Tags

, , ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

క్యూబాలో కొంతమంది పౌరులు ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు.ఈ సందర్భంగా ఒక వ్యక్తి మరణించినట్లు, వందమందిని అరెస్టు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. క్యూబా కమ్యూనిస్టు నియంత త్వాన్నుండి విముక్తి కావాలనీ , స్వేఛ కావాలనీ ప్రదర్శనకారులు కోరినట్లు వార్తలు వచ్చాయి. పోలీసు కార్లను ధ్వంసంచేసి షాపులను లూటీ చేశారు. ప్రదర్శనలు జరిపిన వారికి అమెరికా ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. క్యూబా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి ఈ నిరసనలు ఒక నిదర్శనమని వ్యాఖ్యానించింది.ప్రభుత్వమే ఈ అశాంతికి కారణమని ఆరోపించింది. విదేశాంగ మంత్రి రోడ్రిగజ్‌ అమెరికా ప్రకటనను సవాలుచేశారు. ”నిన్నటివరకూ క్యూబాలో ఎలాంటి అశాంతి లేదు. కానీ కొంతకాలంగా అమలు చేస్తున్నప్రచార కార్యక్రమం వల్లనే ఈ కల్లోలం అశాంతి తలెత్తాయి” అన్నారు.

క్యూబా అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌ శాన్‌ఆంటోనియా డీ బావోస్‌ ప్రాంత పర్యటన సందర్భంగా అమెరికా ప్రేరేపిత గ్రూపులు ఈ ప్రదర్శన చేశాయి. కానెల్‌ ప్రదర్శకులతో మాట్లాడారు. అమెరికా ఆంక్షలవలన తలెత్తిన అశాంతిగా వ్యాఖ్యానించారు. ఆహారకొరత, కరంటు కోత ప్రజల ఆగ్రహానికి కారణమని పాశ్చాత్య మీడియా అభిప్రాయంగావుంది. ప్లోరిడా పదవ జిల్లా డెమోక్రటిక్‌ పార్టీ నేత వాల్‌ డెమింగ్స్‌ ”క్యూబా ప్రజలు నియంత్త త్వానికి, పేదరికానికి వ్యతిరేకంగా స్వేఛాస్వాతంత్రాల కోసం చేసే పోరాటానికి అమెరికా ప్రభుత్వం క్యూబాలో వెంటనే జోక్యం చేసుకోవాలని ” డిమాండ్‌ చేసింది.
ఒక ప్రభుత్వంపై విధించగలిగిన కఠినమైన ఆర్ధిక ఆంక్షలనన్నిటినీ అమెరికా ప్రభుత్వం విధించింది. ఇక మిగిలింది మిలిటరీ జోక్యమే. ఇదివరకు1961లో ఒకసారి ప్రత్యక్షంగా సైనికులను క్యూబా దేశంలో దింపి భంగపడింది. ”బే ఆఫ్‌ ఫిగ్స్‌” గా పేరుపొందిన దాడి తో అధ్యక్షుడు కెనడీ అంతు లేని ఆపఖ్యాతిని మూటకట్టుకున్నాడు. తాజాగా ఆఫ్గనిస్ధాన్‌ లో ఇరవై సంవత్సరాల యుద్దాన్ని కొనసాగించలేక తాలిబాన్లతో రాజీపడి సేనలను ఉపసంహరించుకుంటున్నది. 1960 దశకంలో వియత్నాం యుద్దంలో 5 లక్షల అమెరికా సైన్యం చవిచూసిన పరాజయాలను,యుద్ద వ్యతిరేక అమెరికాప్రజల పోరాటాల చరిత్ర ను, ఇరాక్‌ లో సద్దాంహుస్సేన్‌ హత్యను ప్రజలింకా మరచిపోలేదు.,మిలిటరీ ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ కార్పోరేట్‌ కంపెనీల కోసం చేస్తున్న యుధాలను అమెరికా ప్రజలు అనుమతించే పరిస్ధితి లేదు.

గత అరవై ఏళ్ళకుపైగా అమెరికా నాయకత్వం అత్యంత కఠినమైన రీతిలో ఆంక్షలను అమలుచేస్తున్నది.దీంతో క్యూబా ఆర్ధికప్రగతి నిలిచిపోయింది. అయినా మానవాభివ ద్ది సూచికలలో , పర్యావరణ పరిరక్షణలో ముందుంది. సామాజికన్యాయం అమలుపరుస్తున్నదేశంగా ప్రజల మన్నన పొందింది. విద్య, వైద్యం, సామాజిక భద్రత, సమానత్వం అమలులో ఖ్యాతి పొందింది. సామాజిక విప్లవంలోప్రజలను భాగస్వామ్యం చేయటంవలన కాస్ట్రో, చే గువేరా అందించిన చైతన్యంతో కష్టాలను ఎదుర్కొంటున్నారు. తన చుట్టూ వున్న క్యాపిటలిజం నుంచి పొంచివున్నప్రమాదాన్ని అత్యంత ప్రతిభావంతంగా, పట్టుదల. నిరంతర క షితో అన్ని రంగాలలో ఎదుర్కొంటున్నారు. విప్లవ ప్రభావం ఎంత తీవ్రంగావుంటే పాత వ్యవస్ధ పునరుద్దరణ అంత కష్టమవుతుంది అనేది వాస్తవం. మా క్యూబా పర్యటనలో ఎక్కడా వ్యాపారాన్ని ప్రోత్సహించే ప్రకటన బోర్డులను చూడలేదు. టీకాలు వేయించుకోవాలనీ, తల్లులను పాలివ్వమనీ పెద్ద పెద్ద బోర్డులు కనపడతాయి. ఒక బోర్డు లో ”ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 20 కోట్లమంది చిన్నారులు వీధుల్లో నిద్రిస్తారు. వారిలో క్యూబన్లు ఒక్కరు కూడా లేరు”.ఈ మాటలు 1996 లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో క్యూబా ఉపాధ్యక్షుడి ఉపన్యాసం నుండి రాశారు. మరోచోట విప్లవం గురించి, కాస్ట్రో ”సోషలిజం లేదా మరణం ” అనే మాటలున్న బోర్డులున్నాయి. ప్రతి అవకాశాన్నీ ప్రజలను చైతన్యపరచటానికి ఉపయోగిస్తున్న సంస్క తినుండి వినియోగ సంస్క తి లోకి మార్చాలని అమెరికా ప్రజలను రెచ్చకొడుతుప్నది.

అమెరికా ఆంక్షలే పేదరికానికి కారణం

ఆంక్షల ఫలితంగా ప్రజలు కష్టాలపాలయి ప్రభుత్వంపై తిరగ పడాలనేదే అమెరికా కోరిక. క్యూబా ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలనే లక్ష్యంతో ఆంక్షలను పెంచుతున్నారు.కరోనా సమయంలో ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలుపరుస్తున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం అదనంగా విధించిన 243 ఆంక్షలను జో బైడన్‌ ప్రభుత్వం కొనసాగిస్తూనేవున్నది. ఇతర దేశాల స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తానని ఎన్నికల సమయంలోచేసిన వాగ్దానాన్ని బైడన్‌ మరచాడు . కోవిడ్‌ కాలంలో తన నిర్లక్ష్యం వలన లక్షలాదిమంది ప్రజల మరణానికి కారణమైనందున బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారో సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటున్నాడు. అమెజాన్‌ అడవులను కార్పోరేట్‌ అనుకూలంగా నాశనం చేసి ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నాడు. అతను కూడా క్యూబా వ్యతిరేక ప్రదర్శనకారులకు సంఘీభావం తెలిపి తన నైజాన్ని నిరూపించుకున్నాడు. .క్యూబాలో ఆంక్షలవలన కష్టాలు పడుతున్న ప్రజలను రెచ్చగొట్టి సోషలిస్టు ప్రభుత్వాన్ని కూలదోయపూనుకున్నారు. అదనంగా విధించిన ఆంక్షల ఫలితంగా ప్రధాన ఆదాయవనరైన చక్కెర ఎగుమతులు దెబ్బతిన్నాయి. అమెరికా ఆంక్షలతో పాటుగా కర్షోనా తోడవటంతో టూరిజం వలన వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. అత్యంత అమానవీయ రీతిలో ఆహారపదార్ధాలను, ప్రాణాధార మందులను కూడా దిగుమతి చేసుకోనివ్వటంలేదు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్ధాలను కూడా కొనుక్కోనివ్వటంలేదు. అయినా, అమెరికా కంపెనీలు ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్లకు దీటుగా, పోటీగా స్వంతంగా అయిదు రకాల వ్యాక్సిన్లను అభివ ద్ధి చేసింది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ప్రజలకు, కావాలంటే అమెరికాకు కూడా వ్యాక్సిన్ల ను ఇస్తామన్నారు. కోవిడ్‌ సమయంలో 23 దేశాలకు డాక్టర్లను ,నర్సులను పంపి ప్రపంచ ప్రజలకు అండగా నిలిచింది.

ఒక చిన్నదేశంపై ప్రపంచంలోనే అత్యంత బలవంతమైన దేశం తన శక్తి నంతా ఉపయోగించి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నది. జూన్‌ 23 న ఐక్యరాజ్య సమితి సర్వ సభ్యసమావేశాలలో క్యూబా పై ఆంక్షలను ఎత్తివేయాలని 184 దేశాలు తీర్మానించాయి.. 1992 సం. నుంచీ ఆంక్షలను ఎత్తివేయాలని ఐక్యరాజ్య సమితి లో మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తూనే వున్నాయి. అమెరికా ప్రభుత్వం లెక్కచేయటంలేదు. 2020 సం .లో ఆర్ధిక దిగ్బంధనంవలన 9.1 మిలియన్‌ డాలర్ల ను క్యూబా నష్టపోయిందని, వైరస్‌ లాగానే ఆంక్షలు, దిగ్బంధనం ఊపిరి పీల్చుకోకుండాచేసి హతమార్చుతాయని విదేశాంగ మంత్రి రోడ్రిగజ్‌ అన్నారు.

క్యూబా కు 90 మైళ్ళ దూరంలో వున్న ఆమెరికా లోని ఫ్లోరిడా రాష్ట్రం కేంద్రంగా చేసుకుని అసమ్మతిని రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను రెచ్చకొడుతూ మరొక పక్క బూటకపు వార్తలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందుకు పావులుగా క్యూబా దేశంనుండి పారిపోయివచ్చిన వారిని వాడుకుంటున్నారు. వారి ద్వారా క్యూబా లోవున్న ప్రజలను, వారి బంధువులను, స్నేహితులను లోబరచుకునే ప్రయత్నంచేస్తున్నారు. అసమ్మతివాదులకు ధన సహాయం, సామాజిక మాధ్యమాలకు అవసరమయిన సాంకేతిక సహాయాన్నిస్తున్నారు. మీడియాలో రకరకాల కధనాలను ప్రచారం చేస్తున్నారు.

క్యూబా ప్రజల ప్రియతమ నాయకుడు కాస్ట్రో పై 634 సార్లు హత్యాప్రయత్నం చేశారు. సార్వభౌమత్వం కలిగిన ఒక దేశ అంతరంగిక వ్యవహారాలలో బయటిదేశాల జోక్యం లేదా విచ్చిన్నకర చర్యలను ప్రోత్సహించడం అంటే క్యూబాను అస్ధిరపరచటమేనని , ఇది తమకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యంకాదని రష్యా ప్రకటించింది. క్యూబాలో ఇతర దేశాల జోక్యందారీ విధానాలను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ హెచ్చరించారు. క్యూబా ప్రభుత్వానికి, ప్రజలకు లాటిన్‌ అమెరికా ప్రజలు, సంస్ధలు, సంఘాలు తమ సంపూర్ల మద్దతును ప్రకటించాయి. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న మరొక లాటిన్‌ అమెరికా దేశం వెనెజులా. క్యూబా లో అమెరికా జోక్యాన్నిసహించేది లేదని అధ్యక్షుడు మదురో హెచ్చరించారు. ప్రపంచ మానవాళికి వ్యతిరేకంగా సాగే అత్యాచారాలకు, విద్వేషచర్యలకు, అధర్మయుధాలకు కారణమైన అమెరికాకు క్యూబా లో హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. క్యూబా ప్రజల పేదరికానికి కారణమైన అమెరికా ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని, క్యూబా ప్రభుత్వాన్ని కూలదోసె ప్రయత్నాలను ఆపాలని ప్రపంచ ప్రజలందరం కోరదాం.