• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2020

రాఫెల్‌ నరేంద్రమోడీ సుదర్శన చక్రం అవుతుందా !

31 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Chinese Military, Indian Military, Narendra Modi, Rafale fighter jet


ఎం కోటేశ్వరరావు


తాము అందచేసిన రాఫెల్‌ విమానాల గురించి భారత మీడియా చేసిన హడావుడిని చూసి ఫ్రాన్స్‌ ఉబ్బితబ్బిబ్బయింది. తమ విమానాలను కొన్న మరే దేశంలోనూ లేని విధంగా భారత్‌లో ఇంతగా స్పందన ఉందా అని ముక్కున వేలేసుకుంది. దీనికి భిన్నంగా చైనాలో మీడియా రాఫెల్‌ రాక గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు, అయితే ఏమిటి ? అన్నట్లుగా తాపీగా వ్యవహరించింది. భారత్‌ నుంచి ముప్పు వచ్చింది, జాగ్రత్త పడండి అని గాని మన మీడియా మాదిరి జనంలో చైనా వ్యతిరేక భావాలను రెచ్చగొట్టినట్లుగా భారత వ్యతిరేక ధోరణులను రెచ్చగొట్టినట్లు కనపడదు.


మన దేశం ఎప్పటికప్పుడు రక్షణ పాటవాన్ని పెంచుకోవాలి, అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవాలనటంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు. కొన్ని దేశాలు అణ్వస్త్రాలను సమకూర్చుకొని మనవంటి దేశాలను అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేయాలని వత్తిడి తేవటాన్ని అంగీకరించవద్దని , సంతకం చేయవద్దని వామపక్షాలలో పెద్ద పార్టీ అయిన సిపిఎం అణ్వస్త్రాల తయారీ అవకాశాన్ని అట్టి పెట్టుకోవాలని చెప్పింది.

రాఫెల్‌ విమానాల విషయంలోనూ, బోఫోర్స్‌ శతఘ్నల విషయంలోనూ వాటి నాణ్యత, శక్తి సామర్ధ్యాల గురించి ఎన్నడూ ఎవరూ అభ్యంతర పెట్టలేదు, కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవినీతిని మాత్రమే వామపక్షాలతో సహా ఇతర పార్టీలన్నీ వ్యతిరేకించాయి. రాఫెల్‌ కూడా ఆధునికమైనదే, అయితే వాటిని మన వాయుసేనకు అందించగానే మన దేశం, నరేంద్రమోడీ అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ అయినట్లు, ఇంక ప్రపంచ యాత్రను ప్రారంభించటమే తరువాయి అన్నట్లుగా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.


లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చైనా మిలిటరీతో జరిగిన ఉదంతాలకు రాఫెల్‌ విమానాల రాకకు లంకెపెట్టి కథనాలు అల్లారు. దీన్ని తెలియని తనం అనుకోవాలా చూసే వారు, చదివేవారికి బుర్ర తక్కువ అని మీడియా పెద్దలు భావిస్తున్నారా ?


మన మిలిటరీకి అత్యాధునిక యుద్ద విమానాలను సమకూర్చుకోవాలని 2007లోనే నిర్ణయించారు. ఏ దేశమూ తమ దగ్గర తయారైన పదునైన ఆయుధాలను అది ప్రభుత్వం తయారు చేసినా లేదా ప్రయివేటు కార్పొరేట్‌ సంస్దలు తయారు చేసినా ఇతరులకు ఇచ్చేందుకు అంగీకరించదు. తాను అంతకంటే మెరుగైన దాన్ని తయారు చేసుకున్న తరువాతే మిగతా దేశాలకు వాటిని విక్రయిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నపుడు అమ్ముకొని సొమ్ము చేసుకుంటాయి. ఆ మేరకు కూడా తయారు చేసుకోలేని దేశాలు వాటిని కొనుగోలు చేస్తాయి. అలాగే మనకు విక్రయించేందుకు అమెరికా కార్పొరేట్‌ కంపెనీ అయిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారు చేసే ఎఫ్‌-16, లేదా మరో కార్పొరేట్‌ సంస్ద బోయింగ్‌ ఎఫ్‌-18 సూపర్‌ హార్నెట్‌, స్వీడన్‌ తయారీ గ్రిపెన్‌, రష్యన్‌ మిగ్‌35, ఐరోపాలోని పలు దేశాల భాగస్వామ్యం ఉన్న ఎయిర్‌ బస్‌ తయారీ యూరో ఫైటర్‌ టైఫూన్‌, ఫ్రెంచి కంపెనీ దసాల్ట్‌ రాఫెల్‌ పోటీ పడ్డాయి.


అమెరికా పాలకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అదిరించి బెదిరించి తమ విమానాలను మనకు కట్టబెట్టాలని చూశారు. మిగిలిన కంపెనీల తరఫున ఆయా దేశాలు కూడా తమ ప్రయత్నాలు తాము చేశాయి. చివరికి కుడి ఎడమలుగా ఉన్న యూరోఫైటర్‌ – రాఫెల్‌ రెండింటిలో ఒక దానిని ఎంచుకోవాలని ఖరారు చేసుకొని, వాటిలో కూడా మంచి చెడ్డలను ఎంచుకొని 2012 జనవరిలో రాఫెల్‌ వైపు మొగ్గుచూపారు. రాఫెల్‌నే ఎందుకు ఎంచుకున్నట్లు అంటే ? రాఫెల్‌ అయితే ఒక దేశంతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. యూరో ఫైటర్‌ ఒక దేశానిది కాదు, తయారీ భాగస్వాములు అయిన నాలుగు అయిదు దేశాలతో ప్రతి అంశం మీద ఒప్పందం చేసుకోవాలి. అది తలనొప్పుల వ్యవహారం కనుక రాఫెల్‌కే మొగ్గుచూపారు. ఇదీ పూర్వ కథ. ఇక యుపిఏ పాలనా కాలంలో జరిగిన ధరల సంప్రదింపులు, ఎన్‌డిఏ కాలంలో ధరలు పెంచటంలో చోటు చేసుకున్న అక్రమాల గురించి గతంలోనే ఎంతో సమాచారం ఉంది కనుక దాని జోలికి పోవటం లేదు.


ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.ఎవరి యుద్ద సామర్ధ్యం ఎంత, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అని ప్రతిదేశం ఇతర దేశాల గురించి నిత్యం తెలుసుకొనే పనిలోనే ఉంటుంది.మనమూ అదే చేస్తాము. స్వంతంగా యుద్ద విమానాలను తయారు చేయగలిగిన దేశాలతో చైనా కూడా పోటాపోటీగా ఉంది.మనం కూడా తేలిక పాటి విమానాల తయారీకి పూనుకున్నాము. ప్రభుత్వ రంగ హిందుస్దాన్‌ ఏరోనాటికల్‌ తేజా విమానాలను ఇప్పటికే తయారు చేయటంలో ఎన్నో విజయాలు సాధించింది. మిగతా దేశాలతో పోటీపడే ఆధునికమైన వాటిని తయారు చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. కనుకనే విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించాము.


రాఫెల్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించిన వెంటనే యూరోఫైటర్‌ తయారీలో భాగస్వామి అయిన బ్రిటన్‌ మన దేశంపై రుసరుసలాడింది. ఫ్రెంచి వారివి కొంటున్నారు మావెందుకు కొనరు, వాటి కంటే మావే మెరుగైనవి కదా అని వ్యాఖ్యానించింది (2012 ఫిబ్రవరి 18 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా). అంతే కాదు, ఇతర దేశాలేవీ కొనుగోలుకు ముందుకు రాని రాఫెల్‌ విమానాలను ఫ్రెంచి వారు భారత్‌కు, అదీ అధిక ధరలకు కట్టబెట్టారనే విమర్శలు వచ్చాయి. మనం ఒప్పందం చేసుకున్న తరువాత మరొక దేశం కొనుగోలు చేసినట్లు వార్తలు లేవు.

ఇక రాఫెల్‌ జెట్‌ రాకతో మనం ఇరుగుపొరుగుదేశాల మీద దాడికి దిగవచ్చు అన్నట్లుగా మీడియా చెబుతోంది. ఏ దేశమూ అంత గుడ్డిగా ఉండదు అని గుర్తించాలి. రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేసిన ఈజిప్టు తన మీద నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఇజ్రాయెల్‌ మీద దాన్ని ఎందుకు ప్రయోగించటం లేదు, ఇజ్రాయెల్‌ ఆక్రమణకు గురైన ప్రాంతాలన్నింటినీ ఎందుకు వెనక్కు రప్పించలేకపోయింది? పాలస్తీనా సమస్య పరిష్కారానికి ఇజ్రాయెల్‌ను ఎందుకు ఒప్పించలేకపోయింది ?
సిరియా మీద అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలన్నీ కలసి దాడులు చేశాయి. వాటిలో రాఫెల్‌ విమానాలు కూడా పాల్గొన్నాయి. అయినా సిరియాను అణచలేకపోయాయి. ఎంతో బలహీనమైన సిరియానే అణచలేని రాఫెల్‌ మనకంటే ఎంతో బలమైన చైనా ఆటకట్టిస్తుందంటే నమ్మటం ఎలా ?


మనం మన జనం కష్టార్జితాన్ని ధారపోసి విదేశాల దగ్గర ఆయుధాలు కొనుక్కొనే స్ధితిలో ఉన్నాం. మరోవైపు చైనా స్వంతంగా విమానాలు తయారు చేసే స్ధితిలో ఉంది.
అమెరికా, రష్యా , ఇతర మరికొన్ని దేశాల వద్ద ఉన్న యుద్ద విమానాలు నాలుగవ, ఐదవ తరానికి చెందినవి. మనం కొన్న రాఫెల్‌ విమానాలు మూడు లేదా 3.5 తరానికి చెందిన వన్నది కొందరి భావన. చైనా వద్ద ఉన్న ఆధునిక జె-20 రాఫెల్‌కు సరితూగేది కాదని మన మీడియా కథకులు, కొందరు విశ్లేషకులు నిర్ణయించేశారు. తమ జె-20 నాలుగవ తరానికి చెందినదని, రాఫెల్‌ మూడు దాని కంటే కాస్త అభివృద్ధి చెందినదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక చైనా మిలిటరీ నిపుణుడిని ఉటంకించింది. అసలు జె-20 రాఫెల్‌ సమీపానికి కూడా రాలేదు, ఇది ఆటతీరునే మార్చి వేస్తుందని మన మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బిఎస్‌ ధోనా అంటున్నారు. పై రెండు అభిప్రాయాలతో ఏకీభవించటమా లేదా అన్నది సామాన్యులంగా ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. కానీ రంగంలో ఉన్న నిపుణులు పొరపాటు పడితే పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రస్తుతం మన మిలిటరీ దగ్గర ఉన్న సుఖోరు-30ఎంకె1 కంటే రాఫెల్‌ జెట్‌ మెరుగైనది అని కూడా చైనా నిపుణుడు చెప్పాడు.
మన దేశం రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటం ఆయుధ సేకరణలో విషమానుపాతం(సమపాళ్లలో లేని) అని, రక్షణ అవసరాలకు మించి భారత్‌ మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకుంటోందని, ఇది దక్షిణాసియాలో ఆయుధ పోటీకి దారితీస్తుందని పాకిస్ధాన్‌ వర్ణించింది. భారత ప్రాదేశిక సమగ్రతకు ముప్పు తలపెట్టాలని చూసే శక్తులు ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మన రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ హెచ్చరించారు. భారత్‌లోని సంబంధిత వ్యక్తులు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతి, స్ధిరత్వాలకు తోడ్పడతాయని తాము ఆశిస్తున్నట్లు చైనా వ్యాఖ్యానించింది.


మీడియా మాటలను నమ్మి ఏ దేశమూ మరొక దేశం మీద కాలుదువ్వదు. ఎవరైనా అలాంటి దుస్సాహసాలకు పాల్పడితే అంతకు మించిన ప్రమాదం మరొకటి ఉండదు. దైనిక్‌ జాగరణ్‌ అనే హిందీ దినపత్రిక ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూలమైనదే. ఆ సంస్ద జాగరణ ఒక వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తోంది. దానిలో జూన్‌ 17న భారత్‌-చైనా దేశాల మిలిటరీని పోల్చుతూ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. దానిలో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.
అంశము ×××××××××× ××××××భారత్‌×××××××××చైనా
1.రక్షణ బడ్జెట్‌ 2020 ఫిబ్రవరి ××××× 70 బి.డా ××××177.61బి.డా 2019 జూన్‌
2.జనాభా ××××××××××××××× 136 కోట్లు ××××143 కోట్లు
3. ఏటా మిలిటరీకి సిద్దం×××××××× 2.3 కోట్లు ×××× 1.9 కోట్లు
4. మొత్తం మిలిటరీ ×××××××××× 13.25 లక్షలు××× 23.35 లక్షలు
5.ఆటంబాంబులు ×××××××××× 120-130××××× 270-300
6. అన్ని రకాల విమానాలు×××××× 2,663 ××××××× 3,749
7.హెలికాప్టర్లు ×××××××××××× 646 ××××××××× 842
8. దాడి చేసే హెలికాప్టర్లు ××××× 19 ××××× 200
9.విమానాశ్రయాలు×××××××× 346 ×××× 507
10. ట్యాంకులు ××××××××× 6,464×××× 9,150
11. ప్రధాన రేవులు ××××××× 7 ×××××× 15
12.మర్చంట్‌ మెరైన్‌ బలం×××× 340 ××××× 2,030
13. మందుపాతరలు నాటే ఓడలు××× 6 ×××××× 4
14. ఆర్టిలరీ ×××××××××× 7,414 ××××× 6,246
15.జలాంతర్గాములు ×××××× 14 ××××××× 68
16. యుద్ద ఓడలు ××××××× 295 ××××× 714
17.విమాన వాహక నౌకలు××× 2 ×××××× 1
18. ఫ్రైగేట్స్‌ ×××××××××× 14 ×××××× 48
19. డిస్ట్రాయర్‌ షిప్స్‌ ×××××× 10 ×××××× 32
20.తనిఖీ నౌకలు ×××××××× 135 ××××× 138
21. ఖండాంతర క్షిపణులు ××× 5,000 ×××× 13,0000
22. ముడిచమురు ఉత్పత్తి రోజుకు××× 7.67 ల.పీపాలు×××× 41.89 ల. పీపాలు
23. చమురు వినియోగం రోజుకు ×××× 35.10 ల. పీపాలు ×××× 1.01 కోట్ల పీపాలు


పై సమాచారాన్ని వివిధ వనరుల నుంచి జాగరణ జోష్‌ వ్యాస రచయిత సేకరించారు. దీనిలో విమాన వాహక యుద్ద నౌకలకు సంబంధించి వివరాలు వాస్తవం కాదు. ప్రస్తుతం మన దేశం ఒక నౌకను కలిగి ఉంది, రెండో దానిని తయారు చేస్తున్నారు. మూడవ దానిని కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో చైనా వద్ద ఇప్పటికే రెండు వినియోగంలో ఉన్నాయి, మూడవది నిర్మాణంలో ఉంది. 2030 నాటికి మొత్తం సంఖ్యను ఐదు లేదా ఆరుకు పెంచుకోవాలనే కార్యక్రమాన్ని చైనా ప్రకటించింది.


ఏ విధంగా చూసినా చైనా అన్ని విధాలుగా మెరుగైన స్ధితిలో ఉందని జాగరణ్‌ జోష్‌ వ్యాసకర్త పేర్కొన్నారు. ఎవరైనా అదే చెబుతారు. దీని అర్దం మన బలాన్ని తక్కువ చేయటం కాదు, చైనా బలాన్ని ఎక్కువ చేసి చెప్పటం కాదు. కొన్ని వాస్తవాలను వివరించినపుడు కొందరికి మింగుడుపడకపోవచ్చు.
పాలక పార్టీలకు ఒకే రకమైన భజన చేస్తూ వీక్షకులకు బోరు కొట్టిస్తున్న మన మీడియాకు రాఫెల్‌ దొరికింది. ఒంటిమీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులు వేయటానికి కారణాలు స్పష్టం. ఒకటి ఆ విమానాలు నరేంద్రమోడీ చేతిలో సుదర్శన చక్రాలన్నట్లుగా ఎంత గొప్పగా చిత్రిస్తే అంత, ఎంత చైనా వ్యతిరేక ప్రచారం చేస్తే అంతకంటే నరేంద్రమోడీ దృష్టిలో పడవచ్చు, మంచి పాకేజ్‌లను ఆశించవచ్చు. రెండవది పాలక పార్టీ దాని సోదర సంస్దలు లడఖ్‌ సరిహద్దులో జరిగిన పరిణామాల నేపధ్యంలో రెచ్చగొట్టిన చైనా వ్యతిరేకతకు మధ్యతరగతి సహజంగానే ప్రతి స్పందించింది కనుక వారిని ఆకట్టుకొని రేటింగ్‌ను పెంచుకోవచ్చు. ఇలాంటి కారణాలు తప్ప వాస్తవ ప్రాతిపదిక కనుచూపు మేరలో కానరాదు.
మీడియాలో వ్యక్తమైన రెండు అంశాలలో ఒకటి ముందే చెప్పుకున్నట్లు చైనా వ్యతిరేకత, రెండవది రాఫెల్‌ విమానాలు మన వాయుసేనలో చేరిక. రెండవది నిరంతర ప్రక్రియ. మన భద్రతను మరింత పటిష్టం చేసుకొనేందుకు అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవటం ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిందే. అది ప్రతిదేశమూ చేస్తున్నదే. కానీ చైనా వ్యతిరేకత వెంకటేశ్వర సుప్రభాతం కాదు కదా ! ఎవరు అవునన్నా కాదన్నా చైనా సోషలిస్టు దేశంగా తనదైన పంధాలో తాను పోతోంది. ఇష్టం లేకపోతే పొగడవద్దు, దాని ఖర్మకు దాన్ని వదలి వేయండి. అనేక మంది శాపనార్ధాలు పెడుతున్నట్లు అది కూలిపోతుంతో లేక మరింతగా పటిష్టపడుతుందో చైనా అంతర్గత వ్యవహారం, జనం తేల్చుకుంటారు. అదే సమయంలో అది మన పొరుగుదేశం. మన ఇరుగుపొరుగుతో లడాయి ఉంటే అది ఎలా ఉంటుందో మనం నిత్య జీవితంలో చూస్తున్నదే. మరొక దేశమైనా అంతే.


ఇరుగు పొరుగు దేశాలతో స్నేహం కోరుకోవాలని దాని వలన కలిగే లాభాల గురించి చర్చకు బదులు చైనాకు వ్యతిరేకంగా ఏమి వర్ణన, ఏమి కోలాహలం, ఇప్పటి వరకు ఏదో అనుకున్నారు, ఇక బస్తీమే సవాల్‌ , నరేంద్రమోడీ లేస్తే మనిషి కాదు అన్నట్లుగా గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా చిందులేసింది. 1962లో చైనాతో యుద్దం జరిగింది, తిరిగి సాధారణ సంబంధాలు పునరుద్దరణ జరిగిందా లేదా ? గాల్వన్‌లోయలో ఒక అవాంఛనీయ ఉదంతం జరిగింది. గతంలో జరిగిన యుద్ధానికి కారకులు చైనా వారే అని గతంలో చెప్పిన వారే వారితో చేతులు కలిపేందుకు చొరవ తీసుకొనేందుకు సిగ్గు పడలేదు కదా ! తాజా ఉదంతాలు కూడా చైనా కారణంగానే జరిగాయనే వాదనలను కాసేపు అంగీకరిద్దాం. అంతమాత్రాన చైనాతో రోజూ యుద్ధాలు చేసుకుంటామా ? సమస్యలను పరిష్కరించుకొనేందుకు రెండు దేశాలూ పూనుకున్న తరువాత మరోసారి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది ? అంతగా కావాలనుకుంటే రాఫెల్‌ గొప్పతనం గురించి పొగడండి-దానికి లంకె పెట్టి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది ? రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్దమంటూ వస్తే ఏ ఒక్క దేశమూ మిగలదు. అందువలన ఇప్పుడు కావాల్సింది సమస్యల పరిష్కారం తప్ప రెండు పక్షాలను ఎగదోయటం కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ భవితవ్యం : కరోనా ఇంటికి పంపుతుందా- వాక్సిన్‌ వైట్‌ హౌస్‌కు రప్పిస్తుందా !

28 Tuesday Jul 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Donald Trump, Future of Donald Trump, US President election


ఎం కోటేశ్వరరావు


నవంబరు మూడవ తేదీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిన రోజు. కరోనా వైరస్‌ పరిస్ధితి మరింతగా దిగజారి ఎన్నికలు జరగకపోతే ఏం కానుందో తెలియదు గానీ, పోలింగ్‌ సక్రమంగా జరిగితే దేశ 46 అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ ఎన్నిక ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడి అయినా తిమ్మిని బమ్మిని చేసి రెండవ సారి పదవిలోకి వచ్చేందుకు ట్రంప్‌ నానా అగచాట్లు పడుతున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకొనే అక్కడ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేయని ప్రయత్నం, ప్రత్యర్దులను దెబ్బతీసేందుకు చేయని కుట్రలు తక్కువేమీ కాదు. ఇక డబ్బు ఖర్చు సంగతి సరే సరి. పార్టీల్లో అభ్యర్ధిత్వం కోసం పోటీ పడటం నుంచి ఖరారై ఎన్నికలు ముగిసే వరకు బీరు ప్రాయంగా ఖర్చు చేస్తారు.


” ఘనమైన మన దేశ చరిత్రలో అనేక మంది చెబుతున్నదాని ప్రకారం ఏ యితర ప్రచారం కంటే ఉత్సాహ పూరితంగా ట్రంప్‌ ప్రచారం ఉంది – అది 2016 కంటే ఎక్కువగా ఉంది. బిడెన్‌ సోదిలో లేడు. మౌనంగా ఉండే మెజారిటీ జనం నవంబరు మూడున తమ గళం విప్పుతారు.కృత్రిమంగా ఎన్నికల అణచివేత, కుహనా వార్తలు తీవ్రవాద వామపక్షాన్ని రక్షించలేవు.” అని స్వయంగా ట్రంప్‌ తన గురించి తాను ట్వీట్‌ డబ్బాకొట్టుకున్నాడు. కానీ ఆచరణలో అనేక ఎన్నికల సర్వేలు, జోశ్యాల ప్రకారం ట్రంప్‌ కంటే జో బిడెన్‌ సంతృప్తికరమైన మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ట్రంప్‌ పలుకుబడి అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయినా ఏదో అద్బుతం చేసి ట్రంప్‌ గెలుస్తాడు అని నమ్ముతున్నవారు కూడా అక్కడ ఉన్నారు.


1924 నుంచి 96 సంవత్సరాల ఎన్నికల చరిత్రను చూసినట్లయితే ఫ్లోరిడా రాష్ట్రంలో వెనుకబడిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి ఎవరూ ఇంతవరకు విజయం సాధించలేదు. ఇప్పుడు అక్కడ డెమోక్రటిక్‌ పార్టీ బిడెన్‌ 13 శాతం పాయింట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ఇది ట్రంప్‌కు రాగల కీడును సూచిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. క్విన్‌నిపియాక్‌ విశ్వవిద్యాలయ సర్వేలో బిడెన్‌ 51శాతం, ట్రంప్‌ 38శాతంతో పోటీ పడుతున్నారని వెల్లడికాగా సిఎన్‌ఎన్‌ సర్వేలో 51-46శాతాల చొప్పున ఉన్నారు. దీనిలో కొత్త ఏముంది మార్చి నెలనుంచి జరుపుతున్న ఏ సర్వేలోనూ ఫ్లోరిడాలో ట్రంప్‌ది పైచేయిగా ఉన్నట్లు వెల్లడి కాలేదని ఆయన మద్దతుదార్లు చెబుతున్నారు. అయితే బిడెన్‌కు అనుకూలత వ్యక్తం కావటం ట్రంప్‌కు పెద్ద హెచ్చరికగా చెబుతూ ఎట్టి పరిస్ధితిల్లోనూ ఫ్లోరిడాలో పై చేయిసాధించాలని విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన రానున్న రోజుల్లో ప్రచారం యుద్దం మరింత ముదరటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోతే అది బిడెన్‌ విజయం కంటే ట్రంప్‌ చారిత్రక ఓటమి అవుతుంది. జూన్‌ ఒకటవ తేదీ నుంచి చూస్తే ఫ్లోరిడాలో ట్రంప్‌ సగటున ఎనిమిదిశాతం వెనుకబడి ఉన్నట్లు తేలింది.


అమెరికా ఎన్నికల విధానం ప్రకారం పరోక్ష పద్దతిలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం యాభై రాష్ట్రాలకు వంద సెనెట్‌ (మన రాజ్యసభ మాదిరి) సభ్యులు, కాంగ్రెస్‌లో (మన లోక్‌సభ వంటిది) 435 ప్రజాప్రతినిధులు ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలలో వాషింగ్టన్‌ డిసి నుంచి ముగ్గురితో సహా మొత్తం 538 మంది ఎలక్టరల్‌ కాలేజీ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరిలో 270 మంది మద్దతు పొందిన వారు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నిక అవుతారు. ఒక వేళ ఆ మేరకు పూర్తి మెజారిటీ రాని పక్షంలో అధ్యక్షుడిని పార్లమెంట్‌లోని ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌, ఉపాధ్యక్షుడిని సెనెట్‌ సభ్యులు ఎన్నుకుంటారు.


ఫ్లోరిడా రాష్ట్ర ఫలితాలతో నిమిత్తం లేకుండానే ప్రస్తుతం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోబిడెన్‌కు 270 ఓట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మిషిగాన్‌, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలలో బిడెన్‌ ముందంజలో ఉన్నారు. 2016 ఎన్నికలను ప్రాతిపాదికగా తీసుకుంటే నాటి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిని హిల్లరీ క్లింటన్‌కు 232 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల ఓట్లను కూడా బిడెన్‌ ఖాతాలో వేస్తే అవి 278 అవుతాయి. అలాగాక గత ఎన్నికల ప్రకారం బిడెన్‌కు 232ఓట్లు మాత్రమే ఈసారి కూడా మిగతా చోట్ల వచ్చి ఫ్లోరిడాలో ప్రస్తుతం ఉన్న ముందంజ కొనసాగి అక్కడి 29 ఓట్లను తెచ్చుకుంటే 261 అవుతాయి, పూర్తి మెజారిటీకి తొమ్మిది తక్కువ ఉంటాయి. ఫ్లోరిడాలో కరోనా సమస్య మీద జరిపిన సర్వేలో ట్రంప్‌కు 42శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఈ రాష్ట్ర మెజారిటీ ఓటర్లను తనవైపు తిప్పుకోవటంతో పాటు దేశం మొత్తంగా ఉన్న వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోవటం ట్రంప్‌ వల్ల అవుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.


ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగులు పదకొండుశాతం ఉన్నారు.కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటం, తగు నివారణ చర్యలను తీసుకోవటంలో ట్రంప్‌ నిర్లక్ష్యం గురించి తెలిసిందే. ఇది రాస్తున్న సమయానికి ప్రపంచంలో కోటీ 66లక్షల మందికి కరోనా వైరస్‌ సోకితే వారిలో 44లక్షల మంది అమెరికన్లే, అలాగే మరణించిన ఆరులక్షల 57వేల మందిలో అమెరికాలో లక్షా 50వేల మంది ఉన్నారు. దీనికి ట్రంప్‌ నిర్లక్ష్యం ప్రధాన కారణం. మరోవైపు ఆర్ధిక సమస్యలు, చైనాతో జరుపుతున్న వాణిజ్యపోరు వంటి అనేక ప్రతికూల అంశాల కారణంగా ప్రస్తుతం ట్రంప్‌కు జనంలో ఆదరణ 38శాతానికి పడిపోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. 1948 నుంచి చూసినపుడు ప్రజాదరణ 40శాతంలోపు ఉన్న పదవిలోని అధ్యక్ష అభ్యర్ధులెవరూ రెండవ సారి గెలిచిన దాఖలాలు లేవు.


అయితే ట్రంప్‌ ప్రస్తుతానికి వెనుకబడి ఉన్నప్పటికీ ఓడిపోయే ఖాతాలో వేయకూడదనే అభిప్రాయం కూడా కొంత మందిలో ఉంది. అక్టోబరు నాటికి ఆర్ధిక వ్యవస్ధ కోలుకొని ఓటర్లను ట్రంప్‌ ఆశ్చర్యపరుస్తారని చెబుతున్నారు. అనేక కారణాలతో ఓటర్లు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించగలరనే ఆశాభావాన్ని కలిగిన వారు సగం ముంది ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు.


గత ఎన్నికల్లో ట్రంప్‌కు మెజారిటీ వచ్చిన మిషిగాన్‌, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలలో ఈసారి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధికి మెజారిటీ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే గత ఎన్నికల సమయంలో కూడా తొలుత హిల్లరీ క్లింటన్‌ ఆ రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నట్లు సర్వేలు తెలిపినా తీరా ఓటింగ్‌లో ట్రంప్‌ స్వల్ప మెజారిటీ తెచుకున్నాడు, అది పునరావృతం కాదని చెప్పలేము కదా అన్నది కొందరి వాదన. సర్వేలన్నీ కాలేజీ విద్యావంతులనే ఎక్కువగా ఎంచుకుంటాయని వారే మొత్తం సమాజానికి ప్రతినిధులు కాదన్నది వారి తర్కం.


ట్రంప్‌ నిత్యం ట్వీట్లు, తెలివి తక్కువ ప్రకటనలు, చర్యలకు పాల్పడుతున్నప్పటికీ రోజంతా జనం నోళ్లలో నానుతున్న విషయాన్ని తక్కువగా చూడకూడదని, అది కూడా పెద్ద సానుకూల అంశమే అని కొందరు చెబుతున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో అభ్యర్ధిత్వం కోసం పోటీపడిన బెర్నీశాండర్స్‌ను కుట్రతో వెనక్కు నెట్టిన కారణంగా ఆయన మద్దతుదారులు ఓటింగ్‌కు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతూ అది ట్రంప్‌కు సానుకూలం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కరోనా కారణంగా అనేక చోట్ల పోలింగ్‌ కేంద్రాలను తగ్గించారు. ఇది ఓటింగ్‌శాతం తగ్గటానికి దారి తీయవచ్చని, పట్టణాలలో బిడెన్‌ మద్దతుదారులు ఎక్కువగా ఉన్నారని, పోలింగ్‌ కేంద్రాలలో ఎక్కువ సేపు వేచి ఉండేందుకు వారు ఇచ్చగించరని తద్వారా ప్రత్యర్ధి ఓట్లు తగ్గటం ట్రంప్‌కు కలసి వచ్చే అవకాశం ఉందని ఒక అభిప్రాయం. అక్టోబరు నాటికి కరోనాకు వ్యాక్సిన్‌ రావచ్చని ఆ నాటకీయ ప్రకటనతో ట్రంప్‌ అప్పటి వరకు వచ్చిన ప్రతికూలతలను అధిగమిస్తారన్నది ట్రంప్‌ మద్దతుదారుల ఆశ.


జూలై 15 నాటి వాషింగ్టన్‌ పోస్టు-ఎబిసి సర్వేలో 55శాతం మద్దతుతో బిడెన్‌ ముందుండగా ట్రంప్‌కు 40శాతమే వెల్లడైంది. మార్చినెలలో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉంది. అది కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు, తరువాత పరిస్ధితి మారిపోయింది. వైరస్‌ను ఎదుర్కోవటంలో ట్రంప్‌ విఫలమయ్యారని 60శాతం మంది పేర్కొనగా సక్రమంగానే వ్యవహరించినట్లు 39శాతం చెప్పారు. తానుగా ముఖానికి తొడుగు ధరించేది లేదని ప్రకటించిన ట్రంప్‌ జనంలో దాని మీద తలెత్తిన విమర్శలకు తలొగ్గి తాను కూడా ధరించి సంతృప్తి పరచేందుకు ప్రయత్నించటాన్ని చూశాము. మితవాద ఓటర్లను ఆకర్షించేందుకు నాజీ చిహ్నాలను ఉపయోగించుకొనేందుకు కూడా ప్రయత్నించాడు. ఇది ట్రంప్‌లో తలెత్తిన అపనమ్మకాన్ని సూచిస్తున్నదని కొందరి భాష్యం.


ఓటింగ్‌ సమయానికి నిరుద్యోగం పదిశాతానికి మించి ఉంటే కరోనా మహమ్మారి అదుపులేదనేందుకు సూచిక అవుతుంది. అది ప్రతికూలంగా మారుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రంప్‌ ఓటమి ఖాయం అని అందరూ చెబుతున్నారు. తమనేత విజయం సాధించటం అత్యంత ముఖ్య అంశమని ట్రంప్‌ మద్దతుదారులు 72శాతం మంది భావిస్తుండగా, ట్రంప్‌ను ఓడించటం బిడెన్‌కు ఎంతో ముఖ్యమని ఆయన మద్దతుదారులు 67శాతం భావిస్తున్నారు.


సోమవారం నాడు ట్రంప్‌ విలేకర్లతో మాట్లాడిన తీరును చూస్తే త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దాన్లో భాగంగానే రెండువారాల్లోనే ఒక శుభవార్తను ప్రకటిస్తానని చెప్పాడు. ఒకవైపు ట్రంప్‌ ఇలా చెప్పుకుంటున్న సమయంలోనే మరోవైపు ఆ పెద్దమనిషి నాయకత్వంలో దేశం తప్పుడు మార్గంలో పయనిస్తోందని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలు వెలువడ్డాయి. ఏపి వార్తా సంస్ద చికాగో విశ్వవిద్యాలయ సంస్ధతో కలసి నిర్వహించిన సర్వేలో కరోనా వైరస్‌ వ్యవహారంలో సక్రమంగా వ్యవహరించినట్లు చెప్పిన వారి సంఖ్య 32శాతానికి పడిపోయింది. దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపించారని భావించిన వారు 80శాతం ఉన్నట్లు, ఆర్ధిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నట్లు కేవలం 38శాతం మంది భావిస్తున్నట్లు వెల్లడైంది. సర్వేలు వెల్లడిస్తున్న ఈ ప్రతికూల వార్తల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు ట్రంప్‌ ఎలాంటి ఎత్తుగడలను ముందుకు తెస్తారో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ మొక్కజొన్నల దిగుమతి రైతాంగాన్ని దెబ్బతీస్తుందా -హైకోర్టులో రిట్‌ !

27 Monday Jul 2020

Posted by raomk in AP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Telangana

≈ Leave a comment

Tags

maize imports, maize imports by India, maize imports by modi government


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 25న నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఐక్య జనతా దళ్‌(జెడియు)-బిజెపి-ఎల్‌జెపి, ఇతర చిన్న పార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హౌమం నిర్వహించారు. అంతకు మూడు రోజుల ముందుగా నరేంద్రమోడీ సర్కార్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దాని ప్రకారం ఐదులక్షల టన్నుల మొక్క జొన్నలు, పదివేల టన్నుల పాలు, పాలపొడి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించింది. సాధారణంగా దిగుమతి చేసుకోవాలని ఎవరైనా వాంఛిస్తే ధాన్య రకాలపై 50 నుంచి 60శాతం, పాలు, పాల ఉత్పత్తులపై 30 నుంచి 60శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించి తెప్పించుకోవచ్చు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధ కోటా నిబంధనల మేరకు పైన పేర్కొన్న పరిమాణాలను కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతి చేసుకోనున్నారు.


మొక్కజొన్నలను దిగమతి చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులు అక్రమ వాణిజ్య పద్దతులను అనుసరిస్తున్న కారణంగా రైతులకు రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణా హైకోర్టులో దాఖలైన పిటీషన్లలో అనేక మంది రైతులు తమను కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. మొక్కజొన్నలను దిగుమతి చేసుకున్న సంస్దలు వాటిని నూతన విలక్షణ ఉత్పత్తులను మాత్రమే తయారు చేసేందుకు వినియోగించాలనే షరతును పెట్టింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నలను వేయించి పేలాలుగా తయారు చేస్తే అది కొత్త ఉత్పత్తి కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్నవాటిని తిరిగి వేరే సంచులలో నింపి అమ్మితే కుదరదని అటువంటపుడు కేంద్రం ఏవిధంగా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల కారణంగా తమకు రావాల్సిన ధరలు పడిపోయాయాని రైతులు వాదించారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆదేశించిన కోర్టు కేసును వాయిదా వేసింది.


కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కబుర్లు చెప్పినా, ఉద్దీపన పధకాలు ప్రకటించినా మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాలకు 90 రూపాయలు పెంచిన తరువాత 2020-21 సంవత్సరానికి రు.1,850గా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి నిర్ణయాన్ని ప్రకటించక ముందే దిగుమతుల కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. క్వింటాలుకు 900 నుంచి 1200 రూపాయల వరకు మాత్రమే రైతులు పొందారని అనేక రాష్ట్రాల వార్తలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల టన్నులను విధిగా దిగుమతి చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం వర్తమాన తరుణంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. లాక్‌ డౌన్‌ సమయంలో కోళ్ల దాణా తయారీదారులు తక్కువ ధరలకు పెద్ద మొత్తంలో మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఆ సమయంలో గుడ్లు, కోడి మాంస వినియోగం కూడా తగ్గిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్‌ పాడి పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. వివాహాల సమయంలో ఐస్‌ క్రీమ్‌ పెద్ద ఎత్తున వినియోగించే విషయం తెలిసిందే. వివాహాలకు అతిధులపై తీవ్ర ఆంక్షలున్న కారణంగా ఈ ఏడాది అసలు అడిగిన వారే లేరు. ఇతర ఉత్పత్తులకు సైతం డిమాండ్‌, ధర కూడా గణనీయంగా పడిపోయింది.


మొక్క జొన్న విషయానికి వస్తే ఆసియా ఖండంలో అంతకు ముందు రెండు సంవత్సరాల పాటు డిమాండ్‌ తగ్గి 2019లో మార్కెట్‌ పెరిగింది. చైనా 274 మిలియన్‌ టన్నులతో అగ్రస్ధానంలో ఉండగా ఇండోనేషియా 33, భారత్‌ 28 మిలియన్‌ టన్నులతో వినియోగంలో రెండు మూడు స్ధానాల్లో ఉన్నాయి. అందువలన చైనా వినియోగం, సాగులో, కొనుగోలు విధానాల్లో వచ్చే మార్పులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తలసరి వినియోగంలో దక్షిణ కొరియా 223 కిలోలతో ప్రధమ స్ధానంలో ఉండగా చైనా 188, వియత్నాం 159 కిలోలతో తరువాతి స్ధానాల్లో ఉన్నాయి. ఉత్పత్తి విషయంలో 2019లో ఆసియాలో గరిష్ట స్ధాయిలో 379 మి.టన్నులు ఉత్పత్తి కాగా ఒక్క చైనా వాటాయే 270 మి.ట, ఇండోనేషియా 33, భారత్‌ 29 మి.టన్నులు ఉంది.మన దేశంలో వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువ కావటంతో కొంత ఎగుమతి చేస్తున్నాము. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల కారణంగా దిగుమతులు కూడా చేసుకోవాల్సి వస్తోంది.చైనా వినియోగం ఎక్కువ, దానికి తోడు ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనలకు అనుగుణ్యంగా దిగుమతి చేసుకుంటున్నది. వర్తమాన సంవత్సరంలో చైనాలో 260-265 మి.ట, భారత్‌లో 28 మి.ట దిగుబడి ఉండవచ్చని అంచనా.


దిగుబడుల విషయానికి వస్తే ప్రపంచంలో చిలీలో సగటున హెక్టారుకు 13 టన్నులు ఉండగా అమెరికా, మరికొన్ని చోట్ల 11, ఐరోపా యూనియన్‌ దేశాల సగటు 8, చైనాలో ఆరు కాగా మన దేశంలో మూడు టన్నులు మాత్రమే వస్తున్నది.2019లో ఆసియా దేశాల సగటు దిగుబడి 5.5 టన్నులు. దిగుమతి చేసుకొనే దేశాలలో 2019లో జపాన్‌ 18, దక్షిణ కొరియా 11, వియత్నాం 11, ఇరాన్‌ 10, మలేసియా 4, చైనా 3.9 మిలియన్‌ టన్నుల చొప్పున దిగుమతి చేసుకున్నాయి. ఈ ఏడాది చైనా 7మిలియన్‌ టన్నులు దిగుమతి చేసుకోవచ్చని భావిస్తున్నారు. రికార్డు స్ధాయిలో ఈ ఏడాది కూడా పంట ఉంటుందని, ధరలు కూడా తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది వివిధ దేశాలు దిగుమతి చేసుకున్న మొక్కజొన్నల టన్ను వెల చైనా 222 డాలర్లు, మలేసియా 213, ఇరాన్‌ 182, వియత్నాం 177డాలర్లు చెల్లించాయన్నది సమాచారం. 2020 జూలై 20వ తేదీ కరెన్సీ మారకపు విలువ ప్రకారం మన కనీస మద్దతు ధర రూ.1,850 అంటే డాలర్లలో 24.74 అదే టన్ను ధర 247.4 డాలర్లు. మన దేశం దిగుమతి చేసుకొనే వాటి ధర పైన పేర్కొన్న కనిష్ట-గరిష్ట ధరల మధ్య ఉంటుందని అనుకుంటే అది మన రైతాంగాన్ని దెబ్బతీయటం ఖాయం. దిగుమతుల సాకుతో స్ధానిక వ్యాపారులు కారుచౌకగా రైతుల నుంచి కొనుగోలు చేస్తారని గడచిన తరుణంలోనే వెల్లడైంది. ఈ నేపధ్యంలో రైతులకు రక్షణ ఏమిటన్నది సమస్య. ఎన్ని రైతు బంధులు, రైతు భరోసాలు ఇచ్చినా ధరలు పడిపోతే వచ్చే నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుంది.
గత కొద్ది సంవత్సరాలుగా చైనా మొక్క జొన్న నిల్వలను తగ్గించింది. ఈ కారణంగా 2028 వరకు అవసరాలకు అనుగుణ్యంగా దిగుమతులను పెంచవచ్చని భావిస్తున్నారు. అయితే పన్ను తక్కువగా ఉండే విధంగా కోటా దిగుమతులను పెంచాలని అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న వత్తిడికి తలొగ్గి కోటాను మార్చేది లేదని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే చైనా స్పష్టం చేసింది. 2016లో చైనాలో నిల్వలు 260 మిలియన్‌ టన్నులు ఉన్నాయి.2018 నాటికి అవి 80 మిలియన్‌ టన్నులకు తగ్గాయి. ఆ ఏడాది 3.52 మి.టన్నులు దిగుమతి చేసుకోగా 2020లో 4మి.టకు పెరగవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో కోటా కింద 7.2మి.టన్నులను ఒక శాతం పన్నుతో దిగుమతి చేసుకోనుంది. అదే ఇతరంగా చేసుకొనే దిగుమతులపై 65శాతం పన్ను విధిస్తున్నది. తాము 7.2మి.ట దిగుమతి చేసుకున్నప్పటికీ స్ధానిక రైతాంగం మీద ఎలాంటి ప్రభావం చూపదని, మొత్తం వినియోగంలో రెండుశాతం కంటే ఎక్కువ కాదని అధికారులు చెప్పారు.


గత నాలుగు సంవత్సరాలుగా చైనాలో మొక్కజొన్న ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మూడు నెలల వ్యవధి ఉండే దలియన్‌ వస్తు మార్కెట్‌లో ముందస్తు ధర టన్ను 289 డాలర్లు పలికింది. మన కంటే రెండు రెట్లు అధికదిగుబడి పొందటంతో పాటు మన రైతాంగం గత ఏడాది పొందిన 132డాలర్లతో పోల్చితే ధర కూడా రైతాంగానికి ఎక్కువే గిడుతున్నట్లు ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి.
మన రైతాంగానికి ధరల రక్షణతో పాటు దిగుబడుల పెంపుదల కూడా ఒక ముఖ్యమైన అంశమే అన్నది స్పష్టం. చైనాలో 120 మిలియన్‌ హెక్టార్ల భూమి సాగులో ఉండగా దానిలో ఉత్పత్తి అవుతున్న పంటల విలువ 1,367 బిలియన్‌ డాలర్లని, మన దేశంలో 156 మిలియన్‌ హెక్టార్లలో ఉత్పత్తి విలువు కేవలం 407 బిలియన్‌ డాలర్లే అని నిపుణులు అంచనా వేశారు. రెండు దేశాల్లో అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ చైనాలో కఠిన మైన నిబంధనలు, బలమైన సంస్కరణలు, ప్రోత్సాహకాలు, పరిశోధనా-అభివృద్దికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం వలన చైనా ముందుడుగు వేసేందుకు దోహదం చేశాయి. అశోక్‌ గులాటీ, ప్రెరన్నా టెరవే రూపొందిచిన ఒక నివేదిక ప్రకారం ఒక రూపాయి పరిశోధన-అభివృద్ధికి ఖర్చు చేస్తే జిడిపి రూ.11.20 పెరిగిందని పేర్కొన్నారు. 2018-19లో చైనా వ్యవసాయ పరిశోధనకు 780 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే భారత్‌లో 140 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని తెలిపారు.


ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ -ఉత్పత్తిదారులకు మద్దతు అంచనా)ను ధరల్లో చూస్తే సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకుంటే 2018-19లో చైనా రైతుల మొత్తం ఉత్పాదక విలువలో 15.3శాతం పొందగా అదే భారత్‌లో 5.7శాతమే అని చైనా వ్యవసాయ సంస్కరణల వలన అక్కడి రైతాంగం గణనీయంగా లబ్ది పొందినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. ఫలాన పంట వేస్తేనే అందచేస్తామనే మాదిరి షరతులేమీ లేకుండా రైతులు ఏ పంట వేస్తే దానికి నేరుగా నగదు చెల్లింపు విధానాన్ని అమలు జరిపింది. 2018-19లో చైనా 2007 కోట్ల డాలర్లు అందచేయగా భారత్‌లో పిఎం కిసాన్‌ పధకంలో 300 కోట్ల డాలర్లు అందచేశారు. ఇవిగాక రెండు దేశాల్లోనూ ఇతర సబ్సిడీలు ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్‌ పధకాలకు పెద్ద మొత్తంలో చైనా ఖర్చు చేస్తూ 2030 నాటికి 75శాతం భూములకు నీరందించే లక్ష్యంతో పధకాలను అమలు జరుపుతున్నారు. నీటి వాడకం విషయంలో మన కంటే కఠినమైన నిబంధనలను అమలు జరుపుతున్నారు, చార్జీలను వసూలు చేస్తున్నారు.


చైనాలో ప్రస్తుతం మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. అక్కడ పట్టణాల్లో కూడా పరిమితంగా అయినా సాగు చేస్తున్నారు.బీజింగ్‌ మున్సిపాలిటీలో అలాంటి సాగుదార్లను నమోదు చేసి మొక్కల ఆసుపత్రుల ద్వారా చీడపీడల నివారణ సబ్సిడీ పధకాన్ని అమలు జరుపుతున్నారు. రసాయనాల వాడకం, పరిమాణం తగ్గింపు, సహజ పద్దతుల్లో కీటక నివారణ లక్ష్యాలుగా ఇది సాగుతోంది. దీన్ని హరిత తెగుళ్ల నివారణ సబ్సిడీ పధకంగా పిలుస్తున్నారు. దీనిలో భాగంగా మొక్కల ఆసుపత్రులను (మన కళ్లు, కిడ్నీ, ఎముకలు, గుండె, గొంతు,ముక్కు ప్రత్యేక వైద్యశాలల మాదిరి) ఏర్పాటు చేశారు. ఆసుపత్రులను వ్యవసాయ మందుల సరఫరాదారులు, దుకాణదారులతో అనుసంధానించారు.నమోదు చేయించుకున్న రైతులు తమ పంటలకు వచ్చిన తెగుళ్ల గురించి మొక్కల ఆసుపత్రులలో వైద్యులకు వివరిస్తారు. వైద్యులు వాటి నివారణకు అవసరమైన రసాయన లేదా సహజ నివారణ పద్దతుల గురించి సిఫార్సు చేస్తారు. ఇంటర్నెట్‌ ద్వారా ఆయా ప్రాంతాల దుకాణదారులకు వాటిని వెంటనే పంపుతారు. రైతులు అక్కడకు వెళ్లి తమ గుర్తింపును చూపి వైద్యులు సూచించిన వాటిని సస్య రక్షణకు వినియోగిస్తారు. రైతులకు అందచేసిన వాటి వివరాలను ప్రభుత్వానికి పంపిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని ఆయాశాఖలు విడుదల చేస్తాయి. రసాయనేతర సస్య రక్షణ ఉత్పత్తుల వాడకం పెరుగుతుండగా రసాయన ఉత్పత్తుల వినియోగం తగ్గుతున్నట్లు 2015-18 మధ్యకాలంలో వైద్యుల సిఫార్సులను పరిశీలించగా తేలింది. దీని వలన సబ్సిడీ మొత్తాలు కూడా తగ్గుతున్నట్లు గమనించారు. ఫలితాలను మరింతగా మదింపు వేసి విజయవంతమైనట్లు భావిస్తే ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ నిజం చెప్పినా నమ్మని రోజులు వస్తున్నాయా !

26 Sunday Jul 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Indian Economy, India economy slowdown, Indian economy, Indian GDP paradox, Narendra Modi government credibility


ఎం కోటేశ్వరరావు


” రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో ” అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు మరీ అంత పచ్చిగా నిజం మాట్లాడతావా, అవి మా నేతను ఉద్దేశించే కదా అంటూ దాడులకు దిగేవారు ఒక వైపు. మరోవైపు రెండు రెళ్లు ఎంతో తెలుసుకొనేందుకు కాలుక్యులేటర్‌ను ఆశ్రయించే వారు పెరిగిపోతున్న తరుణమిది.
ఇలాంటి స్ధితిలో దేశ ఆర్ధిక విషయాల గురించి నిజాలు మాట్లాడితే మోడీ అభిమానులు లేదా భక్తులు భరిస్తారా ? మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దెబ్బలాటలకు రారా ? మరోవైపు ఏమి జరుగుతోందో తెలియక జనం అర్ధం చేసుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. కాలుక్యులేటర్లు రెండు రెళ్లు నాలుగు, మూడు మూళ్లు తొమ్మిది అని చూపగలవు తప్ప వివరణ ఇవ్వలేవు. రాజకీయ నాయకులు మసి పూసి మారేడు కాయలను చేయగలరు తప్ప వాస్తవాలను కనపడనివ్వరు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నట్లు ప్రకటించారు. శంకుస్ధాపనకు ఎంచుకున్న సమయం అశుభ గడియ అని, సరైన సమయం కాదని శంకరాచార్య స్వరూపానంద అభ్యంతరం చెప్పారు.చాలా చోట్ల అమావాస్య రోజును అశుభంగా పరిగణిస్తే తమిళియన్లు ఆరోజును పరమ పవిత్రమైనదిగా చూస్తారు. ఇవి విశ్వాసాలకు సంబంధించిన సమస్యలు గనుక అవునని, కాదని చెప్పేవారు ఉంటారు.
కానీ దేశ ఆర్ధిక విషయాలకు సంబంధించి చెప్పాల్సిన వారు నోరు విప్పరు. అంకెలు ఒకటే అయినా కొందరు భిన్నమైన టీకా తాత్పర్యాలు, భాష్యాలతో మన మెదళ్లను తినేస్తున్నార్రా బాబూ అని అనేక మంది భావిస్తున్నారు. తమ సిబ్బంది సేకరించిన గణాంకాలు తప్పని ఏకంగా పాలకులే నిరుద్యోగంపై నివేదిక గురించి చెప్పిన విషయం తెలిసిందే. పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధికిందకే వస్తుంది, అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోవటం లేదని సాక్షాత్తూ మోడీ మహాశయుడే చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కరోనా వైరస్‌ పుణ్యమా అని ఎవరైనా పకోడి బండి పెట్టినా డబ్బుల్లేక ఆ వైపు వెళ్లేందుకు కొందరు విముఖత చూపుతుంటే, కరోనాను కావిలించుకోవటం ఎందుకురా బాబూ అని మరికొందరు వెళ్లటం లేదు. అంతిమంగా పకోడి బండ్లు చాలా మూతపడ్డాయి. ఎప్పుడు పూర్వపు స్ధాయికి వస్తాయో తెలియదు.
దేశ ఆర్ధిక స్ధితి గురించి జనానికి నిజం తెలియటం లేదు. కరోనా కారణంగా వివరాలను సేకరించే సిబ్బందే ఆ ఛాయలకు పోలేదని తెలిసిందే. బయటకు వస్తున్న సమాచారం మాత్రం ఆల్జీబ్రా మాదిరి గుండెను గాబరా పెడుతోంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గినా, వినియోగదారులను వీర బాదుడు బాది వసూలు చేస్తున్న మొత్తం మంగళగిరి పానకాల స్వామికి పోసే పానకం మాదిరి ఎటుపోతోందో తెలియటం లేదు.

ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యలోటు !
ఉగాది పంచాంగ శ్రవణంలో ఆదాయాలు, వ్యయాల గురించి ఏమి చెప్పారో తెలియదు గానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్నదాని కంటే లోటు రెట్టింపుకు పైగా పెరిగి 7.6శాతం ఉంటుందని అంచనా. ఇది తొలి రెండు నెలల తీరుతెన్నులను చూసి చెప్పిన జోశ్యం కనుక వాస్తవంగా ఎంత ఉంటుందో తెలియదు. కేంద్ర బడ్జెట్‌లోటు 7.6శాతం అయితే దానికి రాష్ట్రాలు 4.5శాతం జోడిస్తే వెరసి 12.1శాతం అవుతుందని అంచనా. ఈ లోటును పూడ్చుకొనేందుకు జనం కోసమే కదా అర్ధం చేసుకోరూ అంటూ కేంద్రం, రాష్ట్రాలూ పెట్రోలు, డీజిలు వంటి వాటి ధరలను మరింతగా పెంచినా ఆశ్చర్యం లేదు.
లోటు పెరగటం అంటే ప్రభుత్వాలకు ఆదాయం తగ్గటం, దానికి కారణం జనం వస్తువులు, సేవలను కొనుగోలు తగ్గించటం, అందుకు వారికి తగిన ఉపాధి, ఆదాయం లేకపోవటం, దాని పర్యవసానం వస్తువినియోగం తగ్గించటం, దాంతో పరిశ్రమలు, వ్యాపారాల మూత, ఫలితంగా నిరుద్యోగం పెరుగుదల ఇలా ఒకదానికి ఒకటి తోడై ఏం జరగనుందో తెలియని స్ధితి.
కరోనాకు ముందే పరిస్దితి దిగజారింది, తరువాత పరిస్ధితి మరింత ఘోరంగా తయారైంది. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ గారు చప్పట్లు, దీపాలతో జనాల చేత సంకల్పం చెప్పించారు. ఇరవై ఒక్క లక్షల కోట్ల ఉద్దీపన పధకం అంటూ ఆర్భాటంగా ప్రకటింపచేశారు. అదేమిటో జనానికి తెలియని బ్రహ్మపదార్ధంగా మారింది. ఎవరూ దాని గురించి పెద్దగా చర్చించటం లేదంటే అది మూసినా-తెరిచినా ప్రయోజనం లేని గుడ్డికన్ను వంటిది అని అర్ధం అయినట్లుగా భావించాలి.
ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అన్నట్లుగా ప్రభుత్వాల ద్రవ్యలోటు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా లబ్ది పొందేది కార్పొరేట్లు, ధనికులే అన్నది సామాన్యులకు అర్ధంగాని అంశం.లోటు తక్కువగా ఉంటే ఏదో ఒక పేరుతో ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు పొందేది వారే. లోటు ఎక్కువగా ఉంటే ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా లేనపుడు పెట్టుబడిదారులు ఎవరూ కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రారు. తమ వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వానికి బాండ్ల పేరుతో వడ్డీకి ఇచ్చి లబ్ది పొందుతారు.లోటు పూడ్చే పేరుతో విలువైన భూములు, ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు లేదా ఆస్ధులను కారుచౌకగా అమ్మినపుడు వాటిని కొనుగోలు చేసి లబ్ది పొందేదీ వారే.

వినియోగదారుల ధరలు మరింతగా పెరుగుతాయా ?
ఉత్పత్తిలో స్థబ్దత ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ను సడలించినా ఫ్యాక్టరీలు పూర్తి స్ధాయిలో పని చేయటం లేదు. దీని వలన గిరాకీ మేరకు వస్తువుల సరఫరా లేకపోతే ధరలు పెంచుతారు. మామూలుగానే వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గింది, కరోనాతో అది పెరిగింది. అయినా జూన్‌ నెలలో వినియోగదారుల ధరల సూచి పాక్షిక సమాచారం మేరకే 6.09శాతం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంచనాల కంటే వాస్తవంలో ఎక్కువ ఉంటుందన్నది తెలిసిందే. టోకు ధరల ద్రవ్యోల్బణ సూచి మే నెలలో మైనస్‌ 3.21శాతం అయితే అది జూన్‌ నాటికి 1.81కి చేరింది. అయితే రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 7 నుంచి 7.5శాతానికి పెరగవచ్చని ఆర్ధికవేత్త డాక్టర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి అంచనా వేశారు. ప్రభుత్వం తీసుకున్న ఆర్ధిక మద్దతు చర్యల వలన గిరాకీ పెరగవచ్చని, దానికి అనుగుణ్యంగా ఉత్పత్తి పెరగకపోతే ద్రవ్యోల్బణం-ధరలు- పెరగవచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్బోల్బణం ఎనిమిదిశాతానికి చేరవచ్చని భానుమూర్తి అన్నారు.
ద్రవ్యోల్బణం ఏడుశాతానికంటే తగ్గే అవకాశాలు లేవని అనిల్‌ కుమార్‌ సూద్‌ అనే మరో ఆర్ధికవేత్త చెబుతున్నారు.చమురు ధరలను పెంచారు, పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులు పెరుగుతున్నాయి, రూపాయి విలువ తక్కువగా ఉంది. రవాణా, టెలికాం ఖర్చులు పెరిగాయి, సరఫరా గొలుసు పూర్తిగా వెనుకటి స్ధితికి రాలేదు అన్నారు. వ్యవసాయ రంగం వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ ఫ్యాక్టరీలు సామర్ధ్యంలో 50 నుంచి 55శాతమే పని చేస్తున్నాయని ఎస్‌పి శర్మ అనే మరో ఆర్ధికవేత్త చెప్పారు.

జిడిపి ఎంత మేరకు తగ్గవచ్చు ?
మన దేశంలోని రేటింగ్‌ సంస్ధ ‘ ఇక్రా ‘ అంచనా ప్రకారం వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి 9.5శాతం తిరోగమనంలో ఉండవచ్చు. తొలి త్రైమాస కాలంలో 25శాతం, రెండు, మూడులలో 12, 2.5శాతం వరకు లోటు ఉండవచ్చని, దాని అర్ధం సాధారణ కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయని, ఈ కారణంగా ద్రవ్యోల్బణం ఆరుశాతం అని జోశ్యం చెబుతున్నారు.

భారత్‌లో పెట్టుబడులకు ఇదే తరుణమా ?
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన ప్రసంగ భావం అదే. ఒక వైపు చైనా సంస్ధల పెట్టుబడులకు దారులు మూసిన సమయంలో అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన మోడీ అమెరికన్‌ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణం అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు భారత్‌ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు 30శాతం లబ్ది పొందినట్లు ఒక అంచనా. విదేశీ ద్రవ్య పెట్టుబడిదారులు మన స్టాక్‌మార్కెట్‌ మంచి లాభాలను తెచ్చిపెట్టేదిగా భావిస్తున్నారు. ఆ మేరకు వారి పెట్టుబడులు పెరుగుతాయి, మన దగ్గర డాలర్ల నిల్వలు గణనీయంగా ఉండవచ్చుగానీ, మన దేశంలో ఉపాధి పెరిగే అవకాశాలు లేవు. మన సంపద లాభాల రూపంలో విదేశాలకు తరలిపోతుంది. మన స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు రావటానికి ఒక ప్రధాన కారణం కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించటమే. కంపెనీల దివాళా నిబంధనలను సరళంగా ఉంచాలని ప్రభుత్వం వత్తిడి తేవటాన్ని అంగీకరించని తాను బాధ్యతల నుంచి వైదొలిగినట్లు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు.
అంటే కంపెనీలు నిధులను, తీసుకున్న రుణాలను పక్కదారి పట్టించి దివాలా పేరుతో బిచాణా ఎత్తివేసేందుకు, సులభంగా తప్పించుకొనేందుకు అవకాశం ఇవ్వటం తప్ప మరొకటి కాదు. ఇది కూడా విదేశీ మదుపుదార్లను ఆకర్షిస్తున్నదని చెప్పవచ్చు. గూగుల్‌తో సహా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెడతామని ముందుకు రావటానికి కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఒక ప్రధాన కారణం. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఇప్పటికే తమిళనాడులో సెల్‌ఫోన్ల తయారీ యూనిట్‌ను నడుపుతున్నది. కొత్తగా పెట్టే సంస్ధలకు 15శాతమే పన్ను అన్న రాయితీని ఉపయోగించుకొనేందుకు అది మరో కొత్త పేరుతో విస్తరణకు పూనుకుంది. గూగుల్‌ వంటి కంపెనీలూ అందుకే ముందుకు వస్తున్నాయి. వీటి వలన మనకు కలిగే ప్రయోజనం కంటే వాటికి వచ్చే లాభం ఎక్కువ కనుకనే పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నాయి.

నిరర్ధక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి !
ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎన్‌పిఏ పాలకులు దివాలా తీయించారని బిజెపి చేసిన ప్రచారం గురించి తెలిసినదే. రాజకీయనేతలు బ్యాంకులకు ఫోన్లు చేసి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇప్పించి కమిషన్లు దండుకున్నారని చెప్పింది. దాన్లో అతిశయోక్తి ఉన్నా వాస్తవ పాలు కూడా ఉంది. కానీ ఆరేండ్ల బిజెపి ఏలుబడి తరువాత బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రికార్డు స్థాయిలో పెరగనున్నట్లు ఆర్‌బిఐ స్వయంగా హెచ్చరించింది. దీనికి కరోనా కారణం అంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. కరోనా కొన్ని సంస్దలను ఇబ్బందుల పాలు చేసిన మాట వాస్తవం. ఈ మాత్రానికే గణనీయంగా, ఆకస్మికంగా ఎలా పెరుగుతాయి ? మొత్తంగా చూసినపుడు స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల ఆగలేదు. కంపెనీల లాభాల శాతం పెద్దగా పడిపోయిన దాఖలాలు లేవు. మోడీ సర్కార్‌ రుణ నిబంధనలను కఠినతరం గావించినట్లు చెప్పింది. ఇన్ని చేసినా నిరర్దక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నట్లు ? కాంగ్రెస్‌ నేతల మాదిరే బిజెపి పెద్దలు కూడా దందా ప్రారంభించారా ? 2020 మార్చినాటికి 8.5శాతంగా ఉన్న నిరర్దక ఆస్తులు 2021 మార్చినాటికి 12.5 లేదూ పరిస్ధితి మరింత దిగజారి వత్తిడి పెరిగితే 14.7శాతానికి పెరగవచ్చని స్వయంగా రిజర్వుబ్యాంకు హెచ్చరించింది.

కావలసింది నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీయా ? బలమైన దేశమా !
చరిత్రలో ఎందరో రాజుల ఏలుబడిలోని సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. వారి బలం వాటిని కాపాడలేకపోయింది. వర్తమాన చరిత్రలో నరేంద్రమోడీ నాయకత్వంలో గత ఆరు సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వం ఉంది. దాన్ని ఎవరూ కదిలించలేరన్నది అందరికీ తెలిసిందే. కానీ ఐదేండ్లు తిరిగే సరికి దేశం ఆర్ధికంగా దిగజారిపోయింది. నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీ లేదా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం, ఆయన మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో లాఠీలు పట్టుకొని వీధుల్లోకి వచ్చే ప్రచారకులు, స్వదేశీ జాగరణ మంచ్‌ వారు గానీ ఆర్ధిక దిగజారుడును ఆపలేకపోయారన్నది తిరుగులేని నిజం.
అనేక అంశాలు పరస్పర విరుద్దంగా కనిపిస్తున్నాయి.అది భాష్యం చెప్పేవారి చాతుర్యమా లేక వాస్తవ పరిస్ధితుల నిజాలను ధైర్యంగా నివేదించే సలహాదారులు మోడీ గడీలో లేరా ? దేశ ఆర్ధిక వ్యవస్దలోని అనేక సూచీలు తిరోగమనాన్ని సూచిస్తున్నాయి, వాటి మీద ఆధారపడే జిడిపి మాత్రం పురోగమనం చూపుతున్నది. దేశంలో నేడున్న అసహన పరిస్ధితుల నేపధ్యంలో అనేక మంది ఆర్ధికవేత్తలు బహిరంగంగా, సూటిగా పాలకుల వైఖరిని ప్రస్తుతానికి ప్రశ్నించలేకపోవచ్చు. అయినా కొందరు ధైర్యం చేసి వేస్తున్న ప్రశ్నలు, లేవనెత్తుతున్న సందేహాలను తీర్చేవారు లేరు.

గణాంకాల తిరకాసేమిటో సంతృప్తికరంగా తేల్చేయాలి: సి. రంగరాజన్‌
ఇటీవలి కాలంలో దేశ గణంకాలు, సమాచారానికి సంబంధించిన వివాదాలకు సంతృప్తికరంగా ముగింపు పలకాల్సి ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ సి. రంగరాజన్‌ జాతీయ గణాంకాల దినోత్సవం సందర్భంగా జూన్‌ 30వ తేదీన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటించిన జీవన సాఫల్య అవార్డును అందుకుంటూ ఈ సూచన చేశారు. జాతీయ గణాంకాల కమిషన్‌కు గుర్తింపు ఇవ్వాలని, అలా చేస్తే దాని విధులు, బాధ్యతలేమిటో స్పష్టం అవుతాయని కూడా ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో ఈశాఖ విడుదల చేసిన గణాంకాలు, వాటికి అనుసరిస్తున్న పద్దతి వివాదాస్పదమై అనేక మందిలో అనుమానాలు తలెత్తాయి. జిడిపి సజావుగా ఉంటే దేశం ఎందుకు దిగజారుతోందనే ప్రశ్నలు వచ్చాయి. మన పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే మన సమాచార, గణాంకాల నాణ్యతను మెరుగుపరుచుకొనేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిన స్ధితిలో ఉన్నాము. అలాంటి రుణం ఒకటి మంజూరైందని ప్రధాన గణకుడు ప్రవీణ్‌ శ్రీవాత్సవ చెప్పారు.

అడుగడుగునా అంకెల గారడీ !
2012-18కాలంలో మన జిడిపి సగటున ఏడుశాతం అభివృద్ధి చెందినట్లు లెక్కలు చూపుతున్నాయి.2011 నుంచి 2018వరకు ప్రతి ఏటా జిడిపి వృద్ధి రేటును వాస్తవమైన దాని కంటే 2.5శాతం అదనంగా చూపుతున్నారని 2014 అక్టోబరు నుంచి 2018 జూన్‌వరకు ప్రధాన మంత్రి ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల పేరుతో సలహాదారు పదవి నుంచి తప్పుకున్న ఏడాది తరువాత సుబ్రమణ్యం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విమర్శను ప్రభుత్వ 2020-21ఆర్ధిక సర్వే తిరస్కరించింది. అయితే గత ఆర్ధిక సంవత్సరంలో దిగజారిన ఆర్ధిక స్దితి ప్రభుత్వం వెల్లడిస్తున్న అంకెల గారడీని నిర్ధారించింది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికీ నిజాలు చెప్పటం లేదు, ఇదే తీరు కొనసాగితే రేపు నిజం చెప్పినా నమ్మని స్ధితి కనిపిస్తోంది. మన ప్రభుత్వం జిడిపిని లెక్కిస్తున్న తీరు గురించి ఐఎంఎఫ్‌ ఆర్ధికవేత్తలు కూడా సందేహాలను వెలిబుచ్చారు.


నాడూ నేడూ ఒకటే ప్రచారం అదే దేశం వెలిగిపోతోంది !
2004వరకు అధికారంలో ఉన్న వాజ్‌పేయి హయాంలో దేశం వెలిగిపోయిందనే ప్రచారంతో బిజెపి ఆ ఏడాది ఎన్నికలకు పోయి బొక్కబోర్లా పడిన విషయం తెలిసినదే.2005-11 సంవత్సరాల మధ్యలో బ్యాంకుల రుణాల జారీ రేటు ఏటా 15శాతం చొప్పున అభివృద్ధి చెందిందని, తరువాత కాలంలో అది నాలుగుశాతానికి పడిపోయిందని సిఎంఐయి అధ్యయనం తెలిపింది. అంటే పెట్టుబడి ప్రాజెక్టులు మందగించాయనేందుకు అదొక సూచిక. పారిశ్రామిక ఉత్పత్తి 2011కు ముందు సగటున తొమ్మిదిశాతం వృద్ధి చెందినట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడిస్తే తరువాత కాలంలో రెండుశాతానికి పడిపోయింది.ఇదే కాలంలో పెట్టుబడుల వార్షిక వృద్ధి రేటు 23.9 నుంచి మైనస్‌ 1.8శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో వినియోగం వృద్ధి రేటు వేగం మూడు నుంచి మైనస్‌ 1.5శాతానికి తగ్గింది, పట్టణ రేటు 3.4 నుంచి 0.3కు తగ్గింది ఇలా అనేక సూచికలు పడిపోగా జిడిపి వృద్ధి రేటును మాత్రం 7.2-7.1శాతంగా చూపారు. వేతనాల బిల్లుల శాతాలు కూడా ఇదే కాలంలో గణనీయంగా పడిపోయాయి, దేశం మొత్తంగా వినియోగం తగ్గటానికి ఇదొక కారణం. వీటన్నింటిని చూసిన తరువాత అంకెలు పొంతన కుదరటం లేదని జిడిపి రేటు గురించి అనేక మంది సందేహాలు లేవనెత్తారు. ఈ నేపధ్యంలోనే పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధి కల్పన కిందికే వస్తుందని, అలాంటి వాటిని గణాంకాలు పరిగణనలోకి తీసుకోకుండా నిరుద్యోగం పెరిగినట్లు చూపారని నరేంద్రమోడీ రుసురుసలాడారు. ఒక వేళ అదే నిజమైతే మోడీ ఏలుబడికి ముందు కూడా పకోడీల తయారీని లెక్కలోకి తీసుకోలేదు.

కరోనా తరువాత పరిస్దితి బాగుపడుతుందా ?
అనేక మంది కరోనా వచ్చింది కనుక తాత్కాలిక ఇబ్బందులు తప్పవని మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోతారనటంలో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికీ భావిస్తున్నారు. అదే ప్రచారం చేస్తున్నారు. అంతా బాగుంది, మరోసారి దేశం వెలిగిపోతోంది, 2024 తరువాత కూడా మోడీయే ప్రధాని అని విపరీత ప్రచారం చేస్తున్నారు. అలాంటి గుడ్డి విశ్వాసం ఉన్న వారి బుర్రలకు ఇప్పటివరకు ఎక్కించింది ఒక పట్టాన దిగదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు రేపు తప్పనిసరై నరేంద్రమోడీ నిజాలు చెప్పినా జనాలు నమ్మని పరిస్ధితి వస్తుంది. అందుకే ఇప్పటికైనా జరుగుతోందేమిటో చెబుతారా ? బలమైన ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఫలితం లేదని తేలిపోయింది. వీటన్నింటినీ చూసినపుడు ఇప్పుడు కావలసింది దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి అన్న మహాకవి గురజాడ చెప్పిన అలాంటి జనంతో కూడిన బలమైన దేశమా లేక శ్రీశ్రీ చెప్పినట్లుగా చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉన్న ప్రభుత్వమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో ప్రచ్చన్న యుద్ధాన్ని తీవ్రం చేసిన అమెరికా !

25 Saturday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Communist China, Mike Pompeo, US cold war with China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


” స్వేచ్చా ప్రపంచం చైనాను మార్చాలి(కూల్చాలి) లేనట్లయితే అదే మనల్ని మారుస్తుంది” అన్నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో. హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించాలన్న అంతర్జాతీయ అంగీకారాన్ని చైనా ఉల్లంఘించింది, దక్షిణ చైనా సముద్రం, మరియు ప్రభుత్వ మద్దతుతో మేథోసంపత్తి దోపిడీని ఆపాలి అని కూడా చెప్పాడు. దేశీయంగా చైనా రోజు రోజుకూ నియంతృత్వాన్ని పెంచుతోంది, అంతర్జాతీయంగా స్వేచ్చకు వ్యతిరేకంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ కొత్త ప్రజోపద్రవాన్ని తెచ్చిందని కాలిఫోర్నియాలోని యోర్బా లిండాలో ఈ వారంలో చేసిన ఒక ప్రసంగంలో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని రెచ్చగొట్టాడు.పాంపియో మాటలు ఒక చీమ ఒక చెట్టును ఊపేందుకు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నూతన యుద్దం నిష్ఫలం అవుతుందని చైనా విదేశాంగశాఖ కొట్టివేసింది.


గత నాలుగు దశాబ్దాల కాలంలో రెండు దేశాల సంబంధాల్లో వచ్చిన పెను మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 1970 దశకంలో చైనాతో దౌత్య సంబంధాలకు నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ తెరతీశాడు.” చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచాన్ని తెరవటం ద్వారా తాను ఒక ప్రాంకెస్టయిన్‌ను సృష్టించానేమో అని నిక్సన్‌ ఒకసారి భయాన్ని వ్యక్తం చేశాడు, ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం” అంటూ పాంపియో చైనాను ఒక వికృతాకార అసహజ జంతువుగా వర్ణించాడు. మేరీ షెల్లీ అనే బ్రిటీష్‌ యువరచయిత్రి 1818లో ఫ్రాంకెస్టయిన్‌ అనే ఒక నవలను రాసింది. దానిలో విక్టర్‌ ఫ్రాంకెస్టయిన్‌ అనే యువశాస్త్రవేత్త ఒక వికృతాకార అసహజ జంతువును సృష్టించటం, దాని పర్యవసానాల గురించి ఆ నవల సాగుతుంది. అనేక ఆధునిక సినిమాలకు అది మూలకథావస్తువు అయింది. అమెరికన్లు కమ్యూనిస్టులను, సోషలిస్టు దేశాలను అలాంటి జంతువుతో పోల్చి ప్రచారం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైద్దాంతిక మౌలిక విబేధాలను మనమింకే మాత్రం విస్మరించరాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ అలా చేయలేదు మనం కూడా అంతే ఉండాలి అని కూడా పాంపియో చెప్పాడు. ఎంతగా చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంతగా నవంబరులో జరిగే ఎన్నికలలో తమ నేత ట్రంప్‌కు ఓట్లు వచ్చి తిరిగి అధికారం వస్తుందనే ఎత్తుగడ కూడా పాంపియో ప్రసంగ లక్ష్యం కావచ్చు. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్ధి కావాలనే వ్యూహంతో పాంపియో ఉండటం కూడా ఆ దూకుడుకు కారణం కావచ్చు.


నాలుగు దశాబ్దాల క్రితం -అమెరికా, సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు కూటమి దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం, సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు కూడా తీవ్రంగానే కొనసాగుతున్న సమయమది. అమెరికా తోడేలు అయితే అది తినదలచుకున్న మేక పిల్లలుగా సోషలిస్టు దేశాలు ఉన్నాయి. అప్పుడు కూడా జనాభారీత్యా పెద్దది అయినా చైనా కూడా ఆర్ధికంగా ఒక మేకపిల్ల వంటిదే. అలాంటి చైనాతో దోస్తీ అంటూ అమెరికా తోడేలు ముందుకు రావటమే కాదు, ఏకంగా కావలించుకుంది. ఇప్పుడు మింగివేసేందుకు పూనుకుంది. ఎంతలో ఎంత తేడా !


అది జరిగేనా ? చైనాతో పోల్చితే పసిగుడ్డు వియత్నాంనే ఏమీ చేయలేక తోకముడిచిన అమెరికా గురించి తెలియంది ఏముంది ! నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ కాలుబెడితే అక్కడి నుంచి తోకముడవటం తప్ప పైచేయి సాధించింది లేదు. కొంత మంది చెబుతున్నట్లు అమెరికాలోని ఆయుధ పరిశ్రమలకు లాభాలు తప్ప మరొకటి కాదన్నది కూడా వాస్తవమే. అందుకోసం సాధ్యమైన మేరకు ఉద్రిక్తతలను తానే సృష్టించటం, ఇతర దేశాలను ఎగదోయటం వంటి అనేక పద్దతులను అనుసరిస్తున్నది. నాలుగు దశాబ్దాల నాడు ఉన్నంత బలంగా అమెరికా ఇప్పుడు లేదన్నది ఒక అభిప్రాయం( అయినా ఇప్పటికీ అదే అగ్రరాజ్యం). ఇదే విధంగా చైనా స్ధితి కూడా అంతే, ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా నాటికీ నేటికి ఎంతో తేడా !
సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనేందుకు సుముఖంగా లేని స్ధితిని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీయాలన్నది నాటి అమెరికా ఎత్తుగడ. ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని పూనుకున్న దేశమది. అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద దేశమే కాదు, సోషలిస్టు వ్యవస్ధను కూడా కలిగి ఉన్న చైనాతో సయోధ్యకు రావటం వెనుక అమెరికన్లు మారు మనస్సు పుచ్చుకున్న దాఖలాలేమీ లేవు. ఇప్పుడు ఆ సోవియట్‌ యూనియన్‌ లేదు. చైనాను తన ప్రత్యర్ధిగా అమెరికా భావిస్తోంది. తన 140 కోట్ల జనాభా జీవన స్ధాయిని పెంచేందుకు చైనా సర్వశక్తులను వినియోగిస్తోంది. అమెరికా, దాని అనుయాయి దేశాలు చేస్తున్న కుట్రలు, రెచ్చగొడుతున్న కారణంగా, తాను సాధించిన విజయాలను పదిల పరుచుకొనేందుకు అది స్పందించాల్సి వస్తోంది తప్ప, తానుగా కాలుదువ్వటం లేదు. కొన్ని సందర్భాలలో రాజీ పడిందనే విమర్శలను కూడా ఎదుర్కొన్నది.


సోవియట్‌ వారసురాలిగా ఐరాసలో శాశ్వత సభ్యత్వం రష్యాకు దక్కింది. నాడు అలీన రాజ్యంగా ఉన్నప్పటికీ అనేక అంశాలలో సోవియట్‌కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా భారత్‌ ఉంది. నేడు రష్యా -చైనాల మధ్య విరోధం లేదు, సైద్ధాంతిక బంధమూ లేదు. కానీ అమెరికాను ఎదుర్కోవాలంటే చైనా లేకుండా సాధ్యం కాదన్నది ఇప్పటి రష్యా వైఖరి (భవిష్యత్‌ గురించి చెప్పలేము). అలీన వైఖరి అనేది పాతబడిపోయింది, ఇంక ఆ మాట గురించి మరచిపోండి, మేము ఏ కూటమిలోనూ చేరటం లేదని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. అయితే ఆచరణలో మనం అమెరికా కౌగిలిలో మరింతగా ఒదిగిపోతున్నామన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. లేకుంటే మీరు చైనా మీద యుద్దం ప్రకటించండి మీవెనుక మేము ఉన్నామన్నట్లుగా అమెరికా, దాని అనుంగుదేశాలు బహిరంగంగా ఎలా చెబుతాయి. ప్రపంచ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ఈ ప్రధాన మార్పును గమనంలోకి తీసుకోకుండా లడఖ్‌ వంటి వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోలేము.
హౌడీ మోడీ పేరుతో అమెరికాలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకు తిరిగిన హూస్టన్‌ నగరంలో ఉన్న చైనా తొలి కాన్సులేట్‌ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. మా ఊరు మీకు ఎంత దూరమోా మీ ఊరూ మాకూ అంతే దూరం అన్నట్లు తమ చెంగుడూ నగరంలో ఉన్న అమెరికా కార్యాలయాన్ని మూసివేయాలని చైనా ఆదేశించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియని ఒక అనిశ్చితి ఏర్పడిందన్నది స్పష్టం. రానున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని ట్రంప్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా ? అదే అయితే తాత్కాలికమే. కానీ వాటిలో భాగంగానే ఆసియాలో భారత్‌ పోతుగడ్డ అని రెచ్చగొడుతున్న దానిని మనం నిజమే అనుకుంటే మనకు కొత్త సమస్యలు వస్తాయని గ్రహించాలి. లేదూ అమెరికన్లు చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దపడినా రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు మనం నలిగిపోతాము.


అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి నినాదం. చైనాలో కమ్యూనిస్టులు లాంగ్‌ మార్చ్‌తో ఒక్కో ప్రాంతాన్ని విముక్తి చేస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో అమెరికన్లు నాటి కొమింటాంగ్‌ పార్టీనేత చాంగ్‌కై షేక్‌కు అన్ని రకాల మద్దతు ఇచ్చారు.కొమింటాంగ్‌ మిలిటరీ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ స్ధావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కమ్యూనిస్టులు ప్రధాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికన్లు తైవాన్‌లోని తిరుగుబాటుదార్ల ప్రభుత్వాన్నేే అసలైనా చైనాగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితిలో రెండు దశాబ్దాల పాటు కథనడిపించారు.
చైనాకు స్నేహ హస్తం చాచినా అమెరికన్లు తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు.దాన్ని దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. అమెరికాతో సహా అనేక దేశాలకు తమ మార్కెట్‌ను తెరిచిన చైనీయులు తమవైన ప్రత్యేక సంస్కరణలు అమలు జరిపి అసాధారణ విజయాలను సాధించటంతో పాటు అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు ధీటుగా తయారయ్యారు. అమెరికన్లు తలచింది ఒకటి, జరిగింది మరొకటి. ఒకవైపు తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందినదే అని గుర్తిస్తూనే మరోవైపు అమెరికా అక్కడి పాలకులు, మిలిటరీని మరింత పటిష్టం గావిస్తూ చైనాను నిరంతరం రెచ్చగొడుతున్నది.
తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామన్నట్లుగా దాదాపు ప్రతి రోజూ చైనా మిలిటరీ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయని తైవాన్‌ మంత్రి జోసెఫ్‌ వు ఈనెల 22న ఆరోపించాడు.నేడు తైవాన్‌తో ఏ దేశమూ అధికారిక సంబంధాలను కలిగి లేదు. పరోక్షంగా అమెరికా, మరికొన్ని దేశాలు రోజువారీ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఏ క్షణంలో అయినా మిలిటరీని ప్రయోగించి తైవాన్‌ను తనలో విలీనం చేసుకోవచ్చని చైనా విలీన వ్యతిరేక శక్తులు నిత్యం స్ధానికులను రెచ్చగొడుతుంటాయి. అంతర్జాతీయంగా చైనా మీద వత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమిది. 1996లో హెచ్చరికగా చైనీయులు కొన్ని క్షిపణులను తైవాన్‌ వైపు ప్రయోగించారు. దీన్ని సాకుగా తీసుకొని అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకను పంపి చైనాను బెదిరించింది. 2001లో అమెరికా నిఘా విమానం ఒకటి చైనా స్ధావరంలో అత్యవసరంగా దిగింది. సిబ్బందిని, విమానాన్ని కొద్ది రోజుల పాటు చైనా నిర్బంధించింది. ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా తనకు పోటీగా చైనా ఎదుగుతున్నదనే భయం అమెరికాలో మొదలైన నాటి నుంచి రెండు దేశాల సంబంధాలు ఏదో ఒక రూపంలో దిగజారుతూనే ఉన్నాయి. వాణిజ్య మిగులుతో ఉన్న చైనా తన వస్తువులను కొనాలంటూ 2018లో ట్రంప్‌ వాణిజ్య యుద్దానికి తెరతీసిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతున్నది, ఈ లోగా కరోనా సమస్య ముందుకు వచ్చింది. తమ జనాన్ని గాలికి వదలివేసిన ట్రంప్‌ ప్రపంచ ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు.ఎన్నికల రాజకీయాలకు తెరలేపినా దాని వెనుక ఇతర అజెండా కూడా ఉందన్నది స్పష్టం.


చైనాను కట్టడి చేయాలన్న అమెరికా పధకంలో భాగంగా ఒక వైపు మన దేశాన్ని మరోవైపు రష్యాను అమెరికన్లు దువ్వుతున్నారు.మన రక్షణ ఏర్పాట్లలో భాగంగా రష్యా నుంచి ఎస్‌-400 సంచార క్షిఫణి ప్రయోగ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు, బెదిరింపులకు దిగింది. చివరకు మనం గట్టిగా ఉండటంతో పులిలా బెదిరించిన వారు పిల్లిలా మారిపోయారు. మరోవైపున అనేక చోట్ల రష్యాతో ఘర్షణ పడుతున్న అమెరికన్లు చైనాను కట్టడి చేసే ఎత్తుగడలో భాగంగా రష్యాను కూడా దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రారంభించిన దౌత్యకార్యాలయాల మూసివేత యుద్దంలో చైనా కూడా కంటికి కన్ను-పంటికి పన్ను అన్నట్లుగా స్పందించింది. నిజానికి ఈ వారంలో ప్రారంభమైనట్లు కనిపించినా గత ఏడాది అక్టోబరులోనే దానికి ట్రంప్‌ తెరలేపాడు. చైనా దౌత్య సిబ్బంది సంఖ్యపై ఆంక్షలు విధించాడు. ప్రస్తుతం రెండు దేశాలూ పరస్పరం కాన్సులేట్‌ కార్యాలయాలను మూయాలని ఆదేశించాయి. తరువాత వుహాన్‌, హాంకాంగ్‌, మకావులలో మూసివేతలకు చైనా ఆదేశించవచ్చని వార్తలు వచ్చాయి. వాటితో పాటు దౌత్యవేత్తల బహిష్కరణ, వారి మీద ఆరోపణల పర్వం ఎలాగూ ఉంటుంది. పరిశోధకుల పేరుతో అమెరికా వచ్చిన నలుగురు తమకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్న విషయాన్ని దాచారంటూ వారిలో ముగ్గురిని అమెరికా అరెస్టు చేసింది. ఒక పరిశోధకురాలు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌కు వెళ్లి రక్షణ పొందింది. తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరించేందుకు వారు వచ్చినట్లు అమెరికా ఆరోపించింది. వారికి పది సంవత్సరాల జైలు శిక్ష, రెండున్నరలక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని చైనా వ్యాఖ్యానించింది.


వర్తమాన పరిణామాల్లో హాంకాంగ్‌కు వర్తింప చేస్తూ చైనా చేసిన ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని అమెరికా, దానికి మద్దతుగా బ్రిటన్‌, ఇతర మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నట్లు నానా యాగీ చేస్తున్నాయి.తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చైనా హంకాంగ్‌లోని బ్రిటీష్‌ మరియు ఇతర దేశాలకు చెందిన వారిని విదేశీ పౌరులుగా గుర్తిస్తూ గతంలో బ్రిటన్‌ జారీ చేసిన పాస్‌పోర్టుల గుర్తింపును రద్దు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ హాంకాంగ్‌ పౌరులు విదేశీ ప్రయాణాలు చేసేందుకు అది చెల్లుబాటయ్యే పత్రం కాదని త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చైనా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారికి అవసరమైతే తాము భద్రత కల్పిస్తామనే అర్ధంలో బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా కొన్ని వివరాలను ప్రకటించింది. ఈ పాస్‌పోర్టులు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు 2021జనవరి తరువాత బ్రిటన్‌ సందర్శించవచ్చని, అక్కడ ఐదు సంవత్సరాల పాటు విద్య, ఉద్యోగాలు చేయవచ్చని, తరువాత కావాలనుకుంటే బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తాము వాటి గుర్తింపు రద్దు చేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. హాంకాంగ్‌ చైనాలో భాగమని, అంతర్గత భద్రతకు తీసుకొనే చట్టాలను బ్రిటన్‌ గుర్తించాల్సి ఉందని, దానికి భిన్నంగా వ్యవహరిస్తే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని చైనా స్పష్టం చేసింది. అంతే కాదు హాంకాంగ్‌ పౌరులు చైనా ప్రధాన భూభాగంలో ప్రవేశించాలంటే బ్రిటీష్‌ వారు జారీ చేసిన పాస్‌పోర్టులను చైనా గుర్తించదు, చైనా యంత్రాంగం ఇచ్చిన అనుమతి పత్రాలతోనే ప్రవేశించాల్సి ఉంటుంది. హాంకాంగ్‌ జనాభా 75లక్షలు కాగా తాజాగా బ్రిటన్‌ వెల్లడించిన నిబంధనల ప్రకారం 30లక్షల మంది వరకు బ్రిటన్‌లో స్ధిరపడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంత మందిని బ్రిటన్‌ అనుమతిస్తుందా, వారందరికీ ఉపాధి, వసతి చూపుతుందా అన్న అంశం పక్కన పెడితే చైనా పౌరులకు బ్రిటన్‌ పాస్‌పోర్టులు ఇవ్వటం ఏమిటన్న సమస్య ముందుకు వస్తోంది.


రెండు దేశాలు దౌత్య పరమైన చర్యలు, ప్రతిచర్యలకు పాల్పడటం సాధారణంగా జరగదు. అమెరికా వైపు నుంచి జరుగుతున్న కవ్వింపులు ట్రంప్‌ ఎన్నికల విజయం కోసమే అని చైనా భావిస్తున్నప్పటికీ ట్రంప్‌ తిరిగి వచ్చినా లేదా మరొకరు ఆ స్ధానంలోకి వచ్చినా రాగల పర్యవసానాల గురించి కూడా చైనా ఆలోచిస్తున్నది. అందువలన నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు ఇలాంటి చర్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చైనా తాత్కాలిక చర్యలకు ఉపక్రమించినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహం ఎలా ఉంటుందన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కరోనా బారి నుంచి బయట పడి తిరిగి పూర్వపు స్ధాయికి ఆర్ధిక కార్యకలాపాలను తీసుకురావాలని కోరుకుంటున్న చైనా ఏ దేశంతోనూ గిల్లికజ్జాలకు సిద్దంగా లేదని చెప్పవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో, ఇతర చోట్ల అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, దాని వలలో పడిన దేశాలు చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా దానికి అనుగుణ్యంగానే చైనా స్పందన ఉంటుంది.


మన దేశ విషయానికి వస్తే లడఖ్‌లో జరిగిన పరిణామాల తరువాత పూర్వపు స్థితిని పునరుద్దరించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.అయితే పరస్పరం అనుమానాలు, గతంలో ఉన్న స్ధితి గతుల గురించి ఎవరి భాష్యాలకు వారు కట్టుబడి ఉంటే అది వెంటనే నెరవేరకపోవచ్చు. అంగీకారాన్ని అమలు జరిపేందుకు మరిన్ని చర్చలు, సంప్రదింపులు అవసరం కావచ్చు.ౖౖ అమెరికా మాటలు నమ్మి చైనాను దెబ్బతీసేందుకు మనం సహకరిస్తే ఆ స్ధానంలో మనం ప్రవేశించవచ్చని ఎవరైనా కలలు కంటే అంతకంటే ఆమాయకత్వం మరొకటి ఉండదు. చైనాను దెబ్బతీసి తాను లాభపడాలని చూసిన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకే సాధ్యం కాలేదు. మన నిక్కర్ల నుంచి పాంట్స్‌( దేశ భక్తి గురించి చెప్పేవారికి ఎంత భావ దారిద్య్రం నిక్కరూ మనది కాదు, పాంట్సూ మనవి కాదు.) కు మారిన వారు అమెరికా మాటలు నమ్మి వ్యవహరిస్తే, వారి సూత్రీకరణలను జనం నమ్మితే కుక్కతోకను పట్టుకొని గోదావరిని ఈదిన చందమే అవుతుంది.


చీమ చెట్టును ఊపే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా వైఖరి ఉంది అని చైనీయులు మాట మాత్రంగా పాంపియో గురించి చెప్పినప్పటికీ ఆచరణలో అంత తేలికగా సామ్రాజ్యవాదాన్ని దానికి కేంద్రంగా ఉన్న అమెరికా గురించి చైనా భావించటం లేదు. ఇదే సమయంలో చైనాను ఒంటరిపాటు చేయటం అమెరికాకు అంత తేలిక కాదు. రెండవ ప్రపంచయుద్దం తరువాత బ్రిటన్‌ స్ధానాన్ని అమెరికా ఆక్రమించింది.దాని ప్రతి చర్యలోనూ అమెరికాకు అగ్రస్ధానం ఉండాలన్నట్లు వ్యవహరించింది. అదే పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అనేక దేశాలతో దానికి సమస్యలు తెచ్చింది, మిగతా దేశాలను భయానికి గురి చేసింది. ఇప్పుడు అవే దాని ప్రపంచ పెత్తనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.


అమెరికా వ్యూహకర్తలు అనేక తప్పిదాలు చేశారు లేదా అంచనాలు తప్పి బొక్కబోర్లా పడ్డారు. అదిరించి బెదిరించి తమ పబ్బంగడుపుకోవాలంటే ఎల్లకాలం కుదరదు అనే చిన్న తర్కాన్ని విస్మరించారు.ఐక్యరాజ్యసమితిని ఉపయోగించుకొని ప్రపంచ పెత్తనాన్ని సాగించాలని చూసిన వారు ఇప్పుడు బెదిరింపులకు దిగి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక ఐరాస విభాగాల నుంచి వైదొలుగుతున్నారు. దానితో ఏ దేశమూ అమ్మో అయితే ఎలా అని ఆందోళనకు గురికాలేదు. పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో అమెరికా ఒక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. అది తనకు లాభసాటి కాదు అని వెనక్కు తగ్గింది. అయితే దాని మాటలు నమ్మి ముందుకు పోయిన వారు తరువాత మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే విధంగా అమెరికా ప్రారంభించిన ఆయుధ నియంత్రణ వంటి చర్చలను ట్రంప్‌ యంత్రాంగం ముందుకు తీసుకుపోలేదు. ప్రపంచం తలకిందులు కాలేదు. ఇలాంటి ఉదంతాలను అనేక దేశాలు అమెరికా బలహీనతగా చూస్తున్నాయి. అటువంటపుడు ఆచి తూచి వ్యవహరిస్తాయి తప్ప అమెరికా ఏది గుడ్డిగా చెబితే దాన్ని అనుసరించే అవకాశాలు లేవు. ఉదాహరణకు రెండు సంవత్సరాల క్రితం చైనాతో ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో ఇతర ధనిక దేశాలు అమెరికా వెనుక నిలిచే అవకాశాలు ప్రస్తుతం లేవు.దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. రెండవది ప్రతి పెట్టుబడిదారీ దేశమూ తన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని, ఏకపక్ష వైఖరిని ముందుకు తెస్తున్నది.


అమెరికా ఎంతగా రెచ్చగొడుతున్నా, దక్షిణ చైనా సముద్రంలోకి తన నౌక, వైమానిక దళాలను దించుతున్నా, అనేక దేశాలు తమను ఒంటరిపాటు చేసేందుకు పావులు కదుపుతున్నా చైనా నాయకత్వ వైఖరిలో ఎక్కడా ఆందోళన కనిపించకపోవటానికి, హాంకాంగ్‌తో సహా అనేక అంశాలపై పట్టుబిగింపు, భారత్‌ విధించిన ఆర్ధిక ఆంక్షలు, దేన్నయినా ఎదుర్కొనేందుకు దేనికైనా సిద్దమనే సంకేతాలకు కారణాలు ఏమిటనే వెతుకులాట పశ్చిమ దేశాల పండితుల్లో మొదలైంది.కొద్ది రోజుల క్రితం గ్జీ జింపింగ్‌ అసాధారణ రీతిలో బీజింగ్‌లో వాణిజ్యవేత్తలతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడైతే జీవం ఉంటుందో ఆశకూడా అక్కడే ఉంటుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఐక్యంగా పరిస్ధితిని ఎదుర్కొన్నంత కాలం ఎలాటి ముప్పు లేదని వారికి భరోసా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. చైనీయుల మాటలను ప్రపంచం మొదటి నుంచీ అనుమానంతో చూస్తూనే ఉంది. అది సాధించిన అసాధారణ ఆర్ధిక విజయం, తాజాగా కరోనా వైరస్‌ సహా దేన్నీ ఒక పట్టాన నమ్మలేదు.


కరోనా వైరస్‌ గురించి అమెరికా, మరికొన్ని దేశాలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా అవి మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి తప్ప చైనా విజయవంతంగా బయట పడింది. కరోనా మహమ్మారి కారణంగా తమకు ఆర్ధికంగా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకొనే స్ధితిలోనే ఇంకా మిగతా దేశాలు ఉంటే, దాన్ని అధిగమించి ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టే దశలో చైనా ఉంది. అమెరికా శాండియోగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని చైనా డాటా లాబ్‌ వెయ్యి మంది పట్టణ వాసులపై జరిపిన అధ్యయనంలో చైనా కేంద్ర ప్రభుత్వం మీద జనంలో విశ్వాసం మరింత పెరిగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయం ఫిబ్రవరిలో పదిమందిలో 8.65 మంది విశ్వాసాన్ని వ్యక్తం చేయగా మేనెలలో 8.87కు పెరిగింది, అదే 2019 జూన్‌ నెలలో 8.23 ఉన్నట్లు బ్రిటన్‌ గార్డియన్‌ పత్రిక తెలిపింది. నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములైనపుడు వాటికి ఎంత మూల్యం చెల్లించాలో వారికి తెలుసు, చెల్లించేందుకు కూడా సుముఖంగా ఉంటారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. చైనా నాయకత్వం బలం అదే అని చెప్పుకోవచ్చేమో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కంపల్సరీ లైసెన్స్‌తో కరోనా మందులు, టీకాలను అందుబాటులో ఉంచాలి !

24 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Compulsory licensing, compulsory licensing of patented drugs, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


కొద్ది రోజులుగా కోవిడ్‌ 19 కి మందులను కనుగొన్నట్లుగా వార్తలు పెరిగాయి, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. మందులున్నాయికదా అని ముందు జాగ్రత్తలను వదిలేసి కరచాలనాలు, కౌగిలింతలూ, కేరింతలూ, మొదలయ్యే ప్రమాదం వుంది. ఇక కరోనా వ్యాధి మనల్నేమీ చేయలేదనే ధైర్యం ప్రజలలో పెరుగుతున్నది. కొన్నివందల కంపెనీలు మందుల తయారీలో పోటీలు పడుతున్నాయి. అందరికన్నా ముందు మార్కెట్‌ లో ప్రవేశించి త్వరగా అమ్ముకోవాలని పరుగెత్తుతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నచిన్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.

కొత్తగా వచ్చే మందులన్నీ కొత్తవేనా? ప్రభావమెంత ?
క్వారంటైన్‌తో ఇపుడు వైద్యం మొదలవుతున్నది. వ్యాధి లక్షణాలు ప్రబలే కొద్దీ రోగులను కోవిడ్‌ హాస్పిటల్‌కి మార్చి ప్రాణాన్ని నిలపటానికి ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ద్వారా ఇస్తున్నారు. చికిత్సలో భాగంగా అందుబాటులోవున్న యాంటీ వైరల్‌ , 30 రకాల మందులను కాంబినేషన్లలో ఇంతవరకూ వాడారు. ఇప్పటివరకూ వున్న మందులలో కరోనావైరస్‌ ను విజయవంతంగా సంహరించే మందు ఒక్కటి కూడా లేదనే వాస్తవాన్నిగ్రహించాలి. ఫలానా మందు పనిచేస్తుందని విశ్వసనీయవర్గాలు చెప్తే, వాడి చూడండని ఐసీయమ్‌ఆర్‌ ప్రొటోకాల్‌లో లేని మందులకు కూడా అనుమతులను ఇస్తున్నది. అత్యవసర సందర్భాలలో మాత్రమే వాడే రెమిడెసివీర్‌ అనేమందు నుండి మలేరియాకు, రుమటాయిడ్‌ ఆర్దరైటిస్‌కు వాడే క్లోరోక్విన్‌, లో మాలిక్యులార్‌ వైట్‌ హెపారిన్‌ డీప్‌ వైన్‌ త్రంబోసిస్‌ రాకుండా దేశీయ ట్రెడిషనల్‌ మందుల వరకూవాటిచూస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ధి చేశారు. ఆఫ్రికాలో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. తగ్గించటంలో ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్సలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేశారు. మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.
రెమ్డెసీవీర్‌ అందుబాటులోకివచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కోలుకోవడానికి సమయం15 నుంచి 11 రోజులకు తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. అయిదురోజుల చికిత్సకు మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో 3-4 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఢిల్లీ వంటి చోట్ల రూ.5,400 కు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలకు అమ్ముతున్నారు. ధనవంతులు కరోనా వ్యాధిని అందరికీ పంచారు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు.
అమెరికన్‌ కంపెనీ ఐన గిలియాడ్‌ సైన్సెస్‌ కు రెమిడెసీవీర్‌ మందుల పై పేటెంట్‌ హక్కు ఉన్నది. రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అంటున్నాడు. మా సంగతేంటని యూరప్‌ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్‌ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లుఱర్చవుతుంది. 3000 డాలర్లకు అమ్మటానికి కంపెనీ నిశ్చయించింది.

2) ఇటోలిజుమాబ్‌ మరియు టోసిలిజుమాబ్‌ మందులను ఇన్వెస్టిగేటివ్‌ ధెరపీ గా ఉపయోగించటానికి అధికారులు అనుమతినిచ్చారు. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించినపుడు , ఈ మందులవలన కత్రిమంగా తయారైన యాంటీబాడీస్‌ వైరస్‌ని ఎదుర్కొంటాయనే ప్రతిపాదనతో బెంగుళూరులో వున్న బయోకాన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఫేజ్‌-2 పరిశోధనలో మరణాలను గణనీయంగా తగ్గించిందని కంపెనీ పత్రికలకు వెళ్ళడించింది. ఐసీయమ్‌ఆర్‌ డైరక్టర్‌ భార్గవ గారు ఈ మందులు మరణాలను తగ్గించలేదనీ, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చన్నారు. ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమన్నారు. అయితే ఈ మందులు మంచికంటే ఎక్కువ హాని చేయవచ్చని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టోసిలాజుమాబ్‌ ను వాడాలంటే రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో వుండాలి, 3) ఫావిపిరవిర్‌అనే యాంటీవైరల్‌ మందును మైల్డ్‌, మోడరేట్‌ లక్షణాలున్నకోవిడ్‌ 19 కేసులలో వాడవచ్చని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించారు. ఇన్‌ ఫ్లూయంజాను నియంత్రించటానికి ఈ మందును గ్లిన్‌ మార్క్‌ అనే జపాన్‌ కంపెనీ కనిపెట్టింది. 150 మంది మనుష్యులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్నట్లుగా గ్లిన్‌ మార్క్‌ కంపెనీ ప్రకటించింది. ఒక టేబ్లెట్‌ ను రూ.103 రేటు ప్రకటించి రూ 75 కి తగ్గించారు. దారుణంగా బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తున్నది.

4) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సాహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది.
5) ప్లాస్మా ధెరపీుప్లాస్మా ధెరపీ అంటే రోగనిరోధక శక్తి బాగావున్నవారి రక్తంనుండి ప్లాస్మాను వేరుచేసి రోగనిరోధక శక్తి తక్కువగావున్నవారికి ఇవ్వటాన్ని ప్లాస్మా ధెరపీ అంటారు. కోవిడ్‌-19 వ్యాధినుండి పూర్తిగా కోలుకున్నవారికి కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే రోగనిరోధకణాలు యాంటీబాడీస్‌ ఎక్కువగావుంటాయి. వారి ప్లాస్మాను వేరుచేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఇచ్చి పరిశోధనలు జరుపుతున్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయంటున్నారు. కోలుకున్నరోగులనుండి రక్తాన్ని సేకరించి రోగులకు ఇవ్వటం కొత్తేమీకాదు. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు కూడా ప్లాస్మాధెరపీ ద్వారా చికిత్సచేశారు.
6) క్యూబా లో 1980 లో కనిపెట్టిన ”ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2” వైరస్‌ వ్యాధుల చికిత్స లో ప్రముఖమైనది. ప్రాధమిక దశలో వైరస్‌ వ్టాధులన్నిటిలోను ఉపయోగపడ్తుందని, అమెరికా తో సహా ప్రపంచవ్యాపిత పరిశోధనలు నిరూపించాయి. చైనా తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మందును 40 దేశాలలో వాడుతున్నారు. వూహాన్‌లో కోవిడ్‌-19 ప్రబలినపుడు ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2 ను వాడి సత్ఫలితాలను సాధించారు.
కరోనా మందులకు, వ్యాక్సిన్‌ కు కంపల్సరీ లైసెన్సింగ్‌ (తప్పనిసరిలైసెన్స్‌) ఇవ్వాలి. ఎక్కువ కంపెనీలకు మానుఫ్యాక్చరింగ్‌ లైసెన్సు ఇచ్చిప్రభుత్వం ధరలను నియంత్రించాలి. ప్రభుత్వాధీనంలో కరోనా మందులను అవసరమయిన ప్రజలందరికీ అందుబాటులో వుంచాలి.
కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా పేటెంట్‌ తీసుకుంటాయి. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోవచ్చు. పోలియో వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. ‘ పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని అడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.

కరోనా టీకాల తయారీ.
ఇప్పటివరకూ కోవిడ్‌-19 కి వాక్సీన్‌ ను రూపొందించటానికి 200 పరిశోధనా బందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పరిశోధనలను కొన్ని నెలలకు కుదించారు. కంపెనీలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోవున్నాయి. పరుగు పందెంలో ముందుగా వచ్చి మార్కెట్‌ను శాసించి అంతులేని లాభాలను పొందాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రిటన్‌ ఆక్సఫర్డ్‌ జెన్నర్‌ ఇన్స్టిట్యూట్‌లో అసాధారణ వేగంతో ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తి చేశారని, ప్రఖ్యాత మెడికల్‌ పత్రిక లాన్సెట్‌ ప్రకటించింది. మూడవ దశలో బ్రిటన్‌లో పది వేలమంది వాలంటీర్లపై ఆగస్టునెలలో ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. వాక్సిన్‌ను ఆస్ట్రా జనికాతో కలిసి పూనేలో తయారు చేయటానికి సీరమ్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంవత్సరం చివరకు వంద కోట్ల డోసులను మార్కెట్‌లోకి తేవటానికి పూర్తిస్ధాయిలో తయారవుతున్నారు.

కోవిడ్‌-19 కొరకు వ్యాక్సిన్ల తయారీలో చైనా లోని సినోఫార్మా , సినోవాక్‌ బయోటెక్‌ సంస్ధలు ఫేజ్‌-2 ట్రయల్స్‌ ను పూర్తిచేశాయని లాన్సెట్‌ పత్రిక ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలోని వేలాదిమంది వాలంటీర్లపై ఫేజ్‌-3 వ దశ పరిశోధనలకు తయారవుతున్నారు. ఆరు బ్రెజిలియన్‌ రాష్ట్రాలలో 9000 మంది పై అధ్యయనం ప్రారంభమయిందని గవర్నర్‌ జోవా డోరియా తెలిపారు. టీకా సమర్ధవంతమైనదని రుజువయితే 120 మిలియన్‌ డోసులను ఉత్పత్తి చేయబోతున్నామని గవర్నరు అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ , చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కూడావ్యాక్సిన్‌ పరిశోధనలలో ముందున్నదంటున్నారు, అడినోవైరల్‌ ఆధారిత వ్యాక్సిన్‌ లను కొన్ని చైనా కంపెనీలు అభివద్ది చేస్తున్నాయి.
విజయవంతమౌతున్న చైనా వ్యాక్సిన్లను చూసిన తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , చైనాతో కలిసి పనిచేయటానికి సుముఖత వ్యక్తంచేసాడు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ , ఐ సీ యమ్‌ ఆర్‌ సంయుక్తంగా కొరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీలో ముందున్నాయి. భారత్‌ బయోటిక్‌ అభివద్ది చేసిన” కోవాగ్జిన్‌ ” ఇంజెక్షన్‌ రూపంలో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ను ప్రారంభించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌, హైదరాబాద్‌ నిమ్స్‌, విశాఖ కేజీ హెచ్‌ తోపాటుగా12 ఆసుపత్రులను గుర్తించారు.
కరోనాకు ప్రపంచంలో అందరికన్నా ముందు తొలి టీకాను బయటకు తీసుకురావాలని రష్యా ప్రయత్నిస్తోంది. క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని, టీకా సురక్షితమైనదనీ, ఆగస్టు నెల ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను రష్యాతోపాటు ఆరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలలో వేలమందిపై నిర్వహించనున్నారు. మూడోదశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాల ఉత్పత్తికి ప్రణాలికలు రచించారు. ఈ ఏడాది 3 కోట్ల డోసులను రష్యాఉత్పత్తి చేస్తుందని, విదేశాలలో 17 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయ ప్రయత్నిస్తున్నామన్నారు.

అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ”, కరోనా మహమ్మారికి మించి అత్యవసరం ఏమున్నది.?
డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సును ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మాగ్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్‌ కంపెనీలకెదురొడ్డి నిలిచేదెవరు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చు . చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.
2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ మొదటిసారి ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే ఆ నెక్సావార్‌ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది.
అంతకు ముందు నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేలకు విక్రయించే వారు.
ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌
( యస్‌.ఈ,ఆర్‌.యస్‌.), మెర్స్‌ ( ఎమ్‌.ఇ,ఆర్‌.యస్‌,), ఎబోలా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివద్ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడికి కొత్త మందులేవీ లేవు కనుగొనలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత పేటెంట్‌ మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.
వంద సంవత్సరాలక్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్‌ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ ఈనాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నేను మాస్క్‌ ధరించనన్నాడు. మాస్క్‌ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచం కరోనా కేసుల లెక్కలలో అమెరికాకు ప్రధమ స్ధానాన్నిసాధించాడు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్‌ ధరించనన్నాడు. బ్రెజిల్‌ కు ద్వితీయ స్ధానాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు.
స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( యూనివర్సల్‌ హెల్త్‌ ) అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రాలను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలో పయనిస్తూ ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా క్యూబా ముందుకెళ్తూవుంది. అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తు.చ తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు.అందువలననే వియత్నాంలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.

పేద ప్రజలకు మందులు, టీకాలు దొరుకుతాయా? మాస్కులతోనే ప్రాణాలను కాపాడుకోవాలా?

ఇపుడు సైన్స్‌ అభివధ్ధిచెందింది. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ వలన జబ్బు పడిన వారిని త్వరగా టెస్టులు చేసి గుర్తిస్తున్నారు, అందుబాటులోవున్నమందులను ఉపశమనానికి ప్రతిభావంతంగా వాడుతున్నారు. వెంటిలేటర్‌ ద్వారా కత్రిమంగా ప్రాణవాయువును అందించి ప్రాణాన్ని నిలుపుతున్నారు. ఈ లోగా శరీరం తన రోగనిరోధకశక్తితోనూ, ఉపశమన మందుల ప్రభావంతోనూ, మెరుగైన. వైద్యసేవలతోనూ బతికిబయటపడుతున్నారు. చనిపోయేవారిసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వంద సంవత్సరాలనాడు స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి, రోగనిరోధక శక్తివున్నవారే బతికి బట్టకట్టారు. ఇపుడు కూడా మందులున్నా లేకపోయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
1) మాస్క్‌ ఖచ్చితంగా ధరించాలి. 2) ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి,3) సబ్బుతో చేతులు కడుక్కోవాలి.4) ఉన్నంతలో సమీకత పౌష్టికాహారం తీసుకోవాలి.5) శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.

ఎబోలా, హెచ్‌ ఐ వీ, ఏవియన్‌ ఫ్లూ, నిఫా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్నజూనోటిక్‌ వ్యాధుల్లో అది దాగివున్నది. ఈ రకమైన వైరస్‌ వ్యాధులతో 1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్‌,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్‌ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివద్ది పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్‌లు , వన్యజీవులు స్ధానభ్రంశం చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్‌లు అల్లకల్లోలం సష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి.
ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రకతిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు వ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేతగా కూడా పని చేస్తున్నారు. ఫోన్‌-9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దొంగ బంగారం కేసు : కేరళ సర్కారు మీద కుట్రకు బిజెపి తెరలేపిందా ?

23 Thursday Jul 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Kerala Gold Smuggling Case, Kerala LDF, NIA, Pinarai Vijayan


ఎం కోటేశ్వరరావు
రాజకీయాలకు – నైతిక సూత్రాలకు సంబంధం లేదని ఇటాలియన్‌ దౌత్యవేత్త మాకియవెల్లీ ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేరళలో పట్టుబడిన దొంగబంగారం కేసును ఆసరా చేసుకొని సిపిఐ(ఎం) నాయకత్వలోని కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, బిజెపి అనైతిక రాజకీయాలకు తెరలేపినట్లు కనిపిస్తోంది.
దుబాయిలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏఇ) కాన్సులేట్‌ కార్యాలయం నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి దౌత్య సిబ్బంది ఉపయోగించే ఒక సంచిలో పంపిన దొంగబంగారం కేసును దర్యాప్తు జరిపించాలని కేరళ ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ఎలాంటి శషభిషలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ దర్యాప్తు పూర్తిగాక ముందే విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ) అధికారులు వెల్లడిస్తున్న సమాచారం, సిపిఎంను వ్యతిరేకిస్తున్నశక్తులు చేస్తున్న ప్రచార, ఆందోళనల తీరు తెన్నులు కొన్ని ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. ఎవరూ కోరకుండానే పట్టుబడింది విమానాశ్రయంలో కనుక అది కేంద్ర పరిధిలో ఉంటుంది కనుక కేరళ సర్కారు వెంటనే లేఖ రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయలేదంటూ కాంగ్రెసు, బిజెపి పార్టీలు వింత వాదనను ముందుకు తెచ్చాయి. విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు తమ ఎత్తుగడలతో ఆ ప్రభుత్వాన్ని దెబ్బతీస్తాయా లేక ఎదురు తన్ని తామే దెబ్బ తింటాయా ? ఒక వైపు కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందుతూ కేరళలో కూడా కొత్త సమస్యను సృష్టిస్తుంటే దాన్ని కూడా కట్టడి చేసేందుకు దాని మీద కేంద్రీకరించిన ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ నాయకత్వంలోని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఒక వైపు దొంగబంగారం రాజకీయాలు, మరో వైపు కరోనా కట్టడి పోరు !
దొంగబంగారం ఎలా బయట పడింది !
జూన్‌ 30వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయానికి దుబాయి నుంచి వచ్చిన దౌత్యవేత్తల సంచి ఏముంది అనే అంశంపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చి చిరునామాదారులకు విడుదల చేయకుండా నిలిపివేశారు.
జూలై ఒకటవ తేదీన కేరళ ఐటి శాఖలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్న స్వప్న సురేష్‌ అనే మహిళ కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి తాను తిరువనంతపురం యుఏయి కాన్సులేట్‌ కార్యాలయ కాన్సులర్‌ కార్యదర్శిని అని, సదరు సంచిని విడుదల చేయాలని కోరింది. అధికారులు అంగీకరించలేదు.
రెండవ తేదీన కస్టమ్స్‌ అధికారులకు పలు చోట్ల నుంచి సదరు సంచిని వదలి పెట్టాలని ఫోన్లద్వారా వత్తిడి వచ్చింది. అయినా తిరస్కరించి ఎవరి పేరుతో అయితే సంచి వచ్చిందో వారు వచ్చి తీసుకుపోవాలని కాన్సులేట్‌ కార్యాలయానికి కస్టమ్స్‌ సిబ్బంది స్పష్టం చేశారు.అయితే కాన్సులేట్‌ కార్యాలయంలో గతంలో పిఆర్‌ఓగా పని చేసిన సరిత్‌ కుమార్‌ అరబ్బు వేషంతో ఉన్న ఒక వ్యక్తితో కలసి వచ్చి సంచిని తమకు అందచేయాలని వత్తిడి చేసినా అధికారులు అంగీకరించలేదు.
మూడవ తేదీన కాన్సులేట్‌ అధికారులను పిలిపించేందుకు కస్టమ్స్‌ అధికారులు అనుమతి తీసుకున్నారు.
నాలుగవ తేదీన సదరు సంచి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపివేయాలంటూ ఒక లేఖ కస్టమ్స్‌ అధికారులకు అందింది. అయితే ఐదవ తేదీన ఆ సంచిలో ఏముందో తనిఖీ చేయాలని నిర్ణయించినందున ఆ సమయంలో అక్కడకు ఒక ప్రతినిధిని పంపాలని కాన్సులేట్‌ కార్యాలయానికి కస్టమ్స్‌ అధికారులు వర్తమానం పంపారు.
ఐదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని హైకమిషనర్‌ కార్యాలయ సీనియర్‌ అధికారి సమక్షంలో కస్టమ్స్‌ సిబ్బంది సంచి తనిఖీ ప్రారంభించారు. ఆ సమయంలో ఆ సంచి ఎవరి పేరుతో వచ్చిందో యుఏయి కార్యాలయంలోని సదరు అధికారి కూడా ఉన్నారు. దానిలో 14.8 కోట్ల రూపాయల విలువ చేసే 30కిలోల బంగారం ఉంది. బంగారంతో తమకు సంబంధం లేదని, తమకు పంపింది కాదని కాన్సులేట్‌ అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 3.15 సమయంలో అంతకు ముందు సంప్రదించిన స్వప్న సురేష్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ తతంగం అంతా సాయంత్రం ఆరుగంటలవరకు జరిగింది. మాజీ పిఆర్‌ఓ సరిత్‌ను కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు.
ఏడవ తేదీ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, ఐటి కార్యదర్శి అయిన ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌కు దొంగబంగారం కేసులో అనుమానితులతో సంబంధాలున్నాయనే అనుమానంతో బాధ్యతల నుంచి సిఎం కార్యాలయం తప్పించింది.
తొమ్మిదవ తేదీన జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్‌ఐఏ) విచారణను చేపట్టింది. స్వప్న సురేష్‌ మాట్లాడిన ఆడియో మీడియాలో ప్రసారమైంది. పదవ తేదీన నలుగురు అనుమానితులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. పదకొండవ తేదీన రెండవ నిందితురాలు స్వప్న సురేష్‌, నాలుగవ నిందితుడు సందీప్‌ నాయర్‌ను బెంగళూరులో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నకిలీ సర్టిఫికెట్‌తో స్వప్న సురేష్‌ ఐటిశాఖలో చేరిందన్న అంశంపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పన్నెండవ తేదీన స్వప్న, సందీప్‌ నాయర్‌ అరెస్టును ప్రకటించిన ఎన్‌ఐఏ వారిని కరోనా సంరక్షణ కేంద్రాలకు తరలించింది.
పద్నాలుగవ తేదీన దర్యాప్తు అధికారులు ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ ఇంట్లో తనిఖీలు జరిపారు. కస్టమ్స్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మొదటి నిందితుడు సరిత్‌ కుమార్‌ ఈ బంగారం విషయంలో శివశంకర్‌కు ఎలాంటి సంబంధం లేదని అయితే ఆయన నివాసంలో బంగారం గురించి తాము మాట్లాడినట్లు వెల్లడించాడని వార్తలు వచ్చాయి.
పదిహేనవ తేదీన ఐటి పార్కుల మార్కెటింగ్‌ మరియు కార్యకలాపాల డైరెక్టర్‌ అరుణ్‌ బాల చంద్రన్‌ను బాధ్యతల నుంచి ఐటి శాఖ తొలగించింది.శివశంకర్‌ను ప్రభుత్వ సస్పెండ్‌ చేసింది.
పదహారవ తేదీన తిరువనంతపురం యుఏఇ కాన్సలేట్‌ అధికారి రషీద్‌ అల్‌ సలామీ దేశం వదలి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అతని పేరుమీదే బంగారం ఉన్న సంచి వచ్చింది.
కనిపించకుండా పోయినా కాన్సులేట్‌ కార్యాలయ గన్‌మన్‌ చేతికి గాయాలతో 17వ తేదీన కనిపించాడు. ఐటి శాఖలో స్వప్న సురేష్‌ చేరటంలో శివశంకర్‌ పాత్ర ఉన్నట్లు అతనికి జారీ చేసిన సస్పెన్షన్‌ నోటీసులో పేర్కొన్నారు. పందొమ్మిదవ తేదీన కేసులోని మూడవ నిందితుడైన ఫైజల్‌ ఫరీద్‌ను దుబారులో అరెస్టు చేశారు.

ముఖ్య మంత్రి మీద ఆరోపణలేమిటి ? నిందితులు-వారికి తోడ్పడిన వారి కథేమిటి ?


ఐటిశాఖను ముఖ్యమంత్రే చూస్తున్నారు. ఆ శాఖ అధికారి సిఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా కూడా ఉన్నాడు, అతని ప్రమేయంతోనే స్వప్న సురేష్‌ను ఐటి శాఖలో నియమించారు కనుక ముఖ్యమంత్రి నియమించినట్లుగా భావించి ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన వారు యుగళగీతాలు పాడుతూ రోడ్లెక్కుతున్నారు.
కేరళలో జనం టీవీ ఛానల్‌ బిజెపికి చెందినది. దాని వార్తల సమన్వయకర్త మరియు సంపాదకుడు అయిన అనిల్‌ నంబియార్‌ దొంగ బంగారం ఉదంతంలో నిందితులైన స్వప్న సురేష్‌, సందీప్‌ నాయర్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడైంది. వారు పోలీసులకు దొరకకుండా దాక్కొనేందుకు అతనికి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో ఉన్న సంబంధాలతో సహకరించినట్లు మీద విమర్శలు వచ్చాయి. కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసిన రోజునే నిందితులు పరారయ్యారు. స్వప్న సురేష్‌ -అనిల్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను ఎన్‌ఐఏ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. వాటి ప్రకారం సదరు జనం టీవీ సంపాదకుడు అనిల్‌ నంబియార్‌కు కేంద్ర మంత్రి వి మురళీధరన్‌, బిజెపి నేత కె సురేంద్రన్‌, కర్ణాటక బిజెపి అగ్రనేతలతో సంబంధాలున్నట్లు బయటకు వచ్చింది. తిరువనంత పురం నుంచి బయటపడిన స్వప్న-సందీప్‌ బెంగళూరు వెళ్లబోయే ముందు వర్కల లోని హిందూ ఐక్యవేది నేతకు చెందిన రిసార్టుకు వెళ్లారు. జూలై ఐదవ తేదీన బంగారం సంచిలో ఏముందో తెరిచి చూసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ ప్రారంభం కావటానికి కొద్ది సేపటికి ముందు అంటే మధ్యాహ్నం 12.42 నిమిషాలకు అనిల్‌ నంబియార్‌ నుంచి స్వప్నకు ఫోన్‌ వచ్చింది, 262 సెకండ్లు మాట్లాడుకున్నారు. అంతకు ముందు అనిల్‌- సందీప్‌ మధ్య కూడా ఫోన్‌ సంభాషణలు చోటు చేసుకున్నట్లు నమోదైంది. దీన్ని బట్టి బంగారం దొంగరవాణా గురించి అనిల్‌కు ముందే తెలుసు అని భావిస్తున్నారు.
దొంగబంగారం వార్త మీడియాలో గుప్పుమన్న తరువాత అనిల్‌ నంబియర్‌ తన ఫేస్‌బుక్‌ పోస్టులో స్వప్నకు తాను ఫోన్‌ చేసినట్లు అంగీకరిస్తూ వార్తల అదనపు సమాచారం కోసం కాంటాక్టు చేశానని చెప్పాడు. సాధారణంగా మీడియా సంస్ధలలో సంపాదకులకు బదులు విలేకరులే వివరణలకోసం ప్రయత్నిస్తారు. సంపాదకుడు అనిల్‌ నంబియారే రంగంలోకి దిగారు అనుకుంటే దానికి అనుగుణ్యంగా జనం టీవీలో వార్తలే దర్శనమివ్వలేదని వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు ముస్లిం లీగ్‌ కార్యకర్తలను కూడా ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇంకా మరి కొందరి కోసం గాలిస్తున్నారు.


నిందితులకు బిజెపితో సంబంధాలు !
వివిధ పార్టీల నేతలతో పలువురు కలుస్తున్న సందర్భాలను బట్టి కలిసే వారు చేసిన నేరాలతో పార్టీల నేతలకు సంబంధాలు ఉన్నాయని చెప్పటం కొన్ని సందర్భాలలో వాస్తవ విరుద్దం కూడా కావచ్చు. ఈ కేసులో స్వప్న సురేష్‌ అనే మహిళ పేరు ముంతాజ్‌ ఇస్మాయిల్‌ అని, అరెస్టయిన మాజీ పిఆర్‌ఓ సరిత్‌ పూర్వాశ్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌లో సభ్యుడని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. స్వప్న సురేష్‌ వివరాల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం ఆమె పేరు ముంతాజ్‌ ఇస్మాయిల్‌ అని తలిదండ్రులు హిందువులని ఉంది. భర్త పేరు, ఇతర వివరాలు లేవు. ఒక వేళ ఆమె మతాంతర వివాహం చేసుకొని పేరు మార్చుకొని ఉండవచ్చు. ఇక సరిత్‌ పూర్వాశ్రమంలో ఏ సంస్ధతో ఉన్నాడని కాదు, వర్తమానంలో ఎవరితో ఉన్నారన్నది ముఖ్యం.
మరో నిందితుడు సందీప్‌ నాయర్‌కు బిజెపికి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు నమ్మబలుకుతున్నారు. ఆ పార్టీనేత కుమనమ్‌ రాజశేఖరన్‌తో కలసి ఉన్న ఫొటో బయటకు రాగానే అనేక మందితో తమ నేత కలుస్తారని, అంత మాత్రాన వారితో సంబంధం ఉన్నట్లు కాదని, సందీప్‌ ఎవరో తెలియదని బిజెపి సమర్ధించుకుంది.అయితే తన కుమారుడు బిజెపిలో చురుకైన కార్యకర్త అని సందీప్‌ తల్లి చెప్పింది ( జూలై 11వ తేదీ టెలిగ్రాఫ్‌) విదేశాంగ శాఖ సహాయ మంత్రి, కేరళ బిజెపి నేత వి. మురళీధరన్‌ బంగారం ఉన్న సంచి దౌత్యవేత్తలు ఉపయోగించేది కాదని చెప్పారు. అలా చెప్పాల్సిన అవసరం మంత్రికి ఏమి వచ్చింది. కస్టమ్స్‌ క్లియరింగ్‌ ఏజంట్ల అసోసియేషన్‌ అధ్యక్షుడి హౌదాలో ఆ సంచి విడుదల గురించి కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడినట్లు హరిరాజ్‌ అనే వ్యక్తి చెప్పాడు. అతని ఫేస్‌బుక్‌లో నరేంద్రమోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానిగా చెప్పుకున్నాడు, తనకు బిఎంఎస్‌ లేదా బిజెపితో సంబంధం లేదని కూడా చెప్పుకున్నాడు. వచ్చిన సంచి దౌత్యవేత్తలు ఉపయోగించేది అయితే హరిరాజ్‌కు సంబంధం ఏమిటి ? అతని సిఫార్సుల అవసరం ఎందుకు ఉంటుంది? ఏ దౌత్యవేత్త తరఫున దాన్ని విడుదల చేయాలని అడిగినట్లు ? ఒక వేళ దౌత్యవేత్తది కానట్లయితే, దాని మీద చిరునామా దౌత్యకార్యాలయ అధికారి పేరు ఎందుకు ఉంది? ఎవరి కోరిక మీద హరిరాజ్‌ జోక్యం చేసుకున్నట్లు ?
విమానాశ్రయ సిసిటీవీలో చిత్రాలను పరిశీలించినపుడు గతంలో కూడా అనేక సార్లు స్వప్న సురేష్‌ విమానాశ్రయంలో కనిపించినట్లు బిజెపినేతలు చెబుతున్నారు ? వాస్తవం కూడా కావచ్చు, విమానాశ్రయాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, అక్కడ భద్రత, తనిఖీ బాధ్యత కేంద్రానిదే, అలాంటపుడు ఆమె మీద అంతకు ముందు ఎందుకు అనుమానం రాలేదు ? ఇలా ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తాయి. స్వప్న సురేష్‌కు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారితో సంబంధాలున్నాయనే ఒక్క అంశం తప్ప ఈ కేసులో సిఎం లేదా కార్యాలయానికి ఉన్న సంబంధాల గురించి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
బిజెపి నేతల ప్రకటనలు, వారు వీధులకు ఎక్కుతున్న తీరు తెన్నులను చూస్తే అనుమానాలు తలెత్తటం సహజం. కేరళ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా, సిపిఎం నేతలను ఎక్కడ ఇరికించాలా అని అవకాశం కోసం బిజెపి ఎదురు చూస్తున్నదనేది బహిరంగ రహస్యం. రాజ్యాంగ వ్యవస్ధలు, సిబిఐ, ఆదాయపన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) వంటి సంస్దలు, వ్యవస్ధలను దుర్వినియోగ పరచి ప్రత్యర్ధి పార్టీలు, ప్రభుత్వాలను బదనామ్‌ చేయటంలో యాభై సంవత్సరాలలో కాంగ్రెస్‌ ఎంత అపవాదు మూటకట్టుకుందో బిజెపి తొలి ఐదేళ్లలోనే అంతకంటే ఎక్కువ సంపాదించుకుంది. ఇప్పుడు ఎన్‌ఐఏను కూడా దుర్వినియోగ పరచి ఏదో విధంగా కేరళ ప్రభుత్వాన్ని, పాలక పార్టీలను ఇరుకున పెట్టేందుకు బంగారం అవకాశాన్ని వినియోగించుకుంటుందా అని కూడా ఆలోచించాల్సి వుంది. ఎందుకంటే బిజెపి నేతల మాటలే అందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. బంగారం స్మగ్లింగ్‌ ఒక్క కేరళలోనే జరుగుతున్నట్లు, అది దేశ భద్రతకు ముప్పు అనీ, ఉగ్రవాదులకు డబ్బు అందచేసేందుకు వినియోగిస్తున్నారని, హైదరాబాద్‌ ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది కనుక దీని మూలాలు అక్కడ కూడా ఉన్నాయని, దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసే లక్ష్యంతో బంగారాన్ని అక్రమంగా తీసుకు వస్తున్నారని ఎన్‌ఐఏ అధికారులు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
ఉగ్రవాదులు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అయితే వారి ఉనికి, కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతూ ప్రమాదకరంగా పరిణమించి గతంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన వాటిలో కేరళ ఎన్నడూ లేదు. బంగారాన్ని ఉగ్రవాదుల కోసమే వినియోగిస్తున్నారనే నిర్ధారణకు గతంలో మన నిఘా సంస్ధలు ఎలాంటి నిర్దారణలకు రాలేదు. వారికి నిధుల అందచేసే పద్దతులలో అది కూడా ఒక అంశం కావచ్చు. దొంగ బంగారం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయ చూస్తున్నారన్న ప్రచారం వెనుక అతిశయోక్తి, ఇతర అంశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌, చైనా రిజర్వుబ్యాంకుల వద్ద ఉన్న నిల్వల కంటే మన దేశంలో ప్రయివేటు వ్యక్తుల వద్ద ఇరవై వేల టన్నుల బంగారం ఎక్కువగా ఉంది అన్నది ఒక అంచనా. బంగారం మీద మన దేశంలో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం, దేశంలో డిమాండ్‌ బాగా ఉంటున్న కారణంగా అధికారికంగా దిగుమతి చేసుకుంటున్నదానిలో మూడవ వంతు అక్రమంగా వస్తున్నట్లు చెబుతున్నారు. కెనడాకు చెందిన ఇంపాక్ట్‌ అనే సంస్ధ గత ఏడాది నవంబరులో ఒక నివేదికను విడుదల చేసింది. ఏటా వెయ్యి టన్నుల వరకు వినియోగిస్తుండగా దానిలో 800-900 టన్నులు దిగుమతి అవుతోందని, 200 టన్నుల మేరకు అక్రమంగా వస్తున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశం ఎవరైనా బంగారం దిగుమతి చేసుకుంటే 12.5శాతం కస్టమ్స్‌ సుంకం, మూడు శాతం జిఎస్‌టి చెల్లించాలి, దిగుమతి చేసుకున్నదానితో ఆభరణాలు తయారు చేస్తే మరో ఐదుశాతం అదనపు జిఎస్‌టి చెల్లించాలి.
ఒక కిలోబంగారాన్ని అక్రమ పద్దతుల ద్వారా రప్పించుకుంటే ఆరు లక్షల రూపాయల మేర లాభం ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం ఐదు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నందున అక్రమ రవాణా లాభసాటిగా ఉంటోంది. ఆఫ్రికాలోని గ్రేట్‌ లేక్స్‌ ప్రాంతం నుంచి బంగారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోంది. మన దేశంలోకి వస్తున్న అక్రమ బంగారంలో 75శాతం యుఏఇ నుంచి వస్తోందని ఇంపాక్ట్‌ నివేదిక అంచనా. అందువలన అక్కడ మన భారత గూఢచారులు ఏమి చేస్తున్నారన్నది ఒక ప్రశ్న. నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనా, భూటాన్‌ నుంచి కూడా బంగారం అక్రమంగా వస్తున్నట్లు గుర్తించారు.
దౌత్యవేత్తల సంచుల ద్వారా బంగారాన్ని గత ఏడాది కాలంలో 250 కిలోల వరకు తరలించి ఉంటారని ఎన్‌ఐఎ అధికారులు అంచనా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కస్టమ్స్‌ అధికారుల అంచనా 20 సంచుల ద్వారా 180కిలోలు ఉండవచ్చని ఒక వార్త. వ్యక్తిగత లబ్ది కోసమా లేక దేశాన్ని అస్ధిరం కావించేందుకు బంగారాన్ని తరలిస్తున్నారా అనే కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోంది. ఎన్‌ఐఏ నలుగురిని, కస్టమ్స్‌ సిబ్బంది 13మందిని ఇంతవరకు పట్టుకున్నారు.(సంఖ్యలో మార్పులు ఉండవచ్చు)
ప్రపంచంలోనే బంగారం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరిగే దేశాల్లో మనది ఒకటి. అది ఎలా జరుగుతోందో గత ఏడాది నవంబరులోనే ఇంపాక్ట్‌ సంస్ధ తన నివేదికలో వెల్లడించినా మన కేంద్ర అధికారులు, నిఘా సంస్ధలు యుఏయి-దుబాయి మీద కేంద్రీకరించలేదన్నది స్పష్టం. ఒకటి శుద్ధి చేసిన బంగారం, రెండవది పాక్షికంగా శుద్ధిచేసిన బంగారు కడ్డీలు, బిస్కట్ల రూపంలో రవాణా అవుతోంది. మన దేశానికి చెందిన బంగారు వర్తకులు ఆఫ్రికాలోని తూర్పు ఆఫ్రికా టాంజానియా, ఉగాండాల నుంచి సేకరించి టాంజానియాలోని మవాంజా నుంచి దుబాయి తరలిస్తున్నారు. అక్కడి నుంచి మన దేశం వస్తోంది. ఉగాండా నుంచి సమీర్‌ భీమ్‌జీ అనే వ్యాపారి తరచూ భారత్‌ను సందర్శిస్తున్నట్లు అతనికి ప్రత్యక్షంగా భారత్‌తో బంగారం వ్యాపార లావాదేవీలు ఉన్నాయో లేదో తెలియదు గానీ ఉగాండాలోని ముగ్గురు ప్రముఖ ఎగుమతిదారుల్లో ఒకడని ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం గుర్తించింది. అయితే ముంబాయి స్మగ్లర్‌ ఒకడు సమీర్‌ అక్రమవ్యాపారి అని నిర్ధారించినట్లు ఇంపాక్ట్‌ నివేదిక పేర్కొన్నది.2016లో ఉగాండా అధికారులు జరిపిన దాడిలో అతని ఇంటిలో51.3కిలోల బంగారం దొరికింది. అతనికి మన దేశానికి చెందిన బంగారు రాజుగా పేరు పడిన ప్రధ్వీరాజ్‌ కొఠారీకి సంబంధాలు ఉన్నట్లు మన దేశ అధికారులకు సైతం తెలుసు.
మన దేశంలో బంగారు శుద్ధి రంగాన్ని ప్రోత్సహించేందుకు 2013లో నాటి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిన కారణంగా 2012లో శుద్ధి చేయని బంగారం దిగుమతి 23 టన్నులు ఉండగా 2015 నాటికి 229 టన్నులకు పెరిగింది. శుద్ధి చేయని బంగారం పేరుతో పరిశుద్దమైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు. చిత్రం ఏమిటంటే అసలు ఆయా దేశాల్లో ఎంత బంగారం ఉత్పత్తి అవుతోంది, అసలు ఉత్పత్తి జరుగుతోందా లేదా, ఎగుమతి చేయగలదా లేదా అని కూడా తెలుసుకోకుండా మన దేశం కొన్ని దేశాల నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఉదాహరణకు 2014-17 మధ్య మన దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌ నుంచి 100.63 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది, నిజానికి అదేశానికి అంత ఎగుమతి చేసే స్ధాయి లేదు.


ఇత్తడి రద్దు పేరుతో 4,500 కిలోల బంగారం దిగుమతి !
మన నిఘా అధికారులు నిద్రపోవటం లేదా కుమ్మక్కు కారణంగా ఇత్తడి రద్దు పేరుతో 2017 ఫిబ్రవరి నుంచి 2019 మార్చినెల వరకు 4,500 కిలోల బంగారాన్ని కంటెయినర్ల ద్వారా అక్రమంగా రవాణా చేశారని మళయాళ మాతృభూమి పత్రిక 2019 నవంబరు 24న ఒక వార్తను ప్రచురించింది. ఎక్స్‌రే యంత్రాలు కూడా వాటిని పసిగట్టలేని విధంగా దాన్ని తరలించారు.షార్జా పారిశ్రామిక ప్రాంతం నుంచి భారత్‌కు చేరింది. ఈ రవాణా వెనుక నిసార్‌ అలియార్‌ అనే వ్యక్తి ఉన్నాడు.అతనికి షార్జాలో గోడవున్లు ఉన్నాయి.అధికారుల కన్ను గప్పేందుకు అక్కడ బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి దానికి నల్లని రంగు పూసేవారు, ఇత్తడి రద్దు మధ్య దానిని ప్రత్యేకంగా అమర్చి కంటెయినర్లకు ఎక్కించి నట్లు ఆ పత్రిక రాసింది.ఆ బంగారాన్ని గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో ఉన్న బ్లూ సీ మెటల్స్‌ కంపెనీ పేరు మీద రప్పించేవారు, జామ్‌ నగర్‌ చేరిన తరువాత దానిని శుద్ది చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపేవారు. కేరళలోని పెరుంబవూర్‌కు చెందిన బంగారు చక్రవర్తులుగా పేరు మోసిన వ్యక్తులు మధ్యవర్తులుగా బంగారాన్ని సరఫరా చేసేవారు. గత ఏడాది మార్చి 29న నిసార్‌ అలియార్‌ నుంచి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌(డిఆర్‌ఐ) వారు 185కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. దాంతో బంగారం స్మగ్లింగ్‌ సంబంధాలు అనేకం బయటకు వచ్చాయి.
దేశంలో 2016కు ముందు రెండున్నర సంవత్సరాలలో రెండువేల కోట్ల రూపాయల విలువగల ఏడువేల కిలోల బంగారాన్ని అక్రమంగా చేరవేసినట్లు అదే ఏడాది సెప్టెంబరు 26న డిఆర్‌ఐ ఢిల్లీ జోనల్‌ విభాగం గుర్తించింది. గౌహతి నుంచి 617 సందర్భాలలో ఢిల్లీకి బంగారాన్ని విమానాల్లో తరలించినట్లు విచారణలో వెల్లడైంది.ఈ బంగారం మయన్మార్‌ నుంచి వచ్చినట్లు తేలింది. ప్రతి ఏటా అనేక చోట్ల ఇలాంటి ఉదంతాలు బయటపడటం అధికారులు నేరగాండ్లను అరెస్టు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. 2015 మార్చినెలలో సిలిగురిలో 87కిలోలు, మరుసటి ఏడాది ఆగస్టులో కొల్‌కతాలో 58 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ రెండు ఉదంతాల్లో నిమగమైన ముఠా మొత్తం 200 కోట్ల రూపాయల విలువైన 700 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు తేలింది. ఒక ఉదంతంలో సిలిగురి నుంచి మణిపూర్‌కు తరలిస్తున్న ఐదుకోట్ల రూపాయలకు సమానమైన ఏడున్నరలక్షల డాలర.్లను కనుగొన్నారు.ఈ సొమ్ముతో మయన్మార్‌లో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అంతకు ముందు .274 టన్నుల బంగారం అక్రమంగా తరలించారని అంచనా వేసిన అధికారులు కఠిన చర్యలు తీసుకున్న తరువాత గత ఏడాది కొంతమేర తగ్గింది.
బిజెపి నేతలు ముందుకు తెస్తున్న తర్కం ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారి నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్‌కు పొరుగుసేవల ఉద్యోగం ఇచ్చారు. కనుక సిఎంకు వారితో సంబంధం ఉంది. ఇదే తర్కాన్ని మిగతా దొంగబంగారం కేసులకు కూడా వర్తింప చేస్తే మొత్తంగా బిజెపి నేతలకే చుట్టుకుంటుంది. కస్టమ్స్‌ శాఖ, ఇతర కేంద్ర సంస్దల వైఫల్యం కారణంగానే దేశంలోకి బంగారం అక్రమ రవాణా జరుగుతోంది కనుక నరేంద్రమోడీ లేదా ఆ శాఖలను చూసే మంత్రులు అధికారులను చూసీ చూడనట్లు వ్యవహరించమని ఆదేశించారని అనుకోవాలా ? దుబాయి అక్రమ రవాణా కేంద్రమని కేంద్రానికి తెలియదా ? దౌత్యవేత్తల సంచుల్లో లేదా తనిఖీకి అవకాశం లేనందున స్వయంగా వారే తరలించినా బాధ్యత ఎవరిది ? ఏ రాష్ట్రంలో దొంగబంగారం లేదా మరొక అక్రమం జరిగితే ఆ రాష్ట్రాల పాలకులకు సంబంధం ఉందంటే మిగిలిన కేసుల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాజీనామా చేయాలని ఎందుకు కోరలేదు ? దొరికింది విమానాశ్రయంలో, అదుపులోకి తీసుకున్నది కస్టమ్స్‌ అధికారులు, నిందితులు దొరికింది బిజెపి పాలనలోని బెంగళూరులో, ఆ పార్టీ కార్యకర్తలకూ సంబంధం ఉంది, ఒకడిని అరెస్టు చేశారు. అందువలన అసలు రాజీనామా చేయాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం అధిపతిగా నరేంద్రమోడీ నైతికంగా ఆపని చేయాలా వద్దా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పాలకుల మీద భ్రమలు -పోరాట శక్తిని పోగొడుతున్నాయా !

21 Tuesday Jul 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

challenges before working class, class struggle, identity politics, working class


ఎం కోటేశ్వరరావు


కరోనా వైరస్‌తో సహజీవనం చేయాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన తరువాత అంతకు మించి చేసేది, చేయగలిగింది ఏముంది కనుక … చేద్దాం. అది బ్రతకనిస్తే బతుకుదాం, చంపేస్తే దిక్కులేని చావు చద్దాం. మన చేతుల్లో ఏముంది !
అవినీతి, అక్రమాలు, అధికారం కోసం తొక్కుతున్న అడ్డదారులు, డబ్బుకోసం నడుస్తున్న చెడ్డదారులు, ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం వంటి సకల అవాంఛనీయ, అవలక్షణాలు, రోగాలు రొష్టులతో పాటే జీవిద్దామని ఎవరూ చెప్పకపోయినా వాటితో సహజీవనం చేసేందుకు అలవాటు చేశారు. గతంలో ఎరగనిది ఇప్పుడు అదనంగా కరోనా తోడైంది. తరువాత మరొకటి రావచ్చు. మనకూ పెద్ద పట్టింపు ఉండటం లేదు. పాలకులకు కావాల్సిందీ, కోరుకుంటున్నదీ అదే.
కరోనా వచ్చింది కనుక ఏది ఆగింది. రాజస్ధాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ కూల్చివేత కుట్రకు తెరలేపిన బిజెపిని కరోనా ఆపలేదు. కరోనా పరీక్షలకు, పేషంట్ల చికిత్సకు అవసరమైన ఏర్పాట్లకు నిధులు లేవు, రెండు సంవత్సరాలుగా ఊరిస్తున్న నూతన వేతనాల ఖరారుకు ముందుకు రారు గానీ సలక్షణంగా ఉన్న భవనాలను కూల్చివేసి కొత్త సచివాలయాన్ని కట్టేందుకు కెసిఆర్‌ ప్రభుత్వానికి నిధుల కొరత లేదు.
ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు పెరగకపోయినా పెట్రోలు, డీజిలు ధరలను పెంచి జేబులు లూటీ చేస్తున్నా జనం లేదా కనీసంన్న కేంద్ర ప్రభుత్వం మీద కరోనా కన్నెర్ర చేయలేకపోయింది. అంతర్జాతీయంగా చైనా మీద ఏక్షణంలో అయినా యుద్దం చేస్తామంటూ అమెరికన్లు తమకు సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలోకి విమానవాహక, అణు యుద్ద నౌకలను పంపటాన్ని కరోనా అభ్యంతర పెట్టలేదు.
లడఖ్‌ సరిహద్దులో చైనా మన ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిందని మాననీయ కేంద్ర మంత్రులన్నారు. గౌరవనీయ ప్రధాని రాలేదన్నారు. తీరా చూస్తే అదేదే సినిమాలో నువూ మూస్కో నేనూ మూస్కుంటా అన్నట్లు మీరూ వెనక్కు వెళ్లండి మేమూ వెనక్కు తగ్గుతాం అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వార్తలు. అసలేం జరిగిందీ, ఏం జరుగుతోంది అని జనం జుట్టుపీక్కుంటున్నా కరోనాకేమీ పట్టలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సుత్తి వేసినట్లవుతుంది తప్ప మరొకటి కాదు. ఎందుకిలా జరుగుతోంది?
ప్రభుత్వ స్కూళ్ల వైపు చూడకుండా చేసినా, కార్పొరేట్‌ బళ్లవైపు బలవంతంగా నెట్టినా మనం పట్టించుకోలేదు. ప్రభుత్వ దవాఖానాలను పబ్లిక్‌ పాయి ఖానా లెక్క మార్చారు గనుక మనం అటువైపు వెళ్లే పరిస్ధితి లేదు. కార్పొరేట్‌ ఆసుపత్రుల వైద్య యంత్రాలకు అవసరమైన రోగులుగా మనం మారాం తప్ప మనకు అవసరమైన యంత్రాలుగా అవి లేవు. అక్కడ శవాలుగా మారిన తరువాత కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా నోరెత్తలేని దౌర్భాగ్య పరిస్ధితిలో పడిపోయాం. చాలా మందికి ఈ సమస్యలను చర్చించే, చెప్పే వారు నస పెట్టేవారిగా కనిపిస్తున్నారు. జనం అసలు వినేందుకు కూడా సిద్దం కావటం లేదు, ఇదెక్కడి సుత్తిరా బాబూ అని దూరంగా పోతున్నారు.
ఈ పరిస్ధితిని చూస్తుంటే పెద్దలు చెప్పిన అనేక విషయాలు గుర్తుకు వస్తున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమ తొలి రోజుల్లో జనం కాంగ్రెస్‌ కార్యకర్తలను చూసి వచ్చార్రా దేశభక్తి గురించి ఊదరగొట్టే వారు అంటూ దూరంగా పారి పోయిన రోజులు ఉన్నాయట. తమ జీవితాల మీద పాలనా ప్రభావం పెద్దగా పడనంత వరకు, పాలకులు మితిమీరి జోక్యం చేసుకోనంత వరకు జనం లోకం పోకడను పెద్దగా పట్టించుకోరు. వారికి తెలియని, ఆసక్తిలేని విషయాలను ఎక్కించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిని చూసి పారిపోతారు. ఇప్పుడు మన జీవితాలను శాసిస్తున్న, నడిపిస్తున్న నయా ఉదారవాద విధానాల పర్యవసానాలు, ఫలితాలు, వాటికి ప్రత్యామ్నాయం గురించి చెప్పేవారిని జనం అలాగే చూస్తున్నారా అనిపిస్తోంది.
ఉద్యోగులు, కార్మికులు రాజకీయ పోరాటాలు, ఆరాటాలకు దూరంగా ఉంటారు గానీ ఆర్ధిక పోరాటాలకు మాత్రం సిద్దం సుమతీ అన్నట్లుగా ఉంటారన్నది సాధారణ అభిప్రాయం. చిత్రం ఏమంటే జనం ఇప్పుడు వాటికి కూడా సిద్దంగావటం లేదు. యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు వారికి వత్తాసుగా పాలకులు నూతన ఆర్ధిక విధానాల పేరుతో గతంలో ఉన్న చట్టాలను నీరుగారుస్తున్నారు. ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగించి వేస్తున్నారు. కార్మికులు దాని గురించి ఏండ్ల తరబడి కార్మిక శాఖ (ఆచరణలో యజమానుల వత్తాసు కేంద్రాలుగా మారాయి) కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగు తారా బతుకు తెరువు కోసం ప్రయత్నిస్తారా ? ఏ కార్మికుడైనా తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే ఆ విషయం తెలిసిన వారెవరైనా అతనికి ఉద్యోగం ఇస్తారా ? లోకానికంతటికీ జరిగే అన్యాయాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించినా అదే పరిస్ధితి, వారికి చట్టాల గురించి తెలియక కాదు, ఎవరైనా కేసు వేస్తే వేరే ఉపాధి చూసుకోవాలి తప్ప ఏ సంస్దా దగ్గరకు రానివ్వదు. ఈ నేపధ్యంలో పోరాటాల ద్వారా తమ సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకోసం పోరాడటం కంటే అధికారపక్షంలోని నేతల పైరవీల ద్వారా ” పనులు చేయించుకోవటం ” సులభం, మంచిదనే సాధారణ అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉన్నత విద్యావంతులే అయినా వారిలో కూడా ఆ దగ్గర దారులు, అంతకు మించి మరొక భావన లేదు.దీని అర్ధం అయినదానికీ కానిదానికి ఆందోళన, పోరాటం తప్ప ఇతర పరిష్కారాల వైపు చూడవద్దని కాదు. కార్మికులెప్పుడూ పోరాటం, సమ్మెలను చివరి చర్యలుగానే చూస్తారు.
దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు, రెండున్నర లక్షల మంది టీచర్లకు నూతన వేతనాలు నిర్ణయించేందుకు నియమించిన వేతన సవరణ కమిషన్‌కు రెండు సంవత్సరాలు నిండిపోయింది. ఏదో ఒక సాకుతో వ్యవధిని పదే పదే పొడిగిస్తూ చివరిగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ ఏడాది డిసెంబరు వరకు గడువు నిర్ణయించారు. అయినా ఉద్యోగులు కిక్కురు మనటం లేదు. అప్పటికైనా వెలుగు చూస్తుందా అన్నది అనుమానమే. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు వచ్చే ఏడాది జూలై వరకు కరవు భత్యం, ఇంక్రిమెంట్లను కూడా నిలిపివేసిన నేపధ్యంలో ఏదో ఒక సాకుతో కెసిఆర్‌ ప్రభుత్వం మరో ఆరునెలలు గడువు పెంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆరునెలలుగా కరోనా వ్యాప్తి పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఎంతకాలం అది ప్రభావం చూపుతుందో ఎవరూ చెప్పలేని స్ధితి.
నిజానికి బంగారు తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించి కమిషన్‌ సిఫార్సులను వాయిదా వేసినా సమస్య ఉండేది కాదు. ఏకంగా వేతన సవరణకే ముందుకు పోతుంటే మధ్యలో ఈ మధ్యంతరం ఎందుకు భరు అన్నట్లుగా ప్రభువులు మాట్లాడారు. రాజుగారు అబద్దం చెప్పరు అని విధేయులు నమ్మినట్లుగా రావుగారి గురించి ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల( ఒకటి రెండు సంఘాలు, వాటి నేతలు మినహా) నేతలు నిజంగానే నమ్మారు. పైరవీలు చేయకపోలేదు, చేసినా ఫలితం ఉండదని తేలిపోయింది. ఆర్‌టిసి కార్మికుల చారిత్రాత్మక సమ్మె సమయంలో అనుసరించిన వైఖరి మీద ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభువులతో కలసి విందారగించి మేము మీ వెంటే అని ఏదో ఒరగబెడతారనే భ్రమలతో వ్రతం చెడినా ఫలం దక్కలేదు.
ఏడాది క్రితం సామాజిక మాధ్యమంలో. సాంప్రదాయక మాధ్యమంలో వచ్చిన వార్తలేమిటి ? ప్రస్తుత పరిస్ధితిల్లో ఉద్యోగులు గతం కంటే ఎక్కువే పెరుగుదల కోరుతున్నారు. అయితే ఆర్ధిక పరిస్ధితి దృష్ట్యా 20శాతానికి మించి ఇచ్చే అవకాశం లేదని అధికారులు అంటున్నారని ఒక లీకు. కాదు, దాదాపు అంతా ఖరారైంది, అధికారిక ప్రకటనే తరువాయి 33శాతం పెంపుదలతో 2020 ప్రారంభం నుంచి అమలు జరుపుతారు, మీ కెంత పెరుగుతుందో చూడండి అంటూ ఇంటర్నెట్‌లో కొన్ని సైట్లలో టేబుల్స్‌ వేసి మరీ ప్రకటించిన తీరు తెన్నులను చూశాము. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమలు పోయి ఏడాది చివరి వరకు కమిషన్‌ గడువునే పొడిగించటంతో హతాశులయ్యారు. కరోనాకు ముందే ఆర్ధిక పరిస్ధితి బాగో లేదని చెప్పిన వారు ఇప్పుడు ఏమి చెబుతారో చూడాల్సి ఉంది.
ఆర్‌టిసి కార్మికులు అనివార్యమై అంతిమ ఆయుధంగా సమ్మెకు దిగారు. అంతకు ముందు వారి యూనియన్లు చేసిన పైరవీలు ఫలించలేదని గ్రహించాలి. పాలక పార్టీలో ముఖ్యమంత్రికి ఇష్టం లేని ఒక వర్గానికి గుర్తింపు ఆర్‌టిసి యూనియన్‌ నేతలతో సంబంధం ఉన్నందున వారి సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించారని, చివరికి తమ సత్తా ఏమిటో చూపి మాతో పెట్టుకుంటే ఇంతే అన్న హెచ్చరికతో సమ్మెను సానుకూలంగా ముగించారనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. సమ్మె ఎలా ముగిసినా కార్మికులు తమ సంఘటిత హక్కు అయిన యూనియన్లను కోల్పోయారన్నది చేదు నిజం. ఉద్యోగ సంఘాలన్నీ ఏకంగా ముఖ్యమంత్రికే విధేయతను ప్రకటించినా ( స్వప్రయోజనాలు తప్ప ) సాధించేదేమీ లేదన్నది తేలిపోయింది. రేపు ప్రభువులకు దయ పుట్టి వచ్చే ఏడాది పిఆర్‌సిని అమలు జరిపినా అది ఎలా ఉంటుందో, ఉద్యోగులు, కార్మికులు ఎంత నష్టపోతారో, ఎంత మేరకు లబ్ది పొందుతారో తెలియదు.
కరోనా వైరస్‌ వలస కార్మికులకు తీరని నష్టం కలిగించటం ఒకటైతే అసలు వారెంత మంది, ఎక్కడ పని చేస్తున్నారో కూడా అధికార యంత్రాంగం దగ్గర వివరాలు లేని స్ధితి స్పష్టమైంది. ఇక వారి హక్కులు, సంక్షేమం, చట్టాల అమలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఉద్యోగులు, కార్మికులే కాదు తెలంగాణాలో పోరాట వారసత్వం ఉందని చెప్పుకొనే జబ్బలు చరిచే యువతరం కూడా నిస్తేజంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసిన పాలకులను నిలదీసి ప్రశ్నించే స్ధితిలో కూడా వారు లేరు. రైతు బంధు తమకూ వర్తింప చేయాలని కౌలు రైతుల నుంచి కూడా ఎలాంటి వత్తిడి లేదు. అస్తిత్వ వాదం పోరాట పటిమను దెబ్బతీస్తుంది. ఐక్యతను విచ్చిన్నం చేస్తుంది. ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలనే దివాలాకోరు, ప్రమాదకర వాదనలను ముందుకు తెస్తుంది. అందరి కోసం ఒక్కరు- ఒక్కరి కోసం అందరూ అనే సమిష్టి భావనలకు జనాన్ని దూరం చేస్తుంది.
వేతన కమిషన్‌ విషయానికి వచ్చే సరికి బీద అరుపులు అరుస్తున్న పాలకులు ఖాళీ ఖజానాతో ఉన్న సచివాలయాన్ని కూల గొట్టి వందల కోట్ల రూపాయలతో కొత్తదాన్ని కట్టేందుకు పూనుకున్నారు.ఇదే పాలకులు కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నా కనీసం పరీక్షలు చేయించేందుకు సైతం ఏర్పాట్లు చేయలేదు. కొత్త సచివాలయం నిర్మిస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో చెప్పామని మంత్రులు దబాయిస్తున్నారు. దానికంటే ముందు 2014నాటి ఎన్నికల ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాటిని ఎందుకు అమలు జరపలేదని ఎవరైనా ప్రశ్నిస్తే బూతులతో సమాధానాలు వస్తున్నాయి. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు పెంపుదల, ఇతర అంశాల గురించి కూడా చెప్పారు. మరి వాటి గురించి ప్రస్తావించరేం ? ప్రయివేటు కార్పొరేట్ల ఆసుపత్రుల దయా దాక్షిణ్యాలకు రోగులను వదలివేశారు. ప్రయివేటు విద్యా, వైద్య సంస్ధలు ప్రభుత్వ నియంత్రణ, నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టా రాజ్యంగా ఉన్నా పట్టించుకొనే వారు లేరు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా చర్యలు తీసుకొనేది అని నిబంధనలు చెబుతున్నారు. ఈ పరిస్ధితులను ప్రశ్నించే తత్వాన్ని మన సమాజం కోల్పోయిందా ?
కార్మికులు, ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలతో పాటు ఆర్ధిక విషయాల మీద కూడా ఉద్యమాలకు దూరంగా ఉంటున్న కారణాల గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నా అంతకు మించి లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది. ప్రపంచంలో నయా ఉదారవాద విధానాలు ముందుకు తెచ్చిన కొన్ని అంశాలు వాటి ప్రభావం కార్మికవర్గం, మొత్తంగా సమాజం మీద ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయో. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపాలోని ధనిక దేశాలలో కొన్ని విశ్లేషణలు చేశారు. అయితే అక్కడి పరిస్ధితికీ మన వంటి దేశాలకూ చాలా తేడా ఉంది. కరోనా కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు తమ పని స్ధలాల నుంచి స్వ గ్రామాలు, చిన్న పట్టణాలకు తిరిగి వెళ్లిపోయారు. దొరికిన పని చేస్తున్నారు లేకపోతే కాళ్లు ముడుచుకు కూర్చుంటున్నారు. అమెరికా లేదా ఇతర ధనిక దేశాల వారికి అలాంటి అవకాశాలు లేవు. పక్కనే ఉన్న మెక్సికో లేదా ఇతర లాటిన్‌ అమెరికా నుంచి వలస వచ్చిన వారు వెళ్లిపోగలరు తప్ప స్ధానికులు ఎక్కడికీ పోలేరు. ఎందుకంటే వారికి నిరుద్యోగం తప్ప ప్రత్నామ్నాయ ఉపాధి అవకాశాలు లేవు.
2018లో అమెరికా ఉపాధి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం కార్మికులు 100 మంది అనుకుంటే సేవారంగాలలో ఉన్న వారు 80.2, ఉత్పాదకరంగంలో 12.8, వ్యవసాయ రంగంలో 1.4, వ్యవసాయేతర స్వయం ఉపాధి రంగంలో 5.6శాతం చొప్పున ఉన్నారు. అదే మన దేశ విషయానికి వస్తే 2019లో వ్యవసాయ రంగంలో 42.39, సేవారంగంలో 32.04, వస్తూత్పత్తిలో 25.58 శాతం ఉన్నారు. పదేండ్ల కాలంలో వ్యవసాయం నుంచి పదిశాతం మంది మిగిలిన రెండు రంగాలకు మారారు. ఈ ధోరణి ఇంకా పెరుగుతోంది. వ్యవసాయం గిట్టుబాటు గాక, దాని మీద భ్రమలు కోల్పోయి సేవా, వస్తూత్పత్తి రంగంలో తమ భవిష్యత్‌ను పరీక్షించుకొనే వారు పెరుగుతున్నారు. సేవా, వస్తూత్పత్తి రంగంలో ప్రవేశించే వారు అపరిమితంగా ఉండటం, వారిలో పోటీని ఆయా రంగాల యాజమాన్యాలు వినియోగించుకొని తక్కువ వేతనాలతో లబ్ది పొందుతున్నాయి. బతకలేకపోతే గ్రామాలకు తిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీ వలన కార్మికవర్గంలో పోరాడే శక్తి తగ్గి, పైరవీలు, పనులు చేయించుకోవాలనే దారులకు మళ్లుతున్నారు.
పశ్చిమ దేశాలలో కొన్ని పరిణామాలు, పరిస్ధితి గురించి చూద్దాం. నయా ఉదారవాద విధానాలు ముందుకు తెచ్చిన ప్రధాన అంశం ప్రపంచీకరణ. దాన్ని ముందుకు తీసుకుపోయే సాధనాలుగా ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ), ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వంటి అంతర్జాతీయ సంస్ధలు ఉన్నాయి. లడఖ్‌లో జూన్‌ 15 రాత్రి లడాయి జరగనంత వరకు చైనా వస్తువుల మీద ఎవరికీ వ్యతిరేకత లేదు. టిక్‌టాక్‌లు, ఇతర చైనా యాప్‌లు మన దేశ భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించలేదు. చిత్రం ఏమిటంటే అవి ఒక్క మన దేశానికి ముప్పు తెచ్చేందుకు మాత్రమే తయారు చేయలేదు, మిగతా ప్రపంచమంతా వాటిని వినియోగిస్తూనే ఉంది, తమ భద్రతకు ముప్పు తెస్తున్నాయని ఎలాంటి నిషేధాలు విధించలేదు.
చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకొనే వాటిలో మన కంటే అభివృద్ధి చెందిన దేశాలు ముందు పీఠీన ఉన్నాయి. వాటి పర్యవసానాల గురించి తెలియకుండానే ఆయా దేశాలు దిగుమతులు చేసుకుంటున్నాయా ? ఎవరైనా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే !
ఉదాహరణకు ఫ్రాన్సు పరిణామాన్ని చూద్దాం.1994-2014 మధ్య చైనా, తూర్పు ఐరోపా సహా తక్కువ వేతనాలు ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్న గృహౌపకరణాలు మూడు రెట్లు పెరిగాయి. వాటి ధరలు తక్కువగా ఉన్నందున ఏటా ద్రవ్యోల్బణం 0.17శాతం తగ్గింది. ఆ మేరకు వినియోగదారులకు ధరలూ తగ్గాయి. దిగుమతుల కారణంగా దేశీయ ఉత్పత్తి దారులు పోటీలో నిలిచేందుకు తమ ఉత్పత్తుల ధరలనూ తగ్గించటం లేదా తగ్గేందుకు అనువైన చర్యలూ తీసుకోవాల్సి వచ్చింది. మొత్తంగా దిగుమతి చేసుకున్న ఉపకరణాలు 10 నుంచి 17శాతానికి పెరిగితే వీటిలో తక్కువ వేతనాలున్న దేశాల నుంచి పెరిగినవే 2 నుంచి ఏడుశాతం ఉన్నాయి. ప్రపంచ వ్యాపితంగా ధనిక దేశాల నుంచి దిగుమతుల శాతం 76 నుంచి 58కి తగ్గితే చైనా నుంచి 7 నుంచి 21శాతానికి పెరిగాయి.దిగుమతి వస్తువులు చౌకగా లభిస్తున్న కారణంగా 1994-2014 మధ్య వినియోగదారులకు కనీసంగా ఏడాదికి వెయ్యి యూరోల చొప్పున ఆదా అయినట్లు ఒక అంచనా.
అమెరికా విషయానికి వస్తే 1997-2006 మధ్య 325 వస్తూత్పత్తి పరిశ్రమలకు సంబంధించి విశ్లేషణ చేశారు. తక్కువ వేతనాలున్న దేశాల నుంచి అదే వస్తువుల దిగుమతి ఒక శాతం పెరిగితే అమెరికాలో తయారయ్యే వస్తువుల ధరలు రెండు నుంచి మూడుశాతం తగ్గినట్లు తేలింది. ఆమేరకు రెండు శాతం ద్రవ్యోల్బణం, ధరలూ తగ్గాయి. దీని వలన ద్రవ్యోల్బణం-ధరలతో లంకె ఉన్న వేతనాల పెరుగుదల భారం యజమానులకు తగ్గుతుంది. వారి లాభాల్లో ఎలాంటి తరుగుదల ఉండటం లేదు కనుకనే చైనా తదితర దేశాల నుంచి దిగుమతులను గణనీయంగా పెంచారు. అయితే కొంత కాలానికి అది సాధారణ పరిస్ధితిగా మారినపుడు ఉపాధి, వేతనాలు, ఆదాయాల తగ్గుదలతో జనాల్లో ఆందోళన తలెత్తితే, లాభాల కోసం స్ధానిక ఉత్పత్తిదారుల నుంచి వత్తిడి పెరుగుతుంది. అన్నింటికీ మించి ప్రపంచ మీద పెత్తనం చెలాయించే అమెరికన్లు ఇతర దేశాల మీద అంతకంతకూ ఎక్కువగా ఆధారపడాల్సి వస్తే పెత్తనానికే ముప్పు అని భావించి ధరలు ఎక్కువైనా తమ వస్తువులను చైనా వంటి దేశాలు కూడా దిగుమతులు చేసుకోవాలని లేదా సబ్సిడీలను అనుమతించాలంటూ వాణిజ్య యుద్ధాలకు దిగుతున్నారు.
మన దేశంలో కార్మికవర్గం, ఉద్యోగులు, ఇతర తరగతుల మీద విదేశాల నుంచి దిగుమతి అవుతున్న చౌక ధరల వస్తువుల ప్రభావం తక్కువగా లేదు. మనకు తెలియకుండానే వాటి పట్ల మొగ్గుచూపుతున్నాం. దీనికి మన దేశంలో అంతటి నాణ్యత కలిగిన వస్తువులను అంత తక్కువ ధరలకు అందచేసే పరిస్దితి లేకపోవటం ఒక ప్రధాన కారణం. వినియోగ వస్తువుల ధరలు తగ్గినపుడు వేతనాల మీద ఆధారపడే వారు వేతనాలు తక్కువగా ఉన్నా సర్దుకు పోయే పరిస్దితి ఉన్నపుడు ఆందోళన బాట పట్టేందుకు సముఖత చూపరు. అది కొంత కాలానికి సాధారణ పరిస్ధితిగా మారినపుడు సమస్యలు తిరిగి ముందుకు వస్తాయి. ఉదాహరణకు పెద్ద పట్టణాలలో బడా సంస్దలు కూరగాయల నుంచి వినియోగ వస్తువులన్నింటినీ గొలుసు కట్టు దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. వీటి యజమానులు ఉత్పాదకుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న కారణంగా మధ్యలో ఉండే పంపిణీదారులు, టోకు వ్యాపారులు పొందే లాభాల్లో కొంత మొత్తాన్ని నేరుగా వినియోగదారులకు అందచేస్తుండటంతో చిన్న దుకాణాలతో పోలిస్తే అక్కడ ధరలు తక్కువగా ఉంటున్నాయి. దీని వలన మిగిలిన మొత్తాలతో వినియోగదారులు అదనంగా వస్తువులను కొనుగోలు చేసేందుకు అలవాటు పడతారు. కొంత కాలం గడిచాక ఒక తరహా జీవన విధానానికి అలవాటు పడిన తరువాత అది సాధారణం అవుతుంది. అప్పుడు సమస్యలు ప్రారంభం అవుతాయి. పాలకుల మీద, నయా ఉదారవాద విధానాల మీద భ్రమలు తొలుగుతాయి. పని చేయించుకోవటాలు సాధ్యం కాదు. మన స్వాతంత్య్ర ఉద్యమం తొలుత బ్రిటీష్‌ వారికి వినతులతోనే ప్రారంభమైంది. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంతో సహా ప్రతి ఉద్యమం అలాగే ప్రారంభమైంది. అనివార్యమై తరువాత పోరాట రూపాలను సంతరించుకున్నాయి.
పాలకవర్గాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతున్నాయంటే దాని అర్ధం కార్మికవర్గానికి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి సరిపెట్టేందుకే తప్ప అదనం కాదని గ్రహించాలి. అది కార్మికుల్లో భ్రమలు పెరగటానికి దారి తీస్తుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదాహరణకు అమెరికాలో 1954లో 35శాతం మంది కార్మికులు యూనియన్లలో చేరారు. 2018లో వారి శాతం 10.5శాతానికి పడిపోయింది. కాంట్రాక్టు విధానం పెరిగిన కొద్దీ యూనియన్లతో పని ఉండదు. వారి బేరమాడే శక్తి తగ్గిపోతుంది. అది సాధారణ పరిస్ధితిగా మారినపుడు తలెత్తే సమస్యలతో పాలకులు, వ్యవస్ధ మీద భ్రమలు తొలుగుతాయి. ఈ కారణంగానే అమెరికాలో ఇప్పుడు అలాంటి పరిణామాలను చూడవచ్చు. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని భావిస్తున్న యువత సోషలిజం గురించి ఆసక్తిని ప్రదర్శించటం రోజు రోజుకూ పెరుగుతోంది. అది కోల్పోయిన పోరాటశక్తిని రగులుస్తుంది. అస్తిత్వభావాలను దూరం చేస్తుంది ! దీనికి అతీతంగా మన దేశం, రాష్ట్రం ఎలా ఉంటాయి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అజిత్‌ దోవల్‌ జేమ్స్‌ బాండూ కాదు – మోడీకి చైనా భయపడిందీ లేదు !

18 Saturday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

2020 China–India skirmishes, Ajith Doval, India-China border stand off, India-China disengagement


ఎం కోటేశ్వరరావు
విచారకరమైన లడఖ్‌ ఉదంతం తరువాత భారత్‌ – చైనా దేశాల మధ్య సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చారు, ఇంకా కొనసాగుతున్నాయి. అంగీకరించిన మేరకు ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నదీ లేనిదీ వెంటనే నిర్ధారించటం సాధ్యం కాదని పరిశీలకులు చెబుతున్నారు. రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ లడఖ్‌ పర్యటనకు వెళ్లారు. ఇరు పక్షాలూ వెనక్కు తగ్గాలనే ఒప్పందం పూర్తిగా అమలు కాలేదు. పరస్పరం నమ్మకం కలిగేంతవరకు అది పూర్తి కాదు, దశలవారీ జరుగుతుంది. అయితే ఈలోపలే సామాజిక మీడియాలో చైనా భయపడిందనీ, భవిష్యత్‌లో దాడులు చేయబోమని వాగ్దానం చేసిందని, మోడీతో మాట్లాడాలని జింపింగ్‌ కోరితే తిరస్కరించారని ఇంకా ఏవేవో అబద్దాల ఫ్యాక్టరీల కట్టుకధల ఉత్పత్తులను జనానికి చేరవేస్తున్నారు. వాటి రచయితలు లేదా ఫలానా సంస్ధ ఆ విషయాలు చెబుతోందని గానీ లేదా ఆధారం ఫలానా అని గాని ఉండదు. బుర్రకు పని పెట్టకుండా వినేవారు చెవులప్పగిస్తే చెప్పేవారు హిమాలయాలంత అబద్దాన్ని కూడా ఎక్కించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నంలో భాగం వదలిన సొల్లు కబుర్లతో కూడిన ఒక అనామక ఆంగ్ల పోస్టు గురించి చూడమని ఒక పాఠకుడు పంపారు. దానిలో ఏముందో చెప్పకుండా కేవలం విమర్శలను మాత్రమే వెల్లడిస్తే, ఏకపక్షంగా చర్చిస్తే చదువరులను ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. అలాంటి వాటి బండారాన్ని బయట పెట్టకపోతే నిజమే అని నమ్మే అవకాశం ఉంది. ఆంగ్లంలో ఉన్న దాని అనువాదాన్ని, బండారాన్ని చూద్దాం.సదరు పోస్టు దిగువ విధంగా ఉంది.
” వెల్లడైన గొప్ప రహస్యము
లడఖ్‌ నుంచి చైనా ఎందుకు ఉపసంహరించుకుంది ? పెద్ద యుద్దాన్ని మోడీ గారు వాయిదా వేశారు, లేనట్లయితే పాకిస్ధాన్‌ మరియు చైనా యుద్దానికి భారీ సన్నాహాలు చేసేవి- మొత్తం కుట్ర వివరాలు తెలుసుకోవాలని ఉందా ? జూలై ఐదవ తేదీకి పెద్ద ప్రాధాన్యత ఉంది, ఎందుకంటే చైనా, పాకిస్ధాన్‌, మరియు ఇరాన్‌ కూటమి భారత్‌ మీద దాడి చేసేందుకు పూర్తి సన్నాహాలు చేశాయి. ఒకేసారి దాడి చేయాలన్న విధానం ప్రకారం ఆ తేదీని ఖరారు చేశారు, దాని ప్రకారం పాకిస్ధాన్‌ సైన్యం కాశ్మీర్‌ మీద దాడి చేయాల్సి ఉంది. పాక్‌ సైన్యానికి సాయం చేసేందుకు చైనా సైనికులు పాకిస్ధాన్‌ చేరారు.అయితే భారత గూఢచార సంస్ధ( రా ) మరియు సిఐఏ మరియు మొసాద్‌లు ఈ దాడి గురించి పూర్తిగా తెలుసుకున్నాయి.
కనుక భారత సైన్యం కూడా పూర్తి సన్నాహాలను చేసింది. కనుకనే జూలై ఐదవ తేదీకి ముందే మోడీ లడఖ్‌ చేరుకొని సైన్యానికి పూర్తి స్వేచ్చ నిచ్చారు మరియు చైనాను భయపెట్టారు.ఎలాంటి చర్యలు జరగక ముందే జూలై ఐదవ తేదీ తెల్లవారు ఝామునే ఇరాన్‌ మీద ఇజ్రాయెల్‌ మెరుపుదాడి చేసి తనకు ముప్పు అనుకున్న ఇరాన్‌ వద్ద ఉన్న అన్ని ఆయుధాలను నాశనం చేసింది. ఈ దాడి కూడా మోడీ దౌత్యం కారణంగానే జరిగింది.మరోవైపు పాక్‌ మిలిటరీ అధికారులు కాశ్మీర్‌ మీద దాడి చేసేందుకు నిరాకరించారు, ఎందుకంటే భారత జలాంతర్గాములు కరాచీ సమీపానికి చేరుకున్నాయి మరియు దాడి చేసినట్లయితే అనేక వైపుల నుంచి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్ధాన్‌కు తెలియచేశారు, దీన్ని పాకిస్ధాన్‌ ఏ మాత్రం అంచనా వేయలేదు.
మోడీ అప్పటికే అన్ని అగ్రరాజ్యాలను విశ్వాసంలోకి తీసుకున్నారు. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా,రష్యా అన్నీ మోడీకి బాసటగా నిలిచాయి. అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ద నావను సిద్దంగా ఉంచింది. కంగారులో ఉన్న చైనా సంప్రదించేందుకు ప్రయత్నించింది. ఈ సారి సంప్రదింపుల బాధ్యతను అజిత్‌ దోవల్‌ (ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు) తీసుకున్నారు. మోడీతో మాట్లాడాలని గ్జీ జింపింగ్‌ కోరారు. మాట్లాడేందుకు మోడీ తిరస్కరించారు. అందువల్లనే చైనా విదేశాంగ మంత్రి అజిత్‌ దోవల్‌తో మాట్లాడాల్సి వచ్చింది. దోవల్‌ స్ధాయి విదేశాంగ మంత్రి కంటే తక్కువ, భూతం వంటి ఈ అవమానాన్ని చైనా దిగమింగక తప్పలేదు. చైనా, ఇరాన్‌, పాకిస్ధాన్‌ ఉమ్మడిగా జూలై ఐదున తలపెట్టిన దాడి పధకాన్ని చైనా విదేశాంగ మంత్రికి అజిత్‌ దోవల్‌ అందచేశారు. అది చైనాను కలవరపరచింది, హిందీ భాయి భాయి అనేదాకా తీసుకు వచ్చింది, తన సైన్యాన్ని వెనక్కు తీసుకొనేందుకు అంగీకరించాల్సి వచ్చింది, భవిష్యత్‌లో దాడి చేయబోమని వాగ్దానం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చైనా మీద పాక్‌ సైన్యం ఆగ్రహంతో ఉంది, ఎందుకంటే అది పాకిస్ధాన్‌ను వంటరిగా వదిలేసి పోతున్నది. మనం చైనాతో ఉద్రిక్తతలను తగ్గించినందుకు భారత్‌లోని ప్రతిపక్ష పార్టీ ఆగ్రహంతో ఉంది.
మనం యుద్దానికి ఎందుకు వెళ్లలేదు ? బహుశా కొన్ని తెలివి తక్కువ భారత ప్రతిపక్ష పార్టీలు ఒక వేళ యుద్దం జరిగితే, అదే చైనా దాడి కేవలం మోడీ మీదే కాదు యావత్‌ భారత్‌ మీద, భారతీయుల మీద ఉంటుందని మరచిపోయి ఉండవచ్చు. అలాంటి మనుషులకు మరియు దేశం వ్యతిరేకులకు(దేశభక్తి లేని జనం) దేవుడు జ్ఞానం ప్రసాదించాలి.
మోడీ గనుక విదేశాలకు వెళ్లి అగ్రరాజ్యాలతో స్నేహబంధం కుదుర్చుకోనట్లయితే భారత సైన్యాన్ని సాయుధులను గావించనట్లయితే నేడు భారత్‌లోని అనేక నగరాలు, సరిహద్దులలో బాంబుల మోతలు బుల్లెట్ల శబ్దాలు మోగుతూ ఉండి ఉండేవి. మన ప్రధాని మంచి తనానికి కృతజ్ఞతలు, ఆయన దౌత్యం కారణంగా నేడు మనం చైనా, ఇరాన్‌, పాకిస్ధాన్‌లతో ఐక్యంగా పోరాడటంలో విజయవంతమై వారిని వెనక్కు గొట్టాము.”
పగటి కలలా -వాస్తవాలు ఏమిటి?
నరేంద్రమోడీ వ్యక్తి పూజలో భాగంగా, మూఢ భక్తులు, అమాయక జనాన్ని నమ్మించేందుకు ఇలాంటి పోసుకోలు కబుర్ల సృష్టికి వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో పెద్ద అబద్దాల ఫ్యాక్టరీలు, వాటిలో కిరాయి రాతగాళ్లు వాటిని జనానికి పంచేందుకు కొన్ని వెబ్‌సైట్లు, వాట్సాప్‌ గ్రూపులూ ఉన్నాయి. ఊరూ పేరు, ఆధారాలు లేని రాతలను వారు రాస్తుంటారు. అబద్దం అయితే అచ్చుకాదు కదా అనే అమాయకులు ఇంకా ఉన్నారు. అన్నింటి కంటే జనాలకు జ్ఞాపకశక్తి ఉండదు గనుక ఏమి చెప్పినా నడుస్తుందనే గట్టినమ్మకం, ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని బాగా వంట బట్టించుకున్నారు గనుక ఇలాంటి ఆధారం లేని రాతలతో జనం బుర్రలను నింపేందుకు పూనుకున్నారు.
పైన పేర్కొన్న పోస్టు పచ్చి అబద్దం అనేందుకు ఒక పక్కా నిదర్శనం ఏమంటే ఇరాన్‌ మన మిత్ర దేశం, ఏ నాడూ ఇరాన్‌ గురించి నరేంద్రమోడీ గానీ మరొకరు గానీ చైనా, పాకిస్ధాన్‌తో కలసి మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నదని ఎన్నడూ చెప్పలేదు. మనం విదేశీమారక ద్రవ్య చెల్లింపుల ఇబ్బందుల్లో ఉన్నపుడు రూపాయలు తీసుకొని, వాయిదాల పద్దతిలో మనకు చమురు అమ్మిన దేశం. ప్రలోభాలు, వత్తిడికి లొంగిపోయి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసి అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాము. ఆదేశంతో కుదుర్చుకున్న రైలు మార్గ నిర్మాణ పధకాన్ని వదులుకున్నాము. అయినా ఇరాన్‌ మనతో సఖ్యతగానే ఉంటున్నది. అలాంటి దేశం మన మీద దాడికి ప్రయత్నించిందని, దాన్ని వమ్ముచేశామని చెప్పటం అమెరికా, ఇజ్రాయెల్‌ గూఢచార సంస్ధల కట్టుకధలను ప్రచారం చేయటం తప్ప మరొకటి కాదు. ఆ అబద్దాల పరంపరలోనే మోడీ దౌత్యం కారణంగా ఇజ్రాయెల్‌ మెరుపుదాడి చేసి ఇరాన్‌ ఆయుధాలన్నింటినీ నాశనం చేసిందనే అభూత కల్పనను ముందుకు తెచ్చారు. నిజానికి అంతటి తీవ్ర దాడి చేసినట్లు ఏ పత్రిక లేదా మీడియా గానీ వార్తలు ఇవ్వలేదు. జూలై ఐదవ తేదీన ఇరాన్‌లోని ఒక అణువిద్యుత్‌ కేంద్రంలో పేలుడు సంభవించిందనే చిన్న వార్త తప్ప మరొకటి లేదు.
దక్షిణ చైనా సముద్రంలో మనకు మద్దతుగా అమెరికా ఒక యుద్ద నౌకను సిద్ధంగా ఉంచిందని సదరు కథనంలో పేర్కొన్నారు.రాసిన వారికి కనీస వివరాలు కూడా తెలియదని ఇది తెలియ చేస్తోంది. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారమే మూడు విమానవాహక నౌకలతో పాటు నాలుగు ఇతర యుద్ద నౌకలు అక్కడ తిష్టవేశాయి. అవన్నీ మనకోసమే అని, నరేంద్రమోడీకి లేని గొప్పతనాన్ని ఆపాదించటం తప్ప వాస్తవం కాదు. లడఖ్‌ ఉదంతం జూన్‌ 15న జరిగితే కొన్ని నౌకలు అంతకు ముందే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దారిలో ఉన్నవి తరువాత చేరాయి, అవి కూడా అంతర్జాతీయ జలాల్లో తిష్టవేశాయి తప్ప చైనా సమీపంలో కాదు. అగ్రరాజ్యాలన్నీ మోడీకి మద్దతు ఇచ్చాయని, మోడీ కారణంగానే ఇరాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడి జరిపిందని చెప్పటం చూస్తే మన జనాన్ని ఎంత అమాయకులని ఆ రాతగాళ్లు భావిస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు.
ఇక చైనా భయపడిందని చెప్పటాన్ని చూస్తే అలాంటి పిచ్చి ఊహలు, విషయాలు నవ్వు తెప్పిస్తున్నాయి. చైనా మిలిటరీ అమెరికా బెదిరింపులనే ఖాతరు చేయటం లేదు, దాని కంటే బలహీనమైన మన మిలిటరీ గురించి భయపడుతున్నదని, భవిష్యత్‌లో దాడి చేయబోమని వాగ్దానం చేసిందని చెప్పటం అతిశయోక్తి, జనాల చెవుల్లో పూలు పెట్టటమే. వాటిని నమ్మటం అమాయకత్వం.
తాజాగా సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యాలు వెనక్కు తగ్గటం గురించి అనేక విషయాలు, అస్పష్టమైన సమాచారం మాత్రమే మీడియాలో వస్తున్నది. మీరూ వెనక్కు తగ్గండి-మేమూ వెనక్కు తగ్గుతాం, రెండు దేశాల వాస్తవాధీన రేఖకు అటూ ఇటూ రేండేసి కిలోమీటర్ల వెడల్పున తటస్ధ ప్రాంతాన్ని ఏర్పాటు చేద్దామని, ఆ మేరకు వెనక్కు తగ్గుదామని అంగీకరించినట్లు వార్తలు తెలుపుతున్నాయి. బిజెపి నేతలు లేదా వారి పాకేజ్‌లతో బతికే మీడియా, కొంత మంది వ్యాఖ్యాతలు ఏమి చెబుతున్నారో వినండి, అదే సమయంలో భిన్న గళాలను కూడా గమనంలోకి తీసుకున్నపుడే వాస్తవాలేమిటో ఎవరికైనా అవగతం అవుతుంది. మన దేశంలో మిలిటరీ, వ్యూహాల గురించి రాస్తున్న ప్రముఖుల్లో ఒకరు బ్రహ్మ చెలానే. ఆయన రాసిన వాటన్నింటితో ఏకీభవించాలని లేదు తిరస్కరించాలని లేదు. తాజాగా సరిహద్దుల్లో భారత్‌-చైనాల మిలిటరీ వెనక్కు తగ్గటం గురించి ఆయన అనేక అంశాలు రాశారు, ట్వీట్లు చేశారు. వాటిలో ఇలా పేర్కొన్నారు ” 2020లో వెనక్కు తగ్గటం -2017లో డోక్లాంలో వెనక్కు తగ్గిన – మాదిరే అయితే వ్యూహాత్మక స్ధాయిలో చైనా విజయం సాధించటానికి అనుమతించినట్లే. పరువు దక్కిందని భారత్‌ తృప్తి పడటమే. తదుపరి చైనా దురాక్రమణ దారుణంగా ఉంటుంది. పోరాడ కుండా విజయం సాధించటం అనే సన్‌ జు పద్దతిలో ఒక్క తూటాను కూడా కాల్చకుండా 2017లో వ్యూహాత్మకమైన డోక్లాం పీఠభూమిని చైనా పట్టుకుంది. 2017లో చైనాను సులభంగా వదలి పెట్టటం ద్వారా ప్రస్తుత చైనా బహుముఖ దురాక్రమణను భారత్‌ ఆహ్వానించింది. డోక్లాం తమదని చెప్పిన భూటాన్‌ దాన్ని ఎలా కోల్పోయిందో నేను 2018లో రాసిన దానిలో పేర్కొన్నాను.”
” పోరు లేకుండానే చైనా విజయం సాధించవచ్చు ” అనే శీర్షికతో అదే బ్రహ్మ చెలానే హిందూ స్తాన్‌ టైమ్స్‌ జూలై తొమ్మిదవ తేదీ సంచికలో ఒక విశ్లేషణ రాశారు. డోక్లాం మాదిరి వెనక్కు తగ్గటం అంటే చైనాను స్పష్టమైన విజేతను కావించినట్లే అని పేర్కొన్నారు. భారత్‌ కోరినట్లుగా వివాదానికి పూర్వపు స్ధితి నెలకొనే అవకాశం సుదూరంగా ఉంది. తాత్కాలికమే అయినా తటస్ధ ప్రాంత ఏర్పాటుకు భారత్‌ అంగీకరించటం అంటే అది చైనాకు అనుకూలమైనది, తనది అని కొత్తగా చెబుతున్న గాల్వాన్‌ లోయ నుంచి భారత్‌ను చైనా బయటకు పంపుతున్నది. పది మైళ్లు ముందుకు – ఆరు మైళ్లు వెనక్కు అన్న వ్యూహాన్ని చైనా అనుసరిస్తున్నది అని చెలానే పేర్కొన్నారు. చైనా మూడడుగులు ముందుకు వేసి రెండడుగులు వెనక్కు తగ్గే ఎత్తుగడను అనుసరిస్తున్నదని, పరస్పరం వెనక్కు తగ్గాలనే ఒప్పందంతో భారత్‌ మరికొంత ప్రాంతాన్ని కోల్పోతున్నదని బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది.
ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ మాజీ సంపాదకుడు, బిజెపి వ్యూహకర్త అయిన శేషాద్రి చారి జూలై 16వ తేదీన దక్కన్‌ హెరాల్డ్‌ పత్రికలో ” తటస్ధ ప్రాంతమా లేక నూతన వాస్తవాధీన రేఖా ? ” అనే శీర్షికతో మణిపాల్‌ విద్యా సంస్ధ ప్రొఫెసర్‌ అరవింద కుమార్‌తో కలసి సంయుక్తంగా రాసిన వ్యాసంలో ఆసక్తికరమైన అంశాలు పేర్కొన్నారు. ” ఉనికిలో లేని నూతన తటస్ధ ప్రాంతాలను అంగీకరించటమంటే వాస్తవాధీన రేఖ గురించి భారత దృష్టిలో పెనుమార్పు వచ్చినట్లు కనిపించటాన్ని కాదనలేము.రెండు సైన్యాలూ నోరు విప్పటం లేదు. అలాగే ఢిల్లీ, బీజింగ్‌ రాజకీయ వ్యవస్ధలు కూడా అలాగే ఉన్నాయి. వారి అగ్రనేత తన పౌరులకు జవాబుదారీ కాదు కనుక చైనా వైపు నిశ్శబ్దం, అస్పష్టతలను అర్ధం చేసుకోవచ్చు.భారత వైపు చూస్తే మిలిటరీ రహస్యం అనే ముసుగు కప్పుకున్నందున సమాచారం బయటకు రావటం లేదు, ఇది కూడా అర్ధం చేసుకో దగినదే ( ఆహా ఏమి కుతర్కం ! తాము చేసేది సంసారం, అదే ఎదుటి వారు చేస్తే వ్యభిచారం-చైనా వారికి మిలిటరీ రహస్యాలు ఉండవా ?) తటస్ధ ప్రాంతాలు వాస్తవాధీన రేఖ వెంట నూతన యథాతధ స్ధితిగా మారనున్నాయా అన్నది పెద్ద భయం. అది భారత భద్రతకు పూర్తి ముప్పుగా మారుతుంది. ముఖ్యమైన విషయం ఏమంటే వాస్తవంగా వెనక్కు తగ్గటం గురించి తనిఖీ లేదు. ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నందున ఉపసంహరణ సమస్య ఉత్పన్నం కాదు. ఇంకా, ఒక వేళ రెండు సైన్యాలు సరిహద్దులో కొన్ని ప్రాంతాలు, పోస్టుల వద్ద మోహరిస్తే వాటిని నూతన వాస్తవాధీన రేఖగా భాష్యం చెప్పవచ్చు. పరిస్ధితి చక్కబడి, సాధారణ పరిస్ధితులు తిరిగి నెలకొంటేనే విషయాలు తెలుస్తాయి.”
పైదాని అర్ధం ఏమిటి ? భారత్‌కు చైనా లొంగిపోయినట్లా , మోడీకి జింపింగ్‌ భయపడినట్లా ? జూలై 18వ తేదీ హిందూ పత్రికలో భద్రతా సంస్ధల నుంచి సేకరించిన సమాచారంతో రాసిన వార్త మరింత ఆసక్తికరంగా ఉంది. పెట్రోలింగ్‌ పాయింట్‌ (పిపి)15 వద్ద భారత్‌ వైపు ఒక దశలో చైనీయులు 5కిలోమీటర్ల వరకు మేనెలలో చొచ్చుకొని వచ్చారు. వెనక్కు తగ్గాలనే ప్రణాళిక ప్రకారం చైనీయులు రెండున్నర కిలోమీటర్లు వెనక్కు తగ్గారు,తరువాత ఒక కిలోమీటరు తగ్గారు, ఇంకా ఒకటిన్నర కిలోమీటర్లు వెనక్కు పోవాల్సి ఉంది. ఈ ప్రాంతంలో భారత సైన్యం కూడా రెండున్నర కిలోమీటర్లు వెనక్కు తగ్గాలి. మన మిలిటరీ అధికారులు చెప్పారని రాసినదాని ప్రకారం ఐదు కిలోమీటర్ల వరకు చైనీయులు చొచ్చుకు వచ్చిన వారు ఇప్పటి వరకు మూడున్నర కిలోమీటర్లు వెనక్కు తగ్గారు, ఇంకా ఒకటిన్నర తగ్గాల్సి ఉంది. అది కూడా పూర్తయితే మేనెలకు ముందున్న పూర్వపు స్ధితిలో చైనీయులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు, మనం మాత్రం రెండున్నర కిలోమీటర్లు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది.
భూటాన్‌ – చైనా సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో 2017లో మన సైన్యం చైనాను నిలువరించిందని, గొప్పవిజయం సాధించినట్లు సామాజిక మాధ్యమంలో ఇప్పటికీ వర్ణించేవారు ఉన్నారు. అమెరికాకు చెందిన వార్‌ఆన్‌ రాక్స్‌డాట్‌కామ్‌ 2018 జూన్‌ ఏడున ఒక విశ్లేషణ చేసింది. దానికి ” ఒక ఏడాది తరువాత డోక్లాం : హిమాలయాల్లో చైనా సుదీర్ఘ క్రీడ ” అని శీర్షిక పెట్టింది. ” వారాల తరబడి సంప్రదింపులు జరిపిన తరువాత తమ దళాలను తమ పూర్వపు స్ధానాలకు ఉపసంహరించుకొనేందుకు ఢిల్లీ మరియు బీజింగ్‌ అంగీకరించాయి. తన ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు చెబుతూ చైనా కన్నుగీటింది. అయినప్పటికీ అప్పటి నుంచి చైనా ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తన దళాలను మోహరించింది మరియు నూతన ప్రాధమిక సదుపాయాలను నిర్మించింది. వివాదాస్పద ప్రాంతంలో మెల్లగా, స్ధిరంగా పైచేయి సాధిస్తోంది. ఆ సంక్షోభానికి ఏడాది నిండవస్తున్నది, ఈ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు భారత్‌ లేదా భూటాన్‌ రంగంలోకి దిగలేదు.” అని దానిలో పేర్కొన్నది.
దేశంలో దేశభక్తి, మన ప్రయోజనాలను కాపాడుకోవాలనే విషయంలో అలాంటి పూర్వ చరిత్రలేని సంఘపరివార్‌ దాని అనుబంధ బిజెపి వంటి సంస్ధల నుంచి కమ్యూనిస్టులు గానీ మరొకరు గానీ నేర్చుకోవాల్సిందేమీ లేదు. ఇరుగు పొరుగుదేశాలతో సఖ్యతగా ఉండాలని, సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనే కమ్యూనిస్టులతో సహా అందరూ చెబుతున్నారు. దొంగ దేశభక్తిని ప్రదర్శించేందుకు, ఆపేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వీధులకు ఎక్కటం లేదు.చేదు నిజాలను ప్రశ్నించిన వారిని, చర్చించిన వారిని దేశ ద్రోహులుగా చిత్రించి దాడులు చేస్తున్నారు. రెండోవైపు తమ నేతలకు లేని గొప్పలను ఆపాదిస్తూ ,చవకబారు కథనాలతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలను బయటకు రాకుండా మూసిపెడుతున్నారు. వాస్తవాలను చర్చించేవారా ? మూసి పెట్టి అవాస్తవాలను ప్రచారం చేసే వారా ? ఎవరు దేశభక్తులు ? తప్పుడు, వక్రీకరణలతో కూడిన సమాచారాన్ని జనం మెదళ్లలో నింపి ఎంతకాలం మోసం చేస్తారు ? నరేంద్రమోడీకి చైనా, జింపింగ్‌ భయపడ్డారు అని చెబితే దేశభక్తులు, అలాంటిదేమీ లేదని చెబితే దేశద్రోహులౌతారా ? దేశ భక్తికి ప్రమాణాలు ఏమిటి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత : అమెరికా-చైనా యుద్దానికి దారి తీస్తుందా !

14 Tuesday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#South China Sea, Mike Pompeo, south china sea conflict, War Drills In South China Sea


ఎం కోటేశ్వరరావు
దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్చా రాకపోకల పేరుతో అమెరికా యుద్ధానికి తలపడుతుందా? అమెరికా నౌకా దళాన్ని ఎదుర్కొనేందుకు చైనా అనివార్యంగా సాయుధ సమీకరణకు పూనుకోవాల్సి వస్తోందా ? ఇది ఏ కొత్త పరిణామాలకు నాంది కానుంది ? భారత్‌కు మద్దతుగా అమెరికా సైనిక బలగాలను తరలించిందా ? ఆ ప్రాంతంలో తలెత్తిన పరిణామాల ఫలితంగా వెలువడుతున్న అనేక ఊహాగానాలలో ఇవి కొన్ని మాత్రమే.
అమెరికాకు అగ్రాధిపత్యం అన్నది డోనాల్డ్‌ ట్రంప్‌ నినాదం. నవంబరులో ఎన్నికలంటూ జరిగితే తనకే అధికార పీఠం మరోసారి దక్కాలని కోరుతున్న ట్రంప్‌ ఓట్లకోసమే ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ రోజు రోజుకూ మరింతగా అమెరికాను చుట్టుముడుతోంది. మిన్నువిరిగి మీద పడ్డా తాను ముఖతొడుగు ధరించేది లేదని ఇన్నాళ్లూ భీష్మించుకున్న ట్రంప్‌ ఆపని కూడా చేసి జనాల కళ్లు కప్పేందుకు పూనుకున్నారు. దక్షిణ చైనా సముద్రం, ఆ ప్రాంతంలో ఉన్న సంపదలన్నీ తనవే అని చైనా బెదిరింపులకు దిగిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఈనెల పదమూడవ తేదీన ఒక ప్రకటనలో ఆరోపించాడు. తన తీరం నుంచి పన్నెండు నాటికల్‌ మైళ్లు(22కిలోమీటర్లు) దూరానికి ఆవల ఉన్నవాటి మీద అధికారం తనదే అని చైనా అంటే కుదరదని, మలేషియాకు దగ్గరగా చైనాకు 1,852 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేమ్స్‌ షావోల్‌ వంటి ప్రాంతాలు కూడా తనవే అని చైనా అంటోందని పాంపియో ఆరోపించాడు.
వాస్తవాలను, సముద్ర అంతర్జాతీయ చట్టాలను అమెరికా వక్రీకరిస్తోందని, పరిస్దితిని బూతద్దంలో చూపుతోందని చైనా విమర్శించింది. ఆ ప్రాంత దేశాలతో వివాదాలను నేరుగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనేందుకు చైనా సిద్దంగా ఉన్నదని, వాటిలో అమెరికా లేదని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్రంలో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని తెలిపింది.
ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ ఆ ప్రాంత దేశాల ప్రయోజనాల పేరుతో అమెరికా తన యుద్ద నావలను దక్షిణ చైనా సముద్రంలోకి దింపి రెచ్చగొట్టేందుకు పూనుకుంది. దాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా తన ప్రయత్నాలను తాను చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికాకు చెందిన అణుశక్తితో పనిచేసే రెండు విమాన వాహక యుద్ద నౌకలు ఉన్నాయి. మూడవది దారిలో ఉంది. ఇవిగాక నాలుగు యుద్ద నౌకలు పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఆ సముద్రంలోని పార్సెల్‌, స్పార్టలే దీవుల ప్రాంతంలో చైనా కృత్రిమ దీవులను నిర్మించి తరచూ పెద్ద ఎత్తున తన నౌకా దళ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలో తమ మిత్రదేశాల నౌకలు స్వేచ్చగా తిరిగేందుకు మద్దతుగా, ప్రాంతీయ భద్రత కోసమే తమ యుద్ద నౌకలు ఉన్నాయి తప్ప వేరే కాదని అమెరికా చెప్పుకుంటోంది. అమెరికా విమానవాహక, ఇతర యుద్ద నౌకల సంచారం తమ ప్రజావిముక్తి సైన్యానికి(చైనా మిలిటరీ) సంతోషం గలిగించేదేనని, క్షిపణులను కూల్చివేసే విమాన వాహక నౌకలతో సహా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చైనా వ్యాఖ్యానించింది.ఈ ప్రాంతానికి చెందని వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని దేశాలు బల ప్రదర్శన చేస్తున్నాయని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం నుంచి నౌకలు, వైమానిక మార్గాల ద్వారా ఏటా ఐదులక్షల కోట్లడాలర్ల మేర వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా.
జూన్‌ నెలలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. (జపాన్‌కు అధికారికంగా మిలిటరీ లేనప్పటికీ ఆత్మ రక్షణ దళాల పేరుతో ఉన్న వాటిని సాయుధం గావిస్తున్నది. ఏక్షణంలో అయినా పూర్తి మిలిటరీగా మార్చేందుకు వీలుగా ఉంది.)ఈనెల ఒకటి నుంచి ఐదు వరకు వార్షిక విన్యాసాల్లో భాగంగా చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిన గ్జిషా(పార్సెల్‌) దీవుల చుట్టూ అమెరికా యుద్ద నౌకలు తిరుగుతున్నాయి. ఈ దీవులు, స్పార్టలే దీవులలో తమకూ వాటా ఉందని వియత్నాం, బ్రూనీ, ఫిలిప్పైన్స్‌, మలేషియా కూడా చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాల గురించి తాము దౌత్య పరమైన నిరసన తెలిపినట్లు ఈనెల రెండున వియత్నాం వెల్లడించింది. ఒక వేళ మిలిటరీ మధ్య ఘర్షణలు ప్రారంభమైతే అమెరికాకు మద్దతుగా జపాన్‌, ఆస్ట్రేలియా వస్తాయని, తమతో ఉన్న సంబంధాల రీత్యా వియత్నాం పాల్గొనకపోవచ్చని అయితే, తన అమెరికా సేనల రాకపోకలకు తమ సముద్ర ప్రాంతాన్ని అనుమతించవచ్చని చైనా అంచనా వేస్తోంది. ఏ దేశమూ పూర్తి విజయం సాధించలేదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. చైనా తన భద్రత, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సమతూకాన్ని పునరుద్దరించేందుకు చైనా చేయాల్సిందంతా చేస్తోందని కూడా తెలిపారు. కృత్రిమ దీవులలో కొద్ది వారాల క్రితమే రెండు పరిశోధనా కేంద్రాలను వాటికి మద్దతుగా రక్షణ, మిలిటరీ ఏర్పాట్లు కూడా చేసింది. తాము అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు పనేమిటి అన్న ప్రశ్నకు మేము ఇక్కడ ఉన్నాం లేదా చైనా నౌకలను అడ్డుకొనేందుకు అని చెప్పటమే అని సింగపూర్‌కు చెందిన నిపుణుడు ఇయాన్‌ స్టోరే వ్యాఖ్యానించాడు.తమ యుద్ద నౌకలు నిర్దిష్టంగా ఎక్కడ ఉన్నాయి అన్నది వెల్లడి కాకుండా అమెరికా జాగ్రత్తలు తీసుకుంది. అయితే మలేషియా తీరానికి రెండు వందల నాటికల్‌ మైళ్ల దూరంలో అవి ఉండవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటిని ఆస్ట్రేలియా ఫ్రైగేట్‌ పరమటా అనుసరిస్తున్నది. ముందుగా రూపొందించిన పధకం ప్రకారమే ఏడాది క్రితం నుంచి అది అమెరికా నౌకలను అనుసరిస్తున్నదని ఆస్ట్రేలియా మాజీ రక్షణ అధికారి జెన్నింగ్స్‌ చెప్పారు. ఆ ప్రాంతం మీద తమకు హక్కు ఉన్నట్లు మలేసియా, చైనా, వియత్నాం వాదిస్తున్నాయి. అమెరికా విమాన వాహక నౌక థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచే తిరుగుతున్నది, అయితే కరోనా వైరస్‌ కారణంగా ఒక నావికుడు మరణించటం, వందలాది మంది బాధితులుగా మారటంతో ప్రయాణం నిలిచిపోయింది. ఇతర అమెరికా యుద్ద నౌకల పరిస్ధితి కూడా అదే విధంగా ఉంది.
గాల్వాన్‌ లోయలో భారత-చైనా మిలటరీ వివాదం తరువాత భారత్‌కు మద్దతుగా తాముంటామని అమెరికా ముందుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నావలు దానిలో భాగమే అన్నట్లుగా ఒక భాగం మీడియా చిత్రించింది. నిజానికి వాటికీ గాల్వాన్‌ లోయ వివాదానికి సంబంధం లేదు. అయితే ఆసియాలో ప్రాంతీయ శక్తిగా రూపొందాలంటే చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ ముందుకు రావాలని అప్పుడు అమెరికా మద్దతు ఇస్తుందని, ఇందుకు గాను అమెరికా సాయం, సాంకేతిక పరిజ్ఞానం పొందితేనే సాధ్యమని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేసే ఒక అమెరికన్‌ సంస్ధ డైరెక్టర్‌ అపర్ణా పాండే రెండు వారాల క్రితమే సలహా ఇచ్చారు.
రెండవ ప్రపంచయుద్ద సమయంలో చైనా అత్యంత బలహీనమైన మిలిటరీతో ఉన్నది. జపాన్‌ దురాక్రమణనే అది ఎదిరించలేకపోయింది. ఇంతవరకు సముద్రంలో అమెరికా-చైనా నౌకా యుద్దంలో తారసిల్లిన ఉదంతం లేదు.అమెరికా ఒక మిలిటరీ శక్తిగా ఇప్పటికీ అగ్రస్ధానంలో ఉన్నప్పటికీ ప్రాంతీయ యుద్దాలలో దానికి చావుదెబ్బలు తగిలాయి తప్ప విజయాలేమీ లేవు. కొరియా యుద్దంలో చైనా సత్తా ఏమిటో అమెరికాకు తెలిసి వచ్చింది. అప్పటితో పోల్చుకుంటే ఎంతో బలపడిన చైనాతో ఇప్పుడు తలపడుతుందా అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత దశాబ్దిలో చైనా వైమానిక, నౌకాదళంలో చోటు చేసుకున్న మార్పులు, బలం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. అయితే చైనాకు పెద్దగా యుద్ద అనుభవం లేదు, అందువలన దానికి బలం ఉన్నా తామే పైచేయి సాధిస్తామని అమెరికా అనుకుంటోంది. అమెరికా పెద్ద ఆర్దిక శక్తిగా ఉన్నా వేల మైళ్ల దూరం నుంచి చైనాను ఎదుర్కొని తమను ఆదుకొంటుందని ఆసియా ప్రాంత దేశాలు భావించటం లేదు. అందువల్లనే అటుచైనా ఇటు అమెరికా వైపు మొగ్గేందుకు జంకుతున్నాయని చెప్పాలి. దానికి తోడు అనేక దేశాలతో ఇటీవలి కాలంలో చైనా కుదుర్చుకున్న ఒప్పందాలు, మిలిటరీ కేంద్రాల ఏర్పాటును చూసిన తరువాత అమెరికాను నమ్మి ప్రస్తుతానికైతే ఘర్షణ పడేందుకు సిద్దంగా లేవు. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఎన్ని యుద్ద నావలను దించిందో దాని ధీటుగా చైనా బలగాలు కూడా ఉన్నాయని, పరిస్ధితి ఎంత పోటా పోటీగా ఉందంటే ఒక సందర్భంలో చైనా నావకు అత్యంత సమీపానికి అమెరికా నావ వచ్చినపుడు రెండువైపులా ఎంతో సంయమనం పాటించినట్లు ఒక చైనా మిలిటరీ అధికారి వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో కూడా అమెరికా రెచ్చగొడుతున్న తీరును దాని తెగింపుకు నిదర్శనమని చైనా భావిస్తోంది. మన దేశంతో చైనా సరిహద్దు వివాదం ప్రారంభంగాక ముందే ఏప్రిల్‌, మే నెలల్లోనే దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికన్‌ నౌకల రాక ప్రారంభమైంది. సాధారణంగా కొన్ని నెలల ఏర్పాట్ల తరువాత గానీ అలాంటివి చోటు చేసుకోవు. అయితే ఈ నౌకల రాక నేపధ్యంలోనే మే నెలలో చైనాాభారత సరిహద్దు వివాదం చెలరేగటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది సమాధానం లేని సందేహమనే చెప్పాలి.
అమెరికాాచైనా మధ్య పెరుగుతున్న వివాదం వివాదాస్పద దీవుల విషయంలో తాము చైనా మీద వత్తిడి తీసుకురాగలమని, ఆ పరిస్ధితి తమకు ప్రయోజనకరమే అని కొన్ని దేశాలు భావించవచ్చు గానీ అదే సమయంలో అవి యుద్దాన్ని కోరుకోవటం లేదు. ప్రపంచ వ్యాపితంగా కరోనా తెచ్చిన ఆర్ధిక సంక్షోభ భయం కూడా దీనికి తోడవుతున్నది కనుక అంతగా ఉత్సాహంగా లేవు. ప్రస్తుత పరిస్ధితుల్లో యుద్దం తమకు లాభమా నష్టదాయకమా అన్న అమెరికా యుద్ద పరిశ్రమల అంచనాను బట్టి కూడా పరిణామాలు ఉంటాయి. కరోనా వైరస్‌ సమస్యతో తీవ్ర ఆర్ధిక వడిదుడుకులకు గురైన చైనా అనివార్యమై అమెరికాను ఎదుర్కొనేందుకు తన జాగ్రత్తలు తాను తీసుకొంటోంది తప్ప యుద్ధానికి అది కూడా సిద్దం కాదనే చెప్పాలి.
సంచలనాత్మక కథనాలతో వీక్షకులను, పాఠకులను పెంచుకొనేందుకు మీడియా రాస్తున్న, చూపుతున్న కథనాలు, కొందరి విశ్లేషణలను చూస్తే ముంగిట యుద్దం ఉన్నదా అనే భ్రమ కలుగుతోంది. ఇప్పుడున్న స్ధితిలో కరోనా, దానితో కలసి వస్తున్న ఆర్ధిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని ప్రతి దేశ పౌరుడూ ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరైనా యుద్ధాన్ని కోరుకుంటారని అనుకోజాలం. అలాంటి యుద్దోన్మాదం, ఉన్మాదులను సమాజం సహించదు. ట్రంప్‌ సర్కార్‌ ఎంతగా రెచ్చగొట్టినా అది అధ్యక్ష ఎన్నికల లబ్ది కోసమే అన్నది బలమైన అభిప్రాయం, అందువలన ప్రస్తుతం యుద్దం వచ్చే అవకాశాలు పరిమితమే అని చెప్పవచ్చు.యుద్ద భేరీలు, నాదాలు చేసినంత మాత్రాన, మీడియా రెచ్చగొట్టుళ్లతో యుద్ధాలు జరగవు. అవన్నీ ఎత్తుగడల్లో భాగం కూడా కావచ్చు. అయితే సామ్రాజ్యవాద దేశాల తీరుతెన్నులను చూస్తే తాము సంక్షోభంలో పడినపుడు దాన్ని జనం మీద, ఇతర దేశాల మీద నెట్టివేసేందుకు యుద్ధాలకు పాల్పడినట్లు చరిత్ర చెబుతోంది. అందువలన అమెరికా ఆంతర్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: