• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: January 2018

చైనాలో ఏం జరుగుతోంది, ఎందుకలా ?

31 Wednesday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

chinese communist party, Communist Party Groups, foreign companies in China, Xi Jinping

Image result for communist party vangaurd in china companeis

ఎం కోటేశ్వరరావు

చైనాలో ఏం జరిగినా అది కమ్యూనిస్టులకు, పెట్టుబడిదారులకూ ఆసక్తికరంగానే వుంటుంది. ఒకే దేశమైనా అక్కడ రెండు వ్యవస్ధలను అనుమతించే విధంగా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం తీసుకుంది. తమకు అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సంస్ధలు, పెట్టుబడులకు అనుమతివ్వాలని 1970దశకం చివరిలోనే చైనా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయించింది. అందువలన ఆ తరువాత రెండు దశాబ్దాలకు బ్రిటీష్‌, పోర్చుగీసువారి కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలోని పెట్టుబడిదారీ వ్యవస్ధను 2050 వరకు కొనసాగనిస్తామని హామీ ఇచ్చింది. హాంకాంగ్‌ అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ద వున్న ప్రాంతాలలో ఒకటి. ఎక్కడి నుంచో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నపుడు తనలో విలీనం అయ్యే ప్రాంతాలలో వారిని తిరస్కరించటంలో అర్ధం వుండదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి తెలిసిందే. కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన వెసులుబాటును అవకాశంగా తీసుకొని ప్రపంచ పెట్టుబడిదారులు విలీన ప్రాంతాలలో శాశ్వతంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగించేందుకు లేదా చైనా నుంచి విడగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. వాటిని ఎదుర్కొంటూనే మరోవైపు చైనా తన దైన పద్దతులలో ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ గతంలోనే ప్రకటించింది.

స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ఇటీవలనే పెట్టుబడిదారీ జలగల వార్షిక జాతర జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి మాదిరిగా బయటిలోకానికి పరిచయం అవుతున్న కెటిఆర్‌ ఆ జాతరకు వెళ్లి వచ్చారు. దేశంలో, తమ రాష్ట్రాలలో లాభాలను పీల్చుకొనేందుకు వున్న అవకాశాల గురించి వివరించి మరీ వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో మారియట్‌ ఇంటర్నేషనల్‌ సిఇఓ ఆర్నె సోరెన్సన్‌ ఒకరు. అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గాయని దానిలో భాగంగానే ఈరోజు అమెరికాను ఆహ్వానించేవారు తగ్గిపోయారని దానికి కారణం డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాడు. చైనాలో పూర్తిగా కమ్యూనిస్టు నిరంకుశత్వం వుందని కూడా ఆరోపించాడు. ప్రత్యక్షంగా ఘర్షణ పడటానికి సిద్దంగా లేనప్పటికీ చైనాను దెబ్బతీసేందుకు సామ్రాజ్యవాదులు చేయన్ని యత్నం లేదు. చైనాలో 300 హోటల్స్‌ నిర్వహిస్తున్న మారియట్‌ కొద్ది వారాల క్రితం ఒక ఇమెయిల్‌ సర్వే జరిపింది. దానిలో టిబెట్‌, హాంకాంగ్‌, మకావో, తైవాన్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం మారియట్‌ మొబైల్‌ ఆప్‌ను, తరువాత దాని వెబ్‌సైట్‌ను పనిచేయకుండా చేసింది. వెంటనే ఇందుకు పాల్పడిన తమ సిబ్బందిపై చర్యతీసుకుంటామని, మరోమారు అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మారియట్‌ క్షమాపణలు చెప్పింది. సదరు ప్రాంతాలు చైనా నుంచి విడిపోవాలని కోరే శక్తులు, లేదా వ్యక్తులకు తమ మద్దతు వుండదని, సమస్య తీవ్రతను గుర్తించామని పేర్కొన్నది.

చైనాలో వ్యాపారం చేస్తూ ఆ దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలో విదేశీ కంపెనీలు ఎలాంటి పాత్ర నిర్వహిస్తాయో ఈ వుదంతం చెప్పకనే చెప్పింది. కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయని, వాటిని ఎలా అదుపు చేయాలో తమకు తెలుసని సంస్కరణలకు ఆద్యుడిగా భావిస్తున్న డెంగ్‌సియావో పింగ్‌ ప్రారంభంలోనే చెప్పిన విషయం తెలిసిందే. చైనాలో విదేశీ కంపెనీలను ఎలా అదుపు చేస్తున్నారనేది సహజంగానే ఆసక్తి కలిగించే అంశం. దీనికి సంబంధించి బహిరంగంగా చైనా చేసిన ప్రకటనలు లేదా విధానాల వివరాలు మనకు అందుబాటులో లేవు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై విదేశీ సంస్ధలు, వ్యక్తులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు కొన్ని సందర్భాలలో రామునితోక పివరుండు అన్నట్లుగా వుంటాయి కనుక యధాతధంగా తీసుకోనవసరం లేదు. అయితే ఆ సమాచారం కొన్ని విషయాలను వెల్లడిస్తున్నది. వాటి మంచి చెడ్డలు, పర్యవసానాలను పక్కన పెట్టి వాటిని చూద్దాం.

చైనా జనజీవితంలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను పెంచటానికి, అగ్రగామిగా వుంచటానికి అక్కడి నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. విదేశీ సంస్ధలకు ద్వారాలు తెరిచిన తరువాత అన్యవర్గ ధోరణులైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పార్టీ , సోషలిస్టు వ్యతిరేక ధోరణులు చైనా సమాజంపై పడకుండా చూసేందుకు అవి అన్నది స్పష్టం. వాషింగ్టన్‌ పోస్టు అనే అమెరికా పత్రిక కొద్ది రోజుల క్రితం విదేశీ కంపెనీలలోకి ప్రవేశించేందుకు, అదుపు చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నది అనే పేరుతో అది ఒక విశ్లేషణ రాసింది. దాని భాష్యాన్ని మనం యధాతధంగా తీసుకోనవసరం లేదు. చైనా సర్కారుతో కలసి సంయుక్త భాగస్వామ్య సంస్ధలను నెలకొల్పిన అమెరికా మరియు ఐరోపా కంపెనీలు వాటిలోని నిర్ణయాత్మక కమిటీలు, ఎగ్జిక్యూటివ్‌లు, వాణిజ్య బృందాలలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఇటీవల చైనా కోరిందన్నది వార్త సారం. చైనాలోని అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు జేమ్స్‌ జిమర్‌మన్‌ ‘ కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం ఇంతవరకు విదేశీ పెట్టుబడులున్న సంస్ధలలోకి పెద్ద ఎత్తున పాకి చొరబడినట్లు కనిపించటం లేదు గాని జరుగుతున్న విషయాలను చూస్తే అదే మార్గంలో పయనిస్తున్నాయి’ అన్నారు. విదేశీ కంపెనీల యాజమాన్య నిర్ణయాలలో పాత్రను కమ్యూనిస్టుపార్టీ కోరటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని, ఇదే సమయలో ఇంటర్నెట్‌పై సెన్సార్‌షిప్‌ విదేశీ కంపెనీలపై ప్రభావితం చేయటానికి నాంది అని, తాను ఆర్ధికంగా బలంగా వున్నందున పశ్చిమ దేశాల వాణిజ్యాన్ని తగ్గించేయవచ్చని చైనా భావిస్తున్నట్లు ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. కంపెనీల నిర్వహణలో మరొక దొంతరను ప్రవేశపెట్టటం సంయుక్త భాగస్వామ్య కంపెనీల స్వతంత్ర నిర్ణయాలు చేసే సామర్ద్యాన్ని దెబ్బతీస్తాయని, పెట్టుబడులకు ఆటంకం అవుతుందని చైనాలోని యూరోపియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే అనేక ఆర్ధిక రంగాలలో సంయుక్త భాగస్వామ్యం వున్న కంపెనీలలో చేరాలని చైనా చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.

ఇంటర్నెట్‌ను విదేశీ కంపెనీలు వినియోగించుకోవాలంటే ‘ చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన ఏడు నిబంధనలకు కట్టుబడి వుంటామని, సోషలిస్టు వ్యవస్ధ, ప్రజాభద్రత, సామాజిక నైతికతను దెబ్బతీయబోమని, దేశ ప్రయోజనాలను వుల్లంఘించబోమని ఒక హమీ పత్రాన్ని ఇవ్వాల్సి వుంటుంది. గతేడాది జూన్‌ నుంచి చైనాలో అమలులోకి వచ్చిన ఇంటర్నెట్‌ భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే తమ వ్యాపార రహస్యాలు, మేథాసంపత్తి బహిర్గతం అవుతాయనే పేరుతో ప్రభుత్వ నియంత్రణను విదేశీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. చైనాలో వున్న అన్ని విదేశీ కంపెనీలలో శాఖలను ఏర్పాటు చేసేవిధంగా కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నదని ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా అనే బ్రిటీష్‌ కంపెనీ తాజాగా ఒక నివేదికను తన కెనడా ఖాతాదారులకు పంపింది.దానిలోని అంశాలపై కెనడా మీడియా వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఆ మేరకు ఆ నివేదికలోని అంశాల సారాంశం ఇలా వుంది.

వ్యాపార, వాణిజ్యాలు స్వతంత్రరంగానికి చెందినవి కాదు. ఇప్పటి వరకు ప్రయివేటు వాణిజ్యాన్ని రాజ్యమే క్రమబద్దీకరించింది తప్ప పార్టీ కాదు, కానీ ఇప్పుడు గ్జీ జింపింగ్‌ వాణిజ్యాన్ని పార్టీ అదుపు చేయాలని కోరుతున్నారు.ముఖ్యంగా టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ల కంపెనీలపై పార్టీ ప్రభావం, అదుపు వుండాలి. విదేశీ కంపెనీలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా వాణిజ్య నిర్ణయాలపై పార్టీ ప్రభావం ఏమిటో తెలుసుకోవటానికి వీలుకలుగుతుంది. మారియట్‌ హోటల్స్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌, మకావోలను వేరే దేశాలుగా పేర్కొనటాన్ని పార్టీ శాఖలే కనుగొన్నాయి. ప్రతి రంగంలోనూ పార్టీ ప్రమేయం వుండాలని గతేడాది జరిగిన పార్టీ మహాసభ చేసిన నిర్ణయానికి అనుగుణంగా వందలాది ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రధాన నిర్ణయాలపై పార్టీ కమిటీలను సంప్రదించే విధంగా మార్గదర్శకాలను సవరించాయి.

ఏ సంస్ధలో అయినా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పార్టీ సభ్యులుంటే అక్కడ పార్టీ విధానం, సూత్రాలు అమలు జరుగుతున్నదీ లేనిదీ వారు చూడాలని పార్టీ నిబంధనావళి పేర్కొంటున్నది. అయితే 1980వ దశకంలో సంస్కరణల కారణంగా దీని అమలును సడలించారు. తరువాత రెండు దశాబ్దాల కాలంలో వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రత్యక్ష నియంత్రణలను సడలించారు. ప్రభుత్వ, పార్టీ అదుపును సవాలు చేసే స్ధితిలో లేని చిన్న ప్రయివేటు, మరియు ప్రభుత్వ రంగ సంస్దలపై కమ్యూనిస్టు పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే 2001లో ప్ర పంచవాణిజ్య సంస్ధలో చేరేందుకు గాను వ్యాపార, వాణిజ్య రంగాలలో వున్నవారిని కూడా పార్టీలో చేరేందుకు అనుమతించారు. ఈ చర్యతో అనేక కొత్త కంపెనీలను ఆశ్రిత పక్షపాతంతో పార్టీలో వున్నవారి బంధువులు, ఆశ్రితులతో ఏర్పాటు చేయించారు. ఆ సమయంలో కేవలం మూడుశాతం ప్రయివేటు కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలున్నాయి.తరువాత కాలంలో చైనా ఆర్ధిక వ్యవస్ధలో ప్రయివేటు కంపెనీలు, వాటిలో కమ్యూనిస్టుపార్టీ శాఖల సంఖ్య కూడా పెరిగింది. 2015 నుంచి ఏర్పాటయిన 36లక్షల ప్రయివేటు సంస్దలలో మెజారిటీ సంస్ధలలో పార్టీ శాఖలున్నాయి. సభ్యులు అనేక కంపెనీలలో అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వుండటం పెరిగింది. టెన్సెంట్‌ అనే ఇంటర్నెట్‌ కంపెనీ సిబ్బందిలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులు 23శాతం అయినప్పటికీ 60శాతం కీలక బాధ్యతలలో వారున్నారు. 2002లో చైనాలోని 17శాతం విదేశీ కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలుంటే అక్కడున్న ఏడున్నర లక్షల విదేశీ కంపెనీలలో 70శాతంలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు.

చైనా మాదిరే మన దేశం కూడా సంస్కరణలకు తెరతీస్తే ఇక్కడి కమ్యూనిస్టులు అక్కడ బలపరుస్తూ ఇక్కడ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించటం తెలిసిందే. చైనాలో ప్రయివేటు కంపెనీలను విచ్చలవిడిగా అనుమతించిన తరువాత అది సోషలిజం ఎలా అవుతుందని కమ్యూనిస్టు అభిమానుల్లో సందేహాలు వున్నాయి. అందువలన అక్కడ జరుగుతున్న తీరుతెన్నులను రేఖా మాత్రంగా తెలిపే ఈ సమాచారం సోషలిస్టు వ్యవస్ధను బలపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గోడకు నిధులు – అక్రమవలసదార్లకు పౌరసత్వం : డోనాల్డ్‌ ట్రంప్‌ !

25 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, Dreamers, Republican party, us government shutdown, US immigration deal

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో శుక్రవారం రాత్రి పన్నెండు గంటల నుంచి అక్కడి ప్రభుత్వం పనిచేయటం ఆగిపోయింది. మూడు రోజుల తరువాత ముగిసింది. దీనికంటే ముఖ్యవిషయం ఏమంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ పెద్దమనిషి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడచిన సందర్భంగా లక్షలాది మంది మహిళలు అమెరికా అంతటా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం మూతపడినందువలన ఎక్కువగా ప్రభావితమయ్యేది మిలిటరీ గనుక తెరిచేందుకు ముందుకు రావాలని మూతకు కారకులైన డెమోక్రాట్లకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. ఏడాది పాలనలో తన ఆర్ధిక విజయం, సంపదల సృష్టికి గాను పండుగ చేసుకొనేందుకు ఈ రోజు ప్రదర్శనలు మహిళలకు ఇది సరైన సమయం అంటూ ట్రంప్‌ వారిని రెచ్చగొట్టే విధంగా మరో ట్వీట్‌ద్వారా వ్యాఖ్యానించాడు. నిజానికి ప్రభుత్వ మూత అనేది పెద్ద్ద ప్రహసనం. డెమోక్రాట్లను బందీలుగా మార్చటంతో మరో మార్గం లేక దిగి వచ్చారని అధ్యక్షుడు ట్రంప్‌ తనదైన శైలిలో మూత ముగిసిన తరువాత ట్వీట్‌ చేశాడు. అధ్యక్షుడు తమతో తెరవెనుక ఒప్పందానికి వచ్చారని డెమోక్రాట్‌ సెనెటర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. వలసదారుల సమస్యలపై తరువాత చర్చ జరిపేందుకు రిపబ్లికన్లు సమ్మతించారు గనుక డెమోక్రాట్లు మూత ఎత్తివేతకు అంగీకరించారని వార్తలు. అయితే అలాంటి చర్చ జరుగుతుందో లేదో హామీ లేదని, డెమోక్రాట్లు దేనిమీదా గట్టిగా నిలబడరని మరోసారి రుజువైందని అనేక విమర్శలు వచ్చాయి. రెండు రోజు తరువాత స్వయంగా ట్రంపే అసలు విషయాన్ని బయటపెట్టారు. అక్రమ వలసదారులను నిరోధించేందుకు మెక్సికో-అమెరికా సరిహద్దులలో నిర్మించతలపెట్టిన గోడ నిర్మాణానికి 25బిలియన్‌ డాలర్ల ఖర్చుకు బడ్జెట్‌లో డెమోక్రాట్లు ఆమోదం తెలిపితే పది పన్నెండు సంవత్సరాల వ్యవధిలో చిన్నవయస్సులో చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని విలేకర్లతో చెప్పారు. ఇది సమస్యను మరోవైపు మళ్లించేయత్నం తప్ప పరిష్కారానికి చిత్తశుద్ది కనిపించటం లేదు.

ప్రపంచంలో ఎక్కడా ఏ రోజూ, ఏక్షణం కూడా ప్రభుత్వ వ్యవస్ధలు మూతపడటం అనేది లేదు. అదొక మిధ్య అంటే అతిశయోక్తి కాదు. ట్రంప్‌ ఒక సామ్రాజ్యవాద ప్రతినిధి కనుక ఆ పెద్దమనిషి నోటి నుంచి ఆ భాషే వెలువడుతుంది. నిజానికి మూతపడిన రోజుల్లో పనికి దూరమైన ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు నష్టపోతారు, ఆమేరకు వారు చేసే ఖర్చు తగ్గుతుంది కనుక ఆమేరకు వ్యాపారలావాదేవీలు, వ్యాపారులకు లాభాలు తగ్గుతాయే తప్ప నష్టపోయేదేమీ వుండదు. సంక్షేమ పధకాలు నిలిచిపోతాయి. వుద్యానవనాలు, మ్యూజియంలు, ఇతర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్శనీయ స్ధలాలు మూతపడిన కారణంగా వచ్చే ఆదాయాన్ని కూడా నష్టంగా లెక్కవేస్తున్నారు. వాయిదా పడిన సేవలు తరువాత అయినా అందించేందుకు వీలుంటుంది కనుక వాటిని నష్టాలుగా చెప్పటం కొంతమేరకు అతిశయోక్తి అవుతుంది.

అసలు అమెరికా ప్రభుత్వం ఎందుకు మూతపడింది ? నాలుగు దశాబ్దాల క్రితం సవరించిన రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్‌లోని వుభయ సభలు నిర్ణీత మెజారిటీ ఓటుతో ఆమోదించాల్సి వుంది. సాధారణంగా మన పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలలో అలాంటి సందర్భాలు వచ్చినపుడు ఓటింగ్‌లో పాల్గనటం గురించి రాజకీయ పక్షాలు అవసరమైతే విప్‌లు జారీ చేస్తాయి. అమెరికాలో అలాంటి ఏర్పాట్ల గురించి, మన మాదిరి అక్కడ కూడా జరిగే అపహాస్యాలు, ప్రహసనాల లోతుల్లోకి పోలేదు కనుక వాటి గురించి పక్కన పెడదాం. పార్లమెంట్‌ ఎగువ సభసెనెట్‌లోని వంద స్ధానాలకు గాను రిపబ్లికన్లకు 51,డెమోక్రాట్లకు 47 మంది, ఇద్దరు స్వతంత్రులు వున్నారు. బడ్జెట్‌ ఆమోదానికి కనీసం 60మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వఖర్చుల ఆమోదానికి శుక్రవారం నాడు (మన ఓట్‌ఆన్‌ అకౌంట్‌ మాదిరి) జరిగిన ఓటింగ్‌లో అనారోగ్యం కారణంగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఒకరు గైర్హాజరు కాగా 50 మంది అనుకూలంగానూ 49 వ్యతిరేకంగానూ ఓటు చేశారు. ఐదుగురు అధికార పక్ష సభ్యులు ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటు చేయగా ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా తమ పార్టీ వైఖరికి విరుద్దంగా ఓటు చేశారు. దాంతో తగిన మద్దతు లేక బిల్లు వీగిపోయింది. నిధుల మంజూరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి నిలిచిపోయింది. దీన్నే ప్రభుత్వ మూత అంటున్నారు. ఒప్పందం కుదిరిన తరువాత జరిగిన ఓటింగ్‌లో సెనెట్‌లో 81-18, దిగువ సభ కాంగ్రెస్‌లో 266-150 మెజారిటీతో ప్రతిష్టంభన ముగిసింది.

బడ్జెట్‌కు వుభయ సభల ఆమోదం, అదుపునకు సంబంధించి దశకలో నిబంధనలు సవరించిన తరువాత 1976 నుంచి ఇలాంటి మూతలు తాజా వుదంతంతో సహా పద్దెనిమిది సార్లు జరిగాయి. ఇవి ముగ్గురు రిపబ్లికన్లు, ముగ్గురు డెమోక్రాట్‌ పార్టీల అధ్యక్షుల హయాంలో జరిగాయి. పదకొండు సార్లు డెమోక్రాట్లు కారణంకాగా ఏడు రిపబ్లిక్‌ పార్టీ ఖాతాలో వున్నాయి. వీటిని స్ధూలంగా పరిశీలించినపుడు అత్యధిక సందర్భాలలో కార్మికవర్గానికి వ్యతిరేకమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చినపుడే జరిగాయని గమనించవచ్చు. రెండు పార్టీలు ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహించుతాయనే విషయంలో ఎలాంటి భ్రమలకు లోనుకానవసరం లేదు. వున్నంతలో ఏది తక్కువ హాని చేసే పార్టీ అని బేరీజు వేసుకొని మెజారిటీ కార్మికవర్గం,వలస కార్మికులు డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారులుగా వుంటున్నందున వారిని నిలబెట్టుకొనేందుకు ఆ పార్టీ రిపబ్లికన్లతో పోల్చితే సంక్షేమ చర్యల గురించి ఎక్కువగా మాట్లాడుతోంది.

తాజా మూత విషయానికి వస్తే బాలలుగా వున్నపుడు అమెరికాకు అక్రమంగా తీసుకువచ్చి వారిచేత తక్కువ వేతనాలకు పని చేయించుకొని ఇప్పుడు పెరిగి పెద్దవారైన తరువాత మార్చినెలలో బయటకు గెంటివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమస్యపై వారి సంక్షేమం కోసం నిధుల కేటాయింపు సక్రమంగా లేదంటూ డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అక్రమంగా వలస వచ్చిన వారి బెదిరింపులకు లంగకూడదంటూ రిపబ్లికన్లు పట్టుబట్టారు. ఈ వివాదంపై రెండు పార్టీల మధ్య రాజీకుదిరి తిరిగి ఓటింగ్‌ జరిపి ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే అప్పుడు ఖర్చులకు నిధులను వినియోగించవచ్చు. అది జరగపోతే ఇటు సూర్యుడు అటు పొడుస్తాడా అంటే అంతసీనేమీ వుండదని గత అనుభవాలు రుజువు చేశాయి. నిజంగా అది ప్రతిబంధకమై ముందుకు పోలేని స్ధితి వుంటే అది పునరావృతం కాకుండా సాధారణ మెజారిటీతో ఆమోదం పొందే విధంగా రెండవ మూత సంభవించకుండానే నిబంధనల సవరణ చేసి వుండేవారు. ప్రతిసారీ అత్యధిక సందర్భాల్లో ఏదో ఒక రాజకీయంలో భాగంగానే జరుగుతోంది. ఇప్పుడు అమెరికాకు వలస వచ్చిన వారి గురించి అధికార ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

1976లో తొలి మూత పడటానికి కారణం రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌( ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ యజమాని). కార్మికులు,విద్య,వైద్యం,సంక్షేమ పధకాలకు గాను 56బిలియన్‌ డాలర్ల మేరకోత విధిస్తూ వీటో జారీచేసినపుడు దానికి వ్యతిరేకంగా అదే ఏడాది అమలులోకి వచ్చిన బడ్జెట్‌ అదుపు చట్టాన్ని వినియోగించుకొని డెమోక్రాట్లు ఖర్చులను అడ్డుకున్నారు. అది ఎన్నికల సంవత్సరం అని గమనించాలి. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన డెమోక్రాట్‌ జిమ్మీకార్టర్‌ 1977లో అధికారానికి వచ్చిన తొలిఏడాదే మూడుసార్లు రిపబిక్లన్లు 12,8,8 రోజుల చొప్పున ప్రభుత్వాన్ని మూతవేయించారు. అబార్షన్లు చేయించుకున్నపుడు వైద్యసాయం చేసేందుకు నిధుల కేటాయిపునుఅ అసలు అబార్షన్లనే వ్యతిరేకించే రిపబ్లికన్లు అడ్డుకున్నారు. అవసరం లేని మిలిటరీ పరికరాల కొనుగోలుకు ప్రతిపాదన చేశారంటూ 37బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కార్టర్‌ వీటో చేయటాన్ని వ్యతిరేకిస్తూ 26 రోజుల పాటు రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు.1979 ఎన్నికల సంవత్సరంలో పార్లమెంటు సభ్యులు మరియు వున్నతాధికారులకు 5.5శాతం వేతనాల పెంపు ప్రతిపాదనను, అబార్షన్లకు నిధులను రిపబ్లికన్లు అడ్డుకొని మరోసారి 11రోజుల పాటు మూతకు కారణమయ్యారు. తరువాత అధికారానికి వచ్చిన రిపబ్లికన్‌ రోనాల్డ్‌ రీగన్‌ తొలి నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో ఆరుసార్లు (మొత్తం 12రోజులు) మూత వేయించి డెమోక్రాట్లు రికార్డు సృష్టించారు. తదుపరి నాలుగు సంవత్సరాల కాలంలో రెండుసార్లు, రెండురోజులు మూతపడవేయించి అత్యధిక మూతల అధ్యక్షుడిగా రికార్డులకెక్కించారు. తరువాత డెమోక్రాట్‌ బిల్‌క్లింటన్‌ హయాంలో మెజారిటీ దిగువసభలోని రిపబ్లికన్ల బిల్లును వీటోను చేయటంతో రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు. ఇది గరిష్టంగా 21రోజులు సాగి అత్యధిక ప్రతిష్టంభనగా నమోదైంది. చివరికి బిల్‌క్లింటనే రాజీపడి ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, పన్నుల పెంపుదల ప్రతిపాదన ఆమోదానికి బాటవేశారు. తరువాత బరాక్‌ ఒబామా హయాంలో పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యబీమా చట్టాన్ని వ్యతిరేకించిన రిపబ్లికన్లు 2013లో 16రోజుల పాటు మూత వేయించారు. ఆ తరువాత తిరిగి మూతపడటం ఇదే ప్రధమం.

వారాంతంలో లేదా వరుసగా సెలవులు వున్నపుడు మూతపడిన సందర్భాలలో పెద్ద ప్రభావం చూపలేదుకనుక కొన్ని అసలు చర్చనీయాంశం కాలేదు, అసలు మూతపడినట్లే కొందరికి తెలియలేదు. ఎక్కువ రోజులు కొనసాగితే ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు పని లేకుండా ఇళ్లకు పోవటం లేదా తరువాత వేతనాలు తీసుకొనే ప్రాతిపదికన పని చేయటం ఇలాంటి సందర్భాలలో సర్వసాధారణం. మిలిటరీలో పనిచేసే పౌరవుద్యోగులకు కూడా ఇదే వ ర్తింస్తుంది. మిలిటరీ, గూఢచార, వుగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో వున్న సిబ్బందికి ఈ మూత వర్తించదు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది వుండదు. అయితే ఈ సారి మిలిటరీ సిబ్బందికోసం ప్రసారాలు చేసే టీవీ నెట్‌వర్కు మూతపడినందున తమకు ఇబ్బంది కలిగిందని స్వదేశంలోనూ, విదేశాల్లో వున్న మిలిటరీ సిబ్బంది విమర్శలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.కొన్ని కవాతులు, మిలిటరీలోకి తీసుకోవటం కొన్ని కార్యక్రమాలకు పరిమితంగా ఆటంకం కలుగుతుంది తప్ప అమెరికన్లు విదేశాల్లో జరిపే దాడులు, దుండగాలకు, పోలీసు, అత్యవసర సేవలుగా ప్రకటించిన వాటికి మాత్రం ఎలాంటి ఇబ్బంది వుండదు. గత నాలుగు సందర్భాలలో జరిగిన ఇలాంటి పరిణామాలను గమనంలో వుంచుకొనే అనేక తాత్కాలిక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ఒబామా హయాంలో 16రోజుల మూత సమయంలో ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ వుద్యోగులను వేతనాలు లేకుండా ఇళ్లకు పంపివేశారు. అమెరికాలో పనిచేయకపోతే వేతనం ఇచ్చే విధానం లేని విషయం తెలిసినదే. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. అందువలన ముందే చెప్పుకున్నట్లు జరిగే నష్టం కార్మికవర్గానికే.

నిజానికి మూసివేత సమస్యకు మూడు రోజుల వేతనం పోగొట్టుకున్న కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు. ఆంబోతుల పోరులో లేగదూడల మాదిరి నష్టపోయారు. డోనాల్డ్‌ ట్రంపు చెప్పినట్లు అక్రమంగా వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాలంటే 25 బిలియన్ల డాలర్ల బడ్జెట్‌ కేటాయింపు అంటే అది మరోవిధంగా జనంపై భారమే. ట్రంపు ప్రతిపాదిత గోడను డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. అందువలన ప్రభుత్వ మూతను ఎత్తివేసి ఫిబ్రవరి 6వరకు బడ్జెట్‌ ఖర్చుల ఆమోదానికి గాను అధికార ప్రతిపక్షాలకు ఇరువురకూ ఇబ్బంది లేని రీతిలో కుదిరిన రాజీ అని చెప్పవచ్చు. అయితే ఏదన్నా నష్టం జరిగితే రిపబ్లికన్లకే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. గోడ నిర్మాణానికి ఆమోదం తెలపటం అంటే డెమోక్రాట్లకూ ఇబ్బందే. నిజానికి అక్రమవలసదారులతో తక్కువ వేతనానికి పనిచేయించుకున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచే అవసరం అనుకుంటే ఈ మొత్తాన్ని వసూలు చేయాలి. ఎందుకంటే వారి లాభాలకోసమే ఎవరు అధికారంలో వున్న అక్రమవలసలను ప్రోత్సహించిన విషయం జగద్విదితం.

జనవరి 20నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం ఏడాది పూర్తవుతుంది. దానికి ముందుగానే ఇటువంటిదేదో జరగనుందని కొన్ని సూచనలు వెలువడినా ప్రభుత్వ యంత్రాంగం అంత తీవ్రంగా తీసుకోలేదని వార్తలు వెలువడ్డాయి. జరిగిన నష్టం ఎంతో తరువాత వెల్లడి అవుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది 4.1లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.దీనిలో సగానికిపైగా మిలిటరీకి ఇతర సంస్ధలకు కేటాయిస్తారు. మూడోవంతుకు అటూ ఇటూగా వున్న మొత్తానికి మాత్రమే పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి వుంటుంది. డెమోక్రాట్లు సృష్టించిన ఈ మూత, దానికి కారణమైన రిపబ్లికన్ల ప్రతిపాదనలు రెండూ ఈ ఏడాది నవంబరులో జరగనున్న పార్లమెంటు దిగువసభ ఎన్నికల దృష్టితోనే అన్నది గమనించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జీ హుజూర్‌ జర్నలిస్టులు, భజనలో టీవీ ఛానళ్లు !

22 Monday Jan 2018

Posted by raomk in BJP, Current Affairs, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

his master's voice tv channels and journalists, journalism, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

బహుశా ప్రపంచంలో ఏ ప్రధాని లేదా అధ్యక్షుడి ఖాతాలోను గతంలో లేని వర్తమాన, భవిష్యత్‌లో కూడా లేని అరుదైన రికార్డును ఇప్పటికే నరేంద్రమోడీ స్వంతం చేసుకున్నారు. ఇక మిగిలిన పదవీ కాలంలో కూడా ఇదే వూపును కొనసాగిస్తే పదవీ కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా జర్నలిస్టులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించని తొలి దేశాధినేతగా చరిత్రకెక్కనున్నారు. ఆ రహస్యం ఏమిటో, మోడీ ఎందుకంత పంతం పట్టారో ఇంతవరకు ఏ పరిశోధనాత్మక జర్నలిస్టూ కనిపెట్టలేకపోయారు. ఈ మధ్య జీ న్యూస్‌ మరియు టైమ్స్‌ నౌ టీవీ ఛానల్స్‌ వారు ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటి వరకు ఒక జర్నలిస్టుగా ఇంటర్వ్యూలు ఎలా చేయాలో ప్రతి ఒక్కరి నుంచి ఇంకా నేర్చుకుంటూనే వున్నాను. తొలిసారిగా ఎలా చేయకూడదో గతంలో ఆర్నాబ్‌ గోస్వామి, ఇప్పుడు ఈ రెండు ఛానల్స్‌ ప్రతినిధుల నుంచి నేర్చుకోవటం ప్రారంభించాను. రాబోయే రోజుల్లో ఇంకా ఎందరు నూతన మార్గదర్శకులౌతారో చూడాలి.

తానొవ్వక ఇతరుల నొప్పింపక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అన్నట్లుగా సదరు ఛానళ్ల సీనియర్‌ జర్నలిస్టులు ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నలు అడిగిన తీరు చూసియావత్‌ జర్నలిస్టు లోకం నివ్వెరపోతోంది. ఒక పార్టీనేతకు మరొక పార్టీనేత సంధించే ప్రశ్నలు దెబ్బలాడినట్లే వుంటాయి. కానీ ఒక జర్నలిస్టు అవే అంశాలపై సమాధానాలు రాబట్టేందుకు తమ వృత్తి నైపుణ్యాన్ని వినియోగించి అడగటం వేరు. రెండు ప్రముఖ చానల్స్‌ సీనియర్‌ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు లాలూచీ వ్యవహారంగా ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇంటర్వ్యూల ప్రత్యేకత ఏమంటే వారు కొత్త విషయాలనేమీ రాబట్టలేదు. మోడీ చెప్పినవాటిలో కొత్త విషయాలేమీ లేవు. మరి దీని గురించి చెప్పుకోవాల్సినంత ప్రత్యేకత ఏమిటి ?

ఎవరైనా అధికారంలోనో లేక యజమానులుగానో వున్న పెద్దలు ఒక పెద్ద పర్యటన జరిపినపుడో, ఒక సభలో పాల్గొని వచ్చిన తరువాత ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే భక్తజనులు, భజనపరులు ఇతరులతో పోల్చి మీకు వారికి అసలు పోలికే వుండదు, మీరెక్కడ వారెక్కడ మీరు గనుక ఈ పర్యటన చేయగలిగారు అంటూ మునగ చెట్టు ఎక్కిస్తారు. ఈ రెండు ఛానళ్ల విలేకర్లు అలాంటి దృశ్యాలను గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. అధికారంలో వున్నవారితో పాకేజ్‌లు కుదిరితే, లేదా యాజమాన్యాలు ఇతర కారణాలతో పాలకులతో సత్సంబంధాలు కొనసాగించదలచుకుంటే ఎలాంటి ప్రశ్నలు వెలువడుతాయో అవి ఒక్కోసారి ఎంత హాస్యభరితంగా వుంటాయో, జనం ఎదుర్కొంటున్న, ఆవేదన పడుతున్న, అందరికీ తెలిసిన పాలకులకు ఇబ్బంది కలిగించే అంశాలను కార్పొరేట్‌ మీడియా ఎలా విస్మరిస్తుందో తెలుసుకొనేందుకు ఆ ప్రశ్నలు ఎలా వున్నాయో చూడండి. నెతన్యాహు పర్యటన గురించి ప్రస్తావించారు గానీ దేశాన్ని కుదిపివేసిన సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల విమర్శల గురించి ఏ ఛానల్‌ వారికీ అడగాలని తోచకపోవటం విచిత్రం. ఇలాంటి వారు కూడా విలేకర్లుగా వుంటారా అని బయటి వారి ఆలోచనకు తావిచ్చారు. జీ న్యూస్‌ సుధీర్‌ చౌదరి ప్రశ్నలు ఇలా వున్నాయి.
.https://www.youtube.com/watch?v=2sqUgua0npA

1. మీరు ప్రధాని అయిన 2014 ఇప్పుడు 2018 మధ్య మీరు అంతర్జాతీయ సమ్మేళనాలకు వెళ్లినపుడు భారత స్థితి గురించి తేడా ఏమైనా గమనించారా ?

2.దవోస్‌ లేదా సార్క్‌, లేదా జి20 వంటి సమావేశాలను మేము ఇంతకు ముందు చూశాము.అదంతా దౌత్యపరమైన కసరత్తులా వుండేది. మన నేతలు వెళతారు, దౌత్యపరమైన కసరత్తు, ఒక ఫొటో తీయించుకుంటారు. మిమ్మల్ని తీసుకుంటే దాన్ని మీ విమర్శకులు ఇష్టపడరనుకోండి. అది స్నేహబంధంలాగా వుంటుంది. వారిని మీరు హత్తుకుంటారు, వారి భుజాలపై మీరు చేతులు వేసి మాట్లాడతారు, తరువాత ఫొటోలు వుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని జనాలు మీపై దాడికూడా చేస్తారనుకోండి. కాని అది మీ తరహా దౌత్యశైలి, దాంతో మీరు వెంటనే స్నేహితుల్ని చేసుకుంటారు. వుదాహరణకు నెతన్యాహునే చూడండి. మీ ఇద్దరి మధ్య స్నేహాన్ని చూస్తే మేం ఇద్దరు జిగిని దోస్తులం కలసి సినిమా చూసినట్లుగా వుంది. కాబట్టి మీది అనితరసాధ్యమైన దౌత్యశౌలి, ఈ దేశానికి చెందిన వ్యక్తి కాదు, మీ భాష మాట్లాడరు, బహుశా మీరు ఎంతో కాలం నుంచి తెలిసిన వారు కూడా కాదు, అబ్బబ్బ అలాంటి వ్యక్తితో మీరు అంత త్వరగా ఎలా కలసి పోగలిగారు?

3.మీరు అధికారానికి వచ్చిన తరువాత జిడిపి అభివృద్ధి రేటు విషయంలో ఒక నూతన సాంప్రదాయం ప్రారంభించారు. అదెలా ముందుకు పోతోంది. నాకిప్పుడు గుర్తుకు వస్తోంది,అసలు దీనికి ముందు మూడు నాలుగు సంవత్సరాలక్రితం జనానికి జిడిపి అభివృద్ధి రేటు అంటే ఏమిటో కూడా తెలియదు. ఇప్పుడు జనాలు సెన్సెక్స్‌(స్టాక్‌మార్కెట్‌ సూచీ)ను అనుసరిస్తున్న మాదిరి ప్రతి మూడు నెలలకు అది పైకి కిందికీ ఎలా కదులుతోంది అని చూస్తున్నారు. దాని ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు వాగ్దానం చేసిన మాదిరి అది లేనట్లయితే వెంటనే దాడులు ప్రారంభం అవుతాయి, ఇదొక నూతన సాంప్రదాయం కాదా ?

4. ఈ ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేందుకు నేను ఎంతో పరిశోధన చేస్తున్నపుడు ఈ నూతన ప్రపంచ వ్యవస్ధ గురించి ఆలోచిస్తున్నాను. అసలేమిటీ నూతన ప్రపంచ వ్యవస్ధ? దాంతో నేనొక కొత్త విషయాన్ని కనుగొన్నాను. అదేమంటే దాన్ని పిటిఎం-పుతిన్‌ ట్రంప్‌ మోడీ అని పిలవొచ్చు, అదే నూతన ప్రపంచ వ్యవస్ధ.

5.కొన్ని సందర్భాలలో జనాలు పని చేస్తున్నపుడు వారి వుత్సాహాన్ని కోల్పోతారు. మీరు 2014లో ప్రదర్శించినట్లే ఎంతో వుత్సాహం నేడు కూడా వుందా ? ఇది 2018,

6. మీరు సరైన దారిలోనే వున్నారని అనుకుంటున్నారా ?

7.మీరు ఒక పకీరులా (సర్వసంగ పరిత్యాగి) జీవిస్తున్నారు, మిమల్ని మీరు ఒక పకీరుగా పిలుచుకోండి మీ కుటుంబం కూడా ఎంతో పెద్దది, 125కోట్ల జనం. మీరింత వరకు సెలవు తీసుకోలేదు.విదేశాలకు వెళ్లినపుడు మీరు రాత్రిపూటే ప్రయాణం చేస్తారు, కాబట్టి మీరు మధ్యలో ఆగరు, మీరు విమానంలోనే నిద్రపోతారని విన్నాను. మీకీ వయస్సులో అంతశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఇతరులెవరైనా ఈ వయస్సులో దీన్ని కనీసం వూహించలేరు కూడా. ఒక భారత యువకుడు సిగ్గుపడే విధంగా ఈ రోజు మీశక్తి కనిపిస్తోంది.

టైమ్స్‌ నౌ జర్నలిస్టులు రాహులు శివశంకర్‌, నవికా కుమార్‌ ప్రశ్నలు ఇలా వున్నాయి.

http://www.timesnownews.com/india/video/narendra-modi-full-interview-full-transcript-watch-times-now-prime-minister-modi-interview-bharatiya-janata-party-congress-mukt-india-corruption-free/1910491.

1.ప్రధాన మంత్రిగారూ అధికారంలో మూడున్నర సంవత్సరాల తరువాత మీ గతాన్ని ఎలా చూసుకుంటారు. ఎంతో జరిగింది, మీరు మొత్తంగా సాధించినవి ఏమిటి ? మిగిలిపోయినవి ఏమిటి ?

2.గత రెండు దశాబ్దాలలో దవోస్‌ వెళుతున్న ఈ దేశ తొలి ప్రధాని మీరు, మరియు ప్లీనరీలో మీరు మాట్లాడబోతున్నారు. ఏ ప్రధానీ ఇంతకు ముందు ఇలా చేయలేదు, ఎవరూ ప్లీనరీలో మాట్లాడలేదు. గతేడాది ప్లీనరిలో చైనా మాట్లాడింది, ఈ ఏడాది మీరు మాట్లాడబోతున్నారు, మీ ప్రయాణం రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్నది, భారత అభివృద్ధి గాధలో ఏ భాగాన్ని మీరు దవోస్‌ సభ ముందుంచబోతున్నారు.

3.1991నుంచి ఇంతవరకు మన దేశ ఏ ప్రధాన మంత్రీ వేదికమీద ఆశీనులయ్యే అవకాశాన్ని పొందలేదు, ఎందుకిలా జరిగింది?

4. ప్రధాన మంత్రిగారూ మీరు సంపూర్ణ ప్రధాని. ప్రధాన మంత్రిగారూ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞప్తికి తేదలచాను, అది 2017 అక్టోబరు, ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టీన్‌ లాగార్డే ఇలా చెప్పారు.’మేము స్వల్పంగా భారత స్ధాయిని తగ్గించాము, అయితే గతకొద్ది సంవత్సరాలుగా అమలు జరిపిన వ్యవస్ధీకృత సర్దుబాట్ల(సంస్కరణల) కారణంగా భారత్‌ మధ్య, దీర్ఘ కాలిక అభివృద్ధి బాటలో వున్నదని మేము నమ్ముతున్నాము’ ప్రపంచ ఆర్ధిక సంస్ధలైన ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వంటివి పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి వాటి విషయంలో సంతృప్తి చెందితే ఎందుకని మన దేశంలోని వారు నోట్ల రద్దు, జిఎస్‌టితో సంతృప్తి చెందటం లేదు.

5. ప్రధాన మంత్రిగారూ విదేశాల్లో భారత ప్రతిష్టను మెరుగుపరచేందుకు ప్ర యత్నిస్తున్నారు, కానీ కొంత మంది మన నాయకులు విదేశాలకు వెళ్లినపుడు భారతీయ సంతతివారితో మాట్లాడుతూ ఆ చెప్పే విషయాలన్నీ దేశంలో పని చేయటం లేదు అని చెబుతున్నారు, ప్రతిదీ దిగజారుతున్నందున విదేశాల్లో వున్న భారతీయులు స్వదేశానికి రావాలని చెబుతున్నారు. అలాంటి వారికి మీరేం చెబుతారు.

6.మోడీ గారూ , ఒక మోడీ సిద్ధాంతం వునికిలోకి వచ్చింది, ఎవరైతే ఇటీవల న్యూఢిల్లీని సందర్శించారో మీ మంచి స్నేహితుడు బెంజమిన్‌ నెతన్యాహు మోడీ సిద్ధాంతాన్ని బలపరిచారు. వుగ్రవాదం పట్ల మీ వైఖరికి ఆయన మద్దతిచ్చారు.టైమ్స్‌ నౌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వుగ్రవాదం పట్ల మీ తీరు ఒక గట్టిశక్తి అయిన దేశవైఖరి మాదిరిగా వుందని చెప్పారు. ఆయన మోడీ సిద్దాంతాన్ని, ధృడమైన అధికారాన్ని బలపరిచారు. సుతారమైన అధికారంతో వుగ్రవాద సమస్యను ఎదుర్కోలేమని ఆయన చెప్పారు. మీరు ఆ ధృఢవైఖరినే కొనసాగిస్తారా ?

ఇంతకంటే ప్రహసనాలు ఏముంటాయి ? ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే జర్నలిస్టులను చూసిన వారికి ఈ ఇంటర్వ్యూ చేసిన వారు కనిపిస్తే హయిగా నవ్వుకొనేందుకు వీలు కలుగుతుంది. హాస్య, వ్యంగ్యోక్తులకు మంచి ముడిసరకును అందించినందుకు ఆ జర్నలిస్టులకు యావత్‌ జర్నలిస్టు, రచయితలు, కళాలోకం ఎంతైనా రుణపడి వుంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నిన్న నోట్ల రద్దు, నేడు బ్యాంకు డిపాజిట్లకు ఎసరు, రేపేమిటి మోడీగారూ !

18 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Bank deposits, Demonetisation, FRDI bill, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

త్వరలో ప్రధాని నరేంద్రమోడీ తన అధికార నాలుగోవార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. ఈ కాలంలో ఆయన వ్యతిరేకులకు, మద్దతుదార్లకు ఒక విషయంపై ఏకాభిప్రాయం వుంది. అదేమంటే ఆయన చెప్పేదొకటి చేసేదొకటి, పదవిలోకి వచ్చినప్పటి నుంచి దేశం గిడసబారిపోయింది తప్ప ఎదుగుల లేదు. ఏ దివాలాకోరు విధానాలనైతే కాంగ్రెసు అనుసరించిందో వాటినే మరింత వేగంగా అమలు జరుపుతున్నారు తప్ప కొత్తవి, సరైనవి లేనందున నరేంద్రమోడీ విఫలం కావటం అనివార్యమని ఆయన విధానాలను వ్యతిరేకించే వారు మొదటి నుంచీ బహిరంగంగా చెబుతున్నారు. మద్ధతుదార్లకు ఇప్పటికీ సమాధానం అంతుబట్టటం లేదు. ఆయన అనేక మంచి చర్యలను చేపట్టినప్పటికీ దేశం ఎందుకు గిడసబారిపోయింది, తీసుకున్న చర్యలు వ్యతిరేక ఫలితాలు ఎందుకు ఇస్తున్నాయి అనే ప్రశ్నలకు వారు అంతర్గతంగా తమలో తాము సతమతం అవుతున్నారు తప్ప బయట పడేందుకు సిద్ధం కావటం లేదు. పెద్ద నోట్ల రద్దుపేరుతో జనం దగ్గరున్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయించిన మోడీ ఇప్పుడు ఆ డిపాజిట్లను కొల్లగొట్టేందుకు పూనుకున్నారని అదే జనం గగ్గోలు పెడుతున్నారు. అనేక మంది బ్యాంకుల్లో వున్న డిపాజిట్లను వెనక్కు తీసుకోవాలా వద్దా తీసుకుంటే ఎక్కడ దాచుకోవాలి, తీసుకోకపోతే ఆ డిపాజిట్లను ఏదో ఒకసాకుతో స్వాహా చేస్తే ఎలా అనే గుంజాటనలో వున్నారు.

నల్లధనం వెలికితీత, వుగ్రవాదులకు నిధులు అందకుండా చేసేందుకో మరొక లోకకల్యాణం కోసమో పెద్ద నోట్లను రద్దుచేశామని చెబితే దేశ జనులందరూ నెలల తరబడి బ్యాంకుల ముందు క్యూలు కట్టి తమ వద్ద వున్న నోట్లను డిపాజిట్‌ చేయటం కొత్త నోట్లను తీసుకున్నారు. దానినొక దేశభక్తి కర్తవ్యంగా భావించారు. ఏడాది గడచిపోయినా ఇంకా నోట్ల రద్దుకు ముందున్న పరిస్ధితి పునరుద్ధరణ కాలేదు. ఏటిఎంలలో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తూనే వున్నాయి. రద్దయిన నోట్లెన్ని, నల్లధనం ఎంత బయటికి వచ్చిందో నోట్ల రద్దు వలన కలిగిన లాభమెంత, నష్టమెంత అని చెప్పేవారే లేరు. నోట్ల రద్దును ఎంతో ఘనంగా ప్రకటించిన మోడీ దాని లాభనష్టాల గురించి కనీసం మన్‌కీబాత్‌లో అయినా ఎందుకు చెప్పటం లేదు. రద్దయిన పాతనోట్లతో బ్యాంకుల గదులన్నీ నిండిపోయినందున నాణాలు పెట్టేందుకు స్ధలం లేనందున వాటి ముద్రణ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుద్యోగుల ఆందోళనతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.పనికిరాని పాతనోట్లను ఇంకా ఎంతకాలం దాస్తారు, దాచి ఏం చేస్తారు? మరి నాణాలకు స్ధలం అంతలోనే ఎలా దొరికింది? ఏదో ఒకసాకుతో నాణాల ముద్రణ నిలిపివేసి టంకశాలలను మూసివేయటం లేదా నాణాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు వేసిన ఎత్తుగడ తప్ప నాణాలకు స్ధలం లేదంటే ఎవరైనా నమ్ముతారా? కేంద్ర ప్ర భుత్వం చెబుతున్న మాటలకు విశ్వసనీయత లేకుండా పోతోంది. నోట్ల రద్దు తాత్కాలికంగా ఆర్ధిక వ్యవస్ధకు చేటు తెచ్చినప్పటికీ అభివృద్ధి కొద్ది నెలల్లోనే తిరిగి పట్టాలెక్కుతుందని ఆర్ధికవేత్తలనేక మంది ప్రభుత్వానికి మద్దతు పలికారు.2017 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసానికి అభివృద్ధి 6.5-7శాతం వరకు వుంటుందని అనేకమంది అంచనాలు వేశారు. తీరా అది 5.7శాతమని ప్రభుత్వమే ప్రకటించటంతో ఆర్ధికవేత్తల నోళ్లు మూతబడ్డాయి. రోగి తట్టుకోగలిగినపుడే ఆపరేషన్‌ చెయ్యాలి, అందుకే ఇప్పుడు నోట్లు రద్దు చేశామని చెప్పిన నరేంద్రమోడీ చర్యతో వున్న ఆరోగ్యం కాస్తా మరింత దిగజారింది.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు మనం దిగుమతి చేసుకున్న పీపా ముడి చమురు ధర 109 డాలర్లయితే ఇప్పుడు 56 డాలర్లకు అటూ ఇటూ వుంది. మోడీ తొలి మూడు సంవత్సరాలలో ఇంకా తక్కువ వుంది. ఖజానాకు ఎంతో కలసి వచ్చింది. కానీ వినియోగదారుడికి ఏం ఒరిగింది. తిరిగి పెట్రోలు మూడేండ్ల గరిష్టానికి చేరింది. డీజిల్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు, గ్యాస్‌, కిరోసిన్‌పై నొప్పి తగుల కుండా ప్రతినెలా కొంత చొప్పున కోత పెడుతున్నారు. చిల్లర ద్రవ్యోల్బణం అదుపులో వుందని, ధరల పెరుగుదల తక్కువగా వుందని సంతోషిస్తున్నవారికి అది కూడా పెరగటం ప్రారంభమై 5.13శాతానికి చేరినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. నోట్ల రద్దు ప్రయోజనం ఏమైనట్లు, జిఎస్‌టి విప్లవ ఫలితాలేమిటి? వుత్పత్తి పడిపోయింది, ఎగుమతులు తగ్గిపోయాయి, దిగుమతులు పెరుగుతున్నాయి. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నట్లు ? వాస్తవ పరిస్ధితిని దాచి తిమ్మినిబమ్మిని చేసేందుకు, అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకు కొత్త సమస్యలను ముందు తెచ్చి ఇంతకాలం ప్రయత్నించారన్న అనుమానం కలుగుతోంది. ఏదైనా అసలు ప్రధాని నోరు విప్పి వాస్తవాలు చెబితే కదా !

ఇక బ్యాంకుల్లో వున్న జనం డిపాజిట్లను ప్రభుత్వం తీసుకుంటుందటగా అనే జన ఆందోళన గురించి చూద్ధాం. ఇది ఆధారం లేని లేదా నరేంద్రమోడీని వ్యతిరేకించే ప్రతిపక్షాలు చేసే ఆరోపణ కాదు. స్వయంగా నరేంద్రమోడీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌(ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లులోనే వుంది. తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సెలెక్టు కమిటీకి పంపారు. అది తరువాత ఏమౌతుందో చూడాల్సి వుంది. వున్నది వున్నట్లుగా బిల్లును ఆమోదించినట్లయితే జరిగేదేమిటో చూద్దాం. బ్యాంకుల పరిస్ధితి ప్రాణాంతకంగా అంటే తీవ్రపరిస్ధితి ఏర్పడినపుడు పరిష్కరించేందుకు వ్యవస్ధ ‘రిజల్యూషన్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటు ఈ బిల్లులో వుంది. దీనిలో ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ అధికారులే సభ్యులుగా వుంటారు. బ్యాంకుల పరిస్థితి సంక్లిష్టంగా మారినపుడు డిపాజిట్లతో సహా డబ్బుదాచుకున్నవారి సొమ్మును బ్యాంకులు దివాలా ఎత్తకుండా వినియోగించేందుకు పరిశీలించే అవకాశం ఈ కార్పొరేషన్‌కు దఖలు పడుతుంది. ఇప్పటి వరకు అటువ ంటి పరిస్ధితులు ఏర్పడితే అంటే విజయమాల్య వంటి వారు తీసుకున్న వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయినా, స్వదేశంలోనే వుండి కాళ్లు బార్లా చాపినా దివాలా తీసిన లేదా అంతదగ్గరగా వెళ్లిన ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వమే బడ్జెట్‌ ద్వారా నిధులు ఇచ్చి వాటిని నిలబెడుతోంది. దీన్నే బెయిల్‌ అవుట్‌ అంటున్నారు.ఇప్పుడు పార్లమెంటులో ప్రవే శపెట్టిన బిల్లులో బెయిల్‌ ఇన్‌ అనే కొత్త పద్దతిని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం తాను ఆదుకొనే బాధ్యతను వదిలించుకొని అవసరమైతే డిపాజిటర్ల సొమ్ముతోనే బ్యాంకులను నిలబెడతారు. అప్పుడేమవుతుంది. ఏమైనా జరగవచ్చు. బ్యాంకులు దివాలా తీస్తే బ్యాంకులలో డిపాజిట్లు చేసుకున్నవారిలో లక్షలోపు వున్నవారికి బీమాను వర్తింప చేసి వారికి చెల్లించటం జరుగుతోంది. దీనికి గాను రిజర్వుబ్యాంకుకు అనుబంధంగా వుండే డిపాజిట్‌ ఇన్సూరెన్సు అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. కొత్త బిల్లు ప్రకారం దాన్ని మూసివేస్తారు, దాని స్ధానంలో కొత్త వ్యవస్ధ గురించి ప్రస్తావన లేదు. నిజానికి ఆ సంస్ధకంటే ఇప్పటి వరకు ప్రభుత్వ బ్యాంకుల మీద జనంలో వున్న నమ్మకం ముఖ్యమైనది. గతంలో ప్రయివేటు బ్యాంకుల అనుభవాలను చూసిన జనం బ్యాంకులకు బదులు ఇండ్లలోనే డబ్బుదాచుకొనేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత బ్యాంకుల జాతీయకరణతో వడ్డీ తక్కువ ఇచ్చినప్పటికీ ఆ నమ్మకం ఎంతోపెరిగింది. ఇప్పుడు దానికి ముప్పు వచ్చింది. నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు, మరోసారి పెద్ద నోట్ల రద్దు అనే ప్రచారాల నడుమ ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లుతో బ్యాంకు డిపాజిట్లు కూడా సురక్షితం కాదనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ఈ భావం మరింత పెరిగితే బ్యాంకులకు డిపాజిట్లు తగ్గిపోతాయి. బంగారం, ఇండ్ల స్ధలాలు, భూముల రూపంలో దాచుకొనేందుకు జనం చూస్తారు. ఇది ఆర్ధిక కోణంలో చూస్తే తిరోగమనమే.

ప్రతిదానిని తమ ఘనతగా చూపేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయద్రవ్య సంస్ధలు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీల వత్తిడి మేరకు దేశమంతటా ఏకరూప పన్ను విధానం వుండాలని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ప్రతిపాదించింది. అప్పుడు ప్రతిపక్షంలో వున్న బిజెపి దానిని వ్యతిరేకించింది. తీరా తాను అధికారానికి వచ్చిన తరువాత తన ఘనతగా చెప్పుకొంటోంది. ఇప్పుడు ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు ద్వారా డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పిస్తామని, రుణాలు ఎగవేసినవారిపై మరింత కఠినచర్యలు తీ సుకొనేందుకే ఈ బిల్లును తెస్తున్నట్లు చెబుతోంది. పది సంవత్సరాల కితం అమెరికాలోని బడా బ్యాంకులు దివాలా తీసిన తీరు చూసిన బ్యాంకులను ఆదుకొనేందుకు డిపాజిటర్ల సొమ్మును వాడుకోవటంతో సహా వివిధ చర్యలను చేపట్టేందుకు విధంగా ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని భారత్‌ భాగస్వామిగా వున్న జి20 దేశాల కూటమి నిర్ణయించింది. దాని పర్యవసానమే ఈ బిల్లు.

ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అమెరికా, ఐరోపా వంటి ధనిక దేశాలలో బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్దలన్నీ ప్రయివేటు రంగంలో వున్నాయి. అటువంటివి దివాలా తీసినపుడు ప్రభుత్వ సొమ్ముతో ఆదుకోవటానికి, ప్రభుత్వరంగంలోని బ్యాంకులు దివాలా తీసినపుడు వాటిని ఆదుకొనేందుకు ప్రజల సొమ్మును వినియోగించటానికి తేడా వుంది. ప్రభుత్వరంగంలోని బ్యాంకులు పాలకపార్టీల నేతలతో కుమ్మక్కయ్యే పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు లక్షల కోట్ల రూపాయలు రుణాలిస్తున్నాయి. వాటిని పక్కదారి పట్టించి, కాగితాల మీద దివాలా చూపించి రుణాలు ఎగవేస్తున్నవారే ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి కుమ్మక్కు, కావాలని ఎగవేసే వారిని నియంత్రించటం, వసూలు చేయటం ఒక అంశం. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ పధకాలు, సామాజిక అవసరాలను కూడా తీరుస్తున్నందున అవి ఇబ్బందులలో పడినపుడు వాటిని ఆదుకోవటానికి ప్రభుత్వ నిధులు కేటాయించటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ప్ర భుత్వం ఆ బాధ్యతను కూడా విస్మరించి డిపాజిటర్ల సొమ్ముతోనే ఆపని చేసేందుకు పూనుకుంది. అంటే కుమ్మక్కు, కావాలని ఎగవేసే రుణాలు ఇంకా పెరిగేందుకు అవకా శం వుంటుంది. ఇప్పటి వరకు మన దేశ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అటువంటి పారుబాకీల సమస్య వున్నప్పటికీ మొత్తం మీద అవి నిర్వహిస్తున్న పాత్రతో పోల్చితే వుద్యోగ సంఘాలు సూచిస్తున్న విధంగా ముందస్తు చర్యలు తీసుకుంటే అధిగమించరాని పెద్ద సమస్య కాదు.

ప్రపంచ ద్రవ్యపెట్టుబడిదారులు బ్యాంకులలో ప్రభుత్వ పాత్ర తగ్గాలని డిమాండ్‌ చేస్తున్నారు. పశ్చిమ దేశాల బ్యాంకింగ్‌ వ్యవస్దకు మనకు చాలా తేడా వుంది. దాని రోగం వేరు. బాసల్‌ పేరుతో పశ్చిమ దేశాల బ్యాంకుల రోగానికి సూచిస్తున్న చికిత్సను మన జాతీయ బ్యాంకులకు చేయటం అర్దంలేని పని. బాసల్‌ పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వం తన వాటాను తగ్గించుకొని బ్యాంకులలో తగిన మేర నిధులు వుంచే పేరుతో ప్రయివేటీకరణకు బాటలు వేస్తున్నది. ఇప్పుడు డిపాజిటర్ల సొమ్ముతో ప్రభుత్వ బ్యాంకుల దివాలాను నిరోధించటమంటే అది మరింత వేగం కావటానికి దారి తీస్తుంది. బ్యాంకులు దివాలా తీసినపుడు డిపాజిట్లలో కొంత మొత్తాన్ని బ్యాంకుల వాటా ధనంగా మార్చుతారు. అది మరోసారి దివాలా తీస్తే గీస్తే వాటాల ధర మరింతగా పతనం అవుతుంది. సొమ్ము అవసరమైన వారు ఆ వాటాలను అయినకాడికి, లేదా అవసరం అయినపుడు ప్రయివేటు వారికి అమ్ముకోవటం తప్ప మరొక మార్గం వుండదు. తన వాటాలనే విక్రయిస్తున్న ప్రభుత్వం సామాన్యడిపాజిటర్ల వాటాను కొనుగోలు చేస్తుందని ఎలా భావించగలం? ప్రభుత్వం ఒక వైపున బ్యాంకులకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు 2.11లక్షల కోట్లను ప్రభుత్వ రంగబ్యాంకులకు సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అలాంటపుడు బిల్లు ద్వారా డిపాజిటర్ల సొమ్ము వినియోగానికి అవకాశ ం కల్పించటం ఎందుకు అనే ప్ర శ్న వుత్పన్నం అవుతోంది. ఈ బిల్లును యధాతధంగా ఆమోదిస్తే రానున్న రోజుల్లో డిపాజిట్లకు భద్రత సమస్యకు నాందిపలికినట్లే. లేదు కొంత మంది చెబుతున్నట్లుగా బిల్లు ఆమోదం పొందటం కోసం ప్రభుత్వరంగ బ్యాంకు డిపాజిట్లకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చినా తరువాత దొడ్డిదారిన దానిని అమలు జరపరన్న గ్యారంటీ ఏముంది? పాలకుల మాటలు నీటి మీది రాతలు, అందునా అవసరమైనపుడు హడావుడి చేసి ఆనన నోరు మెదపని నరేంద్రమోడీ వంటి వారి చేతలు మరింత ప్రమాదకరం. ఆలోచించండి ! నిన్న జనానికి ప్రయోజనం లేని, దేశానికి నష్టం కలిగించిన పెద్ద నోట్ల రద్దు, నేడు సామాన్య డిపాజిటర్ల సొమ్ము కొల్లగొట్టేందుకు ఎఫ్‌ఆర్‌డిఐ, రేపు ఏ ముప్పు తేనున్నారు మోడీ గారూ అని అడగాల్సిన తరుణం రాలేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లెనిన్‌ దేవదూత, బైబిల్‌ నుంచే కమ్యూనిజం :పుతిన్‌

17 Wednesday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, Bible, communist manifesto, Democratic party, Lenin a saint, Pavel Grudinin, russian elections, Soviet communist ideas, v.i.lenin, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

గత వారంలో కమ్యూనిస్టులకు, ఇతరులకు ఆసక్తి కలిగించే రెండు వుదంతాలు జరిగాయి. ఒకటి మార్చి18న జరిగే ఎన్నికలలో మరోసారి పీఠం ఎక్కేందుకు పోటీ పడుతున్న రష్యన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ కమ్యూనిస్టు భావజాలం బైబిల్‌ నుంచే వచ్చిందని, లెనిన్‌ దేవదూత వంటి వ్యక్తి అని చెప్పాడు. అమెరికాలోని అమీ హరోవిట్జ్‌ అనే ఒక మితవాద వీడియో గ్రాఫర్‌ న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు చదివి వినిపించిన నాలుగు ప్రకటనలు ఎవరివి అంటే కమ్యూనిస్టులవి అనే దిమ్మతిరిగే సమాధానం రావటం రెండో వుదంతం.

న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం వుదారవాద భావాల నిలయంగా ప్రసిద్ధి. హారోవిట్జ్‌ తాను నాలుగు వాక్యాలను చదివి వినిపిస్తానని అవి కమ్యూనిస్టులవో డెమోక్రటిక్‌ పార్టీవో చెప్పాలని విద్యార్ధులను కోరాడు. మొదటిది ‘మేము సామాజిక మార్పునే పురికొల్పుతాము’. సమాధానం చెప్పిన నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టోలో భాగం అని ఏక కంఠంతో చెప్పారు. ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది ఎక్కువగా కమ్యూనిస్టు ప్రకటనగానే కనిపిస్తోంది అని చెప్పగా ఒక్కరు మాత్రమే డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటన అని సరిగా చెప్పారు.

‘మేము నూతన వర్గాలను, అణచివేత నూతన పరిస్దితులను, పాతవాటిని తొలగించేందుకు నూతన పోరాట పద్దతులను పాదుకొల్పాము’ అనే ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీదే అని అందరూ సమాధానం చెబుతారని నేను అనుకొంటున్నాను అని ఒక యువతి చెప్పగా ఇద్దరిలో ఒకరు అది కమ్యూనిస్టుమానిఫెస్టోలో భాగం అని చెప్పారు.

‘ ప్రజలపట్ల వివక్షను చూపే విధానాల ఫలితమే జాతి, సంపద, ఆదాయ అసమానతలు ‘ అన్న ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీది అని ముగ్గురిలో ఇద్దరు సరిగానే చెప్పారు. అయితే కొందరు ఇది నిజంగా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘స్వేచ్చామార్కెట్‌ పద్దతుల ద్వారా సంపద అసమానతలను పరిష్కరించలేము’ ఈ ప్రకటనపై నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టో చెప్పిన అంశ మే అన్నారు. ఇది డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటనలో భాగం. చిత్రంగా వుందే అది కమ్యూనిస్టు మానిఫెస్టో అంశం మాదిరి ధ్వనిస్తోందే అని ఆశ్చర్యపోయారు ఒకరు.

‘ఈ వ్యవస్ధ పని చేయటం లేదు, ఆర్ధికానికి బంధనాలు వేశాము’ అన్న వ్యాక్యం డెమోక్రటిక్‌ పార్టీది అని ఇద్దరిలో ఒకరు చెప్పారు. అమెరికన్‌ విద్యార్ధులు కమ్యూనిస్టు ప్రణాళిక-డెమొక్రటిక్‌ పార్టీ 2016 ఎన్నికలలో చెప్పినదానికి తేడాను గుర్తించటంలో ఎందుకు గందరగోళపడుతున్నారు అన్నది ఒక ప్రశ్న. అమెరికా పరిణామాలను గమనిస్తున్న వారికి ఇది సహజంగా కనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తరువాత కాలంలో అమెరికాలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు ప్రణాళిక-డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్న అంశాలకు తేడాను జనం గుర్తించలేని కారణంగా, డెమోక్రటిక్‌ పార్టీని ఒక తీవ్రవాద వామపక్ష సంస్ధగా పరిగణించినందున 2010 నుంచి ఇప్పటి వఅసరకు రాష్ట్రాలు, కేంద్రంలోని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు వెయ్యింటిలో, మెజారిటీ రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయిందని ఒక విశ్లేషణ తెలిపింది. బరాక్‌ ఒబామా పదవిలో వున్న ఎనిమిది సంవత్సరాల పాటూ అతనొక కమ్యూనిస్టు అనే ప్రచారం సాగుతూనే వుంది. డెమోక్రటిక్‌ పార్టీని కొందరు కమ్యూనిస్టు లేదా తీవ్రవాద వామపక్ష సంస్ధగా చిత్రించటాన్నీ చూశాము. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న స్ధితి, అమెరికాను, యావత్‌ పెట్టుబడిదారీ వ్యవస్ధను కుదిపిన 2011 సెప్టెంబరు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం వంటి పరిణామాల పూర్వరంగంలో డెమోక్రటిక్‌ పార్టీ నినాదాలు, నాయకుల ప్రసంగాలలో పెద్ద మార్పు వచ్చింది. దానికి పరాకాష్టంగా అవును నేను సోషలిస్టును అంటూ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు బెర్నీ శాండర్స్‌ ఆర్ధిక అసమానతల గురించి ఎండగట్టిన తీరు, సోషలిస్టును నన్ను బలపరచండి అంటూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వంకోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీపడి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తీరును చూశాము. లక్షలాది మంది యువత శాండర్స్‌తో గొంతు కలుపుతూ అవును మేమూ సోషలిస్టులటే అంటూ ప్రచారం చేసిందీ విదితమే. అందుకే నేడు అమెరికాలో సోషలిజం అంటే తిట్టుపదం కాదు. డెమోక్రటిక్‌ పార్టీ అస్ధిత్వరాజకీయాలు ఆ పార్టీని రాడికల్‌ నినాదాలు చేయిస్తున్నాయి. అయితే దాని స్వభావం అది కాదని సదా గుర్తుంచుకోవాలి. రెండు ప్రధాన పార్టీలలో ఏది ఎక్కువ హానికరమైనది అని ఎంచుకోవాల్సి వచ్చినపుడు డెమోక్రటిక్‌ పార్టీ కూడా కార్పొరేట్లకే అనుకూలం అయినప్పటికీ ఇంతవరకూ కార్మికవర్గం, నల్లజాతీయుల మొగ్గు ఆ పార్టీవైపే వుంది. అలాంటి వారంతా రోజువారీ, ఆందోళనల సందర్భంగా కమ్యూనిస్టులు మాట్లాడినట్లే దోపిడీ,జాతి వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటారు. అందువలన యువత డెమోక్రటిక్‌ పార్టీ – కమ్యూనిస్టు ప్రణాళిక చెప్పిన అంశాల గురించి గందరగోళపడుతున్నారు. ఇది ఒక విధంగా మంచిదే. కమ్యూనిస్టు వ్యతిరేకత నరనరానికి ఎక్కి వున్న స్ధితిలో దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా ఎంతవరకు కలసి అంత మేరకు వామపక్ష భావజాలం వ్యాప్తి చెందినట్లే, సోషలిజం, కమ్యూనిజాలకు ఆమేరకు వ్యతిరేకత తగ్గుతుంది.

అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ రాడికల్‌ నినాదాల కారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పదజాలం యువతకు పరిచయం కావటం అక్కడి పాలకవర్గానికి ఆందోళన కలిగించే అంశం. రష్యాలో పాతిక సంవత్సరాల క్రితం కూల్చివేసిన సోషలిస్టు వ్యవస్ధ గురించి 56శాతం మందిలో బెంగ తలెత్తిందని ఒక సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే స్టాలిన్‌, లెనిన్‌ పట్ల జనంలో క్రమంగా సానుకూల అభిప్రాయాలూ పెరుగుతున్నాయని కూడా సర్వేలు తెలుపుతున్నాయి. మార్చినెలలో జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టిన పార్టీ సభ్యుడు కాని లెనిన్‌ వ్యవసాయ క్షేత్ర అధిపతి పావెల్‌ గ్రడినిన్‌ దేశవ్యాపితంగా ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పుతిన్‌ మినహా మరొకరెవరూ గెలిచే అవకాశం లేదని ఎన్నికల పట్ల నిరాసక్తతతో వున్న వారిలో కూడా వుత్సాహం నింపుతున్నట్లు, నెల రోజుల క్రితంతో పోల్చితే మద్దతు ఇచ్చేవారు రెట్టింపు అయినట్లు మీడియా పేర్కొన్నది. ప్రజల సొమ్ము తస్కరించటాన్ని ఆపండి, జనం మంచిజీవితాలను గడుపుతున్నారనే అబద్దాలకు సమాధికట్టండి, విద్య, వైద్యం వుచితంగా అందచేయాలని, పెన్షనర్లు గౌరవ ప్రద జీవితం గడపాలని కోరుతున్న రష్యన్‌ రాజ్యాంగాన్ని అమలు చేయటం ప్రారంభించండి అని వుపన్యాసాలలో అడుగుతున్న గ్రడినిన్‌ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.ఆయన వుపన్యాసం తరువాత తన ఆధ్వర్యంలోని లెనిన్‌ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారి జీవన పరిస్ధితులపై రూపొందించిన వీడియోను ప్రదర్శి ంచి రష్యన్లందరికీ అలాంటి పరిస్థితులు వుండాలని, తనకు అవకాశం ఇస్తే అమలు చేస్తానని చేస్తున్న ప్రచారతీరు కొత్తగా వుంది. గతంలో సహకార వ్యవసాయ క్షేత్రంగా వున్నదానిని ప్ర యివేటీకరించిన సమయంలో దానిలో పనిచేస్తున్న గ్రడినిన్‌ 1995లో దాదాపు సగం వాటాలను కొనుగోలు చేశారు. గతేడాది నాలుగువందల కోట్ల రూబుళ్ల మేర స్ట్రాబెర్రీ ఇతర తాజా పండ్లను మాస్కో మార్కెట్లో విక్రయించారు. వచ్చిన లాభాలలో ఎక్కువ భాగం తిరిగిదానిలోనే పెట్టుబడి పెట్టటం, కార్మికుల సంక్షేమ చర్యలకు వినియోగిస్తూ ఎడారిలో ఒయాసిస్‌ మాదిరి సోషలిజాన్ని కాలదన్నుకున్న రష్యాలో సోషలిస్టు పద్దతులలో క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆధునిక నివాస గృహాలతో పాటు వుచిత పాఠశాలలు, ఆరోగ్య, ప్రసూతి కేంద్రాల నిర్వహణ, పెన్షన్‌ సదుపాయాలను కలిగిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా కార్మికులకు సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యమే అని నిరూపించారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమపధకాల కంటే ఎక్కువ లబ్ది చేకూరుతోంది. వ్యవసాయక్షేత్రంలో పని చేసే కార్మికులకు రష్యన్‌ సగటు కంటే రెట్టింపుగా 78వేల రూబుళ్ల మేరకు నెలవారీ వేతనం ఇస్తున్నారు. అక్కడ పనిచేసే డ్రైవర్లు నివశించే భవనంలోనే గ్రడినిన్‌ కూడా వుంటున్నారు. మీరు ఇలా ఎందుకు నిర్వహిస్తున్నారు అని తరచూ అనేక మంది నన్ను అడుగుతూ వుంటారు. రష్యాలో అందరూ ఇలానే వుండాలని నేను కోరుకుంటున్నాను, అది సాధ్యమే అని చెబుతాను అని గ్రడినిన్‌ చెప్పారు. ఆయన మీసాలు, జుట్టు, రూపు రేఖలు స్టాలిన్‌ను పోలివుండటంతో కొంత మంది ఆయనలో స్టాలిన్‌ను చూస్తున్నారని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యా నించింది. యజమానిగా ఆయన వేతనం లెనిన్‌ క్షేత్రంలో పనిచేసే ట్రాక్టర్‌ డ్రైవర్ల కంటే 26రెట్లు ఎక్కువ అని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలు వెల్లడించినట్లు ఆ పత్రిక తెలిపింది.

గ్రడినిన్‌ పట్ల ఓటర్లలో ఆసక్తి జనించిన పూర్వరంగంలో లెనిన్‌ ఒక దేవదూత అని, బైబిల్‌ నుంచే సోవియట్‌ కమ్యూనిస్టు భావన వచ్చిందని పుతిన్‌ చెప్పటం దానిని ప్రభుత్వరంగంలోని టీవీ ప్రసారం చేయటం ఎన్నికల ప్రచారంలో భాగమే అని చెప్పవచ్చు. ఫిన్లండ్‌ సరిహద్దులోని వాలమ్‌ మొనాస్టరీ పునరుద్దరణ సందర్భంగా తీసిన డాక్యుమెంటరీ కోసం పుతిన్‌ మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. గతంలో పుతిన్‌ అనేక సందర్భాలలో చర్చిని సమర్దించారు. ‘కమ్యూనిజం-క్రైస్తవం భావనలు ఒకదానికి ఒకటి పొసగదు అని నేను నమ్మటం లేదు. నేను చెబుతున్నది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నేను అనుకుంటున్నది నేను చెబుతాను’ అన్నారు. ‘ముందుగా ఒకటి చెప్పాలి, ఎల్లవేళలా విశ్వాసం మనతోనే వుంటోంది. మన దేశ ప్రజలకు కష్టాలు వచ్చినపుడు అది బలపడింది.ఆ చర్యలు ఎంతో కఠినంగా వున్నాయి. దేవునితో యుద్ధం చేసిన సంవత్సరాలలో చర్చ్‌లను నాశనం అయ్యాయి, పూజారులను లేకుండా చేశారు. అయితే అదే సమయంలో సోవియట్‌లు ఒక నూతన మతాన్ని సృష్టించాయి.నిజంగానే కమ్యూనిస్టు భావజాలం క్రైస్తవానికి చాలా దగ్గర పోలిక వుంది. క్రైస్తవం, కమ్యూనిజం రెండూ కూడా స్వేచ్చ, సోదరత్వం, సమానత్వాన్ని ప్రబోధించాయి. లెనిన్‌ భౌతిక కాయ్యాన్ని మసోలియంలో వుంచారు. ఆర్ధడాక్స్‌ లేదా క్రైస్తవుల దేవదూతల అవశేషాలకూ దానికి తేడా ఏముంది’ అని పుతిన్‌ డాక్యుమెంటరీ నిర్వాహకులతో ప్రశ్నించారు.

రష్యాలో లెనిన్‌, స్టాలిన్‌, సోషలిజం, కమ్యూనిజాల పట్ల ఇప్పటికీ అక్కడి జనంలో వున్న అభిమానాల పూర్వరంగంలో వాటిపై మొరటుగా దాడిచేస్తే ఫలితం లేదని గ్రహించిన వ్యక్తిగా ఓటర్లలో గందరగోళం కలిగించేందుకు, తాను లెనిన్‌, కమ్యూనిజాలను వ్యతిరేకించినప్పటికీ వాటిపట్ల గౌరవం వుందని చెప్పుకొనేందుకు చేసిన ఒక ప్రయత్నంగా చెప్పవచ్చు. తాను అధికారంలో వున్నంత వరకు లెనిన్‌ భౌతిక కాయాన్ని మసోలియంలోనే వుంచుతానని గతంలో చెప్పాడు. ఎన్నికల సమయం గనుక లెనిన్‌ గురించి సానుకూలంగా మాట్లాడి దానిని ప్రచారంలోకి పెట్టారు. గతంలో అనేక సందర్భాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను వ్యక్తం చేసిన పుతిన్‌ ఒక బూర్జువారాజకీయవేత్త. అవసరం కొద్ది అలాంటి వారు ఏమైనా చెబుతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ మేథావా, మెంటలా ? ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు ?

11 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, Donald trump one year rule, genius, insane, US failures

ఎం కోటేశ్వరరావు

అధ్యక్ష పదవికి ఎన్నికైన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ ఇలా చెప్పాడు.’ దివంగత మహానుభావుడు అబ్రహాం లింకన్‌ తప్ప ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన వారందరికంటే నేను మెరుగైన అధ్యక్షుడిగా వుండగలనని మీకు చెప్పగలను’ అన్నాడు. ఏడాది తరువాత ట్రంప్‌ మానసిక స్ధితిపై జాతీయ స్ధాయిలో చర్చ జరగకుండా చూడటం ఎలా అని అధ్యక్షభవనం మల్లగుల్లాలు పడుతూ తలలు పట్టుకుంటోందని అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్‌ పోస్టు ఒక వార్తకు శీర్షికగా పెట్టింది. ట్రంప్‌ పాలన ప్రారంభమై ఈనెల 20తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ తరుణంలో ప్రపంచ అగ్రరాజ్య అధిపతి గురించి ఇలాంటి విశ్లేషణ రావటానికి కారణం ఏమిటి ?

‘రగలటం మరియు కోపావేశం’ పేరుతో ట్రంప్‌ ఎన్నికల ప్రచారం, గతేడాది కాలంలో అధ్యక్ష భవనంలో వ్యవహరించిన తీరు తెన్నులపై అంతరంగిక కధనాలతో మైఖేల్‌ వూల్ఫ్‌ అనే రచయిత ఒక పుస్తకం రాశాడు. దీనిపై స్పందిస్తూ తాను నిజంగానే తగిన శక్తి సామర్ధ్యాలు, స్ధిరమైన మేథావిగా వున్నానని ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ముసలోడు దెబ్బలాటకు సిద్ధం అన్నట్లుగా వున్నప్పటికీ ఆయన సహాయకులు మాత్రం అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారట. నిజానికి ట్రంప్‌ మానసిక స్ధితి గురించి ఎన్నికలకు ముందే చర్చ ప్రారంభమైంది. దాని గురించి ఇప్పుడు పుస్తకం కూడా వెలువడటంతో బహిరంగ చర్చకు నాంది పలికినట్లు కావటంతో అధ్యక్ష భవనం కూడా ఏదో ఒకటి చేయాల్సింది వుంది. చెత్త పుస్తకం రాసిన చెత్త రచయిత అని వ్యాఖ్యానించిన ట్రంప్‌ సలహాదారుడు తమనేత గొప్ప రాజకీయ మేథావి అని వర్ణించాడు. విమర్శకుల నోరు మూయించటం, ట్రంప్‌ గురించి పొగడ్తలకు దిగటం సహాకులకు మామూలే. కొందరు విమర్శకులు చెబుతున్నట్లు ట్రంప్‌ మానసిక స్ధితి నిజంగానే బాగా లేదా ?

అమెరికా అధ్యక్ష భవనంలో ఎవరు కొలువుతీరారన్నది పెద్దగా ప్రాముఖ్యత కలిగిన విషయం కాదు. వ్యక్తులుగా ప్రవర్తనలో మంచిచెడ్డలు విధానాలపై ప్రభావం పెద్దగా చూపవు.పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణ్యంగా జాతీయ, అంతర్జాతీయ విధానాలు వుంటాయి. ఎవర, ఏ పార్టీ నేత పీఠంపై వున్నా దోపిడీ, ప్రపంచాధిపత్యం, యుద్ధోన్మాదం కనిపిస్తూనే వుంటుంది. అయితే ఏడు పదులు దాటిన ట్రంప్‌ ముదిమది తప్పి వ్యవహరిస్తున్నట్లుగా కొన్ని సందర్భాలలో అనిపించటం లేదా ? ఒక సందర్భంలో జర్నలిస్టులను లేపేయాలని తన మనసులోని మాటను వెల్లడించిన ట్రంప్‌ మరో సందర్భంలో నకిలీ వార్తల గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అత్యంత విస్వసనీయతలేని, అవినీతి మీడియా అవార్డులను ఈ ఏడాదికి ప్రకటించబోతున్నట్లు చెప్పాడు. అదే ట్రంప్‌ తాజాగా మీడియా అంతిమంగా తనను బలపరచకతప్పదని లేకపోతే టిఆర్‌పి రేటింగ్‌ పడిపోతుందని ఎద్దేవా చేశాడు. ఇలాంటి ప్రవర్తన చూసినపుడు మతితప్పి వ్యవహరిస్తున్నట్లే అనిపించవచ్చుగానీ వాస్తవం కాదు. అమెరికా ఇంటా బయటా ఎదుర్కొంటున్న వైఫల్యాలు, తీవ్ర సమస్యల మధ్య నాయకత్వం ఎదుర్కొంటున్న తలనొప్పులను వ్యక్తీకరించటంలో సమతూకం తప్పటం తప్పటం తప్ప మరొకటి కాదు. అది స్ధానిక మీడియా కావచ్చు వుత్తర కొరియా అధ్యక్షుడి గురించి కావచ్చు, అన్నింటా అది కనిపిస్తుంది.

అంతర్గతంగా గతేడాది కాలంలో ట్రంప్‌ సర్కార్‌ ఏ విధంగా వ్యవహరించిందో చూద్దాం. ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే ఇండియానా పోలీసు ప్రాంతంలో జరిపిన పర్యటన గురించి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసింది. అక్కడి ఒక వుక్కు కర్మాగారంలో తాను పదకొండు వందల పర్మనెంటు వుద్యోగాలను రక్షించానని చెప్పుకున్న గొప్పలను అక్కడి కార్మికనేత అంతసీన్‌ లేదని, చాలా తక్కువ అని గాలితీశాడు. నా పరువు తీస్తావా అంటూ సదరు నేతపై ట్రంప్‌ ట్విటర్‌ దాడి చేశాడు. అదే పెద్దమనిషి ఏడాది తరువాత తానొక స్ధిరమైన మేథావినని డబ్బా కొట్టుకున్నాడు. ట్రంప్‌ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన పదవీ స్వీకారం జరిగిన వెంటనే జరిపిన భారీ మహిళా ప్రదర్శన తరువాత గతేడాది కాలంలో జరిగిన ప్రదర్శనల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గంటున్నారు. మేకలకు తోడేళ్లను సంరక్షకులుగా నియమించినట్లు ఒక పెద్ద ఫాస్ట్‌ ఫుడ్‌ కంపెనీ యజమాని ఆండ్రూపుడెర్‌ను కార్మికశాఖ మంత్రిగా నియమించటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటంతో వుపసంహరించకతప్పలేదు. అనేక మంది పేదలకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఒబామా ఆరోగ్యసేవల పధకంగా పిలిచిన దానికి తూట్లు పొడిచేందుకు ట్రంప్‌ చేసిన యత్నాన్ని తాత్కాలికంగా అయినా కార్మికులు అడ్డుకోగలిగారు. ఒకవైపు కార్మికుల సంక్షేమ చర్యలను నీరు గార్చేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు రాబోయే పది సంవత్సరాల కాలంలో ధనికులు, కార్పొరేట్లకు లక్షన్నరకోట్ల డాలర్ల మేర పన్ను రాయితీలు ఇచ్చేందుకు చేసిన నిర్ణయాన్ని కార్మికులు అడ్డుకోలేకపోయారు. కార్మిక వ్యతిరేక చట్టాలకు అనుమతి, వుద్యోగ భద్రత రక్షణ, ఆరోగ్య రక్షణ వుపసంహరణ, ఆర్ధిక పరమైన రక్షణలకు మంగళం పాడే అనేక నిర్ణయాలకు అనుమతినిచ్చాడు. జాతీయ కార్మిక సంబంధాల బోర్డుతో సహా అనేక కమిటీలు, బోర్డులను కార్మిక వ్యతిరేకులతో నింపివేశారు.పర్యవసానంగా మూడు కార్మిక అనుకూల తీర్పులను తిరస్కరించారు. ట్రంప్‌ ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాలలో వున్న విబేధాలు కూడా ట్రంప్‌ కార్మిక వ్యతిరేకచర్యలను వేగవంతంగావిస్తున్నాయి.

ఒబామా సర్కార్‌ హయాంలోనే మంచివేతనాలతో కూడిన వుద్యోగాల సంఖ్య తగ్గి,వేతన మొత్తాలు తక్కువగా వుండే వుపాధి పెరుగుదల ప్రారంభమైంది. అది ట్రంప్‌ ఏడాది కాలంలో మరింతగా పెరిగింది. అందువలన నిరుద్యోగం తగ్గినట్లు కనిపించినా ఆరోగ్య సంరక్షణ, బార్లు, హోటళ్లలో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. పర్యవసానంగా వేతన ఆదాయం తగ్గటంతో యూనియన్లలో చేరే కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. దీంతో రాష్ట్రాలలలో కార్మిక వ్యతిరేక చట్టాలకు ప్రతిఘటన కూడా తగ్గిపోయింది.

అంతర్జాతీయ వ్యవహారాలలో డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి మిగతావారి కంటే భిన్నంగా కనిపించినప్పటికీ ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లు అమెరికా పాలకవర్గ మౌలిక ప్రయోజనాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీలేకుండా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే మీడియాతో వ్యవహరించేతీరులో, ట్విటర్‌ వ్యాఖ్యల విషయంలో అందరూ అనుకొంటున్నట్లుగా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగానే వుంది. అమెరికాలో పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు, ఆర్ధికరంగంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న సంక్షోభం, ఇరాక్‌, ఆఫ్ఘ్‌నిస్తాలో తగిలిన ఎదురు దెబ్బలు, చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు, లాటిన్‌ అమెరికాలో ప్రతిఘటన వంటి అనేక కారణాలు అంతర్జాతీయ రంగంలో అమెరికాను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తన సంక్షోభాన్ని ఎక్కడో ఒక చోట యుద్ధంద్వారానో మరో విధంగానో ఇతరులపై రుద్ధేందుకు ట్రంప్‌ యంత్రాంగం కూడా చేయని యత్నం లేదు. వుత్తర కొరియా అణు,క్షిపణి పరీక్షలను సాకుగా చూపి కాలుదువ్వటం దానిలో భాగమే. ఈ పూర్వరంగంలో ట్రంప్‌ ప్రభుత్వ వైఖరి భారత వుపఖండంలో ఎలా వుందో చూడటం అవసరం.

పాకిస్ధాన్‌ వుగ్రవాదులకు మద్దతు ఇస్తున్న కారణంగా అందచేస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ గొప్పగా చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల సృష్టిలో, మన దేశంలో పంజాబ్‌, కాశ్మీరుల్లో వుగ్రవాదులకు అవసరమైన శిక్షణ, ఆయుధాల అందచేతలో అమెరికా ప్రయోజనాలకు అనుగుణ్యంగా పాకిస్ధాన్‌ వ్యవహరించిన తీరు లోకవిదితం.ఇంతకాలం తాము చేసిన సాయాన్ని తీసుకొని తమకు అబద్దాలు చెప్పటం, మోసం చేయటం తప్ప పాకిస్ధాన్‌ మాకు చేసిందేమీ లేదని అమెరికా ఆరోపించింది. ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధంలో వైఫల్యాలకు అమెరికా తమను బలిపశువులుగా చేస్తోందని పాక్‌ రక్షణ మంత్రి ఖుర్రమ్‌ దస్తగిర్‌ ఖాన్‌ ప్రతి విమర్శ చేశాడు. ఇప్పుడు అమెరికా సాయం నిలిపివేసినందున తమకు వచ్చే నష్టమేమీ లేదని పాక్‌ తిప్పికొట్టింది. చైనా తరువాత అతి పెద్దదిగా వున్న భారత మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు అమెరికా సామ,దాన,భేద,దండోపాయాలను అనుసరించింది. వుగ్రవాదులకు సాయం, ప్రోత్సాహం దానిలో భాగమే. ఇప్పటికీ అమెరికా మనపై వత్తిడి తెస్తూనే వుంది. వాణిజ్యం విషయంలో మన దేశంలోని కార్పొరేట్‌శక్తులు అటు సోవియట్‌ను ఇటు అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నించిన అనుభవాలున్నాయి. సోవియట్‌ అంతరించిన తరువాత చైనాకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌, మన దేశాన్ని కూడా తన గుప్పెటలో వుంచుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే దానికి భిన్నంగా జరిగిన పరిణామాలలో గత పాతిక సంవత్సరాలలో ఒక్కొక్క అడుగు మన దేశం అమెరికాకు దగ్గర అవటం, అదే సమయంలో చైనాకు పాకిస్ధాన్‌ దగ్గరయింది. దీంతో పాకిస్ధాన్‌కు సాయం నిలిపివేసి మన దేశానికి ఏదో మేలు చేస్తున్నట్లు ట్రంప్‌ ఫోజు పెడుతున్నాడు. నరేంద్రమోడీని, మన దేశాన్ని పొగుడుతూ మునగ చెట్టిక్కించటంతప్ప ఇంత వరకు ఏ ఒక్క విషయంలోనూ సానుకూల వైఖరిని అనుసరించలేదు. వీసాల విషయంలో లక్షలాది మంది భారత కార్మికులు, వుద్యోగులను భయకంపితులను గావించటంలో ఇప్పటివరకు అమెరికా అధ్య క్షులలో ట్రంప్‌ తరువాతే ఎవరైనా. ప్రపంచ రాజకీయాలలో మన దేశాన్ని జూనియర్‌ భాగస్వామిగా చేసుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రపంచ వేదికమీద భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కావాలి…… ఆ భాగస్వామి అమెరికానే, అది నూరేళ్ల బంధం ‘ అని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిలర్సన్‌ మనల్ని ఎక్కడికో తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు. పెరుగుతున్న చైనా ప్రాభవాన్ని అడ్డుకొనేందుకు అమెరికా పెద్ద వ్యూహం పన్నింది. దానిలో మన దేశాన్ని నిలిపేందుకు పూనుకుంది. వాణిజ్యం విషయంలో మనపై అమెరికా తెస్తున్న వత్తిడిని దేశీయ కార్పొరేట్‌ శక్తులు ప్రతిఘటిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్ధలతో చేతులు కలిపి తాము కూడా లాభాలను పంచుకోవాలనుకుంటున్నాయి తప్ప తమ లాభాలను ఫణంగా పెట్టి అంతర్జాతీయ సంస్ధలకు లొంగిపోవాలని అవి కోరుకోవటం లేదు. అందువలన మన దేశం తనకు లొంగకపోతే మరోసారి పాకిస్ధాన్‌ను దగ్గరకు తీసుకొని మనపై దానిని ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. పాకిస్ధాన్‌కు తాత్కాలికంగా సాయం నిలిపివేత ప్రచార ఆర్బాటం మనకు ఎర తప్ప చిత్తశుద్ధితో కాదు. పాక్‌తో పూర్తి సంబంధాలు తెగతెంపులు చేసుకొంటే అమెరికన్లకు ఎంత నష్టమో తెలియంది కాదు. అందువలన ట్రంప్‌ మెచ్చుకోళ్లకు మురిసిపోతే మనం వూబిలో దిగినట్లే. తనకు మాలిన ధర్మానికి పాల్పడినట్లు అమెరికా చరిత్రలో ఒక్కటంటే ఒక్క వుదంతం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా ఎన్నికలలో పశ్చిమ దేశాల జోక్యం !

04 Thursday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Communist Party of the Russian Federation, russian elections, Vladimir Putin, western countries intervention, western countries intervention in russian elections

ఎం కోటేశ్వరరావు

మార్చి 18న జరిగే రష్యా ఏడవ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం మొదలైంది. నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్ధులు తమ అర్హత పత్రాలను ఈనెల ఏడు, పార్టీల అభ్యర్ధులు పన్నెండవ తేదీలో సమర్పించాల్సి వుంది. ఎన్నికల ప్రచారం అధికారికంగా డిసెంబరు18న ప్రారంభమైంది. అప్పటి నుంచి 25 రోజుల లోగా అంటే జనవరి పదహారవ తేదీలోపు తాము ఫలానా వారిని అభ్యర్ధులుగా నియమించినట్లు పార్టీలు సమావేశాలలో అధికారికంగా చేసిన తీర్మానాలను ఎన్నికల కమిషన్‌కు అందచేయాలి. అధ్యక్ష పదవికి ఎన్నికవ్వాలంటే యాభైశాతంపైగా ఓట్లు తెచ్చుకోవాలి. ఎవరికీ ఆమేరకు రానట్లయితే మూడు వారాల్లోపు మొదటి రెండు స్ధానాలలో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ నిర్వహించాల్సి వుంది.

అధ్యక్ష పదవికోసం మరోసారి పోటీ పడుతున్న వ్లదిమిర్‌ పుతిన్‌, కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా లెనిన్‌ వ్యవసాయ కంపెనీ పారిశ్రామికవేత్త పావెల్‌ గ్రడినిన్‌, ఇతర పార్టీల తరఫున వ్లదిమిర్‌ జిరినోవస్కీ, గ్రిగొరీ యెవలిన్‌స్కీ,సెనియా సోబ్‌చెక్‌ తదితరులు వున్నారు. రష్యా నిబంధనల ప్రకారం పార్టీల అభ్యర్ధులుగా పార్టీ సభ్యులు కాని వారిని కూడా నియమించవచ్చు.దానికి అనుగుణ్యంగానే కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం రష్యాలో నమోదైన పార్టీలు 69 వున్నాయి. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలంటే మూడులక్షల సంతకాలను సేకరించాల్సి వుంది, అయితే ఏ ఒక్క రాష్ట్రంలోనూ అవి ఏడున్నరవేలకు మించకూడదు. అంటే దేశమంతటా పలుకుబడి కలిగిన వారే పోటీకి అర్హులు అవుతారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని పార్టీల అభ్యర్ధులు లక్ష సంతకాలను సమీకరించాల్సి వుంది. ఏరాష్ట్రంలోనూ అవి రెండున్నరవేలకు మించకూడదు.ఒక ఓటరు ఒక అభ్యర్ధికి మాత్రమే మద్దతుగా సంతకం చేయాలి. ఫిిబ్రవరి మొదటి వారంలో నామినేషన్ల పరిశీలన, ఖరారు చేస్తారు.

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని అధ్యక్షపదవికి అభ్యర్ధిగా నిర్ణయించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. డిసెంబరు 23న కమ్యూనిస్టు పార్టీ వార్షిక ప్లీనరీ సమావేశంలో పావెల్‌ గ్రడినిన్‌ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీ అధినేత జుగనోవ్‌ అభ్యర్ధి గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు.’ ఆయనొక శక్తి వంతుడు, అనుభవశాలి. సోషలిస్టు పద్దతులలో తన సంస్ధను నిర్మించారు. గ్రడినిన్‌ను బలపరిస్తే ఈ అనుభవాన్ని ప్రతిచోటా వ్యాపింపచేయవచ్చు. ఆయన వ్యాపారే, మాటలు చెప్పరు, వ్యాపారాన్ని జాతీయ దృక్పధంతో చేస్తున్నారు. సోవియట్‌ విలువలకు మద్దతు ఇస్తారు. ఆయన సంస్ధ అత్యుత సాంకేతిక పరిజ్ఞానంతో కూడి వుంది. ఒక బ్యాంకు చైర్మన్‌ మాదిరి గాక ఒక కమ్యూనిస్టు డైరెక్టర్‌లా వ్యవహరిస్తారు. నిరంకుశుడు కాదు, జన సేవకుడు. రష్యన్‌ ప్రభుత్వం అన్నింటినీ వదిలించుకోవాలనే కార్యక్రమం కలిగి వుంది. ఆ సవాలును దేశభక్తులు స్వీకరించారు. వారి ప్రధాన లక్ష్యం జనం గురించిన ఆందోళనే. సొమ్మును దోచుకోలేదు, విదేశాల్లో దాచుకోలేదు,పెట్టుబడులు పెట్టాడు. ప్రజల మనిషిగా అన్ని పరీక్షలు నెగ్గాడు. పార్టీ మద్దతు, దేశభక్తుల విశాల కూటమితో పనిచేశాడు. గ్రామీణ సామాజిక జీవనాన్ని పటిష్టం గావించారు. మార్కెట్‌ శక్తులు, దోపిడీదారులు, అవినీతి పరుల మధ్య పోటీలో ఒక స్ధిరమైన సంస్ధను నిర్మించారు. ఆయనకు వుత్పత్తి ఎలా చేయాలో మాత్రమే కాదు గౌరవ ప్రదమైన వేతనాలు, పెన్షన్లు ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. గరిష్ట వేతనాలు, సిబ్బంది సంరక్షణ చూశారు.వుచిత గృహవసతి, విద్య, వైద్యం కల్పించారు. సోవియట్‌ కాలం నాటి కార్మిక నిబంధనలన్నీ పాటించారు. పార్టీ మొత్తంగా ఆయన విజయానికి పని చేయాలి.మన అభ్యర్ధి ఒక మంచి, విలువైన వ్యక్తి అని మనం రుజువు చేయాలి, ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా ఆయన విజయానికి కృషి చేయాలి.’ అని జుగనోవ్‌ చెప్పారు.

యాభైఏడు సంవత్సరాల గ్రడినిన్‌ మెకానికల్‌ ఇంజనీరు, మాస్కో సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో 1990 దశకం నుంచి పనిచేస్తున్నారు.ఆయన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించగానే రష్యన్‌ మీడియా ఆసక్తితో పాటు దాడులు కూడా ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ తన పలుకుబడిని పెంచుకొనేందుకు పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పోటీకి నిలిపినట్లు అనేక మంది వ్యాఖ్యానించారు.జుగనోవ్‌ ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలతో కలసి వేసిన నామినేషన్‌ కార్యక్రమానికి పెద్ద ప్రచారం కల్పించారు.

ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ ఇంకా వూపందుకోలేదు.పోలింగ్‌కు సరిగ్గా నెల రోజు ముందు మీడియాలో అభ్యర్ధుల ప్రచారం ప్రారంభం అవుతుంది. గతంలో జరిగిన ఎన్నికలపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సారి ఎలా జరుగుతాయో వూహించటం కష్టం కాదు. 2016 అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందన్న తీవ్ర విమర్శలు, ఆరోపణల నేపధ్యంలో ఈ సారి దానికి పోటీగా అమెరికా జోక్యం చేసుకుంటుందా అన్నది ప్రశ్న.ప్రస్తుతం వెల్లడవుతున్న అభిప్రాయాల ప్రకారం పుతిన్‌ తిరిగి విజయం సాధించటం ఖాయం అనే వాతావరణం వుంది. డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారనే విమర్శల నేపధ్యంలో ఇపుడు రష్యా ఎన్నికలలో జోక్యం అనే వార్తలు వస్తున్నాయి. అవినీతి కేసులలో శిక్షపడిన అలెక్సీ నవాల్నే పోటీకి అనర్హుడని ప్రకటించటంతో రష్యన్‌ ఎన్నికలను బహిష్కరించాలని అతడు పిలుపునిచ్చాడు. తను రంగంలో వుంటే పుతిన్‌ అవకాశాలు దెబ్బతింటాయనే కారణంతోనే తనను తప్పించారని చేసిన ఆరోపణను అమెరికన్‌ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ చర్య తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పుతిన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఖండించారు. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేయటమే తమ ముఖ్య లక్ష్యంగా ఎంచుకున్న సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికన్లు తదుపరి పర్యవసానాలను పూర్తిగా అంచనా వేయలేకపోయారా అన్నది ఒక అంశం. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత రష్యా కూడా ఐరోపాలోని ఇతర దేశాల మాదిరి తనకు లొంగి వుంటుందని అమెరికన్లు భావించి వుండవచ్చు. కానీ ఆచరణలో అది కూడా పోటీదారుగా మారుతుందని, ప్రపంచ రాజకీయాలలో తన పట్టు పెంచుకొనేందుకు ముందుకు వస్తుందని సామ్రాజ్యవాద దేశాలు అంచనా వేసి వుంటే పరిణామాలు కచ్చితంగా మరో విధంగా వుండేవి. మార్కెట్ల వేట పోటీలో సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసికొత్తగా ముందుకు వచ్చిన రష్యా సహజంగానే తన వాటాను డిమాండ్‌ చేయటమే మిగతా పశ్చిమ దేశాలు, దానికి వున్న వివాదం.

దీనిలో పశ్చిమ దేశాలను సవాలు చేసేంతగా రోజు రోజుకూ అన్ని రకాలుగా బలం పెంచుకుంటున్న సోషలిస్టు చైనా అనేక అంశాలలో రష్యాతో చేయి కలుపుతోంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, సైనిక సమీకరణలు లేకపోవటం వుభయులకు ప్రయోజనకరమైన అంశం. అందువల్లనే అమెరికా, దాని మిత్ర దేశాలతో ఆసియాలో, ఐరోపాలో రష్యన్లు ఏకు మేకై కూర్చున్నారు. రష్యా పక్కనే వున్న వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు నాటో కూటమి నిరంతరం ప్రయత్నిస్తున్నది.రష్యా అడ్డుకుంటున్నది. క్రిమియా ప్రాంతాన్ని తనలో కలిపివేసుకోవటం ద్వారా ఆ ప్రాంతంలో తమకు ఎదురులేదని రష్యా లోకానికి చాటింది. ఆ పేరుతోనే వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు పశ్చిమ దేశాలు పావులు కదుపుతున్నాయి, పోటీ పడుతున్నాయి. వుక్రెయిన్‌ పరిరక్షణకు తాము టాంకులను ధ్వంసం చేసే క్షిపణులతో సహా అధునాతన మారణాయుధాలు అందచేసేందుకు సిద్దంగా వున్నామని తొలిసారిగా కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రకటించింది రష్యా. వాటిని ఆత్మరక్షణ కోసమే వాడతాం తప్ప ఎదురుదాడికి కాదని వుక్రెయిన్‌ చెబుతున్నది. అమెరికా ప్రకటనను తప్పు పడుతున్న జర్మనీ అదనపు ఆయుధ విక్రయాల గురించి ప్రశ్నిస్తున్నది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయుధాలతో పనేముంది వేరే మార్గం వుందన్నట్లుగా జర్మనీ రంగంలోకి దిగింది. ఎన్నికలలోపే వుక్రెయిన్‌లో ఐరాస శాంతి దళాలను ఏర్పాటు చేయాలని బుధవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రి వుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో కోరటం దానిలో భాగమే. వుక్రెయిన్‌లో ఐరాస దళాల ఏర్పాటుకు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ఫ్రాన్స్‌తో కలసి జర్మనీ ప్రయత్నిస్తోంది. రష్యా ఎన్నికలను సాకుగా చూపరాదని కోరుతోంది. వుక్రెయిన్‌ విషయంలో తనకు పెద్దన్న పాత్ర వుండాలని అమెరికా కోరుకుంటుండగా అటువంటి అవకాశం ఇవ్వరాదని జర్మనీ, ఫ్రాన్స్‌ సహజంగానే కోరుకుంటాయి. ఐరోపా సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, ఇతరుల పాత్ర వుండరాదని అవి చెబుతున్నాయి. ఈ రెండు పరిణామాలు పరోక్షంగా రష్యన్‌ ఎన్నికలలో జోక్యం చేసుకోవటమే అవుతుంది. తమకు కొరకరాని కొయ్యగా తయారైన పుతిన్‌ మీద పశ్చిమ దేశాలకు సానుకూల వైఖరి వుండదు. అయితే తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించగల బలమైన మరొక నాయకుడు, శక్తి పశ్చిమ దేశాలకు దొరకటం లేదు. అధికారపక్ష బలంతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ గత పాతిక సంవత్సరాలుగా అక్కడ కమ్యూనిస్టుపార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా వుంటోంది. వర్గ స్వభావ రీత్యా పశ్చిమ దేశాలు కమ్యూనిస్టులను బలపరిచే సమస్యే లేదు. ఇదొక విచిత్ర పరిస్ధితి. ఇతర పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాలలో పశ్చిమ దేశాలు తమకు అనుకూలమైన శక్తులను సంపాదించటంలో కొంత మేరకు జయప్రదమయ్యాయి. అనేక సందర్భాలలో రష్యాను వ్యతిరేకించే, పశ్చిమ దేశాల అనుకూల శక్తులే ఎన్నికలలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

నిజానికి పుతిన్‌ అధికార రాజకీయాలలో తలపండిన వ్యక్తి. తన ఎన్నికకు మార్గం సుగమం చేసుకొనేందుకు గత ఏడాది కాలంగా ఇంటా బయటా అనేక చర్యలు తీసుకున్నాడు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తారనే అనుమానం వున్న గవర్నర్లను తొలగించటం,బదిలీ చేయటం వంటి వాటిని కొద్దినెలల ముందుగానే పూర్తి చేశాడు.విదేశాలలో సొమ్ము దాచుకున్నవారిపై కఠిన చర్యలంటూ ఆర్భాటం చేసినప్పటికీ ఎన్నికల నేపధ్యంలో వారికి అనుకూలమైన చర్యలు తీసుకున్నాడు. ఆర్ధికశాఖ నిషేధజాబితాలో వున్న దేశాలలో తప్ప ఇతర దేశాలలో దాచుకున్న సొమ్మును రష్యా తీసుకురానవసరం లేదని, పన్నులు చెల్లించక్కరలేదని లెక్కలు ప్రకటిస్తే చాలనే వెసులుబాటు కల్పించాడు. నిధుల వివరాలు వెల్లడించిన వారి మీద ఒకటి రెండుశాతం పన్ను విధించి క్షమించి వదలి వేయాలనే ఆలోచన వున్నట్లు వార్తలు రాయించారు. జనవరి ఒకటి నూతన సంవత్సరాది సందర్భంగా చిన్న సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ పుతిన్‌ పలు చర్యలు ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల అక్రమాలు తప్ప మరొకటి కాదు.

అంతర్జాతీయంగా రష్యా తన పట్టునిలుపుకొనే క్రమంలో అమెరికాను వ్యతిరేకిస్తున్నప్పటికీ దాని ఆర్ధిక పరిస్ధితి అంత సజావుగా లేదు. ఇతర ధనిక దేశాల మాదిరే ఆర్ధిక సంక్షోభప్రభావం తీవ్రంగా పడింది. గత కొంత కాలంగా దాని అభివృద్ధి రేటు గిడసబారింది. గతేడాది అభివృద్ధి రేటు 1.8-2.2శాతం మధ్య వుండవచ్చని డిసెంబరు మధ్యలో రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించింది. దాని అంచనా ప్రకారం 2018లో 1.5-2శాతం మధ్య వుంటుందని పేర్కొన్నది. రానున్న పది సంవత్సరాలలో రష్యా ఆర్ధిక పరిస్ధితి నిరాశాజనకమే అని బ్లూమ్‌బెర్గ్‌ విశ్లేషించింది. 2021నాటికి చమురు పీపా ధర 20డాలర్లకు పడిపోతుందని, రష్యన్‌ప్రభుత్వం బడ్జెట్‌ సమస్యలతో పాటు కార్మికుల సమ్మెలతో తలెత్తే పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వుంటుందని పేర్కొన్నది.2024నాటికి చమురు ధర పదిడాలర్లకు పడిపోతుందని,2028నాటికి రాజకీయ రంగం నుంచి పుతిన్‌ కనుమరుగవుతారని జోస్యం చెప్పింది.ఈ జోస్యం ఫలించినా లేదా ఇప్పుడున్న ఆర్ధిక మాంద్యం కొనసాగినా పుతిన్‌కు ఇవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యం లేదు. గతంతో పోలిస్తే చమురు ధరలో పెద్దగా పెరుగుదల లేకపోయినా దివాలాకోరు ఆర్ధిక విధానాల కారణంగా రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధకున్న పరిమితులు వెల్లడయ్యాయి.

ఈ పూర్వరంగంలో జరుగుతున్న ఎన్నికలను ఆర్ధిక స్ధితి పెద్దగా ప్రభావితం చేయబోదని పుతిన్‌ విజయం సాధిస్తారని మీడియా పండితులు చెబుతున్నారు. ఆర్ధిక పరిస్ధితి ఇలాగే కొనసాగితే రష్యన్‌ సమాజంలో ఎలాంటి అసంతృప్తి తలెత్తుతుందనేది ఇప్పుడే జోస్యం చెప్పలేము. అయితే సోషలిజాన్ని పోగొట్టుకున్న పాతికేండ్ల తరువాత సాధించిందేమిటి అని నెమరువేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బోల్షివిక్‌ విప్లవం జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 58శాతం మంది సోవియట్‌ను కోల్పోయినందుకు విచారం వెలిబుచ్చుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. గతం మాదిరే చరిత్ర పునరావృతం కాదుగాని ముందుకే పోతుంది, అది పురోగమనం వైపే అన్నది చరిత్ర చెప్పిన సత్యం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: