• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2019

మేథావులూ మీ రెటు వైపో తేల్చుకోండి !

27 Saturday Jul 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Adoor Gopalakrishnan, Jai Sri Ram, letters war, open letter to Prime Minister Modi

Image result for martin luther king jr quotes on intellectuals

ఎం కోటేశ్వరరావు

” చెడ్డవారి ద్వేష పూరితమైన మాటలు, చేతలకే కాదు, భయంకరమైన నిశ్శబ్దాన్ని పాటించే మంచి వారి గురించి కూడా మనం ఈ తరంలో పశ్చాత్తాప పడాల్సి వుంటుంది.” మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన మాటలివి. దేశంలో నేడు పెరుగుతున్న విద్వేష ధోరణులు, వాటిని పెంచి పోషిస్తున్న వారి తీరును గురించి నోరు విప్పని వారికి ఇవి చక్కగా వర్తిసాయి.కొంత కాలం క్రితం ఆవుల సంరక్షణ పేరుతో దాడులు చేసి చంపివేస్తే, ఇప్పుడు కొంత మంది ఆకస్మికంగా ప్రత్యక్షమై మైనారిటీ మతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని జై శ్రీరామ్‌ అనాలని వత్తిడి చేయటం, నిరాకరించిన వారి మీద దాడులు చేస్తున్న వార్తలు నిత్యం ఏదో ఒక మూలన జరుగుతున్నాయి. వీటిని న్యాయ విచారణ పద్దతిని పాటించని దాడులు, హత్యలు(ఆటవిక) అంటున్నారు. అలాంటి వాటిని నిరోధించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ రాశారు. దానికి ప్రతిగా ప్రతిగా 62 మంది ప్రముఖులు మోడీకి లేఖ రాసిన వారి మీద దాడి చేస్తూ మరో లేఖ రాసి మోడీకి మద్దతు పలికారు. రాముడి పేరుతో ఆటవిక దాడులు చేసి పేరును దుర్వినియోగం చేయవద్దు అని కోరిన రాముడి భక్తుల మీద దాడి ప్రారంభించి పేరు మార్చుకోండి, భూమ్మీద వుండవద్దు అని బరితెగిస్తున్నారు.

ఈ ఏడాది మార్చినెలలో సుప్రీం కోర్టు ముందుకు ఒక పిటీషన్‌ వచ్చింది. అదేమంటే దేశంలోని ముస్లింలను పాకిస్ధాన్‌ పంపాలంటూ కోర్టు ఆదేశించాలంటూ దాన్ని దాఖలు చేశారు. దాన్ని న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ మరియు వినీత్‌ శరణ్‌లతో కూడిన బెంచ్‌ విచారణకు చేపట్టింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాదిని పిటీషన్‌లోని అంశాన్ని గట్టిగా చదవమని న్యాయమూర్తి నారిమన్‌ అడిగారు. చదివిన తరువాత మీరు నిజంగా ఈ కేసును వాదించదలచుకున్నారా, తరువాత మీ మీద విమర్శలు చేయాల్సి వుంటుంది అని వ్యాఖ్యానించటంతో సదరు న్యాయవాది లేదు అని చెప్పి జారుకున్నాడు. ఆటవిక హత్యల గురించి నరేంద్రమోడీకి లేఖ రాసిన 49 మందిలో ప్రఖ్యాత దర్శకుడు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ ఒకరు. ఆ లేఖను సహించలేని కేరళ బిజెపి నేత ఒకరు గోపాలకృష్ణన్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.చేశారు. జై శ్రీరామ్‌ నినాదాన్ని భరించలేకపోతే శ్రీహరి కోటలో పేరు నమోదు చేసుకొని చంద్రుడి మీదకో లేదా మరో గ్రహానికో పొమ్మని, పేరు మార్చుకుంటే మంచిదని నోరు పారవేసుకున్నాడు. అయితే అలాగే వెళతా చంద్రుడి మీదకు టిక్కెట్‌ ఏర్పాటు చేయండి అని మరోమారు నోరెత్తకుండా కృష్ణన్‌ సమాధానమిచ్చారు అనుకోండి.

Image result for adoor gopalakrishnan

విద్వేషం ముదిరి ముస్లింలు అయితే పాకిస్ధాన్‌ పోవాలంటున్న వారు హిందువుల వరకు వచ్చే సరికి అసలు భూమ్మీదే వుండకూడదని చెబుతున్నారు. దబోల్కర్‌, గోవింద పన్సారే, కలుబుర్గి, గౌరీ లంకేష్‌లను అలాగే లేకుండా చేసిన విషయం తెలిసిందే. గోపాలకృష్ణన్‌ విషయానికి వస్తే ఆయన ప్రముఖ మళయాళీ, కేరళ వాసి కావటంతో పర్యవసానాలను గమనంలో వుంచుకొని అంతం చేస్తామని బెదిరించలేదు తప్ప ఈ దేశంలోనే కాదు, అసలు భూమ్మీదే వుండవద్దని చెప్పారు. అంతే కాదు, కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం నుంచి గోపాలకృష్ణన్‌కు ఇంతవరకు ఎలాంటి సత్కారాలు జరగలేదు కనుక ఇలా మాట్లాడుతున్నారని కూడా నోరు పారవేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రతిభా పాటవాలను బట్టిగాక భావజాలాన్ని బట్టి బిజెపి గుర్తిస్తుందన్న వాస్తవాన్ని ఆ పెద్ద మనిషి దాచుకోలేకపోయాడు. ఆటవిక చర్యలకు పాల్పడే సమయంలో జై శ్రీరామ్‌ అనటానికి తాను వ్యతిరేకం తప్ప ఎవరైనా వచ్చి తన ఇంటి ముందు ఆ నినాదం చేస్తే తాను కూడా వారితో గొంతు కలుపుతానని, తనకు ఇప్పటికే ఎన్నో ఘనమైన గౌరవాలు దక్కాయని, ఇంకా కావాలన్న ఆసక్తి లేదని కూడా గోపాల కృష్ణన్‌ చెప్పారు. తాను కూడా భక్తుడనేనని, రాముడు ఆదర్శ పురుషుడు, ఆయనను ఇలాంటి పద్దతుల్లో అవమానించకూడదని ఆయన స్పష్టం చేశారు.

తమతో విబేధించిన వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం సంఘపరివార్‌ శక్తులకు కొత్త అంశం కాదు. మధ్యలోనే రాజీనామా చేసిన రిజర్వుబ్యాంకు మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌, ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక వారు బాధ్యతల్లో వున్నపుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఏదో ఆశించి విమర్శిస్తున్నారంటూ దాడి చేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు. జరుగుతున్న లోపాలు తెలిసి కూడా అనేక మంది నోరు విప్పటం లేదు. గుడులకు పరిమితం కావాల్సిన దేవుళ్లను వీధుల్లోకి లాక్కువ వచ్చిన కాషాయ దళాలు తమ కుతర్కంతో తమ మానాన తాము వున్న మేథావుల మీద కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నారు, అవమానిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను,దేశంలో జరిగే అవాంఛనీయ ధోరణులను విమర్శించే వారికి ‘ ఏదో ఆశించి లేదా ఆశించింది దక్కక ‘ అన్న ముద్రవేస్తున్నారు. నచ్చని విధానాల మీద బహిరంగంగా స్పందించే ధైర్యవంతులను కాసేపు పక్కన పెడదాం. స్పందించని వారి సంగతేమిటి? స్పందించే వారి మీద ఎదురుదాడులు పెరిగే కొద్దీ నోరు మూసుకొని వుండే వారికి మోడీ ఎంత ముట్టచెప్పారు లేదా ఏ పదవి ఇస్తానని ప్రలోభ పెట్టారు అన్న ప్రశ్నలు ప్రారంభం అవుతాయి. ఇక నరేంద్రమోడీకి అనుకూలంగా ప్రకటన చేసేవారికి అంతకంటే ఎక్కువే ముట్టింది కనుక బస్తీమే సవాల్‌ అంటూ మోడీ విమర్శకుల మీద తొడ కొడుతున్నారని అనుకోవాలి. ఈ దేశంలో జై శ్రీరామ్‌ అనకూడదా అంటూ కు తర్కం, విపరీతార్ధం తీసి వ్యాఖ్యానించిన తెలుగు సినీ రంగంలో వర్దమాన రచయిత అనంత శ్రీరామ్‌ 49 మంది మీద విమర్శలకు దిగాడు,మరో 62 మంది పోటీ ప్రకటన చేశారు, వారూ, శ్రీరామ్‌ మోడీకి, బిజెపికి ఎంతకు అమ్ముడు పోయారు అంటే ఎవరు జవాబు చెబుతారు.

ఏదో ఆశించి విమర్శలు చేస్తున్నారనేది ఇప్పుడు అన్ని రంగాలలో ఒక ఆయుధంగా మారిపోయింది. ఎవరూ సరైన వారు కాదు, అందరిలో లోపాలు వున్నాయనే దాడి వెనుక తమ తప్పిదాలను, దుర్మార్గాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడ దాగి వుంది. తమకు నచ్చని ఏ చిన్న సూచన, లేదా విమర్శ చేసినా సహించే స్ధితి లేదు. అందుకే 49 మంది లేఖపై అంత అసహనం. ఇంతకీ ఆ లేఖలో ఏముందో చూద్దాం.

Image result for narendra modi on lynchings

‘ జూలై 23, 2019,

శ్రీ నరేంద్ర దామోదర్‌ మోడీ,

గౌరవనీయమైన భారత ప్రధాని.

ప్రియమైన ప్రధాన మంత్రి,

శాంతిని ప్రేమించే మరియు భారతీయులంగా గర్వించే మేము ఇటీవలి కాలంలో మన ప్రియమైన దేశంలో జరుగుతున్న అనేక విషాదకర ఘటనల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాము. అన్ని మతాలు,తెగలు,కులాలు, లింగపరంగా అందరినీ సమానులుగా పరిగణించే మన రాజ్యాంగం దేశాన్ని సమసమాజ, ప్రజాస్వామ్య సర్వసత్తాక దేశంగా వర్ణించింది. అందువలన అతడు లేదా ఆమెకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ప్రతి వారూ అనుభవించేట్లు చూడాల్సి వుంది. అందుకు గాను మావినతి ఇలా వున్నది.

1. ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలను న్యాయ విచారణ పద్దతులను పాటించకుండా చంపటాన్ని(ఆటవిక హత్యలు) వెంటనే నిలుపుదల చేయించాలి.2016లో దళితుల మీద 840 అత్యాచారాలు జరిగినట్లు, ఆ వుదంతాలలో శిక్షలు పడుతున్న శాతం పడిపోతుండటాన్ని జాతీయ నేర నమోదు సంస్ధ(ఎన్‌సిఆర్‌బి) ద్వారా తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాము. అంతేకాదు 2009 జనవరి ఒకటి నుంచి 2018 అక్టోబరు 29 మధ్య మత సంబంధమైన గుర్తింపు ప్రాతిపదికన 254విద్వేష పూరిత నేరాలు జరిగినట్లు నమోదైంది. వాటిలో 91 మంది మరణించగా 579 మంది గాయపడ్డారు.(ఫ్యాక్ట్‌ చెకర్‌ డేటా, 2018 అక్టోబరు 30) ది సిటిజన్స్‌ రిలీజియస్‌ హేట్‌ క్రైమ్‌ వాచ్‌ నమోదు చేసిన దాని ప్రకారం 62శాతం కేసులలో ముస్లింలు (భారత జనాభాలో 14శాతం మంది), క్రైస్తవులు(దేశ జనాభాలో రెండుశాతం) 14శాతం కేసులలో బాధితులు. వీటిలో 90శాతం దాడులు జాతీయంగా మీ ప్రభుత్వం అధికారం స్వీకరించిన 2014 మే నెల తరువాత నమోదైనవి.

ఎటువంటి న్యాయ విచారణ పద్దతులను పాటించకుండా చంపిన వుదంతాలను ప్రధాన మంత్రిగా మీరు పార్లమెంట్‌లో విమర్శించారు, అయితే అది చాలదు. దుష్కార్యాలకు పాల్పడిన వారి మీద ఏ చర్య తీసుకున్నారు ? అటువంటి నేరాలకు పాల్పడిన వారికి బెయిలు ఇవ్వకూడదని, ఇతరులు భయపడేవిధంగా శిక్షలు వుండాలని, వేగంగా, తప్పకుండా పడాలని మేము గట్టిగా భావిస్తున్నాము.హత్యలు చేసినపుడు ఎలాంటి పెరోల్‌ లేకుండా జీవితకాల శిక్షలు వేయటానికి అవకాశం వున్నపుడు అంతకంటే క్రూరమైన ఆటవిక హత్యలకు పాల్పడుతున్నవారికి అలాంటి శిక్షలు ఎందుకు వేయకూడదు ? ఆమె లేదా అతను ఎవరూ తమ స్వంత దేశంలో భయంతో బతక కూడదు.

దురదృష్టకరంగా నేడు ‘జై శ్రీరామ్‌’ రెచ్చగొట్టే పోరు నినాదంగా మారింది. అది శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తున్నది.ఆ పేరుతో ఆటవిక హత్యలు చోటు చేసుకుంటున్నాయి. మతం పేరుతో ఎక్కువగా హింసాకాండకు పాల్పడటం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఇవి మధ్య యుగాలు కావు. భారత్‌లో మెజారిటీగా వున్న జనంలో అనేక మందికిి రాముడి పేరు పవిత్రమైనది. దేశంలోనే అత్యున్నత బాధ్యతల్లో వున్న మీరు రాముడి పేరును ఈ విధంగా భష్ట్రు పట్టించటాన్ని వెంటనే నిలుపుదల చేయించాలి.

2.భిన్నాభి ప్రాయం లేపోతే ప్రజాస్వామ్యమే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతిని వ్యక్త పరచేవారిని ఆ కారణంతో దేశ వ్యతిరేకులు లేదా అర్బన్‌ నక్సల్‌ అని నిర్బంధించకూడదు. రాజ్యాంగం కల్పించిన రక్షణ ఆర్టికల్‌ 19ప్రకారం భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్చలో అసమ్మతి అంతర్భాగం.

పాలకపార్టీని విమర్శించటం అంటే దేశాన్ని విమర్శించినట్లు కాదు. అధికారంలో వున్నంత మాత్రాన ఏ పార్టీ కూడా దేశానికి పర్యాయపదం కాదు. అది ఆ దేశంలోని రాజకీయ పార్టీలలో ఒకటి మాత్రమే. అందువలన ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని జాతీయ వ్యతిరేక మనోభావాలతో సమంగా చూడకూడదు. ఎక్కడైతే అసమ్మతిని అణచివేయని స్వేచ్చా వాతావరణం వుంటుందో అది మాత్రమే బలమైన దేశాన్ని తయారు చేస్తుంది. మన దేశ భవితవ్యత కొరకు సమంజసమైన మరియు ఆతృత కలిగిన భారతీయులంగా మేము దేనికొరకైతే సూచనలు చేశామో వాటిని ఆ స్ఫూర్తితో పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాము.’

అంటూ 49 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, మణిరత్నం, అపర్ణాసేన్‌, రామచంద్ర గుహ వంటి ప్రముఖులు వున్నారు. దీనికి ప్రతిగా 62 మంది ప్రముఖులు పై లేఖ రాసిన వారి మీద ఎదురు దాడి చేస్తూ అంతకంటే పెద్ద లేఖను రాశారు. ఫలానా అంశం మీద మీరెందుకు స్పందించలేదు, నరేంద్రమోడీ దేశాన్ని ఐక్యంగా వుంచుతుంటే, విదేశాల్లో దేశపరువు తీసే విధంగా, మోడీని ప్రతినాయకుడిగా చూపుతున్నారంటూ 49 మంది లేఖలో లేని అంశాలను ఏకరువు పెట్టారు. దేశంలో ఎవరు ఏ అంశం మీద అయినా స్పందించేందుకు హక్కు వుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే 49 మంది లేఖలో ఎక్కడా ప్రధానిని కించపరచలేదు, జరుగుతున్నదాడులకు బాధ్యుడు మోడీ అని లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, సంస్ధలని ఎక్కడా ప్రస్తావించలేదు. తాము చూస్తున్న,జరుగుతున్న పరిణామాల మీద స్పందించారు. దానికి జవాబు నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలని ఎవరైనా ఆశిస్తారు. కాశ్మీరు విషయంలో మధ్యవర్తిత్వం లేదా తీర్పు చెప్పాలని తనను నరేంద్రమోడీయే స్వయంగా కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగా చెప్పాడు. స్వయంగా తన మీద వచ్చిన అంశానికే నోరు విప్పేందుకు నరేంద్రమోడీకి ధైర్యం లేకపోయింది. మా ప్రధాని అలా అడగలేదు అనటం తప్ప ట్రంప్‌ అబద్దం చెప్పాడు అని మంత్రులు లేదా ప్రభుత్వం ప్రకటన చేసే దమ్మును 56 అంగుళాల ఛాతీ ప్రదర్శించలేకపోయింది.

నలభై తొమ్మిది మంది మన దేశానికే పరిమితమై మన ప్రధానికే లేఖ రాశారు. ఇదే పరువు తీసే అంశమైతే అంతర్జాతీయ స్ధాయిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో మోడీ గురించి చెప్పిన అంశం మన దేశ, ప్రధాని పరువు నిలబెట్టేదని 62 మంది మేథావులు భావిస్తున్నారా? అవునంటే ట్రంప్‌ను అభినందించారా కాకపోతే ఖండిస్తూ ప్రకటన ఏమైనా చేశారా అంటే లేదు. ఫలానా అంశం మీద మీరెందుకు స్పందించలేదని ఇతరులను ప్రశ్నిస్తున్న వారు యావత్‌ దేశ ప్రతిష్టకు, దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా మోడీ అడిగినట్లు చెప్పిన అంశం మీద ఎందుకు స్పందించలేదో చెబుతారా ? అంతర్జాతీయంగా మోడీ గబ్బుపట్టినా, అపహాస్యం పాలైనా ఫరవాలేదని 62 మంది అనుకుంటున్నారా ? కొన్ని ఎంపిక చేసిన అంశాల మీదనే స్పందిస్తున్నారని 62 మంది మేథావులు ప్రశ్నించారు. మీ లేఖలో మీరు ఎంపిక చేసుకున్న అంశాలు గాక ఇతర వాటిని ఎందుకు విస్మరించారో చెప్పాలి.ఈ దేశంలో 49 మందే కాదు 62 మంది కూడా అన్ని అంశాల మీద స్పందించాలని నిర్ణయించుకున్న బృందాలు కావు, అది సాధ్యం కూడా కాదు. కొందరు ప్రస్తావించిన దాని మీద చర్చ లేక స్పందనకు పరిమితం కాకుండా లేని అంశాలను ఎందుకు లేవనెత్తలేదనటం అడ్డగోలు వాదన తప్ప మేథావితనం కాదేమో ! ప్రధానికి లేఖ రాస్తే స్పందించాల్సింది ఆయన లేదా ప్రధాని కార్యాలయం, వారు చేయాల్సిన దాని మీద స్పందించే బాధ్యతను మీకు ఎవరైనా ఇచ్చారా ? లేదూ ఆ బాధ్యతను మీరు స్వచ్చందంగా పుచ్చుకుంటే మీరు ఎన్నింటి మీద, ఎప్పుడు, ఎలా స్పందించారో వివరించండి.

Image result for karl marx on intellectuals

మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు కోపం అన్నట్లు 62 మంది స్పందన వుంది. దేశంలో జరుగుతున్న నేరాల గురించి జాతీయ నేరాల నమోదు సంస్ధ(ఎన్‌సిఆర్‌బి) వెల్లడించిన అంశాలనే 49 మంది తమ లేఖలో వుటంకించారు. అంటే సదరు ఎన్‌సిఆర్‌బి అంతర్జాతీయంగా దేశం, మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాటిని నమోదు చేసినట్లా ? ఆటవిక హత్యల గురించి గతంలో ఎన్నడూ ఎవరూ సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయలేదు. గతంలో జరిగిన ఆటవిక హత్యలేమైనా వుంటే అవి శాంతి భద్రతల సమస్యల్లో భాగంగా జరిగాయి. గత ఐదు సంవత్సరాలుగా ఆవు సంరక్షణ పేరుతో, జైశ్రీరామ్‌ పేరుతో మైనారిటీ మతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు, హత్యలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఆటవిక దాడులు, వాటిని నిరోధించేందుకు, శిక్షాపరంగా తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని ఒక వాజ్యంలో సుప్రీం కోర్టు గతేడాది జూలైలో కేంద్రం, మానవహక్కుల కమిషన్‌, రాష్ట్రాలను కోరింది. ఆటవిక హత్యలను ప్రత్యేక నేరంగా పరిగణించాలని పార్లమెంట్‌ను కూడా కోరింది. ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్‌ వెల్లడించిన 45పేజీల తీర్పు మన దేశంలో నెలకొన్న పరిస్ధితికి పాలకులను తీవ్రంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. పరువు, ప్రతిష్ట గురించి పాకులాడే వారికి ఇంతకంటే పరువుతక్కువ మరొకటి వుండదు. అలాంటి తీర్పు ఇచ్చి ఏడాది గడిచినా గడచినా స్పందన లేదేమిటని అదే కోర్టు మరోసారి ఈనెలల అడగటం అంటే మన చర్మాలు ఎంత మొద్దుబారాయో గుర్తు చేయటమే. ఎంపిక చేసుకున్న అంశాల మీద లేఖలు రాస్తున్నారని 49 మందిని విమర్శించిన 62 మంది సుప్రీం కోర్టు స్పందన గురించి ఏమంటారు. కోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో వుండగా దీన్ని పట్టించుకోవటంలో దురుద్ధేశ్యం వుందని, కేంద్రాన్ని ఎండగట్టేందుకు కేసులను ఎంపిక చేసుకుందని తప్పుపడతారా ? ఆవేదన చెందిన ప్రముఖులు కోరినా, చివరకు సర్వోన్నత న్యాయస్ధానం అడిగినా స్పందించని వారి గురించి 62 మంది ఏమంటారు? అసలు 62 మంది సమస్య ఏమిటి?

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ కొద్ది రోజుల క్రితం ముంబై సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ 150 వార్షికోత్సంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి తన పాలనా కాలంలో ఆర్ధిక వ్యవస్ధను రెండింతలు చేసి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచేందుకు నిర్ణయించటం అభినందనీయం అన్నారు. అయితే దేశంలో అంతా సవ్యంగా లేదు, సామాజిక రంగంలో తీవ్ర ఆందోళనకర పరిస్ధితులు వున్నాయి. తీవ్రమైన దారిద్య్రం మన సమాజాన్ని పీడిస్తోంది. అది వేగాన్ని మందగింప చేసి మనం ముందుకు పోవటానికి ఆటంకం అవుతుంది. అసహనం పెరగటం, విద్వేష పూరిత నేరాలు, తమకు తోచిన నీతి, రీతిని ఇతరుల మీద బలవంతంగా రుద్దటం వంటి అంశాలు దేశ ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దేశంలో సామాజిక అస్ధిరత పెరుగుతోంది.మహిళల మీద నేరాలు, కుల, మత ప్రాతిపదికన హింసాకాండ వంటి ఇతర అన్ని రకాల అసహనం దేశమంతటా ప్రబలిపోయింది. సామాజిక సామరస్యతను సాధించేందుకు ఆటంకంగా మారుతున్నది. దేశంలో నిరుద్యోగం 6.1శాతం వుండటం నాలుగుదశాబ్దాల రికార్డు, దాన్ని త్వరలో పరిష్కరించాలి. నీటి సంక్షోభం వుంది, వైద్య సదుపాయాలు కుంటుపడుతున్నాయి. తోటి వర్ధమాన దేశాలతో పోల్చుకుంటే దేశంలో ఆర్యోగ సంరక్షణకు చేస్తున్న ఖర్చు అట్టడుగున వుంది. కొన్ని అంశాలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించేందుకు పూనుకోవాలి అని కూడా ఆది గోద్రెజ్‌ చెప్పారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఆటవిక హత్య గురించి పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ తనకు బాధ కలిగించిందని, నిందితులకు సాధ్యమైన మేరకు కఠిన శిక్ష వేయాలని వ్యాఖ్యానించారు.పోలీసుల ముందే జరిగిన మూకదాడి గురించి పార్లమెంటులో మాట్లాడక తప్పని స్ధితి వచ్చింది. వీటి గురించి 62 మంది మేథావులు ఏమంటారు? ఆది గోద్రెజ్‌ కూడా ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని కాలేజీ సభను ఎంపిక చేసుకొని మాట్లాడారా ?

ఆటవిక చర్యలకు పాల్పడే సమయంలో జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయటాన్ని లేదా ఆ నినాదాలు చేస్తూ ఆటవిక చర్యలు చేపట్టటాన్ని సభ్య సమాజం తప్పుపడుతోంది. ఆ చర్యలు మన దేశ సంస్కృతి కాదు, పురాణాలు, ఇతర గ్రంధాల్లో చరిత్రలో ఎక్కడా జై శ్రీరామ్‌ పేరుతో ఆటవిక పద్దతులను పాటించటమే మన సంస్కృతి అని ఎక్కడా చెప్పలేదు. మధ్య యుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో, జర్మనీలో హిట్లర్‌ను పొగిడే సందర్భంలో ఇలాంటి వున్మాద పూరితమైన వ్యవహారాలు జరిగాయి తప్ప మరెక్కడా కానరాదు. మోడీకి లేఖ రాసిన 49 మంది తమవైన రాజకీయ అభిప్రాయాలు కలిగి వుండవచ్చు తప్ప వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు, రాజకీయాల్లో వున్న వారు కాదు.అలాగే మోడీకి మద్దతుగా లేఖ రాసిన వారు 62 మంది ఏ పార్టీకి చెందినవారన్నది సమస్య కాదు. ఎవరు ఏ భావజాలానికి ప్రతినిధులుగా జనం ముందుకు వచ్చారన్నదే ముఖ్యం.

Image result for intellectual's

మతోన్మాదులు, ఫాసిస్టులు, నాజీలు, ఇతర నియంతలు ఏలిన దేశాల చరిత్రను చూస్తే మేథావులు ఎప్పుడూ, ఎక్కడా ఒకే వైఖరితో లేరు. దోపిడీ పద్దతులు, విధానాలను రూపొందించిందీ, దోపిడీని నిర్మూలించే, సమసమాజాన్ని నిర్మించే పద్దతులనూ చెప్పింది కూడా మేథావులే. 1925లో ఇటలీలో ఫాసిస్టు మేథావులు సభ జరిపి తమ ప్రణాళికను ప్రకటించిన తరువాత ఫాసిస్టు వ్యతిరేక మేథావులు తమ ప్రణాళికను ప్రకటించారు. ఇలాంటి పరిణామాలు అనేక దేశాల్లో జరిగాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి సమీకరణ జరుగుతున్నది. వాస్తవానికి దాన్ని సంఘపరివార్‌ శక్తులు వేగవంతం చేస్తున్నాయి. మేథావులుగా వున్న వారు తాము ఎటు వైపో తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వారు కల్పిస్తున్నారు. మేము అటు వామపక్షం కాదు ఇటు మితవాద పక్షం కాదు అనుకునే వారు కూడా ఏదో ఒకవైపు సమీకరణ అయ్యేందుకు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మితవాదులు వారిని మధ్యలో వుండనివ్వరు. తమను విమర్శించే వారందరూ తమకు వ్యతిరేకులే అన్నది ఇప్పుడు నడుస్తున్న ధోరణి. తమకు అనుకూలంగా లేనివారందరూ కూడా వ్యతిరేకులే అనే సూచనలు కనిపిస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్చను మన దేశంలో ఫాసిస్టులు, నాజీలకు ప్రతిరూపాలుగా వున్న శక్తులు సహించే స్ధితిలో లేవు. మేథావులు ఎప్పుడూ రెండు తరగతులుగా వుంటారని చరిత్ర చెప్పింది. ఒక తరగతి పాలకవర్గాలకు వూడిగం చేసేందుకు తమ మేథోశక్తిని వుపయోగించి చరిత్ర చెత్తబుట్టలోకి పోతే, మరో తరగతి ప్రజల గొంతుకగా ముందుండి నిరంతరం జనం నోళ్లలో నానుతున్నారు. అందువలన మేథావులు ఎటు వైపు వుండాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్న మైంది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దెబ్బకు దెబ్బ – ఓడకు ఓడ – అమెరికా వలలో బ్రిటన్‌ !

23 Tuesday Jul 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Britain, Grace 1, Iran Oil, Iran Tanker, Stena Impero, tit-for-tat ship seizures, UK Tanker., US Trap

Image result for Ship crisis: Britain falls into a dangerous US trap

ఎం కోటేశ్వరరావు

దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను అందరికీ తెలిసిన ప్రతీకార చర్యలు. ఇప్పుడు గల్ఫ్‌లోని హార్ముజ్‌ జలసంధిలో అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రతీకార చర్యలలో బ్రిటన్‌ ఓడకు ఓడ చేరింది.తమ ఓడను పట్టుకున్న బ్రిటన్‌ చర్యకు ప్రతిగా బ్రిటన్‌ ఓడను ఇరాన్‌ పట్టుకొని తన రేవుకు తరలించింది. అమెరికా పన్నిన వలలో తనకు మాలిన ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించిన బ్రిటన్‌ ఇప్పుడు ఇరాన్‌తో కొత్త వైరాన్ని తెచ్చుకుంది, దాన్నుంచి పరువు దక్కించుకొని ఎలా బయపడుతుందన్నది ఆసక్తికరం. ఇరాన్‌ వ్యవహారంలో ఒంటరిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అమెరికా తనకు తోడుగా బ్రిటన్‌ వున్నట్లు ప్రపంచానికి చూపింది. ఇరాన్‌ అణు ఒప్పందంపై అమెరికా వైఖరిని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న బ్రిటన్‌ ఇప్పుడు ఈ పిచ్చిపని ఎందుకు చేసిందని ఆంగ్లేయులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఎవరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు, ఎలా జరిగిందన్నది తేలాలని కోరుతున్నారు. మరోవైపు బ్రిటన్‌ చర్యకు ఐరోపా యూనియన్‌(ఇయు) మద్దతు ప్రకటించలేదు. మౌనంగా వుంది. ఇరాన్‌ చర్యను మాట మాత్రంగా ఫ్రాన్స్‌, జర్మనీ తప్ప ఐరోపా యూనియన్‌ తప్పు పట్టలేదు, మౌనం దాల్చింది. అమెరికా-ఇరాన్‌ వివాదంలో బ్రిటన్‌ ముందుకు రావటం యాదృచ్చికమా ? వ్యూహాత్మకమా ? అమెరికా పన్నిన వలలో చిక్కుకుందా? పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయి? ఇది అనూహ్య పర్యవసానాలకు దారి తీస్తుందా ? తన తప్పిదాన్ని బ్రిటన్‌ గ్రహిస్తే టీ కప్పులో తుపానులా ముగుస్తుందా ! పరువు ప్రతిష్టలకు పోయి మరేదైనా చేస్తుందా ?

తాజా వుదంత నేపధ్యాన్ని క్లుప్తంగా చూద్దాం. జూన్‌ 13: తమ రెండు చమురు ఓడలపై ఇరాన్‌ దాడి చేసిందని అమెరికా ఆరోపణ, తప్పుడు ప్రచారం తప్ప అలాంటిదేమీలేదని ఇరాన్‌ ఖండన. జూన్‌ 20: తమ గగన తలాన్ని అతిక్రమించినందున అమెరికా మిలిటరీ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్‌ ప్రకటన. ప్రతిదాడికి ఆదేశాలిచ్చిన ట్రంప్‌ 150 మంది పౌరుల ప్రాణాలు పోతాయని చెప్పటంతో చివరి నిమిషంలో వుపసంహరించుకున్నట్లు అమెరికా మీడియా ద్వారా వెల్లడి. జూలై 4: సరిగ్గా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజున సిరియాకు చమురు తీసుకు వెళుతోందని, ఇది ఇయు ఆంక్షలను వుల్లంఘించటమే అనే సాకుతో జిబ్రాల్టర్‌ ప్రభుత్వ కోరిక మేరకు బ్రిటన్‌ నౌకాదళం రంగంలోకి దిగి జిబ్రాల్టర్‌ జలసంధిలో పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఇరాన్‌ చమురు ఓడ గ్రేస్‌1ని పట్టుకుంది. దెబ్బకు దెబ్బగా బ్రిటీష్‌ చమురు ఓడలను పట్టుకుంటామని ఇరాన్‌ ప్రకటన. జూలై 10: వాణిజ్య నౌక బ్రిటీష్‌ హెరిటేజ్‌ను అడ్డుకోబోయిన మూడు ఇరాన్‌ పడవలకు దగ్గరగా వెళ్లిన బ్రిటన్‌ నావీ ఫ్రైగేట్‌ హెచ్‌ఎంఎస్‌ మాంట్‌రోజ్‌, హెచ్చరికలతో ఇరాన్‌ పడవలు వెళ్లిపోయాయని, ఎలాంటి కాల్పులు జరగలేదని బ్రిటన్‌ ప్రకటన. అయితే ఆ వుదంతానికి ఎలాంటి ఆధారాలు లేవు, అస్పష్టమైన ఫొటోల వెల్లడి. అలాంటిదేమీ లేదని ఇరాన్‌ ప్రకటన.ఈ నౌక తన ట్రాకర్‌ను ఒక రోజు ముందుగా నిలిపివేసింది. దానికి వెన్నుదన్నుగా బ్రిటీష్‌ యుద్ధ నౌక ఎందుకు వెళ్లింది అన్న ప్రశ్నకు సమాధానాలు లేవు. జూలై 11: గ్రేస్‌1 నౌక కెప్టెన్‌, ఇతర అధికారులను అరెస్టు చేసినట్లు జిబ్రాల్టర్‌ ప్రకటన. ఇయు ఆంక్షలను వుల్లంఘించారని ఆరోపణ. రెండు రోజుల తరువాత బెయిలు మీద అధికారుల విడుదల. ఆంక్షలను వుల్లంఘించబోమని ఇరాన్‌ హామీ ఇస్తే గ్రేస్‌1 టాంకర్‌ను వదులుతామని ఇరాన్‌ మంత్రికి బ్రిటన్‌ విదేశాంగ మంత్రి ప్రతిపాదన. జూలై 15:ఇరాన్‌ అణు ఒప్పందంపై బ్రసెల్స్‌లో ఇయు విదేశాంగ మంత్రుల సమావేశం. గల్ఫ్‌లో సైనిక చర్యకు చూస్తున్న ట్రంప్‌కు మద్దతు ఇచ్చేది లేదని బ్రిటన్‌ నేతల ప్రకటన. జూలై 16:తమ నౌక గ్రేస్‌1 నిర్బంధం అపహరణ తప్ప మరొకటి కాదని, దెబ్బకు దెబ్బ తీస్తామని ఇరాన్‌ అధ్యక్షుడి ప్రకటన.జూలై 17: యుఏయి నుంచి బయలు దేరిన పనామా పతాకం వున్న చమురు ఓడను హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ నిర్బంధించినట్లు అనుమానిస్తున్నట్లు అమెరికా అధికారుల వెల్లడి. ఇరాన్‌ జలాల్లో ప్రవేశించే ముందు మూడురోజుల క్రితమే ట్రాకర్‌ను ఆపివేసిన ఓడ. తమ దళాలు ఒక విదేశీ ఓడను, పన్నెండు మంది సిబ్బందిని పట్టుకున్నట్లు ఇరాన్‌ ప్రకటన. జూలై 18: తమ నౌక యుఎస్‌ బాక్సర్‌కు వెయ్యి గజాల సమీపానికి వచ్చిన ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ట్రంప్‌ ప్రకటన, అంత సీన్‌ లేదు, అదంతా వట్టిదే అని ప్రకటించిన ఇరాన్‌. జూలై 19: హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ రెండు నౌకలను నిర్బంధించినట్లు వార్తలు. వాటిలో ఒకటైన బ్రిటన్‌ స్టెనా ఇంపెరో అంతర్జాతీయ నౌకా నిబంధనలను వుల్లంఘించినందున అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్‌ ప్రకటన. లైబీరియా పతాకంతో వున్న మరొక నౌక మెస్‌డార్‌ను నిలువరించిన ఇరాన్‌ దళాలు తరువాత వారి ప్రయాణాన్ని అనుమతించినట్లు నౌక ఆపరేటర్‌ ప్రకటన.

Image result for iran oil tanker, gibraltar

ఇరాన్‌ అనే ఒక చిన్న దేశాన్ని దెబ్బతీసేందుకు అమెరికా అనే ప్రపంచ అగ్రరాజ్యం గత కొద్ది నెలలుగా గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు చేస్తున్న యత్నాలను ప్రపంచం చూస్తోంది.వాటిలో ఓడకు-ఓడ కొత్త అధ్యాయం. అట్లాంటిక్‌-మధ్యధరా సముద్రాలను కలిపే, ఐరోపా-ఆఫ్రికాలను విడదీసే జలసంధి పేరు జిబ్రాల్టర్‌. ఐరోపాలో స్పెయిన్‌, ఆఫ్రికాలో మొరాకో ఈ జలసంధికి ఎదురెదురుగా వుంటాయి. వాటి మధ్య దూరం కేవలం 14.3కిలోమీటర్లే. జిబ్రాల్టర్‌ 30వేల జనాభా వున్న బ్రిటీష్‌ పాలిత ప్రాంతం. అది స్పెయిన్‌దే అయినప్పటికీ ఆధిపత్యం కోసం ఐరోపాలో జరిగిన యుద్ధాలలో కీలకమైన ఈ ప్రాంతాన్ని 1713లో బ్రిటన్‌కు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ బ్రిటన్‌ నౌకాదళ స్దావరం వుంది. ప్రపంచంలో సముద్రం ద్వారా జరిగే వాణిజ్య ఓడల రవాణాలో సగం ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సి వుంది. ఆ ప్రాంతాన్ని తమకు తిరిగి అప్పగించాలన్నది స్పెయిన్‌ డిమాండ్‌. అయితే ఇప్పటి వరకు రెండు ప్రజాభిప్రాయ సేకరణల్లో అక్కడి వారు స్పెయిన్‌లో విలీనం కావటానికి గానీ లేదా స్పెయిన్‌ సార్వభౌమత్వాన్ని అంగీకరించటానికి గానీ అంగీకరించలేదు. దాని వెనుక బ్రిటన్‌ హస్తం వుందని వేరే చెప్పనవసరం లేదు.

ఇక తాజా వివాద విషయానికి వస్తే ఈ వుదంతంలో నిబంధనలను వుల్లంఘించి బ్రిటన్‌ గిల్లి కజ్జాకు దిగినట్లు కనిపిస్తోంది. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని నియంత్రించేందుకు ఇరాన్‌, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాన్ని ఇరాన్‌ వుల్లంఘిస్తోందంటూ ఏకపక్షంగా ఆరోపించి ఆ ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా వెంటనే ఇరాన్‌పై ఆంక్షలను తీవ్రతరం చేయటమే కాదు, యుద్ధానికి కాలుదువ్వుతోంది. చమురు అమ్మకాలను అడ్డుకుంటోంది. అమెరికా చర్యలను బ్రిటన్‌తో సహా ఇతర దేశాలేవీ ఆమోదించలేదు. ఇరాన్‌ నౌకను స్వాధీనం చేసుకోవటానికి ఒక రోజు ముందుగా జిబ్రాల్టర్‌ తన చట్టాన్ని సవరించుకుంది. ఆ మేరకు గ్రేస్‌1 చమురు నౌక(టాంకర్‌) ద్వారా ఐరోపా యూనియన్‌ ఆంక్షలను వుల్లంఘించి సిరియాలోని బానియాస్‌ చమురు శుద్ధి కేంద్రానికి చమురు సరఫరా చేస్తున్ననట్లు తమకు అనుమానంగా వుందని జిబ్రాల్టర్‌ చేసిన వినతి మేరకు బ్రిటన్‌ నౌకాదళం రంగంలోకి దిగింది. 2012 నాటి ఐరోపా యూనియన్‌ నిబంధన 36 మేరకు నౌకను స్వాధీనం చేసుకున్నట్లు జిబ్రాల్టర్‌ కోర్టు పేర్కొన్నది.

సిరియాకు చమురు సరఫరాలపై ఐరోపా యూనియన్‌ విధించిన ఆంక్షలు సభ్యదేశాలకు వర్తిస్తాయి తప్ప ఇరాన్‌కు వర్తించవు. ఎందుకంటే ఇరాన్‌ సభ్యరాజ్యం కాదు. నౌకలోని చమురు సిరియాకు కాదని ఇరాన్‌ ప్రకటించింది. అలాంటపుడు ఇరాన్‌ చమురు ఓడను కూడా ఐరోపా యూనియన్‌ మధ్యలో అడ్డుకోకూడదు. ఒకవేళ అడ్డుకున్నా ఇరాన్‌ ప్రకటన తరువాత వదలి వేయాలి. ఇక్కడ ఆంక్షలు విధించిన ఐరోపా యూనియన్‌ అసలు రంగంలోనే లేదు. అలాంటపుడు జిబ్రాల్టర్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకను అడ్డుకోవటానికి బ్రిటన్‌కు ఎవరు అధికారమిచ్చారు? ఐరోపా యూనియన్‌ అలాంటి అధికారం ఇవ్వలేదు. సిరియా మీద ఐరోపాయూనియన్‌ ఆంక్షలను బ్రిటన్‌ అమలు జరుపుతోందా లేక ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలను బ్రిటన్‌ అమలు జరుపుతున్నట్లా ? ఒక వైపు తాను ఐరోపా యూనియన్‌ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. దాంతో తలెత్తిన సంక్షోభంలో ప్రధానిగా వున్న థెరెసా మే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. ఈ తరుణంలో ఇరాన్‌ నౌకను స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయం ఎక్కడ జరిగిందన్నది ఒక ప్రశ్నగా ముందుకు వచ్చింది. అంతర్గతంగా ఏమి జరిగినా అమెరికా తరఫున బ్రిటన్‌ అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు పరస్పర విరుద్ధంగా వున్నాయి. సౌదీ అరేబియాకు తాజాగా సైనికులతో పాటు ఎఫ్‌ 22 యుద్ధ విమానాలను, క్షిపణులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సెనెటర్‌ రాండ్‌ పాల్‌ను నియమించారు. బ్రిటన్‌-ఇరాన్‌ సంబంధాల చరిత్రను చూస్తే రెండు దేశాల మధ్య విశ్వాసం లేదు.1901లో బ్రిటన్‌ వ్యాపారి విలియం నాక్స్‌ డీ అర్సే పర్షియాగా మరో పేరున్న ఇరాన్‌లో చమురు అన్వేషణకు నాటి రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం అక్కడ దొరికే చమురు మొత్తం అతనిదే. లాభాల్లో 16శాతం మాత్రమే ఇరాన్‌కు దక్కుతుంది. కంపెనీ మీద రాజుకు ఎలాంటి ప్రమేయం వుండదు. ఆ విధంగా ది ఆంగ్లో పర్షియన్‌ ఆయిల్‌ కంపెనీ వునికిలోకి వచ్చింది. తరువాత బ్రిటన్‌ ప్రభుత్వం అక్కడ పెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వుత్పత్తులను బ్రిటన్‌కు తీసుకుపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1951లో కంపెనీని జాతీయం చేశారు, ఆస్ధులను స్వాధీనం చేసుకున్నారు. దానికి ప్రతిగా బ్రిటన్‌ తన చమురుశుద్ధి కర్మాగారాన్ని మూసివేసింది. ఇరాన్‌ బ్యాంకు ఖాతాలను స్ధంభింపచేసింది. అయితే 1953లో అమెరికా- బ్రిటన్‌ తమ తొత్తు అయిన షాను గద్దెపై కూర్చోపెట్టాయి. బ్రిటీష్‌ పెట్రోలియం(బిపి)కు తిరిగి చమురు క్షేత్రాలను కట్టబెట్టారు.1979లో అయాతుల్లా ఖొమైనీ నాయకత్వంలో తిరుగుబాటు జరిగే వరకు అదే కంపెనీ దోపిడీ కొనసాగింది. తరువాత మరోసారి చమురు పరిశ్రమను కంపెనీని జాతీయం చేశారు.

Image result for Ship crisis: Britain falls into a dangerous US trap

ఓడకు ఓడ వుదంతానికి ఇరాన్‌ మీద ఒంటి కాలిపై లేచే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ సూత్రధారిగా వున్నట్లు కనిపిస్తున్నది. నౌకను పట్టుకోగానే బోల్టన్‌ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అయితే ఇదంతా అతగాడి బృంద పధకం ప్రకారం జరిగిందని, ఆశ్చర్యం ఒక నటన అని తేలింది. అమెరికా వూబిలోకి తమ దేశాన్ని లాగారని ఆంగ్లేయులు అంటున్నారు. బ్రిటన్‌ స్వాధీనం చేసుకున్న ఇరాన్‌ నౌక పెద్దది కావటంతో అది సూయజ్‌ కాలువ గుండా ప్రయాణించే అవకాశం లేదు.దాంతో మధ్యధరా సముద్రంలో నుంచి జిబ్రాల్టర్‌ జల సంధిలో ప్రవేశించేందుకు గుడ్‌ హోప్‌ ఆగ్రాన్ని చుట్టి వచ్చింది. మరో 48 గంటల్లో ఇరాన్‌ నౌక జిబ్రాల్టర్‌ ప్రాంతానికి రానుండగా అమెరికా గూఢచార సంస్ధలు స్పెయిన్‌ నౌకదళానికి ఆ విషయాన్ని చేరవేశాయి. అయితే స్పెయిన్‌ మీద నమ్మకం లేని అమెరికన్లు బ్రిటన్‌కు సైతం తెలియచేశారు. వారు కోరుకున్నట్లుగానే బ్రిటన్‌ అడ్డగించింది. ఈ సైనిక చర్యకు ఎవరు వుత్తరువులు జారీ చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా వినతి మేరకు నౌకను పట్టుకుంది బ్రిటన్‌ తప్ప తమకు ఆ చర్యతో ఎలాంటి సంబంధం లేదని స్పెయిన్‌ విదేశాంగ మంత్రి జోసెఫ్‌ బోరెల్‌ ప్రకటించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల విభాగం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇరాన్‌ మీద దాడికి ఐరోపా ధనిక దేశాలు సుముఖంగా వుంటే ఈ పాటికి అమెరికా ఆ పని చేసి వుండేది. ఇప్పటి వరకు అలాంటి సూచనలేమీ లేకపోవటంతో ఏదో ఒక విధంగా ట్రంప్‌ గిల్లికజ్జాలతో కాలం గడుపుతున్నాడు, దానిలో భాగమే బ్రిటన్‌ నౌకా వుదంతం అని చెప్పవచ్చు. సోమవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ బ్రిటన్‌ తన నౌకల రక్షణ బాధ్యతను తానే చూసుకోవాలని చెప్పటం మరో మలుపు. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న వాటిని ఇరాన్‌ పట్టుకోవటం ఏమిటని ప్రశ్నిస్తూ అంతర్జాతీయ జలాల్లో ఆటంకం లేకుండా చూసుకోవటం ప్రపంచ బాధ్యత అని అన్ని దేశాలను రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేశాడు. ఈ పూర్వరంగంలో ఈ వుదంతానికి ముగింపు సుఖాంతం అవుతుందా ? కొత్త పరిణామాలకు నాంది పలుకుతుందా అని చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా వృద్ధి రేటు పతనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం ?

17 Wednesday Jul 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, china’s economic growth, china’s economic growth slides, Donald trump, world Trade

Image result for china’s economic growth slides

ఎం కోటే శ్వరరావు

ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో 6.4శాతంగా వున్న తమ వృద్దిరేటు రెండవ త్రైమాసిక కాలంలో 6.2శాతానికి తగ్గిందని, ఇది గడచిన ఇరవై ఏడు సంవత్సరాలలో కనిష్టం అని చైనా ప్రకటించింది. ఈ పరిస్ధితి లాభమా నష్టమా అనే చర్చ ప్రపంచ వ్యాపితంగా మీడియాలో ప్రారంభమైంది. అనుకూల వార్తలను తప్ప ప్రతికూల, విమర్శనాత్మక వైఖరులను సహించే పరిస్ధితి దేశంలో రోజు రోజుకూ దిగజారుతోంది. ఎదుటి వారి బలహీనతలను వినియోగించుకొని లబ్ది పొందాలని చెప్పేవారిని దేశ భక్తులుగానూ, మంచి చెడ్డలను వివరించి వైఖరులు మార్చుకోవాలని కోరే వారిని దేశద్రోహులనేంతగా పరిస్ధితులు వున్నాయి. ఎదుటి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని ఎలా చూస్తామో ఎదుటి వారు కూడా అదే ప్రయత్నం చేస్తారనే చిన్న తర్కం తట్టకపోతే వచ్చే సమస్య ఇది. ప్రపంచ వ్యాపితంగా ప్రతి దేశం స్వేచ్చా వాణిజ్యం, విధానాల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరికి వారు రక్షణాత్మక చర్యలను ఎక్కువగా తీసుకుంటున్న రోజులివి. ప్రతికూలతలను మనం మూసిపెడితే ప్రపంచానికి తెలియకుండా పోతుందా? మంచి చెడ్డలను చర్చించిన వారు దేశద్రోహులు కాదు అసలైన దేశ భక్తులని ముందుగా చెప్పాలి.

తాము విధించిన పన్నుల కారణంగానే చైనా ఆర్ధిక వ్యవస్ధ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తమ చర్యలు పన్నులు లేని దేశాలకు తరలిపోవాలని అనుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేయటమే కాదు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేలా చైనాపై వత్తిడిని పెంచుతున్నాయని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. వేలాది కంపెనీలు వెళ్లిపోతున్న కారణంగానే తమతో ఒప్పందం చేసుకోవాలని చైనా కోరుకుంటోందని, తమకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని, విలువ తగ్గించటం ద్వారా ఆ మొత్తం చైనాయే చెల్లిస్తోందని కూడా ఆ పెద్దమనిషి చెప్పాడు. అయితే అమెరికా ఆర్ధికవేత్తలు ఇలాంటి వైఖరులను తోసిపుచ్చుతున్నారు. చైనా వుత్పత్తులపై విధించే దిగుమతి పన్ను కారణంగా ధరల పెరుగుదల వలన ఆ మొత్తాన్ని వినియోగదారులే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రెండువందల బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్ను విధిస్తే, అరవై బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై చైనా కూడా అంతే మొత్తంలో పన్ను విధిస్తోంది. మరో 325 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై పది నుంచి 25శాతం మేర పన్ను విధిస్తామని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇరుదేశాల వాణిజ్యంలో చైనాది పైచేయిగా వుంది. అమెరికా దిగుమతులు 540 బిలియన్‌ డాలర్లుండగా చైనా దిగుమతులు కేవలం 120 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ తేడాను తగ్గించేందుకు తమ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటూ అమెరికా బలవంతం చేస్తోంది.

చైనా ఆర్ధికవృద్ధి రేటు పడిపోవటం అమెరికాకు చెడు వార్త అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ విశ్లేషణ పేర్కొన్నది. దాని సారాంశం ఇలా వుంది. చైనా ఆర్ధిక మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఇది ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుంది.చిలీ రాగి మొదలు ఇండోనేషియా బొగ్గు వరకు చైనా ఫ్యాక్టరీలకు జరుగుతున్న ముడిసరకుల సరఫరాపై ప్రభావ చూపవచ్చు. దక్షిణాఫ్రికా వుత్పత్తిలో ఈ శతాబ్ది ప్రారంభంలో రెండుశాతం చైనాకు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం 15శాతానికి చేరాయి. కాంగో ఎగుమతుల్లో 45శాతం చైనాకే వున్నాయి. ఇలాంటి దేశాలన్నీ చైనా పెట్టుబడుల మీద ఆధారపడి వున్నాయి. పీటర్సన్‌ సంస్ధ వివరాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 35, బ్రెజిల్‌ 30, దక్షిణకొరియా 24శాతం వుత్పత్తులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మందగమనం కారణంగా చైనా అంతర్గత వినియోగం పడిపోతే ఈ దేశాలే కాదు చైనాలో వస్తువిక్రయాలు చేస్తున్న అమెరికన్‌ కంపెనీల ఆదాయం, లాభదాయకత, వాటాల విలువ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని సిరాకాస్‌ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త మేరీ లవ్లీ చెప్పారు. అంతిమంగా వాటాల ధరలు బలహీనమైతే అది అమెరికా వినియోగదారుల, ఆర్ధిక వ్యవస్ధపై వున్న విశ్వాసాన్నే దెబ్బతీస్తుందని కూడా ఆమె అన్నారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిందని ట్రంప్‌ సంతోషంగా వుండవచ్చు గానీ ఇది జాగ్రత్తగా వుండాల్సిన పరిణామం అని ఆమె హెచ్చరించారు. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు, ఇతర అనేక దేశాల మీద పన్నులు విధిస్తున్నారు. ఆ దేశాల వారు బదులు తీర్చుకుంటున్నందున మొత్తంగా ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. వార్షిక అభివృద్ది లక్ష్యం 6నుంచి 6.5శాతం వుండే విధంగా వినియోగం పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటోంది.

చైనాలో జరిగే పరిణామం మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతోంది.ఈ ఏడాది జనవరి 22 నాటి ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణ సారాంశం ఇలా వుంది. చైనా తొలిసారిగా వుత్పాదక కార్యకలాపాలు పడిపోయాయి. ఎగుమతులు, దిగుమతులూ తగ్గాయి. కొన్ని సంస్ధల సామర్ధ్య వినియోగం 40,50శాతం మధ్య వుంది. చైనాలో వస్తు డిమాండ్‌ పడిపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాపితంగా వుంటుంది.ఈ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాల్లో చైనా వాటా ఏడుశాతం మాత్రమే వుండగా ఈ ఏడాది 19శాతానికి చేరనుంది. చైనా పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా గొలుసుతో ముడిపడి వుంది. అనేక వస్తువుల ధరలను ప్రస్తుతం చైనా ఆర్ధిక వ్యవస్ధ నిర్ణయించే స్ధితిలో వుంది. ప్రపంచంలో వినియోగించే వుక్కు, రాగి, బొగ్గు, సిమెంట్‌లో సగం చైనాకు పోతోంది.అది కొనటం ఆపివేస్తే ధరలు పడిపోతాయి. డిమాండ్‌ పడిపోకుండా చూసేందుకు చైనా తక్షణ నిర్మాణ పధకాలను చేపట్టింది, పన్నులను తగ్గించింది. కొన్ని దిగుమతి పన్నులను తగ్గించింది.చిన్న సంస్ధలకు రుణాలను పెంచింది, బ్యాంకుల వద్ద నిల్వధనాన్ని తగ్గించింది.వడ్డీల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. పెద్ద సంఖ్యలో వుద్యోగాలు రద్దు కాకుండా వుద్దీపన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం భారత్‌ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో చైనా వాటా 4.39శాతం.అక్కడి నుంచి 16శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కారణంగా మన దేశం మీద ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. అయితే చైనా కరెన్సీ యువాన్‌ బలహీనపడితే చైనా నుంచి దిగుమతులు చౌక అవుతాయి, దాంతో అక్కడి నుంచి వస్తువులను మన దేశంలో కుమ్మరిస్తారు. అది ఇక్కడి కంపెనీలను దెబ్బతీస్తుంది. చైనాకు ఎగుమతి చేసే ముడిసరకులు దెబ్బతింటాయి. చైనా కంపెనీలు భారత్‌కు వస్తాయి, ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేస్తాయి, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా సాయం తీసుకొని భారత్‌ లబ్ది పొందవచ్చు.

మరికొందరి విశ్లేషణల సారాంశం ఇలా వుంది. వాణిజ్య యుద్ధం కారణంగా కొంత మేరకు అమెరికా మార్కెట్‌ను చైనా కోల్పోవచ్చు. ఆ మేరకు మన దేశం ఆ స్ధానంలో ప్రవేశించవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 2012-15 మధ్య కాలంలో ఎగుమతి మార్కెట్లో చైనా చొరబాటు 53-51శాతం మధ్య కదలాడగా దాటగా మన దేశం 27-28శాతం కలిగి వుంది. అమెరికా 48 నుంచి 43శాతానికి పడిపోయింది. 2016లో చైనా 42.57శాతానికి పడిపోగా మన దేశం 23.32కు, అమెరికా 37శాతానికి తగ్గిపోయింది. అంటే మూడు దేశాలకూ ఎగుమతుల అవకాశాలు తగ్గాయి. అయినా మన కంటే చైనా వాటా రెట్టింపుకు దగ్గరగా వుంది. పోయిన వాటాను పూడ్చుకొనేందుకు చైనా ఏం చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే మన దేశం మీద కూడా అమెరికా వాణిజ్య యుద్దం చేస్తోంది. చైనా స్ధానంలో మనం చొరబడాలంటే ఈ అంశం పరిష్కారం కావటం ఒకటి. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వుత్పత్తుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి వున్నాయి. వాటిని మనం తయారు చేసి ఎగుమతి చేయాలంటే అవసరమైన వుత్పాదక సామర్ధ్యాలను సమకూర్చుకోవటం తెల్లవారే సరికి జరిగే వ్యవహారం కాదు. 2016లో వుత్పాదక రంగంలో చైనా హైటెక్‌ వుత్పత్తుల ఎగుమతులు 25శాతం కాగా మన దేశంలో ఏడుశాతమే వున్నాయి. పన్ను ఒప్పందాలు చైనాకు 22 వుండగా మన దేశానికి రెండు మాత్రమే వున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చొరబడాలంటే అందునా ప్రతి దేశం రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇవి ఎంత ఎక్కువ వుంటే అంత ప్రయోజనం. ఇలాంటి తేడాలు అనేకం వున్న కారణంగా మన దేశం ఏ మేరకు లబ్దిపొందుతుంది అన్నది ప్రశ్న.

చైనా వారు ప్రకటించిన లెక్కలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా లేవు, నేను గతవారం చైనాలో వున్నాను. వుత్పాదక రంగంలో మందగించిందనేది సాధారణ అభిప్రాయంగా వుంది. వేగంగా పెరుగుతున్న సేవా రంగం తిరిగి వెనుకటి స్ధాయికి తీసుకు వస్తుందనే అభిప్రాయమూ వుంది అని ఏలే విశ్వవిద్యాలయ సీనియర్‌ ఆర్ధికవేత్త స్టీఫెన్‌ రోచి చెప్పారు. మోర్గాన్‌ స్టాన్లే ఆసియా అధ్యక్షుడిగా 2007-12 మధ్య ఆయన చైనాలో వున్నారు. ప్రస్తుతం సాగుతున్న వాణిజ్య పోరు గురించి కూడా వారిలో ఎలాంటి ఆత్రత కూడా కనిపించలేదన్నారు. ఆర్ధిక మందగమన నేపధ్యంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ధోరణిలో కూడా వారు లేరని, ఒక వేళ పోరు ముదిరితే దాన్ని అదుపు చేసే వ్యూహాలు కూడా వారి దగ్గర వున్నాయని చెప్పారు.

చైనా ఆర్ధికం మందగిస్తే ఏం జరుగుతుందనే అంశంపై పైన పేర్కొన్న అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు.చర్చలో ముందుకు వస్తున్న అంశాలకు ప్రతీకగా వాటిని చూడాలి. ప్రతి దేశ ఆర్ధిక వ్యవస్ధ తాను ఎదుర్కొంటున్న సమస్యలకు తమదైన పరిష్కారాలను చూసుకోవాలి తప్ప అనుకరిస్తే ప్రయోజనం వుండదు. అనేక మంది పరిశీలకులు చెబుతున్నదాని ప్రకారం చైనా ప్రస్తుతం పెట్టుబడుల కంటే వస్తు వినియోగాన్ని పెంచే ఆర్ధిక నమూనా దిశగా ప్రయాణిస్తోంది. 2007-17 మధ్య కాలంలో చైనా గృహ వినియోగం అమెరికాతో పోలిస్తే 13శాతం నుంచి 34శాతానికి పెరిగింది. జిడిపిలో దాని వినియోగం గతేడాది 40శాతం వుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అంచనా ప్రకారం 2017-23 మధ్య చైనా ఆర్ధిక వ్యవస్ధ 42శాతం చొప్పున(వార్షిక వృద్ధి 6.1శాతం), అమెరికా వ్యవస్ధ 13శాతం(వార్షిక వృద్ధి రెండుశాతం) పెరుగుతాయి. తరువాత వాటి వృద్ధి రేటు 8, 4శాతాల చొప్పున వుంటాయి.2026 నాటికి డాలర్లలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ స్ధాయికి చైనా చేరుకుంటుంది. 2027 నాటికి అమెరికా వినియోగంలో 74శాతం కలిగి వుంటుంది. తరువాత చైనా జిడిపి వృద్ధి రేటు ఆరుశాతం, అమెరికా రేటు నాలుగుశాతం వుంటుంది.

ఈ లెక్కలు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. ఈ నేపధ్యంలో మన దేశం ఎంచుకున్న మార్గం ఏమిటన్నది చూడాల్సి వుంది. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం మన దేశ అభివృద్ధి అత్యధికంగా అంతర్గత డిమాండ్‌ కారణంగా జరిగింది, ఎగుమతుల అభివృద్ధి నెమ్మదిగా వుంది. కనుక కొత్త ప్రభుత్వం ఎగుమతి ఆధారిత అభివృద్ది ప్రాతిపదికగా చూడాలని సలహాయిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ది రేటు 3.9శాతం కాగా 2019లో 3.7శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. వుత్పత్తి కూడా 3.5 నుంచి 3.3శాతానికి తగ్గనున్నట్లు తెలిపింది. ప్రపంచం వాణిజ్యం తగ్గితే అది కొన్ని దేశాల మీదనే ప్రతికూల ప్రభావం చూపదు. చివరికి దుస్తుల ఎగుమతి విషయాల్లో కూడా మన దేశం బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడలేకపోతోంది. భారత్‌లో అంతర్గత డిమాండ్‌ ఎక్కువగా వున్న కారణంగా దిగుమతులు రెండంకెల స్ధాయికి చేరుతున్నాయని, డిమాండ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.జిడిపిలో సాధారణంగా 30శాతం మేరకు ఎగుమతులు చేయాల్సి వుండగా ఇప్పుడు పదిశాతం మేరకే వుందని, రానున్న రోజుల్లో ఎగుమతులు పెంచాలని కోరింది.

Related image

తాజాగా కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోనూ ప్రయివేటు పెట్టుబడుల ద్వారా అభివృద్ది తద్వారా ఎగుమతుల గురించి వక్కాణించారు.గత ఐదు సంవత్సరాలలో మొత్తంగా చూస్తే ఎగుమతులు పడిపోవటంతో పాటు పారిశ్రామిక మరియు వస్తుతయారీ అభివృద్ది కూడా మందగించింది. వినియోగ వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోయింది. దీనికి ఒక ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవటం, ఇతర కారణాలతో తలెత్తిన సంక్షోభం అన్నది అందరూ చెబుతున్నదే. ఒక్క సేవారంగంలో తప్ప ఇతర రంగాలలో తీవ్ర సమస్యలున్నప్పటికీ మనం మాత్రం వేగంగా అభివృద్ది చెందుతున్న దేశమనే తోక తగిలించుకుంటూనే వున్నాం. లేకపోతే రాజకీయంగా చెప్పుకొనేందుకేమీ వుండదు. దేశాన్ని ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధగా మార్చాలనే తపనతో మేకిన్‌ ఇండియా అనో మరొక పిలుపో ఇచ్చినా దాని వలన ఫలితాలేమీ రాలేదు. గతంలో తూర్పు ఆసియా దేశాలు, కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలతో ఒక వెలుగు వెలిగిన మాట నిజం.నాటికీ నేటికీ ఎంతో తేడా వుంది. ప్రస్తుతం ధనికదేశాలు ఎదుర్కొంటున్న మాంద్యం, ప్రతి దేశం అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు అలాంటి అభివృద్దికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నాయి. అన్నింటినీ మించి గతంలో ఆసియన్‌ దేశాలు అభివృద్ధి చెందిన సమయంలో దిగ్గజ చైనా రంగంలో లేదు. అక్కడి నుంచి దిగుమతులను అడ్డుకొనేందుకు మన దేశంతో సహా ప్రతిదేశమూ ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నది. అనేక సందర్భాలలో మన వుత్పత్తులు తగినంత నాణ్యత లేవనే సాకుతో ఐరోపా, అమెరికా తిరస్కరించిన వుదంతాల గురించి వస్తున్న వార్తల గురించి తెలిసిందే.అమెరికా మన దేశం మీద కూడా వాణిజ్యపోరు సాగిస్తున్నది, మనం కూడా మన ఎలక్ట్రానిక్‌పరిశ్రమ రక్షణ కోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయరంగంలో అలాంటి చర్యలను మరింతగా తీసుకోవాల్సి వుంది.

వేగంగా అభివృద్ధి చెందటం గురించి ప్రతి ఒక్కరూ చైనాను పదే పదే చెబుతుంటారు.అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరించిన సమతుల విధానం దాని విజయానికి కారణం. వుత్పాదకత పెంపుదలతో పాటు అక్కడి జన జీవితాలను ఎంతో మెరుగుపరచటం, అందుకు అవసరమైన విధంగా వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ రెండో కోణాన్ని అనేక మంది చూడటం లేదు. 2008లో ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యంతో తన విధానంలోని బలహీనతను చైనా నాయకత్వం గుర్తించింది. దాన్ని సరిచేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే అంతర్గత వినిమయాన్ని పెంచి తగ్గిన ఎగుమతుల సమస్యను కొంత మేరకు అధిగమించింది. ఎంతగా తగ్గినా ఆరుశాతం పైగా ఆర్ధిక వృద్ది రేటు చైనాలో కొనసాగుతోంది. ఇప్పటికే దాని దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు పోగుపడి వున్నాయి కనుక తన ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పరుగు పెట్టించేందుకు అవసరమైన వుద్దీపన పధకాలను చేపట్టగల సత్తా వుంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఠలాయిస్తే ఇతర మార్కెట్లను సంపాదించగల శక్తి వుంది. మన దేశంలో బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో, పెట్టుబడుల కొరతతో సతమతమౌతున్నాయి. అంతర్గత డిమాండ్‌ను పెంచటంతో పాటు వుపాధి కల్పనలో లోటు రాకుండా చూసుకొనేందుకు చైనాలో ప్రయివేటు రంగానికి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ధనికదేశాలతో వాణిజ్య పోరును ఎదుర్కొంటూనే సవ్యసాచిలా చైనా నాయకత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఫలితం లేదు. మన విధానాల లోపాల్ని ముందుగా సవరించుకోవాలి. వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు మన సర్కార్‌ చెబుతున్న తప్పుడు లెక్కలను ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో అసలు మనం చెప్పే అభివృద్ది ఇతర లెక్కలను విశ్వసించి ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారా అన్నదే అసలు సమస్య !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌లో కొత్త దనం ఏమిటి !

14 Sunday Jul 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, Farmers, Health, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Andhra Pradesh Budget 2019-20, Y S Jagan Govt 1st Budget

Image result for What is new in YS Jagan first Budget

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన తొలి బడ్జెట్‌లో ఎన్నో విన్యాసాలు ప్రదర్శించారు. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు, ఓట్ల యాత్రల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వాగ్దానాలు, విసిరిన వాగ్బాణాలకు అనుగుణ్యంగానే ఈ బడ్జెట్‌ను రూపొందించారు. అధికారానికి వచ్చిన రెండో నెల్లోనే బడ్జెట్‌ పెట్టాల్సి రావటం కసరత్తు చేసేందుకు తగిన సమయం లేదని చెప్పుకొనేందుకు, ఎవరైనా నిజమే కదా అనేందుకు ఆస్కారం వుంటుంది. దానిలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. బడ్జెట్‌ కొత్త మంత్రులకు హడావుడి తప్ప నిరంతరం కొనసాగే అధికార యంత్రాంగానికి రోజువారీ వ్యవహారమే. అందునా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ముందుకు గానే ఏర్పాట్లు చేశారు కనుక, నూతన పాలకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని శాఖల, పధకాలకు కోత, వాత, కొన్నింటికి మోత అన్నట్లుగా సవరణలు చేయటం తప్ప పెద్దగా ఇబ్బంది వుండదు. ఫిబ్రవరి మాసంలో నాటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రెండు లక్షల 26వేల కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రతిపాదిస్తే, రాజేంద్రనాధ్‌ రెండు లక్షల 27వేల కోట్లతో ప్రపతిపాదించారు.

అడుక్కొనే దగ్గర పిసినారి తనం ఎందుకన్నది పెద్దల మందలింపు వంటి సలహా. బడ్జెట్‌లో విషయంలో కూడా పాలకులు దీన్నే ప్రదర్శిస్తూ భారీగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సంక్షేమ పధకాల అమలు విషయంలో ఎవరికీ పేచీ లేదు గానీ అవే సర్వస్వం, జిందా తిలిస్మాత్‌ (సర్వరోగ నివారిణి అన్నది దాని తయారీదార్ల ప్రచార నినాదం) అంటే కుదరదు. అవి సంక్షోభం లేదా సమస్యల్లో వున్న జనానికి పూత మందు వంటి వుపశమన చర్యలు మాత్రమే అన్నది ముందుగా చెప్పకతప్పదు. జగన్‌ సర్కార్‌ కూడా పిసినారితనం ప్రదర్శించలేదు. బడ్జెట్‌ అంటే అంకెల గజిబిజి కనుక సమీప అంకెల్లోకి మార్చి చెప్పుకుందాం. ప్రతిపాదించిన రెండులక్షల 27వేల కోట్లలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంటులు, రాష్ట్రం తీసుకొనే అప్పులు అన్నీ కలసి వుంటాయి. బడ్జెట్లో చూపిన అంకెలను చూసి ఎవరైనా చూశారా మా జగన్‌ తడాఖా అని ఛాతీ విరుచుకున్నారో తెలుగుదేశం కార్యకర్తలకు జరిగిన పరాభవమే పునరావృతం అవుతుంది.

మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో చంద్రబాబు సర్కార్‌ లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు కుదించింది. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దాన్నే రెండులక్షల 27వేల కోట్లకు పెంచి చూశారా చంద్రబాబు కంటే తాము 19శాతం బడ్జెట్‌ పెంచాము అని గొప్పలు చెప్పుకొంటోంది. ఆచరణలో ఏం జరుగుతుందన్నది ముఖ్యం. గతేడాది తెలుగుదేశం సర్కార్‌ అప్పుల ఆదాయం మినహా మిగిలిన మొత్తం ఆదాయంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు. గత ఏడాది ఆశించిన మేర రాని కారణంగానే లక్షా 55వేల 507 కోట్ల అంచనాను లక్షా 14వేల 684 కోట్లకు తగ్గించారు. అయినా రాజేంద్రనాధ్‌ వర్తమాన సంవత్సరంలో లక్షా 78వేల 697 కోట్లను చూపారు. రాకపోతే చంద్రబాబు నాయుడి సర్కార్‌ మాదిరే కోత పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. తెలుగుదేశం సర్కార్‌ గతేడాది 33,461 కోట్ల రూపాయలను అప్పులు తేవాలని లక్ష్యంగా పెట్టి 38,245 కోట్లకు పెంచింది. ఇప్పుడు జగన్‌ ఆ మొత్తాన్ని 47వేల కోట్లకు పెంచనున్నట్లు ప్రతిపాదించారు.

ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాల్సి వుంది. బడ్జెట్‌కు ముందుగా ఆర్ధికశాఖ ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించింది. ఇదే ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు కూడా శ్వేతపత్రాన్ని ప్రకటించింది. ప్రభుత్వాలు మారగానే వాటిలోని పదజాలం వ్యాఖ్యానాలు కూడా మారిపోయాయి. ఆర్ధిక శాఖ లేదా ప్రభుత్వం ప్రకటించే పత్రాలు వాస్తవ అంకెలను జనం ముందుంచి వారి విచక్షణ, వ్యాఖ్యానాలకు వదలి వేయాలి తప్ప రాజకీయ వ్యాఖ్యానాలను చొప్పించినపుడు వాటి విశ్వసనీయతే ప్రమాదంలో పడుతుంది. వెంటనే వాటి మీద తలెత్తే ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది. గత ఐదు సంవత్సరాలలో పాలన, ఆర్ధిక యాజమాన్యంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, మానవ, భౌతిక పెట్టుబడులపై పూర్తి నిర్లక్ష్యం, దానికి అవినీతి తోడై చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టారని (జగన్‌ సర్కార్‌ ఆర్ధిక శాఖ శ్వేత పత్రం-పేరా 8) వ్యాఖ్యానించారు. సహజవనరులను ప్రయివేటు వారు లబ్దిపొందే విధంగా ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని, నీకిది నాకది అనే పద్దతుల్లో ప్రభుత్వ సంస్ధలను ప్రయివేటీకరించారని దానిలో పేర్కొన్నారు. ఈ విమర్శను తెలుగుదేశం అంగీకరించకపోవచ్చుగానీ మిగతా పార్టీలు, నిష్పాక్షికంగా చూసే వారికి ఎలాంటి అభ్యంతరమూ వుండదు. ఇక్కడ సమస్య జగన్‌ సర్కార్‌ దీన్నుంచి తీసుకున్న గుణపాఠాలు ఏమిటి? వాటిని సరిదిద్దేందుకు అనుసరించే వారి విధానం ఏమిటన్నదే అసలు ప్రశ్న. సహజవనరులను ప్రయివేటు వారి దోపిడికీ వదలి వేయకుండా తీసుకున్న లేదా తీసుకోబోయే చర్యలేమిటి? ప్రయివేటీకరణ మీద నూతన ప్రభుత్వ విధానం ఏమిటి అన్నదానికి ఆర్ధిక మంత్రి ప్రసంగంలో ఎక్కడా సమాధానం కనపడదు.

రెవెన్యూ ఖర్చు మీద గత ప్రభుత్వానికి అదుపు లేదని, అది విపరీతంగా పెరిగిపోయిందని,సమర్దవంతంగా నిర్వహించలేదని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిర్ణయాల మేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లను తీసుకుంటూనే రెవెన్యూ ఖాతా ఖర్చుకు గాను ప్రభుత్వం అప్పులు చేసిందని, మూలధన పెట్టుబడి ఖాతాకు అన్నింటికీ మించి మానవ వనరుల అభివృద్ధికి నిధులను గణనీయంగా తగ్గించటంతో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహార సేవలు దిగజారి పోయినట్లు పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో అందుకు భిన్నమైన విధానం అనుసరించారా అని చూస్తే అలాంటిదేమీ కనపడదు. ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించటం అంటే రాష్ట్ర ప్రజల ఆరోగ్య మెరుగుదలకు తోడ్పడుతుందని అనుకుంటే పొరపాటు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బందిని సమకూర్చితే మొత్తంగా జనానికి చౌకగా వైద్యం అందుతుంది, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీ నివారణ అవుతుంది. విద్యారంగంలో ప్రయివేటు సంస్ధలు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్‌, లేదా ఇతర సంస్దలేవీ ప్రమాణాలను పెంచటం లేదని అనేక సర్వేలు వెల్లడించాయి.చేరే వారు లేక ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడుతున్నాయి. అందువలన ప్రభుత్వం సర్కారీ బడులను అభివృద్ధి చేయకుండా అమ్మ వడి పేరుతో డబ్బు ఖర్చు చేస్తే ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్ధలకే తిరిగి ప్రయోజనం జరుగుతుంది.

చంద్రబాబు సర్కార్‌ 2017ా18లో మూలధన పెట్టుబడి ఖాతాలో మొత్తం రూ.13,490 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది 28,678 కోట్లు ప్రతిపాదించి, 20,398 కోట్లకు సవరించింది. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ 32,293 కోట్లను ప్రతిపాదించింది.ఎంత ఖర్చు చేస్తారో తెలియదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే స్వల్ప పెంపుదల తప్ప చంద్రబాబుకుాజగన్‌కు పెద్ద తేడాలేదని అంకెలు చెబుతున్నాయి. దీనిలో కీలకమైన సాగునీటి రంగానికి గతేడాది బడ్జెట్‌లో 15,915 కోట్లు కేటాయించి 13,385 కోట్లకు సవరిస్తే, ఈ మొత్తం కూడా లేకుండా జగన్‌ 11,981 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపులు పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. ఇదిలా వుంటే భారీ ఖర్చుతో తెలంగాణా గడ్డ మీద నుంచి శ్రీశైలానికి గోదావరి నీటిని తరలించే ఎత్తి పోతల పధకాల గురించి జగన్‌ సర్కార్‌ ఆలోచన చేయటం మరింత విడ్డూరంగా వుంది. మరోవైపు ఈ ప్రతిపాదనల మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. గత ఐదేండ్లలోఅది 2018ా19 నాటికి రెండులక్షల 59వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 57వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 20వేల కోట్లకు చేరింది. సర్కార్‌ అప్పుమీద వడ్డీ ఇరవైవేల కోట్లు, అసలు తీర్చేందుకు మరో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది జగన్‌ సర్కార్‌ తీసుకోదలచినట్లు ప్రతిపాదించిన రుణం 47వేల కోట్ల రూపాయలు. ప్రభుత్వం తీసుకున్న అప్పు మొత్తాన్ని మూలధన పెట్టుబడులకు ఖర్చు చేసి వుంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ రూపురేఖలే మారిపోయి వుండేవని, మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి చెందితే రాష్ట్రం పారిశ్రామిక, సేవారంగాల ఆధారిత రాష్ట్రంగా మారిపోయి వుండేదని తద్వారా ఆదాయ పెంపు సామర్ధ్యం పెరిగి వుండేదని శ్వేత పత్రం పేర్కొన్నది. దానికి అనుగుణమైన కేటాయింపులు బడ్జెట్లో కనిపించటం లేదు.

Image result for What is new in YS Jagan first Budget

బాబస్తే జాబస్తుందని ప్రచారం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 2017-18లో పారిశ్రామిక రంగంలో మూలధన పెట్టుబడి ఖర్చు వంద కోట్ల రూపాయలు(బడ్జెట్‌ పత్రాల్లో అంకెల ప్రకారం). ఈ మొత్తాన్ని గతేడాది బడ్జెట్లో 1464 కోట్లుగా ప్రతిపాదించి 653 కోట్లకు సవరించారు. జగన్‌ సర్కార్‌ 1116 కోట్లుగా ప్రకటించింది. దీని భావమేమి తిరుమలేశా ! కడప వుక్కు కర్మాగారం గురించి ప్రస్తావన స్వల్ప నామ మాత్ర కేటాయింపు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు అంటే అదొక్కటే కాదు.1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా ప్రభుత్వాలు పరిశ్రమల స్ధాపన బాధ్యతను విస్మరించాయి. ఆ తరువాత ఎక్కడైనా ఒకటీ అరాచోట రక్షణ రంగ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది తప్ప ఇతరంగా ఏవీ రాలేదు. ప్రభుత్వరంగ పరిశ్రమలను వదిలించుకొనేందుకు తెగనమ్మటమే విధానంగా ముందుకు వచ్చింది. జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌ కూడా దాని కొనసాగింపుగానే వుంది తప్ప మరొకటి కాదు.ప్రతి ఏటా వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు నిధులు కేటాయించి కొనుగోలు చేసిన వారికి రాయితీలు ఇస్తున్నారు. దాని వలన వ్యవసాయ కార్మికులకు వుపాధి పోతోంది. వారికి ప్రత్యామ్నాయం పారిశ్రామిక రంగం తప్ప మరొకటి కాదు. మానవ శ్రమ పాత్రను తగ్గించేలా పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు, కొత్త పరిశ్రమల్లో అసలు ప్రారంభం నుంచి అదే పరిస్ధితి. అందుకే అభివృద్ధి అంకెలను వెల్లడిస్తున్నా దానికి తగిన విధంగా వుపాధి పెంపొందటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దశలోకి మన దేశం రోజురోజుకూ వేగంగా మారిపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌ దానికి మినహాయింపుగా వుండజాలదు. రెండవది ప్రయివేటు రంగంలోని ఐటి సంస్ధలు ఇప్పటికే కేంద్రీకృతం అయిన నగరాల్లో తప్ప మిగతా చోట్లకు రావని గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ అనుభవం తెలిపింది.

రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు గణనీయంగా వున్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర చేతి వృత్తి దారుల ఆదాయాలు గణనీయంగా పెరగకుండా రాష్ట్రంలో వస్తు వినియోగం పెరగదు. అది లేకుండా పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి కావు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగదు. అసంఘటిత రంగ కార్మికులకు పదేండ్లు, అంతకు ముందు నిర్ణయించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వుద్యోగులకు తాత్కాలిక భృతి ప్రకటించాల్సిందే, వేతన సవరణ జరగాల్సిందే. అసంఘటిత రంగ కార్మికుల, చిరుద్యోగుల సంగతేమిటి? బడ్జెట్‌ వుపన్యాసంలో అ సలు ఈ ప్రస్తావనే లేదు. జగన్‌ పర్యటనల్లో ఎవరూ వీటి గురించి అడగలేదు అనుకోవాలా ? ఈ పూర్వరంగంలో వివిధ తరగతుల ఆదాయాలను పెంచేందుకు,నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు జగన్‌ సర్కార్‌ నవరత్నాల పరిధి దాటి ఆలోచించటమే కొత్తదనం అవుతుంది. ఈ బడ్జెట్‌లో అదేమీ లేదు. అసెంబ్లీ చర్చలో అయినా ఇలాంటి లోపాలను సవరిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వంచన, వాస్తవ దూరంగా కేంద్ర బడ్జెట్‌ !

13 Saturday Jul 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

5 Trillion Dollar Economy, India budget 2019-20, Nirmala Sitharaman

Image result for india budget 2019-20, nirmala

ఎం కోటేశ్వరరావు

2019-20 సంవత్సర పూర్తి బడ్జెట్‌ను జూలై ఐదున నూతన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు.ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సంఘపరివార్‌కు చెందిన వారు కుహనా మేథావుల కేంద్రంగా వర్ణిస్తారు. అయితే వారి అదృష్టమో దురదృష్టమోగానీ అదే విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తీరుకు మొత్తంగా మీడియా ప్రశంసలు కురింపించింది. అఫ్‌ కోర్స్‌ అది కార్పొరేట్లకు, ప్రయివేటీకరణకు పెద్ద పీట వేసినందువలన కూడా కావచ్చు. ఒక వ్యక్తి హావభావాలు, ప్రవర్తన తీరుతెన్నులు వ్యక్తిగతమైనవి తప్ప వేరు కాదు. సదరు వ్యక్తులు ఏ భావాలకు, విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాటి పర్యవసానాలు,ఫలాలు ఏమిటన్నదే సమాజం చూస్తుంది. అందువలన నిర్మలా సీతారామన్‌ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు గనుక దానిలోని అంశాలపై విమర్శలు లేదా ప్రశంసలను వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు.

ఐదేండ్ల క్రితం నాటి అర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, నిర్మల బడ్జెట్‌కు సామ్యాలను చూపుతూ ఎన్ని నిమిషాలు, ఎన్నిపదాలు, ఏ అంశానికి ఎంత సమయం కేటాయించారు అనే పద్దతుల్లో విశ్లేషించిన వారు కూడా లేకపోలేదు.ఆ రీత్యా చూసినపుడు 16,489 పదాలను జైట్లీ రెండు గంటల ఏడు నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేస్తే నిర్మల 20,223 పదాలను రెండు గంటల తొమ్మిది నిమిషాల 13 సెకండ్లలోనే ముగించారంటే వాగ్ధాటితో తక్కువ సమయంలో ఎక్కువ పదాలను కుమ్మరించారన్నది స్పష్టం. బడ్జెట్‌ తీరు తెన్నులను చూసే ముందు నాలుగవ తేదీన ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వేను కూడా కలిపి విశ్లేషించటం సముచితంగా వుంటుంది.

గతానికి చెందిన అంకెల వివరాలు ఇచ్చినప్పటికీ వాటికి చెప్పే భాష్యం, వుగాది పంచాంగంలా ఆశాభావం వెలిబుచ్చే నివేదికలుగానే మన అర్ధిక సర్వేలు వుంటున్నాయి. బడ్జెట్‌ కూడా అంతే. భవిష్యత్‌ మాసాల్లో సంభవించే పరిణామాల మీద అంచనాల ప్రాతిపదికగానే బడ్జెట్‌ కేటాయింపుల ప్రతిపాదనలు వుంటాయి. అంచనాలు తప్పితే కోతలతో సవరణలను ఆమోదించటం మనం చూస్తున్నాం. ఏ పార్టీ ప్రభుత్వం వున్నా అదే చేస్తుంది. ఏడాదిన్నర క్రితం పార్లమెంటుకు సమర్పించిన సర్వే 2018-19లో వ ద్ధిరేటు ఏడునుంచి ఏడున్నర శాతందాకా ఉండనుందన్నా, వాస్తవంలో అది 6.8శాతానికే పరిమితమైంది. కాగా వర్తమాన సంవత్సరంలో ఏడు శాతం ఆశాభావం, అంచనా మాత్రమే. ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్ల డాలర్లకు ఆర్ధిక వ్యవస్ధను పెంచుతామని అందుకుగాను ప్రతి ఏటా కనీసం ఎనిమిది శాతం అభివృద్ది వుండాలని చెప్పిన వారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు అంచనాలోనే ఒకశాతాన్ని తగ్గించారు. అలాంటపుడు ఆశించిన లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు ?

Image result for india budget 2019-20, nirmala

అంకెల్లోకి పోతే ఒక పట్టాన తేలే అవకాశం వుండదు. వాటిని ఎలాగైనా వినియోగించవచ్చు, భాష్యం చెప్పవచ్చు. అందువలన ఎవరి భాష్యం వాస్తవాలకు దగ్గరగా వుందన్నది జనం నిర్ణయించుకోవాల్సిందే.ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ వుపన్యాసం రెండింటిలోనూ 2024-25 నాటికి అంటే ఐదు సంవత్సరాలలో మన ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షలకోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యంగా చెప్పారు. తప్పులేదు, అందుకు గాను ఏటా 8శాతం అభివృద్ధి రేటు వుండాలని చెప్పారు. ప్రస్తుతం ఆర్ధిక మంత్రి చెప్పినదాని ప్రకారం మన జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు వుంది.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా ప్రభుత్వాలు, మంత్రులూ తమ పబ్బంతాము గడుపుకొని ఓట్లు కొల్లగొట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన దీపాంకర్‌ దాసుగుప్తా చెబుతున్న లెక్కల ప్రకారం ఐదు లక్షల కోట్ల డాలర్లకు జిడిపి పెరగాలంటే 2018-19 రేట్ల ప్రకారం ఐదేండ్లలో ఎనిమిది శాతం వృద్ధి రేటు బదులు 13శాతం వుంటేనే సాధ్యం అంటున్నారు. అదే 2011-12 ధరల ప్రకారం అయితే 19శాతం వంతున పెరిగితే నాలుగేండ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధించవచ్చని, అదే ఎనిమిదిశాతం చొప్పున అయితే 2030-31వరకు ఆగాల్సి వుంటుందని పేర్కొన్నారు.

ప్రస్తుత మన పాలకులు చెబుతున్న లక్ష్యం సాధించటం గురించి ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే అసలు నీవు దేశభక్తుడవేనా అని ప్రశ్నిస్తారు. మన గురించి ఐఎంఎఫ్‌ ఏమి చెప్పిందో ఒకసారి చూద్దాం.2020 నుంచి 2024 సంవత్సరాలలో సగటున 7.59శాతం అభివృద్ధి రేటుతో మన జిడిపి 2.97లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.30లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన అభివృద్ధి రేటు 6.8శాతమే. అది ఈ ఏడాది ఏడుశాతంగా వుంటుందని అంచనా వేస్తున్నారు. అలాంటపుడు ఎనిమిదిశాతం వుంటే గింటే ఐదులక్షల కోట్ల డాలర్లకు చేరతామని చెప్పటం ఏమిటి? అదేమన్నా ప్రామాణిక సంఖ్యా? అంతకు మించి సాధిస్తే జనం వద్దంటారా ? లేకపోతే మరేదైనా చేస్తారా ? ఐదు సంవత్సరాల క్రితం అచ్చేదిన్‌(మంచి రోజులను) తెస్తామని, గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటికీ విస్తరిస్తామని, 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పినట్లుగానే మైండ్‌ గేమ్‌లో ఇదొక భాగం అనుకోవాలి.

ఆర్ధిక సర్వే రచయితలు అభివృద్ధి గురించి పలుసార్లు చైనాను వుదహరించారు. బ్రిటీష్‌ వారి ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు. చైనా మాదిరి పురోగమించాలని కోరుకోవటం తప్పుకాదు. బ్రిటీష్‌ వారి నమూనా వారి దేశాన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది గనుక మనకు వాంఛనీయమూ కాదు. ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనంలో వుంచుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో ఎలాంటి పెద్ద సంక్షోభాలు లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా వుంటే అది చైనా ఒక్కటే. కొంత మంది విమర్శకులు అక్కడ కమ్యూనిస్టు పార్టీ పేరుతో పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్నారని ఆరోపిస్తారు. వారు చెప్పిందాన్ని కాసేపు అంగీకరిద్దాం.చైనా సంస్కరణలకు నాలుగు పదులు నిండాయి. ఈ కాలంలో అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ ప్రతి పది సంవత్సరాలకు ఏదో ఒక ఆర్ధిక సంక్షోభం, మాంద్యం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. ధనిక దేశాల్లో 2008లో ప్రారంభమైన సంక్షోభం పరిష్కారం గాకపోగా త్వరలో మరో సంక్షోభానికి తెరలేవనుందనే వార్తలు, హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ సంక్షోభ ప్రభావం మనమీద కూడా పడుతోంది. చైనా ఎన్నడూ ధనిక దేశాల మాదిరి సంక్షోభాలను ఎదుర్కొన్నదా అంటే లేదు. అభివృద్ధి రేటులో స్వల్పతగ్గుదల వుండవచ్చు గానీ ఇతర దేశాల మాదిరి నామ మాత్రం లేదా తిరోగమన దారి పట్టలేదు కదా ? ఎందుకనో ఎప్పుడైనా మనం ఆలోచించామా ?

మన దేశంలో కొంత మంది భలే చిత్రమైన వాదనలు చేస్తుంటారు, వాటిని నిజమని నమ్మేవారు కూడా లేకపోలేదు. వాటిలో కొన్ని పచ్చి అబద్దాలు కూడా వున్నాయి. వాటి తీరుతెన్నులు ఎలా వున్నాయో చూద్దాము. చైనా అభివృద్ధి చెందిన మాట నిజమేగానీ అది కమ్యూనిస్టు దేశమండీ, మనది ప్రజాస్వామ్యం, ఒక నిర్ణయం చేస్తే అక్కడ తప్పయినా ఒప్పయినా అమలు జరగాల్సిందే, మన దగ్గర అలా కాదు. చైనా భిన్నమైన దారుల్లో పయనిస్తున్నది, దాని తరువాత స్ధానం పొందేందుకు భారత్‌ ప్రయత్నించకూడదు, అది సాధ్యం కాదు.ఏక పార్టీ నిరంకుశ పాలనతో పాటు దశాబ్దాల తరబడి మౌలిక సంస్కరణల గురించి చేసిన ప్రచారంతో పాటు మెజారిటీగా వున్న హాన్‌ జాతీయులు, చైనా భాష మాట్లాడేవారిని సమీకరించారు. భారత్‌లో అటువంటి అవకాశం లేదు.బహుళపార్టీ వ్యవస్ధ వున్నది. సామాజిక పరంగా, భాషా పరంగా వందలాది మైనారిటీలను ఒక లక్ష్యం కోసం సమీకరించటం సాధ్యం కాదు. చైనాలో రైతులను భూముల నుంచి తరమివేశారు, మన దగ్గర అలా కుదరదు. నిరంకుశ పాలకులు వున్న అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పలేము, క్యూబా, వుత్తర కొరియా, వెనెజులాల్లో వైఫల్యం చెందారు. మంచి నియంతలను కలిగి వుండటం చైనీయుల అదృష్టం. ఇంకా ఇలాంటి బుర్రతక్కువ ప్రచారాలు చాలా వున్నాయి. అలాంటపుడు మన అభివృద్ధి రేటు చైనా కంటే ఎక్కువ వుంది, త్వరలో మనం చైనాను అధిగమిస్తాము, ఎగుమతుల్లో చైనాతో పోటీపడతాము, దాన్ని వెనక్కు నెట్టి ముందుకు పోతాము అని చెప్పుకోవటం ఎందుకు అన్నది ప్రశ్న.

సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాల్లో జనం ఆహారం తిని బతికితే ప్రజాస్వామ్య దేశాల్లో స్వేచ్చతో ప్రాణాలు నిలుపుకుంటారా? అక్కడ అభివృద్ధి చెందితే ఇక్కడ నిత్యదరిద్రంతో బతకాలా ? అసలు ఇలాంటి వాదనలు చేసే వారి సమస్య ఏమిటో మనకు అర్ధం కాదు. కమ్యూనిస్టులు ఏపనైనా మెడమీద కొడవలి, తలమీద సుత్తిపెట్టి చేస్తావా, చస్తావా అంటారన్నట్లుగా కొందరు చెబుతారు. పోనీ, మచ్చుకు అలా చేసి చైనాలో హెక్టారుకు1,751 కిలోల పత్తి పండిస్తే మనది ప్రజాస్వామ్యం గనుక 502కిలోలే పండిస్తారని అనుకుందాం. మరి బ్రెజిల్‌, టర్కీ, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్ధలున్నవేగా అక్కడ చైనా తరువాత అధికంగా 1,600-1700 కిలోల వరకు పండిస్తున్నారుగా దాన్నేమనాలి? పత్తి రైతులు మన దేశంలోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే గుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకత తప్ప సరైన సమాధానం వుండదు.

Image result for india budget 2019-20, nirmala

ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో భిన్న భాషలు, జాతులు, మతాలు, కులాలు, ఆచారాలు వున్న మాట నిజం. ఇలాంటి చోట హిందూత్వ పేరుతో మెజారిటీవాదాన్ని బలవంతంగా రుద్ద చూస్తున్నారు. ఇది జనాన్ని ఏకత్రాటి మీద నడిపించటానికి దోహదం చేస్తుందా ? ఫలానా వారి ఇంట్లో ఆవు మాంసం వుందనో, ఫలానా వారు ఆవులను వధించటానికే తరలిస్తున్నారనో సాకులు చూపి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సామూహికంగా దాడులు, హత్యలు చేసే వారు గోరక్షకుల పేరుతో చలామణి అవుతున్నారు. వారికి పాలకపార్టీ అండదండలున్నాయి. ఒక్క వుదంతంలో కూడా ఇంతవరకు దుండగులకు శిక్షలు పడలేదు. అది అలా వుండగా కొత్తగా ఆకస్మికంగా కొందరు ప్రత్యక్షమై మైనారిటీ తరగతులకు చెందిన వారిని పట్టుకొని నీవు దొంగతనానికి వచ్చావు లేదా జైశ్రీరామ్‌ అంటావా లేదా అంటూ చావచితక కొట్టి పోతుంటే వారిని అడ్డుకొనే వారు లేరు. అలాంటి వారిని ఎవరైనా విమర్శిస్తే అదిగో చూడండి వీరు హిందూమతానికి, హిందూత్వకు వ్యతిరేకులు, మెజారిటీగా వున్న వారికి తమ దేవుడిని తలచుకొనే అవకాశం కూడా వుండకూడదా అంటూ విద్వేష ప్రచారాన్ని రెచ్చగొడుతున్న స్ధితిలో వారి ఏలుబడిలో చైనా మాదిరి దేశాన్ని అభివృద్ధి చేస్తామని ఎవరైనా చెబితే ఎలా నమ్మాలి?

ఏ దేశ పురోగమనానికైనా పరిశోధన, అభివృద్ధి కీలకం. వేల సంవత్సరాల నాడే మన వారు సముద్ర వాణిజ్యం చేశారని ఒకవైపు గొప్ప చెప్పుకుంటాం. మరోవైపు సముద్రం దాటి ప్రయాణిస్తే మ్లేచ్చులు అవుతారు, మైలపడతారు, ధర్మం చెడుతుంది, కులం నుంచి వెలి అంటూ గిరులు గీసి కూర్చోపెట్టిన కారణంగానే మనకు ఒక కొలంబస్‌ లేకుండా పోయాడు. మన పూర్వులు పెట్రోలు లేకుండానే విమానాలు నడిపారు, ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండేది, అసలు వేదాల్లోనే అన్నీ వున్నాయంటూ లొట్టలు వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవటానికే మనకు సమయం చాల్లేదు. మిగతా దేశాల్లో ఇలాంటి పిచ్చి ముదరలేదు కనుకనే కొత్తవాటిని కనిపెట్టాలనే తపనతో ఎంతో ముందుకు పోయారు. దేశంలో జరిగిన ప్రతి అనర్ధానికి లేదా తమకు నచ్చని ప్రతి అంశానికి కారకుడు నెహ్రూ అంటూ బిజెపి నేతలు దాడిచేస్తుంటారు. వాదనకోసం సరే అందాం. గత ఐదు సంవత్సరాల్లో నరేంద్రమోడీ, అంతకు ముందు వాజ్‌పేయి పాలనా కాలంలో బిజెపి చేసిందేమిటి? చైనా గత కొద్ది సంవత్సరాలుగా పరిశోధన, అభివృద్ధికి తన జిడిపిలో రెండుశాతం మొత్తం ఖర్చు చేస్తున్నది. మనం 0.7శాతం దాటలేదు. ఐదు సంవత్సరాల క్రితం స్ధానికుల పేటెంట్‌ దరఖాస్తుల విషయంలో మనం 52వ స్ధానంలో వుంటే 2018లో అది 55కు దిగజారింది. ఇదే సమయంలో చైనా మూడు నుంచి ఒకటవ స్ధానానికి చేరుకుంది. ఆవు మూత్రంలో బంగారం వుందా, అవితాగితే కాన్సర్‌ నయమౌతుందా, ఆవు పేడలో ఏముంది, దాన్ని పూసుకుంటే సొగసుగా తయారవుతామా అనే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. యధారాజా తధా పరిశోధకా అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. కావాలంటే వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పే సంస్కృత పండితులకు, అగ్రహారాలకు వాటి పరిశోధన అప్పగించి వాటిలో దాగి వున్నవాటిని వెలికి తీయమనండి. పైసా ఖర్చు కాదు. ఇప్పటికే ఐదేండ్ల కాలాన్ని వృధా చేశారు. దాని దారిన అది నడుస్తుంటే మిగతా అంశాల మీద ఇతరులను ప్రోత్సహించాలి, పోటీ పెట్టాలి తప్ప కాలు గడపదాట కుండా వేదకాలం గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఏముంటుంది.

ఏ దేశంలోనూ ఇవ్వని విధంగా పరిశోధన పేరుతో చేసే ఖర్చులకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు, ఇతర రాయితీలు ఇస్తున్నాయి. ప్రయివేటు సంస్ధలు ఆ రాయితీలను ఎలా స్వాహా చేయాలనే అంశం మీద పెడుతున్న శ్రద్ద పరిశోధన మీద లేదు. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. దాంతో పన్ను మినహాయింపులను తగ్గించగానే ప్రయివేటు రంగం గగ్గోలు పెడుతోంది. మరో వైపున అన్ని బాధ్యతల నుంచీ తప్పుకుంటున్నట్లుగానే పరిశోధనా రంగం నుంచి కూడా ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి.1996లో చైనా జిడిపిలో 0.56శాతం ఖర్చు చేయగా మన దేశం 0.63శాతం పెట్టింది. అదే 2015నాటికి చైనా 2.07శాతానికి పెంచగా మనది అదే 0.63దగ్గరే వుండిపోయింది.ఇదే కాలంలో ప్రపంచ సగటు 1.97 నుంచి 2.23శాతానికి పెరిగింది. మనం ప్రపంచ సగటుకు ఇంకా ఎంతో దూరంలో వున్నాం. ఇజ్రాయెల్‌ గరిష్టంగా 4.27శాతం ఖర్చు చేస్తోంది. పరిశోధనకు కూడా ప్రజాస్వామ్యమే అడ్డువస్తోందనుకోవాలా ? రాజకీయంగా ఎవరైనా అడ్డుపడుతున్నారా ?

Image result for india budget 2019-20, nirmala

దేశంలో పెట్టుబడుల విషయానికి వస్తే 2004జూన్‌ నుంచి 2019 మార్చి వరకు లభ్యమైన సమాచారం మేరకు జిడిపిలో ప్రతి మూడు మాసాల పెట్టుబడి సగటు 34.8శాతంగా వుంది. గరిష్టం 2011సెప్టెంబరులో 41.2శాతం కాగా కనిష్టం 2017 మార్చిలో 29.5శాతం వుంది. తాజా పరిస్ధితికి వస్తే గతేడాది చివరి మాసాల్లో 32.2శాతం వుండగా ఈ ఏడాది మార్చిలో 29.8శాతం వుంది. చైనాలో ఏడాదికి ఒకసారి వివరాలను వెల్లడిస్తారు. ఆ మేరకు 2018 డిసెంబరులో పెట్టుబడి జిడిపిలో 44.8శాతం వుంది. అంతకు ముందు ఏడాది 44.6 శాతం. 1952 డిసెంబరు నుంచి 2018 డిసెంబరు వరకు సగటు 36శాతం వుంది. 2011 డిసెంబరులో గరిష్టంగా 48 శాతం కాగా 1962లో కనిష్టంగా 15.1శాతం నమోదైంది.

నరేంద్రమోడీ 2.0 సర్కార్‌ ప్రయివేటు పెట్టుబడుల మీద పెద్ద ఎత్తున మరులుగొన్నట్లు కనిపిస్తోంది. మనదేశంలో ప్రయివేటు రంగ పెట్టుబడులు ప్రస్తుతం 14సంవత్సరాల కనిష్ట స్ధాయికి పడిపోయిన తరుణంలో వాటి గురించి జనానికి భ్రమలు కొల్పే విధంగా పారాయణం చేస్తున్నది. మంచి రోజులు తెస్తా మంచి రోజులు తెస్తా అని నరేంద్రమోడీ చెప్పటం తప్ప అలాంటి సూచనలు ఎండమావుల్లా కూడా కనిపించటం లేదు. 2018 డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో దేశంలో నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చెప్పిన కంపెనీల విలువ లక్ష కోట్ల రూపాయలని సిఎంఐఇ(భారత ఆర్ధిక వ్యవస్ధ పర్యవేక్షణ కేంద్రం) పేర్కొన్నది. అయితే ఆ మొత్తం సెప్టెంబరుతో ముగిసిన మూడునెలలతో పోల్చితే 53శాతం, ఏడాదితో పోల్చితే 55శాతం తక్కువ అని తెలిపింది. ప్రయివేటు రంగం పధకాలు ఇదే కాలంలో 62,64శాతాల చొప్పున తగ్గాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్ధల పధకాలు కూడా 37,41శాతాల చొప్పున పడిపోయాయి. ఇది 2004 తరువాత ఇది కనిష్టం. కొత్త పధకాలు రాకపోవటం ఒకటైతే అమల్లో వున్న ప్రాజెక్టులు నిలిచిపోవటం మరింత ఆందోళనకరం. మొత్తంగా 11శాతం వుంటే ప్రయివేటు రంగంలో ఇది 24శాతం వరకు వుంది. అనేక రాష్ట్రాలలో విద్యుత్‌ కోతలు ఎత్తివేత గురించి పాలకులు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాల స్ధాపక సామర్ధ్యం పెరిగినంతగా విద్యుత్‌ వినియోగం పెరగకపోవటమే కొరతలేకపోవటానికి కారణం. ప్రయివేటీకరణలో భాగంగా విదేశాల నుంచి అప్పులు దొరుకుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా తెచ్చి విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. నిలిచిపోయిన ప్రాజెక్టులలో 35.4శాతం విద్యుత్‌, 29.2శాతం వస్తూత్పత్తి రంగానికి చెందినవి. నిధులు, ఇంధనం, ముడిసరకుల కొరత, మార్కెట్‌ పరిస్ధితులు అనుకూలంగా లేకపోవటం దీనికి ప్రధాన కారణాలు. వీటిలో కూడా ఎక్కువ శాతం నిధుల కొరతే. ఇటువంటి స్ధితిలో ప్రయివేటు పెట్టుబడుల గురించి దేశ ప్రజల్లో ఆశలు రేపుతున్నారు. ఈ పేరుతో మరిన్ని ప్రజా, కార్మిక వ్యతిరేక సంస్కరణలను రుద్దే యత్నం తప్ప ఇది వేరు కాదు.

ఆశలు ఆకాశంలో ఎగురుతుంటే భూమ్మీద పరిస్ధితి ఎలా వుంది ? అన్నదాతలు సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయ ప్రధాన దేశంలో రైతుల రాబడిని రెండింతలు చేసేందుకు 14.5శాతం మేర వ్యవసాయాభివ ద్ధి రేటు అవసరమని నిపుణులు చెబుతున్నారు. వానలు కురిసినప్పుడే రెండు శాతానికి పరిమితమైనప్పుడు, లోటు వర్షపాత సూచనలు కనిపిస్తున్న ఈ ఏడాది ఎలా పుంజుకోగలదో ఆర్థికవేత్తలే వివరించాలి! పెట్టుబడులు, పొదుపు, ఎగుమతులు, వ ద్ధి, ఉపాధి అవకాశాలు ఇతోధికమైతే భారత ఆర్థిక స్వస్థతకు తిరుగుండదని క ష్ణమూర్తి సుబ్రమణియన్‌ విరచిత సర్వే నమ్మకంగా చెబుతోంది. ప్రపంచ ధనిక దేశాలు వ ద్ధిపరమైన సవాళ్లను ఎదుర్కొంటుండగా, మరోవైపు వాణిజ్య యుద్ధమేఘాలు కలవరపరుస్తుండగా- మన వ ద్ధి ప్రస్థానం గతాన్ని అధిగమిస్తుందన్నది ప్రశ్న.

Image result for india budget 2019-20, nirmala

సోషలిస్టు చైనా గురించి ఇటీవలనే కొన్ని వార్తలు వచ్చాయి. అక్కడ కార్మికుల వేతనాలు పెరుగుతున్న కారణంగా అనేక మంది ప్రయివేటు పారిశ్రామికవేత్తలు తమ సంస్ధలను అక్కడి నుంచి తరలించేందుకు చూస్తున్నారని, భారత్‌ అనువుగా వుంటుందని భావిస్తున్నారన్నది వాటి సారాంశం. దీని అర్ధం ఏమిటి? తన ఎగుమతులను చౌకగా ప్రపంచానికి అందించేందుకు కార్మికుల శ్రమను ఫణంగా పెడుతోందన్న కొందరి వక్రీకరణలకు ఇది చెంపపెట్టు. ఆ స్ధాయిలో మన దేశంలో వేతనాలు లేవన్నది మన పాలకులకు అభిశంసన. ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ ధనిక దేశాలు ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న కారణంగా దాని ఎగుమతులపై కొంత ప్రభావం పడినా ఆరుశాతం పైగా అభివృద్ధి రేటు కొనసాగించటానికి కారణం తన జనాల ఆదాయాలను పెంచి అంతర్గత వస్తు వినియోగాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవటమే. కేవలం ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలుగా మారిన లాటిన్‌ అమెరికా దేశాలు దెబ్బతినటానికి కార్మికవర్గ ఆదాయాలను పెంచకపోవటం ప్రధాన కారణం. వ ద్ధి, ఉపాధి చెట్టపట్టాలు కట్టి సాగితేనేగాని ప్రగతి సాధ్యం. రిజర్వ్‌బ్యాంక్‌ బాధ్యతలు చేపట్టకముందు ఏడేళ్లనాటి ఆర్థిక సర్వేలో రఘురాం రాజన్‌ ఉపాధి కల్పన ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఉద్బోధించారు. రెండేళ్ల క్రితం తనవంతుగా ముఖ్య ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్‌ సుబ్రమణియన్‌ ‘ఉపాధి రహిత వ ద్ధి’పై ఆందోళన చెందినా- కార్యాచరణ లేదు. దేశంలో ఉపాధి అవకాశాల విస్తరణకు నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం దోహదపడగలదంటున్న తాజా సర్వే- ముఖ్యంగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ (ఎస్‌ఎమ్‌ఎస్‌ఈ)లకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మేకిన్‌ ఇండియా పిలుపు లక్ష్యానికి ఇది విరుద్దం. భారీ పరి శమలతో పెద్ద ఎత్తున వుత్పత్తి చేసి వుత్పాదక ఖర్చు తగ్గిస్తే తప్ప ఎగుమతుల్లో మనం పోటీ పడలేము. చిన్న, మధ్య తరహా సంస్దలకు అలాంటి వెసులుబాటు వుండదు.

ప్రయివేటు పెట్టుబడులతో పెద్ద ఎత్తున వుపాధి కల్పిస్తామని యువతకు భ్రమలు కల్పిస్తున్నారు. అభివృద్ధి రేటు గురించి డబ్బాకొట్టుకుంటున్న పాలకులు వుపాధి గురించి మాట్లాడటం లేదు. గతంలో వుపాధి రహిత అభివృద్ధి సంఘటిత రంగ సంస్ధలకే పరిమితం అయింది. ఇప్పుడు అది అసంఘటిత రంగానికి కూడా విస్తరించటం వుపాధి కల్పన మరింత క్లిష్టం కానుంది. దేశంలో పదిహేను సంవత్సరాలకు పైబడిన వారిలో పని చేస్తున్నవారు లేదా పనికోసం ఎదురుచూస్తున్నవారు గానీ 2012లో 55.5 శాతం మంది వుంటే 2018లో 49.7శాతానికి పడిపోయింది. అంటే నిరుద్యోగులు పెరిగారు.

ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపుదల, ఆర్థికాభివ ద్ధి తదితరాలు పరస్పరం ముడివడిన అంశాలంటున్న సర్వే ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో రాబడి పెంపొందే అవకాశాలు ఉంటాయని ఒకవైపు చెబుతోంది. మరోవైపు వ్యవసాయంలో యంత్రాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో అనేక ప్రాంతాలలో నాట్లు, కోత, నూర్పిడి పనులను యంత్రాలే చేస్తున్నాయి. వుపాధి రహిత అభివృద్దికి ఇది ఒక సూచిక. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాల కారణంగా సేద్య రాబడి 20-25 శాతం మేర క్షీణిస్తుందన్న గత సర్వే మాటేమిటి అంటే సమాధానం లేదు. చిన్నా, పెద్ద అనేతేడా లేకుండా అన్ని రంగాల్లో రోబోలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధిక సర్వే చెబుతున్నదానికి భిన్నంగా నీతి ఆయోగ్‌ వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌ చంద్‌ వాదన వుంది. గత ఐదు సంవత్సరాలుగా సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదు అవుతోంది. ప్రస్తుత స్ధితిని చూస్తే ఆరో సంవత్సరం కూడా ఇదే స్ధితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా వ్యవసాయ వృద్ధి రేటు 2.9శాతం తక్కువేమీ కాదు.కానీ వృద్ది రేటు ఐదుశాతం గనుక వుంటే పంటల ధరలు పడిపోయి రైతుల ఆదాయాలు 30 నుంచి 40శాతం వరకు పడిపోయే అవకాశం వుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్న మోడీ సర్కార్‌ ప్రచారం ఒక వాగాడంబరమే తప్ప వాస్తవం కాదని కూడా రమేష్‌ తేటతెల్లం చేశారు. ఆదాయాలు రెట్టింపు కావాలంటే ఏడాదికి పదిశాతం వృద్దిరేటు అవసరం. తన అంచనా ప్రకారం గత మూడు సంవత్సరాలుగా ఆరుశాతానికి మించి లేదు. ఇప్పుడున్న ధరలకు పదిశాతం అదనంగా రైతులు పొందితే వారి ఆదాయం 16శాతం పెరుగుతుందని రమేష్‌ అంటారు. మరి ఆ పరిస్ధితి ఇప్పుడు వుందా ? ప్రతి పభుత్వ పథకానికి, కార్యక్రమానికి ‘గావ్‌, గరీబ్‌, కిసాన్‌’ కేంద్ర బిందువులని ఘనంగా చాటిన ఆర్థిక మంత్రి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ప్రత్యేకించింది బడ్జెట్‌లో అయిదు శాతమే! పెట్టుబడి లేని వ్యవసాయంపై ద ష్టి సారించామని, రైతుల రాబడి రెండింతలయ్యేందుకు అది దోహదపడుతుందన్న హామీ ఉత్తచేతులతో మూరలేసిన చందమే. ‘కిసాన్‌ సమ్మాన్‌’ అల్పసంతోషులను కొంత ఊరడిస్తున్నా, రైతుకు జీవన భద్రత కల్పించగల విశేష చొరవ ఈ బడ్జెట్‌ కసరత్తులోనూ కొరవడింది. రైతాంగంలో కేవలం ఆరు శాతానికే దక్కుతున్న కనీస మద్దతు ధరల పెరుగుదల ఎంత ప్రహసన ప్రాయంగా వుందో బడ్జెట్‌కు ముందు పెంచిన నామమాత్ర ధరలను చూస్తే తెలుస్తుంది.

దేశంలో పారిశుద్ధ్య సేవలు అంతంతమాత్రమేనని గత ఏడాది పార్లమెంటరీ స్థాయీసంఘం విమర్శించింది. వివిధ రాష్ట్రాల్లో రూ.14 వేలకోట్లకు పైగా స్వచ్ఛ నిధులు మురిగిపోతున్నాయని లెక్కచెప్పింది. ఆ ఊసెత్తని తాజా ఆర్థిక సర్వే స్వచ్ఛభారత్‌ నుంచి స్వస్థ భారత్‌ మీదుగా సుందర భారత్‌ వైపు నడుద్దామని పిలుపునిచ్చింది. బడ్జెట్‌ పరిమాణం 27 లక్షల 86 వేలకోట్ల రూపాయలకు ఎగబాకింది. నిరుటి బడ్జెట్‌ ప్రతిపాదనలకన్నా మూడు లక్షల 44 వేలకోట్ల రూపాయలు అధికం! ఆదాయపన్ను మినహాయింపుల గురించి ఎదురు చూసిన ప్రభుత్వ వుద్యోగుల ఆశాభంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాలుగునెలల క్రితం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ప్రతిపాదనలనే తిరిగి వల్లించారు. నిజానికి వుద్యోగులకు మినహాయింపులు పెంచితే ఆ మేరకు మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుంది. అధిక ఆదాయం వచ్చే వారి మీద సర్‌ఛార్చి పెంపుదల హర్షణీయమే అయినా అసమానతల తగ్గింపు రీత్యా చూస్తే ఇది సముద్రంలో కాకిరెట్ట వంటిదే. మరోవైపు బడా సంస్ధలకు ఇచ్చిన రాయితీలను చూస్తే 25శాతం ఆదాయపన్ను జాబితాలోకి వచ్చి సంస్ధల వార్షిక లావాదేవీల మొత్తాన్ని 250 నుంచి 400 కోట్లకు పెంచారు. పోనీ దీని వలన ఆర్ధిక వ్యవస్ధకు మేలు జరుగుతుందా అంటే చెప్పలేము. అనేక సంస్ధలు తమ లాభాలను, పన్ను రాయితీలను సరిహద్దులు దాటించి విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చి వాటి మీద కూడా రాయితీలు పొందుతున్నారు.

మోదీ ప్రభుత్వం ‘సాగరమాల’ పేరిట రేవుల్ని నవీకరించి, నూతనంగా ప్రపంచ స్ధాయి నౌకాశ్రయాలు నిర్మించి, వాటన్నింటినీ అనుసంధానిస్తూ కోస్తా ఆర్థిక మండళ్లు నెలకొల్పుతామన్నా- జల మార్గాల గురించి చెప్పినా ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్లుగా వుంది. ఇప్పుడు హైవేల గ్రిడ్‌ గురించి కబుర్లు చెబుతున్నారు. ‘గ్రామీణ సడక్‌ యోజన’ నిధులు ఖర్చు చేయలేదు. ఈ సారి మొత్తాన్ని పెంచలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కేటాయింపులు తగ్గాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను కుదించారు. ఇవన్నీ గ్రామీణుల ఆదాయాలను తగ్గించేవే తప్ప పెంచేవి కాదు. గత బడ్జెట్‌లో వివిధ పధకాలకు చేసిన కేటాయింపుల్లో దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయల మేర కోతలు పెట్టి లోటు అదుపులో వుందని నమ్మబలికారు. జనాన్ని మాయ చేయటం తప్ప వేరే కాదు. ప్రభుత్వ రంగ సంస్ధలలో పెట్టుబడుల వుపసంహరణ ద్వారా వచ్చిన నిధులను కొత్త పెట్టుబడిగా పెడితే ప్రయోజనం, అలాగాక వాటిని లోటును పూడ్చు కోవటానికి వినియోగిస్తున్నారు.

Image result for india budget 2019-20

రానున్న ఐదు సంవత్సరాలలో మౌలిక వసతుల కల్పనకు వందలక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని కొండంత రాగం తీసి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం 3.38లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మరోవైపు రైల్వే మౌలిక సదుపాయాల నిమిత్తమే 2030 సంవత్సరంలోగా రూ.50 లక్షల కోట్లు కావాలని చెప్పి కేటాయించిన మొత్తం 66వేల కోట్ల రూపాయలు మాత్రమే. తొలిసారి అధికారానికి వచ్చిన కొత్తలో తెల్లారి లేస్తే నరేంద్రమోడీ ఏదో ఒక దేశంలో వుండేవారు. ఎందుకయ్యా అంటే దేశానికి అవసరమైన విదేశీ పెట్టుబడులు తీసుకురావటానికి అని చెప్పారు. మరోవైపు తమ నేత కొత్తగా అప్పులు చేయటం లేదని, పాత అప్పులను తీర్చినట్లు మోడీ అనుయాయులు ఎన్నికల ముందు వూదరగొట్టారు. తాజా బడ్జెట్‌లో విదేశీ బాండ్ల ద్వారా రుణాలను సేకరిస్తామని చెబుతున్నారు. ఐదేండ్లుగా సాగించిన కౌగిలింతల దౌత్యం, విదేశీయులకు పరచిన ఎర్రతివాచీ మర్యాదలద్వారా ఏమి సాధించినట్లు? ఏమాటను, ఏ చేతనూ విశ్వసించే స్దితి కనిపించటం లేదు.

మరోవైపు జనాన్ని బాదేందుకు ఏ అవకాశాన్నీ వదలటం లేదు. వివాహ సమయంలో నూతన వధూ వరులకు అరుంధతి నక్షత్రాన్ని చూడమని చెబుతారు. వారికి అది కనిపిస్తుందో లేదో తెలియదు గానీ అమ్మాయి తండ్రికి అప్పులు స్పష్టంగా కళ్ల ముందుంటాయి. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వెలిబుచ్చినట్లు చమురు ధరలు తగ్గుతాయో లేదో గాని పెట్రోలు, డీజిల్‌ మీద ప్రకటించిన ఒక రూపాయి ప్రత్యేక సుంకం మాత్రం స్పష్టంగా ధరల పెరుగుదలకు దారి తీసింది. గత ఐదు సంవత్సరాలలో తగ్గిన చమురు ధరలను వినియోగదారులు లబ్ది పొందకుండా పన్నులను పెంచారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చమురు ధరలు తగ్గుతాయని ఏ అంచనాతో చెబుతున్నారో తెలియదు గానీ ఆ పేరుతో జనానికి వడ్డించారు. ఇష్టమైనపుడు వుంగరాల వేళ్లతో మొట్టినా సరదాగానే వుంటుందంటారు. ఇది కూడా అంతేనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గ్రీస్‌ వామపక్షం సిరిజా ఓటమి కారణాలేమిటి?

10 Wednesday Jul 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

100 years of the KKE, Alexis Tsipras, Greece New Democracy, Socialist PASOK, Syriza, The ‘SYRIZA Experience

Image result for why leftist syriza lost the Greece 2019 election

ఎం. కోటేశ్వరరావు

గ్రీస్‌లో నాలుగేండ్ల క్రితం తొలి వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ సిరిజా ఆదివారంనాడు జరిగిన మలి ఎన్నికల్లో పరాజయం పాలైంది. మితవాద న్యూ డెమోక్రసీ పార్టీ తిరిగి అధికారానికి వచ్చింది. తొలిసారిగా మే నెలలో జరిగిన ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని రకాల మితవాద పార్టీలు 52శాతం ఓట్లు తెచ్చుకొని అక్కడ పెరుగుతున్న ప్రమాదానికి సంకేతాలను వెల్లడించాయి. ఇప్పుడు వాటి బలం మరింత పెరిగింది. వామపక్ష సిరిజా వైఖరి, విధానాలతో తొలినుంచీ విభేదిస్తున్న కమ్యూనిస్టు పార్టీ గత ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్లూ సీట్లను నిలబెట్టుకుంది. గతంలోనూ, ఈసారీ ఆ పార్టీ 300స్థానాలున్న పార్లమెంట్‌లో 15 సీట్లు తెచ్చుకుంది. లాటిన్‌ అమెరికాలో కొన్నిచోట్ల వామపక్షాలకు తగిలిన ఎదురుదెబ్బల పూర్వరంగంలో గ్రీస్‌ ఎన్నికలు అభ్యుదయవాదులు, వామపక్షాలు, కమ్యూనిస్టులు, కార్మికవర్గానికి కూడా ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతున్నాయి.
ఈ ఎన్నికల్లో అధికారిక సమాచారం ప్రకారం వివిధ పార్టీల ఓట్లశాతం, సీట్ల సంఖ్య ఇలా ఉన్నాయి. న్యూడెమోక్రసీ 39.85(158), సిరిజా 31.53(86), కినాల్‌(మార్పుకోసం ఉద్యమం) 8.10(22), కమ్యూనిస్టుపార్టీ 5.3(15), ఎలినికి లిసీ(గ్రీక్‌ పరిష్కారం) 3.7(10) డైయం25(2025 ఐరోపా ఉద్యమంలో ప్రజాస్వామ్యం) 3.44(9) సీట్లు పొందగా ఇతర పార్టీలకు 8.08శాతం ఓట్లొచ్చాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం 300స్థానాలున్న పార్లమెంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 151స్థానాలు అవసరం. అయితే ఎన్నికలు 250స్థానాలకు మాత్రమే జరుగుతాయి. వీటిలో మూడు రకాలు, దేశం మొత్తాన్ని 12 నియోజకవర్గాలుగా పరిగణించి పార్టీలు పొందిన ఓట్లశాతాలకు అనుగుణంగా సీట్లను కేటాయిస్తారు. ఇవిగాక మరో ఏడు స్ధానాలు ఇవన్నీ దాదాపు దీవులకు చెందినవి. వీటిలో నియోజకవర్గ ప్రాతిపదికన మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న వారిని విజేతలుగా నిర్ణయిస్తారు. మిగిలిన 231స్థానాలను దేశంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గాలలో వున్న సీట్లను దామాషా ప్రాతికపదికన పార్టీలకు కేటాయిస్తారు. కనీసం 3శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీకి మాత్రమే ప్రాతినిద్యం లభిస్తుంది. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పెద్ద పార్టీకి 50స్థానాలు బోనస్‌గా ఇస్తారు. ఈ కారణంగానే న్యూ డెమోక్రసీ పార్టీకి 39.85శాతమే ఓట్లు వచ్చినా సీట్లు సగానికిపైగా పొందింది.
కొంతమంది వర్ణించినట్టు తీవ్రవాద వామపక్ష లేదా వామపక్ష కూటమిగా 2004లో ఏర్పడి పదేండ్లలో అధికారానికి వచ్చిన పార్టీగా సిరిజా ఎందరో వామపక్ష అభిమానులకు ఉత్సాహానిచ్చింది. సిరిజా అంటే మూలాల నుంచి లేదా విప్లవాత్మకం అని అర్థం. గ్రీసులో 1990 దశకంలో ప్రయివేటీకరణ, సామాజిక, పౌర సమస్యల వంటివాటితో పాటు కొసావోపై దాడులను వ్యతిరేకించటం వంటి అనేక సమస్యలపై ఐక్యంగా ఉద్యమించిన వామపక్ష సంస్థలు, పార్టీలు, శక్తులు తొలిసారిగా 2002 గ్రీస్‌ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్దుబాట్లు చేసుకున్నాయి. తరువాత దాని కొనసాగింపుగా 2004ఎన్నికల సమయంలో సిరిజా కూటమిగా పోటీ చేశాయి. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయిన ఒక గ్రూపు, వామపక్ష-పర్యావరణ ఉద్యమకారుల పార్టీ, ఇంటర్నేషనల్‌ వర్కర్స్‌ లెఫ్ట్‌ వంటివి, వివిధ భావజాలాలతో పని చేస్తున్న వామపక్ష బృందాలూ వ్యక్తులూ దీనిలో చేరారు. ఆ ఎన్నికల్లో 3.3శాతం ఓట్లు తెచ్చుకున్న సిరిజా ఆరు పార్లమెంట్‌ స్థానాలు తెచ్చుకుంది. ఆరుగురు ఎంపీలు వామపక్ష-పర్యావరణ పార్టీకి చెందిన వారే అయ్యారు. ఇది మిగతా బృందాలలో ఆందోళనకు కారణమైంది. సిరిజాలో ఇదే పెద్దపార్టీ. మధ్యేవాద వామపక్ష రాజకీయాలను తిరస్కరించాలనే అంశంపై కొన్ని సైద్ధాంతిక సమస్యలు తలెత్తటంతో ఎన్నికలు ముగిసిన మూడునెలలకే ఈ పార్టీ విడిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల్లో విడిగానే పోటీ కూడా చేసింది. సిరిజాలో విలీనమైన ఇతర పార్టీలలో కూడా విభేదాలు తలెత్తాయి. అయితే అదే ఏడాది డిసెంబరులో తిరిగి సంకీర్ణ కూటమిలో కొనసాగాలని నిర్ణయించుకొన్నారు. 2004 నుంచి 2009 వరకు సిరిజా అనేక అంతర్గత సమస్యలను ఎదుర్కొన్నది, కొత్త శక్తులు చేరాయి. 2009ఎన్నికల్లో 4.6శాతం ఓట్లు తెచ్చుకుంది. తరువాత కాలంలో ప్రధాని అయిన సిప్రాస్‌ పార్లమెంటరీ పార్టీనేతగా ఎన్నికయ్యారు. మరుసటి ఏడాది వామపక్ష-పర్యావరణ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు సిరిజా నుంచి విడిపోయి డెమోక్రటిక్‌ లెఫ్ట్‌ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. 2012లో జరిగిన ఎన్నికల్లో సిరిజా కూటమి 16శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ పెద్ద పక్షంగా ముందుకొచ్చింది. అయితే ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటంతో అదే ఏడాది జూన్‌లో తిరిగి ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికల్లో కూటమి బదులు సిరిజా ఒక పార్టీగా పోటీ చేసి 27శాతానికి ఓట్లను పెంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మరుసటి ఏడాది ఐక్యపార్టీ సభ జరిగింది. కూటమిలోని పార్టీలను రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే నాలుగు పార్టీలు అంగీకరించకపోవటంతో ఆ నిర్ణయాన్ని మూడునెలలు వాయిదా వేశారు. సిప్రాస్‌ను అధ్యక్షుడిగా 74శాతం అంగీకరించారు. యూరో నుంచి తప్పుకోవాలని కోరే వామపక్ష వేదిక అనే పార్టీ సిరిజా కేంద్రకమిటీలో 30శాతం స్ధానాలను పొందింది. 2014 ఐరోపా యూనియన్‌ ఎన్నికల్లో 26.5శాతం ఓట్లతో సిరిజా పెద్ద పార్టీగా అవతరించింది. తరువాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో వివిధ కారణాలతో మిశ్రమ ఫలితాలను పొందింది. 2014 డిసెంబరులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవటంలో విఫలం కావటంతో పార్లమెంట్‌ రద్దయింది. 2015 జనవరి 25న జరిగిన ఎన్నికల్లో సిరిజా 36.3శాతం ఓట్లు, 149 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది గానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు సీట్లు తగ్గాయి. సిరిజా గనుక అధికారంలోకి వస్తే పొదుపు చర్యలకు వ్యతిరేక వైఖరిని తీసుకుంటుందని, పెట్టుబడిదార్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని అనేకమంది భయపడ్డారు. మితవాద ఇండిపెండెంట్‌ గ్రీక్స్‌ పార్టీ సంకీర్ణానికి అంగీకరించటంతో సిప్రాస్‌ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. ఒక వామపక్షం, పచ్చి మితవాద పార్టీ పొత్తు అది.
రుణభారం నుంచి గ్రీస్‌ను బయట పడవేసేందుకు ఐరోపాయూనియన్‌, ఐరోపా కమిషన్‌, ఐఎంఎఫ్‌ల త్రికూటమి పొదుపు పేరుతో విధించిన షరతులను అంగీకరిస్తూ సిప్రాస్‌ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనను సిరిజాలోని 25మంది ఎంపీలు వ్యతిరేకించారు. వారంతా బయటకొచ్చి పాపులర్‌ యూనిటీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. మెజారిటీ కోల్పోవటంతో 2015 ఆగస్టు 20న రాజీనామా చేసి సెప్టెంబరు 20న తాజా ఎన్నికలకు సిప్రాస్‌ సిఫార్సు చేశారు. తిరిగి సిరిజా పెద్దపార్టీగా అవతరించి 145స్థానాలను తెచ్చుకుంది. మరోసారి ఇండిపెండెంట్‌ గ్రీక్స్‌తో ఒప్పందం చేసుకొని 155సీట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని రెండోసారి ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌ పదవీ కాలం నాలుగేండ్లు అయినందున ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు వుంది. అయితే మేలో జరిగిన ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో, తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరిజా ఓటమి చెందింది. దాంతో ముందస్తు ఎన్నికలకు సిప్రాస్‌ సిఫార్సు చేయటంతో ఈనెల ఏడున ఎన్నికలు జరిగాయి. ఒక వామపక్ష పార్టీగా సిరిజా స్వల్ప కాలంలోనే ఓటర్లకు ఎందుకు దూరమైంది అన్నది అనేకమందిలో తలెత్తుతున్న ప్రశ్న.
నాలుగేండ్ల క్రితం గ్రీస్‌ చేగువేరా(సిప్రాస్‌)గా పేరు తెచ్చుకున్న నేత పాలనలో అంతకు ముందు పాలకుల హయాంలో త్రికూటమి తమ మీద రుద్దిన భారాలనుంచి విముక్తి కలిగిస్తారని ఆశించిన కార్మికవర్గ కలలు కల్లలయ్యాయి. గత పాలకులు ప్రకటించిన పొదుపు చర్యల గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్టు సిప్రాస్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. మితవాదులు గగ్గోలు పెట్టారు. జనం బ్రహ్మరథం పట్టారు. 2015 జూలై 5న జనాభిప్రాయ సేకరణ సమయంలో డబ్బులేక బ్యాంకులు మూతబడ్డాయి. ఐరోపా సంస్థలు, ఐఎంఎఫ్‌ నగదు సరఫరా నిలిపేశాయి. అవి ప్రతిపాదించిన పొదుపు చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు 61శాతం మంది ఓటు వేశారు. కొద్దిరోజుల తరువాత ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి సదరు సంస్థలు రుద్దిన అన్ని షరతులకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ 25మంది ఎంపీలు తిరుగుబాటు చేయటంతో వెంటనే పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలు జరిపారు. నూతన షరతుల గురించి జనానికి పూర్తిగా తెలిసి, పర్యవసానాల గురించి చర్చలు ప్రారంభమయ్యేలోగానే ఎన్నికలు రావటం, ఎదురుగా అంతకు ముందే పొదుపు చర్యల్ని రుద్దిన న్యూ డెమోక్రసీ పార్టీ కనిపిస్తుండటంతో చాలామంది ఓటర్లు అసలు ఎన్నికలకే దూరమయ్యారు. 1974 తరువాత కనిష్టంగా 56.6శాతం ఓట్లు పోలయ్యాయి (తాజా ఎన్నికల్లో మరో శాతం పెరిగింది తప్ప ఓటర్లలో ఉత్సాహం లేదు). మరోసారి సిరిజానే ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ పార్టీకి, సిరిజాకు పెద్ద తేడాలేదని భావించిన వామపక్ష ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉండిపోయారనే అభిప్రాయాలూ వెల్లడయ్యాయి.

Image result for syriza tsipras  lost
ఒకనాడు ప్రయివేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించిన వ్యక్తే వాటిని కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టటాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొత్తగా అన్న, వస్త్రాల కోసం చూస్తే వున్న వాటినే వూడగొట్టినట్టుగా పరిస్థితి తయారైంది. విప్లవకారుడని భావించిన వారికి విద్రోహిగా కనిపించాడంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు వందల నౌకా కంపెనీలకు, ఇతర సంస్థలకు పెద్ద మొత్తంలో పన్నుల రాయితీలు ప్రకటించారు. ఇలాంటి వైఖరి కారణంగానే మితవాదుల కంటే అతివాదుల పేరుతో భారాలు మోపే వారే మంచిదనే కారణంతో ఐరోపా యూనియన్‌ ఎన్నికల్లో దేశంలో ఇరవైకి పైగా ఉన్న బడా సంస్థలలో సగం, బ్యాంకులు, ఐరోపా యూనియన్‌, కమిషన్‌, అనేక కార్పొరేట్‌ సంస్థలు సిప్రాస్‌కు మద్దతిచ్చినట్టు వార్తలొచ్చాయి. అమెరికా నుంచి ఎఫ్‌16 యుద్ధ విమానాల కొనుగోలుకు రెండున్నర బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఇజ్రాయెల్‌తో స్నేహ సంబంధాలను పెంపొందించుకున్నారు. బాల్కన్‌ ప్రాంతానికి నాటో కూటమి విస్తరించటాన్ని వ్యతిరేకిస్తూ గతంలో గ్రీస్‌ చేసిన వీటో రద్దు చేసి దారి సుగమం చేశారు.
గ్రీక్‌ బడాబాబులకు, ఐరోపా యూనియన్‌ భారాలకు, పొదుపు చర్యలకు వ్యతిరేకంగా పోరాడతానన్న వాగ్దానాలతో సిప్రాస్‌ అధికారానికి వచ్చారు. వాటికి పూర్తి భిన్నంగా ఆచరణలో వ్యవహరించారు. పొదుపు పేరుతో పేదల మీద భారాలను మోపారని చివరికి జర్మన్‌ ఆర్థిక మంత్రి వూల్ఫ్‌గాంగ్‌ ష్కాబుల్‌ కూడా విమర్శించారంటే ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నాలుగేండ్ల క్రితం న్యూడెమోక్రసీకి 16.5శాతం మంది యువకులు ఓటు వేస్తే ఈ ఎన్నికల్లో 30శాతానికి పెరిగింది, ఇదే విధంగా పెన్షనర్లు కూడా ఆ పార్టీ వైపు మొగ్గారని వెల్లడైంది. సిరిజా నాయకత్వం పైకి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ఆచరణలో ప్రజావ్యతిరేక నయా ఉదారవాద విధానాలను అమలు చేసింది. మిగతా పార్టీలకు దానికీ తేడాలేదని తనను తానే బహిర్గత పరుచుకుంది. ఇతర బూర్జువా పార్టీల మాదిరే పార్టీలో అన్నీ తానే అయి వ్యవహరించి సిరిజా అంటే సిప్రాస్‌ అనే విధంగా మార్చివేశారన్న విమర్శలున్నాయి. ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఓటర్లను ఆకట్టుకొనేందుకు సిప్రాస్‌ కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించాడు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఫలితం లేకుండా పోయింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: