• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: AIMIM

హరిద్వార్‌ ధర్మ సంసద్‌ : పరస్పర అవగాహనతోనే హిందూ- ముస్లిం మతోన్మాదుల ప్రసంగాలు !

25 Saturday Dec 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

#Haridwar hate speeches, AIMIM, ‘Hate’ speeches at Dharma Sansad, BJP, Haridwar hate speeches, Hinduthwa, RSS


ఎం కోటేశ్వరరావు


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్‌ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.


”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్‌(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్‌ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.


స్వామి సాగర్‌ సింధు మహరాజ్‌ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్‌ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్‌ సింగ్‌ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)


ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ లేదా మేడిన్‌ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?


విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్‌ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్‌ పార్టీ నేత వార్సి పఠాన్‌ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్‌ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్‌ అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ జలీల్‌ ప్రకటించారు. మజ్లిస్‌ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్‌ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.


టైమ్స్‌ నౌ టీవీ ఛానల్‌ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్‌ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్‌ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్‌ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.


ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్‌ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్‌ మనకు ఒక ప్రభాకరన్‌ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్‌, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్‌ తీవ్రవాది), ఒక జనరల్‌ సాహెబ్‌ సింగ్‌ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.


తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్‌ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్‌ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.


మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్‌ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్‌ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్‌ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్‌ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.


హరిద్వార్‌ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ డిజిపి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్‌ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్‌ సమావేశం ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?


డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్‌ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్‌ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్‌ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.


సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్‌ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డాగా తెలంగాణా గడ్డను మారుస్తారా ?

06 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Telangana

≈ 1 Comment

Tags

AIMIM, BJP, GHMC election 2020, trs


ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుదామంటే ఎల్లవేళలా సాధ్యం కాదు.అందునా రాజకీయ పార్టీలకు అసలు కుదరదు. హైదరాబాద్‌ మహానగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలన్నింటికీ ఒక కొత్త సవాలును ముందుకు తెచ్చాయి. దాన్ని ఏ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అన్నదాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మీద ఒక తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాదు జనాభా రీత్యా రాష్ట్రంలో మూడోవంతు కలిగి ఉంది. తెలుగు ప్రాంతాల నుంచే గాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్ధిరపడిన, వలస వచ్చిన జనం ఇక్కడ ఉంది. ఈ నేపధ్యంలోనే తప్పించుకు తిరిగితే కుదరని స్ధితి ఏర్పడిందని చెప్పాల్సి వస్తోంది.
జిహెచ్‌ఎంసి ఫలితం తీరు తెన్నులు ఏమిటి ?
గత ఎన్నికలకు, వర్తమాన ఎన్నికలకు పోలికను చూడటం సహజమే అయినప్పటికీ అనేక అంశాలు ఒకదానితో ఒకటి పోల్చుకొనేందుకు వీలు లేదు. గత ఎన్నికల్లో బిజెపి తన మిత్రపక్షం తెలుగుదేశంతో కలసి 63 స్ధానాల్లో పోటీ చేసింది, ఈసారి అన్ని సీట్లకు పోటీ చేసింది. మజ్లిస్‌ పార్టీ గత ఎన్నికల్లో 60 చోట్ల పోటీ చేయగా ఈ సారి 51కే పరిమితం అయింది. అందువలన వచ్చిన సీట్లు, ఓట్లశాతలను పోల్చుకోలేము. టిఆర్‌ఎస్‌ అన్ని స్ధానాలకు కాంగ్రెస్‌ 146 చోట్ల పోటీ చేసింది. పార్టీల వారీ టిఆర్‌ఎస్‌ 55, బిజెపి 48, మజ్లిస్‌ 44, కాంగ్రెస్‌ రెండు సీట్లు తెచ్చుకుంది. ఒక స్ధానం ఫలితం ఖరారు కావాల్సి ఉంది. గత, తాజా ఎన్నికల్లో పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ 2016 ——- 2020
టిఆర్‌ఎస్‌ 43.85 ——- 34.9
బిజెపి 10.34 ——– 34.6
మజ్లిస్‌ 15.85 ——– 18.28
కాంగ్రెస్‌ 13.11 ——— 6.5
టిడిపి 15.10 ——— 1.61
గత ఎన్నికల ఫలితాలు ఏమి వెల్లడించాయి ?
గత ఏడాది జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలోనే కారు వేగం తగ్గటాన్ని చూశాము. మున్సిపల్‌ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు, పార్టీల వారీ ఓటింగ్‌ ఇతర అంశాలను క్లుప్తంగా చూద్దాం.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను టిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్‌ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్‌ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్‌ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్‌ 431, కాంగ్రెస్‌ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్‌ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా దానికి సీట్లు రాలేదు.
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో కారు వేగం బాగా తగ్గింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.
మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ 50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస 28 ———- 71 —– 20 —– 0 —— 1—— 1
కాంగ్రెస్‌ 1 ———- 10 —– 35 —– 30 —- 26 —- 18
బిజెపి 0 ———— 3 ——- 4 —– 14 —- 40 —- 59
మజ్లిస్‌ 0 ———— 0 ——- 2 ——- 1 —– 2 —- 40
–ఇతరులు 1 ———— 2 —— 11 —– 17—-48 —- 41

పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరాసకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్‌ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్‌ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్‌ 41(12.61) మజ్లిస్‌ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్‌ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. కరీంనగర్‌ లోక్‌సభ స్ధానానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 60 స్ధానాలకు గాను టిఆర్‌ఎస్‌ 36, దానితో ఉండే స్వతంత్రులు నలుగురు, బిజెపి 13, మజ్లిస్‌ 6,స్వతంత్ర ఒకరు ఉన్నారు.

రాబోయే రోజుల్లో బిజెపి వ్యూహమేమిటి ?
బిజెపి హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన వనరులను అన్నింటినీ కేంద్రీకరించటంతో పాటు తన మత అజెండాను పూర్తిగా ముందుకు తీసుకు వచ్చింది. మత పరమైన భావోద్వేగాలను గరిష్ట స్ధాయిలో రేపేందుకు అది ప్రయత్నించింది. ఎన్నికల ఫలితాలపై చర్చలలో ఆ పార్టీ ప్రతినిధులు వెలిబుచ్చిన అభిప్రాయాలను మొత్తంగా చూస్తే ఈ అజెండాను రాష్ట్ర వ్యాపితంగా ముందుకు తీసుకుపోవటం ద్వారా 2023 లేదా దానికి ముందే ఒక వేళ జమిలి ఎన్నికలను రుద్దితే 2022లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో విజయం సాధించాలనే ఆశ, ఆకాంక్షలను అది దాచుకోలేదు. దుబ్బాక ఉప ఎన్నిక తరువాత హైదరాబాదులో వచ్చిన విజయాలతో రానున్న రోజుల్లో ప్రచారదాడిని మరింతగా పెంచనుంది. మజ్లిస్‌ను పరోక్షంగా ప్రోత్సహించి లబ్ది పొందుతుంది తప్ప ప్రత్యక్షంగా సంబంధాలను తీసుకొనే అవకాశాలు లేవు. ఒక రాష్ట్ర అధికారం వేరు ఒక కార్పొరేషన్‌ పరిధి వేరు.

కాంగ్రెస్‌ భవితవ్యం ఏమిటి ?
ఆంబోతుల మధ్య లేగ దూడలు నలిగిపోయినట్లుగా కాంగ్రెస్‌ పరిస్దితి తయారైంది. దుబ్బాకలో చివరి నిమిషం వరకు అభ్యర్ధిని తేల్చుకోలేకపోవటంలోనే దాని బలహీనత వ్యక్తమైంది. హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికలలో అలాంటి పరిస్ధితి లేదు. అంతర్గత విబేధాలు వెల్లడయ్యాయి. బిజెపి-మజ్లిస్‌-తెరాసలతో పోటీ పడి అది ప్రచారం నిర్వహించలేకపోయింది. సంఖ్యరీత్యా గతంలో ఉన్న రెండు సీట్లు నిలుపుకున్నా గణనీయంగా ఓట్లను కోల్పోయింది. ఆ పార్టీలో ఇప్పుడు మిగిలేవారు ఎందరు అన్నది ప్రశ్న. ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించినా దానిలో ఉంటారనే విశ్వాసం ఓటర్లలో కోల్పోవటం ఒక ప్రధాన కారణం. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమకుమార్‌ ఎప్పుడో తప్పుకుంటానని ప్రకటించినా ఆ స్ధానంలో మరొకరిని భర్తీ చేయలేని పార్టీ తీరా పూర్తిగా కాడి పడవేసిన తరువాత కూడా వెంటనే నిర్ణయం తీసుకోలేని బలహీనతతో అది ఉంది.

చౌరాస్తాలో ఉన్న టిఆర్‌ఎస్‌ కారు !
టిఆర్‌ఎస్‌ కారుకు దుబ్బాకలో ఓడిపోయిన దాని కంటే హైదరాబాద్‌లో గెలిచినా పెద్ద దెబ్బతగిలింది. నాలుగు రోడ్ల (చౌరాస్తా) కూడలిలో నిలిచింది.ఇది స్వయంకృతం. ఇప్పుడు అది ఏ దారిలో వెళ్లనుంది అన్నదే కీలకమైన ప్రశ్న. హైదరాబాదు ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాలను కొత్త బాట పట్టించేందుకు దోహదం చేశాయి. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను ఆకర్షించి దెబ్బతీసిన ప్రశ్నించే వారు లేకుండా చూసుకోవాలని భావించిన ఆ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో తన వారిని నిలుపుకొనేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తుందన్న ప్రశ్నను ఈ పరిణామం ముందుకు తెచ్చింది. హైదరాబాద్‌ను చూపి బిజెపి తెరాస-కాంగ్రెస్‌ నేతలకు గాలం వేస్తున్నది. మజ్లిస్‌తో అది ఆడిన క్రీడ ఇప్పుడు అడుగడుగునా మజ్లిస్‌కు లొంగలేదు అని నిరూపించుకోవాల్సిన పరిస్ధితిని తెచ్చి పెట్టింది. మేయర్‌ ఎన్నికలో అది పోటీ చేసినా, చేయకుండా బేషరతు మద్దతు ఇచ్చినా తెరవెనుక ఏదో జరిగిందనే జనం భావించే స్దితిని స్వయంగా కల్పించుకుంది.

మజ్లిస్‌ ఏమి చేయనుంది ?
ఇతర రాష్ట్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బిజెపి బి టీమ్‌గా పోటీలోకి దిగుతున్నదనే విమర్శ మజ్లిస్‌ మీద ఉంది. దాని వలన లబ్దిపొందిన తీరును మహారాష్ట్ర, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో చూశాము.మరికొన్ని చోట్ల కూడా అదే పాచికను ప్రయోగించవచ్చు. అయితే తెలంగాణా- ప్రత్యేకించి హైదరాబాదులో ఉన్న పరిస్ధితి వేరు. మజ్లిస్‌, ముస్లిం మైనారిటీలను బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతానికి చెందిన వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకొనేందుకు ఎప్పటి నుంచో నిరంతరం ప్రయత్నిస్తోంది. బిజెపి ప్రచారంతో మజ్లిస్‌ తన స్ధానాన్ని పటిష్ట పరచుకుంది. రెండు మతశక్తులు రంగంలోకి దిగినపుడు జరిగే పరిణామం ఇదే. ఇప్పుడు మజ్లిస్‌ను ఒక అంటరాని పార్టీగా చేయటంలో బిజెపి ప్రచారం విజయవంతమైంది. ఎన్నికల ప్రచారంలో బిజెపి అంత తీవ్రంగా గాకపోయినా మజ్లిస్‌ను కూడా టిఆర్‌ఎస్‌ విమర్శించక తప్పలేదు. మజ్లిస్‌ మాత్రం టిఆర్‌ఎస్‌ మీద ఎలాంటి దాడి చేయలేదు. ఈ పరిణామాన్ని బిజెపి ఉపయోగించుకుంది. మజ్లిస్‌ను ఉపయోగించుకొని లబ్ది పొందేందుకు గతంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నించింది. ఇదే టిఆర్‌ఎస్‌ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసింది. ఒక విధంగా చూస్తే ఇప్పుడు మజ్లిస్‌ కూడా ఇరకాటంలో పడింది. అధికారం లేకుండా అది ముస్లింలను తనతో ఉంచుకోలేదు. గొంతెమ్మ కోరికలు కోరి తెగేదాక లాగకపోవచ్చు. ఒక ఎత్తుగడగా ఈ ఎన్నికలో వాటా కోరకపోవచ్చు. డిప్యూటీ మేయర్‌ లేదా కొంతకాలం మేయర్‌ పదవితో దానికి వచ్చే ప్రయోజనం కంటే బేషరతు మద్దతుతోనే ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు.

ఇప్పుడేమి జరగనుంది ? ఏమి చేయాలి ?
హైదరాబాదు మేయర్‌ కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగానే అన్ని పార్టీలు వ్యవహరించటం అనివార్యం. రాజకీయాల్లో దేశద్రోహులుగా లేదా దేశద్రోహశక్తులకు మద్దతు ఇచ్చిన పార్టీలని తాను విమర్శించిన వాటితో చేతులు కలపటానికి బిజెపికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాశ్మీరులో పిడిపితో కలసి సంకీర్ణ మంత్రివర్గంలో పాల్గొనటమే దానికి పెద్ద నిదర్శనం. అలాంటి పార్టీకి మజ్లిస్‌తో చేతులు కలపటం పెద్ద సమస్య కాదు. అయితే అలంకార ప్రాయమైన మేయర్‌ పీఠం కంటే ముఖ్యమంత్రి గద్దె మీద బిజెపి కేంద్రీకరించినందున ప్రస్తుతానికి మజ్లిస్‌తో చేతులు కలిపే అవకాశాలు లేవు. మజ్లిస్‌తో చేతులు కలిపిందనే ప్రచారాన్ని నగర ఓటర్లు అనేక మంది నమ్మిన కారణంగానే గతంలో టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారు ఇప్పుడు బిజెపి వైపు మొగ్గారు. అలాంటపుడు మజ్లిస్‌తో చేతులు కలిపితే బిజెపికి మొదటికే మోసం వస్తుంది.
మేయర్‌ పీఠాన్ని టిఆర్‌ఎస్‌ దక్కించుకొనేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి ? హాజరైన సభ్యులలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీకి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలు దక్కుతాయి. తమ మధ్య ఎలాంటి అవగాహన లేదు అని చెప్పుకొనేందుకు మజ్లిస్‌ ఓటింగ్‌ను బహిష్కరించవచ్చు లేదా అది కూడా పోటీ పెడితే బిజెపి కూడా పోటీ చేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చు. ఏది జరిగినా టిఆర్‌ఎస్‌కు పీఠం ఖాయం. గత ఎన్నికల్లో టిర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉన్న కారణంగా రెండు పదవులనూ అదే దక్కించుకుంది. మజ్లిస్‌తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే బిజెపి పన్నిన వలలో చిక్కినట్లే. పరోక్షంగా మద్దతు తీసుకున్నా బిజెపి దాడి ఆగదు.
తెలంగాణా వ్యాప్తంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు అనువైన భౌతిక పరిస్ధితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగితే ఇలాంటి మితవాద భావాలు ఓటర్ల మీద బలంగా ప్రభావం చూపుతాయి. అది హైదరాదు నగరం మీద ఉన్నంత తీవ్రంగా ఇతర ప్రాంతాల మీద ఉంటుందని చెప్పలేము. చారిత్రక నేపధ్యం, రజాకార్‌ వారసత్వం, గతంలో ఇక్కడ జరిగిన మతకలహాలు, రాజకీయ పార్టీల అవకాశవాదం దీనికి కారణం. హైదరాబాదులో మజ్లిస్‌ పార్టీ గూండాయిజం నుంచి రక్షణ కల్పించేది తామే అనే బిజెపి ప్రచారం దశాబ్దాలుగా పధకం ప్రకారం సాగుతోంది. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్నట్లుగా అనేక మంది ఆ ప్రచారానికి లోనుకావటం కూడా తాజా ఎన్నికల్లో బిజెపి పుంజుకోవటానికి దోహదం చేసింది. ముఖ్యంగా మజ్లిస్‌ ప్రభావం ఎక్కువ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకోవటం లేని ప్రాంతాలలో టిఆర్‌ఎస్‌ విజయం సాధించటం దానికి ఒక సూచిక అని చెప్పవచ్చు.
టిఆర్‌ఎస్‌-బిజెపి మధ్య తెరవెనుక అవగాహన ఉందన్నది గతంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో, వెలుపల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి వైఖరి స్పష్టం చేసింది. బిజెపితో రాజీపడి తమ జోలికి రాకుండా చూసుకోవాలన్నది టిఆర్‌ఎస్‌ నేతల అవకాశవాదం. అదే విధంగా మజ్లిస్‌ను బుజ్జగించే వైఖరితోనే ఆ పార్టీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని బిజెపి చేస్తున్న ప్రచారదాడిని ఎదుర్కోవటంలో చట్టపరంగా, రాజకీయంగా కెసిఆర్‌ సర్కార్‌ అచేతనంగా ఉందని జనం భావిస్తున్నారు. తాము పార్లమెంట్‌లో బిజెపికి మద్దతు ఇచ్చి తప్పు చేశామనే టిఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేసినా రాజకీయంగా నిర్దిష్ట వైఖరిని తీసుకోలేదు. నవంబరు 26జాతీయ సమ్మెకు చివరి నిమిషంలో మద్దతు ప్రకటించింది.డిసెంబరు ఎనిమిదవ తేదీ భారత్‌ బంద్‌లో సంపూర్ణంగా పొల్గొనాలని రెండు రోజులు ముందుగానే కెసిఆర్‌ ప్రకటించారు. బిజెపి తమ గద్దెకు ఎసరు తెస్తోందని నిర్ధారించుకున్నట్లుగా ఇది సూచిస్తున్నది.
ఇక మజ్లిస్‌తో తమకు తెరచాటు అవగాహన లేదని నిరూపించుకొనే బాధ్యత టిఆర్‌ఎస్‌ మీద ఉంది. దాని వలన లబ్ది పొందేది కూడా అదే. తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా నిజమాబాద్‌ కార్పొరేషన్‌లో దాని సహకారంతోనే మేయర్‌ పదవిని దక్కించుకుంది. కనుక చెప్పే మాటలను అంత తేలికగా నమ్మటం కష్టం. ఎలా నిరూపించుకుంటారో ఆ పార్టీయే నిర్ణయించుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే అదేమీ కష్టం కాదు. నిజంగానే అదే జరిగితే ఏం జరుగుతుంది ? రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు గతంలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా ఇటీవల టిఆర్‌ఎస్‌ వైపు ఉన్నారు. మజ్లిస్‌తో సంబంధాలను తెంచుకుంటే ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలో తన అభ్యర్ధులను పోటీ పెట్టి మైనారిటీల ఓట్లను చీల్చి బిజెపికి లబ్ది చేకూర్చినట్లే ఇక్కడ కూడా చేసేందుకు అవకాశం లేకపోలేదు. బిజెపి మెజారిటీ మతతత్వాన్ని వ్యతిరేకించినట్లే మజ్లిస్‌ మైనారిటీ మతతత్వాన్ని కూడా నిఖరంగా వ్యతిరేకిస్తే కోల్పోయిన ఓట్లలో కొన్నింటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఇదే విధంగా అసంతృప్తి చెందిన వివిధ తరగతుల సమస్యలను పరిష్కరిస్తే వారి మద్దతును కూడా తిరిగి పొందటం కష్టం కాదు. ప్రభుత్వం మీద ఒకసారి అసంతృప్తి ప్రారంభమైతే ఎన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపినా అవి ఓట్లు తెచ్చి పెట్టవు అని ఇప్పటికైనా టిఆర్‌ఎస్‌ నాయకత్వం గుర్తించటం అవసరం. ఎవరు అధికారంలోకి వచ్చినా అమలు జరుపుతున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తారు కనుక తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకోవచ్చనే అభిప్రాయం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లలో కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ అది మరింత స్ధిరపడుతుంది. కొత్తది ఏదైనా సాధారణ స్దాయికి చేరిన తరువాత దాని మీద ఆకర్షణ తగ్గి కొత్త అంశాల మీద కేంద్రీకరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగింది అదే. చంద్రబాబు నాయుడి సర్కార్‌ అమలు జరిపిన పధకాలేమీ తక్కువ కాదు, చివరి నిమిషంలో ముందుకు తెచ్చిన పసుపు-కుంకమ కంటే వైసిపి పార్టీ ఎక్కువగా అమలుజరుపుతుందని జనం భావించారన్నది స్పష్టం.
హైదరాబాదు ప్రచారంలో అభివృద్ది అంశాల కంటే మత అంశాలనే ఎక్కువగా ముందుకు తెచ్చారు. తెలంగాణాలో సంక్షేమ పధకాలతో పాటు మతోన్మాద భావాలను కూడా బిజెపి జమిలిగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రసమితి, ఆ పార్టీ నాయకత్వం తమ వైఖరులను మార్చుకొని సామరస్యతగా మారుపేరుగా ఉన్న రాష్ట్రాన్ని ఇదే బాటలో నడిపిస్తారా ? అవకాశ వాదం, తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి మెజారిటీ-మైనారిటీ మతశక్తుల అడ్డాగా మారుస్తారా ? టిఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్ష ఎదురైంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మహిళల దర్గా ప్రవేశానికి జావేద్‌ అక్తర్‌ మద్దతు

30 Saturday Apr 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

AIMIM, Javed akhtar, Trupti Desai, women entry Dargh's

సత్య

   తృప్తి దేశాయ్‌ ! భూమాత రాన్‌ రాగిణి బ్రిగేడ్‌ నాయకురాలు !! శని శింగనాపూర్‌ శని దేవాలయ ప్రవేశం కోసం వుద్యమించి విజయం సాధించిన యోధురాలు. తరువాత కొల్లా పూర్‌ మహలక్ష్మి, నాసిక్‌ త్రయంబకేశ్వర దేవాలయాలలో జయప్రదంగా ప్రవేశించి పూజలు నిర్వహించారు. ప్రార్ధనా మందిరాలలో మహిళల ప్రవేశంపై నిషేధాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తృప్తి దేశాయ్‌కు సుప్రసిద్ధ సినీ గీత రచయిత జావేద్‌ అక్తర్‌ మద్దతు ప్రకటించారు. దేవాలయాలు, దర్గాలు అన్న విచక్షణ లేకుండా చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా సభ్యులుగా చేరేందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు సంస్ధ అధిపతి మోహన్‌ భగవత్‌కు లేఖ రాయాలని అక్తర్‌ సూచించారు. అంతకు నాలుగు రోజుల ముందు తృప్తి దేశాయ్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా మహిళలను అనుమతించాలని కోరుతూ తాను సంస్ధ అధిపతికి లేఖ రాస్తానని ప్రకటించారు. ఏ ప్రిల్‌ 28వ తేదీన ముంబైలోని పురాతన హాజీ అలీ దర్గాలో ప్రవేశించేందుకు తృప్తి నాయకత్వంలోని మహిళల బృందం ప్రయత్నించింది. మహిళలకు ప్రవేశం లేదనే పేరుతో దర్గా పాలకవర్గం ఆమెను అనుమతించలేదు. దేశాయ్‌తో పాటు అనేక సంస్ధలకు చెందిన మహిళలు ప్రార్దనలు చేసేందుకు సాయంత్రం ఐదు గంటలకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు వారిని అడ్డుకొని కారునుంచి దిగకుండా చుట్టుముట్టారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటమే గాక కారు దిగవద్దంటూ సలహా ఇచ్చారు. రాత్రి ఏడున్నరకు దర్గాను మూసివేశారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే నంటూ తాము శాంతియుతంగా వివక్ష పాటించే అన్ని ప్రార్ధనా మందిరాలు, ప్రాంతాలలో ప్రవేశానికి ఆందోళన చేస్తామని ప్రకటించి వెనుదిరిగారు. ఇది తొలి రోజు మాత్రమే. మాకేమీ తొందర లేదు, 2012 నుంచి దర్గా అంశం కోర్టులో వుంది అన్నారు.తమ ఆందోళనకు మద్దతు ప్రకటించాలని సినీ హీరోలు షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌లకు తృప్తి దేశాయ్‌ విజ్ఞప్తి చేశారు. వారు తమ వైఖరి ఏమిటో ప్రకటిస్తే వారి అభిమానులందరూ తమతో కలసి వస్తారని అన్నారు.

  దాంతో తాము ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రకటించి ముఖ్యమంత్రిని కలుసుకొనేందుకు ఆయన నివాసం వద్దకు వెళ్లింది. ముందస్తు అనుమతి లేదనే పేరుతో నివాసంలోకి పోలీసులూ రానివ్వలేదు. ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటంపై తృప్తి దేశాయ్‌ నిరసన వ్యక్తం చేశారు. దర్గాదగ్గర నాపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారు. దాని గురించి ముఖ్యమంత్రికి విన్నవించుకుందామని వెళుతుంటే ముందస్తు అనుమతి లేదని అడ్డగించుతున్నారు, ఇదేమి ప్రజాస్వామ్యం, బిజెపి చెప్పే మహిళలకు మంచి రోజులంటే ఇవేనా ‘ అని ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.

    దర్గాలో ప్రవేశించేందుకు వచ్చిన వారిని అవసరమైతే బలప్రయోగంతో అడ్డుకుంటామని దర్గా దగ్గర తన బృందంతో వున్న సమాజవాది పార్టీ నాయకురాలు రుక్సానా సిద్దికీ చెప్పారు.తృప్తిపై సిరాతో దాడి చేస్తామని మజ్లిస్‌ పార్టీ నేత హాజీ రఫత్‌ హుస్సేన్‌ హెచ్చరించారు. దీనికి కొద్ది రోజుల ముందు శివసేన నేత అరాఫత్‌ షేక్‌ మాట్లాడుతూ ఆమె గనుక దర్గాలోకి ప్రవేశిస్తే చెప్పులతో కొడతామని బెదిరించారు. అయితే అరాఫత్‌ ప్రకటనతో తమ పార్టీకి సంబంధం లేదని తరువాత శివసేన చెప్పుకుంది.

    అసలు ఈ సమస్యను అనవసర పెద్ద వివాదంగా చేశారని దర్గా పాలక మండలి సభ్యుడు రిజ్వాన్‌ మర్చంట్‌ అంటున్నారు. దర్గాను సందర్శించకుండా సోదరీ మణులను నిషేధించలేదు, ఆపలేదు. వారికి ప్రత్యేక మార్గాలు, హుండీలు వున్నాయి. వారి కోసం ప్రత్యేకంగా స్థలం కూడా కేటాయించాము. ఒక పురుష ముస్లిం ఫకీరు సమాధి దగ్గరకు మహిళలను అనుమతించటం, దానిని తాకటం ఇస్లాం ప్రకారం తీవ్రమైన పాపం, అందుకే వారిని దాని దగ్గరకు అనుమతించటం లేదు.’ అన్నారు.

    దర్గాలో ప్రవేశం నిషేధంపై విచారణ జరుపుతున్న బొంబై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. శబరి మల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశ నిషేధంపై ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది. బహుశా ఈ తీర్పు వచ్చిన తరువాత దర్గా కేసుపై కూడా తీర్పు వస్తుందని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అవేమి నోళ్లో మరి !

08 Friday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

AIMIM, Amitshaw, BJP, Hate-Speech, Ramdev

ఎం కోటేశ్వరరావు

    కాంగ్రెస్‌ వర్ణించినట్లు తాలిబాన్‌ రామ్‌దేవ్‌ బాబా తన మనసులోని మాట బయట పెట్టుకున్నాడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు భారత మాత దేశభక్త బిజెపి అధిపతి అమిత్‌ షా తమ స్నేహితుడైన రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛ ఆయనకు వర్తించదా అని దాని గురించి మాట్లాడుతున్న వారిని అడుగుతున్నానని చాలా తెలివిగా ప్రశ్నించారు. ఇంతకీ తనను తానే బాబా అని పిలుచుకొనే రామ్‌దేవ్‌ నోటి నుంచి రాలిన స్వేచ్చా భావం ఏమిటట ! ఈ దేశంలో చట్టాలు వుండబట్టి గాని లేకపోతే భారత మాతకు జై అనని లక్షల మంది తలలు తెగనరికే వాడిని అన్నారు. తన మనసులోని మాటను పలికిన ఆ పెద్దమనిషిని షా సమర్ధించకపోతే ఆశ్చర్య పడాలి తప్ప మద్దతు పలకటం అత్యంత సహజం. భారత మాతకు జై అనని వారు ఈ దేశం వదలి వెళ్లాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు. మరెందుకోగాని వెంకయ్య నాయుడు మాత్రం ప్రజాస్వామ్యంలో అనేక మంది అనేకం మాట్లాడుతుంటారు, చివరకు ప్రభుత్వం చేసిన దానికే అందరూ కట్టుబడి వుండాలి అని ముక్తాయించారు.

    రామ్‌దేవ్‌, అమిత్‌ షా గ్రామాల్లోని మోతుబరులను గుర్తుకు తెచ్చారు. వారి హుకుంలను ఖాతరు చేయని దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాల పట్ల వారు ఇలాగే నోరు పారవేసుకుంటూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతుంటారు. పల్లెలు, పట్టణాల తేడా లేకుండా స్త్రీల వస్త్ర ధారణ, బయటకు రావటం గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేసే కాషాయ తాలిబాన్లు మనకు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో నల్లుల సంతానంలా పెరిగిపోతున్నారు. నువ్వెలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నట్లు విద్వేషాలను రెచ్చగొట్టే రామ్‌దేవ్‌ వాచాలతను భావ ప్రకటనా స్వేచ్ఛ కాదా అని ప్రశ్నించిన అమిత్‌ షా గురించి చెప్పాల్సిందేముంది. రామ్‌దేవ్‌ బిజెపి నేతలకు స్నేహితుడు,సన్నిహితుడూ అన్నది లోకానికంతటికీ తెలిసిన నగ్న సత్యం.

    ప్రస్తుతం దేశంలో వివిధ అసెంబ్లీలు, పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికైన వారిలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు తమపై కేసులు వున్నట్లు స్వయంగా పేర్కొన్న 70 మందిలో మెజారిటీ తాలిబాన్లకు ఆశ్రయమిచ్చేదిగా పేరు తెచ్చుకున్న బిజెపి వారు 28 మంది వుంటే , మైనారిటీ తాలిబాన్లకు ఆలవాలంగా పేరు బడ్డ మజ్లిస్‌ పార్టీ వారు ఆరుగురు వున్నారు. ఇక కేసులున్న 399 మంది అభ్యర్ధుల వివరాలకు వస్తే వారిలో కూడా 97 మందితో బిజెపి టాప్‌లో వుంది. దాని మిత్రపక్షమైన శివసేన 14, మజ్లిస్‌కు చెందిన వారు 12 మంది వున్నారు. పోటీ చేసిన వారు, గెలిచిన వారిలో వివిధ పార్టీలకు చెందిన వారు వున్నారు. వాటిలో సిపిఎం వంటి వామపక్షాల వారు లేరని వేరే చెప్పనవసరం లేదు. వివిధ సందర్భాలలో విద్వేష ప్రసంగాలకు పెట్టింది పేరైన వారి నోళ్ల నుంచి రాలిన ముత్యాలు ఎలాంటివో చూడండి. ముందుగా అగ్రజుడు అమిత్‌ షాతోనే మొదలు పెడదాం.

   ‘ ఒక మనిషి తిండి లేదా నిద్ర లేకుండా జీవించ గలడు, అతనికి దాహం, ఆకలివేసినా బతక్కగలడు, కానీ అతను అవమానానికి గురైతే బతకలేడు, గతేడాది ఘర్షణల సందర్భంగా హత్యకు గురైన వారికి ప్రతీకారం తీర్చుకోవాలి. బిజెపికి ఓటేయండి : అమిత్‌ షా ( ఇండియా టుడే) ‘ఒక వేళ ఏ కారణంతో అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా, గెలిచినా పాట్నాలో జరుగుతుంది. పాకిస్తాన్‌లో బాణసంచా కాలుస్తారు: అమిత్‌ షా( లైవ్‌ మింట్‌)

   ‘ఎవరైనా పాకిస్తాన్‌ జిందాబాద్‌ నినాదాలు చేస్తే వారి తలలు తీసేస్తాం’ పశ్చిమ బెంగాల్‌ బిజెపి అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ( అఫింగ్టన్‌ పోస్ట్‌)

  ‘రాముడికి పుట్టిన వారి వారసులతో లేక అక్రమ సంతానానికి పుట్టిన వారితో కూడిన ప్రభుత్వం కావాలో మీరు తేల్చుకోవాలి: సాధ్వి నిరంజన జ్యోతి, కేంద్ర మంత్రి( ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌)

  ‘మనం పోరాటాన్ని ప్రారంభించాలి. మనం పోరాటాన్ని మొదలు పెట్టనట్లయితే ఈ రోజు మనం అరుణ్‌ను పోగొట్టుకున్నాం, రేపు మరొకరిని పోగొట్టుకుంటాం, మరొకర్ని పోగొట్టుకొనే ముందు మనం మన బలాన్ని ప్రదర్శించాలి, అదెలా వుండాలంటే ఈ హంతకులు తమంతట తామే అంతర్ధానం కావాలి,నేను ఒక మంత్రిని కనుక నా చేతులు కట్టివేయబడి వున్నాయి, అధికార యంత్రాంగం దానిని చూసుకుంటుంది.’ రామ శంకర్‌ కథేరియా, కేంద్ర మంత్రి (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌), ‘ కేసులను గనుక వుపసంహరించని పక్షంలో ఆగ్రా మరొక రకమైన హోలీని చూస్తుంది :రామ శంకర్‌ కథేరియా, కేంద్ర మంత్రి ( హిందూ)

   ‘ మూడు రోజుల్లోగా పరారీ అయిన వారిని పోలీసులు అరెస్టు చేయనట్లయితే తరువాత ఏం చేయాలో జనం నిర్ణయించుకుంటారు: సంజీవ్‌ బల్యాన్‌, కేంద్ర మంత్రి (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌)

     ‘నరేంద్రమోడీని వ్యతిరేకించేవారు పాకిస్థాన్‌ వెళ్లిపోవాలి: గిరిరాజ్‌ సింగ్‌, కేంద్ర మంత్రి( ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

    ‘ నలుగురు భార్యలు, నలభై మంది పిల్లలు అనేది ఇండియాలో పనిచేయదు, కానీ ప్రతి హిందూ మహిళ హిందూ మతాన్ని కాపాడు కొనేందుకు కనీసం నలుగుర్ని కనాల్సిన సమయమిది: సాక్షి మహరాజ్‌ , బిజెపి ఎంపీ (హిందూ) మన తల్లి కోసం చావటానికైనా, చంపటానికైనా సిద్ధం కావాలి:సాక్షి మహరాజ్‌ , బిజెపి ఎంపీ (ఐబిఎన్‌)

   ‘వారు ఒక హిందూ యువతిని తీసుకుపోతే మనం వంద మంది ముస్లిం యువతులను తీసుకురావాలి:యోగి ఆదిత్యనాధ్‌, బిజెపి ఎంపీ( ఇండియా టుడే)

   ‘శాంతి, ఇస్లాం పరస్పర విరుద్ధమైనవి ప్రపంచంలో ఇస్లాం వున్నంత వరకు వుగ్రవాదం వుంటుంది: అనంత కుమార్‌ హెగ్డే , కర్ణాటక బిజెపి ఎంపీ.(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

   ‘ మమ్మల్ని పరీక్షించేందుకు ప్రయత్నించవద్దు, మా సమాజాన్ని అవమానిస్తే సహించం, మేం అశాంతిని కోరుకోవటం లేదు, కానీ మీరు హిందువులను పరీక్షించాలనుకుంటే మనం ఒక తేదీ నిర్ణయించి ముస్లింలను ఎదుర్కోవాలి: బాబూలాల్‌, బిజెపి ఎంపీ (ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ )

  ‘ మనం ముస్లింలం అని గుర్తుపెట్టుకోండి.. ముస్లింలు మరియు భయం సహజీవనం చేయలేవు, భయం లేదా ముస్లింలో బతకాలి. మనం బతుకుతాం ఆందోళన అవసరం లేదు:అసదుద్దీన్‌ ఒవైసీ, మజ్లిస్‌ ఎంపీ, 4 టీవీ.

   ‘ఈ (జాట్స్‌) పంది కొడుకులు అంబేద్కర్‌ మరియు లోహియాను పార్లమెంట్‌లో అడుగు పెట్టనివ్వలేదు: రాజ్‌ కుమార్‌ సయానీ, బిజెపి ఎంపీ.

   ‘రాహుల్‌ గాంధీ ఒక ద్రోహి అతన్ని వురి తీయాలి, కాల్చిపారేయాలి: రాజస్ధాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ

   ఇలాంటి వారితో నిత్యం కలిసి వుండే రామ్‌దేవ్‌ అలా నోరు పారవేసుకోవటంలో, ఆ పెద్దమనిషిని అమిత్‌ షా సమర్ధించటంలో ఇంకా ఆశ్చర్యం కలుగుతోందా ? ఇది భారత దేశం కనుక ఇలా రెచ్చగొట్టేవారు ఇంకా పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్నారు, చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. అన్నింటి కంటే అలాంటి వారిని ఏదో ఒక కారణంతో సమాజంలో కొంత మంది సమర్ధించటం విచారకరం.మజ్లిస్‌ నేతల ప్రసంగాలను చూపి బిజెపి వారు, వారి ప్రసంగాలను చూపిి మజ్లిస్‌ వారూ నోటిని విచక్షణా రహితంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం, రెచ్చగొట్టటం భారతీయ సంస్కృతి కాదు, ఐరోపా నుంచి ముఖ్యంగా జర్మనీ హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నది. కానీ వారే అదే నోటితో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం గురించి కూడా చెబుతారు. అవేమి నోళ్లో మరి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత మాతపై రెండు ఫత్వాలు

24 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

AIMIM, bharat-mata-ki-jai-row, BJP, Bjp nationalism, MIM, Narendra Modi, RSS, RSS Double game

చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు.

ఎం కోటేశ్వరరావు

    భారత మాతపై రెండు ఫత్వాలు జారీ అయ్యాయి. మెజారిటీ మతోన్మాదులు, మైనారిటీ మతోన్మాదులు ఎవరు చేసినా ఇవి రెండూ ఇప్పటికే సమాజంలో వున్న చీలికలు, అపోహలను మరింత గట్టిపరుస్తాయి. దేశానికి నష్టదాయకం. ప్రధాని నరేంద్రమోడీ బిజెపి జాతీయ సమావేశంలో వికాస మంత్రాన్ని జపిస్తే అదే సమావేశంలో పార్టీ మాత్రం దాని కంటే భారత మాతకు జై అనని వారు రాజ్యాంగాన్ని గౌరవించనివారిగా పరిగణించబడతారు అంటే దేశద్రోహుల కిందే లెక్క అన్న విడగొట్టే తీర్మానం చేసింది. దీన్నే మరో విధంగా ఆ పార్టీకి తెలిసిన భాషలో చెప్పాలంటే ఫత్వా జారీ చేసింది. దీనంతటికీ కారణం భారత మాతాకీ జై అనే నినాదాన్ని దేశభక్తిగా యువతరానికి బోధించాల్సిన అవసరం వుందని బిజెపి మాతృమూర్తి సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధిపతి మోహన్‌ భగత్‌ చిచ్చు రాజేశారు. దానికి ప్రతిగా మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తాను అలా నినదించను అని ప్రకటించి ఆజ్యం పోశారు. చిత్రం ఏమంటే ఈ రెండు శక్తులూ విడదీసేవి, విద్వేషాన్ని రెచ్చగొట్టేవి తప్ప మన స్వాతంత్య్ర వుద్యమంతో గానీ దేశాన్ని, సమాజాన్ని ఐక్య పరిచే కృషిలో భాగస్వాములైనవి కాదు, హిందూ,ముస్లింలకు అధికార లేదా ఏకైక ప్రతినిధులూ కావు. అధిపతి చెప్పిన తరువాత అనుచర గణం వూరికే ఎలా వుంటుంది? ఏకంగా బిజెపి సమావేశంలో తీర్మానం చేసింది. ఇదే సమయంలో హైదరాబాదుకు చెందిన అల్‌ మహద్‌ అల్‌ అలాలీ అల్‌ ఇస్లామీ, జామియా నిజామియా అనే మత సంస్థలు దీనికి ప్రతిగా భారత మాతకు జై అనటానికి ముస్లింలకు అనుమతి లేదని ఒక ఫత్వా జారీచేశాయి. దేశాన్ని ఒక మాతగా కొలవటానికి లేదని అవి పేర్కొన్నాయి. ప్రతి ముస్లిం తన దేశాన్ని ప్రేమిస్తారు, అందుకోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఇది వేరే విషయం, పూజించాల్సి వచ్చినపుడు అల్లాను తప్ప మరొకరిని ఇస్లాం అంగీకరించదని, రెండింటినీ కలగా పులగం చేయవద్దని ఆ సంస్ధలు చెబుతున్నాయి. భారత్‌కు జై, జై హింద్‌, హిందుస్తాన్‌ జిందాబాద్‌ అనటానికి తమకు ఇబ్బంది లేదని భారత మాత అంటే ఒక దేవతకు ప్రతిరూపంగా వున్నందున తాము జై కొట్టలేమని ముస్లిం నాయకులు ప్రకటించారు. ఇప్పుడు శిరోమణి అకాలీదళ్‌(అమృతసర్‌)కు చెందిన సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ కూడా సిక్కులు ఏ రూపంలోనూ మహిళలను పూజించరని అందువలన తాము భారత మాతాకి జై అనేది లేదని ప్రకటించారు. ‘దీని గురించి నేను వ్యాఖ్యానించాలనుకోవటం లేదు, ఇదొక వృధా వివాదం’ అని బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ విలేకర్లు అడిగిన దానికి బదులిస్తూ బుధవారం నాడు అహమ్మదాబాద్‌లో వ్యాఖ్యానించారు. భారత మాతాకీ జై అని ప్రతి ఒక్కరూ అనే విధంగా, గోవధను రాజ్యాంగంలో చేర్చాలని యధాప్రకారం బాబా రాందేవ్‌ డిమాండ్‌ చేశారు.

   హిందువుల అభ్యున్నతి కోసం (అది చెప్పే హిందూ అంటే భారత్‌ , భారత్‌ అంటే హిందూ అనే వ్యాఖ్యానానికి అర్ధం అదే) పని చేస్తున్నట్లు చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ విరుద్ధ ముఖాలను ఎందుకు ప్రదర్శిస్తున్నట్లు ? నరేంద్రమోడీ అంటే ‘గుజరాత్‌ మోడల’్‌ తప్ప రాజ్యాంగం గురించి అంతగా తెలిసిన వ్యక్తి కాదనుకోవచ్చు, మరి అరుణ్‌జైట్లీ వంటి సుప్రసిద్ద లాయర్లు వుండి కూడా అలాంటి తీర్మానాలు ఎందుకు చేయిస్తున్నట్లు ? నిద్ర పోయే వారిని లేపవచ్చు తప్ప నటించే వారిని లేపలేము అన్నట్లే ఇదంతా ఒక పధకం ప్రకారమే జరుగుతోందని అనేక మంది భావించటంలో ఆశ్చర్యం లేదు. భారత మాతకు జై అనేందుకు నిరాకరించిన మహారాష్ట్ర శాసనసభలో మజ్లిస్‌ పార్టీ సభ్యుడిని వర్తమాన సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. చట్ట సభలు చేసిన నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించటానికి వీలు లేదనే తీర్పులు వెలువడుతున్న తరుణంలో అది కోర్టు పరిధిలోకి రాదు. కానీ బయట ఎవరైనా భారత మాతకు జై అనను అంటే అలాంటి వారిపై చర్య తీసుకోవటం కుదరదు, ఎవరైనా అలాంటి పిచ్చిపనిచేస్తే అది కోర్టులో చెల్లదు.ఎందుకంటే మన రాజ్యాంగంలో భారత్‌ అనే పదం వుంది తప్ప భారతమాత లేదు.అయినా సరే బిజెపి తన తీర్మానంలో ఇలా పేర్కొన్నది.’మన రాజ్యాంగం ఇండియాను భారత్‌ అని కూడా వర్ణించింది.భారత్‌ విజయం గురించి నినదించకపోవటం మన రాజ్యాంగాన్నే అగౌరవపరచటంతో సమానం’ అని పేర్కొన్నది. భారత స్వాతంత్య్ర వుద్యమంతో గానీ, రాజ్యాంగంతో గాని ఎలాంటి బీరకాయ పీచు సంబంధం కూడా లేని బిజెపి రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్దంగా వ్యవహరించటంలో ఆశ్చర్యం ఏముంది ?

   నినాదాలు చేయటం ద్వారా జాతీయ వాదాన్ని తయారు చేయలేమని వాజ్‌పేయి ప్రధానిగా వున్న కాలంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన సోలీ సోరాబ్జీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆయనే మరొక విషయాన్ని కూడా తెలిపారు. విజయ్‌ ఇమ్మాన్యుయెల్‌-కేరళ రాష్ట్ర వివాదంలో 1986లో మైలురాయిగా పేర్కొన దగిన తీర్పును సుప్రీం కోర్టు జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి ఇచ్చారు.యెహోవా విట్‌నెస్‌ అనే క్రైస్తవ తెగకు చెందిన వారు జాతీయ గీతం పాడేటపుడు గౌరవసూచకంగా లేచి నిలబడతారు తప్ప దానిని పాడకూడదని అందువలన తాము జాతీయ గీతాన్ని పాడలేదని విద్యార్ధులు చేసిన వాదనపై వివాదం కోర్టుకు ఎక్కింది.ఆ విద్యార్ధుల చర్యను సమర్ధిస్తూ ‘ మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తున్నది, మన తత్వశాస్త్రం సహనాన్ని బోధిస్తున్నది, మన రాజ్యాంగం సహనాన్ని ఆచరిస్తున్నది, మనం దాన్ని నీరు గార్చవద్దు’ అని న్యాయమూర్తి చిన్నప రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారంటూ సహనాన్ని స్పష్టంగా నిర్ధారించిన తీర్పు అని సొరాబ్జి వ్యాఖ్యానించారు.

   సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం రాజ్యాంగంపై బిజెపి పూర్తిగా తప్పుడు వైఖరి తీసుకున్నది అని వ్యాఖ్యానించారు. కేరళ విద్యార్ధి కేసునే వుదాహరిస్తూ జాతీయ గీతాన్ని పాడనందుకు విద్యార్ధులను స్కూలు నుంచి బహిష్కరించారు. వారు దేశం లేదా జాతీయ పతాకం పట్ల ఎలాంటి అగౌరవాన్ని ప్రదర్శించలేదని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నారు.అందువలన వర్తమాన వివాద పూర్వరంగంలో ఒక వ్యక్తి ఎవరైనా ఇతర విధాలుగా దేశాన్ని అగౌరవపరిస్తే తప్ప కొన్ని నినాదాలను నేను చేయను అంటే అది మొత్తంగా అగౌరవ పరిచినట్లు కాదని సుందరం చెప్పారు. దేన్నయినా నినదించాలా లేదా అనేది అతనికి లేదా ఆమెకు సంబంధించిన విషయం. రాజ్యాంగం ప్రకారం భారత మాతాకీ జై అని నినదించకపోవటం దేశాన్ని అగౌరవపరచటంగా నేను అంగీకరించను, ఇదంతా పూర్తిగా అనవసరమైన చీలికలను సృష్టిస్తున్నది. ఎవరైనా దేశాన్ని లేదా జాతీయ పతాకాన్ని అగౌరవ పరిస్థే చర్య తీసుకోవాలని నేను కూడా నమ్ముతాను, ప్రస్తుతం అలాంటిదేమీ నాకు కనిపించటంలేదు.అలాంటి చర్యలు చీలికలను మరింత గట్టిపరుస్తాయి అని సుందరం అన్నారు.

   ‘ రాజ్యాంగ ప్రకారం భారత మాతాకు జై అని జనం అనాల్సిన అవసరం లేదు,ఎక్కడా దాని గురించి చర్చించలేదు. బిజెపి తీర్మానం తప్పుడు వ్యాఖ్యానం. ఇండియా అంటే భారత్‌ అని మాత్రమే రాజ్యంగం చెప్పింది.అది భారత మాత గురించి పేర్కొనలేదు. కాబట్టి అలాంటి నినాదం చేయటం ప్రతి పౌరుడి ప్రాధమిక విధి కాదు,మనం అందరం దేశాన్ని ప్రేమిస్తాము, గౌరవిస్తాము, కానీ దానిని మన మీద రాసుకొని తిరగము’ అని మరో సీనియర్‌ న్యాయవాది కామినీ జైస్వాల్‌ అన్నారు.’ బిజెపి వారు అనవసరంగా ఒక వివాదాన్ని సృష్టించారు. ఎవరూ కోరుకోని దానిని వారు సృష్టించబోతున్నారు. వారు జనాన్ని విభజించేందుకు పూనుకున్నారు, ఈ సమస్యలను రేకెత్తించకూడదు’ అని కూడా ఆమె చెప్పారు.మహా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పూర్తిగా తప్పుడు నిర్ణయం, ఎవరైనా దానిని సవాలు చేయాలి’ అని కూడా అన్నారు.

    ముంబైకి చెందిన న్యాయవాది అబ్దుల్‌ మజీద్‌ మెమన్‌ మాట్లాడుతూ ‘ ఈ సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు బిజెపి అలాగే మజ్లిస్‌ రెండూ తప్పు చేస్తున్నాయి. రాజకీయాలు చేస్తున్నారు. నా వరకు భారత మాతాకి జై అనటం ఒక సమస్య కాదు. ఆ నినాదమిస్తే ఏం హాని జరుగుతుంది.అసెంబ్లీ నుంచి వారిస్‌ పఠాన్‌ను సస్పెండ్‌ చేయటం అతి ప్రతిస్పందన అనుకుంటున్నాను. నినదించటం తప్పుకాదని నమ్ముతున్నట్లు నేను అతనితో టీవీ చర్చలో కూడా చెప్పాను, అయితే బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ వత్తిడి చేసిన కారణంగా తానా పనిచేయనని అతను అన్నాడు. దీంతో ఆ సమస్య అక్కడితో ముగిసి వుండాల్సింది’ అన్నారు.

   ‘మజ్లిస్‌ మొత్తం ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహించేది కాదని నేను ప్రతి ఒక్కరికీ గుర్తు చేయదలచాను. వారి చర్యలతో వాతావరణాన్ని కలుషితం కానివ్వరాదు.ఈ సమస్యను అనవసరంగా రేకెత్తించారని నేను కూడా భావిస్తున్నాను. హైదరాబాదుకు చెందిన ఒక మత పెద్ద భారత మాతాకి జై అనటాన్ని అభ్యంతర పెట్టినట్లు నేను చదివాను. గత అరవై సంవత్సరాలుగా వారికి సమస్య లేదు. ఇప్పటికీ వారికి భారత్‌ లేదా జై అనటానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ సమస్య ఎక్కడంటే మాత లేదా తల్లి అని చెప్పటంలోనే. మాతృదేశం అన్న భావనలో ఇప్పుడు తప్పేమిటి ? భారత మాత అంటే మదర్‌ ఇండియా వంటిదే. కానీ ఒక ముస్లిం మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన మదర్‌ ఇండియా అవార్డు వచ్చిన సినిమా, దానిలో మరొక ముస్లిం అయిన నర్గీస్‌ దత్‌ ప్రధాన పోత్ర పోషించారు, దానితో ఎవరికీ ఇబ్బంది రాలేదు. కానీ అసలు సమస్య ప్రతిసారీ ముస్లింలు తమ విదేయత, దేశభక్తిని నిరూపించుకోవటంలో అలసి పోయారు. అందుకోసం వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి నుంచి సర్టిఫికెట్‌ అవసరం లేదు’ అని మెమెన్‌ స్పష్టం చేశారు. మరొక సుప్రీం కోర్టు లాయర్‌ రాజు రామచంద్రన్‌ కూడా జాతీయ గీతాన్ని ఆలపించకపోవటం అనుమతించదగినదే అని కేరళ విద్యార్ధుల కేసు స్పష్టం చేసింది. కొంత మంది డిమాండ్‌ చేసినంత మాత్రాన ఒక నినాదాన్ని పలకనంత మాత్రాన అది రాజ్యాంగాన్ని అగౌరవపరచినట్లు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. ‘తన తీర్మానంలో బిజెపి ఈ విధంగా ప్రస్తావించటం దురదృష్టకరం, ఒక న్యాయవాదిగా నాకు అరుణ్‌ జైట్లీ అంటే గౌరవం వుంది, పార్టీ తీర్మానంలో రాజ్యాంగాన్ని ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యానం చేయటాన్ని నిరోధించేందుకు ఆయన అయినా ప్రయత్నించి వుండాల్సింది’ అని మరో సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వ్యాఖ్యానించారు.

   భారత మాతాకీ జై అన్న నినాదం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కంటే ముందే స్వాతంత్య్ర వుద్యమంతో ముడిపడి వున్నదని, భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌ ఆ నినాదాలతోనే వురి కంబం ఎక్కారు, ఇప్పుడు ఆ నినాదం గురించి చర్చించటమే ఒక విద్రోహం అని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా తన పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యా నించారు. నిజమే ఆంగ్లేయులు మన దేశాన్ని అక్రమించినందున దాస్యవిముక్తి చేయటానికి అనేక మంది దేశ భక్తులు జాతీయ వాదంలో భాగంగా అనేక నినాదాలు ఇచ్చిన మాట వాస్తవం. అదే భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజగురు ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని కూడా అన్నారు. మరి దాన్ని నినదించాలని సంఘపరివార్‌ లేదా బిజెపి ఎందుకు కోరటం లేదు. అన్నింటి కంటే భగత్‌ సింగ్‌ ఆ నినాదం చేస్తున్న తరుణంలో సంఘపరివార్‌ నేత సావర్కర్‌ ఆంగ్లమాతాకు జై అని నినాదాలు ఇస్తామని,తెల్ల దొరలకు సేవలు చేసుకుంటామని, బొలో స్వాతంత్య్ర భారత్‌కు జై అనే నినాదం మా నోట వెంట రానివ్వబోమని జైలు నుంచి బ్రిటీష్‌ వారికి లేఖలు రాసిన పచ్చినిజాన్ని కాదంటారా ? ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనటానికి ఏ మతానికి లేదా మరొకరికి అభ్యంతరం లేదు దాన్ని వదలి పెట్టి వివాదాస్పద అంశాలనే ఎందుకు అమ్ముల పొదిలోంచి బయటకు తీస్తున్నట్లు ?

  వందేమాతరం అన్నందుకు నాడు బ్రిటీష్‌ పాలకులు స్వాతంత్య్ర సమర యోధులను జైల్లో పెట్టారు. ఇదే నినాదాన్ని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో అసందర్భంగా చేసినందుకు రాజీవ్‌ యాదవ్‌ అనే లాయర్‌ను న్యాయమూర్తులు మందలించటంతో అతను కోర్టుకు క్షమాపణ చెప్పాడు. అంటే దీని అర్ధం జడ్జీలకు దేశభక్తి లేదనా ? జాతీయ వాదులు కాదనా ? వందేమాతర గీతం, నినాదం ఒక వివాదాస్పద అంశం. స్వాతంత్య్ర వుద్యమ కాలంలోనే ముస్లింలు, సిక్కులు దానిని పాడేందుకు నిరాకరించారు.అంత మాత్రాన స్వాతంత్య్ర వుద్యమం వారిని దేశద్రోహులుగా లేక జాతి వ్యతిరేకులుగా పరిగణించలేదు. అక్కున చేర్చుకుంది. ఎందరో ముస్లింలు, సిక్కులు వందేమాతరం అనకుండానే తమ తమ పద్దతుల్లో స్వాతంత్య్ర వుద్యమంలో ఎన్నో త్యాగాలు చేయలేదా ? వారు దేశభక్తులు కాలేదా ?

   బిజెపి కనుక దేశభక్తి, జాతీయ వాదాలపై చట్టాలను సవరించి వాటిని గతం నుంచి వర్తింపచేయాలని గనుక నిర్ణయిస్తే జనగనమణ గీత రచయిత రవీంద్రనాధ ఠాగూర్‌ కూడా దేశద్రోహి వర్గీకరణకిందికే వస్తారు. ఒక గీతం జాతిని ఐక్య పరచాలి తప్ప విడదీయకూడదంటూ వందేమాతర గీతాన్ని రవీంద్రుడు తిరస్కరించారు. ‘ఈ అంశంపై బెంగాలీ హిందువులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు, కానీ ఇది ఒక్క హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు. రెండు వైపులా బలమైన భావనలు వున్నాయి. సమతుల్యమైన న్యాయం అవసరం. మన రాజకీయ లక్ష్యాల వుద్యమంలో మనం శాంతి, ఐక్యత, మంచితనం కోరుకుంటున్నాం, ఒక వర్గం చేసిన డిమాండ్లకు ప్రతిగా మరొక వర్గం చేసే డిమాండ్లతో అంతంలేని ఎదురుబొదురు బలప్రదర్శనలు తగదు.’అని రవీంద్రుడు సుభాస్‌ చంద్రబోస్‌కు రాసిన లేఖలో సూచించారు. చివరకు కాంగ్రెస్‌ వందేమాతర గీతంలో హిందూ దేవత దుర్గకు సంబంధించిన భాగాలు మినహా మిగతా భాగాన్ని ఆమోదించింది. చివరకు మన రాజ్యాంగసభలో కూడా ఇది వివాదాస్పదమైంది. 1950 జనవరి 24న రాజ్యాంగసభకు అధ్యక్షత వహించిన బాబూ రాజేంద్ర ప్రసాద్‌ జనగన మణను జాతీయ గీతంగానూ , స్వాతంత్య్ర వుద్యమంలో చారిత్రక పాత్ర వహించిన వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ దానికి కూడా జాతీయ పాటగా సమాన స్థాయిని కల్పించాలని అంతిమంగా ఆ వివాదానికి స్వస్తి పలికారు.

   తరువాత 2006లో వందేమాతరం 125వ వార్షికోత్సవం సందర్భంగా దానిని విధిగా ఆలపించాలా లేదా అన్న వివాదం ఏర్పడింది.ముస్లింలలోనే భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. సిక్కులు దానిని ఆలపించవద్దని సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటి(ఎస్‌జిపిసి) కోరింది. వందేమాతరం గీతాలాపన స్వచ్చందం తప్ప విధికాదని పార్లమెంట్‌లో 2006 ఆగస్టు 22న ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్బంగా అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా విధిగా వందేమాతర గీతాన్ని ఆలపించాలని వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను బిజెపి సమర్ధించిందని, అయితే విధిగా చేయనవసరం లేదని నాడు వాజ్‌పేయి స్పష్టత ఇచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ఆ నాడు పేర్కొన్నది.

  అందువలన ఇప్పుడు భారత మాతాకి జై అనటమే దేశభక్తికి, జాతీయతకు నిదర్శనం, చిహ్నమని బిజెపి వత్తిడి చేయటం దాని అజెండా ప్రకారం దేశం నడవాలని ఏకపక్షంగా నిర్ణయించటం నిరంకుశ ధోరణులకు నిదర్శనం తప్ప మరొకటి కాదు. తమ ప్రధాని మేకిండియా నినాదమిచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోతానంటుంటే బిజెపి మాత్రం బ్రేకిండియా నినాదాలతో దేశాన్ని విచ్చిన్నం చేయ చూస్తున్నది. ఎవరిది కుహనా జాతీయ వాదం,ఎవరు దేశభక్తులు? ఏది అభివృద్ధి పధం ? ఇదా దేశాన్ని ముందుకు తీసుకుపోయే మార్గం? దీన్నా నరేంద్రమోడీకి ఓటు వేసి జనం కోరుకున్నది ?

గమనిక: ఈ వ్యాసంలోని న్యాయవాదుల అభిప్రాయాలు ది వైర్‌.ఇన్‌లోని గౌరవ్‌ వివేక్‌ భట్నాగర్‌ వ్యాసం నుంచి స్వీకరించబడినవి. రచయితకు కృతజ్ఞతలు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: