• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: 2002 Gujarat carnage

సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

20 Friday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Gujarat, History, NATIONAL NEWS, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

2002 Gujarat carnage, BJP, Explosive BBC documentary, Gujarat pogrom, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యం కాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశంలో కూడా అనేక మంది పాత సంగతులను అలాగే ఎందుకు వెల్లడించకూడదు అనుకుంటారు. గోద్రా రైలు దుర్ఘటన పేరుతో జరిపిన 2002 గుజరాత్‌ మారణకాండ గురించి బ్రిటన్‌ రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన నివేదికల్లోని అంశాలను బహిర్గతం చేస్తే కొంత మంది ఇప్పుడు ధూం ధాం అంటూ మండిపడుతున్నారు. తమ రాయబారి పంపిన అంశాలను బ్రిటన్‌ సరికొత్త పద్దతుల్లో వెల్లడికావించింది. బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌( బిబిసి ) రెండవ ఛానల్‌ ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) పేరుతో 2023 జనవరి 17న ప్రసారం చేసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ తొలి భాగం ఆ దురంతాలను గుర్తుకు తెచ్చి మరోసారి నరేంద్రమోడీ, సంఘపరివార్‌ సంస్థల పేర్లను జనం నోళ్లలో నానేట్లు చేసింది. బిబిసికి సమాచారం ఇచ్చిన తీరు మీద బ్రిటన్‌ ప్రభుత్వాన్ని ఖండించలేని నిస్సహాయ స్థితికి ప్రపంచంలో ఎదురులేదని చెబుతున్న నరేంద్రమోడీని నెట్టింది. ప్రతిస్పందిస్తే మరింత పరువు పోతుంది అన్నట్లుగా మాట్లాడకూడదని నిర్ణయించింది. పైకి మాట్లాడినా మాట్లాడకున్నా ప్రపంచమంతా మోడీ గురించి మరోసారి అవలోకిస్తుంది.


ఈ డాక్యుమెంటరీ వక్రీకరణలతో ప్రచారం కోసం నిర్మించిందని, ఒక నిర్ధిష్టమైన పరువు తక్కువ కథనాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు రూపొందించినదని, దాని మీద ఇంతకు మించి స్పందించి గౌరవించదగినది కాదని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ పేర్కొన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. వివాదం తలెత్తటంతో ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్‌ నుంచి తొలగించారు. ఈ నెల 24న మరొక భాగం ప్రసారం కావాల్సి ఉంది.తమ కథనాన్ని బిబిసి సమర్ధించుకుంది. ఉన్నతమైన సంపాదక ప్రమాణాలకు అనుగుణంగా తీవ్రంగా పరిశోధించిన తరువాత రూపొందించినట్లు పేర్కొన్నది. భిన్న గళాలు, అభిప్రాయాలు వెలిబుచ్చే వారిని, నిపుణులను తాము కలిశామని, బిజెపికి చెందిన వారి స్పందనలతో సహా పలు అభిప్రాయాలకు దానిలో తావిచ్చామని, తమ డాక్యుమెంటరీలో లేవనెత్తిన అంశాలకు తగిన సమాధానం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా స్పందించేందుకు తిరస్కరించినట్లు బిబిసి తన ప్రకటనలో పేర్కొన్నది. గుజరాత్‌ ఉదంతాలు, నరేంద్రమోడీ పాత్ర గురించి ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అది ప్రసారంగాక ముందే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అని బిబిసి ప్రకటన చెబుతున్నది. చర్చ మరింత జరిగితే నరేంద్రమోడీ, బిజెపికి మరింత నష్టం గనుక కేంద్రం నుంచి లేదా బిజెపి దీని గురించి ముందు ముందు ప్రస్తావించకపోవచ్చు. మొత్తంగా మీడియా నరేంద్రమోడీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పరిమితంగానైనా వార్తలు ఇవ్వకపోవచ్చు, చర్చలు జరపకపోవచ్చు. అంత మాత్రాన రచ్చగాకుండా ఉంటుందా జనం చర్చించకుండా ఉంటారా ?


ఏ దేశంలోనైనా పెద్ద ఉదంతాలు జరిగినపుడు ఆ దేశంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు మనదేశంతో సహా తమ వనరులు, సంబంధాల ద్వారా సమాచారాన్ని సేకరించి వాటిని తమ దేశాలకు చేరవేస్తాయి. వికీలీక్స్‌ వెల్లడించిన కోట్ల కొద్దీ పత్రాలవే. గుజరాత్‌ ఉదంతాల గురించి బ్రిటీష్‌ రాయబార కార్యాలయం అలాంటి నివేదికనే ఇచ్చినట్లు దానిలోని అంశాలను డాక్యుమెంటరీ వెల్లడించింది. బిబిసికి వాటిని అందించారంటే బ్రిటన్‌ ప్రభుత్వం తొలిసారిగా వాటిని బహిర్గత పరిచినట్లే. అందువలన ఈ డాక్యుమెంటరీ గురించి, దానిలో పేర్కొన్న అంశాల సంగతి ఏమిటని పార్లమెంటులో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎంపీ ప్రస్తావించినపుడు నోరు మూయించేందుకు ప్రధాని రిషి సునాక్‌ చూశాడు. సమాధానంగా ఏమి చెప్పినప్పటికీ అది మొహమాటంతో చెప్పినవిగానే పరిగణించాలి. నివేదికలోని అంశాలు వాస్తవమా కాదా అని చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానమిచ్చాడు.పాకిస్థాన్‌ మూలాలున్న ఎంపీ ఇమ్రాన్‌ హుసేన్‌ డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించగా దానితో తమకు సంబంధం లేదని, దానిలో భారత ప్రధాని గురించి చిత్రీకరించిన తీరును తాను అంగీకరించటం లేదని రిషి సునాక్‌ చెప్పాడు. మత విద్వేష హింస ఎక్కడ జరిగినా తాము సహించబోమని, అయితే నరేంద్రమోడీ పాత్రను చిత్రించిన తీరును తాను అంగీకరించనని అన్నాడు. ఇంత రచ్చ జరిగిన తరువాత కూడా బిబిసి చిత్రంలో వెల్లడించిన అంశాల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరో భాగాన్ని ప్రసారం చేస్తారా లేదా అన్నది చెప్పలేదు.


డాక్యుమెంటరీలో పేర్కొన్నదాని ప్రకారం నాటి బ్రిటన్‌ దౌత్యవేత్త పంపిన సమాచార పత్రానికి పెట్టిన శీర్షిక, సంగ్రహము ఇలా ఉంది. ” విషయము: గుజరాత్‌ మారణకాండ ” వెల్లడైనదాని కంటే హింస చాలా ఎక్కువగా ఉంది. కనీసం రెండువేల మంది మరణించారు. పధకం ప్రకారం పెద్ద ఎత్తున ముస్లిం మహిళల మీద అత్యాచారాలు జరిగాయి.లక్షా 38వేల మంది నిరాశ్రయులయ్యారు. హిందువులు ఉండే చోట, హిందువులు-ముస్లింలు కలసి ఉన్న ప్రాంతాలలో ముస్లింల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం కావించారు. పధకం ప్రకారం హింస జరిగింది. కొన్ని నెలల ముందుగానే పధకం వేసి ఉండవచ్చు. రాజకీయ ప్రేరేపితమైనది.హిందువులుండే ప్రాంతాల నుంచి ముస్లింలను తరమివేయటమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ రక్షణలో దీనికి విహెచ్‌పి (హిందూ ఉగ్రవాద సంస్థ) నాయకత్వం వహించింది. మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా ఐకమత్యము అసాధ్యం. వారి(హిందూ మూకలు) పధకం ప్రకారం సాగించిన హింసలో నిర్దిష్ట జాతి నిర్మూలన లక్షణాలన్నీ ఉన్నాయి. శిక్షలేమీ ఉండవనే వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా విహెచ్‌పి అంత ఎక్కువ నష్టం కలిగించి ఉండేది కాదు. దీనికి నరేంద్రమోడీ నేరుగా బాధ్యుడు.”


ఇంతే కాదు, డాక్యుమెంటరీ వెల్లడించిన దాని ప్రకారం బ్రిటన్‌తో పాటు ఐరోపా సమాఖ్య కూడా విచారణ జరిపింది. వాటిసారం ఒక్కటే. హింసాకాండలో మంత్రులు చురుకుగా భాగస్వాములయ్యారు. దాడుల్లో జోక్యం చేసుకోవద్దని సీనియర్‌ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశ్వసనీయమైన వారు చెప్పినదాని ప్రకారం 2002 ఫిబ్రవరి 27న నరేంద్రమోడీ సీనియర్‌ పోలీసు అధికారులతో సమావేశమై జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. అసలు అలాంటి సమావేశం జరగలేదని పోలీసు అధికారి ఒకరు చెప్పినట్లు కూడా బిబిసి తన కథనంలో పేర్కొన్నది. సమావేశం జరిగిందని అంగీకరిస్తే మోడీ ఆదేశాలను అమలు జరిపినట్లుగా అంగీకరించినట్లవుతుంది, ఆ ఉదంతాలకు స్వయంగా కారకులని అంగీకరించినట్లవుతుంది కనుక అసలు సమావేశమే జరగలేదని చెప్పినట్లు కూడా పేర్కొన్నది. నాడు ఇంటలిజెన్స్‌ విభాగ అధిపతిగా ఉన్న ఆర్‌బి శ్రీకుమార్‌, మరో అధికారి సంజీవ భట్‌, మరో అధికారి మాత్రం నరేంద్రమోడీ ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. సదరు సమావేశంలో అసలు వారెవరూ పాల్గొనలేదని అదే కథనంలో మరొక పోలీసు అధికారి చెప్పిన అంశాన్ని కూడా డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. మరొక కేసులో సంజీవ భట్‌ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.


ఈ కథనంలో లేదా నరేంద్రమోడీ మద్దతుదార్లు, బిజెపి ఏమి చెప్పినా కొన్ని సందేహాలకు సరైన సమాధానం రాలేదు. అంతటి తీవ్ర శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు ఏ సిఎం అయినా ఇంటలిజెన్స్‌ అధికారిని పిలిపించకుండా,ఉన్నతాధికారుల సమావేశం జరపకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారా ? ” స్నేహపూర్వకంగా ఉన్న ఒక దేశాధినేత గురించి గతంలో బిబిసిలో అలాంటి విమర్శ వచ్చినట్లు నాకు గుర్తు లేదు. కనుక సహజంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమంటే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని గట్టిగా కోరుకుంటూ ప్రస్తుతం బ్రిటన్‌ ప్రభుత్వం సున్నితమైన చర్చల్లో మునిగి ఉన్నపుడు గుజరాత్‌ కొట్లాటలపై విస్ఫోటకం వంటి చిత్రాన్ని ప్రసారం చేయాలని బిబిసి ఎందుకు నిర్ణయించినట్లు ” అని మన విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఒకరు ప్రశ్నించినట్లు బిబిసి పేర్కొన్నది. నిజమే, వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుపుతున్న తరుణంలో ఇలాంటి అంశాలతో కూడిన చిత్రాన్ని ప్రసారం చేస్తే హానికలిగే అవకాశం ఉంటుంది, ఇతర సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. కనుక ఏ ప్రభుత్వమైనా తన దగ్గర ఉన్న సమాచారాన్ని, అందునా ప్రభుత్వ నిధులతో నడిచే ఒక మీడియా(బిబిసి) సంస్థకు అందచేసి బహిర్గతపరిచేందుకు అనుమతిస్తుందా ? కారణం ఏదైనా బ్రిటన్‌ ప్రభుత్వం అందించింది, ప్రసారానికి కూడా అనుమతి ఇచ్చింది.


గుజరాత్‌ మారణకాండ జరిగినపుడు బ్రిటన్‌ విదేశాంగ మంత్రిగా ఉన్న జాక్‌ స్ట్రా ఆ ఉదంతాలపై నివేదిక ఇవ్వాలని కోరాడు.హౌంమంత్రిగా జాక్‌ స్ట్రా పనిచేసినపుడు బ్రిటన్‌ సమాచార స్వేచ్చ చట్టాన్ని 2000లో తెచ్చారు. దాన్ని సమీక్షించేందుకు 2015లో ఏర్పాటు చేసిన ఒక కమిటీలో కూడా జాక్‌ ఉన్నాడు. బహుశా సమాచార కమిషన్‌తో ఉన్న దగ్గరి సంబంధాల కారణంగా గుజరాత్‌ నివేదికలను బహిర్గతం కావించేందుకు అతగాడు ఒక పాత్ర పోషించి ఉండవచ్చని భావిస్తున్నారు. జాక్‌ స్ట్రా లేబర్‌ పార్టీ నేత కనుక టోరీ పార్టీ ప్రధాని రిషి సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు చూసి ఉండవచ్చు అనుకుంటే, అధికారంలో ఉన్న పార్టీ, మంత్రులు, అధికారులు ఎందుకు సహకరించినట్లు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.


రాయబార కార్యాలయం పంపిన నివేదికలో నరేంద్రమోడీ పాత్ర గురించి స్పష్టంగా చెప్పిన కారణంగానే ఆ తరువాత బ్రిటీష్‌ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. బ్రిటన్‌లోని హిందూత్వ సంస్థల ఆహ్వానం మేరకు 2003లో నరేంద్రమోడీ అక్కడికి వెళ్లారు. దాని మీద తలెత్తిన విమర్శలతో ” నరేంద్రమోడీ బ్రిటన్‌ సందర్శన గురించి మాకు తెలుసు, ప్రభుత్వ ఆహ్వానం మేరకు అతను రావటం లేదు, ఇక్కడ ఉన్నపుడు అతనితో ఎలాంటి సంబంధాలూ ఉండవు ” అని బ్రిటన్‌ సర్కార్‌ ప్రకటించింది. మోడీ బ్రిటన్‌ వెళ్లినపుడు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా ఉన్న సత్యవ్రత పాల్‌ తరువాత రాసిన దానిలో ఇలా ఉంది. ” విదేశాంగశాఖ మంత్రి (యశ్వంత సిన్హా) ప్రధాని వాజ్‌పాయి దగ్గరకు వెళ్లారు. ఆ పర్యటన వాంఛనీయం కాదు, రద్దు చేసుకోవాల్సిందే అన్న వైఖరితో ప్రధాని కూడా అంగీకరించారు.” ఐనా సరే జరిగింది అంటే సంఘపరివార్‌ వత్తిడి కారణం అన్నది స్పష్టం. ఇక మోడీ బ్రిటన్‌లో ఉండగా ఇమ్రాన్‌ ఖాన్‌ అనే లాయరు మోడీని అరెస్టు చేయాలని అక్కడ కోర్టుకు వెళ్లారు, కోర్టు అంగీకరించలేదు. ఇప్పుడు బిబిసి వెల్లడించిన సమాచారం గనుక ఆ నాడు తన వద్ద ఉండి ఉంటే మోడీ అరెస్టుకు దారితీసేదని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నాడు. అదే సర్కార్‌ తరువాత 2005లో మోడీ వీసాను రద్దు చేసింది. అమెరికా కూడా వీసాను రద్దు చేసింది.సిఎంగా ఉన్నపుడు మోడీ రాకను అడ్డుకుంది. తరువాత 2014లో నరేంద్రమోడీ ప్రధాని కాగానే ఈ రెండు దేశాలూ వీసాను పునరుద్దరించి దేశాధినేతగా స్వాగతం పలికాయి. ఒక దేశంలో ఒక రాష్ట్రానికి సిఎంగా ఉండటం వేరు, ప్రధానిగా దేశాధినేతగా ఉండటం వేరు గనుక తామాపని చేశామని, ఒక్క నరేంద్రమోడీకే కాదు సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు సైతం వీసా పునరుద్దరించామని, అది సంప్రదాయమని 2022 నవంబరులో అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.


తమ ప్రాణాలకు భద్రత గురించిన భయంతో భారత్‌కు చెందిన 30 మంది డాక్యుమెంటరీలో మాట్లాడేందుకు తిరస్కరించినట్లు బిబిసి పేర్కొన్నది.భారత ప్రభుత్వం కూడా దానిలో పేర్కొన్న అంశాలపై స్పందించేందుకు నిరాకరించింది అనికూడా వెల్లడించింది.ఈ నెల 24న ప్రసారం కానున్న రెండవ భాగంలో 2019 తరువాత మోడీ సర్కార్‌ తీరు తెన్నుల గురించి వివరించనుంది. ఈ చిత్రం గురించి పలు కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ ఎత్తులు జిత్తులలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్‌ ముందుకు తెచ్చిన కూటముల్లో మన దేశం చురుకుగా ఉంది. మన మీడియా వర్ణించినట్లుగా ”మనవాడు” రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు మోడీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తరువాత కూడ బిబిసి ఇలాంటి చిత్రాన్ని ప్రసారం చేయటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే బ్రిటన్‌ విదేశాంగ శాఖ వద్ద ఉన్న నివేదికలను కూడా సుప్రీం కోర్టుకు సమర్పించి దాని మీద విచారణ జరిగిన తరువాత బిబిసి ఆపని చేసి ఉంటే ఆ వాదనకు అర్ధం ఉంది. అలా జరగలేదే. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నరేంద్రమోడీని బదనాం చేసేందుకు ఇలా చేశారని చెబుతున్నారు. బ్రిటన్ను ప్రభావితం చేసే స్థితిలో ఇప్పుడు అమెరికా తప్ప మరొక దేశం లేదు. అదే వాస్తవమైతే ఆ పని 2014, 2019 ఎన్నికలపుడే చేసి ఉండవచ్చు. దాని వలన బిబిసికి, బ్రిటన్‌ ప్రభుత్వానికి కలిగే లబ్ది ఏమిటి ? ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా బిబిసి ఉత్తినే ఈ చిత్రాన్ని ప్రసారం చేస్తుందా ? దీని వెనుక ఉన్న అసలు సంగతి ఏమిటో వెల్లడిగాక తప్పదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీపై గుజరాత్‌ మారణకాండ మచ్చ : వీసా నిరాకరణపై మరోసారి గుర్తు చేసిన అమెరికా !

21 Monday Nov 2022

Posted by raomk in BJP, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2002 Gujarat carnage, AB Vajpayee, BJP, Immunity, Joe Biden, journalist Jamal Khashoggi, Narendra Modi Failures, RSS, Saudi Crown Prince Mohammed bin Salman


ఎం కోటేశ్వరరావు


పెళ్లికొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్‌ అవసరం లేని అంశాన్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అవసరం లేని అంశాన్ని చెప్పి నరేంద్రమోడీ మీద ఉన్న గుజరాత్‌ మారణకాండ మచ్చను తిరిగి ప్రపంచానికి గుర్తు చేసిన తీరు మీద మీడియాలో మరోసారి చర్చ జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2018లో హత్య చేశారు. దాని వెనుక సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉందని గతంలో అమెరికా విమర్శించింది. సౌదీలో భిన్న అభిప్రాయాలను, అసమ్మతిని అణిచివేస్తున్నట్లు ధ్వజమెత్తింది. ఖషోగ్గీ అమెరికా నివాసిగా ఉన్నందున అతని సన్నిహితురాలు, పౌరహక్కుల గ్రూపులు అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరుగుతున్నది. ప్రస్తుతం అతను దేశాధినేతగా ఉన్నందున అమెరికా చట్టాల ప్రకారం ఒక దేశాధినేతను అమెరికాలో విచారించే అవకాశం లేదని విచారణల నుంచి ప్రభుత్వ పరంగా మాపు(మినహాయింపు) ప్రకటించినట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే మాపు కోర్టును ప్రభావితం చేయదని, విచారించాలా లేదా అన్నది జడ్జి నిర్ణయానికే వదలి వేసినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది.


అయినప్పటికీ పౌర హక్కుల బృందాలు ప్రభుత్వ చర్య మీద ధ్వజమెత్తాయి. ఖషోగ్గీకి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదని, గతంలో ఆంక్షల మాపు పొందిన వారిలో హైతీ నేత జీన్‌ బెర్ట్రాండ్‌ అరిస్టైడ్‌, జింబాబ్వే నేత రాబర్ట్‌ ముగాబే, కాంగోనేత కబిల, భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉన్నారని విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత పటేల్‌ పేర్కొన్నాడు. వీరందరినీ పౌరహక్కులను హరించిన, జనాలను అణచివేసిన వారిగా అంతకు ముందు అమెరికా పేర్కొన్నది. వీసాల నిరాకరణ, ఆంక్షల వంటి చర్యలను ప్రకటించించి అమలు జరిపింది. వారు దేశాధినేతలుగా అధికారానికి వచ్చిన తరువాత వాటి నుంచి మినహాయింపులు ఇచ్చింది. ఆ దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు, నేతలతో అవసరాలు, అధికారికంగా వారు ఐరాస సమావేశాలకు అమెరికా రావాల్సిన అగత్య వంటి అంశాల కారణంగా కూడా ఆంక్షలను సడలించాల్సి వచ్చింది. కోర్టులో దాఖలైన దావా మంచి చెడ్డల జోలికి పోవటం లేదు.ఆంక్షలను మాపు చేసినప్పటికీ హత్యలో సౌదీ ఏజంట్ల పాత్రను అమెరికా ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నదని అమెరికా విదేశాంగశాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది . దానిలో రాజు పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.జర్నలిస్టు ఖషోగ్గీని హత్య చేయాలని ఎంబిఎస్‌గా పిలిచే మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నప్పటికీ సౌదీతో సంబంధాల అవసరాల రీత్యా ఎంబిఎస్‌ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. హత్యకు ముందు 2017 నుంచి ఎంబిఎస్‌ సౌదీ రక్షణ, గూఢచార విభాగాల అధిపతిగా ఉన్నాడు. ఇటీవలనే ప్రధానిగా ప్రకటించారు. కుట్రకు ఎవరు పధకాన్ని రూపొందించినప్పటికీ దాని స్వభావం, జరిగిన తీరును చూస్తే అతని అనుమతి లేకుండా జరిగేది కాదని సిఐఏ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారు.2021 ఫిబ్రవరిలో అమెరికా బహిర్గతపరచిన రహస్య పత్రాలలో జర్నలిస్టు ఖషోగ్గీని బందీగా పట్టుకు రండి లేదా అంతమొందించండన్నదానికి ఎంబిఎస్‌ ఆమోదం వుందని పేర్కొన్నారు.
.
ఎంబిఎస్‌పై మాపు ప్రకటించటం ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలని చెబుతున్న అమెరికా, దాని మిత్రపక్షాల ప్రయత్నాలకు హాని కలిగిస్తుందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు.నిరంకుశ సౌదీ వత్తిడికి లొంగినట్లు విమర్శించారు. ఖషోగ్గి హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొందరు సౌదీ అధికారుల మీద వీసా నిరాకరణ, ఇతర ఆంక్షలను అమలు జరుపుతున్నారు. హత్యలో సౌదీ రాజు పాత్ర గురించి విదేశాంగశాఖ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు.తన ఎన్నికల ప్రచారంలో సౌదీ రాజును ” అంటరాని ” వాని జోబైడెన్‌ వర్ణించాడు. ఈ ఉదంతంలో అతన్ని జవాబుదారీగా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తామని అమెరికన్లకు వాగ్దానం చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మారిన అంతర్జాతీయ పరిణామాల్లో రష్యాకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపమంటూ సౌదీకి వెళ్లి రాజును కౌగలించుకున్నాడు, చమురు ఉత్పత్తిని పెంచమని బతిమిలాడుకున్నాడు.వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ఇప్పుడు విచారణ నుంచి మాపు చేసి మరోసారి ప్రసన్నం చేసుకోవాలని అమెరికా చూస్తున్నది. హత్య జరిగినపుడు సల్మాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. ఇప్పుడు దేశాధినేత, అతడిని ప్రభుత్వం శిక్షించేది లేదని జో బైడెన్‌ 2021 ఫిబ్రవరిలోనే చెప్పాడు. సౌదీ రాజు సల్మాన్‌పై గూఢచార నివేదికలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వ్యూహాత్మక భాగస్వామిపై చర్య తీసుకున్న సంప్రదాయం అమెరికాకు లేదని చెప్పాడు.ఇది కేసు మంచి చెడ్డల ప్రతిబింబం కాదు లేదా ఖషోగ్గీ హత్య మీద మా అభిప్రాయాలకూ ప్రతిబింబం కాదు, ప్రభుత్వ అధిపతిగా రాజు పాత్ర మీద చట్టపరమైన పదవి మీద ఇక్కడి చట్టాల ప్రతిబింబమే అని తాజాగా వేదాంత పటేల్‌ చెప్పాడు.


చట్టబద్దంగా ఖషోగ్గి కేసులో సౌదీ రాజును మరొక దేశంలో విచారించే అవకాశం లేదని అతని న్యాయవాదులు కోర్టులో చెప్పారు. దాని మీద కేసు విచారణ జరుపుతున్న వాషింగ్టన్‌ జడ్జి ఒకరు ఆదేశం జారీ చేస్తూ నవంబరు పదిహేడవ తేదీ అర్ధరాత్రి లోగా ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలంటూ బైడెన్‌ ప్రభుత్వాన్ని కోర్టు కోరారు. ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేస్తూ సల్మాన్‌పై విచారణకు మినహాయింపు ఇచ్చామని అది కోర్టు నిర్ణయం మీద ప్రభావం చూపదని పేర్కొన్నది. దాన్నే మరుసటి రోజు మీడియాకు వివరిస్తూ విలేకర్ల ప్రశ్నకు నరేంద్రమోడీ మీద ఉన్న ఆంక్షలకు సైతం మాపు వర్తింప చేశామని వేదాంత పటేల్‌ చెప్పాడు. హతుడు ఖషోగ్గీ అమెరికా పౌరుడు గనుక అతని సన్నిహితురాలు, ఇతర హక్కుల సంస్థ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం వచ్చింది. గుజరాత్‌ మారణకాండలో అమెరికా పౌరులెవరూ మరణించనందున అక్కడి కోర్టులో మోడీపై కేసులను దాఖలు చేసే అవకాశం లేదు. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ నివారణలో సిఎంగా నరేంద్రమోడీ విఫలం కావటమే గాక దాడులను ప్రోత్సహించినట్లు విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దాని గురించి అమెరికాలోని హక్కుల సంఘాలు చేసిన వత్తిడి మేరకు ప్రభుత్వం 2005 నుంచి 2014వరకు అమెరికా సర్కార్‌ మోడీ అధికారిక పర్యటనతో పాటు పర్యాటక, వాణిజ్య వీసాలను కూడా నిరాకరించింది.తమ విదేశాంగశాఖ భారత మానవహక్కుల కమిషన్‌, ఇతర భారత స్వతంత్ర సంస్థల సమాచార ప్రాతిపదికగా ఒక వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నది 2014లో మోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన కొద్ది గంటల్లోనే దేశాధినేతగా ఉన్నందున బరాక్‌ ఒబామా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టాడు. తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. 2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ఆ హౌదాలో తొలిసారి అమెరికా వెళ్లటానికి ముందు గుజరాత్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు గాను విచారించాలంటూ దాఖలైన ఒక కేసులో అమెరిక ఫెడరల్‌ కోర్టు నరేంద్రమోడీకి సమన్లు జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరులో నరేంద్రమోడీతో సహా ఇతర దేశాధినేతలను అమెరికా కోర్టులో విచారించేందుకు మాపు ఉందని, తమ ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని నాటి ఒబామా సర్కార్‌ కోర్టుకు తెలిపింది.2015 జనవరిలో న్యూయార్క్‌ కోర్టు ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ కేసును కొట్టివేసింది. ఇప్పుడు సౌదీ రాజు మీద కేసును కూడా అదే విధంగా కొట్టివేసే అవకాశం ఉంది.

సిఎంగా ఉన్నపుడు మోడీకి వీసా నిరాకరించిన అమెరికా నిర్ణయాన్ని నాడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తప్పు పట్టింది. తమ దేశంలో చట్టబద్దంగా ఒక రాష్ట్రానికి ఎన్నికైన సిఎంకు వీసా నిరాకరణ పద్దతి కాదని 2005లోనే స్పష్టం చేసినప్పటికీ అమెరికా ఖాతరు చేయలేదు. నరేంద్రమోడీ వీసా నిరాకరణకు వత్తిడి చేసిన అంతర్జాతీయ మత స్వేచ్చ అమెరికన్‌ కమిషన్‌ సంస్థ(యు ఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) ఎన్‌ఆర్‌సి పేరుతో భారత ప్రభుత్వం ముస్లింలను వేధిస్తున్నదంటూ దానికి కారకులైన ” ముఖ్యనేతలందరి ” మీద ఆంక్షలు విధించాలని 2019లో డిమాండ్‌ చేసింది. దానిలో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అది నరేంద్రమోడీ, అమిత్‌ షాల గురించే అన్నది స్పష్టం.


జర్నలిస్టు ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ రాజు సల్మాన్‌ హస్తం ఉందని గతంలో చెప్పిన అమెరికా నాలుక మడిచి ఇప్పుడు ఏజంట్ల పాత్ర గురించి చెబుతోంది. గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ రాజధర్మాన్ని పాటించాలని నాటి ప్రధాని వాజ్‌పాయి హితవు చెప్పిన సంగతి తెలిసిందే.దీన్ని 2013లో నరేంద్రమోడీ తిరస్కరించటమే గాక తాను రాజధర్మాన్ని పాటిస్తున్నట్లు వాజ్‌పాయి చెప్పారని అన్నారు. ” ఒక నిర్ణీత రాజధర్మం ఉంది, దాన్ని మీరు అనుసరిస్తున్నారని ” అన్నట్లుగా మోడీ వర్ణించారు. నరేంద్రమోడీ 2014లో దేశాధినేత పదవిలోకి వచ్చినందున అంతకు ముందు విధించిన ఆంక్షలను మాపు చేసింది తప్ప శాశ్వతంగా ఎత్తివేసిందా లేదా అన్నది స్పష్టం కాలేదు. ఇప్పుడు ఖషోగ్గీ ఉదంతంలో సౌదీ ఏజంట్ల పాత్ర గురించి పునరుద్ఘాటిస్తున్నట్లుగానే గుజరాత్‌ మారణకాండలో సంఘపరివార్‌ సంస్థల గురించి కూడా అమెరికా గత వైఖరినే పునరుద్ఘాటిస్తుందా ? గుజరాత్‌ ఉదంతాలపై మోడీ ఇంతవరకు క్షమాపణ చెప్పటం లేదా విచారం వ్యక్తం చేయలేదు. ఆ ఉదంతాల్లో ఒక మానభంగం కేసులో శిక్షలు పడిన వారిని కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

2002 నాటి ఉదంతాలకు నరేంద్రమోడీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని 2012లో సుప్రీం కోర్టు చెప్పింది. తరువాత కూడా అమెరికా ఆంక్షలను కొనసాగించింది. తన మీద ఆంక్షల కోసం వత్తిడి తెచ్చిన యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌ ప్రతినిధులు 2016లో భారత పర్యటనకు అనుమతి కోరగా చివరి క్షణంలో మోడీ సర్కార్‌ తిరస్కరించింది. ఈ అనధికార నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ సర్కార్‌, సంఘపరివార్‌ సంస్థల తీరు తెన్నుల మీద ఆ సంస్థ ఎప్పటికప్పుడు తన నివేదికల్లో విమర్శలు చేస్తూనే ఉంది. వాటి మీద అమెరికా సర్కార్‌ అవుననీ, కాదని చెప్పదు. కానీ అవసరమైనపుడు వాటి ఆధారంగా గతంలో అనేక దేశాల వారి మీద ఆంక్షలు విధించింది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నందున నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నంత వరకు మోడీ అమెరికా వీసా భద్రంగా ఉంటుంది అని 2016 జూన్‌ రెండున గార్డియన్‌ పత్రిక విశ్లేషణలో పేర్కొన్నారు. వేదాంత పటేల్‌ స్పందనలో నరేంద్రమోడీ పేరు ప్రస్తావన తేవటంపై అధికారికంగా ఇది రాసిన సమయానికి కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ ప్రస్తావన కావాలని చేశారా లేక యధాలాపంగా చెప్పారా అన్నది పక్కన పెడితే గతంలో ట్రంప్‌ ప్రధాని నరేంద్రమోడీ తనను కాశ్మీరు వివాదంలో పెద్దమనిషిగా ఉండమని కోరినట్లు చేసిన తీవ్ర ఆరోపణ మీద కూడా మోడీ మౌనం దాల్చారు . స్పందిస్తే మరింత విస్తృత చర్చకు దారితీస్తుందన్న జాగ్రత్త దాని వెనుక ఉంది. ఇప్పుడూ దాన్నే అనుసరిస్తున్నారా ? అనుమానం ఎందుకు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?
  • రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !
  • నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !
  • పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: