ్య దేశాల ఒప్పందాన్ని వమ్ము చేసే ట్రంప్‌ యంత్రాంగ యత్నాలను ఆసియన్‌ నాయకులు పట్టించుకోలేదని, తాము స్వంతంగా ముందుకు పోవాలని నిర్ణయించారని, ట్రంప్‌కు ఘనస్వాగతం చెప్పినప్పటికీ ఆయన అజెండాను మొత్తంగా పట్టించుకోలేదని రైల్స్‌ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడేమిటి? ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని అనేక మంది ముక్కుమీద వేలేసుకున్నారు. గత అధ్యక్షులందరినీ అధిగమించి డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నెండు రోజుల గత రికార్డును బద్దలు కొట్టి 13రోజులతో కొత్త ఆసియా పర్యటన రికార్డును స్ధాపించాడు. నవంబరు ఐదున జపాన్‌తో మొదలై 14వ తేదీన ఫిలిప్పీన్స్‌లో ముగిసింది. మధ్యలో చైనా, దక్షిణ కొరియా, వియత్నాం పర్యటించారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లు అమెరికా అధ్యక్షులు మన ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాదిరి ఏదో ఒక సాకుతో విదేశీ పర్యటనలు చేయరు. రాజకీయ, ఆర్ధిక, మిలిటరీ వంటి అనేక అంశాలుంటాయి. అయితే ఈ పర్యటనలో సాధించినదాని కంటే పొగొట్టుకున్న పరువే ఎక్కువగా వుందని చెప్పవచ్చు.

ఆతిధ్యం ఇచ్చేవారు పెట్టింది తిని, మర్యాదలను స్వీకరించటం సంస్కారం. కొంత మంది మా పిల్లలు అది తినరు తినరు అనిముందే చెప్పి ఇబ్బంది పెడతారు. అలవాటైన ఆహారం తప్ప కొత్తదానిని రుచిచూసేందుకు ఇచ్చగించని తరహా మనిషి ట్రంప్‌. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జపాన్‌ వచ్చిన ట్రంప్‌ అక్కడ వడ్డించిన చేపను చూసి అది వద్దంటూ బర్గర్‌ కావాలని మరీ మారాం చేసి తెప్పించుకుతిన్నాడంటూ ఈ సందర్భంగా వార్తలు వచ్చాయంటేనేే ట్రంప్‌కు పెద్ద అవమానం. ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాల వారు వడ్డించిందా లేక మరేం తింటారు అంటూ ఐరోపా, జపాన్‌ మీడియాలో కథనాలు రాశాయి. మా వృద్ధ ట్రంప్‌ బర్గర్‌ తప్ప మరొకటి తినడు అని అధికారులుప్పందించారేమో జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన ప్రారంభంలోనే వారి సాంప్రదాయ వంటకాల బదులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న బీఫ్‌తో తయారు చేసిన బర్గర్‌నే మధ్యాహ్న విందుగా వడ్డించే ఏర్పాటు చేయాల్సి వచ్చిందట.

ట్రంప్‌ అభిరుచులు, అలవాట్లు వ్యక్తిగతం. గొడ్డు, పంది మాంసంతో తయారు చేసే హాంబర్గర్‌లు ఎన్ని తిన్నా ప్రపంచానికేమీ ఇబ్బంది లేదు. ఆ పెద్దమనిషి పర్యటనలో ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ వారు పెట్టింది తినకపోవటం, దక్షిణ కొరియాలో పెట్టింది తినటం రెండూ వివాదాస్పదం కావటం విశేషం. జపాన్‌-దక్షిణ కొరియాల మధ్య వివాదాస్పదంగా వున్న దీవుల జలాల నుంచి తెప్పించిన రొయ్యలతో సహా దక్షిణ కొరియా వంటకాలు వడ్డించటం, వాటిని లట్టలు వేసుకుంటూ ట్రంప్‌ తినటం అంటే ఆ దీవులపై దక్షిణ కొరియా హక్కును అమెరికా గుర్తించినట్లే, ఇది జపాన్‌ వ్యతిరేకమైనది అని జపాన్‌ మీడియా వ్యాఖ్యానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కొరియాను ఆక్రమించిన జపాన్‌ తన సైనికుల కోసం దక్షిణ కొరియా యువతులను చెరపట్టి అప్పగించారు. అలాంటి వారిలో ఒకరైన 88 సంవత్సరాల లీ యాంగ్‌ సూ ట్రంప్‌ విందు ఆహ్వానితుల జాబితాలో ఒకరుగా ప్రకటించటం తమను నేరగాళ్లుగా పరిగణించటమే అని జపనీస్‌ ప్రభుత్వం భావించింది. దౌత్య పద్దతులలో అమెరికాకు ఆ మేరకు నిరసన తెలిపినట్లు, వుత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా పని చేస్తున్న తరుణంలో ఇలాంటి పనులు తగవని పేర్కొన్నట్లు వెల్లడైంది. మీరు మా ఇంటికొచ్చినా, మేం మీ ఇంటికొచ్చినా మాకు కావాల్సిందే తేవాలి, పెట్టాలి అనే అమెరికా సామ్రాజ్యవాదంతోనే అసలు సమస్య. అందువలన ట్రంప్‌కు ఏం పెట్టారు, ఏ తిన్నారు అనేది కూడా రాజకీయాలు, ఆర్ధికాంశాలతో ముడి పడి వుంటాన్నాయన్నది గమనించాల్సి వుంది.

డెమోక్రటిక్‌ పార్టీ అధినేత బరాక్‌ ఒబామా హయాంలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం ట్రంప్‌, తరువాత ఎందరు అధ్యక్షులు వచ్చిం తరువాత పరిష్కారం అవుతుందో వారికే తెలియని స్ధితి.రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం మాదిరి ప్రపంచ మార్కెట్‌ను చాపచుట్టినట్లుగా తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పరిస్ధితి పీకసన్నం-బానకడుపులా వుంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా వుంటాయో జోస్యం చెప్పలేము గాని, గతం మాదిరి ఏకఛత్రాధిపత్యం వహించటం సాధ్యం కాని పరిస్థితి నేడు నెలకొంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర మాత్రం కాదన్నట్లు సామ్రాజ్యవాదులు మొత్తంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు, దేశాలకు వ్యతిరేకత విషయంలో ఐక్యంగా వుంటున్నారు, ప్రపంచ మార్కెట్‌ను పంచుకోవటంలో విబేధాలను దాచుకోవటం లేదు.

ఐదు ఆసియా దేశాల పర్యటనలో తొలి పాదం మోపిన జపాన్‌లో ప్రధాని షింజో అబేతో గోల్ఫ్‌ ఆడటానికి వెళ్లబోయే ముందు యోకోటా వైమానికస్ధావరంలో అమెరికన్‌ సైనికులతో మాట్లాడారు. పరోక్షంగా వుత్తర కొరియాను వుద్దేశించి మాట్లాడుతూ అమెరికా సంకల్పాన్ని ఎవ్వరూ, ఏ నియంత, ఏ ప్రభుత్వమైనా తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరికలు జారీ చేశాడు. గతంలో తమను తక్కువ అంచనా వేసిన ఎవరికీ అది సంతోషకరంగా లేదు, మేము లంగలేదు, ఎలాంటి సడలింపులు లేవు అన్నాడు. తరువాత దక్షిణ కొరియా పార్లమెంట్‌ సభ్యుల నుద్ధేశించి మాట్లాడుతూ ట్రంప్‌ ఇదే మాదిరి హెచ్చరికలు జారీ చేయటమే కాదు, అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి తయారీ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే మిలిటరీ చర్య తీసుకుంటామని సోషలిస్టు కొరియాపై బెదిరింపులకు దిగాడు.

రాజధాని టోకియోలో వుభయ దేశాల వాణిజ్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ జపాన్‌ అక్రమ వ్యాపార పద్దతులను అనుసరిస్తోందని ట్రంప్‌ విమర్శలు గుప్పించాడు.’ గత కొన్ని దశాబ్దాలుగా జపాన్‌ విజయం సాధిస్తోందని మీరు తెలుసుకోవాలి, ప్రస్తుతం జపాన్‌తో మా వ్యాపారం న్యాయబద్దంగా లేదు, మాకు మార్కెట్‌ను తెరవలేదు. మీరు ఇక్కడి నుంచి కార్లను షిప్పుల్లో రవాణా చేయటం కాదు, అమెరికాలో తయారు చేసేందుకు ప్రయత్నించండి, అలా అడగటం మొరటుగా వుందా’ అని ప్రశ్నించాడు. చైనా తరువాత అమెరికన్ల వాణిజ్యలోటు కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతుల కారణంగా జపాన్‌తోనే ఎక్కువగా వుంది. రాజకీయంగా అమెరికాతో వున్న బంధం కారణంగా జపాన్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజానికి రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య విబేధాలు కొత్తవి కాదు. అమెరికాలో అమ్ముడౌతున్న జపాన్‌ బ్రాండ్‌ కార్లలలో 75శాతం అమెరికాలోనే తయారు చేస్తున్నామని కార్ల తయారీ వాణిజ్య సంస్ధల అసోసియేషన్‌ తెలిపింది. పసిఫిక్‌ సముద్ర ప్రాంత దేశాల స్వేచ్చా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్‌ నిర్ణయించారు, కొనసాగాలని జపాన్‌ కోరుతోంది. రెండు దేశాల మధ్య పన్నుల విషయంలో విబేధాలు ఎడతెగటం లేదు. అమెరికన్‌ కార్ల అమ్మకాలపై జపాన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని, ఘనీభవింపచేసిన గొడ్డు మాంసం, వ్యవసాయ వుత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

గతేడాది అమెరికా ఎన్నికల ప్రచారంలో చైనా శత్రువు అని చెప్పిన ట్రంప్‌ చైనా పర్యటనలో పొగడ్తలు కురిపించాడు. గ్రేట్‌ హాల్‌లో మాట్లాడుతూ రెండు పెద్ద దేశాల మధ్య పెద్ద వాణిజ్యంలో తమకు న్యాయం జరగలేదని అయితే దానికిి చైనా తప్పేమీ లేదని, తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పర్యటన సందర్భంగా 25వేల కోట్ల డాలర్ల మేరకు ఆర్ధికలావాదేవీలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్‌ పర్యటన లేకపోయినా రెండు దేశాల మధ్య అది జరిగి వుండేదని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

చైనాతో వాణిజ్యం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసియా పర్యటనలో ఇంతవరకు చేసిన పెద్ద తప్పిదం, సిగ్గు చేటు, అమెరికా, ఆ ప్రాంత కార్మికులకు ఇది భయంకర వర్తమానం, డెమోక్రాట్లకు ఇది మాంస విందు అవుతుంది అని అమెరికాలోని చైనా అధ్యయనాల సంస్ధ నిపుణుడు ఎలీ రాట్నర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో వాణిజ్యలోటుకు తమ గతపాలకులదే బాధ్యత అని చైనాలో చెప్పిన ట్రంప్‌ తరువాత అపెక్‌ సమావేశంలో నాలుకను మరోవైపు తిప్పాడు.చైనా పేరు ప్రస్తావించకుండా ఈ ప్రాంత దేశాలు అనుచిత వ్యాపార పద్దతులు అనుసరిస్తున్నాయని, ఇక ముందు తమతో అలా కుదరదు అన్నాడు. దుర్విధి అనే నరకంలో పడకుండా తప్పించేందుకు అమెరికన్లు మతి తప్పిన ముసలి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని తమపై చేసిన వ్యాఖ్యలపై వుత్తర కొరియా వ్యాఖ్యానించింది. ఈ పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు నిజంగానే దాన్ని నిర్ధారిస్తున్నాయి. వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ కొవ్వుబలిసిన పొట్టోడంటూ అవమానకరవ్యాఖ్యలు చేసిన నోటితోనే కొద్ది గంటల తరువాత భవిష్యత్‌లో ఇరువురం స్నేహితులుగా వుండవచ్చు అన్నాడు. వియత్నాంలో మానవహక్కులకు భంగం కలిగిస్తున్నారని దుమ్మెత్తి పోసిన ట్రంప్‌ తాజా పర్యటనలో ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో వియత్నాం ఒకటి అని పేర్కొన్నాడు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకోలేదని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను అని గతంలో చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చాడు. రిపబ్లికన్‌ పార్టీకి(ట్రంప్‌కు) అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారని సిఐఏ నివేదించిన విషయం తెలిసిందే. అమెరికా గూఢచార, దర్యాప్తు సంస్ధల నివేదికలను నేను విశ్వసిస్తానా లేదా అన్నది సమస్యకాదు, వాటికినేను కట్టుబడి వున్నాను, ప్రత్యేకించి ప్రస్తుతం పని చేస్తున్న సంస్ధలు మంచివారిని కలిగి వున్నాయి అని చెప్పాడు. ట్రంప్‌ పర్యటన అన్నింటిలో అమెరికాకు ప్రధమ స్ధానం అన్నలక్ష్యంతో సాగిందా లేక ఆ స్ధానంలో చైనాను ప్రవేశ పెట్టేందుకు వచ్చారా అన్నది అర్ధం కావటం లేదన్న వ్యాఖ్య కూడా వెలువడింది.ఆసియా పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అనేక మంది పరిశీలకులు తలలు పట్టుకుంటున్నారు.అనేక మందికి ఆశించిన కిక్కు రాలేదు. తన తీరుతెన్నులను తప్పుపడితే ట్రంప్‌కు కోపం, పొగిడితే జనాల్లో పలుచన. కార్పొరేట్‌ మీడియాకు ఇరకాటమే మరి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మాస్కోలో వైఫల్యం-బీజింగ్‌లో విజయం !

14 Tuesday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, china communist party, communist, Donald trump, Socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-4

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడవ తేదీ సందర్భంగా వంద సంవత్సరాల బోల్షివిక్‌ విప్లవం గురించి ముందుగానే మొదలైన చర్చ తరువాత కూడా ప్రపంచ మీడియాలో సాగుతోంది. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా బోల్షివిక్‌ విప్లవం గురించి వెలువడే వ్యతిరేక,సానుకూల అంశాలన్నింటిపై మధనం జరగవలసిందే. పాత, కొత్త తరాలు వాటి మంచి చెడ్డలను గ్రహించాలి. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ విధానాలదే పైచేయిగా వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తమ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి దిక్కు తోచటం లేదు. మొత్తంగా చూసినపుడు సోషలిస్టు దేశాలు-పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు తమ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో వాటి మధ్య విబేధాలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలోకి రాక ముందు 1949 నుంచి 1994 వరకు ఏడు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందాలు జరిగాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు 16సంవత్సరాలు గడిచినా కొనసాగుతూనే వున్నాయి. సాగదీతలో ఇప్పటికి ఇదే ఒక రికార్డు అయితే ఇంకెంతకాలానికి ఒప్పందం కుదురుతుందో తెలియదు. అమెరికా-ఐరోపాయూనియన్‌ల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణం. ఎవరిదారి వారు చూసుకొనే క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషలిస్టు దేశాలను ఒకవైపు దెబ్బతీయాలని చూస్తూనే మరోవైపు వాటితో సఖ్యతగా వుండే ద్వంద్వ వైఖరిని ధనిక దేశాలు అనుసరిస్తున్నాయి. రెండో వెసులుబాటు గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు వుండేది కాదు.

ఒక సైద్ధాంతిక ప్రత్యర్ధిగా భావించే చైనాను ఎదుర్కొనే క్రమంలో ప్రజాస్వామిక దేశాలు తమ వైఫల్యాలను గుర్తించాల్సి వుందని ఐరిష్‌ టైమ్స్‌ వాఖ్యాత మార్టిన్‌ వూల్ఫ్‌ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యాన సారాంశం ఇలా వుంది. నాటి రష్యానేతల కంటే చైనా గ్జీ మరింత జాగ్రత్తగా వున్నారు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నూతన యుగంలోకి ప్రవేశించిందని ఎంతో ధృడంగా చెప్పారు. తమ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకొనే ఇతర దేశాలకు చైనా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. లెనినిస్టు రాజకీయ వ్యవస్ధ చరిత్ర అవశేషాలనుంచి వుద్భవించింది కాదు, ఇంకా అదొక నమూనాగా వుంది. సోవియట్‌ పారిశ్రామికీకరణ నాజీ సైన్యాలను ఓడించటానికి తోడ్పడింది. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ, ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అదే పెద్ద అసాధారణ రాజకీయ పరిణామం. ఇదిలా వుండగా అత్యంత ముఖ్యమైన ఆర్ధిక పరిణామం దారిద్య్రం నుంచి మధ్యతరగతి ఆర్ధిక స్ధాయికి చైనా ఎదుగుదల. అందుకే గ్జీ చైనాను ఒక నమూనాగా చెప్పగలుగుతున్నారు. మాస్కోలో విఫలమైన వ్యవస్ధ బీజింగ్‌లో ఎలా విజయవంతం అయిందన్నది ఇంకా తెలియాల్సి వుంది. రెండింటికి మధ్య వున్న పెద్ద తేడా ఏమంటే మావో తరువాత లెనినిస్టు రాజకీయ వ్యవస్ధను అట్టేపెట్టిన డెంగ్‌ సియావో పింగ్‌ సూక్ష్మబుద్ధితో కూడిన నిర్ణయాలు. అన్నింటికీ మించి ఆర్ధిక వ్యవస్ధను బయటివారికి తెరుస్తూనేే పార్టీ ఆధిపత్యపాత్రను కొనసాగించటం. చైనీయులు వర్ణించే జూన్‌ నాలుగవ తేదీ సంఘటన,పశ్చిమ దేశాలు 1989 మారణకాండగా పిలిచిన వుదంతం సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అదుపు గురించి ఎంత పట్టుదలగా వున్నారో తెలియచేశాయి. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎన్నడూ తడబడలేదు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.

Image result for 1991 soviet coup,lenin statue

సోవియట్‌ యూనియన్‌ కూడా అటువంటి బాటనే అనుసరించి వుండాల్సింది అనే చర్చ ప్రారంభమై వుండాల్సింది కానీ జరగలేదు. దీని ఫలితంగా శతాబ్దం క్రితం జరిగిన అక్టోబరు విప్లవాన్ని ఎలా గుర్తించాలి అనేది నేటి రష్యాకు తెలియకుండా పోయింది. లెనినిజం, మార్కెట్‌తో చైనా బంధపు పర్యవసానాలేమిటి? చైనా నిజంగానే పశ్చిమ దేశాల నుంచి ఆర్ధికశాస్త్రాన్ని నేర్చుకుంది.అయితే ఆధునిక పశ్చిమదేశాల రాజకీయాలను తిరస్కరించింది.చైనా అభివృద్ధి చెందే కొద్దీ లెనినిస్టు రాజకీయాలు, మార్కెట్‌ అర్ధికవిధానాల జమిలి వైఖరి పని చేస్తుందా? అంటే మనకు తెలియదనే సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్ధ ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేసింది. దీర్ఘకాలంలో పార్టీ మీద ఒక వ్యక్తి ఆధిపత్యం, చైనా మీద ఒక పార్టీ ఆధిపత్యం నిలబడదు. ఇదంతా దీర్ఘకాలంలో జరిగేది, తక్షణ స్ధితి సుస్పష్టం. ఏక వ్యక్తి నియంత్రించే లెనినిస్టు నిరంకుశపాలనలో చైనా ఒక ఆర్ధిక అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఎదుగుతున్న ఈశక్తి మిగతా ప్రపంచమంతా శాంతియుతంగా సహకరించటం తప్ప మరొక అవకాశం లేదు. వుదారవాద ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారందరూ ఆర్ధిక చైనాను మాత్రమే కాదు ప్రముఖ సైద్ధాంతిక ప్రత్యర్ధిగా కూడా గుర్తించాల్సిన అవసరం వుంది.ఒకటి, నిష్కారణంగా చైనాతో ప్రతికూల సంబంధాలను పెంచుకోకుండా పశ్చిమ దేశాలు తమ సాంకేతిక, అర్ధిక వున్నతిని కొనసాగించాలి. చైనా మన వ్యాపార భాగస్వామే తప్ప స్నేహితురాలు కాదు. రెండవది ఎంతో ముఖ్యమైనది, ఈరోజు మాదిరి దుర్బలంగా వున్న పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కాకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ ఆర్ధిక యాజమాన్యం మరియు రాజకీయాలు సంతృప్తికరంగా లేవన్న వాస్తవాన్ని గుర్తించి, నేర్చుకోవాలి. పశ్చిమ దేశాలు తమ ద్రవ్యవ్యవస్ధను ఎటూ కదలని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే విధంగా వదలివేశాయి.తమ భవిష్యత్‌కు చేసే ఖర్చు విషయంలో గుచ్చి గుచ్చి వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్ధికవిజేతలు-పరాజితుల మధ్య ప్రమాదకరమైన అఘాతం పెరగటాన్ని అమెరికా అనుమతించింది. తన రాజకీయాలలో అబద్దాలు, విద్వేషానికి తావిచ్చింది.

ఇంకా మరికొన్ని విషయాలు తన విశ్లేషణలో పేర్కొన్న మార్టిన్‌ వూల్ప్‌ కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి కలిగినవాడేమీ కాదు. చైనా సోషలిజం కూలిపోతుందని జోస్యం చెప్పాడు. విధిలేని పరిస్ధితుల్లో అవకాశం వచ్చేంత వరకు చైనాతో మంచిగా వుండి సమయంరాగానే దెబ్బతీయాలని పరోక్షంగా సూచించాడు. చైనా వ్యాపార భాగస్వామి తప్ప స్నేహితురాలు కాదనటంలో అంతరంగమిదే. సంక్షోభాన్నుంచి బయటపడేందుకు,లాభాల కోసం పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు దేశాలతో సఖ్యంగా వుండటం అన్నది 1980 దశకం తరువాతి ముఖ్యపరిణామం. అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలన్నీ గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమిదే.

తాజా తొలి ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా, వియత్నాంల అభివృద్ధి గురించి పొగిడారు.చైనాతో వాణిజ్యలోటుకు తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు.మార్టిన్‌ చెప్పినట్లు ఆర్ధిక అవసరాల కోసం అలా చెప్పాడు తప్ప సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేక చర్యతోనే ఆ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టటం ట్రంప్‌ వర్గనైజం. బోల్షివిక్‌ విప్లవానికి వందేండ్ల సందర్భంగా నవంబరు ఏడును ‘కమ్యూనిజం బాధితుల జాతీయ దినం ‘గా ప్రకటించి మరీ వచ్చాడు. వాస్తవానికి రోసెన్‌బర్గ్‌ దంపతులను వురితీయటంతో సహా అనేక మందిని వెంటాడి వేధించిన దుష్ట చరిత్ర వారిదే.కమ్యూనిజం గతించిందని, దానిని పాతిపెట్టామని, అంతిమ విజయం సాధించామని చెప్పుకున్న పాతికేండ్ల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఇంకా భయపడుతున్నాయి.పోరులో ఒక రంగంలో ఓడిపోవచ్చు, అంతమాత్రాన యుద్ధం ఓడిపోయినట్లు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ అనేక రంగాలలో విజేతగా వున్నాడు, సోవియట్‌ గడ్డపై జరిగిన నిర్ణయాత్మకపోరులో కమ్యూనిస్టుల చేతిలో ఓటమిపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా బోల్షివిక్‌ విప్లవాన్ని వమ్ముచేసినంత మాత్రాన దోపిడీ వర్గం అంతిమ విజయం సాధించినట్లు సంబరపడితే అది కార్మికవర్గాన్ని మరింతగా కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది.

అక్టోబరు విప్లవం జయప్రదం అయిన తరువాత సోవియట్‌ను దెబ్బతీయటానికి పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. అంతర్గతంగా సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే శక్తుల విచ్చిన్న కార్యకలాపాలకు తోడు, బయట రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేవరకు ఇరుగుపొరుగు దేశాలతో సోవియట్‌ సంబంధాలు సజావుగా లేవు. ఏడు సంవత్సరాల తరువాత 1924లో మాత్రమే బ్రిటన్‌ సోషలిస్టు రష్యాను గుర్తించింది. ప్రతి దేశంతో ఏదో ఒక సమస్య, సహాయ నిరాకరణ. వీటన్నింటినీ తట్టుకొని స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ బలపడింది.

సోషలిస్టు చైనాకు సైతం పాతిక సంవత్సరాల పాటు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో గుర్తించకుండా అడ్డుకున్నారు. ఇటువంటి స్ధితి చరిత్రలో మరేదేశానికీ వచ్చి వుండదు. మార్టిన్‌ పేర్కొన్నట్లు చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన పట్టును పెంచుకున్న తరువాత డెంగ్‌ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర రాజకీయ నిర్ణయాలు నేటి చైనా అవతరణకు దోహదం చేశాయి. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను కూలదోసేందుకు జరిగిన ప్రయత్నాన్ని నిర్ణయాత్మకంగా ఎదుర్కొనటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర,దానికి జనామోదం లభించటానికి ఎంతో ముందు చూపుతో డెంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ప్రారంభించిన సంస్కరణలతో తమ జీవితాలు మెరుగుపడుతున్నాయని జనం గ్రహించటం కూడా ఒక ప్రధానకారణం.చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోని ప్రజా మిలిటరీ తియన్మెన్‌ స్క్వేర్‌ కుట్రను మొగ్గలోనే తుంచి వేసింది. బహుశా దానిని గమనించే అమెరికా, ఇతరసామ్రాజ్యవాదులు సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలో కుట్రను ముందుకు, మరింత వేగంగా అమలు జరిపినట్లు కనిపిస్తోంది.తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రదర్శనలుగా ప్రపంచానికి తెలిసిన ఘటనలు 1989 ఏప్రిల్‌ 15న ప్రారంభమై జూన్‌ నాలుగు వరకు జరిగాయి. తూర్పు ఐరోపాలో అదే ఏడాది నవంబరులో తూర్పు జర్మనీలో, తరువాత సోవియట్‌లో మొదలయ్యాయి. దానిని గుర్తించి అక్కడి కమ్యూనిస్టుపార్టీలు చైనా పార్టీ మాదిరి తమ పాత్రలను మలుచుకొని వుంటే చరిత్ర మరోవిధంగా వుండేది. !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నూటఅరవై కోట్ల మందిని బలితీసుకున్న పెట్టుబడిదారీ విధానం !

07 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, CAPITALISM, communist, mass murdering evil of capitalism, Nazism, revolution

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-3

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు విప్లవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన జాతీయ, ప్రాంతీయ మీడియాతో పోల్చితే పశ్చిమదేశాల మీడియాలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. తరువాత కూడా అది ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ధనిక దేశాలలో పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో పెట్టుబడిదారీ పండితులకు అంతుబట్టటం లేదు. దాదాపు ప్రతి దేశంలోనూ ఒకసారి ఎన్నికైన పార్టీ వెంటనే రెండోసారి అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. పాలకపార్టీల పేర్లు, కొన్ని అంశాలపై భిన్న వైఖరులు కలిగి వుండటం తప్ప అనుసరిస్తున్న విధానాలన్నీ ఒకే విధంగా వుంటున్నాయి. పళ్లూడగొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా జనం మీద భారాలు మోపటానికి, సంక్షేమ పధకాలకు కోత పెట్టటంలో ఏ పార్టీ అయినా ఒకే విధంగా వ్యవహరించటమే దీనికి కారణం.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో పెల్లుబికిన కమ్యూనిస్టు వుద్యమంపై మొదటి, రెండవ సాదారణ ఎన్నికల సందర్భంగా నాటి మీడియా ఎంత తప్పుడు ప్రచారం చేసిందో పాత తరాలకు, చరిత్ర కారులకు తెలిసిందే.అయితే పశ్చిమ దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతూనే వుంది. దాని కొనసాగింపుగానే వందేండ్ల బోల్షివిక్‌ విప్లవం గురించి ఇప్పుడు కూడా చెడరాసిపారేస్తున్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల మానస పుత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక నవంబరు ఆరున వంద సంవత్సరాల కమ్యూనిజంలో వందమిలియన్ల మంది హత్య అంటూ ఒక శీర్షికతో ఒక వార్త, అంతకు మూడు రోజుల ముందు కమ్యూనిజపు రక్త శతాబ్దం పేరుతో మరొక వార్తను ప్రచురించింది. ఇంకా అనేక పత్రికలు గతంలో కూడా ఆ సమాచారాన్నే అటూ ఇటూ మార్చి గత కొద్ది సంవత్సరాలుగా పాఠకుల మీద రుద్దుతున్నాయి. వాటిని జనం పూర్తిగా నమ్మటం లేదని అక్టోబరులో అమెరికాకు చెందిన కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ విడుదల చేసిన ఒక సర్వేలో పేర్కొన్న విషయం తెలిసిందే.(అమెరికాలో అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్టులను వేటాడి వేధించింది తప్ప కమ్యూనిస్టుల బాధితులు లేకపోయినా ఆ పేరుతో ఒక సంస్ధ ఏర్పాటు చేయటమే విడ్డూరం) ఈ ప్రచారం ఎంత హాస్యాస్పదం అంటే రష్యా, చైనాలలో సంభవించిన కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారిని కూడా కమ్యూనిస్టులే చంపివేశారని చెబుతారు. అంతకంటే అత్యంత దుర్మార్గమైన ప్రచారం ఏమంటే ఫాసిస్టులు-నాజీలు, వారి పీచమణిచి ప్రపంచాన్ని రక్షించిన కమ్యూనిస్టులను ఒకేగాట కట్టి జనాన్ని చంపటంలో కమ్యూనిస్టులకు, ఫాసిస్టులకు తేడా లేదు. ఇద్దరూ మారణహోమానికి పాల్పడ్డారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా మొత్తంగా సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, వారికి వూడిగం చేసే వారి చేతుల్లో వుంది కనుక గోబెల్స్‌ మాదిరి పదే పదే ప్రచారం చేసి అనేక మంది బుర్రలను కలుషితం చేస్తున్నారు.

నరహంతకులు ధరాధిపతులైనారన్నట్లు లాభాల కోసం పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రపంచంలో మానవాళిపై జరిపినన్ని దుర్మార్గాలు మరొకరు జరపలేదు. మానవత్వాన్నే పరిహసించారు. వారు హరించిన మానవ హక్కులకు అంతేలేదు. పెట్టుబడిదారీ విధానం, దానిని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న పాలకులు జరిపిన దాడులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనాన్ని గాలికి వదలి వేయటం వంటి బాధ్యతా రాహిత్యం వంటి సకల అనర్ధాలు వలన పెట్టుబడిదారీ విధానం నూట అరవై కోట్ల మందికిపైగా జనాల మరణాలకు కారణమైందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.https://prolecenter.wordpress.com/2017/08/21/1-6-billion-killed-by-capitalism/ కమ్యూనిస్టుల పాలనలో కరువులలో మరణించినా అందుకు వారే బాధ్యులంటున్న వారు ఆ ప్రాతిపదికను మిగతావారికి ఎందుకు వర్తింప చేయరు?

బ్రిటీష్‌ వారి ఆక్రమణ సమయంలో మన దేశంలో సంభవించిన బెంగాల్‌ కరవులో కోటి మంది, అంతకు ముందు సంభవించిన వాటిలో మూడు కోట్ల మంది మరణించారు. మన దేశాన్ని బ్రిటీష్‌ వారు ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధాలు, దాడులు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరో రెండు కోట్లు. ఇక ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు ఐరోపా ధనిక దేశాలు ఐరోపా ఖండంలో, ఇతర ఖండాలలో జరిపిన యుద్ధాలు, వాటిలో చిందిన రక్తం, పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరిది? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం, కంపూచియా, లావోస్‌లతో కూడిన ఇండో చైనా ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు జపాన్‌,ఫ్రాన్స్‌, అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన లేదా గాయపడిన వారు దాదాపు కోటి మంది వున్నారు. మారణాయుధాల గుట్టలను వెలికితీసే పేరుతో ఇరాక్‌పై అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు జరిపిన దాడులు, ఆంక్షల కారణంగా మరణించిన లక్షల మంది గురించి తెలిసిందే. ఇక రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకొనే అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఫాసిస్టు, నాజీలు, నియంతలుగా పేరు పడిన జర్మనీ, జపాన్‌,ఇటలీ వారితో చేతులు కలిపిన వారు తప్ప కమ్యూనిస్టులు కాదే. ఆ యుద్ధాలలో జరిగిన ప్రాణ నష్టాలను ఎవరి ఖాతాలో వేయాలి? వియత్నాం యుద్ధంలో అమెరికన్లు ప్రయోగించిన రసాయనిక ఆయుధాల వలన యుద్ధం ముగిసిన నాలుగు దశాబ్దాల తరువాత కూడా అనేక ప్రాంతాలలో పంటలు పండకపోవటం, జనం రోగాల బారిన పడటం చూస్తున్నదే. జపాన్‌పై అమెరికా ప్రయోగించిన అణ్వాయుధ ప్రభావం డెబ్బయి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అనుభవిస్తున్నారు. మ్యూనిజాన్ని అరికట్టేపేరుతో ఇండోనేషియాలో నియంత సుహార్తోను ప్రోత్సహించి దాదాపు పది లక్షల మంది మ్యూనిస్టులు,అభిమానులను హత్య చేయించటంలో అమెరికన్లకు పాత్ర వుందని ఇటీవలే బయటపడిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారీ విధానంలో భాగంగా సంభవించిన ఆర్ధిక సంక్షోభాలలో చితికిపోయిన కుటుంబాలు, మరణాలకు బాధ్యత ఎవరిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు, దారుణాలకు పాల్పడిన దేశాలు, వారిని నడిపించిన పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం మాటేమిటి?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: