Tags

, , , ,

Image result for modi's big lie cartoons

ఎం కోటేశ్వరరావు

ఘనుడై నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2014 జూన్‌ నుంచి 2018 సెప్టెంబరు వరకు మన దేశ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం 54,90,763 కోట్ల నుంచి 82,03,253 కోట్లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. వీటి మీద సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లోని ఒక గ్రూప్‌ చర్చలో పాల్గన్న మోడీ, బిజెపి అభిమానులు, కార్యకర్తల స్పందన గమనిస్తే దానిని ప్రత్యక్షంగా చూసేందుకు హిట్లర్‌ ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌ కుల సంఘాలు ఆమోదిస్తే హిందూత్వ తాలిబాన్‌ కుటుంబాలలో ఎక్కడో అక్కడ పుట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే తెలిసీ అలాంటి వాడిని కనేందుకు ఏ తల్లీ అంగీకరించదు కనుక టెస్ట్‌ ట్యూబ్‌ జీవిగా పుట్టేందుకు ఒక మట్టి కుండను సరఫరా చేయమని ఆంధ్రవిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావుకు ఈ పాటికి గోబెల్స్‌ వర్తమానం పంపే వుంటాడు.

ప్రభుత్వ రుణ వార్తను ఇచ్చిన ఒక మీడియా సంస్ధను, వార్త కటింగ్‌ను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన వ్యక్తి ఒక అబ్బకు పుట్టిన వారు కాదని,అప్పులన్నీ హాజ్‌యాత్రకోసం చేసిన వని, కాంగ్రెస్‌ వారు 54లక్షల కోట్లు అప్పులు చేసి మోడీకి అప్పగిస్తే నాలుగున్నరేండ్లలో 32లక్షల కోట్ల వడ్డీ అయిందని, ఇండియా అప్పుకు, మోడీ చేసిన అప్పుకు తేడా తెలియదని, ఎల్లో మీడియా ఫేక్‌ న్యూస్‌ నమ్మవద్దని, అది అప్పుకాదు మోడీ మిగిల్చిన మొత్తం అంటూ విరుచుకుపడ్డారు.తెలివి తేటలు కలిగిన ఇంకొందరు గతంలో యుపిఏ హయాంలో చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు తక్కువ శాతం అంటూ సమర్ధనకు పూనుకున్నారు. బూతులు తిట్టేవారి కంటే వీరు కొంత నయం. వీటిని చూస్తుంటే జర్మనీలో నాజీలు, హిట్లర్‌ ప్రచారం అక్కడి సమాజం మీద ఎలాంటి ప్రభావం కలిగించిందో ప్రత్యక్షంగా అర్ధం అవుతోంది. 1897లో పుట్టిన గోబెల్స్‌ ‘ఆంగ్లేయుల నాయకత్వ రహస్యం ప్రత్యేకించిన కొన్ని తెలివితేటల మీద ఆధారపడలేదు. అది మూర్ఖ సూక్ష్మబుద్ధి మీద ఆధారపడిందంటే ఆశ్చర్యం కాదు. ఎవరైనా అబద్దం చెప్పదలచుకుంటే అది పెద్దదై వుండాలి, దానికే కట్టుబడి వుండాలి, దానిని కొనసాగించాలి.అది అపహాస్యంగా కనిపిస్తున్నా సరే దానికే కట్టుబడి వుండాలి.’ అని ఒక రచనలో పేర్కొంటాడు. దానిని మరింతగా అభివృద్ది చేసి ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుంది, చివరకు తొలిసారి అబద్దం చెప్పిన వాడు కూడా ఒక దశలో నిజమే అని నమ్మే విధంగా తయారవుతాడు అని నిరూపించాడు.

Image result for modi's  big lie   cartoons

అప్పులు చేయటం సరైనదా కాదా అన్నది ఒక అంశం. అత్యంత ధనిక దేశం అమెరికా నుంచి దాన్ని తలదన్నేందుకు ప్రయత్నిస్తున్న చైనా వరకు అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయి. మన దేశం అందుకు మినహాయింపు కాదు. కేంద్రంగానీ, రాష్ట్రాలు గానీ, అది కాంగ్రెస్‌ లేదా బిజెపి అయినా ఎవరైనా చేస్తున్నది అదే. ప్రతి ఏటా బడ్జెట్‌లో గతంలో వున్న అప్పులు తీర్చేందుకు, వాటికి అసలు, వడ్డీ కోసం కేటాయింపులు చేస్తారు. లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు కొత్త అప్పులు చేస్తారు. మోడీ సర్కార్‌ సగటున ఏటా ఆరులక్షల కోట్ల మేరకు అప్పు చేస్తున్నది.ఈ ఏడాది అంటే 2019 మార్చి నెలాఖరులోపు కేంద్ర ప్రభుత్వ లోటు అంచనా 6.24లక్షల కోట్ల రూపాయలు. అయితే ఆర్ధిక సంవత్సరం తొలి ఎనిమిది నెలలకే 7.17 కోట్లకు చేరింది. అంటే ప్రపంచబ్యాంకు పరిభాషలో చెప్పాలంటే ఆర్ధిక కట్టుబాటును వుల్లంఘించటమే. ఈ లోటును పూడ్చుకొనేందుకు అప్పు చేయాలి లేదా నోట్ల ముద్రణకు పాల్పడాలి. ఇంతకు మించి మరొక ప్రత్యామ్నాయం లేదు ఈ వాస్తవం మోడీ భక్తులకు తెలియదా లేక తెలిసినా వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తూ ఎదురుదాడికి పాల్పడుతున్నారా ? వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే క్రమంలో ఎదురుదాడి ఒక పద్దతి.

నరేంద్రమోడీకి లేనిదాన్ని ఆపాదించేందుకు ఆయన నియమించుకున్న యంత్రాంగం అనేక అవాస్తవాలను ప్రచారంలో పెట్టింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పెట్టుబడులు తెచ్చేందుకే మోడీ విదేశీ ప్రయాణాలు చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ అసలు అప్పులు చేయలేదు, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి అప్పులు తీసుకోలేదు. కాంగ్రెస్‌ పాలనా కాలంలో చేసిన అప్పులన్నీ తీర్చాడు. ఇంకా ఇలాంటి ఎన్నో అతిశయోక్తులను మోడీకి ఆపాదించారు. వీరాభి అభిమానులు వాటన్నింటినీ నమ్మారు కనుకనే సామాజిక మాధ్యమంలో స్పందన అలా అదుపు తప్పింది. మోడీ విశ్వసనీయత ఎలా తయారైందంటే ఆయనే స్వయంగా తన ప్రభుత్వం అప్పులు చేసిందని నిజం చెప్పినా అంగీకరించే స్ధితి లేదు. మూకోన్మాదం అంటే ఇదేనా ? గోబెల్స్‌ చెప్పినదానికి అనుగుణ్యంగానే బిజెపి నేతల తీరు తెన్నులున్నాయి. ఒక బిజెపిని ఓడించటానికి అన్ని పార్టీలు ఏకమౌతున్నాయి.నేను కాపలాదారుగా పహారా కాస్తుంటే దేశాన్ని లూటీ చేసిన వారంతా ఏకమౌతున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నది సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ, ఆయన భజన బృందం. తెలంగాణాలో అన్ని స్ధానాలకు పోటీ చేస్తున్న ఏకైక పార్టీ మాది, అధికారం మాదే. మీడియా, జనం పగలబడి నవ్వుతున్నా గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు ఎన్నికల ప్రచారంలో చెప్పింది అదే. వారికా ధైర్యం, అంతటి తెలివి తేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గోబెల్స్‌ చెప్పిన అంశమే.అతని వుపదేశాన్ని మరింత నవీకరిస్తూ పక్కాగా అమలు జరుపుతున్నది హిట్లర్‌, గోబెల్స్‌ భావజాలం, ప్రచార పద్దతులను అరువు తెచ్చుకున్న కాషాయ పరివారం, వారితో ఏదో ఒక దశలో స్నేహం చేసిన, చేస్తున్న వారు అంటే ఎవరికైనా కోపం వస్తే చేయగలిగిందేమీ లేదు.

Image result for modi's big lie cartoons

ఈ రోజు దేశంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమిలో 40కి పైగా చిన్నా పెద్ద పార్టీలు వున్నాయి. బిజెపిని ఓడించటానికి అన్ని పార్టీలు ఏకమైతున్నాయని చెప్పటం గోబెల్స్‌ ప్రచారం కాదా ? ఎన్‌డిఏ పేరుతో వున్నది తమ పార్టీ ఒక్కటే అని చెప్పమనండి. కాపలాదారుగా నరేంద్రమోడీ సక్రమంగా విధి నిర్వహిస్తే విజయ మాల్య, నీరవ్‌ మోడీ వంటి వేల కోట్ల రూపాయలను ఎగవేసిన వారు దేశం వదలి ఎలా పోయారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన వారు, నిధులను దారి మళ్లించిన వారు గత నాలుగు సంవత్సరాలలో ఇబ్బడి ముబ్బడిగా ఎలా పెరిగారు? కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులని చెబుతున్నవాటిలో కొన్ని లక్షల కోట్లను రాని బాకీల కింద రద్దు ఖాతాలో రాసిన వారెవరు? వసూలు చేయకుండా అడ్డుపడ్డదెవరు ? తీసుకున్న రుణాల వాయిదాల చెల్లింపులో విఫలమైన ప్రతి రుణఖాతా రుణ వ్యవధిని బట్టి నిరర్ధక ఆస్ధి అవుతుంది. అలాంటపుడు కాంగ్రెస్‌ హాయాంలో ఇచ్చిన అప్పులు తమ హాయాంలో ఇచ్చిన వాటిని వేరు చేసి తమ ఘనత, కాంగ్రెస్‌ కాలంలో ఇచ్చిన వాటి బండారాన్ని ఎందుకు బయటపెట్టరు.

అబద్దం ఆడదలచుకుంటే అది పెద్దదై వుండాలన్న బ్రిటీష్‌ కుటిల నీతిని ప్రదర్శించింది సాక్షాత్తూ నరేంద్రమోడీయే. పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలు, నల్లధనం గురించి చెప్పింది పెద్ద అబద్దం కాదా ? జనం ఏమనుకున్నా అదే అబద్దానికి కట్టుబడి వుండాలి, నోరు విప్పకూడదు అన్నదానికి నరేంద్రమోడీ నోట్ల రద్దు గురించి ‘కట్టుబడి ‘ వున్నారా లేదా ? ఏండ్లు గడుస్తున్నా దాని మీద ఒక్క మాటైనా మాట్లాడారా ? ఎంత నిబద్ధత ! తాను నోరు విప్పక పోవటమే కాదు, రిజర్వు బ్యాంకు నోరు కూడా మూయించారా లేదా ? ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి మాట్లాడిందేమిటి ? తరువాత అసలు నోరు విప్పారా ? గోబెల్స్‌ చెప్పిందానికి ట్టుబడి వున్నారా లేదా ? ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా వుండాలన్నాడు గోబెల్స్‌. కుహనా సైన్సు గురించి చెప్పిన మాటలను ప్రపంచం అపహస్యం చేస్తున్నా ఎవరైనా మానుకున్నారా ? వేదాల్లో అన్నీ వున్నాయష అని చెప్పేవారి సంఖ్య తగ్గలేదు, చెప్పేవారు మరింత పెరిగారు. తలకాయలూపే వారు ఇబ్బడి ముబ్బడి అయ్యారా లేదా ! పురాతన కాలంలో మనకు ప్లాస్టిక్‌ సర్జరీ నుంచి విమానాలు, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల నుంచి ఖండాంతర నియంత్రిత క్షిపణులు మన దగ్గర వున్నాయంటే నిజమే అని నమ్మేవారు తయారయ్యారా లేదా ? వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ గురించి ప్రధాని మోడీ స్వయంగా చెప్పిన తరువాత ఆయన కటాక్ష వీక్షణాల కోసం పరితపించే వారు కొందరైతే, నిజంగా నమ్మే కొందరు అలాంటి ప్రచారాలు చేస్తున్నారు

Related image

వుపాధి గురించి తాము చేసిన వాగ్దానాలను అమలు జరిపానని మోడీ నమ్మబలుకుతున్నారు. ఇదొక పెద్ద అబద్దం. దాన్నుంచి బయట పడలేరు, వాస్తవాన్ని అంగీకరించలేరు. ఆవులను కాయటం కూడా వుద్యోగమే అని బిజెపి త్రిపుర ముఖ్యమంత్రి సెలవిచ్చాడు. పకోడీలు అమ్మేవారు రోజుకు రెండువందల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది కూడా వుద్యోగ కల్పనే అని నరేంద్రమోడీ చెప్పిన తరువాత అనుచరులు మరింతగా రెచ్చిపోతారని వేరే చెప్పాలా? గతేడాది జూలై 21న ప్రధాని మోడీ లోక్‌సభలో వుపాధి గురించి చెప్పిన అంశాలేమిటో చూద్దాం. గతేడాది కాలంలో కోటికి పైగా వుద్యోగాలు(వుపాధి) కల్పించాం. 2017సెప్టెంబరు 2018 మే మాసాల మధ్య వుద్యోగుల భవిష్యనిధి సంస్ధ(ఇపిఎఫ్‌ఓ)లో 45లక్షల మంది నూతన చందాదారులుగా చేరారు. ఇదే కాలంలో నూతన పెన్షన్‌ స్కీములో 5.68లక్షల మంది నూతన ఖాతాదారులుగా చేరారు. కేవలం తొమ్మిదినెలలో ఈ రెండు పధకాల్లో చేరిన వారి సంఖ్య 50లక్షలు దాటుతుంది. పన్నెండు నెలల్లో 70లక్షలు దాటవచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్ల వంటి వారు మరో ఆరులక్షల మంది వృత్తిలో చేరి వుంటారు. గతేడాది దేశంలో7.6లక్షల వాణిజ్య వాహనాల విక్రయం జరిగింది. నాలుగోవంతు పనిలోంచి తొలగినా 5.7లక్షల వాహనాలు నిఖరంగా వుంటాయి. ఒక్కొక్కదాని మీద ఇద్దరు పని చేసినా 11.4లక్షల మందికి వుపాధి కల్పించినట్లు కాదా అంటూ ప్రతిపక్షాలను మోడీ తనవాదనా పటిమతో ప్రశ్నించారు. స్వరాజ్య అనే ఆర్‌ఎస్‌ఎస్‌వారు నడిపే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వం ఎన్నో వుద్యోగాలు కల్పించినా దాన్ని సాధికారికంగా చేప్పేందుకు అవసరమైన సమాచారం లేదని పేర్కొన్నారు.ఇదొక పెద్ద అబద్దం

Image result for modi's big lie cartoons

నీతి అయోగ్‌ వుపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా ఆధ్వర్యంలో వుపాధి కల్పన సమాచారం మీద ఒక నివేదిక తయారు చేశారు. వుద్యోగ కల్పన దృశ్యం కలతపరిచేదిగా కనిపించటంతో దాన్ని పక్కన పెట్టేశారు. అయినా ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం వుండి, నాలుగున్నర సంవత్సరాలు ప్రధాని పదవిలో వున్న పెద్దమనిషి వుద్యోగాల సమాచారం లేదని చెప్పటం సిగ్గుపడాల్సిందిగా వుంది కదా ! కార్మికశాఖ 2016-17 సంవత్సరానికి తయారు చేసిన నివేదికను కూడా ప్రభుత్వం తొక్కి పెట్టిందని చెబుతున్నారు. దొరికిందేదో చేయక కోరిన వుద్యోగం రాలేదని ఖాళీగా వున్న వారిని నిరుద్యోగులుగా లెక్కించకూడదని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ సెలవిచ్చారు. నిజమే రాజకీయ నిరుద్యోగులకు అది వర్తిస్తుంది, పదవులేమీ ఇవ్వకపోయినా అధికారపార్టీ తనలో చేరినవారందరికీ కండువాలు కప్పి మందలో కలిపేసుకుంటే అలాంటి వారు ఏమి చేస్తున్నారో ఎలా సంపాదించుకుంటున్నారో చూస్తున్నాము. కానీ వుపాధి విషయంలో అలా కుదరదే. కొత్తగా ఎవరైనా పకోడి బండి పెట్టుకుంటే వున్న తమకే బేరాల్లేకపోతే నువ్వొకడివా అంటూ గుర్రుగా చూసే పరిస్ధితి. జవదేవకర్‌ నిర్వచనం ప్రకారం ఆవుల పెంపకం, పకోడి బండి, టీ ఫ్లాస్కులు తీసుకొని రోడ్డెక్కటానికి అవకాశం లేని వారందరినీ నిరుద్యోగులుగా లెక్కించటానికి లేదు. దేశంలో నిరుద్యోగులు 2018 డిసెంబరులో 7.4శాతానికి పెరిగారు. జనవరి ఆరవ తేదీ నాటికి 30రోజు సగటు నిరుద్యోగుల సంఖ్య 7.8శాతానికి పెరిగింది. డిసెంబరులో మొత్తం వుపాధి పొందుతున్నవారి సంఖ్య 3.97కోట్లు, అదే 2017 డిసెంబరులో వున్నవారితో పోల్చితే 1.1 కోట్లు తక్కువ. తాను చెప్పిన దానిని ఎలాంటి జంక గొంకు లేకుండా పాటిస్తున్న వారిని చూసి గోబెల్స్‌ ముసిముసి నవ్వులు నవ్వుతూనే వుంటాడు.