• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Women

దిశ, ఇతరులపై అత్యాచారాలు: సభ్య సమాజం ముందున్న ప్రశ్నలు, సవాళ్లు !

08 Sunday Dec 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Women

≈ Leave a comment

Tags

#Hyderabad vet rape, Disha, Disha and others Rape and murder cases, Disha Rape and murder case, Hyderabad Encounter, Hyderabad rape case encounter, Hyderabad vet rape and murder, murder

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic societyఎం కోటేశ్వరరావు
నవంబరు 27న హైదరాబాద్‌ పశువైద్యురాలు దిశపై సామూహిక అత్యాచారం, హత్య ఉదంతంలో అరెస్టు చేసిన నలుగురు నిందితులను డిసెంబరు ఆరు శుక్రవారం తెల్లవారు ఝామున షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌ పల్లి వద్ద పోలీసులు కాల్చి చంపారు. దిశను ఎక్కడైతే సజీవదహనం చేశారో అక్కడే, ఏ సమయంలో ఆ దుండగానికి పాల్పడ్డారో అదే సమయానికి వారిని హతమార్చినట్లు చెబుతున్నారు. దిశ దారుణోదంతంపై వెల్లడైన తీవ్ర నిరసన, పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై వచ్చిన వత్తిడి పూర్వరంగంలో ఇలాంటిదేదో జరుగుతుందని, తమ బాధ్యతను దులిపివేసుకొంటారని బయటకు చెప్పకపోయినా అనేక మంది ముందే ఊహించారు. దుండగులపై తక్షణమే చర్య అంటే కాల్చివేయాలని పెద్ద ఎత్తున వివిధ తరగతులకు చెందిన వారు బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. వారు కోరుకున్నట్లుగానే జరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు పండుగ చేసుకుంటూ వివిధ రూపాల్లో దాన్ని ప్రదర్శించారు. పోలీసుల మీద పూలవర్షం కురిపించారు, జయజయ ధ్వానాలు పలికారు. పాలకులను కూడా అదే విధంగా పొగడ్తలతో ముంచెత్తారు. ఇది చైతన్యమా ? దానికి విరుద్దమా ?

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎన్‌కౌంటర్‌పేరుతో నిందితులను హతమార్చారు, ఇది చట్ట ఉల్లంఘన అని అభిప్రాయపడిన వారిని అనేక మంది నిందితులకు మద్దతుదారులు,అత్యాచారాలను సమర్ధించేవారు అన్నట్లు శాపనార్ధాలు పెట్టారు. ఒకవైపు చట్టాలకు అందరూ, అన్ని సమయాలలో లోబడే ఉండాలని చెబుతూనే, కొందరి పట్ల కొన్ని సమయాల్లో చట్టాల ప్రకారం పోతే కుదరదు సత్వర న్యాయం జరగాలంటూ చట్ట వ్యతిరేక చర్యలకు బహిరంగంగా మద్దతు పలుకుతూ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.ఒక అనాగరిక చర్యకు ప్రతిక్రియ పేరుతో మరొక అనాగరిక ప్రతిచర్యను సమర్దించారు. ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోవాల్సిందే తప్ప అంగీకరించాల్సిన ధోరణి కాదని చెప్పకతప్పదు. ఉద్రేకాల నుంచి తగ్గి ఆలోచించాల్సిన సమయమిది.
దిశ ఉదంతం అత్యంత కిరాతకమైనదనటంలో ఎలాంటి సందేహం లేదు. నిందితులను ఏ ఒక్కరూ, ఏ ఒక్క పార్టీయే కాదు, చివరకు వారి కుటుంబ సభ్యులు కూడా సమర్ధించలేదు. దురంతానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటానికి ఎవరూ వెనుకాడలేదు. వారు చేసిన నేరానికి మరణశిక్ష పడేందుకు కూడా అవకాశం ఉందని నిర్భయ కేసు ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో తోబుట్టువులైన గీతా-సంజరు కిడ్నాప్‌, హత్య కేసులో నేరగాండ్లు రంగా, బిల్లాలకు ఉరిశిక్షను అమలు చేసిన ఉదంతం తెలిసిందే. అయినా పోలీసులు, కోర్టుల మీద విశ్వాసం సన్నగిల్లటం, కాలహరణ నేపధ్యంలో వెంటనే నిందితులను కాల్చిచంపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.
సమాజంలో సర్వకాల సర్వావస్దలలో మనోభావాలు ఉంటాయి. ఆయా ఉదంతాలు, సందర్భాలను బట్టి అవి వెల్లడయ్యే రూపాలు ఉంటాయి. గత కొంత కాలంగా మన దేశంలో మనోభావాలు వెల్లడవుతున్న తీరు, కొన్ని అంశాలలో రెచ్చగొడుతున్న(నిర్భయ, దిశ వంటి దారుణాతి దారుణ ఉదంతాల విషయంలో కాదని మనవి) తీరు వివాదాస్పదం అవుతోంది. ఆవు, ఆలయాల పేరుతో జరుగుతున్నవి అందుకు తిరుగులేని ఉదాహరణలు. మనోభావాలు, ఆవేశ, కావేషాలు గతం కంటే పెరుగుతున్నాయి, అదే సమయంలో ప్రతి దారుణం, అన్యాయం పట్ల ఒకే విధంగా స్పందన ఎందుకు ఉండటం లేదు అన్న ప్రశ్నలు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దిశ దారుణం, అనంతరం దానికి పాల్పడి అరెస్టయిన నిందితుల కాల్చివేత జరిగిపోయాయి. ఉద్రేకాలు చల్లారాయి గనుక వీటి పర్యవసానాలు, మరో దిశ ఉదంతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించాలి.
ఎన్‌కౌంటర్‌ పేరుతో దిశ కేసులో నిందితుల కాల్చివేత చట్టవిరుద్దం అనటమే పెద్ద నేరం అన్నట్లుగా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. వారిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉండటం ఆందోళనకరం. ఎవరికైనా దేన్నయినా ప్రశ్నించే హక్కు ఉంది, వాటిని కోరుకొనే వారికి బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేయాల్సి వస్తోంది. ఏకపక్షం అంటే కుదురుతుందా ? షాద్‌నగర్‌ పోలీసు చర్యను సమర్ధించేవారు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. దిశ తలితండ్రులు తమ కుమార్తె అదృశ్యం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినపుడు మా స్టేషన్‌ పరిధి కాదంటూ పోలీసులు తిరస్కరించారు. అంతటితో ఊరుకోలేదు, మీ అమ్మాయికి ఎవరితో అయినా ప్రేమ వ్యవహారం ఉందా, ఎవరితో అయినా లేచిపోయిందనే అనుమానాలున్నాయా అని ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇది అత్యాచారం కంటే మరింత బాధాకరమైన, బాధ్యతా రహితమైన చర్య. బిడ్డ సంగతి దేవుడెరుగు, అనాగరికంగా ప్రవర్తించేే పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వచ్చామురా బాబూ అని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారు అనుకోవాల్సిన పరిస్దితులు పోలీసు వ్యవస్ధలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి పోలీసులపై చర్యకు సభ్య సమాజం ఎందుకు డిమాండ్‌ చేయలేదు. నిందితులను కాల్చిచంపగానే పోలీసుల మీద పూలు చల్లటాన్ని ఏమనాలి, మనమేం చేస్తున్నామో అనే చైతన్యంలో ఉండే ఆ పని చేశారా ?
పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం, సహాయ పోలీసు ఫోన్‌కు సమాచారం అందించకు పోవటం దిశదే తప్పు అన్నట్లుగా మాట్లాడిన మంత్రులు, అధికారయంత్రాంగంపై తీసుకున్న చర్యలేమిటి ? దిశపై అత్యాచారానికి ముందు ఆదిలాబాద్‌ ప్రాంతంలో టేకు లక్ష్మి, అదే సమయంలో వరంగల్‌ మానసలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. ఈ దురంతాలను మీడియా ఎందుకు విస్మరించింది ? బలహీనవర్గాలుగా ఉన్నవారి మీద ఇలాంటివి సర్వ సాధారణమే, వాటిని సంచలనాత్మకంగా అందిస్తే రేటింగు, సర్క్యులేషన్‌ల పెరుగుదల ఉండదని లెక్కలు వేసుకుంటున్నదా ? మీడియాకు ఏది లాభసాటి అయితే దాని మీదే కేంద్రీకరిస్తుందని సరిపెట్టుకుందాం, సభ్య సమాజం సంగతి ఏమిటి ? దానికేమైంది ? దిశ ఉదంతంపై మాదిరి ఎందుకు స్పందించలేదో ఎవరైనా చెప్పగలరా ? అత్యాచారం అన్న తరువాత ఎవరి మీద జరిగినా అది దారుణమే, కొందరి మీద దారుణాతి దారుణంగా మరికొందరి మీద సుఖవంతంగా జరుగుతుందా? తీవ్రంగా ఖండించాల్సిన ఉదంతమే, అన్నింటి పట్ల ఎందుకు ఒకే మాదిరి స్పందించటం లేదు? దిశ విద్యావంతురాలిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో భాగంగానే బయటకు వెళ్లింది. టేకు లక్ష్మి విద్యావంతురాలు కాదు గనుక గ్రామాల్లో తిరుగుతూ బూరలు, పూసల వంటి వాటిని అమ్ముకుంటూ కుటుంబ పోషణకు తన వంతు చేస్తున్నది. ఆ క్రమంలోనే ఆమె దుండగులకు బలైంది.
లక్ష్మి, మానస కుటుంబ సభ్యులు, పరిమితంగానే అయినా వారికి మద్దతుగా నిలిచిన వారు నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని మాత్రమే కోరారు. దిశ కేసు నిందితులను కాల్చివేసిన తరువాత తమ వారి కేసుల్లో కూడా నిందితులను కాల్చివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ తరువాత హైదరాబాదు, తెలంగాణా లేదా ఏ రాష్ట్రంలో అయినా ఆడపిల్లలు నిర్భయంగా స్వేచ్చగా తిరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారా ? తలి దండ్రులు లేదా సంరక్షకులు భయపడకుండా తమ పిల్లలను బయటకు పంపగలరా ? నేరాలు చేయాలనుకునే వారంతా భయంతో ఉన్నారని పోలీసు అధికారి సజ్జనార్‌ చెప్పగలరా ? లేకపోతే ఎందుకు అని సంజాయిషీ, సమాధానం చెప్పకపోయినా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సి ఉంది.
ఎన్‌కౌంటర్లతో దుష్ట లేదా నేర స్వభావం ఉన్నవారిని భయపెట్టి అదుపు చేయగలరా ? పోలీసులకు అనుమతి ఉన్న తుపాకులు ఉన్నాయి కనుక దిశ కేసులో నిందితులను కాల్చిచంపి ఇతరులను భయపెట్టాలని చూశారని చెబుతున్నారు. సరే అనుకుందాం. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దిశ తలిదండ్రులు, గతంలో అనేక మంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులు మరొక అభాగిని తల్లిదండ్రుల పట్ల ఆ విధంగా ప్రవర్తించకుండా వారిలో భయాన్ని పుట్టించాల్సిన అవసరం లేదా ? వారినలాగే వదిలేస్తారా ? దానికి పోలీసు ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వం చేసింది ఏమిటి ?
అమెరికాలో ఏ చిన్న నేరానికి పాల్పడినా వెంటనే విచారణ, శిక్షలు వేస్తారు. ఎక్కడా లేని విధంగా జనాలతో జైళ్లను నింపివేస్తున్నారు. అయినా నేరాలు చేసేవారెవరూ భయపడటం లేదు. ఏ తెల్లపోలీసు ఏ నల్లవాడిని ఎప్పుడు, ఎందుకు కాల్చిచంపుతాడో తెలియదు. పౌరుల విషయానికి వస్తే ఎవడు ఎప్పుడు తుపాకి తీసుకొని ఉట్టిపుణ్యానికి తోటి వారిని ఎందుకు చంపుతాడో తెలియదు. నల్లవారిని చంపిన తెల్ల పోలీసుల మీద అత్యధిక సందర్భాలలో చర్యలుండవు, ఆత్మరక్షణ, అనుమానంతో కాల్చిచంపామని ఎలాంటి ‘భయం’ లేకుండా దర్జాగా తిరుగుతుంటారు. ఇక తుపాకులతో సామూహిక హత్యాకాండలకు పాల్పడిన ఉదంతాలలో పోలీసులు అత్యధిక సందర్భాలలో నిందితులను అక్కడికక్కడే కాల్చిచంపుతున్నట్లు వచ్చే వార్తలు తెలిసిందే. అది భయం కలిగించేదే అయినా అలాంటి ఘటనలు రోజూ ఎక్కడో అక్కడ అమెరికాలో ఎందుకు పునరావృతం అవుతున్నాయి.

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
మన దేశంలో నమోదైన నేరాలలో కేవలం 46.48శాతం(2016) మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. రాష్ట్రాల వారీ చూస్తే కేరళలో 84శాతం ఉంటే బీహార్‌లో పదిశాతం మాత్రమే. అదే అమెరికాలో 93, జపాన్‌, కెనడాలలో 99శాతం వరకు ఉంటున్నాయి.మన కంటే వేగంగా కేసుల దర్యాప్తు, కోర్టు విచారణ జరుగుతోంది అయినా ఒకసారి కేసుపెడితే శిక్ష తప్పుదు అనే భయం ఆయా సమాజాలలో కలగటం లేదు. నేరాలు పునరావృతం అవుతున్నాయి. మన దేశంలో ప్రతి లక్షమంది జనాభాకు జైళ్లలో ఉన్నవారు కేవలం 30 మంది మాత్రమే. అదే అమెరికాలో 737 మంది, రష్యాలో 615 మంది ఉన్నారు. అంతమంది జైలు పాలవుతున్నా అక్కడ భయం ఎందుకు ఉండటం లేదు ?
అందువలన ఎన్‌కౌంటర్ల ద్వారా, సత్వర శిక్షల ద్వారా కూడా భయం కలుగుతుందని చెప్పలేము. ముందుస్ధు ఆలోచనలు లేదా పధకాలతో నేరాలకు పాల్పడేవారు తాము చట్టం, సమాజం నుంచి తప్పించుకోగలమనే ధీమాతోనే పాల్పడతారు. దిశ ఉదంతంపై నిరసన తెలిపి రాత్రయ్యే సరికి తప్పతాగి గంతులు వేసేందుకు హైదరాబాద్‌లో పబ్‌కు వెళ్లిన ఒక మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు ఒక యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయ తెలిసిందే. అలాంటి వారిని జైళ్లపాలు చేసి సమాజానికి దూరంగా ఉంచటం తప్ప సత్వరన్యాయం పేరుతో అంతం చేయటానికి నాగరిక సమాజం అంగీకరించటం లేదు. ఎన్నో అనుభవాల తరువాతనే ప్రస్తుతం ఉన్న చట్టాలను రూపొందించామని అందరూ గుర్తించటం అవసరం. అసలు నేరాలుండని సమాజం కోసం కృషి చేయటం తప్ప మరొక దగ్గర మార్గం ఏముంది. అయితే అందుకు ఎంతకాలం ఎదురు చూడాలి అన్నది తక్షణమే వెలువడే ప్రశ్న. నిర్భయ, దిశలకు ముందు అనేక మంది అభాగినులు అత్యాచారాలకు గురయ్యారు. అయినా స్పందించటానికి సమాజం ఇంతకాలం ఎందుకు వ్యవధి తీసుకుంది, ఎందుకు ముందుకు రాలేదు అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరక్కపోదు. మన సమాజం ఈ స్ధితికి రావటానికి లక్షల సంవత్సరాలు పట్టింది. అయినప్పటికీ ఒక ఇంట్లోనే అందరి ఆలోచనలూ, చైతన్య స్ధాయి ఒకే విధంగా ఉండటం లేదని, అలాంటపుడు చైతన్యాన్ని వేగిరంగా కలిగించేందుకు కృషి చేయటం తప్ప మరొక దగ్గరదారి లేదన్నది అవగతం అవుతుంది.
ప్రతీకారం తీర్చుకోవటమే అయితే న్యాయం తన లక్షణాన్ని కోల్పోతుందని మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ కథనాలపై స్పందించారు. న్యాయం అన్నది ఎన్నడూ తక్షణం లభించేది కాదు, అది ప్రతీకారంగా మారితే దాని స్వభావాన్నే కోల్పోతుంది, నేర వ్యవహారాల కేసుల పట్ల అలసత్వం, వ్యవధి తీసుకోవటం గురించి వైఖరిని పునరాలోచించుకోవాలన్నారు.
కోర్టులలో విచారణ ఆలస్యం కావటం మీద పౌరులలో అసంతృప్తి పెరుగుతోంది. నిర్భయ ఉదంతం తరువాత వెల్లడైన నిరసనల పూర్వరంగంలో న్యాయం వేగంగా జరిగేందుకు సూచనలు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ వర్మ ఆధ్వర్యంలో మరో ఇద్దరు న్యాయమూర్తులు లీలా సేథ్‌, గోపాల్‌ సుబ్రమణియమ్‌లతో కూడిన కమిటీని 2012లో ఏర్పాటు చేశారు. ఉరిశిక్ష ద్వారా అత్యాచారాల నిరోధించటం లేదా పరిష్కారం కాదని స్పష్టం చేస్తూ అలాంటి నేరాలు నిరోధించేందుకు తీసుకోవాల్సిన సామాజిక మరియు భౌతిక అంశాలకు సంబంధించి అది కొన్ని సూచనలు చేసింది. ఆరు సంవత్సరాలు గడిచినా వాటిని అమలు జరపటంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయి.
ఈ నివేదికను సమర్పించిన తరువాత మహిళలను కించపరిచే అనేక మంది గత ఆరు సంవత్సరాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయ్యారు.ఉత్తర ప్రదేశ్‌లో అధికార పార్టీ ఎంఎల్‌ఏ ఒక అత్యాచార కేసులో నిందితుడు.కాశ్మీర్‌లో అసిఫా మీద అత్యాచారం చేసిన నిందితులకు మద్దతుగా బిజెపి మంత్రులు, న్యాయవాదులు ఏకంగా ప్రదర్శనలే చేశారు. వర్మకమిటీ చేసిన సిఫార్సులలో మరణశిక్ష లేదు. అత్యాచార నేరంగాండ్లకు జీవితకాల శిక్ష విధించాలని పేర్కొన్నది. కేసులను నమోదు చేసేందుకు తిరస్కరించిన లేదా దర్యాప్తును నీరుగార్చేందుకు ప్రయత్నించిన అధికారులు నేరం చేసినట్లుగా భావించి శిక్షార్హులను చేయాలన్నది. ఎంత మందిని ఆ విధంగా శిక్షించారు? విచారణ అధికారులందరూ చిత్త శుద్దితోనే పని చే శారని చెప్పగలరా ? దిశ ఉదంతం మా పరిధి కేసు కాదని తిరస్కరించిన వారిపై చర్యలేమిటి అన్నది ప్రశ్న. అదేవిధంగా అత్యాచారానికి గురైన వారికి జరిపే వైద్య పరీక్షలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహించాలని పేర్కొన్నది. రాష్ట్రాలలో భద్రత కమిషన్లను ఏర్పాటు అన్నది ఒక సూచన. ఇంతవరకు ఎన్ని రాష్ట్రాలు అలాంటి కమిషన్లను ఏర్పాటు చేశాయి ? వచ్చిన వార్తలు, నేరుగా అందిన ఫిర్యాదులను స్వీకరించి కోర్టులు విచారణకు తీసుకోవచ్చని కమిటీ పేర్కొన్నది. రాజకీయ సంస్కరణల్లో భాగంగా నేరచరిత్ర ఉన్నవారిని ప్రజాప్రతినిధులుగా తీసుకోవద్దని, రాజకీయాలను నేరపూరితంగా మార్చవద్దని కూడా వర్మకమిటీ కోరింది.ఎన్ని పార్టీలు అమలు జరుపుతున్నాయి?

Image result for Disha and others Rape and murder cases:challenges and questions for civic society
వర్మకమిటీ సిఫార్సులు వచ్చిన తరువాత రాజకీయ వ్య వస్ధ పరిస్ధితి ఏమిటో చూద్దాం.2014లో ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యులలో నేర చరిత్రకలవారు 26శాతం మంది ఉంటే, 2019లో 43శాతానికి పెరిగారు. ఎడిఆర్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం 539 మంది లోక్‌ సభ సభ్యులలో 233 మంది నేర చరిత కలిగిన వారున్నారు. వీరిలో బిజెపికి చెందిన వారు 116, తరువాత కాంగ్రెస్‌ 29,జెడియు 13, డిఎంకె 10,టిఎంసి నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ఇక పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్ధులపై ఉన్న కేసులలో మహిళల మీద అత్యాచారాలు, హత్యలు,యత్నాలు, కిడ్నాప్‌ల వంటివి 29శాతం ఉన్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి ఎంపీ, ఎంఎల్‌ఏ అభ్యర్ధులలో నేర చరిత కలిగిన వారు బిజెపిలో ఎక్కువ మంది ఉండగా రెండవ స్ధానంలో బిఎస్‌పి ఉందని ఏడిఆర్‌ మరొక అధ్యయనంలో పేర్కొన్నది. ఇలాంటి వారి చేతిలో పాలన పెడితే జరిగేదేమిటో సభ్యసమాజం ఆలోచిస్తున్నదా ? అభ్యర్ధుల నేర చరిత్ర గురించి అఫిడవిట్లలో వారే స్వయంగా ఇస్తున్నారు. వాటిని విశ్లేషించి ఎడిఆర్‌ సంస్ధ నిర్వాహకులు పోలింగ్‌కు ముందే ప్రకటిస్తున్నారు. అయినా సభ్యసమాజం అలాంటి వారిని ఎందుకు ఎన్నుకుంటున్నట్లు ? సభ్య సమాజానికి బాధ్యత లేదా ?
దిశ నిందితుల కాల్చివేత జరిగి కొన్ని గంటలు కూడా జరగక ముందే హైదరాబాద్‌ శివార్లలోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రగతి నగర్‌లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్త, భయం ఏమైనట్లు ? సభ్య సమాజం ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శబరిమల తీర్పు 4: సామాజిక మాధ్యమంలో అసంబద్ధ, కుతర్కం !

12 Friday Oct 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Anti Hindu, Hindu scriptures, illogical and inconsistent arguments in social media on Sabarimala verdict, sabarimala verdict, social media on Sabarimala verdict

Image result for illogical and inconsistent arguments in social media on  Sabarimala verdict

ఎం కోటేశ్వరరావు

ఏ మతం వారి ఆచార వ్యవహారాలలోని మంచి చెడ్డలను ఆ మతాల వారే ప్రశ్నించాలి, అంతేనా మతం పట్ల నమ్మకం వున్న వారే అందుకు అర్హులు, దేవుడు, దేవత, దేవదూత, ప్రవక్త, దేవుని బిడ్డల మీద ప్రశ్నించే వారికి నమ్మకం వుందని రుజువు ఏమిటి? ఒక మతం వారు మరొక మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. సామాజిక మాధ్యమంలో, సాంప్రదాయక మాధ్యమాల్లో వస్తున్న,వేస్తున్న, వేయిస్తున్న ప్రశ్నలివి.ఈ వాదన అక్కడితో ఆగటం లేదు, హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కూడదన్న కోర్టు మసీదుల్లో ప్రవేశాలకు ఆదేశాలు జారీ చేస్తాయా, ముస్లిం మహిళల బురఖాలను తీసివేయిస్తాయా, అన్ని మతాల ఆచార, వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాయా? ఇలా చర్చ సాగుతోంది. ఈ తర్కంలో పరస్పర వైరుధ్యాలు, వుక్రోషం, అవకాశవాదం వున్నాయి.

ఈ క్రమంలో మసీదుల్లో మహిళల ప్రవేశానికి అనుమతించాలని ఆదేశాలివ్వాలంటూ కేరళ హిందూ మహాసభ నేత స్వామి దత్తాత్రేయ శాయి స్వరూపనాధ్‌ ఆ రాష్ట్ర హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్య పిటీషన్‌ను న్యాయమూర్తులు తిరస్కరించారు. తన వాదనకు తగిన ఆధారాలను చూపటంలో విఫలమైన కారణంగా పిటీషన్‌ విచారణ అర్హం కాదని కొట్టి వేశారు. తగిన సాక్ష్యాలతో మరొకరు ఎవరైనా అవసరమైతే అలాంటి కేసులు వేసుకోవచ్చు లేదా ముస్లిం మత పెద్దలు అంతవరకు తెచ్చుకోకుండా మసీదుల్లోకి మహిళలను అనుమతించే వివేచనను అయినా చూపవచ్చు. అయ్యప్ప ఆలయంలో అలాంటి వివక్ష వుందని బలమైన ఆధారాలు, సాక్ష్యాలు వుండబట్టే అయ్యప్ప కేసు విచారణకు నిలిచింది, తీర్పును ప్రకటించాల్సి వచ్చింది. వివక్షను పాటించే వారు తమ వాదనలకు తగిన సాక్ష్యాలను చూపలేకపోయినందున కేసును ఓడిపోయారు.

పైన పేర్కొన్న వాదనలను సామాన్యులు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన మార్కండేయ కట్జూయే ఎలాంటి ఫీజు లేకుండా ఇలాంటి వాదనలు, సుప్రీం కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు పూనుకున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పు మీద కట్జూ స్పందించారు.’ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఆ కేసు తీర్పును పునర్విచారణ చేసేందుకు ఏడుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేయాలి లేదా దేశమంతటా మసీదుల్లో మహిళల ప్రవేశాన్ని అమలు చేయించాలి. సిద్దాంత రీత్యా మసీదుల్లో మహిళల ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవు, మక్కా, మదీనాల్లో అనుమతిస్తున్నారు, ఇండ్లలో ప్రార్ధనలు చేసుకోవాల్సిన మహిళలను భారత్‌లో ఒకటి రెండు శాతం మసీదుల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. మసీదుల్లో తగినంత స్ధలం లేదన్నది సాధారణంగా సమర్ధనకు చెబుతున్నారు. అదే కారణం అయితే పురుషులకే ప్రాధాన్యత ఎందుకు? మహిళలు మసీదుల్లో పురుషులు బయట ఎందుకు చేయకూడదు. లేదా సగం సగం పద్దతిలో వేర్పాటు చేయాలి. కాబట్టి దీనిలో మీరు దేన్ని ఎంచుకుంటారు ‘ అని ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నించారు. అంతే కాదు, ఎవరైతే మత ఆచారాలను పాటిస్తున్నారో వారికే సమానత్వం గురించి అడిగే హక్కు వుందని, సదరు ఆచారం హేతుబద్దమైనదా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టుకు లేదని శబరిమల కేసులో మిగతా నలుగురితో విబేధించిన ఐదవ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా వాదనను కట్జూ సమర్ధించారు.

మనది లౌకిక రాజ్యం. ఏ మతానికి లేదా మత ఆచారాలకు రాజ్యాంగంలోని అంశాల నుంచి మినహాయింపు ఇవ్వలేదు. అలాగని ఏ మత ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అంశాలు కూడా లేవు. అవసరమని భావిస్తే ఏ ప్రజా ప్రయోజన లేదా సంబంధ అంశంపై అయినా కోర్టు స్వయంగా జోక్యం చేసుకోవచ్చు. ఏ రూపంలోనూ ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేందుకు, వివక్ష పాటించేందుకు వీలు లేదు. ఈ పరిమితులకు లోబడే కోర్టులు తీర్పులు చెబుతున్నాయి.భర్త నుంచి మనోవర్తి పొందేందుకు ముస్లిం మహిళలకు హక్కు వుందని షాబానో కేసులో తీర్పు చెప్పిన కోర్టు మూడుసార్లు తలాక్‌ చెబితే విడాకులు చెల్లవని కూడా చెప్పింది.ఈ కేసులను ఇస్లాంను పాటించే ముస్లిం న్యాయమూర్తులే విచారించాలి,న్యాయవాదులే వాదించాలి, ముస్లింలు మాత్రమే కోర్టులో గుమస్తాలుగా వుండాలి అని ఆ మతానికి చెందిన వారితో సహా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. లేదా శబరిమల ఆలయ కేసు విచారణ సమయంలోనూ ఏ వ్యక్తి లేదా ఏ సంస్ధా కేసులో పైన పేర్కొన్న వాదనతో ప్రతివాదులుగా చేరలేదు.

ఇప్పుడు అలాంటి వాదనలు ఎందుకు చేస్తున్నట్లు ? మూలం, పర్యవసానాలు ఏమిటి? అస్థిత్వ భావజాలం. సమాజంలో నిరాదరణకు గురయ్యే మైనారిటీ తరగతులు తమ ప్రయోజనాల పరిరక్షణకు ఈ భావనను ముందుకు తెచ్చారనే అభిప్రాయం వుంది. అది ప్రారంభంలో అభివృద్ధికరంగానే వున్నప్పటికీ ఒక పరిధి దాటిన తరువాత అదే ఆటంకంగా మారటంతో పాటు దోపిడీ వర్గాలు శ్రామిక వర్గాన్ని విభజించి పాలించేందుకు ఆ భావజాలాన్ని పెంచి పోషించాయనే అభిప్రాయం కూడా వుంది. వుదాహరణకు ఇటీవల సిపిఎస్‌(కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. నిజానికి కార్మిక, వుద్యోగ, వుపాధ్యాయ సంఘాలు ఈ అంశం మీద గట్టిగా కేంద్రీకరించి వ్యతిరేకించి వుండాల్సింది, అది జరగలేదు. ఆ పధకం కింద వుద్యోగంలో చేరిన వారికి కూడా ప్రారంభంలో దాని వలన కలిగే హానితెలియలేదు, పట్టించుకోలేదు. ముందు వుద్యోగం చాలనుకున్నారు. ఇప్పుడు వుద్యమంలో పాత పధకంలో వున్నవారు దానికి వ్యతిరేకంగా జరిగే వుద్యమంలో అంతగా ఆసక్తి చూపుతున్నారా అన్నది ప్రశ్న. కాడర్‌ వారీ సంఘాల ఏర్పాటు కూడా ఈ భావజాల పుణ్యమే. ఒక క్యాడర్‌ సమస్య మీద వుద్యమిస్తే మరో కాడర్‌లో స్పందన వుండదు. ప్రారంభంలో ఎలా వున్నప్పటికీ ఇప్పుడు అస్ధిత్వ భావజాలం ఐక్యతకు ఆటంకంగా మారిందనేందుకు ఇలా అనేక దృష్టాంతాలను పేర్కొనవచ్చు. స్ధూలంగా అస్థిత్వ రాజకీయాలుగా నామకరణం జరిగిన ఈ అంశం అన్ని జీవన రంగాల్లో ప్రబలంగా వ్యాపించింది. దళితుల సమస్యల మీద పోరాడాలంటే దళితులే నాయకత్వం వహించాలి, వారికి తెలిసినంతగా వారి సమస్యలు,వేదన ఇతరులకు అర్ధం కాదు. ఇదే తర్కాన్ని మహిళలకు వర్తింప చేశారు.కార్మిక సంఘాలకు కార్మికులే నాయకత్వం వహించాలి, బయటి రాజకీయ నాయకులు, ఇతరులు వుండకూడదు అని కార్మికుల కంటే యజమానులే గట్టిగా చెబుతున్నారు. ఆ మేరకు చట్ట సవరణ కూడా చేయాలనే డిమాండ్‌ ముందుకు తెచ్చారు. ఏ మతంవారి దురాచారాలను ఆ మతం వారే, అందునా వాటిని పాటించే వారే ప్రశ్నించాలి అనే తర్కానికి ఇదే మూలం. ఈ దేశంలో దేవుడు,దేవత, మతం, కులంతో ప్రమేయం లేకుండా జీవించాలని కోరుకొనే స్వేచ్చ, దేనినైనా ప్రశ్నించే హక్కు పౌరులకు వుంది అనే విషయాన్ని కొంత మంది మరచిపోతున్నారు.

ఆచారాలు, అలవాట్లను పాటించేవారే ప్రశ్నించేందుకు అర్హులు అనే వితండవాదానికి తావిస్తే గోవధ నిషేధించాలని డిమాండ్‌ చేసే హక్కు గోమాంసం తినని వారికి, వధించని వారికి ఎక్కడిది? ఆ పనిచేసే వారి నుంచే అది రావాలి కదా ! ఇలాంటి వాదనలు సమాజం యథాతధంగా వుండాలని కోరుకొనే తిరోగమన వాదులకు, మన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే లేదా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసే శక్తులకు మాత్రమే సంతోషం కలిగిస్తాయి.మెజారిటీ పౌరులు హిందువులు కనుక హిందూ రాజ్యంగా వుండాలని, వారు చెప్పిందే అమలు జరగాలంటూ మనువాద పున:ప్రతిష్ట చేయాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దాని ప్రకారం మనం మతరాజ్యాల్లోకి మారిపోవాలి, రాజ్యాంగమెందుకు, పార్లమెంట్‌, కోర్టులెందుకు ?

మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని కోర్టులెందుకు జోక్యం చేసుకోవు లేదా అమలు జరిపించవు అనే వాదనను చూద్దాం.మొదటి విషయం మన రాజ్యాంగం న్యాయవ్యవస్ధకు అలాంటి కార్యనిర్వాహక అధికారం ఇవ్వలేదు. మన రాత పూర్వక రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ప్రకారం న్యాయం జరుగుతున్నదా లేదా తీర్పు చెప్పటానికి, జరగటం లేదని కోర్టుకు స్వయంగా తెలిసినపుడు లేదా భావించినపుడు అమలు జరపాలని ప్రభుత్వాలకు మార్గదర్శనం, రాజ్యాంగ విరుద్దం అయితే ఆదేశాలు ఇస్తాయి. రాజ్యాంగం ప్రకారం నిర్ణీత వయస్సు వచ్చిన యువతీ యువకులు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. కానీ రోజూ ఏదో ఒక మూల అలాంటి వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి, వేటాడి చంపుతున్న వుదంతాలు దేనికి సూచిక, అలాగే అంటరాని తనం నేరం, శిక్షార్హం. సమాజంలో అదింకా కొనసాగుతున్నదా లేదా ? ఆ వివక్ష, నేరానికి వ్యతిరేకంగా లేదా తమకు న్యాయం చేయాలని ఎవరైనా కోర్టు తలుపు తడితేనో లేదా ఆ దురాచారం కొనసాగుతున్నతీరు గురించి మీడియా ఇచ్చిన వార్తలను చూసి స్పందిస్తేనో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అంతే తప్ప కోర్టులు ప్రతి ఇంటికి లేదా ప్రతి ప్రార్ధనా స్ధలానికి వెళ్లి అంటరానితనాన్ని పాటిస్తున్నారా లేదా అని చూడవు. మసీదులైనా అంతే. ఎవరైనా తమను ఫలానా మసీదులో ప్రవేశానికి ఆటంకం కలిగిస్తున్నారని కోర్టుకో, పోలీసులకో ఫిర్యాదు చేయకుండా ఆ వ్యవస్ధలు ఎలా స్పందిస్తాయి. మహిళలను మసీదులకు వెళ్లటాన్ని ఎవరు అడ్డగించారు, వెళ్ల వచ్చు అన్నది ఒక వాదన. వెళ్ల వచ్చు నిజమే, వెళ్లటం లేదన్నది వాస్తవం. ఎవరు అడ్డగించారు అని ఎదురు ప్రశ్న వేసే వారే ఎందుకు వెళ్లటం లేదో సమాధానం చెప్పాలి. ప్రతి మతంలోనూ సంస్కరణోద్యమాలు రావాలి, దీనికి ఇస్లాం మినహాయింపు కాదు. మా మతం మా ఇష్టం అంటే కుదరదు.

ముస్లిం మహిళల చేత బురఖాలు తీసేయిస్తారా అన్నదొక ప్రశ్న. కొన్ని దేశాలలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే లేదా వ్యతిరేక చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు లేదా ప్రతిపాదిస్తున్నారు. వాటిని చూసి ఇక్కడి ముస్లిం వ్యతిరేకులు ఈ అంశాన్ని తలకెత్తుకుంటున్నారు. ఫలాన దుస్తులు వేసుకోవాలి, ఫలానావి వేసుకోకూడదు, ఫలనాది తినకూడదు, ఫలానాదే తినాలి అనే తాలిబాన్ల ఫర్మానాలు కూడా ఇలాంటి వాటి మీద ప్రభావం చూపుతున్నాయి. బురఖా లేదా ముసుగు ధరించేది ఒక్క ముస్లిం మహిళలేనా? పూర్తిగా ముఖాన్ని కప్పి వుంచుతూ హిందువుల్లో అలాంటి వేషధారణ వున్నవారి సంగతేమిటి? వాటికి ఏ పేరు పెట్టినా వారిని కూడా ముసుగులు తొలగించే విధంగా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలా?

ఇంకా మరికొన్ని వాదనలు, అయ్యప్ప బ్రహ్మచారి కనుక వయస్సులో వున్న యువతులు సందర్శిస్తే ఆయన వ్రత భంగం అవుతుంది. హిందూ పురాణాల ప్ర కారం కార్తికేయుడు కూడా బ్రహ్మచారే, ఆయన సోదరుడు వినాయకుడూ, రామ భక్త హనుమంతుడూ బ్రహ్మచారే. వారు కూడా బ్రహ్మచర్యాన్ని నిష్టగా పాటించినట్లు చదివాం తప్ప మినహాయింపులు తీసుకున్నట్లు తెలియదు. వారి దేవాలయ ప్రవేశాలకు ఎలాంటి ఆంక్షలు లేవు. వారి వ్రతానికి మహిళలు ఎలాంటి భంగమూ కలిగించటం లేదు. ఖురాన్‌ ప్రకారం బహిష్టులో వున్న మహిళలు నమాజు చేయటానికి లేదు, దానికి కూడా మనం వ్యతిరేకంగా పోరాడదాం. సుప్రీం కోర్టు దేవుడైతే భక్తుల మనోభావాలను గౌరవించాలి తప్ప సంస్కారం లేని మహిళావాదులను కాదు, ఇంకా ఇలాంటి అనేక వాదనలను ముందుకు తెచ్చారు. వీటన్నింటిని మొత్తంగా బేరేజు వేస్తే కోర్టు తీర్పు హిందూమతానికి వ్యతిరేకంగా ఇచ్చిందనే భావాన్ని కలిగించేందుకు తీవ్ర ప్రయత్నం కనిపిస్తోంది. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే హిందూయేతర మతాల్లో వున్న వివక్ష లేదా అసంబద్దతలను గుర్తించటానికి, తొలగించటానికి ఈ తీర్పు దోహదం చేస్తుందన్నది పురోగామి వాదుల అభిప్రాయం అని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శబరిమల తీర్పు 3 : ప్రజాకర్షక నినాదాలతో భారతీయ మితవాదం !

10 Wednesday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Far right populism in India, RSS, RSS game, sabarimala verdict

Image result for Far right  in india cartoons

ఎం కోటేశ్వరరావు

దేశంలో పచ్చి మితవాద శక్తులు చెలరేగిపోవటం ఒకవైపు వాటి భావాజాలానికి విరుద్దంగా కొన్ని పురోగామి తీర్పులను సుప్రీం కోర్టు వెలువరించటం ఒక చిత్రమైన స్ధితి. అధికారంలో వున్న బిజెపి కొన్ని తీర్పుల మీద ఎలాంటి వైఖరులను వెల్లడించటం లేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి శబరిమల వివాదంలో మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ, మహిళలపై ఆంక్షలను కొనసాగించాలన్న న్యాయమూర్తి తీర్పును సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. దానికి వ్యక్తిగత అభిప్రాయమనే షరతు పెట్టారు. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగాó నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఎవరు అడిగారు? బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధలు ఒకవైపు సదరు న్యాయమూర్తి తీర్పుతో ఏకీభవిస్తూ, మెజారిటీ బెంచ్‌ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన తరువాత ఆమెనుంచి అంతకు మించి ఎవరైనా ఎలా ఆశించగలరు?

ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ గోడమీద పిల్లి వాటంగా వ్యవహరిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీల సంగతి సరేసరి. వామపక్షాలు మాత్రమే తమ సూత్రబద్దమైన వైఖరులను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు పురోగామి శక్తుల కంటే ప్రజాకర్షక నినాదాలతో తిరోగామి భావజాలానిదే పైచేయిగా వున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో దానికి గురయ్యేవారిలో పురుషులతో పాటు మహిళలూ వుంటారు. ఐరోపాలోని అనేక దేశాలలో నయా నాజీలు, ఫాసిస్టులు పెరుగుతున్నారు. మన దేశంలో ఈ భావజాలంతో పనిచేస్తున్న శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేశాయి. మరింతగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాయి. నాజీలు యూదువ్యతిరేకతను రెచ్చగొట్టి ఐరోపాలో మారణహోమం సృష్టిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారు. మన దేశంలో ముస్లింలతో పాటు క్రైస్తవ వ్యతిరేకతను కూడా జోడించారు. ఎందుకిలా జరుగుతోంది. సమగ్రంగా చర్చ, పరిశోధన జరగాల్సి వుంది. ప్రజాకర్షక నినాదాలంటే సంక్షేమ కార్యక్రమాలే కానవసరం లేదు.అసోం, త్రిపురల నుంచి బంగ్లాదేశీయులను ఒకవైపు వెళ్లగొట్టాలంటున్న బిజెపి మరో వైపు గుజరాత్‌లో వుత్తరాది రాష్ట్రాల వారిని వెళ్లగొడుతుంటే అచేతనంగా వుంది.

వస్తు వ్యాపారం చేసే ఒక సాధారణ వ్యాపారి కంటే డబ్బుతో వ్యాపారం చేసే ఒక వడ్డీ వ్యాపారిని చూస్తే సామాన్యులు ఎక్కువగా భయపడతారు. పెట్టుబడిదారీ వ్యవస్దలో సంభవిస్తున్న సంక్షోభాలను అధిగమించటానికి ఒక వైపు ప్రయత్నిస్తూనే రెండోవైపు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదం తీవ్రంగా నిమగ్నమైంది. మొదటి అంశంలో భాగంగా నయా వుదారవాద విధానాలను ముందుకు తెచ్చింది, రెండవ అంశంలో సోషలిస్టు వ్యవస్ద నిర్మాణంలో జరిగిన లోపాలను ఆసరా చేసుకొని, కుట్రలు చేసి ప్రధమ సోషలిస్టు రాజ్యాన్ని, దాని సాయంతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలను కూల్చివేయటంలో జయప్రదమయ్యారు. సాధారణ వడ్డీ వ్యాపారి స్ధానంలో పట్టణాలలో గూండా వడ్డీవ్యాపారుల మాదిరి నయావుదారవాదం కార్మికవర్గం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. దాని దెబ్బకు వుదారవాద ముసుగులు వేసుకున్న సోషలిస్టు, లేబర్‌ పార్టీల వంటివి జనం మీద భారాలు మోపటంలో మితవాదుల కంటే తక్కువేమీ కాదని ఈ కాలంలో రుజువు చేసుకున్నాయి. సాంప్రదాయ పార్టీల మీద జనానికి విశ్వాసం పోయింది. మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్ధలో అంతరాలు పెరగటంతో పాటు నయావుదారవాద విధానాలు ఎంత వేగంగా పెట్టుబడిదారుల సంపదలను పెంచుతాయో సంక్షోభాలను కూడా అంతేవేగంగా ముందుకు తెస్తాయని తేలిపోయింది. సోషలిస్టు వ్యవస్ధలకు ప్రత్యామ్నాయం పెట్టుబడిదారీ విధానమే అంటూ చూపిన రంగుల కలలు పాతికేండ్లలో కల్లలయ్యాయి. సోషలిజం, కమ్యూనిజాల మీద చేసిన తప్పుడు ప్రచారం, వాటికి తగిలిన తీవ్రమైన ఎదురుదెబ్బలను చూసిన తరువాత జనానికి తాత్కాలికంగా అయినా ఎటుపోవాలో తెలియని స్ధితి మితవాద శక్తుల పెరుగుదలకు అనువుగా తయారైందని చెప్పవచ్చు. అవి అనేక చోట్ల జనాకర్షక నినాదాలతో ముందుకు వస్తున్నాయి.అసంతృప్తి, ప్రత్యామ్నాయం గురించి అవగాహనలేని, విశ్వాసంలేని యువత ఇటువంటి శక్తుల వెనుక చేరటం గతంలో కూడా జరిగింది. ఈ స్ధితి ఎంతోకాలం వుండదని గత చరిత్ర రుజువు చేసింది.

పచ్చి మిత, తీవ్రవాద భావాలను రాజీకీయాలు, సమాజంలో మరింతగా వ్యాప్తి, అమలు చేసే క్రమంలో వాటిని అందంగా, మహిళీకరణ(ఫెమినైజ్‌కు ఈ పదం దగ్గరగా వుంటుందని ప్రయోగించాను, అంతకంటే మెరుగు, అర్ధవంతమైన పదాన్ని సూచిస్తే స్వీకరిస్తాను) చేయటం కనిపిస్తోంది. మరోసారి యూదులను చూపి ద్వేషం రెచ్చగొట్టే పరిస్ధితులు పునరావృతం అవుతాయా ? ఇప్పటికైతే అలాంటి సూచనలు లేవు. దాని స్ధానంలో ముస్లింలపట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టటం, కొంత మేరకు జనాన్ని తప్పుదారి పట్టించగలిగినట్లు చెప్పవచ్చు. ముస్లింలందరూ వుగ్రవాదులు గాకపోవచ్చుగాని వుగ్రవాదులందరూ ముస్లింలే అనే ఒక ప్రమాదకరవాదన రూపంలో ద్వేషాన్ని పెంచుతున్నారు. ఫ్రెంచి మితవాద రాజకీయ వారసత్వ క్రమంలో మూడవతరానికి చెందిన యువతి మరియం మార్చల్‌ లీపెన్‌. ఆమె తన తాత మారీ లీపెన్‌, పిన్ని మారినే లీపెన్‌ బాటలో ముందుకు వచ్చింది.తాత కంటే పిన్ని ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించింది. ఇరవై మూడు సంవత్సరాలకే పార్లమెంట్‌కు ఎన్నికైన మరియం లీపెన్‌ పుట్టినప్పటి నుంచి మితవాద భావాల వుగ్గుపాలతో పెరిగా నంటూ తన భావాలను మరింత స్పష్టంగా చెబుతోంది. జాతీయవాదం కూడా నాజీజమే. మీరు కనుక జాతీయ ప్రయోజనాలను సమర్ధిస్తే వేదనామయ క్రమాన్ని ప్రారంభించినట్లే, అది యుద్దము, ప్రళయానికి దారి తీస్తుందని అంటోందా అమ్మడు.28ఏండ్ల మార్చెల్‌ లీపెన్‌ పచ్చి ముస్లిం వ్యతిరేకి. ఇస్లామ్‌ను మనం అంతమొందించాలి లేదా అదే మనల్ని పదే పదే చంపుతుంది అని విద్వేషాన్ని వెళ్లగక్కారు. నేషనల్‌ పార్టీలో వున్న వారికి ఈమె ప్రతిరూపం. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రస్తుతం నేషనల్‌ ర్యాలీ పార్టీ నేతగా మారీ లీపెన్‌ పని చేస్తున్నారు. తండ్రి నాయకత్వస్ధానాన్ని ఆమె అందుకున్నారు. ఐరోపా రాజకీయాలలో ఇలాంటి వారసత్వ ధోరణులు ఇటీవలి వరకు లేవు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఈమె తొలి రౌండులో 21.3శాతం ఓట్లు తెచ్చుకొని అంతిమపోటీలో 33.9శాతం తెచ్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Image result for Far right  in india cartoons

బ్రిటన్‌లో రంగంలోకి వచ్చిన మరొక ముస్లిం వ్యతిరేక సంస్ధ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఇండిపెండెన్స్‌ పార్టీ(యుకెఐపి). ఇది ఐరోపాయూనియన్‌లో బ్రిటన్‌ చేరటాన్ని, వలస కార్మికుల, ముస్లిం వ్యతిరేకపార్టీ. పురుటి సమయంలో ఇచ్చే వేతనాలకు, ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు ధరించేందుకు ఇది వ్యతిరేకం. దీని వత్తిడి కారణంగానే 2016లో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలా లేదా అన్న ప్రజాభిప్రాయ సేకరణ జరపటం, వైదొలగాలని తీర్పు రావటం తెలిసిందే. వలస కార్మికుల రాకను వ్యతిరేకిస్తున్న కారణంగా బ్రిటన్‌ కార్మికవర్గం గణనీయ భాగానికి దీనిపట్ల సానుకూల అభిప్రాయం వుందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో ఇదే మూడవ పెద్ద పార్టీ. స్ధానికంగా వున్నవారి కంటే వలస వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారనే అభిప్రాయం యువతలో పెరుగుతున్నది.

అబార్షన్లను వ్యతిరేకించటంతో సహా మహిళపట్ల అనేక తిరోగమన ధోరణులు కలిగిన జిమ్‌ డౌసన్‌ బ్రిటన్‌లో కంటికి కనిపించని పెద్ద మితవాది అని టైమ్స్‌ పత్రిక వర్ణించింది. ఇలాంటి నీచులైన మగవారందరూ ఇస్లాం నుంచి మహిళలను రక్షించేవారుగా తమకు తామే ముందుకు వస్తున్నారని డేనియల్‌ ట్రిల్లింగ్‌ అనే రచయిత ‘క్రూరమైన నీచులు: బ్రిటన్‌లో పచ్చి మితవాదుల పెరుగుదల’అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధాన స్రవంతి రాజకీయాలకు దూరంగా వుండే భావజాలాల పట్ల ఆసక్తిని రేకెత్తించటంలో ఇంటర్నెట్‌ కూడా కూడా దోహదం చేస్తోందని, పచ్చి మిత వాద వైఖరులకు యువతగురి అవుతోందని కూడా పేర్కొన్నారు. కుహనా వార్తల యుగంలో అసంఖ్యాక వనరులు ఈ భావాలకు ఆసరా అవుతున్నాయి ప్రత్యేకించి ఈ మితవాదులలో అనేక మంది ప్రధాన స్రవంతి మీడియాను నమ్మటం లేదని ట్రిల్లంగ్‌ పేర్కొన్నారు.

జర్మనీలో ఇటీవల వునికిలోకి వచ్చి గత ఏడాది ఎన్నికలలో 709 స్ధానాలున్న పార్లమెంటులో 94సీట్లతో మూడవ పెద్ద పార్టీగా ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ(ఎఎఫ్‌డి) అవతరించింది. ఆ పార్టీ పార్లమెంటరీ నేత 39 సంవత్సరాల ఎలిస్‌ ఎలిజబెత్‌. ఈ పార్టీ ముస్లిం, వలస కార్మికులకు వ్యతిరేకత, ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలని చెబుతుంది.దేశంలోకి ప్రవేశించేవారిని అడ్డుకొనేందుకు అవసరమైతే మారణాయుధాలను వుపయోగించమని అంటోంది. నాజీల అత్యాచారాలను గుర్తు చేసుకోవటం ఆపివేయాలని, వాటి గురించి తక్కువ మాట్లాడాలని కోరుతోంది.

నార్వేలో అధికారంలో వున్న సంకీర్ణ కూటమిలోని ప్రోగ్రెస్‌ పార్టీ మితవాది. దేశాన్నీ ముస్లిమీకరణ చేస్తున్నారని, పోలీసు యూనిఫాంలో హిజబ్‌ ధరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించే ఈమె ఇజ్రాయెల్‌ను పచ్చిగా సమర్ధిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇలా అనేక దేశాలలో వున్న ఇలాంటి మహిళల ద్వేషపూరిత వైఖరి, మాటలకు మన దేశంలో సాధ్వుల మని చెప్పుకుంటూ నోరుపారవేసుకొనే వారికి పెద్ద తేడా లేదు. మచ్చుకు ఢిల్లీని పాలించేందుకు రాముడి అంశలో పుట్టిన వారు కావాలో లంజలకు పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని సాధ్వి నిరంజన జ్యోతి గత ఎన్నికలలో ప్రసంగాలు చేసిన విషయం తెలిసినదే.ఈమె నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇక యోగులుగా చెప్పుకొనేవారి గురించి చెప్పనే అవసరం లేదు. చిత్రం ఏమిటంటే వీరందరూ బిజెపి మద్దతుదారులు, నేతలే కావటం విశేషం. ఏ విత్తనం వేస్తే ఆ కాయలే కాస్తాయి మరి.

మన దేశంలో పచ్చి మితవాద శక్తులతో నిండిన ఆర్‌ఎస్‌ఎస్‌, అది ఏర్పాటు చేసిన సంఘాల నాయకులు అనేక సందర్భాలలో తమ తిరోగామి భావాలను ఎలాంటి శషభిషలు లేకుండా వెల్లడిస్తూనే వున్నారు. అయినా అనేక మంది విద్యావంతులైన మహిళలు ఇలాంటి శక్తులను అనుసరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు ప్రవేశం లేదనే విషయం వేరే చెప్పనవసరం లేదు. ఎందుకు లేదో చెప్పరు. 2013 జనవరి ఆరున పిటిఐ ఒక వార్తను అందించింది.ఇండోర్‌ పట్టణంలో జరిగిన ఒక సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన వుపన్యాసంలోని అంశాలు ఇలా వున్నాయి.’ భర్త మరియు భార్య మధ్య ఒక ఒప్పందం వుంటుంది. దాని ప్రకారం నువ్వు నా ఇంటిని జాగ్రత్తగా చూడు, నేను నీ అవసరాలన్నింటినీ తీరుస్తాను, నిన్ను సురక్షితంగా వుంచుతాను అని భర్త చెబుతాడు. కాబట్టి భార్య ఒప్పందానికి అనుగుణ్యంగా వున్నంత వరకు భర్త కాంట్రాక్టు నిబంధనలను అనుసరిస్తాడు, భార్యతో వుంటాడు. భార్య ఒప్పందాన్ని వుల్లంఘిస్తే అతను ఆమెను వదిలించుకోవచ్చు ‘. ఈ వుపన్యాసం గురించి సిపిఎం నాయకురాలు బృందాకరత్‌ స్పందిస్తూ ‘ఇలా మాట్లాడటం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు అంతిమంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఇదే. అందుకే దీనిని రాష్ట్రీయ తిరోగమన సంఘ్‌ అని నేనంటాను. అధికారంలో వున్న బిజెపి పెద్దలు మనుస్మృతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఆయనిలాంటి భాషలో మాట్లాడారంటే తన భావజాలాన్ని ప్రతిబింబించినట్లే ‘ అన్నారు.

అంతకు ముందు అసోంలోని సిల్చార్‌లో మాట్లాడుతూ పశ్చిమ దేశాల ప్రభావం కారణంగా ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోనే మానభంగాలు జరుగుతున్నాయి, దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో జరగవు అని ఇదే భగవత్‌ గారు సెలవిచ్చారని కూడా పిటిఐ వార్తలో పేర్కొన్నది.’దేశ పట్టణ ప్రాంతాలలో మహిళలపై నేరాలు జరగటం సిగ్గు చేటు, ఇది ప్రమాదకర ధోరణి. అయిటే అటువంటి నేరాలు ‘భారత్‌ లేదా దేశ గ్రామీణ ప్రాంతాలలో జరగవు. మీరు గ్రామీణ ప్రాంతాలు లేదా అడవులకు వెళ్లండి అక్కడ సామూహిక మానభంగాలు లేదా లైంగిక పరమైన నేరాలు వుండవు. పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావంతో భారత్‌ ఎప్పుడు ఇండియాగా మారిందో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నారు. సమాజంలోని ప్రతి దొంతరలో నిజమైన భారతీయ విలువలు మరియు సంస్కృతిని చొప్పించాలి, అక్కడ మహిళను తల్లిగా చూస్తారు’ అన్నారు. భగవత్‌కు భారత్‌ గురించిగానీ ఇండియా గురించీ తెలియదు, ప్రభుత్వ లెక్కల ప్ర కారం గరిష్టంగా జరుగుతున్న అత్యాచారాలు పేదలు, దళితులు, గిరిజనుల మీదే అని బృందాకరత్‌ వ్యాఖ్యానించారు.

ప్రపంచ వ్యాపితంగా సామాజిక మీడియాలో మితవాద శక్తులు పెరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా వంటి చోట్ల మితవాదానికి శ్వేతజాతి జాతీయవాదం తోడవుతున్నది. మన దేశంలో హిందూత్వ జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నారు. దీనికి కులదురహంకారం, వెనుకబడిన తరగతులు, షెడ్యూలు కులాల పట్ల ద్వేషం తోడవుతున్నదని ఇటీవల జరిగిన ప్రణయ్‌ హత్యతో సహా అనేక వుదంతాలు వెల్లడించాయి. అనేక మంది యువతులు ఫేస్‌బుక్‌లో వీడియోలను పెట్టి తిరోగమన భావాలను వెల్లడించటం కొత్త పరిణామం. సమాజంలోని వున్నత తరగతులకు చెందిన మహిళలు పచ్చి మితవాద శక్తులు, వారు జరిపే ఆందోళనలవైపు మొగ్గటం గతంలో కూడా వున్నది ఇటీవలి కాలంలో పెరగటం గమనించాల్సిన అంశం. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు పచ్చిమితవాదులను మహిళా రక్షకులుగా అంగీకరించటం తప్ప ఇది వేరు కాదు. తమను యాజమాన్యాలకు అమ్మివేసే తొత్తులను కార్మికులు నమ్మినాయకత్వ స్ధానాలలో కూర్చో పెట్టటాన్ని చూస్తున్నాం. అలాంటిదే ఇది, గుండెలు బాదుకొని ఆందోళన చెందినందువలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శబరిమల తీర్పు 2 : ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు నాలికల వైఖరి !

08 Monday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Women

≈ Leave a comment

Tags

RSS doublespeak, RSS doublespeak on sabarimala, sabarimala, sabarimala verdict

Image result for rss doublespeak on sabarimala cartoons

ఎం కోటేశ్వరరావు

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 125 ప్రకారం విడాకుల తరువాత ముస్లిం మహిళలు భర్త నుంచి భరణం పొందేందుకు అర్హులే అని సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు నిచ్చింది. ఇది తమ మత సాంప్రదాయాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తీర్పును వమ్ము చేస్తూ కాంగ్రెస్‌ సర్కార్‌ ఏకంగా ఒక బిల్లునే పార్లమెంట్‌లో ఆమోదించింది. ఆ చర్యను వ్యతిరేకించిన బిజెపి అది ముస్లింల సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయం అని విమర్శించింది. కానీ అదే పార్టీ నేడు ఇప్పటి వరకు ఆ డిమాండ్‌ చేయలేదుగానీ దాన్ని మద్దతు దారులు అదే డిమాండ్‌ చేస్తున్నారు. తీర్పును పునర్విచారణ జరపాలని బిజెపి కోరుతున్నది. గమనించాల్సిందేమిటంటే శని శింగనాపూర్‌ దేవాలయంలో అసలు మొత్తంగా మహిళలకు ప్రవేశం లేదు. అది చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణ చేయాలని బిజెపి లేదా మహిళామోర్చా, ఇతర సంఘాలు గానీ డిమాండ్‌ చేయలేదు. పండలం మాజీ రాజకుటుంబం వారు షాబానో కేసు మాదిరి నరేంద్రమోడీ సర్కార్‌ కూడా శబరిమల తీర్పును రద్దు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాని గురించి ఇంతవరకు బిజెపి లేదా కేంద్రం నోరెత్తలేదు. నెపాన్ని సిపిఎం మీద నెట్టాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలను పట్టించుకోవటం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి చెబుతున్నాయి. కమ్యూనిస్టులు కనుక వారి వైఖరి వారికి వుంటుంది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ కొద్ది సంవత్సరాల క్రితం శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశించే అవకాశం ఇవ్వాలని కోరినపుడు భక్తులు గుర్తురాలేదా? ఎందుకీ అవకాశం వాదం, రెండు నాల్కల ధోరణి? కాంగ్రెస్‌ మైనారిటీ ముస్లిం ఛాందసవాదులను సంతృప్తి పరచేందుకు ప్రయత్నిస్తే నేడు బిజెపి మెజారిటీ హిందువుల ఓట్ల కోసం ఛాందసులను తృప్తి పరచేందుకు పూనుకుంది. కోర్టు తీర్పు అమలు గురించి చర్చించేందుకు రావాలని ఆలయ ప్రధాన పూజారి, ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. తీర్పుపై పునర్విచారణకు ప్రభుత్వం నిర్ణయించకుండా తాము చర్చలకు వచ్చేదని వారి ప్రతినిధులు ప్రకటించారు.

నాడు హిందూ కోడ్‌ బిల్లు ద్వారా హిందూ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ వాదించిన విషయం ముందే చెప్పుకున్నాము. అదే సంస్ధ సృష్టి అయిన బిజెపి జమ్మూకాశ్మీర్‌లో మహిళల వారసత్వహక్కు విషయంలో వివక్ష చూపుతున్నారని మొసలి కన్నీరు కార్చుతున్నది. అసలు లక్ష్యం దానికి ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370కి ఎసరు తేవటం. ఇదే బిజెపి వుమ్మడి పౌరస్మృతి గురించి చెబుతుంది. దీని వెనుక ముస్లిం, క్రిస్టియన్‌ వ్యతిరేకత వుంది. ఒక వైపు ముస్లింలు, క్రైస్తవులు ఎలాంటి కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లలను ఎక్కువ మందిని కంటూ హిందూ జనాభాను మైనారిటీగా చేసేందుకు కుట్రపన్నారని చెబుతారు, మరోవైపు బిజెపిలోని నోటి తుత్తర గాళ్లు, పెండ్లీ పెటాకులు లేని సన్యాసులు, సన్యాసినులు హిందూ మహిళలు కుటుంబ నియంత్రణను పక్కన పెట్టి ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతారు.

లవ్‌జీహాద్‌ పేరుతో హిందూ యువతులు ఇతర మతాలకు చెందిన వారిని వివాహం చేసుకోకుండా చూసేందుకు సంఘపరివార్‌ సంస్ధలు నిరంతర ప్రచారం చేస్తున్నాయి. మత వుద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. వాలెంటైన్స్‌ డే రోజున వారంతా బృందాలుగా పార్కుల వెంట తిరుగుతూ కనిపించిన యువతీ యువకులను కొట్టటం, వివాహం చేసుకోమని బలవంత పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నిచ్చెన మెట్ల వంటి మన కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న అమ్మాయి ఎవరైనా కింది మెట్టులో వున్న అబ్బాయిని వివాహం చేసుకుంటే యువకులను హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాంటి చర్యలను సామాజిక మాధ్య మాల్లో నిస్సిగ్గుగా సమర్ధించేవారంతా పై తరగతికి చెందిన వారే అన్నది అందరికీ తెలిసిన నిజం. అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు, బంధువులు ముస్లింలను వివాహాలు చేసుకున్నారు. అది మాత్రం ఇలాంటి బాపతుకు లవ్‌ జీహాద్‌గా కనిపించదు. సుబ్రమణ్యస్వామి కుమార్తె సుహాసిని మాజీ అధికారి సల్మాన్‌ హైదర్‌ కుమారుడు నదీమ్‌ను, బిజెపినేతలు సికిందర్‌ భక్త్‌, షా నవాజ్‌ ఖాన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ హిందూ యువతులను వివాహం చేసుకున్నారు. ఎల్‌కె అద్వానీ మేనకోడలు ఒక ముస్లింను వివాహం చేసుకుంది. సామాన్యులనే సమిధలుగా చేస్తున్నారు. మతకొట్లాటలను రెచ్చగొట్టేందుకు అలాంటి వుదంతాలను వినియోగించుకుంటున్నారు.

ఆమోదంతో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్‌ 377ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీని మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఎనిమిదేండ్ల పాటు ఈ కేసు నడిచింది. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్న యోగి ఆదిత్యనాధ్‌ 2013లో బిజెపి పార్లమెంట్‌ సభ్యుడిగా వుండి ఏం మాట్లాడారో చూడండి. ‘ సామాజిక నీతికి స్వలింగ సంపర్కం ప్రమాదకరం, సామాజిక కట్టుబాట్లు, సరిహద్దులను చెరిపివేస్తే ఆ తరువాత మనిషి జంతువుకు తేడా వుండదు. చౌకబారు కుతర్కంతో మత గ్రంధాలకు వీటిని జత చేయటం పూర్తి అనైతికం, ఇంట్లో చేసే వాటిని నాలుగు రోడ్ల కూడలిలో చేస్తామని ఎవరైనా అంటే దాన్ని సమాజం అంగీకరించకూడదు. దానికి ఏవిధమైన రాజ్యాంగ బద్దత కూడా వుండకూడదు’ అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షం వున్న కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌ 2011లో కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ‘ దురదృష్టం కొదీ ఎయిడ్స్‌ వ్యాధి ప్రపంచానికి మన దేశానికి వచ్చింది. ఒక పురుషుడు మరొక పురుషుడితో కలిస్తే ఇది వస్తుంది. ఇది పూర్తిగా అసహజమైనది, జరగకూడనిది, కానీ జరుగుతోంది. బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి మరొక అడుగు ముందుకు వేసి 2013లో మాట్లాడుతూ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేస్తే అది లాభదాయకంగా మారి అన్ని పట్టణాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో స్వలంగ సంపర్క బార్లను తెరవటానికి దారి తీస్తుంది’ అన్నారు. ఇప్పటికి ఎన్ని బార్లు తెరిచారో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తిరుగుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మనకు చెప్పాలి. ఇక ప్రతిదాన్నీ తన కంపెనీ లాభాల కోసం వినియోగించుకుంటున్న యోగా గురు బాబారామ్‌ దేవ్‌ ఈ అంశాన్ని కూడా వదల లేదు. స్వలింగ సంపర్కులు తన యోగాశ్రమానికి వస్తే దీనికి గ్యారంటీగా చికిత్స చేస్తామని చెప్పాడు. ఇది సాధారణంగా, సహజంగా మానవ మాత్రులెవరూ చేయకూడనిది అని టీవీల్లో బోధలు చేసే ముస్లిం పండితుడు జకీర్‌ నాయక్‌ చెప్పారు.

శబరి మల తీర్పుపై పునర్విచారణ పిటీషన్‌ వేయాలన్న డిమాండుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నదని ముస్లింలీగ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి ప్రకటించారు.భక్తుల మనోభావాలను గౌరవిస్తున్న కారణంగానే ఆలయపవిత్రతను కాపాడాలని యుడిఎఫ్‌ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు.కోర్టు తీర్పు కంటే భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వైఖరి వల్లనే అలజడి తలెత్తింది. నేడు ఇది శబరిమల విషయంలో జరిగింది రేపు దీని ప్రభావం ఇతర విశ్వాసాల మీద కూడా పడవచ్చు అన్నారు. శబరిమల తీర్పు అమలు హేతువాదులకు,నాస్తికులకు ఒక సమస్యగాకపోవచ్చుగానీ కోట్లాది భక్తులకు ఇది ప్రధాన సమస్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పునర్విచారణ పిటీషన్‌ దాఖలు చేయవచ్చు. మసీదుల్లో మహిళల ప్రవేశం గురించి కొన్ని ముస్లిం సంస్ధలు అనుమతించాలని కోరుతుండగా మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.

భక్తుల విశ్వాసాలను గౌరవించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మహిళలను వీధుల్లోకి సమీకరిస్తున్నాయి. తొలుత కోర్టు తీర్పుకు అనుకూలంగా మాట్లాడిన ఆ సంస్ధ వెంటనే ప్లేటు ఫిరాయించింది. సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ భక్తుల మనోభావాలను విస్మరించకూడదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి సన్నాయి నొక్కులు నొక్కారు. సమీక్ష పిటీషన్‌ వేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇది జరిగిన మరుసటి రోజు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నడిపే జన్మభూమి దినపత్రికలో జోషి ప్రకటన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ మేధావి, భారతీయ విచార కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ అయిన ఆర్‌ సంజయన్‌ రాసిన ఒక వ్యాసంలో కోర్టు తీర్పును సమర్ధించటం గమనించాల్సిన అంశం. వున్నత న్యాయ స్ధానం తీర్పు ఆలయ మౌలిక సాంప్రదాయాలు, క్రతువులను ఏ విధంగానూ మార్పు చేయదని, వాస్తవానికి మరింత మంది మహిళా భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తే దాని ప్రాధాన్యత, ప్రజాదరణ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. పది-యాభై సంవత్సరాల మధ్య వయస్సున్న వారి మీద వున్న ఆంక్షలను మాత్రమే కోర్టు కొట్టివేసింది. అటువంటి సాంప్రదాయాలు సక్రమం అని నిరూపించటానికి తర్కబద్దంగా లేదా తగిన శాస్త్రీయ పద్దతులు కూడా లేవని స్పష్టం చేశారు. ఆలయ అధికారుల సహాయంతో గతంలో అన్న ప్రాసన కార్యక్రమాలు కూడా జరిగాయని, పిల్లలను కనే వయస్సులో వున్న మహిళ ప్రవేశంపై ఆంక్షలు విధించాలని 1991లోనే కేరళ హైకోర్టు ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. దేవాలయాన్ని సందర్శించాలా లేదా అనే, ఎప్పుడు ఆ పని చేయాలి అనే అంశాలను నిర్ణయించుకొనే స్వేచ్చ మహిళలకే వదలి వేయాలి.వారికి నిర్ణయించుకొనే సామర్ధ్యం వుంది, పితృస్వామ్య రోజులు అంతరించాయని ప్రతి ఒక్కరూ గుర్తించటం అవసరం అని కూడా పేర్కొన్నారు. తిరువనంతపురం లోని భారతీయ విచార కేంద్రం డైరెక్టర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అయిన పి పరమేశ్వరన్‌ 2006నవంబరులో త్రిసూర్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మహిళలు దేవాలయ సందర్శనను కోరుకుంటే వారిని అనుమతించాలి, అనుమతించకపోవటానికి ఎలాంటి కారణం లేదు అన్నారు.

మహిళలు కొండమీద వున్న ఆలయాన్ని చేరుకొనేందుకు ఎక్కలేరు, మహిళా కార్యకర్తలు తప్ప మూమూలు నిజమైన భక్త మహిళలెవరూ ఆలయాన్ని సందర్శించరు అనేవారు కొందరు. రెడీ టు వెయిట్‌ అంటే మాకు ఆలయ ప్రవేశ అర్హత వచ్చేంత వరకు వేచి చూస్తాం అనే నినాదంతో కొందరు మహిళలు ప్రచారం చేస్తున్నారు. మహిళలు అంత ఎత్తు ఎక్కలేరు, గంటల తరబడి వేచి వుండలేరు అని చెప్పే మహానుభావులారా అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న వారు అయ్యప్ప ఆలయానికి వెళ్లలేరా? వెళ్లాలా లేదా అనేది ఎవరిష్టం వారిది. వివక్ష కూడదన్నది సహజన్యాయం తప్ప బలవంతంగా వారిని గుళ్ల చుట్టూ తిప్పాలని ఏ కోర్టూ చెప్పలేదు, చెప్పదు. బస్సుల సౌకర్యం లేనపుడు ఏడుకొండలు ఎక్కి తిరుమలలో వెంకటేశ్వరుడిని మహిళలు దర్శించలేదా? ఇప్పుడు నడకదారిలో వెళుతున్నవారు లేరా ? శక్తి వున్న వారు నడుస్తారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశ అర్హత వున్న పదేండ్ల లోపు వారు, యాభై ఏండ్ల పైబడిన వారు నడవగలరని ఎవరైనా చెప్పగలరా? ఇక మహిళా కార్యకర్తలు మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తారని వుక్రోషంతో చెబుతున్నమాట తప్ప మరొకటి కాదు, ఆ మాట చెప్పిన ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పద్మకుమార్‌ మహిళలకు సౌకర్యం కోసం వంద ఎకరాల స్ధలం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేయటం అవసరం. ఆసక్తి వున్న వారికి అవకాశం కల్పించమని అడగటం తప్ప ఆంక్షలను వ్యతిరేకించే కమ్యూనిస్టు పురుషులు, మహిళా కార్యకర్తలెవరూ అయ్యప్పమాల వేసుకొని దర్శనాలు గతంలో చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యరు.

శబరిమల తీర్పును ఆలిండియా కాంగ్రెస్‌ స్వాగతిస్తే కేరళ కాంగ్రెస్‌ నాయకుడు రమేష్‌ చెన్నితల మాత్రం అతని కంటే ఘనుడు ఆచంటమల్లన అన్నట్లు బిజెపి కంటే రెండాకులు ఎక్కువ చదివాడు. విశ్వాసం కంటే హేతుబద్దత పైచేయిగా వుండకూడదు అనటాన్ని నేను సమర్ధిస్తాను, తప్పుడు వాదాల ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తున్నది, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, దేవస్ధానం బోర్డు భిన్నవైఖరులు తీసుకున్నాయి, తీర్పు పునర్విచారణ కోరాలి అని చెన్నితల వ్యాఖ్యానించారు. కోర్టు విచారణ ఒక రోజు ప్రారంభమై మరుసటి రోజుకు ముగియలేదు. సంవత్సరాల పాటు సాగింది, అదేమీ రహస్యంగా జరగలేదు, ఒక పక్షం తప్పుడు వాదాలు చేస్తే రెండవ పక్షం ఏమిచేసినట్లు? కోర్టు అంత గుడ్డిగా తీర్పు ఇచ్చినట్లా ? ప్రజాస్వామ్యంలో కోర్టు తీర్పు మీద అప్పీలు చేయవచ్చు.

ఎవరైనా ఒక వివాదంలో తనకు న్యాయం జరగలేదనుకున్నపుడు, తన వాదనను సరిగా పట్టించుకోలేదని భావించినపుడు కోర్టు తీర్పు మీద అప్పీలు చేసుకొనేందుకు, పునర్విచారణ కోరేందుకు అవకాశం, హక్కు వుంటుంది. శబరిమల కేసులో మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు వుండరాదన్నది ఎల్‌డిఎఫ్‌ వైఖరి, దాన్నే కోర్టుకు సమర్పించింది, దానికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చింది. అందుకే అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తన వైఖరికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చినందున పునర్విచారణ కోరటం అనే సమస్య ప్రభుత్వం ముందు వుండదు. అయినా సరే కోరకపోవటం తప్పని సిపిఎం వ్యతిరేకులు దాడి చేస్తున్నారు. ప్రజలకు ప్రధాన శత్రువుగా ఏ పార్టీ వుంది, ఏ అంశం ముప్పు కలిగిస్తుంది అని ఎంచుకోవటం, దానికి అనుగుణ్యంగా ఎత్తుగడలు నిర్ణయించుకోవటం గురించి సిపిఎం తీసుకున్న నిర్ణయాలతో ఎవరైనా ఏకీభవించకపోవచ్చు, మంచి చెడ్డలను విమర్శించవచ్చు. అయితే సామాజిక విషయాల్లో ఇంతవరకు ఓట్లకోసమో, మరొకదాని కోసమో గతంలో ప్రకటించిన తన సూత్రబద్ద వైఖరులను నవీకరించుకుందేమోగాని ఒకసారి నిర్ణయించుకున్న తరువాత దానికి విరుద్దంగా మార్చుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు అనే అంశంలో దాని రాజకీయ వ్యతిరేకులు కూడా ఏకీభవించకతప్పదు. శబరిమల ఆలయ విషయంలో కూడా అదే రుజువైంది. విఎస్‌ అచ్యుతానందన్‌ ముఖ్య మంత్రిగా వుండగా ఇచ్చిన అఫిడవిట్‌లో ఆంక్షలను వ్యతిరేకించింది. తరువాత అధికారానికి వచ్చిన యుడిఎఫ్‌ దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టుకు మరొక అఫిడవిట్‌ను సమర్పించింది. ఐదేండ్ల తరువాత తిరిగి అధికారానికి వచ్చిన సిపిఎం తన పూర్వపు వైఖరినే కోర్టులో పునరుద్ఘాటించింది.

మాటతప్పదు, మడమ తిప్పదు అని ఎంతో మంది నమ్మే ఆర్‌ఎస్‌ఎస్‌ శబరిమల విషయంలో అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి ఇప్పుడు రెండు నాలికలతో మాట్లాడారు.దీని వెనుక వున్న కారణాన్ని తరువాత చెప్పుకుందాం. రెండు సంవత్సరాల క్రితం ఆలయ ప్రవేశం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏం చెప్పిందో చూద్దాం. ‘ కొన్ని ప్రాంతాలలో కొన్ని అనుచిత సాంప్రదాయాల కారణంగా ఆలయ ప్రవేశం సమస్యపై ఏకాభిప్రాయం లేదు. ఎక్కడైతే అటువంటి సమస్యలు ముందుకు వచ్చాయో, తగిన చర్చల ద్వారా అలాంటి ఆలోచనా వైఖరిని మార్చేందుకు ప్రయత్నించాలి.సమాజ హితానికి వ్యతిరేకులైన కొందరు గత కొద్ది రోజులుగా మహిళల ఆలయ ప్రవేశంపై మింగుడు పడని వివాదాన్ని లేవనెత్తుతున్నారు. మత, ఆధ్యాత్మిక వ్యవహారాలు, ఆరాధన, విశ్వాసాల వంటి విషయాలలో స్త్రీ పురుషులు సహజంగానే సమాన భాగస్వాములు అనే ఒక వున్నత సాంప్రదాయాన్ని గతం నుంచీ పాటిస్తున్నాము. మహిళలు వేదాలు నేర్చుకుంటున్నారు, సహజపద్దతుల్లోనే వారు ఆలయ పూజారులుగా కూడా పని చేస్తున్నారు ‘ 2016 మార్చి రెండవ వారంలో రాజస్ధాన్‌లోని నాగౌర్‌ సమీపంలో జరిగిన మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధుల సభకు సమర్పించిన నివేదికలో సురేష్‌ భయ్యాజీ ఈ మాటలు చెప్పినట్లు డక్కర్‌ హెరాల్డ్‌ పత్రిక వెల్లడించింది. శబరిమల ఆలయంలో కొన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశ నిషిద్ధం వెయ్యి సంవత్సరాల నాటి ఆచారం అని చెప్పినా అర్ధం లేదు, పురుషులకు ఏ పరిమితులు విధించారో మహిళందరికీ అవే వుండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోందని కూడా సురేష్‌ చెప్పారు. నాడు కేరళలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ మహిళల ప్రవేశానికి వ్యతిరేకం. అదే సమయంలో మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌ ఆలయంలో మహిళల ప్రవేశం గురించి వివాదం నడుస్తున్నది. ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసం వచ్చింది, అంతకు ముందు అదే పత్రిక సంపాదకీయంలో గౌరవ ప్రదమైన చర్చ జరగాలని బోధ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రవేశానికి సుముఖత వ్యక్తం చేయగా మంత్రి పంకజ్‌ ముండే వంటి వారు వ్యతిరేకించారు.ఈ సమావేశంలోనే నిక్కర్లను విప్పేసి పాంట్లు( పురాణాలు, వేదాలు, ఛాందసవాదుల ప్రకారం నిక్కరు,పాంట్లు మన సంస్కృతి కాదు) వేసుకోవాలని తీర్మానించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ, అనుసరించే సంస్ధలు విశ్వాసాలు, నమ్మకాలు, సాంప్రదాయాల మీద కోర్టులు తీర్పు చెప్పజాలవనే వాదనను చాలా కాలంగా ముందుకు తెస్తున్నాయి. కూల్చివేసిన బాబరీ మసీదు స్ధలంలోనే రాముడు పుట్టాడని, అక్కడి రామాలయాన్ని కూల్చి బాబరు కాలంలో మసీదు నిర్మి ంచారని వాదిస్తున్నది. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విశ్వాసాలకు ఆధారాలేమిటని ఎదురుదాడికి దిగుతున్నది. బాబరీ మసీదు స్థల యాజమాన్య హక్కుల గురించి దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు వివాదంలో అది తమకు అనుకూలంగా వస్తే ఈ శక్తులు మిన్నకుంటాయి లేకపోతే తమ విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఆ తీర్పును వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అందుకే శబరిమల, శని సింగనాపూర్‌ వంటి వాటిని ఆసరా చేసుకొని తమ వాదనలను ముందుకు తెస్తున్నాయి. అందుకు గాను మహిళలను ముందు నిలుపుతున్నాయి.

మత ప్రాతిపదికన జనాన్ని చీల్చి అధికారానికి రావాలన్న మతోన్మాదుల ఎత్తుగడల్లో ప్రార్ధనా స్దలాలను వివాదాస్పదం చేయటం. దానిలో భాగమే రామాలయాన్ని కూల్చివేసి బాబరీ మసీదును కట్టారనటం, వారణాసిలో ఔరంగజేబ్‌ కాలంలో నిర్మించిన జ్ఞానవాపి మసీదు కాశీవిశ్వనాధుని ఆలయమని వివాదాలను రేపిన విషయం తెలిసినదే. కేరళలో పట్టు సంపాదించేందుకు శబరిమల ఆలయం మీద క్రైస్తవులు కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా దానిలో భాగమే. ఆలయం పరిసర ప్రాంతాలలో క్రైస్తవులు ఎక్కువగా నివశిస్తున్నారు. అయ్యప్ప ఆలయ సమీపంలో పెద్ద చర్చిని నిర్మించి క్రైస్తవ యాత్రా కేంద్రంగా మార్చాలన్న కుట్ర వుందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి కేరళలో క్రైస్తవం ఎన్నో శతాబ్దాల క్రితమే వ్యాపించింది. బ్రాహ్మలతో సహా అనేక నిచ్చెన మెట్ల వ్యవస్ధలో ఎగువున వున్న కులాలవారు ఎప్పుడో క్రైస్తవులుగా మారిపోయారన్నది చరిత్రలో దాగని సత్యం. తెలుగు ప్రాంతాలలో రెడ్డి, కమ్మ క్రైస్తవుల మాదిరి కేరళలో సిరియన్‌ క్రైస్తవులంటే అగ్రకులాలకు చెందిన వారే. తెలుగు ప్రాంతాలలో మాదిరి తాళిబట్టుతో సహా అనేక హిందూ సంప్రదాయాలను వారు పాటిస్తారు. సిరియన్‌ క్రిస్టియన్లు అనేక రంగాలలో ప్రముఖులుగా, ధనికులుగా వున్నారు.వారే ఆ ప్రాంతంలో చర్చి నిర్మించతలపెట్టారన్నది ఆరోపణ. బాబరీ మసీదు నిర్మాణంలో రామాలయ నిర్మాణ స్ధంభాలను వుపయోగించారని ఆధారంలేని ప్రచారం చేస్తున్నట్లే శబరిమల ఆలయానికి 20కిలోమీటర్ల దూరంలోని నీలక్కల్‌ శివాలయంలో రెండువేల సంవత్సరాల నాటి కొయ్య శిలువ బయటపడిందని, దానిని సిరియన్‌ క్రిస్టియన్‌ సమూహ ఆద్యుడు సెయింట్‌ థామస్‌ స్వయంగా తీసుకువచ్చిన 1983లో ప్రచారంలోకి వచ్చింది. సెయింట్‌ థామస్‌ చర్యను సహించని తమిళ బ్రాహ్మడు ఆయనను కత్తితో పొడిచి చంపాడని ప్రచారం చేశారు. దాన్ని నమ్మిన క్రైస్తవులు ఆ ప్రాంతాన్ని సందర్శించటంతో పాటు చర్చి నిర్మాణానికి స్ధలం కావాలని కోరారు. దానికి నిరసనగా బిజెపి నేత, ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా వున్న కుమనం రాజశేఖర్‌ ఆందోళనకు నాయకత్వం వహించాడు.తరువాత అక్కడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అటవీ భూమిని కేటాయించారు. నిజానికి రెండువేల సంవత్సరాల నాటి కొయ్య మన దేశవాతావరణ పరిస్ధితులలో చెక్కుచెదరకుండా వుండటం అసాధ్యం. అయితే తరువాత వచ్చిన వార్తల ప్రకారం బాబరీ మసీదు ప్రాంగణంలో దొంగతనంగా రాముడి విగ్రహాన్ని పెట్టినట్లే అక్కడి శివాలయంలో శిలువను పెట్టారని తేలింది.హైదరాబాదులో హుస్సేన్‌ సాగర్‌ చెరువుకు హిందూమతశక్తులు వినాయకసాగర్‌ పేరు పెట్టినట్లుగానే క్రైస్తవమతశక్తులు అయ్యప్ప కొండను సెయింట్‌ థామస్‌ కొండగా పిలవటం ప్రారంభించారు.సెయింట్‌ థామస్‌ హత్య వాస్తవం కాదని, ఆయన ఇటలీలోని ఓర్టానాలో మరణించాడని వాటికన్‌ తరువాత వివరణ ఇచ్చింది. నిజానికి సిరియన్‌ క్రిస్టియన్లు వలస వచ్చిన వారి వారసులు కాదని, స్ధానిక బ్రాహ్మలే మతం మార్చుకున్నారని 1883లోనే ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. హిందూ మతశక్తులు ఎలా కుట్రలు చేస్తున్నాయో శబరిమల ప్రాంతంలోని క్రైస్తవ మతోన్మాదులు కూడా అలాంటి వాటిలోనే నిమగ్నమయ్యారని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శబరిమల తీర్పు 1 : సాంప్రదాయ ముసుగులో బిజెపి-ముస్లింలీగ్‌-కాంగ్రెస్‌ బృందగానం !

07 Sunday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

congress- bjp- muslim league chorus, Kerala LDF, Ready to wait, Sabarimala Entry Case, sabarimala verdict

TDB says Only real women devotees expected to visit Sabarimala temple

ఎం కోటేశ్వరరావు

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచ్‌ మెజారిటీ (4ా1) తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో బిజెపి అనుబంధ విభాగమైన మహిళా మోర్చా,యువమోర్చా తదితర సంస్ధలు రంగంలోకి దిగాయి. ప్రదర్శనలు, ఇతర రూపాల్లో ఆందోళనలు చేయిస్తున్నాయి. మహిళలకు అనుకూలంగా వచ్చిన తీర్పులను బిజెపి ఎంత రెచ్చగొట్టినా మహిళలే వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటం ఏమిటని అనేక మందిలో ఆశ్చర్యం, ఆవేదన, ఆందోళన కలిగి వుండవచ్చు.వేలు, లక్షల సంఖ్యలో రైతులు, కార్మికులు, వుద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ఒక్క ముక్క కూడా వార్తలు, చిత్రాలను ప్రచురించని పత్రికలు వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అతిశయోక్తులను జోడించటం కూడా చాలా మందికి మింగుడుపడటం లేదు. సమాజం మొత్తం మీద చూసినపుడు వెనుకబడిన వారిలో మహిళలు అత్యంత వెనుకబడిన వారని, ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో వున్న పరిస్ధితులు, పరిణామాలను గుర్తిస్తే ఇలాంటి ప్రదర్శనల గురించి ఆశ్చర్యపడాల్సిన పని వుండదు. తిరోగామి భావజాల ప్రభావం సామాజికంగా వెనుకబడిన వారి మీద ఎక్కువగా వుంటుంది. మహిళలకు మినహాయింపు ఎలా వుంటుంది. అనేక వుదంతాలలో వారిని వారిని ముందుకు తెచ్చిన ఫ్యూడల్‌, ఇతర తిరోగామి శక్తులను చూశాము. అనేక ఆందోళనలు అవి రిజర్వేషన్లకు వ్యతిరేకం నుంచి దళితుల మీద దాడులు, వేర్పాటు వాదం నుంచి విచ్చిన్న వాదాల ఆందోళనల వరకు జరిగిన వాటిలో మహిళలు గణనీయంగా పాల్గనటం తెలిసిందే. అలాంటి వాటి గురించి వార్తలను గుప్పించటం, ఆందోళనలు, పోరాటాలను విస్మరించటం కార్పొరేట్‌, పాలకవర్గాల మీడియా వర్గదృష్టిలో భాగమని వేరే చెప్పనవసరం లేదు.

శబరిమల తీర్పు వివిధ రాజకీయపార్టీల, స్వచ్చంద లేదా సాంస్కృతిక సంస్ధల ముసుగులో వున్న శక్తుల బండారాన్ని, ఫ్యూడల్‌ శక్తుల సంతుష్టీకరణకు పడే తాపత్రయాన్ని బయట పెడుతున్నది. చిత్రం ఏమిటంటే మహిళల పట్ల మత విషయాలలో నాణానికి బమ్మా బరుసు వంటి బిజెపి-ముస్లింలీగ్‌ ఒకే పాట పాడుతున్నాయి, ఆ బృందగానంలో కాంగ్రెస్‌ గొంతు కలిపింది. శబరిమల ఆలయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుకొనేందుకు సాంప్రదాయ ముసుగు వేసుకొని రంగంలోకి దిగటమే కాదు, ఓట్ల రూపంలో సొమ్ము చేసుకొనేందుకు బిజెపి, కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌, ఇతర శక్తులు పోటీ పడుతున్నాయి. తీర్పుపై పునర్విచారణకు అప్పీలు చేయరాదని నిర్ణయించినందుకు సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. కారాలు మిరియాలు నూరుతున్నాయి. మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను ముఖ్యంగా మహిళ్లో రెచ్చగొట్టేందుకు పూనుకున్నాయి.ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదనే ముద్రవేయాలన్నది కుటిలనీతి. ఒక పురోగామి తీర్పు, పరిణామాన్ని అడ్డుకోవాలంటే దానికి సాంప్రదాయ ముసుగువేయి అన్నది మతోన్మాద, కులోన్మాద శక్తులు, వాటికి అంటకాగే అవకాశవాద శక్తులఎత్తుగడ. వివిధ సందర్భాలలో ఇది వెల్లడైంది. మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష శక్తులన్నీ ఏకమైన తరుణంలో ఆచితూచి వ్యవహరించేందుకు అక్కడి వామపక్ష ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా అరవై సంవత్సరాల క్రితం ఇదే కేరళలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతసంస్ధలు, వాటి రాజకీయ ప్రతినిధులు, వారికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌కు అమెరికా గూఢచార సంస్ధ డబ్చిచ్చి మరీ విమోచన సమరం పేరుతో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఆధ్వర్యాన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది. ఇప్పుడు శబరిమల పేరుతో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అని ఇప్పుడే చెప్పలేము గాని శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం కనిపిస్తున్నది. నంబూద్రిపాద్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ కమ్యూనిస్టు విప్లవ అజెండాలోనివి కాదు, ప్రజాస్వామిక స్వభావం కలిగినవే. స్వాతంత్య్రవుద్యమంలో ముందుకు వచ్చిన భూ సంస్కరణల అమలుకు పూనుకుంది. కౌలుదార్లకు రక్షణ కల్పించటం, వ్యవసాయ కార్మికుల కనీసవేతనాలు పెంచటం, ప్రయివేటు విద్యా సంస్ధలలో వుద్యోగనియామకాల క్రమబద్దీకరణ, వేతనాలను ట్రెజరీల ద్వారా చెల్లించాలని, చట్టాన్ని వుల్లంఘించిన విద్యా సంస్ధలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి సాధారణ అంశాలు మాత్రమే వున్నాయి. నిజానికి వీటి మీద వాగ్దానాలు చేయని పార్టీ లేదు. కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన ‘నేరం’ ఏమిటంటే చేసిన వాగ్దానాన్ని అమలు జరపటమే. దీనికి వ్యతిరేకంగా సర్వమత శక్తులతో పాటు నేతిబీరలో నెయ్యి మాదిరి సోషలిస్టు పార్టీల ముసుగులో వున్న శక్తులు కూడా మతశక్తులు, కాంగ్రెస్‌తో చేతులు కలిపి తమ బండారాన్ని తాము బయట పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆందోళనకు దిగిన అంశం కూడా కమ్యూనిస్టు అజెండాలోనిది కాదు. చట్టబద్దమైన పాలనకు కట్టుబడడిన వారిగా శబరిమల తీర్పును అమలు జరుపుతామని ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ ప్రకటించటంతో రాజకీయ లబ్ది పొందేందుకు అన్ని రకాల శక్తులు రంగంలోకి దిగాయి. గతంలో చేసిన కుట్రలను జయప్రదంగా తిప్పి కొట్టిన కమ్యూనిస్టులు ఈ సారి దానిని ఎలా అధిగమిస్తారన్నదే ఆసక్తి కలిగించే అంశం.

మన దేశంలో పురోగమన వాదానికి కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయ వాదులు, తిరోగమన వాదానికి ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో ఏకీభవించే బిజెపి, శివసేన, వాటిఅనుబంధ సంస్థలు, ఏది వాటంగా వుంటే ఆవైపు మొగ్గే అవకాశవాదానికి ప్రతీకలుగా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ బూర్జువా పార్టీలని స్థూలంగా చెప్పవచ్చు. వూహాజనితమైన, భావోద్రేకాలను రెచ్చగొట్టే అంశాలను ముందుకు తెచ్చి దేశాన్ని పట్టి పీడిస్తున్న తక్షణ సమస్యలుగా చిత్రించటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెట్టింది పేరు. వుదాహరణకు లవ్‌ జీహాద్‌. ముస్లిం యువకులు హిందూ బాలికలను ఆకర్షించి వివాహాలు చేసుకొని ముస్లింలుగా మార్చివేస్తున్నారన్నది వాటిలో ఒకటి. అందుకోసం హిందూ కుటుంబాలన్నింటినీ కలసి దాని గురించి చెప్పాలని పిలుపునిస్తారు. వాలెంటైన్స్‌ డే రోజున ఏడాదికి ఒకసారి పార్కుల వెంట తిరిగి ప్రేమికుల కోసం వెతకటం రెండవది. ఈ బాపతు భాషలో చెప్పాలంటే రుక్మిణిని లేపుకు పోయి వివాహం చేసుకున్న కృష్ణుడిని మాత్రం ఆదర్శ పురుషుడిగా కొలుస్తారు.

మూడుసార్లు తలాక్‌ చెప్పటం ద్వారా విడాకులు చెల్లవని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము ముస్లిం మహిళలను విముక్తి చేశామని, అందువలన వారంతా బిజెపికే ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి మహిళల పట్ల ఆ పార్టీకి లేదా దానిని సృష్టించిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి చిత్తశుద్ది లేదు. హిందూకోడ్‌ బిల్లు విషయంలో అదెలా వ్యవహరించింది చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ గాంధీ తరువాత భారత్‌ అనే తన పుస్తకంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా వుంది. ధర్మశాస్త్రాల ప్రాతిపదికన ఏర్పడిన హిందూ చట్టాలలో జోక్యం చేసుకొనేందుకు రాజ్యాంగపరిషత్‌కు ఎలాంటి హక్కు లేదంటూ 1949లోనే ఆలిండియా యాంటీ హిందూకోడ్‌ బిల్‌ కమిటీ ఏర్పడింది. దేశమంతటా సభలు పెట్టారు. వుపన్యాసాలు చేసిన వారు, పాల్గన్న వారంతా ధర్మ యుద్ధ సైనికులుగా పోరాడతామన్నారు. ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సభను ఏర్పాటు చేసింది. హిందూ సమాజంపై బిల్లు ఆటంబాంబు వంటిదని ఒక వక్త వర్ణించాడు. రౌలట్‌ చట్టం బ్రిటీష్‌ రాజ్య పతనానికి నాంది పలికినట్లుగా ఈ బిల్లు నెహ్రూ ప్రభుత్వపతనానికి దారి తీస్తుందన్నారొకరు. మరుసటి రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రాజ్యాంగపరిషత్‌ భవనం వద్ద ప్రదర్శన చేశారు. నెహ్రూ, అంబేద్కర్‌ దిష్టిబమ్మలను తగులబెట్టారు. ఒక అంటరాని వ్యక్తికి బ్రాహ్మ ణులు కాపాడే విషయాలతో పనేమిటని కరపత్రిజీ మహరాజ్‌ అనే పెద్దగా తెలియని ఒక స్వామిజీ అంబేద్కర్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించాడు. పురుషులు రెండో వివాహం చేసుకోవటం గురించి యాజ్ఞవల్క్యుడే స్వయంగా ఇలా చెప్పాడంటూ సమర్ధించాడు. దాని ప్రకారం భార్యకు నిరంతరం మద్యం తాగే అలవాటు వుంటే, పిల్లలు పుట్టరని తేలితే, మాయలాడి, పెద్ద నోరుగలది, మగ పిల్లలు లేకుండా కేవలం ఆడపిల్లలను మాత్రమే కన్నపుడు, భర్తను ద్వేషించినపుడు మొదటి భార్య జీవించి వున్నా భర్త రెండవ వివాహం చేసుకోవచ్చనిచెప్పాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం విడాకులు నిషేధం ఇలా సాగింది స్వామీజి సమర్దన. బిల్లుకు వ్యతిరేకంగా ద్వారకా పీఠ శంకరాచార్య ఒక ఫత్వా జారీచేశారు.

ఈ పూర్వరంగంలో లింగవివక్ష నివారణ, మహిళలకు సమాన స్థాయి కల్పించే లక్ష్యంతో రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడు అంబేద్కర్‌ నాటి ప్రధాని నెహ్రూ మద్దతుతో 1951లో హిందూ కోడ్‌ బిల్లును ప్రతిపాదించారు. దానిలో మహిళలకు వారసత్వం, విడాకులు,భరణపు హక్కులను ఇవ్వటంతో పాటు వివాహవయస్సు పెంపు, బహుభార్యాత్వానికి వ్యతిరేకత, వితంతు వివాహాలు, బాల్యవివాహాల నిరోధం వంటి అనేక పురోగామి అంశాలను దానిలో చేర్చారు. ఈ బిల్లును ఆనాడు హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌, నేటి బిజెపి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అది హిందూ జీవన విధానాన్ని, మహోన్నతంగా నిర్మితమైన హిందూ సంస్కృతిని నాశనం చేస్తాయని నాశనం చేస్తాయని గగ్గోలు పెట్టాయి. వారికి మిగతా మితవాద సంస్థలు, కాంగ్రెస్‌లోని మితవాదులు తోడయ్యారు. ఇహ సంఘపరివార్‌ వంటి సంస్థలున్న తరువాత పుకార్లకు కొదవేముంటుంది. తన కుమార్తె ఇందిరా గాంధీ విడాకులకోసమే నెహ్రూ ఈ బిల్లును తెచ్చారని ప్రచారం చేశారు. వత్తిడికి తలగ్గిన నెహ్రూ బిల్లును వాయిదా వేయించారు. దానికి నిరసనగా అంబేద్కర్‌ రాజీనామా చేశారు. 1952తొలి పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ బిల్లును ఒక సమస్యగా చేసి ప్రచారం చేసిన నెహ్రూ ఆ తరువాత 1956లో అదే బిల్లు ఆమోదానికి దోహదం చేశారు.

ఇటీవల కాలానికి వస్తే రూప్‌ కన్వర్‌ అనే ఒక 18ఏండ్ల యువతి రాజస్ధాన్‌లోని దేవరాల గ్రామంలో మరణించిన ఆమె భర్తతో కలిపి సజీవ దహనం చేశారు. అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం ఆమె తప్పించుకొని పారిపోతే అత్తమామలు, ఇతర బంధువులు లాక్కొచ్చి మరీ చితిపై పడవేశారు. ఈ దుర్మార్గాన్ని కొందరు సతికి సహకరించటంగా వర్ణించి సమర్ధించారు.దీన్ని సమర్ధించటంలోనూ, అనుకూలంగా ప్రదర్శనలు, ఆందోళనలు చేయటంలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వంటి మతోన్మాద సంస్ధలు ముందున్నాయని మరచిపోకూడదు.( సాంప్రదాయం ఇతరులకే గాని తమకు కాదు అన్నట్లుగా ఆ దురాచారాన్ని నిస్సిగ్గుగా సమర్ధించిన బిజెపిలో ఏ ఒక్కరు కూడా సతికి పాల్పడినట్లు మనకు ఎక్కడా వార్తలు కనిపించవు). అది రాజపుత్రుల సాంప్రదాయమని, స్వచ్చందంగానే సతికి పాల్పడతారని ప్రచారం చేశారు. ఈ వుదంతంలో కూడా కాంగ్రెస్‌ అవకాశవాద వైఖరి కనిపించింది. అందుకు పాల్పడిన వారి మీద కేసు నమోదు చేసేందుకు, తీరా నమోదు చేసినా కేసు నిలిచేందుకు వీలుగా వ్యవహరించటంలో విఫలమైంది. కేసులో సాక్షులుగా పేర్కొన్నవారు అడ్డం తిరగటంతో అది వీగిపోయింది. హిందూకోడ్‌ బిల్లును తన కుమార్తె విడాకుల కోసం నెహ్రూ తెచ్చాడని ప్రచారం చేసిన వారి వారసులే, రూపకన్వర్‌ వుదంతంలో నెహ్రూమనవడు, ప్రధానిగా వున్న రాజీవ్‌ గాంధీ పట్ల కూడా అలాగే వ్యవహరించారు. ఒక పార్సీ అయిన ప్రధాని రాజీవ్‌ గాంధీ ఒక విదేశీ మహిళను వివాహం చేసుకొని హిందూ మతాన్ని అవమానిస్తున్నారని భక్తిలాల్‌ అనే రాజస్ధాన్‌ మాజీ ఎంపీ ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. తరువాత సతి నిరోధక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు బిజెపి దానిని వ్యతిరేకించింది. సతి రాజపుత్రుల సంప్రదాయమని దానిని విధిగా రక్షించాలని వాదించింది.

శబరిమల ఆలయ పవిత్రతను రక్షించాలని కోరే వారిలో ఆధునిక ఛాందసవాద మహిళలేమీ తక్కువ తినలేదు. రెడీ టు వెయిట్‌ అంటే తమకు ఆలయ సందర్శన అర్హత వచ్చేవరకు(50నిండేవరకు) వేచి చూస్తాం అనే వారికి ఒక మనవి, ఒక సవినయ ప్రశ్న. ఆలయ సందర్శన మీ ఇష్టం, వెళ్లే వారిని అడ్డుకోవద్దు అని చెప్పటం తప్ప మిమ్మల్ని దేవాలయ ప్రవేశానికి బలవంతం చేసేవారెవరూ లేరు. ఇక్కడ తర్కంతో ఆలోచిస్తే ఈ నినాదం ఇచ్చేవారు ఇబ్బందుల్లో పడతారు. సాంప్రదాయాలను కాపాడాలి, పాటించాలి, అమలు జరపాలి అనే వారు ఒక్క శబరిమల ఆలయానికే పరిమితమా లేక ఇతర సాంప్రదాయాలన్నింటి విషయంలో అదే వైఖరిని కలిగి వుంటారా? సతి కూడా సాంప్రదాయమే దాని పరిరక్షించాలి, అనుమతించాలని రెడీ టు వెయిట్‌ పూర్వీకులు గతంలో ప్రదర్శనలు చేసిన విషయాన్ని వారు గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ఈ విషయంలో రెడీ టు సతి బర్న్‌ (సతి చితిమంటలకు సిద్ధం) అని పిలుపిస్తారా? బహుభార్యాత్వం కూడా మన సాంప్రదాయంలో భాగమే, అందుకు కూడా సిద్దపడతారా ? పురాణ పురుషుడు కౌశికుడికి వేశ్యకొంపల వెంట తిరిగే అలవాటుంది.కుష్టువ్యాధి సోకినా ఆ బుద్ది పోలేదు, ఏకంగా భార్యనే వారి వద్దకు తీసుకుపొమ్మని చెప్పిన అంశం తెలిసిందే. తెల్లవారే సరికి మరణించాలని దారిలో మాండవ్యముని శాపానికి గురైన భర్తను రక్షించుకొనేందుకు కౌశికుడి భార్య తన ప్రాతివ్రత్యంతో సూర్యోదయాన్నే నిలిపివేయించిందట. అంత చేయకపోయినా సాంప్రదాయాలను పాటించాలి, వాటికి కట్టుబడివుండాలని చెబుతున్నవారు కౌశికుడి భార్య బాటలో నడచి భర్తలను వేశ్య కొంపల వెంట తిప్పుతారా? సూర్యోదయాన్ని ఆపలేకపోయినా కనీసం పోలీసు అరెస్టులనైనా అడ్డుకుంటారా? వుద్రేకం వివేచనను లేకుండా చేస్తుంది, అవి వేరు ఇవి వేరు అని అవకాశవాదంతో మాట్లాడకండి. ఇలాంటి వాటిని అడ్డుకుంటే తిరోగామి శక్తులు వదలి వేసిన పనికి మాలిన సాంప్రదాయాలకు ఘనత ముసుగు తొడిగి స్త్రీలను తిరిగి వెనుకటి స్ధితిలోకి నెట్టినా ఆశ్చర్య పడనవసరం లేదు. నిదానంగా ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

497 వివాదం పురుషుల పట్ల వివక్ష మీద- తీర్పు, చర్చ మహిళల సమానత్వం గురించి !

29 Saturday Sep 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

Adultery, adultery law, IPC section 497, Supreme Court of India

Image result for adultery law : challenged by men, ruling and discussion focused on women

ఎం కోటేశ్వరరావు

‘భర్త అంటే భార్యకు యజమాని కాదు, వేరొకరి భార్యతో మరో పురుషుడు సంబంధం పెట్టుకుంటే ఆ కారణంగా విడాకులు కోరవచ్చు అది తప్పిదం తప్ప ఆ చర్య శిక్షార్హమైన నేరపూరితమైది కాదు ‘ సుప్రీం కోర్టు మన శిక్షా స్మృతిలోని 158 ఏండ్ల నాటి చట్టం చెల్లదంటూ కొట్టి వేస్తూ ఇచ్చి తీర్పు సారాంశమిది. అయితే ఈ తీర్పు వివాహితుల విశృంఖలతకు, వివాహ వ్యవస్ధ విచ్చిత్తికి దోహదం చేస్తుందంటూ ఆడమగా తేడా లేకుండా కొందరి నుంచి తీవ్ర వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(ఈ రచయిత న్యాయ నిపుణుడు కాదు, కనుక పరిమితులు వున్నాయని గమనించ మనవి). న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారిచ్చే ఏ తీర్పునైనా విమర్శించ వచ్చు కనుక వారికా స్వేచ్చ వుంది. ఇక తాజా తీర్పు విషయానికి వస్తే అసలు ఈ కేసును దాఖలు చేసిన వ్యక్తి వుద్ధేశ్యం వేరు. ఇప్పుడున్న చట్టం పురుషుల పట్ల వివక్షతో కూడుకున్నదని తన స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడిన కారణంగా ఆ వివక్షను సవాలు చేస్తూ పగబట్టిన మహిళలు, వారి భర్తల నుంచి వివాహేతర సంబంధాల విషయంలో పురుషులను రక్షించేందుకు తాను కేసు దాఖలు చేసినట్లు కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు జోసెఫ్‌ షైనీ చెప్పాడు. అతను ఇటలీలో ఒక హోటల్‌ నిర్వహిస్తున్నాడు. దీనిపై వెలువడిన తీర్పు, దాని మీద జరుగుతున్న చర్చ మహిళల సమానత్వం, ఇతర అంశాల చుట్టూ తిరగటం విశేషం.

రంకుతనం నేరపూరితమైనదిగా నిర్దేశించిన భారతీయ శిక్షా స్మృతిలోని 497వ సెక్షన్‌ చెల్లదని ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. భారతీయ శిక్షా స్మృతిలో రంకుతనం గురించి చెబుతున్న సెక్షన్‌ 497 ప్రకారం దానికి పాల్పడిన మహిళలను శిక్షించే అవకాశం లేదు. భర్త అంగీకారం లేకుండా అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడు మాత్రమే నేరం చేసినట్లుగా అది చెబుతున్నది. ఎవరైనా రంకుతనానికి పాల్పడితే భాగస్వామి ఆ కారణంగా విడాకులు కోరవచ్చు. ఈ సెక్షన్‌ భర్తను ఒక యజమానిగా పరిగణిస్తున్నదంటూ కోర్టు కొట్టి వేసింది. రంకుతనం(వివాహేతర సంబంధం) అంటే ఒక వ్యక్తి అంగీకారం లేదా చూసీచూడనట్లుగా వుంటే తప్ప అతని భార్యతో ఎవరైతే లైంగిక సంబంధం కలిగి వున్నారో దాన్ని రంకుతనంగా పరిగణిస్తారు. అటు వంటి సంబంధం అత్యాచార నేరం కిందికి రానప్పటికీ రంకుతనపు నేరస్దుడిగా పరిగణించబడతాడు. అందుకుగాను జరిమానాతో లేదా జరిమానా లేకుండా, లేదా జరిమానాతో సహా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అలాంటి కేసులలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిందంటూ భార్యను శిక్షించటానికి వీలు లేదు.

ఈ భాష్యం అనేక అంశాలను ముందుకు తెచ్చింది. రంకుతనం నేరంలో దుష్కృత్యాన్ని ప్రోత్సహించిన వ్యక్తిగా వివాహిత మహిళను పరిగణించరు. అంటే రంకుతనానికి పురుషులను తప్ప మహిళలను బాధ్యురాలిగా చూడటం లేదు. వివాహంగాని ఒక మహిళ ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుంటే ఈ సెక్షన్‌ వర్తించదు. ముందే చెప్పినట్లు భర్త అనుమతించినా, చూసీచూడనట్లు వ్యవహరించినా ఆ రంకుతనం నేరం కాదు. రంకుతనానికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయటానికి సదరు వివాహిత మహిళ భర్తకు మాత్రమే హక్కు వుంది. సదరు పురుషుడి భార్య హక్కు గురించి ఏమీ చెప్పలేదు. అంటే ఒక మహిళ ఒక పురుషుడికి చెందినది మాత్రమే అని, ఒక వేళ ఆమె వివాహేతర సంబంధానికి అంగీకరించినప్పటికీ ఆమెకు స్వంతంగా ఎలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు వుండవని సెక్షన్‌ పరిగణిస్తున్నది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 మరియు 15ను వుల్లంఘిస్తున్నదని అందువలన దాని మీద విచారణ జరపాలంటూ 2017 డిసెంబరులో సుప్రీం కోర్టు ముందు ఒక జోసెఫ్‌ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది.

రాజ్యం ఏ వ్యక్తికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టపరమైన సమాన రక్షణను నిరాకరించజాలదని ఆర్టికల్‌ 14 చెబుతుండగా కుల, మత, తెగ, లింగ, పుట్టిన ప్రాంతం తదితరాలు కారణాలుగా ఏ పౌరుడి పట్ల వివక్ష చూపరాదని ఆర్టికల్‌ 15చెబుతున్నది. జోసెఫ్‌ పిటీషన్‌ స్వీకరించిన కోర్టు 497 సెక్షన్‌ను సవాలు చేసిన తొలి పిటీషన్‌ ఇది కాదని 1954 నుంచీ సవాలు చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి, కేసులున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. పెద్ద ప్రయాస లేకుండానే దీని గురించి నిర్ణయించవచ్చని పేర్కొన్నది. చట్టాలు లింగ సంబంధంగా తటస్ధంగా వుండాలని భావించింది. పురుషుల పట్ల వివక్ష చూపుతున్నదని పిటీషన్‌దారు వాదించాడు. ఈ పిటీషనర్‌ వాదనను అంగీకరిస్తే ఇప్పటి కంటే వివాహేతర సంబంధాలు మరింత స్వేచ్చగా చెలరేగుతాయని, దీని బదులు సంస్కరణల కమిటీ సూచించినట్లుగా ‘ మరొక వ్యక్తి భాగస్వామి లేదా మరొకరితో ఎవరు లైంగిక సంబంధాలు నెరిపినా దానిని రంకుతనంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఆగస్టు ఒకటిన వాదనలు వినటం ప్రారంభించిన కోర్టు సెప్టెంబరు 27న ఆ సెక్షన్‌ చెల్లదంటూ ఐదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పు చెప్పింది.

తీర్పు పట్ల పిటీషనర్‌ జోసెఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన స్నేహితుడితో కలసి పని చేస్తున్న వుద్యోగిని ఒకరు ఒకరు తప్పుడు అత్యాచార ఆరోపణ చేయటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ వుదంతం తనను పిటీషన్‌ వేసేందుకు ప్రేరేపించిందని చెప్పాడు. మహిళలు ఇష్టపూర్వకంగానే భాగస్వాములై వుండవచ్చు, కానీ భర్తలు ఫిర్యాదు చేసినపుడు సంబంధం పెట్టుకున్న పురుషుడు బాధితుడు అవుతున్నాడు. ఇలాంటి ఫిర్యాదులు దాఖలైనపుడు పురుషుడు ఒంటరి తనం ఫీలవుతాడు. తట్టుకోలేకపోవచ్చు. ఈ సెక్షన్‌ రద్దు ఒక ప్రాధమిక చర్య, అది అనేక మార్పులకు దారి తీయవచ్చు అన్నాడు. కేరళ పురుషుల్లో రంకుతనం విచ్చలవిడిగా వున్నప్పటికీ బయటకు ఖండిస్తారు అన్నాడు.

భారతీయ సంస్కృతి ఏమౌతుందో అని ఆవేదన చెందే వారు ఈ తీర్పు వివాహేతర సంబంధాలకు ఇప్పటి వరకు వున్న బంధనాలను ఛేదించి స్వేచ్చ ప్రసాదించిందని, దీన్ని అవకాశంగా తీసుకొని స్త్రీ, పురుషులు ఇక తెగబడతారని, ఇంక పెళ్లెందుకు అని ఈసడించుకుంటున్నారు. గతాన్ని ఒకసారి అవలోకించటం అవసరం. ఇక్కడ ఇతిహాసాలు, మనుస్మృతి లేదా పురాణాల వుదంతాలను ప్రస్తావిస్తున్నామంటే అర్ధం వాటిన నమ్మిలేదా అవి మంచివి అని అర్ధం కాదు. వాటి ప్రభావం సమాజం మీద తీవ్రంగా వుందన్నది కాదనలేని వాస్తవం. కొన్ని సందర్భాలలో తమకు వాటంగా వుందనుకున్నపుడు వాటిని మన సంస్కృతిగా చూపుతూ రక్షణగా తీసుకోవటం, ఇష్టం లేనపుడు వాటికి విరుద్దంగా వాదించే అవకాశవాద వైఖరి మన సమాజంలో కనిపిస్తుంది. దాన్ని చెప్పేందుకే వాటి ప్రస్తావన పరిమితి. మిర్యాలగూడెం ప్రణయ్‌-అమృత వివాహ విషయాన్నే చూడండి.మిర్యాల గూడెం అమృత, ప్రణయ్‌ వివాహ వుదంతంలో తొమ్మిదో తరగతిలో ప్రేమ ఏమిటి అని బుగ్గలు నొక్కుకుంటున్న వారు రుక్మిణిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న సమయంలో కృష్ణుడి వయసెంతో చెబుతారా ? రుక్మిణికి 13 లేదా 14, కృష్ణుడికి 14, కొన్ని పురాణాల ప్ర కారం ఎనిమిది, 16, ఆ సమయానికి కృష్ణుడు ఇంకా సెటిల్‌ కాలేదు. సీతారాముల వివాహ సమయంలో వారి వయస్సు 12-6 సంవత్సరాలట. ఆ వుదంతాలను లట్టలు వేసుకుంటూ భక్తి పారవశ్యంతో చూస్తాం. మరి దీన్నెందుకు ద్వేషిస్తున్నాం. వారు అవతారపురుషులు అనేట్లయితే, ముందే రాసి పెట్టిన దాని ప్రకారం ఎలాగూ వివాహం అవుతుంది కదా? అంత చిన్న వయస్సులో అలా చేసుకోవాల్సిన ఖర్మేం పట్టింది. మనుస్మృతిలోని ఒక శ్లోకం ప్రకారం యుక్త వయస్సు వచ్చిన యువతి తనను చేపట్టే పెండ్లికొడుకు కోసం మూడు సంవత్సరాలు ఆగాలి. పెండ్లికొడుకులు రానపుడు ఆయువతే తనకు కావాల్సిన వాడిని చూసుకోవచ్చు.అని కామకోటి.ఓఆర్‌జిలో రాశారు.వీటన్నింటినీ చూసినపుడు చూసినపుడు ప్రణయ్‌-అమృత బాల్య వివాహం చేసుకోలేదు. చట్ట ప్రకారం వయస్సు వచ్చిన తరువాతే చేసుకున్నారు.శివుడిని తన కుమార్తె పార్వతి వివాహం చేసుకోవటం ఇష్టం లేని దక్షుడు వారిమానాన వారిని వదలి వేశాడు తప్ప శివుడ్ని చంపించేందుకు సుపారీ ఇచ్చి ఏర్పాట్లు చేయలేదే. విధి రాతను తప్పించలేం అని నమ్మేట్లయితే అందుకు విరుద్దంగా హత్య చేయించటం విధిని వెనక్కు తిప్పే ప్రయత్నమే కదా? అలాంటి మారుతీరావుకు మద్దతుగా ప్రదర్శనలు జరపటం, సామాజిక మాధ్యమాల్లో మద్దతు ప్రకటించట అంటే సమాజరీతిని వెనక్కు నడిపించాలని చూడటం తప్ప వేరు కాదు.

మహాభారతంలో పాండు రాజు ఇతరుల నుంచి పిల్లలను కనాలని కుంతిని స్వయంగా ప్రోత్సహించాడు. కుంతి తొలుత అంగీకరించలేదు. భార్య ఒక భర్తకే కట్టుబడి వుండాలన్న ఆంక్షలేవీ లేవని చెబుతాడు. ఆమె ఒకరికి పరిమితం కాకుండా ఒకరిని అనధికారికంగా ఐదుగుర్ని ఐదుగురితో అధికారికంగా కన్నదనుకోండి అది వేరే విషయం. ద్రౌపది ఆ పాండవులను ఐదుగుర్నీ భర్తలుగా చేసుకుంది. దాని వలన మన సమాజానికి హాని కలిగిందని ఎవరూ చెప్పలేదు. ఏదో ఒకసాకుతో ఆమోదించారు. వుద్ధాలకుడి కుమారుడు శేవత్‌కేతు తన తల్లి ఇతరులతో సంబంధాలను కలిగి వుండటాన్ని చూసి భార్యలు భర్తలకే పరిమితం కావాలన్న కొత్త నిబంధనను తీసుకువచ్చిన విషయమూ తెలిసిందే. భర్త చనిపోయినపుడు నియోగి విధి పేరుతో అంబిక, అంబాలిక పిల్లలను కనవచ్చని వ్యాసుడే చెప్పాడు. ఇప్పుడెవరైనా ఆ పని చేస్తే అంగీకరిస్తారా? రామాయణం విషయానికి వస్తే కొంత కాలం పరపురుషుడి పంచన వున్న ఒక మహిళ పవిత్రంగా ఎలా వుంటుందన్న మాటలు విన్న రాముడు సీత పవిత్రతను నిరూపించుకొనేందుకు అగ్ని ప్రవేశం చేయమన్న విషయం తెలిసిందే. అదే రాముడి సాయం పొందిన సుగ్రీవుడు తన భార్య రుమ వాలి చెరలో వున్నప్పటికీ ఆమె పవిత్రను నిరూపించుకోమని కోరలేదు. రాముడు కూడా దాన్ని రుద్దలేదు. మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం మహిళలు పురుషుల ఆస్తులుగానే వున్నారు తప్ప వారి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించలేదు. మనుస్మృతి ప్రకారం ఒక మహిళ ఎగువ తరగతి కులపు వ్యక్తితో సంభోగిస్తే అది శిక్షించదగిన చర్య కాదు. అదే దిగువ కులపు పురుషుడితో చేస్తే శిక్షార్హమేకాదు ఆమెను విడిగా వుంచాలి. దిగువ తరగతి పురుషుడు ఎగువ తరగతి మహిళతో సంబంధం కలిగి వుంటే అతనికి వురి శిక్ష విధించాలి. ఎవరైనా పురుషుడు (భార్యకాని) తన స్వంతకులపు మహిళతో తన ఇచ్చ తీర్చుకుంటే అతడు ఆమెకు పరిహారం చెల్లించాలి. ఈ తీరు తెన్నులను మన గత ఘన సంస్కృతి అని కీర్తిద్దామా?

ఎవరి వాదనలు వారు, ఎవరి తర్కం వారు చెప్పవచ్చు. తమకు నచ్చని భావాలను వ్యతిరేకించటం,అసహనాన్ని ప్రదర్శించవద్దు.తమ భావాలను ఇతరుల మీద రుద్ద వద్దు. సమాజం తనకు ఆటంకం కలిగించే వాటిని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టివేసి ముందుకు పోతుంది. వివాహేతర సంబంధాలు నేరాలు కావని చెప్పటమంటే అలాంటి సంబంధాలు పెట్టుకోమని చెప్పినట్లు కాదు. చట్టం వున్నప్పటికీ రోజూ జరుగుతున్న అనేక నేరాలకు అవే కారణమని మనకు తెలిసిందే. అందువలన రంకుతనం అనేది చట్టం వుంటే అదుపులో వుంటుందని లేకపోతే విచ్చలవిడిగా పెరిగిపోతుందని వాదించటం అంటే మనమీద మనకే నమ్మకం లేకపోవటం. అనేక దేశాలలో ఇలాంటి బూజుపట్టిన చట్టాలు ఎప్పుడో రద్దయ్యాయి. అక్కడ వివాహవ్యవస్ధ, కుటుంబ జీవనం లేదా, నైతిక విలువలు లేవా? ఏ సమస్య మీద అయినా మధనం జరగనివ్వండి, ఎవరికి వారిని మంచి చెడ్డలను నిర్ణయించుకోనివ్వండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మళయాళ నటికి మరుగుజ్జు యోధుల బెదిరింపులు !

20 Monday Feb 2017

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Aami actress, BJP’s trolling army, Manju warrier, Trolls

ఎం కోటేశ్వరరావు

    మత, మితవాద శక్తులు వివాదాస్పదం గావించిన మళయాళ చిత్రం ‘ఆమీ ‘ నిర్మాణం సజావుగా సాగుతుందా? సాగినా ప్రేక్షకులను చూడనిస్తారా అనే వూహాజనిత ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ చిత్రంలో ఏ ముందో చూడకుండానే దర్శకుడు, నటీ నటులపై వత్తిడి తీసుకురావటం,సామాజిక మీడియాలో బెదిరింపులకు పాల్పడం మన దేశంలో కొన్ని శక్తుల అసహన ధోరణులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపించటం లేదూ ! తన జాతీయతను ఎవరూ ప్రశ్నించజాలరని, తాను హిందువునే అంటూ రచయిత్రి కమలా సురయ్య జీవిత కథ ఆధారంగా నిర్మించే చిత్రంలో కమల పాత్ర ధరించటానికి తనకు హక్కుందని, తాను నటిస్తానని సినీ నటి మంజు వారియర్‌ స్పష్టం చేశారు. సుప్రసిద్ధ నటి విద్యాబాలన్‌ మాదిరి మంజుపై కూడా తిరోగామి శక్తులు వత్తిడిని ఇంకా పెంచుతాయా? ఆమె వాటిని తట్టుకొని చెప్పినట్లు చిత్రంలో నటించగలరా అన్న సందేహాలు వుండనే వుంటాయి.

     భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతి, విమర్శలను జాతి వ్యతిరేకంగా చిత్రించే నాజీ పోకడలను జనం మెదళ్లలోకి క్రమంగా ఎక్కిస్తున్న తరుణమిది. మన దేశం స్వల్పకాలం ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని చూసింది తప్ప నాజీ, ఫాసిజం స్వరూపాన్ని చూడలేదు. అలాగని నిజమైన ప్రజాస్వామిక వ్యవస్ధను కూడా చూడలేదన్నది కూడా అంతే వాస్తవం. ఇది నిజంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన పరిస్ధితి.మనకు తెలియని వాటి గురించి జనానికి తెలియచేయటం కంటే తెలిసినట్లుండి, నిజంగా తెలియని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెబితే దానికి వ్యతిరేకమైన నియంతృత్వం గురించి చైతన్యవంతులను గావించటం సులభం అవుతుంది.

   తాము మాంసం తింటామని తెలియ చేసేందుకు ఎముకలను మెడలో వేసుకు తిరగరన్నది తెలిసిందే. అలాగే నియంతలు, ప్రజాస్వామ్యాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టాలనుకొనే శక్తులు కూడా అదే మాదిరి ప్రవర్తిస్తాయి.తమ భావజాలాన్ని, రాజకీయాలను వ్యతిరేకించే వారిని సామాజిక మాధ్యమంలో ఎలా వేధిస్తారో, వెంటాడుతారో ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఇప్పుడు సినీనటి మంజు వారియర్‌ను కూడా అలాగే వేధించి, వెంటాడుతున్నారు. సాహితీలోకంలో, కేరళలో మాధవికుట్టి అనే పేరుతో రచనలు చేసి జీవిత చివరి కాలంలో కమలా సురయ్యాగా మారిన కమలాదాస్‌ గురించి పరిచయం చేయనవసరం లేదు. కేరళలోని ఒక ఛాందసవాద నాయర్‌ కుటుంబంలో జన్మించిన ఆమె తన రచనలలో స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు, సమాజంలోని అక్రమ సంబంధాల గురించి నిర్మొహమాటంగా చర్చించటం కొంత మందికి మింగుడు పడలేదు.ఆమె రచయిత్రిగానే గాక పత్రికల్లో వివిధ అంశాలపై రచనలు చేశారు. ప్రముఖ రచయిత్రుల సరసన స్ధానం సంపాదించారు. తన 65వ ఏట ఆమె హిందూమతాన్ని వదలి ముస్లింగా మారారు. ఆ సమయంలో పెద్దవివాదమే చెలరేగింది. నాడు ఆమెపై ధ్వజమెత్తిన పరంపరకు చెందిన వారే ఇప్పుడు మరోసారి మరో రూపంలో దాడికి దిగారు. తన 75వ ఏట 2009లో ఆమె మరణించారు. ఆమె హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మతం మారారని కొందరు ఆక్షేపిస్తే ఒక ముస్లిం పారిశ్రామికవేత్తతో వున్న సంబంధాల కారణంగా మతం మారారని కొందరు నిందించారు. ఇప్పుడు ఆమె జీవిత కథా ఇతివృత్తంతో సినిమా తీస్తున్న దర్శకుడు కమల్‌గా సుప్రసిద్ధుడైన కమాలుద్దీన్‌ మహమ్మద్‌ మాజిద్‌ అనే ఒక ముస్లిం అని అతగాడు తీస్తున్న సినిమా గనుక అది లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించేదిగా వుంటుందని కొందరు ధ్వజమెత్తారు. తొలుత కమలాదాస్‌ పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసి మేకప్‌ టెస్టులు, దుస్తులు అన్నీ సిద్ధం చేసుకొని చిత్రీకరణకు వెళ్లబోయే ముందు కథనాన్ని మార్చిన కారణంగా తాను నటించలేనని ప్రకటించారు. హిందూత్వ శక్తుల దాడికి భయపడి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారని గతేడాదే మళయాల చిత్రసీమలో, మీడియాలో వార్తలు వచ్చాయి.

   దర్శకుడు కమల్‌ విషయానికి వస్తే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చర్యను విమర్శించాడు. సినిమాహాళ్లలో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడని వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటాన్ని విమర్శించారు. రాజకీయంగా బిజెపి, హిందూత్వశక్తులు ఇది మింగుడు పడలేదు. జాతీయ గీతాన్ని గౌరవించకపోతే ఈ దేశం వదలి పోవాలని కూడా కొందరు బిజెపి నేతలు కమల్‌ను కోరారు. విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన తరువాత మంజూ వారియర్‌ను సంప్రదించగా ఆమె అంగీకరించారు. గతంలో ఆమె కమల్‌ చిత్రాలలో నటించారు. సామాజిక మాధ్యమాలలో తనపై దాడి, వేధింపులకు దిగిన వారికి మంజు వారియర్‌ అదే మాధ్యమం ద్వారా తన ఫేస్‌బుక్‌లో సమాధానమిచ్చారు.

    ‘ నేను కమల్‌ సార్‌ను నా గురువుగా చూస్తాను. ఇరవై సంవత్సరాల తరువాత ఆయనలోని ఒక గొప్ప కళాకారుడితో పని చేసే అవకాశం వచ్చినందుకు వుద్విగ్నతకు లోనవుతున్నాను తప్ప ఆయన రాజకీయాలను చూసి కాదు. నా దేశమే నా రాజకీయాలు. ప్రార్ధనలు చేసేందుకు నేను రోజుకు రెండుసార్లు దేవాలయాని వెళతాను. అదే విధంగా ఒక చర్చి, ఒక మసీదు ముందుకు వెళ్లినపుడు కూడా నేను అదే మాదిరి భక్తితో తలవంచుతాను.’ అని మంజు పేర్కొన్నారు. భిన్న రాజకీయాలు, భావజాలాలు వున్న వారు అనేక మంది కలసి పని చేస్తున్నారంటే ఒక మంచి సినిమా నిర్మాణ లక్ష్యం తప్ప మరొకటి కాదు.

    మంజుపై తిరోగామి శక్తులు దాడి, బెదిరింపులకు దిగితే ఆమె అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమంలో స్పందించారు. తాను హిందువునని చెప్పుకోవటం సంఘపరివార్‌కు లొంగిపోవటంగా కూడా వర్ణించినవారు లేకపోలేదు. కొందరు ఎత్తుగడగా ఆమె అలా ప్రకటించిందన్న వారు కూడా వున్నారు. దేశంలో నెలకొన్న అసహన ధోరణుల నుంచి రక్షణ పొందేందుకు ఆమె జాతీయత కింద రక్షణ పొందారని ప్రముఖ రచయిత ఎంఎన్‌ కరాసెరీ వ్యాఖ్యానించారు. ‘ఆమె అభత్రాభావానికి లోనైవుంటే అందుకు ఆమెను నేను తప్పుపట్టటం లేదు. ఆమె ఇప్పటికే తన జీవితంలో అనేక విషాదాలను చూశారు. ఆమె సున్నిత మనస్కురాలైన కళాకారణి తప్ప రాజకీయవేత్తకాదు. ఆమెకు విద్వేష రాజకీయాలు తెలియవు ‘ అన్నారు. మత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చే వారికి కళ అన్నా కళాకారులన్నా ప్రేమ వుండదు. అందువల్లనే ఎంఎఫ్‌ హుస్సేన్‌, సల్మాన్‌ రష్డి వంటి వారి చిత్రాలు, రచనలను వ్యతిరేకిస్తారు. సృజనాత్మక స్వేచ్చను వ్యతిరేకించటంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకటే అని కూడా కరసెరీ వ్యాఖ్యానించారు. ‘కమలా సురయ్యా జీవితం నిజంగా ఎంతో సమ్మోహనమైంది. స్త్రీ లైంగికత్వం గురించి ఎంతో నిజాయితీగా ఆమె రచనలను విప్లవాత్మకం కావించింది. ఆమె జీవిత చరమాంకంలో ప్రేమ కోసం ఇస్లాంలోకి మారటంద్వారా విమర్శలపాలయ్యారు.ఆమె జీవిత మంతా వివాదాల మయం. ఒక కళాకారిణికి ఇవన్నీ ఎన్నో సవాళ్లను ముందుకు తెస్తాయి. మంజు ఒక యువ మహిళ, ఆమెకు సూక్ష్మ రాజకీయ బేధాలను గ్రహించలేకపోవచ్చు, తన పాత్రను అంగీకరించే సమయంలో దాని పరిధిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని వుండవచ్చు ‘ అన్నారు.

    సామాజిక మీడియాలో మంజు వారియర్‌పై దాడి, బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్నవారు తమ రాజకీయ భావాలను వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి చెందిన వారు లేదా దాని ప్రభావానికి లోనైన వారన్నది స్పష్టం. మీడియా ప్రతినిధులు ఈ వివాదం, బెదిరింపుల గురించి ప్రశ్నించినపుడు సామాజిక మీడియాలో ప్రచారం వెనుక తమ పాత్ర లేదని బిజెపి సీనియర్‌ నాయకులు చెప్పారు.’ సామాజిక మీడియాలో చర్చ జరుగుతున్న కారణంగా ఈ చిత్రానికి వ్యతిరేకంగా బిజెపి మరియు సంఘపరివార్‌ ప్రచారం నిర్వహిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి, సామాజిక మీడియాలో వస్తున్నది బిజెపి వైఖరి కాదు. దానికి మా బాధ్యత లేదు ‘ అని బిజెపి కార్యదర్శి బి గోపాల కృష్ణన్‌ చెప్పారు. తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఆ వివాదం లేదా ప్రచారంపై తమ వైఖరి ఏమిటో బిజెపి ఇంతవరకు ప్రకటించకపోవటం విశేషం. అనేక సందర్భాలలో కాగల కార్యకర్యం గంధర్వులు తీరుస్తారన్నట్లుగా ఇలా వ్యవహరించటం పరివార్‌ సంస్ధలకు సాధారణమే అన్నది విమర్శ.

    తమకేమీ సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని సామాజిక కార్యకర్త ఎంఎన్‌ పియర్సన్‌ వంటి వారు స్పష్టం చేస్తున్నారు.’ ఇది ఒక గెరిల్లా దాడి వంటిది. సమాజంలో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నవారిని వెనక్కు కొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వారి రాజీకీయ అజెండాలో భాగమిది ‘ అన్నారు. అన్ని రకాల ఆలోచనా కోణాలను అంగీకరించే సంప్రదాయమున్న రాష్ట్రంలో అనేక మంది రచయితలు ఎంఎం కలబుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని బలిగొన్న విద్వేష ప్రచారాన్ని కొనసాగించే దానిలో మంజు, కమల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఒక భాగమని సిపిఎం పార్లమెంట్‌ సభ్యుడు ఎంబి రాజేష్‌ విమర్శించారు.

   సినిమా స్క్రిప్టులో మార్పులు చేసిన కారణంగా తాను చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు విద్యాబాలన్‌ చెప్పినప్పటికీ ఇంతవరకు అలాంటి మార్పులేమీ లేవని దర్శకుడు కమల్‌ స్పష్టం చేశారు. నవంబరులో షూటింగ్‌ ప్రారంభం కావాల్సి వుండగా విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన కారణంగా వాయిదా పడింది. జీవిత చరమాంకంలో ఇస్లాం మతం పుచ్చుకున్న కమలాదాస్‌ వివాదాస్పద జీవితం వున్న పాత్రను పోషించటం గురించి విద్యాబాలన్‌ భయపడి వుండవచ్చు. బాలీవుడ్‌లో ఆమె ఇటీవల కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. దక్షిణ భారత్‌లో ఈ సమయంలో ఇలాంటి చిత్రంలో చేస్తే తన భవిష్యత్‌ అవకాశాలను ప్రభావితం చేస్తాయోమో అన్నది కారణం కావచ్చని కమల్‌ వ్యాఖ్యానించారు. బయటి బెదిరింపులకు భయపడి మంజు వారియర్‌ వెనక్కు తగ్గుతుందని తాను భావించటం లేదని అన్నారు. కేరళ, ముంబై, కొల్‌కతాలలో షూటింగ్‌ జరుపుకొని మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాలన్నది నిర్మాతల లక్ష్యం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Increase Maternity Benefit from 12 weeks to 26 weeks

10 Wednesday Aug 2016

Posted by raomk in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

Maternity Benefit, Maternity Benefit India

Amendments to the Maternity Benefit Act, 1961

The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has given its ex-post facto approval for amendments to the Maternity Benefit Act, 1961 by introducing the Maternity Benefit (Amendment) Bill, 2016 in Parliament.

The maternity benefit Act 1961 protects the employment of women during the time of her maternity and entitles her of a ‘maternity benefit’ – i.e. full paid absence from work – to take care for her child. The act is applicable to all establishments employing 10 or more persons. The amendments will help 1.8 million (approx.) women workforce in organised sector.

The amendments to Maternity Benefit Act, 1961 are as follows:

• Increase Maternity Benefit from 12 weeks to 26 weeks for two surviving children and 12 weeks for more than two childern.

• 12 weeks Maternity Benefit to a ‘Commissioning mother’ and ‘Adopting mother’.

• Facilitate’Work from home’. • Mandatory provision of Creche in respect of establishment having 50 or more employees.

Justification:

• Maternal care to the Child during early childhood – crucial for growth and development of the child.

• The 44th, 45th and 46th Indian Labour Conference recommended enhancement of Maternity Benefits to 24 weeks.

• Ministry of Women & Child Development proposed to enhance Maternity Benefit to 8 months.

• In Tripartite consultations, all stake holders, in general supported the amendment proposal.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

శని సింగనాపూర్‌లో మనువాదంపై మహిళల తిరుగులేని విజయం

09 Saturday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ Leave a comment

Tags

Bhumata Brigade, manuvadis, Shani Shingnapur, Trupti Desai, Women decisive victory, women power

సత్య

13న కొల్లాపూర్‌ మహలక్ష్మి దేవాలయ ప్రవేశం

    తృప్తి దేశాయ్‌ ! భూమాత రాన్‌ రాగిణి బ్రిగేడ్‌ !! శని శింగనాపూర్‌ !!!

       దేశంలో అనేక మంది నోళ్లలో నానుతున్న పేర్లివి. నాలుగు వందలఏళ్ళ  నాటి శని దేవాలయంలో మహిళలకు ప్రవేశ నిషేధ శని శుక్రవారం సాయంత్రంతో వదలి పోయింది.ఈనెల ఒకటవ తేదీన బొంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో శని దేవాలయ పాలకవర్గం మహిళలపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇది నిజంగా మహిళలు సాధించిన పెద్ద విజయాలలో ఒకటి. దీనితో వుత్తేజితులైన మహారాష్ట్ర మహిళలు ఇప్పుడు తమ దృష్టి ఇతర దేవాలయాలపై సారించారు. తదుపరి ఈనెల 13న తాము కొల్లాపూర్‌లోని మహలక్ష్మి దేవాలయ ప్రవేశం చేస్తామని, తరువాత నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయ ప్రవేశం చేస్తామని ఈ వుద్యమానికి నాయకత్వం వహిస్తున్న తృప్తి దేశాయ్‌ శనివారం నాడు ప్రకటించారు. ఒక చిన్న పల్లెటూరు శని శింగనాపూర్‌లో ప్రారంభమైన ఈ వుద్యమం దేశంలోని ఇతర పాంతాలకు విస్తరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో దళితులకు దేవాలయ ప్రవేశాలపై వున్న ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేవాలయ ప్రవేశ వుద్యమాలు సాగిన విషయం తెలిసిందే. ఇపుడు మహిళా ప్రవేశ వుద్యమానికి నాంది పలికారు.దీంతో మనువాదులు మింగా కక్కలేకుండా వున్నారు. రాజ్యాంగం చట్టాలు వుండబట్టిగాని లేకపోతే ఇలాంటి తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తుల అంతం చూసి వుండేవాళ్లం ప్రకటించే సర్వసంగ పరిత్యాగులమని ఫోజు పెట్టే సాధ్వులు, బాబాలు, యోగులు,యోగినులు మనకు దర్శనమిచ్చినా ఆశ్చర్యం లేదు.

     చాలా మందికి సుపరిచితమైన షిరిడీకి దగ్గరలో అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఈ శనిదేవాలయం వుంది. తమకు పట్టిన శని వదలాలని లేదా పట్టకుండా వుండాలని ముందస్తుగా కోరుకుంటూ వేలాది మంది నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మహిళలు సాగిస్తున్న ఈ వుద్యమం ఆస్తికులకే గాక నాస్తికులకు కూడా అభ్యంతరకరంగా వున్నట్లు అక్కడక్కడా వినిపిస్తోంది. ఇక్కడ సమస్య మహిళలలో మూఢనమ్మకాలను ప్రోత్సహించటం కాదు. దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమానికి కమ్యూనిస్టు అగ్రనాయకులు అనేక మంది నాయకత్వం వహించారంటే అర్ధం దళితులను తీసుకువెళ్లి మనువాదానికి అప్పగించాలని కాదు. పుట్టుక కారణంగా వివక్ష ప్రదర్శించటాన్ని, తోటి మనిషిని మనిషిగా చూడాలనే ప్రజాతంత్ర డిమాండ్‌, హక్కును నిర్ధారించుకొనేందుకే ఆ వుద్యమాలు జరిగాయి.ఇప్పుడు మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న వుద్యమం, న్యాయపోరాటాలను కూడా అలాగే చూడాలి. ఒక వ్యక్తి దేవుడిని, మతాన్ని నమ్మటమా నమ్మకపోవటమా అన్నది వారి వ్యక్తిగతం.

    ఈ వుద్యమానికి నాంది పలికిన 31 సంవత్సరాల యువతి ఆస్ధికురాలు. మహారాష్ట్రలో అధికారంలో వున్న బిజెపి-శివసేన సంకీర్ణ కూటమి ప్రభుత్వం శని ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకొనేందుకు చేయని ప్రయత్నం లేదు. మహిళలను అడ్డుకొనేందుకు తొలిసారిగా ఆ దేవాలయానికి మహాళా ధర్మకర్తలను నియమించి వారి ద్వారా అడ్డుకోవాలని చౌకబారు ఎత్తుగడ వేసింది. మహిళలను సమీకరించేందుకు కూడా చేయూత నిచ్చింది.అయితే బోంబే హైకోర్టులో ప్రభుత్వం వివక్షకు వ్యతిరేకమని అఫిడవిట్‌ ఇవ్వాల్సి వచ్చింది. అయినా తీర్పును అమలు జరిపేందుకు సిద్ధం కాకపోవటంతో ముఖ్య మంత్రిపై కోర్టు ధిక్కరణ నేరం కింద కోర్టుకు లాగుతామని తృప్తి దేశాయ్‌ ప్రకటించిన తరువాతే శని ఆలయ కమిటీ దిగివచ్చింది. ఇంత జరిగాక దేవాలయ ప్రవేశం కోసం మహిళలు ఆందోళన చేయాల్సి రావటం సిగ్గుచేటని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించటం విశేషం. వివక్షను పాటిస్తున్న ఇతర దేవాలయాల ప్రవేశం సందర్భంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాల్సి వుంది.

   కాలం చెల్లిన మనువాదులను వుక్కిరి బిక్కిరి చేస్తున్న తృప్తి దేశాయ్‌ ఒక సాధారణ కుటుంబానికి చెందిన గృహిణి. కర్ణాటక సరిహద్దులోని నిపానీ తాలుకాలో జన్మించిన తృప్తి కుటుంబం తరువాత పూనాలో స్ధిరపడింది. ముంబైలో హోం సైన్సు కోర్సులో చేరిన ఆమె కుటుంబ పరిస్ధితుల కారణంగా ఒక ఏడాది తరువాత విద్యను మానుకోవాల్సి వచ్చింది.తరువాత తాను నివసించే పరిసరాలలో క్రాంతి వీర్‌ అనే ఒక సంస్ధలో చేరి దానికి అధ్యక్షురాలైంది. పేదలకు రేషన్‌ కార్డులు ఇప్పించేందుకు, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి, వుపాధికి తోడ్పటం వంటి కార్యకలాపాలను ఆ సంస్ధ నిర్వహించేది.ఈ క్రమంలోనే 2007లో ఆమె ఎన్‌సిపి అగ్రనేత అజిత్‌ పవార్‌ కుటుంబ ఆధ్వర్యంలో నడిచే అజిత్‌ సహకార బ్యాంకులో జరిగిన 50 కోట్ల అవినీతికి వ్యతిరేకంగా తృప్తి దేశాయ్‌ గళం విప్పింది.బ్యాంకు డిపాజిట్‌దార్లతో పోరాట సమితిని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల తరువాత 29వేల మందికి తమ డిపాజిట్లు వచ్చేట్లు చేయటంతో ఆమె వెలుగులోకి వచ్చారు. దాంతో కొంత మంది ఆమెకు ఏదైనా సామాజిక సంస్ధను ఏర్పాటు చేయమని సలహా ఇచ్చారు.

     అలా ఏర్పడిందే భూమాత బ్రిగేడ్‌.నలభై మందితో 2010 సెప్టెంబరు 27న ప్రారంభమైన ఈ సంస్ధలో ఇపుడు ఐదువేల మందికి పైగా స్త్రీ, పురుష సభ్యులున్నారు. అనేక అంశాలపై ఈ సంస్ధ పని చేస్తుంది.అన్నా హజారే జనలోక్‌పాల్‌ ఆందోళనలోనూ వారు పాల్గొన్నారు. శని దేవాలయ ప్రవేశం కోసం భూమాత బ్రిగేడ్‌ ఒక వుప విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి భూమాత రాన్‌రాగిణి బ్రిగేడ్‌ అని పేరు పెట్టారు. నవంబరు 29న ప్రారంభమైన ఈ వుద్యమం ఏప్రిల్‌ ఎనిమిదిన దేవాలయ ప్రవేశంతో విజయం సాధించింది. తృప్తి దేశాయ్‌ 2006లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇప్పుడు ఆరు సంవత్సరాల కుమారుడు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. తన భార్య కార్యకలాపాలను చూసి తాము గర్వ పడుతున్నట్లు ఆమె భర్త ప్రశాంత్‌ దేశాయ్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Mullahs on the warpath against a domestic violence law – Will society standup against to the clerics ?

22 Tuesday Mar 2016

Posted by raomk in Communalism, Current Affairs, INTERNATIONAL NEWS, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

clerics ?, domestic violence law, Islamic, Mullahs, Mullahs on the warpath, pakistan, pro-women law, un-Islamic, Women

(Posted below are selected reports and commentary on the mass mobilisation by religious leaders in Pakistan opposed to the Punjab Protection of Women against Violence Act ]

Pakistan religious leaders slam women’s protection acthttp://www.aljazeera.com/news/2016/03/religious-leaders-slam-women-protection-act-pakistan-160303160705361.html

The News International, March 20, 2016

Standing up to the clerics

by Ghazi Salahuddin

When they sat together on a Mansoora table in Lahore on Tuesday, the religious leaders of Pakistan had women on their mind. They deliberated on the Punjab Protection of Women against Violence Act and demanded that the law be withdrawn before March 27; otherwise, they would launch a nation-wide movement against the government.

Times have certainly changed, but there are intimations of the massive agitation that was mounted against Zulfikar Ali Bhutto in 1977. The Pakistan National Alliance (PNA) movement was largely religiously motivated. Its slogan was the establishment of the Nizam-e-Mustafa, though political parties were also a part of the nine-party alliance.

And the irony is that Nawaz Sharif, though he had not yet emerged on the political horizon in 1977, would spiritually have belonged to that Islamist group. After all, his was the most prominent face in another Islamist alliance (an electoral one this time) that was formed in 1988 to confront Z A Bhutto’s daughter Benazir. The Islami Jamhoori Ittehad (IJI) also had nine parties. Throughout his political career, Nawaz Sharif has basked in the glory of conservative, even Islamist politics.

Now, however, the religious parties have ganged up against their former ally. Is this an omen of some kind, indicating a shift in the ideological alignments of our political parties? Can we hope that the veto power that clerics had held over our politics is about to be curtailed?

We need to look carefully at this emerging confrontation between the government and a united front of the religious groups in the context of the ongoing campaign against terrorism and extremism. This means that we can safely set aside an analogy between the PNA movement and the present stirrings. No mainstream political party is marching with the clerics and the establishment has obviously not nudged them into this defiance.

While the immediate provocation is the ‘un-Islamic’ law on women’s rights, it is instructive to scan the joint declaration that was approved by around 30 religious outfits. There has been some discussion lately about a shift in the government’s ideological sense of direction. First, the prime minister invoked a ‘liberal’ vision of Pakistan. Then, Mumtaz Qadri was executed. There have been some other signs of this shift.

The declaration said that “the religious leadership stands united to safeguard Namoos-e-Risalat and the Muslim family system”. It is interesting that these religious parties are not ashamed to insist that the measures taken by the government that they deem to be secular and liberal in nature “are a revolt against the constitution and betrayal of the founding fathers of the country”.

Imagine in your mind the sight of the leaders that represent the entire spectrum of our religious constituency and ask yourselves if they could be the successors of the founding fathers of Pakistan. This, in a way, is a more sinister usurpation of what they call the ideology of Pakistan than any military intervention or imposition of martial law. This is one measure of how we, in a collective sense, relate to our history. This confusion has left us wandering in the wilderness.

According to published reports, Jamaat-e-Islami chief Sirajul Haq, who presided over the meeting, said that “the women protection law is an attack on the Muslim family system and the rulers have been tasked to break it”. He argued that along with such measures as the execution of Mumtaz Qadri, the law was part of an international agenda and proved that the West had unleashed a cultural attack on the Muslim world.

There is no denying that Pakistani society is very vulnerable to religions passions. Even when the Islamists are unable to win an electoral majority, their capacity to mobilise the streets on an emotional issue is considerable. Besides, this power becomes larger than what it actually is when the government loses its nerve or when some high functionaries play a collaborative role. That is how a Lal Masjid becomes possible.

Have things changed since the Army Public School in Peshawar to an extent that the government can take on the clerics this time? The very reasons that the religious alliance has given for its exasperation are justification for not moving back. And if this is the resolve of the authorities, they should be grateful to the religious leaders for getting together and setting the stage for a decisive encounter.

But we cannot be sure that Nawaz Sharif’s administration would be able to muster the courage of its convictions. It is difficult to visualise a change of heart of such proportions in a short time. The PML-N, after all, has always been a right of centre, conservative party, and its affiliations with the militants in southern Punjab have been widely suspected.

So, why did Nawaz Sharif step out of this shadow in November last year to perceive Pakistan’s future in a ‘liberal’ and democratic dispensation? Why was he so enthusiastic in applauding the Oscar awarded to Sharmeen Obaild-Chinoy’s short documentary on honour killing, when the Islamists were condemning it as a Western conspiracy to damage Pakistan’s image? How did he find the courage to execute Mumtaz Qadri? And how was the landmark women’s rights law possible in Punjab?

It seems rational to believe that this is a new game plan, devised in collaboration with the military establishment. The logic for this shift has been present for a long time. It would be a national tragedy if these initiatives were abandoned prematurely. Incidentally, the religious leaders also expressed their concern that the rulers were keen to improve ties with India. There has been some good news on that front too, and this process should also be protected.

The fact that the law to protect women against violence has become the rallying point for all factions of Islamists and radicals, as well as moderates, is understandable. They resist the emancipation of women with full force. They know that the education of little girls and the freedom of women will effectively obliterate their kingdom of fear and obscurantism. It is for this reason that they so venomously disparage Western values and ideas. One reason for Islamophobia in Western countries, apart from violent extremism, is the status of women in Muslim countries.

I read an article about a prominent French intellectual, Alain Finkielkraut, in The New York Times who argues that Islam and the French society are incompatible. He is obviously an anti-Muslim rightist. But I think that he has a point when he says that the main problem is the oppression of women in Muslim culture. “We’ve got to help the Muslims resolve this question”, he said. In Pakistan, we should not need anyone’s help to liberate our women.

The writer is a staff member.

o o o

The News – March 17, 2016

Editorial: Fantastical fears

The degree of frenzy stirred up by the Protection of Women Law passed unanimously by the Punjab Assembly last month is unexpected and rather alarming. Under pressure from religious parties, the Punjab government has stopped the notification of the law while its top brass contemplates what to do. What is unclear is whether the religious right has the political power to force the government into changing the law. The claims of religious parties, led by the JUI-F and the Jamaat-e-Islami, are widely exaggerated. The law has been labelled an ‘attack on the Muslim family system’, a promotion of ‘Western immorality’, an attempt at ‘secularising’ Pakistan and an attack on the ‘rights of men’. The Punjab Protection of Women Law aims to protect women against domestic abuse and harassment in public spaces. Both are systemic issues prevalent in Pakistani society. This is as such not different from other laws passed to protect women against physical harm at both the federal and provincial levels. The Protection of Women Bill of 2006 is an example, with religious parties apparently un-threatened by the Musharraf-era legislation which amended Hudood Ordinance provisions. Even the most narrow-minded of critics of the recent law have shied away from arguing that husbands have a right to beat their wives or that men have a right to harass women.

So the question is: if it is acknowledged that these practices are not desired in society, then why are the religious parties protesting a law that aims to put an end to them? The answer is simple: political expediency. The religious parties appear to have decided to construct an issue out of a non-issue simply to gain political mileage. One must remember that the law to regulate marriage in the Ayub Khan period was also opposed while religious parties attempted to thwart the rise of Zulfikar Ali Bhutto’s PPP by using the rhetoric of a ‘threat to Islam’. The fact is that the law to protect women poses no threat to Islam. There appears to be nothing in the law that is either un-Islamic or violates cultural practices. After all, no culture and no religion – especially not Islam – sanctions violence of any kind against women. It seems the religious right is trying to remain relevant to the country’s politics by raising the slogan that somehow Islam is in danger because of this law. In a post-NAP Pakistan, religious parties have not been able to raise support in favour of their usual causes. That the execution of Mumtaz Qadri and passage of the women’s protection law are being condemned in the same line of argument suggests that our religious parties are trying to counter their own irrelevance to the politics of Pakistan. The Punjab government deserves praise for tabling the law and defending it as well. It must not give in to these demands. Otherwise, it will open itself to being held hostage over and over again. It would be unfortunate if a measure aimed at safeguarding a large proportion of the population had to be altered on the basis of whims expressed by the right wing.

o o o

The News – March 17, 2016

Activists come out against religious parties’ furore over pro-women law

Karachi

Often seen to have taken hard stances against each other, mainstream religious parties and scholars belonging to all schools of thought appear to be standing in unison against the pro-women bill recently passed by the Punjab Assembly. However, voices condemning the scholars’ demand to withdraw the ‘un-Islamic’ Punjab Protection of Women Against Violence Act-2015, by March 27, have also been raised as civil society activists on Wednesday gathered outside the Karachi Press Club and urged the Punjab government not to succumb to the parties’ pressure.

The protest was organised under the banner of Joint Action Committee (JAC) – a coalition including organisations suc­h as the Human Rights Organisation of Pakistan, Urban Resource Centre, Peoples’ Labour Bureau, Aurat Foundation, Pakistan Medical Association, Pakistan Institute for Labour Education and Research and others.

The JAC, welcoming the Punjab government’s step, called for implementing the bill in letter and spirit. A representative of the National Organisation for Working Communities, Farhat Parveen, said, “In a country where ‘honour’ killings and acid attack remain common, the passage of the bill in Punjab is a good omen and must be appreciated.”

The Sindh government had already passed a law pertaining to providing protection to women from domestic violence in 2013 but was yet to implement it, she added. “We strongly condemn the religious parties which have not only been mocking a serious bill protecting women from violence but also using the issue to pressure the government to gain personal benefits,” opined vice chairperson of HRCP’s Sindh chapter, Asaid Iqbal Butt.

The protestors also called for the legislation to be taken as a bench mark by the federal government as well as other provincial governments while also criticised the religious parties’ practice of doing politics in the name of women.

Representatives of over 35 religious parties on the call of Jamaat-e-Islami (JI) had, on Tuesday, gathered in Lahore to warn the Punjab government of launching a mass protest movement if the bill was not withdrawn by March 27.

This bill introduces, for the first time, an in-built implementation mechanism through the establishing centres in all districts for victims, court orders pertaining to provision of residence, protection as well as monetary compensation and introduction of GPS tracked electronic bracelets-anklets for perpetrators.

o o o

The Nation – March 16, 2016

Who gave these religious scholars the right to speak on behalf of women?

by Shamila Ghyas

People who have never raised their voice for child brides, for raped women, for the women who killed themselves due to a lack of justice, are in no position to have a say over women rights

A lot has been said about the Women’s Protection Act of Punjab and one would have thought the topic would have been done and dusted by now. The Act consists of 31 clauses which provide a proper system for complaint registration as well as penalties for offenders.

Women being protected from all forms of violence, what could be wrong in that?

Apparently, a lot.

All the religious parties in Pakistan have demanded that the government withdraw the bill. On the one hand, they term it un-Islamic while on the other, they say Islam does not allow violence on women. So if there is no violence allowed then why be against something that goes even further and protects the woman?

Maulana Fazlur Rehman even went far enough to say the law has poison in it. He said that many of the clauses contradict Sunnah. This still very much counters their statement saying Islam does not allow violence against women.

Mufti Naeem commented earlier that the law is not needed since just a mere 1% of women go through domestic violence. Does he know how many women exist in Pakistan and what a huge number, the (supposed) 1% he is dismissing actually amounts to? If the number of women abused does not reach 10,000,000 the violence should be swept under the carpet and be ignored? And let’s not even get to the cases which go unreported and unrecorded.

A lot of the complaints revolve around the man who assaults his wife being told to leave the home instead of the woman. He is also required to wear a GPS so his movements can be tracked.

They say that is an insult to the dignity of a man to leave and to wear such a thing.

I think it would rather be a humongous insult to the man’s dignity IF he assaults his wife. But then that is just me and not the Maulanas teaching us about dignified behavior.

There can be no arguments in favor of a man being allowed to assault and beat his wife or women in general. None.

A man who does not intend on beating his wife would not have any problems with the bill. It does not affect him or his wife or his family. He should welcome it, for the people who do this will be the ones punished, not him.

As for marriages breaking up, should a woman who is regularly beaten by her husband stay in such an abusive marriage in the first place?

And no, since people will bring up children, they are equally affected by such marriages as are by broken ones. Perhaps even more.

If the wife is so desperate and has nowhere to go, or is pushed down by the social stigma of “what will people say” and “bringing shame to the family,” the poor woman will probably not even report the violence to the police in the first place – leaving her marriage quite ‘intact.’

There will be women who will abuse the law too; but even that has been taken into consideration. There is a fine as well as jail time in place.

And putting all that aside, people who have never raised their voice for a raped woman, for the woman who killed herself due to lack of justice, are in no position to have a say over women rights.

They never showed this much uproar for when an 11-year-old child was married off to a 50-yea-old man and died a week later due to internal injuries.

They conveniently turned deaf and dumb when a man threw acid on the face of a woman who said no to marrying him.

They secretly smiled at the brother who killed his sister because he saw her talking to a boy he did not like.

What gives them the right to have a say in this when they have been quiet all along regarding every other atrocity that has taken place against women? Who makes them the experts? Just because they are scholars?

Here, they are openly going against a law that is there to protect women. What is the point of such scholars when they are only encouraging violence with their stance?

“Islam does not allow violence against women and we shall support every law that backs this up.” THIS is what they should be saying.

THIS! No ifs and buts. There are no gray areas here.

Think about the times when families pressurize daughters-in-law to get dowry from their respective families and this continues well into the marriage too. How many cases are there of families abusing them (daughters-in-law) to the point they actually die?

Countless.

Are we just supposed to express our grief when we read about such cases by shaking our heads and then moving on the to the next news? Is it not better to prevent such things from taking place entirely?

Won’t the woman have been better off had the family/husband been punished before it got to the point where she didn’t exist anymore? What about the children she left behind then? Suddenly, nobody is thinking of them anymore.

Every single person who wants the Women’s Protection Act in Punjab to be withdrawn is nothing more than a person with a severe inferiority complex who doesn’t want to be punished by law when he beats, rapes, abuses, harasses, throws acid on women, etc.

They come equipped with a mentality that man is superior to a woman and thus holds power over her. That includes the right to hit her when he wishes to.

This also goes for the women who agree to be violated against and think it as being completely acceptable behavior. There are many women out there who support the weak, spineless characters who abuse and use religion to further their own agenda.

If you are against the Act, it simply means you are saying it is okay to beat and rape women.

Shamila Ghyas is an author who writes for Khabaristan Times and other publications.

o o o

Dawn – 21 March 2016

Mullahs on the warpath

by Maheen Usmani

Perhaps nothing unites our clerics more than women’s issues.

The Council of Islamic Ideology deliberates on burning issues like underage marriage (the younger the better), can a woman object to her husband’s second, third and fourth marriages (no), can DNA be used as primary evidence in rape cases (of course not…duh), the interpretation of veil for women, is co-education kosher (no, such an unhealthy practice for society), should female judges be obliged to wear niqab (naturally, yes).

Nowadays, the clerics have a new rallying cry.

Mullahs — who seal their lips and eyes when women are raped, assaulted, burnt, murdered, humiliated, thrown out of houses, used as barter or traded to compensate for “insults” to ghairatmand (so-called honourable) men — are finally up in arms.

What has got their goat this time?

The Punjab Assembly has taken the unforgivable step of passing the Women’s Protection Act, which seeks to give legal protection to women from domestic, psychological and sexual violence.

How ridiculous is that, shout the clerics. This is “an un-Islamic law!” they thunder from their pulpits.

Maulana Fazlur Rehman and his coterie are so incensed that they are racing to hold rallies to protest such a draconian move which will grant protection to women from their oppressors.

How can this happen in Pakistan, they scream.

Yes, they are the very same people who have decided that they are the stakeholders of a country whose very existence they not only campaigned against and denounced but whose founder they termed “Kafir-e-Azam.”

Now they have positioned themselves as the standard bearers of Pakistan and its ideology. In fact, they are corrupting its ideology to suit their ends.

And the supine, pathetic so-called silent majority has let them.

Examine: It took my mother 30 years to walk out of an abusive marriage and an ’honest’ infidelity

In Punjab, violence is a way of life in many homes.

Recently, I met a woman from the province who worked as a maid and was widowed at an early age and had struggled to raise her kids.

One day when I said, “How sad that your husband died so young…” she interrupted me with a wave of her hand.

“Baji, no, no, I am not sorry. He used to hit me so much. At least now no one can raise a hand to me. It’s difficult yes, but now, I live life on my own terms.”

Surprised that this spirited tall woman had once been battered, I asked: “But why did you take it? Why did you not tell him to stop?”

“Because Baji, that is the way our men are, They beat us and we get beaten. That is our life.”

And this is exactly the kind of mindset the mullahs in Pakistan want to perpetuate: powerless women getting abused endlessly and accepting it as their due.

Maheen Usmani is a freelance journalist. She has reported on varied subjects ranging from socio-political issues to sports, travel, culture and counter terrorism.

Courtesy :http://sacw.net/

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • కేరళామే హమ్‌ దేఖేంగే !
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1
  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • కేరళామే హమ్‌ దేఖేంగే !
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1
  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • కేరళామే హమ్‌ దేఖేంగే !
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2
  • ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1
  • లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: