• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Andhrapradesh

సీతయ్య ఎవరి మాటా వినడు !

06 Tuesday Jun 2017

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, Andhrapradesh, ap special asistance, ap special status, chandrababu naidu, Congress party, Rahul gandhi

ఎంకెఆర్‌

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా పండే రొయ్య మీసాల పొడవు- విస్తృత ప్రచారం పొందిన చంద్రబాబు నాయుడి సీనియారిటీ గురించి ఎవరైనా విబేధిస్తే అంతకంటే అమాయకులు మరొకరు వుండరు. అయితే ఎవరూ వివాదం చేయకపోయినా ఈ మధ్యకాలంలో, తాజాగా తన సీనియారిటీ గురించి తానే చెప్పుకుంటున్న చంద్రబాబు గురించి ప్రస్తావన రాకుండా ఎలా వుంటుంది? అసలా అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. తాను మారానని మూడో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అంతకు ముందు చంద్రబాబు చెప్పారు. చూస్తుంటే ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతీ అన్న నీతి బాగా వంట పట్టించుకున్నట్లు తేలిపోయింది.

గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మోడీ భయం పట్టుకుందని విమర్శించారు. ఆ మాటకు వస్తే నరేంద్రమోడీ, చంద్రబాబు కూడా సభలలో తాము చెప్పదలచుకున్నవి చెప్పారు, అతి వినయం ప్రదర్శించి చేయాల్సిన నటన చేయలేదా, ఎవరు తక్కువ ? అలాగే రాహుల్‌ చెప్పిన మాటలు వినటమా లేదా, చేసిన విమర్శలను పట్టించుకోవటమా లేదా సూచనలను పాటించటమా లేదా అన్నది వేరే విషయం. తాను ఎవరికీ భయపడటం లేదని, దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తను కనుక ఇప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న వారు చెబితే వినేది లేదని చంద్రబాబు చెప్పాల్సిన పనేముంది. నిజానికి అది నరేంద్రమోడీకి ఎక్కడో మండే మాట. మరో విధంగా అలా అనటం అంటే జ్ఞాన ద్వారాన్ని మూసుకోవటమే. ఆ మాట అన్న తరువాత ఈగలు, చీమలు, దోమల మాదిరి అధికారం చుట్టూ మూగే ఇతర పార్టీల వారూ, తెలుగుదేశం పార్టీలోని సహచరులు, జూనియర్లు చెప్పిందానిని కూడా చంద్రబాబు ఎలా వింటారు. ఇప్పటికే ‘సీతయ్య నివాస్‌’ మాదిరి తెలుగు దేశం పార్టీలో అసలు అలా చెప్పే వాతావరణం ఎక్కడుంది. గతంలో ఒక్క పెదబాబే అనుకుంటే తండ్రికి తగ్గ తనయుడు చినబాబు కూడా తోడయ్యారు. దీంతో చంద్రబాబు తప్ప తెలుగుదేశంలోని సీనియర్లందరూ నారావారి కుటుంబంలో పుట్టబోయే వారికి అన్నలుగానూ పుట్టిన వారికి తమ్ములుగానూ మారిపోయారు. గతంలో పది సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు శైలిని దగ్గరగా చూసిన వారికి ఆయనకు సీనియారిటీతో నిమిత్తం లేకుండానే ఇతరులు చెప్పేదానిని పరిగణనలోకి తీసుకొనే తత్వం లేదన్నది బాగా తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మహాకవి కాళిదాసు గర్వభంగం కథను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. సరస్వతి దేవి పెట్టిన పరీక్షలో సున్నా మార్కులు తెచ్చుకున్న కాళిదాసుకు కనువిప్పు కలగగానే విద్యతో వినయం వృద్ధి చెందాలి గాని అహంకారం కాదు నాయనా కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధిని మార్చటానికే ఈ పరీక్ష అని దాహంతో వచ్చిన కాళిదాసుకు మంచినీరు ఇచ్చి అనుగ్రహిస్తుంది.

అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ, బయట ప్రతిపక్షాలకు తాను చెప్పటం తప్ప ఇతరులు చెప్పింది వినే అలవాటు లేదనే విమర్శలు వున్న చంద్రబాబు ఎవరూ చూడకుండా అయినా వేమన, సుమతీ శతకాలు ఒక్కసారి తిరగేసుకుంటే మంచిది.

వినదగు నెవ్వరు చెప్పిన,

వినినంతనే వేగపడక వివరింపదగున్‌,

గని కల్లనిజము లెరిగిన,

మనుజుడే పో నీతిపరుడుడు మహిలో సుమతీ

అన్న ప్రబోధ పద్యాన్ని చంద్రబాబు మరిచి పోయి వుంటారు.

మూడు సంవత్సరాల పాలనలో సున్నా మార్కులు తెచ్చుకున్న చంద్రబాబు వైఫల్యాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే మండిపడుతున్నారు. తానే చెప్పుకున్నట్లు ఒక సీనియర్‌గా గోబెల్స్‌ ప్రచారంలో కూడా ఆయనను మించిన వారు లేరు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్నది హిట్లర్‌ ప్రచార మంత్రి గోబెల్స్‌ సూత్రం. చంద్రబాబుకు గోబెల్స్‌ను మించిన బిజెపి తోడు కావటంతో ఇక చెప్పాల్సిందేముంది.

రాష్ట్ర విభజన సమయంలో వ్యతిరేకించింది ఒక్క సిపిఎం తప్ప మరొకపార్టీ లేదు.అందుకే ఆ పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా ఫలాన వరం ఇవ్వాలని కోరలేదు. గతంలో అలా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలా అడగటం అంటే విభజనను అంగీకరించినట్లే. ఆసుపత్రులలో పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వచ్చినపుడు సంభవించే పర్యవసానాలకు అంగీకారం తెలుపుతూ రోగి లేదా సమీప బంధువుల సంతకాలతో లేఖలు తీసుకుంటారు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడవటానికి ఆమోదం తెలిపి ఒకటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు. ఆపరేషన్‌ చేసే వైద్యుడు కోరిన కత్తులు, కటార్లు అందించి సహకరించే సిబ్బంది మాదిరి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడిచే సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసి కాంగ్రెస్‌కు అన్ని విధాలుగా సహాయపడింది బిజెపి. తిరుపతి సభలో ప్రత్యేక హోదా గురించి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసింది నరేంద్రమోడీ. తరువాత దానిని తిరస్కరించిందీ ఆ పెద్ద మనిషే. మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని జరిగితే వాటన్నింటినీ వదలి పెట్టి చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్‌ మీదే ఎదురుదాడులకు దిగారు. రాష్ట్రానికి హాని చేయటంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో బిజెపిదీ అంతే. హోదా బదులు ప్రత్యేక పాకేజీ ఇచ్చారని, దాని కంటే హోదా వలన అదనంగా వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని కూడా చంద్రబాబు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు సమస్య పాకేజి వలన కలిగిన ప్రయోజనం ఏమిటన్నదే, ఆ ప్రశ్నకు ఇంతవరకు ఆ పెద్ద మనిషి లేదా బిజెపి నేతలు గానీ నోరు విప్పటం లేదు.

ఏ పార్టీలో ఎంతకాలం వుంటారో, ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని విశ్వసనీయతలేని నాయకులతో తెలుగుదేశం పడవ నడుస్తోంది. అలాంటి పార్టీ నేతగా దానిని నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఆయన చెప్పే కాంగ్రెస్‌ అడ్డగోలు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఎలా నష్టపోయిందో, ఆ నష్టాన్ని పూడ్చేందుకు మిత్రపక్షం బిజెపి ఇచ్చిన ప్రత్యేక పాకేజి కారణంగా వచ్చే లాభాలు ఏమిటో, తెలుగుదేశం పార్టీ చెప్పే న్యాయబద్ద విభజన కోసం తాము చెప్పిందేమిటో, చేసిందేమిటో ప్రభుత్వం తరఫున ఒక శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు చెప్పటం తప్ప మరొక మార్గం లేదు. అదేమీ లేకుండా అడ్డగోలు రాజకీయాలు, దాడులు చేస్తే రాష్ట్ర ప్రజలకు పూచికపుల్ల ప్రయోజనం కూడా వుండదు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆ కాంగ్రెస్‌లో చివరి వరకు వుండి తెలుగు దేశం పడవలోకి ఎక్కిన నేతలను మాత్రం ఎలాంటి క్షమాపణ అడగకుండానే పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి అందలమెక్కించారు. అదే కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో కూడా చేరి దానిని కూడా పునీతం చేశారు. తెలుగుదేశం సరసన కూర్చొని వారిపుడు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపికి కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా వున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ విషయాన్ని నొక్కి వక్కాణిస్తే ఆయనకే నష్టం. ఒక రాజకీయపార్టీ పట్ల మరొక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలనేది అది వారిష్టం.కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆని చెబుతున్నారు కనుక సాధించిన అదనపు ప్రయోజనాలేమిటో కూడా చెప్పాలి.ప్రతి ఏటా నవనిర్మాణ దీక్షలంటూ ప్రత్యర్ధులపై ఎదురుదాడులు తప్ప జనానికి సానుకూల అంశాలను వివరించిన పాపాన పోలేదు. కులం, మతం, ప్రాంతీయ భావనలను తలకెక్కించుకున్న జనంలోని ఒక తరగతి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర వైఫల్యాల గురించి పట్టించుకోకపోవచ్చు. ఎల్లకాలం ఇదే పరిస్ధితి వుండదు. అటు బిజెపి తెలుగుదేశం పార్టీని ముందుగదిలో కూర్చో పెట్టి దాని ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వెనుక ద్వారం తెరిచింది. శ్రీకృష్డుడి రాజకీయం మాదిరి ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జునుడిని చూచితి నేను అన్నట్లుగా బిజెపి తనకు ఏది వాటంగా వుంటే అది చేసేందుకు పావులు కదుపుతోంది. చంద్రబాబు అస్త్రాలు తుప్పు పట్టటం లేదా ఒక్కొక్కటిగా మొద్దుబారి పనికి రాకుండా పోతున్నాయి. అవ్వతో వసంతమాడినట్లు కాంగ్రెస్‌ క్షమాపణలతో కాలక్షేపం చేస్తే కుదురుతుందనుకుంటే పొరపాటు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏం సాధించారని చంద్రబాబు నవ్వారు ?

07 Sunday Aug 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

Amaravathi capital, Andhrapradesh, ap special status, BJP, tdp

ఎం కోటేశ్వరరావు

ఏమైంది,

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు.

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, నీకు కూడా నేను అదేచేశాను అంది అమ్మ.

ఏమైంది,

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు,

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, మీ అమ్మకు కూడా నేను అదేచేశాను అంది అమ్మమ్మ.

ఏమైంది ?

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు,

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, మీ అమ్మమ్మకు కూడా నేను అదేచేశాను అంది పెద్ద మామ్మ.

తరతరాలుగా ఓదార్పు మాటలు, ఎంతో విశ్వసనీయమైనవి, మీరూ వాటినే వుపయోగించండి !

   ఇవి చదవగానే తరతరాలుగా కొద్ది మార్పులతో వస్తున్న గుడ్‌ వర్డ్‌ గ్రైప్‌ వాటర్‌ వాణిజ్య ప్రకటన గుర్తుకు వచ్చి వుంటుంది.

  ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం-బిజెపి కూటములు నమ్మక ద్రోహానికి పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విచారించటం లేదు, ఏడవటం లేదు, కోపగించుకోవటం లేదు గానీ తామెన్నుకున్న పాలకులు, వాగ్దానాలు చేసిన వారు ఏం చేస్తారా అని వుగ్గపట్టుకు కూర్చున్నారు. ప్రత్యేక హోదా విషయంలో నమ్మక ద్రోహానికి గురయ్యామని తెలిసి కూడా ఎలాంటి అందోళనకు పాల్పడకుండా ఎంతో నిబ్బరంగా వున్నారు. బహుశా ఆంధ్రులు ఆరంభ శూరులు అనే విమర్శను తొలగించుకోవాలంటే ఎక్కడో అక్కడ ప్రారంభించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినపుడు చేసిన ఆందోళన, వెలిబుచ్చిన ఆగ్రహంతో పోల్చుకుంటే ఇప్పుడు తమ భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నా ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా వుండటాన్ని చూస్తే ఆంధ్రులు స్థిత ప్రజ్ఞులైనట్లు నిరూపించుకున్నారని అనుకోవాలి. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనే సింగపూర్‌ సిటీ నిర్మాణం జరిగితే గుప్తుల స్వర్ణయుగం మాదిరి చంద్రన్న స్వర్ణయుగం ఆవిర్భవించి ఎవరూ ఏమీ అడగకుండానే అన్నీ సమకూరుతాయనే ధీమా ఏర్పడిందా ? దీని పర్యవసానం ఏమిటి ?

    ఏడాదికి ఒకసారి మాత్రమే కనువిందు చేసే ‘మే ‘పుష్పం మాదిరి ప్రధాని నరేంద్రమోడీని కలిసి బయటకు రాగానే అరుదుగా కనిపించే చంద్రబాబు నాయుడి ముఖంలో నవ్వు వికసించింది. తాము అభిమానించే బాబా నోరు విప్పగానే సమక్షంలో వుండే భక్తులు బాబా మాట్లాడారు, బాబా మాట్లాడారు అని ఆనందంతో కేరింతలు కొట్టినట్లుగా, ఆర్కిమెడిస్‌ తాను కనుగొన్న సూత్రం గురించి యురేకా, యురేకా అంటూ బట్టలు వేసుకోవటం కూడా మరచి స్నానాల తొట్టి నుంచి లేచి వీధులలో పరుగెట్టినట్లుగా చంద్రబాబు నవ్వారని ఆయన భక్తులు మైమరచి పోతున్నారు. రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లు ఆర్ధిక పరమైనదా కాదా అని తేల్చేందుకు లోక్‌సభకు నివేదిస్తామనగానే సంతోషంతో కేరింతలు కొడుతూ బల్లలు చరిచిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాబోయే రోజుల్లో నయానో భయానో సాధిస్తాం తప్ప ప్రత్యేక హోదాపై ఇంకేమాత్రం నిరసనలు తెలుపబోమని విజయవాడలో చెప్పారు. సుజనా చౌదరి అలా బల్లలు చరిచి వుండాల్సింది కాదని చంద్రబాబు నాయుడు సర్ది చెప్పిన విషయం తెలిసిందే. ఇక వారి నేత బాలయ్య బాబు అయితే హోదా ఇవ్వకపోతే కంటి చూపుతో కాల్చేస్తా అన్నట్లుగా మాట్లాడతారు. అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో మాట్లాడుతూ విభజన హామీలు నెరవేరేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతారు. అసలు పోరాటం ఎప్పుడు మొదలు పెట్టారని ఎవరైనా అమాయకంగా లేదా అమాయకులు అడిగితే తెలుగుదేశం నేతలకు పట్టరాని ఆగ్రహం వస్తుందని సదా గమనంలో పెట్టుకోవాలి.జక్కన్న సినిమాలో బాలకృష్ణను అనుకరించి హాస్యం పండించటాన్నే లైట్‌గా తీసుకోలేని బాలకృష్ణ అభిమానులు హాస్యనటుడు ప్రధ్వీరాజ్‌ను బెదిరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఐదు కాదు పది అన్న వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఆ నాడు విభజన బిల్లులో ఎందుకు పెట్టలేదని మన్మోహన్‌ సింగ్‌ను ఇప్పుడు నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదాకు మరోవైపు ఎవరెవరు అభ్యంతరాలు తెలుపుతున్నారో వెంకయ్య నాయుడు మరోసారి గుర్తు చేసి అలాంటి వారిని అప్రమత్తం గావించారు. ప్రజాస్వామ్యం, సహనంపై జనంలో ఇంకా విశ్వాసం వుంది కదా అని ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, వాదించవచ్చు.

     నరేంద్రమోడీ మాట్లాడేందుకు సిద్దపడితే ఢిల్లీ వెళతానని చెప్పిన చంద్రబాబు ఎలాగైతేనేం ఢిల్లీ వెళ్లారూ, తిరిగి రానూ వచ్చారు. మోడీ గారి వేద గణితం మాదిరి చంద్రబాబు లెక్కల్లో ఇది 31వ సారి అనుకోవాలి. లేదా మోడీతో ప్రత్యేక హోదాపై మాట్లాడటంతో కొంత మంది భ్రమింప చేస్తున్నట్లుగా ఆవిర్భవించిన నూతన శకంలో తొలి పర్యటనగా అయినా లెక్కించుకోవాలి. ఢిల్లీ వెళ్లారా లేదా అని కాదు అన్నయా ఏం సాధించుకువచ్చారని చిలక నవ్వులు నవ్వినట్లు అన్నట్లు చంద్రబాబు సాధించిందేమిటి ? కలలో కూడా నెరవేరని గట్టి హామీ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి తమకు అభ్యంతరం లేదని, తమ రాష్ట్రాలకూ దాన్ని ఇవ్వాలని కోరుతున్న ముఖ్య మంత్రులను బుజ్జగింప చేసి ఆంధ్రప్రదేశ్‌కు ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని నరేంద్రమోడీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. నరేంద్రమోడీ-చంద్రబాబు భేటీ సందర్భంగా తాను పక్కనే వున్నట్లుగా ‘ఏపినీ అదుకొనే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా వుండండి అని చంద్రబాబును వుద్ధేశించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారంటే ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని భావించవచ్చు. ప్రతిపక్షాలు కోరుతున్నట్లు ప్రత్యేక హోదా మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోకుండా ఆర్ధికంగా ఇబ్బందులు వున్న రాష్ట్రాన్ని ఆదుకోవటానికి ఇతోధికంగా సాయం చేయటంతో పాటు పన్ను రాయితీలు కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించటం శుభసూచకం’ అని వ్యాఖ్యాత పేర్కొన్నారు.నిజంగా అదే జరిగితే అంతకంటే కావాల్సిందేముంది. అలాంటి చిత్తమే వుంటే ఇంత రచ్చ జరగటానికి అవకాశం ఎందుకు ఇచ్చినట్లు ? ప్రతిపక్షాలు కోరుతున్నట్లు అన్నారు, తెలుగుదేశం కోరటం లేదనేనా ? తమకు లేని హోదా, రాయితీలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు అంగీకరించి తమ రాజకీయ పునాదిని తామే కూల్చుకునేంత అమాయకంగా మమతాబెనర్జీ,నవీన్‌ పట్నాయక్‌, జయలలిత వున్నారా ? పోనీ వారు ముగ్గుర్ని ఒప్పిస్తే మిగతావారి సంగతేమిటి? భారతంలో ద్రౌపది తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అన్న సందేహం లేవనెత్తినట్లుగా ఆ వ్యాఖ్యాత తాను నమ్మి జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారా లేక జనాన్ని మాత్రమే నమ్మించేందుకు పూనుకున్నారా ?

    ఆదాయమున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని ఒక విధాన పరంగానే నిలిపివేసింది.నిధులు అంతగా లేని రాష్ట్రాలు కూడా అదేబాటలో నడుస్తున్నాయి. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారు, దానికి రాజధాని కూడా లేదు నుక ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వటానికి వుదారంగా అంగీకరించండని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనధికారికంగానే అడిగారనుకోండి. విభజన సమయంలో మా అభిప్రాయం అడగలేదెందుకుని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు ? ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ముందుగా తాను అధికారంలో వున్న రాష్ట్రాలకు అలాంటి అభ్యంతరం లేదని ప్రకటింపచేసి మిగతావారిని అడిగితే నిజాయితీగా, నిజమైన రాజనీతిజ్ఞురాలిగా బిజెపిని పరిగణిస్తారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎక్కడకు తరలించాలా అని చూసిన టాటా నానో కార్ల కంపెనీకి రాయితీలు ఇచ్చే శక్తి లేక అనేక రాష్ట్రాలు ఆ పోటీలో వెనుకబడగా జనం సొమ్మును కార్పొరేట్లకు కట్టపెట్టటంలో ముందున్న గుజరాత్‌ దానిని దక్కించుకుంది. అటువంటపుడు ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రత్యేక రాయితీలు ఇవ్వటానికి ఎలా ఒప్పుకుంటుంది? ఒక రాష్ట్రానికి వుదారంగా నిధులు సాధ్యం కాదని సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌ట్లీ రాజ్యసభలో ప్రత్యేక హోదా అనధికార బిల్లుపై చర్చ సందర్భంగా చెప్పిన చారిత్రాత్మక సమాధానంలో స్పష్టం చేసిన విషయాన్ని అప్పుడే ఎలా మరిపోగలం ? ప్రత్యేక హోదా సినిమా చివరికి ఎలా ముగుస్తుందో తెలియదు గాని కధ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం అమోఘంగా వుందనే విధంగా ప్రచారం హోరెత్తుతోంది.

     ప్రత్యేక హోదా రాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిర్ణయించుకున్న తరువాత వాటిని ఇవ్వకూడదని నిర్ణయించుకున్న బిజెపి, ఇవ్వకపోయినా గట్టిగా అడగకూడదు, ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయాలని చూస్తున్న తెలుగు దేశం పార్టీలపై జనంలో తలెత్తిన చిరు అసంతృప్తి లేదా ఆగ్రహాన్ని కూడా వుపశమింపచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వాటిని చూస్తుంటే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. మొరటు సామెత మాదిరి వుపస్థ మినహా గర్భాదాన అన్నట్లు కీలకమైన అంశాలు లేకుండా తూతూ మంత్రంగా ప్రత్యేక హోదా కల్పించేందుకు ఏదైనా పధక రచన చేస్తున్నారా ? అన్నది వాటిలో ఒకటి. అదే అయితే వ్యతిరేకించే రాష్ట్రాలేవీ వుండవు. పన్నులు విధించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి హరించి కేంద్రం తీసుకొనేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం పొందటం లాంఛనమే కను ప్రత్యేక హోదా ప్రకటించిన రాష్ట్రాలలోని పరిశ్రమలు, వ్యాపారాలకు పన్నులను మినహాయించాల్సింది కూడా కేంద్రమే అవుతుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో ఏర్పాటయ్యే వాటికి మినహాయింపులు ఇవ్వటం ద్వారా ఖజానాకు వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తుందా? అన్ని రాష్ట్రాలు భరించాలా? పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు రాయితీలు ఇవ్వటాన్ని నిరుత్సాహపరచాలని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని వెనుకబడిన రాష్ట్రాల నుంచి ఒకవైపు డిమాండ్‌ పెరుగుతున్నది, అలాంటపుడు ముందుబడినట్టు చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపులు ఎలా ఇస్తారు ? వస్తు, సేవల పన్ను విధానాన్ని అమలు జరపటమే ఒక సవాలుగా మారనుందని విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో ఈ సమస్యలన్నీ మరింతగా ముందుకు వస్తాయా రావా ?

    రాష్ట్ర విభజనకు పూర్తిగా కాంగ్రెస్‌దే బాధ్యత అని నిత్యం దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో వుంది కనుక, అందుకు చొరవ తీసుకుంది కనుక దానిదే బాధ్యత అనటంలో సందేహం లేదు. కానీ మిగతా పార్టీలు ఎలా తప్పుకుంటాయి. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన బిజెపి, రెండు కళ్ల సిద్దాంతం పేరుతో విభజనకు అంగీకరించిన తెలుగుదేశం పార్టీ సంగతేమిటి ? అందువలన ముందుగా బిజెపి తన పాలిత రాష్ట్రాల అభిప్రాయాన్ని వెల్లడించి తన నిజాయితీ ఏమిటో జనం ముందు ప్రదర్శించాలి.

      గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు రాజకీయ పార్టీల ఆలోచనలు, గోత్రాలు వాటికి దగ్గరగా వుండే వారికే బాగా తెలుస్తాయి. అలాంటి వారిలో జిగిని జర్నలిస్టు తెగ ఒకటి.ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా సాధించిందేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తమకు రెండు వందల స్ధానాలకు మించి రావని, అప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టటం అవసరం అని బిజెపి పెద్దలు లెక్కవేస్తున్నారని అలాంటి ఒక జర్నలిస్టు విశ్లేషించారు. అంటే మోడీ గాలి పోవటం ప్రారంభమైందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై వున్న కేసులలో ఆయనకు శిక్ష పడితే , ఆ పార్టీ వెనుక వున్న జనం తిరిగి కాంగ్రెస్‌వైపే చేరతారని దాంతో కాంగ్రెస్‌ ఎన్నో కొన్ని సీట్లు పొందే అవకాశం వుంది కాబట్టి ప్రస్తుతానికి జగన్మోహన్‌రెడ్డి జోలికి పోగూడదన్నది బిజెపి ఆలోచనగా వుందట.వైసిపిని దెబ్బతీయటానికి సహకరిస్తే రాష్ట్రంలోని 25కు గాను 20 సీట్లు గెలుస్తామని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుందట. అంటే అలా చేస్తే జన్మజన్మల బంధం మాదిరి వచ్చే సారి కూడా మద్దతు ఇచ్చి ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ ముందస్తు ఆశ చూపుతోందా? అవినీతిని అంతం చేస్తామని, అక్రమార్జన పరుల తాటతీస్తామని తమ పార్టీ రూటే సపరేటని చెప్పుకున్న బిజెపి పత్రికల్లో రాసేంతగా తమ అధికార దాహ ఆలోచనలను వెల్లడిస్తోందా ? ఏ పార్టీలో గెలిచినా అమ్ముడు పోయే ఎంపీలు, ఎంఎల్‌ఏలు తామర తంపరగా పెరిగి పోతున్న ఈ రోజుల్లో వారిని కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బుండి, సైద్ధాంతిక, నైతిక బాదర బందీలేని బిజెపి,తెలుగుదేశం వంటి పార్టీలు రాబోయే అధికారం గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తే వారు ఇంక ప్రజల గురించేమి పట్టించుకుంటారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

22 Friday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Narendra Modi, special status to Andhra pradesh, tdp

 నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు అందరూ వూహించినట్లుగానే రెండవ సారి కూడా చర్చకు రాకుండా పోయింది. అలాంటి బిల్లులను చర్చకు రానివ్వరని ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా ఎంతో శాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్రహించటం మంచిది. రజనీకాంత్‌ ఒక సినిమాలో సినిమాలో చెప్పినట్లు అతిగా ఆశపడవద్దు. నరేంద్రమోడీ, చంద్రబాబు మంత్రదండాలు, అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలు, లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య వంటి పవన్‌ కల్యాణ్‌ ప్రకటనల కోసం ఎదురు చూసే ఆనందం ఎంతైనా ప్రత్యేక హోదాతో రాదు కదా !

    ఆ బిల్లు చర్చకు వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెప్పిన తీరును చూసినపుడే రాదన్న గట్టి ధీమా వారిలో వుందని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని అంగీకరిద్దాం. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం కూడా అలాంటిదే. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అన్యాయం చేశారనే శాశ్వత విమర్శను కొనసాగించాలన్నా , ఆ పేరుతో మరికొంత కాలం ఓట్లు దండుకోవాలన్నా దానిని ఇవ్వకుండా, అలాంటి బిల్లులను చర్చకు రాకుండా చేయటం బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అవసరం అని శుక్రవారం నాటి పరిణామాలు నిరూపించాయని కూడా అనుకోకతప్పదు మరి. రాష్ట్రాన్ని విభజించి అసెంబ్లీ చరిత్రలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగి కావచ్చు లేదా చేసిన తప్పును దిద్దుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న లోకోక్తి ప్రకారం గానీ ఏదైనేం రెండు సంవత్సరాలకు ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

   నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిజెపి నేత అవునో కాదో తెలియని మా గుంటూరు గొరిజవోలు చిన్న సినీ హీరో శివాజీ దానిని 14వ అంశంగా పెట్టారని శరభ శరభ దశ్శరభ శరభ అంటున్నాడు. బిల్లు చర్చకు రావాలని, ఆమోదం పొందాలని తెలుగుదేశం పార్టీ నిజంగా కోరుకుంటే , హోదా రాకపోతే ఆంధ్రప్రజలు ఆగ్రహిస్తారని అనుకొని వుంటే చర్చకు రాకుండా పోయిన తరువాత దాని మీద ఆ పార్టీ నేతలు, చివరికి నిన్నటి వరకు కాంగ్రెస్‌లో వుండి తెలుగుదేశంలో రాజ్యసభ సీటుకొనుక్కున్నారని విమర్శలు ఎదుర్కొన్న టిజి వెంకటేష్‌తో సహా అలాంటి వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు.

   ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎంపీ పార్లమెంట్‌ ప్రాంగణాన్ని వీడియో తీసి దానిని సామాజిక మీడియాలో పెట్టారని అది నిబంధనలకు వ్యతిరేకం కనుక అతగాడిపై చర్య తీసుకోవాలని బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓకే, అదే వాస్తవమైతే నిబంధనల ప్రకారం స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు, రుజువైతే చర్య తీసుకోవచ్చు, ఎవరు అడ్డుపడ్డారు. వుభయ సభలలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు కూడా చర్య తీసుకోవాలనే కోరారు తప్ప వ్యతిరేకించలేదు. అన్నింటికీ మించి సదరు సభ్యుడు క్షమాపణ చెప్పాడు. అయినా సరే అతని ప్రవర్తన అభ్యంతరకరం అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా మాదిరి బిజెపి వ్యూహకర్తల మేకిట్‌ ఎన్‌ ఇష్యూ (దాన్నొక సమస్యగా చేయండి ) కాకపోతే ఆ పేరుతో లోక్‌సభ, రాజ్యసభలను ఒక రోజంతా పనిచేయకుండా వాయిదా పడేట్లు అధికారపక్షమే అడ్డుకోవాల్సినంత తీవ్ర విషయమా అది.

   రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి పార్లమెంట్‌ భద్రతా విషయాన్ని చర్చించాలన్న అధికార పక్ష సభ్యురాలి డిమాండ్‌ను కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల తరువాత దాని గురించి చర్చించవచ్చని చెప్పారు.అయినా సరే బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు తమ పట్టువీడకుండా గొడవ చేయటంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా అనధికార బిల్లులు చర్చకు రాకుండా పోయాయి. కాంగ్రెస్‌ సభ్యులు ముందే చర్చకు అంగీకరించి వుంటే బిల్లు చర్చకు వచ్చేదని నెపాన్ని కాంగ్రెస్‌ మీద నెట్టేందుకు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ప్రయత్నించటాన్ని చూస్తే జరిగిందేమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రజానీకం వుందని భావిస్తున్నారా ? లేక తామేం చెప్పినా నిజమే నిజమే అని తలలూపుతారనుకుంటున్నారా ? అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు కోసం పట్టుబట్టి హైదరాబాదులోనే కూర్చుంటామా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అన్ని పార్టీలనీ గుడ్డిగా నమ్మి (సిపిఎం తప్ప) అన్నీ వదులుకున్న ఆంధ్రులు రాని ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టి కూర్చుంటారా ?

      తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి తన సిబ్బంది ద్వారా ఒక అధికారిక ప్రకటన పంపారు. దాని పూర్తి పాఠం ఇలా వుంది.’రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్  అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు . ‘.

ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్‌ మీద అంత సానుభూతి ఎందుకు? తెలుగు దేశం పార్టీ కృషి, వత్తిడి వల్లనే కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇచ్చిందన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇలా చెప్పటం నిజంగా ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేక వత్తిడి ద్వారా పని చేస్తుందా ? మీరు చెప్పినట్లు స్నేహంగా వున్నంత కాలం నిధులు విడుదల చేయని కారణంగానే వత్తిడి తెచ్చారని అనుకోవాలా ? వత్తిడి కారణంగా అదనంగా వచ్చిన నిధులేమిటో జనానికి తెలియ చేస్తే సంతోషిస్తారు. బిజెపి-తెలుగు దేశం మధ్య వున్నది అనుభూతికి అందని అపూర్వ స్నేహంగా కనిపిస్తోంది. మీరు తెచ్చే వత్తిడికి నిజంగా అంత సత్తా వుంటే ప్రత్యేక హోదా సంగతి ఇంతకాలం ఎందుకు తేల్చలేకపోయారు అని జనం అడుగుతున్నారు. పార్లమెంట్‌లో మీరే ఎందుకు వత్తిడి తేలేదు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభలో గందర గోళం, వెల్‌లోకి దూసుకుపోవటం వంటివి చేస్తారు. కానీ మీ మిత్రపక్షం అధికారంలో వుండి ఆ పని చేస్తోంది. అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవాలా ?

    కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు, బుద్ది రాదు అనుకుందాం . బిజెపి, తెలుగుదేశం పార్టీల వద్ద శుద్ది,బుద్ది టన్నుల కొద్దీ వున్నాయి కదా ! ఇప్పటికైనా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ఏదో ఒకటి చేసి చూపండి, ఏమీ చేయకుండానే మూడో ఏడాదిలో ప్రవేశించారు. లేదా ఏదీ అవేమీ వుండవు అనైనా చెప్పండి ! సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రుల చెవిలో ‘ప్రత్యేక ‘పువ్వు – చంద్రన్న ముందున్న మార్గాలు

06 Friday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Chandrbabu, special status to Andhrapradesh, tdp

ఎం కోటేశ్వరరావు

    పేరు మోసిన అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగి మరణించిన తరువాత కూడా సొమ్ము చేసుకొనేందుకు వెంటిలేటర్‌లు పెట్టి బంధువులను మోసం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా పరిస్థితి వుంది. తేడా ఏమంటే అక్కడ డబ్బు రాబట్టుకోవటం కోసం అయితే, ఇక్కడ జనం మద్దతు పోగొట్టుకోకుండా వుండటం కోసం. ప్రత్యేక హోదా ఇవ్వటం నిబంధనల రీత్యా సాధ్యం కాదని తెలిసినా నాడు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఐదు కాదు పది అంటూ పెద్ద రాయితీని రాబట్టినట్లు బిజెపి పెద్ద నాటకం ఆడింది. తీరా బిల్లు విషయానికి వచ్చే సరికి అటు కాంగ్రెస్‌ దానిని దానిలో చేర్చలేదు, ఇటు బిజెపి, తెలుగుదేశం పార్టీ కూడా నోరు మెదపలేదు.ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం మోపి తప్పుకొనేందుకు చూస్తున్నాయి. మొత్తం మీద రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు, ప్రత్యేక హోదా రాయితీల నాటకంతో బిజెపి, అందరూ కోరుతున్నారు, కలిసి వస్తున్నారు కదా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ వారు వారందరితో కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలియనంత అమాయకంగా ఈ పార్టీలలో తలలు పండిన పెద్దలు వున్నారా ?

     అటు కేంద్రం-ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న పార్టీలు రెండు సంవత్సరాల పాటు ఆశ పెట్టాయి. ఇంకెంత మాత్రమూ మోసం చేయలేవు.మరణించిన రోగిని వెంటిలేటర్‌పై పెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అసలు విషయం చెప్పదు, చేయాల్సిందంతా చేస్తున్నాం అని మాత్రమే చెబుతుంది. రోగి బతికి బట్ట కట్టే ఆశ చచ్చి, అంతకు మించి వెంటిలేటర్‌ ఖర్చు భరించలేక బంధువులకు ఏం చేయాలో తెలియదు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలానే వుంది.

    పార్లమెంట్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ సీనియర్‌ లాయర్‌ కనుక కేసు గెలుస్తామని గానీ ఓడిపోతామని గాని చెప్పకుండా నర్మగర్బంగా అసలు కేసే లేదు అని చెప్పేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు, ఇతరులు అందరితో మాట్లాడుతున్నా అని చెబుతున్నారు. ఆయన మాట్లాడటం లేదని ఎవరూ అనటం లేదు. దేన్ని గురించి, ఏం మాట్లాడుతున్నారో జనానికి తెలియాలి కదా? కనీసం ఆయనను వెన్నంటి వుండే లేదా మేనేజిమెంట్‌లో వుండే మీడియా కూడా లీకుల కధనాలు కూడా ఇవ్వకపోవటంతో వాటికి అలవాటు పడిన వారు మత్తుకు బానిసలైన వారు గంజాయి దొరక్క పోతే ఎలా విలవిల్లాడి పోతారో అలా జుట్టు పీక్కుంటున్నారు.

    గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు పరిస్థితి వేరు. కారణాలేమైనా కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు అలా కాదే. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడి మాదిరి మీడియా సంస్ధలు అటు కేంద్రంలోని బిజెపి- ఇటు రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ మధ్య వున్నాయి. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ నొప్పి లేదా రాజకీయంగా నష్టం జరగకుండా తమ ప్రావీణ్యాన్ని వుపయోగించి ఏం రాస్తాయో, ఎలా చూపుతాయో తెలియదు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల గడువు వుంది. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పుల్లుగా వాగ్దానాలు చేసి, రంగుల కలలను జనం ముందుంచారు. ఏ రంగంలో చూసినా ఎదురుగాలి తప్ప మరొకటి కనపడటం లేదు. గత ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో తనపై ఆధారపడే ప్రభుత్వం వుంటుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్యసభలో తనకు తగినంత బలం లేదు కనుక బిజెపి కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నది. మరొక మార్గం లేదు కనుక తెలుగుదేశం కూడా అధికారాన్ని పంచుకొని, తాను కూడా పంచి ఇచ్చింది.

    గత రెండు సంవత్సరాల అనుభవం చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది పిడికెడు మట్టి, ముంతెడు నీళ్లు అని అమరావతి శంకుస్ధాపన సభలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో శాశ్వత రాజధానిని పక్కన పెట్టి తాత్కాలిక రాజధానిని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేక తరగతి హోదా రాదని చంద్రబాబుకు ఎప్పుడో అవగతం అయినా దానిని అంగీకరిస్తే రాజకీయంగా నష్టం కనుక. సాధ్యమైన మేరకు దాని ప్రస్తావన, దానిపై ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారు.అసలు ప్రస్తావించకపోతే అదీ నష్టమే కను తద్దినం మాదిరి స్మరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర పెద్దలు గత ఏడాది కాలంగా పరోక్షంగా చెబుతూ లీకులను వదులుతూనే వున్నారు. ఇక లాభం లేదని గత వారంలో చిన్న మంత్రుల ద్వారా పెద్ద విషయాన్ని చెప్పించారు.

    ఈ పూర్వరంగంలో గత వారం రోజులుగా చంద్రబాబుకు పాలుపోవటం లేదు. స్పందన ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే రాజకీయంగా ఒంటరి పాటు కావటంతో పాటు కేంద్రం నుంచి ప్రతి రోజూ అధికారికంగా తలనొప్పులే. సఖ్యంగా వున్న ఇపుడే వుదయం సాయంత్రం ఢిల్లీ ప్రభువుల దర్శనం చేసుకున్నా ఫలితం వుండటం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో చూస్తే రాజకీయంగా కలసి వచ్చే స్నేహితులు కనిపించటం లేదు. గత ఎన్నికలలో తోడ్పడిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు వీలైతే నాలుగు మాటలు, కాఫీ, ఆశకు పిసినారి తనం ఎందుకన్నట్లు వీలైతే ముఖ్యమంత్రి పదవి కోసం దారి వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడపుడే కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి మార్గం అగమ్యగోచరం. వైఎస్‌ కుటుంబంతో వున్న ఆర్ధిక లావాదేవీలు పరిష్కారం కాని వారు అవి తేలేంత వరకు అదే పార్టీలో కొనసాగవచ్చు.ఆ బాదర బందీ లేనివారు, తెలుగు దేశం పార్టీతో సర్దుబాటుకు వచ్చిన వారు ఇప్పటికే ఫిరాయించారు, రానున్న రోజుల్లో మరికొందరు రావచ్చు.

    తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా అంత సజావుగా, వుత్సాహంతో, వుద్వేగంతో వురకలు వేసే పరిస్థితి వుండదు.కేంద్రంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు వున్నవారు దానితో వైరం తెచ్చుకొనేందుకు సుతరామూ అంగీకరించరు. రెండవది చంద్రబాబు నాయుడు అప్పుచేసి పప్పుకూడు అన్న పద్దతుల్లో రాజధాని అమరావతిని కూడా అప్పులతో నిర్మించేందుకు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఇంతవరకు ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అలా జరగలేదు.ఒక వేళ ఆ ప్రాంత భూములన్నీ తాకట్టు పెట్టి లేక భారీ రాయితీలు ఇచ్చో విదేశీ సంస్దల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. లక్షల వుద్యోగాలు సృష్టించలేకపోయినా కనీసం రాజధాని నిర్మాణం చేయకుండా వచ్చే ఎన్నికలలో ఓటర్ల ముందుకు పోలేరు. చంద్రబాబు మరొకసారి విశ్వసనీయత సమస్యను ఎదుర్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.

     ఈ పూర్వరంగంలో ఏదో ఒక దారి లేదా సాకు వెతుక్కొని బిజెపి, కేంద్రంతో సర్దుకు పోదాం లెండి అన్నట్లు ఎన్నికల ముందు వరకు లొంగి పోవటం ఒక మార్గం. చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు కనుక అప్పటి పరిస్థితిని బట్టి ఏదారి పట్టాలో నిర్ణయించుకోవటం ఒకటి.లేదూ తెగేదాకా లాగితే తెలుగు దేశం పార్టీ సంగతి తేల్చటానికి బిజెపి వెనుకాడదు. కాంగ్రెస్‌ బాటలోనే అది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వెనుకాడదు అని ఇప్పటికే రుజువు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఫిరాయింపు జనాలతో నిండి వుంది. అలాంటి వారికి మరొక జంప్‌ చేయటం కష్టం కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం.అది సాధ్యం కాదని తేలిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పటానికి ఎలాంటి జంకూ గొంకూ వుండదు. తొలిసారి తప్పు చేసినపుడు సిగ్గు పడతారేమో గాని తరువాత అలవాటుగా మారిపోతుంది. అధికారానికి బానిసలుగా మారితే ఎంతకైనా తెగిస్తారు.

     చంద్రబాబు ముందున్న మరొక మార్గం జనానికి వాస్తవాలు చెప్పి విశ్వసనీయత కల్పించుకొని వారి మద్దతు పొందటానికి ప్రయత్నించటం. చంద్రబాబు చాణక్యంలో ఇంతవరకు అలాంటి అధ్యాయం లేదు. చిత్రం ఏమంటే ఏది జరిగినా చంద్రబాబు, తెలుగుదేశం బలహీనపడే పరిస్థితులను స్వయంగా సృష్టించుకున్నారు. రెండో మార్గాన్ని అనుసరించితే కనీసం కొంత మంది సానుభూతి అయినా పొందవచ్చు.

      రాష్ట్రంలో బిజెపి కూడా మునుపటి మాదిరి లేదు. కేంద్రంలో ఎవరి దయా దాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తప్ప రాష్ట్రంలో బలపడటానికి దానికి మరొక మంచి అవకాశం లేదు, రాదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిందనే తొందర వారిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో సాంప్రదాయ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్త సంబంధీకులే కాకుండా, కొత్తగా కాంగ్రెస్‌ రక్తం కూడా కలిసింది. వుపయోగించుకోవటం, లాభం లేదనుకున్నపుడు వదలి వేసిన గత అనుభవాల రీత్యా చంద్రబాబు నాయుడు వారికి నమ్మదగిన స్నేహితుడు కాదు. అన్నింటికీ మించి మర్రి చెట్టు నీడన మరొక మొక్క ఎదగదు అన్నట్లు తెలుగు దేశం నీడలో బిజెపి పెరగటం అసాధ్యం అని రెండు సంవత్సరాల అనుభవం వారికి నేర్పింది. అందువలన తమకు లొంగిపోయి అధికారంలో మరింత వాటా పెడితే సరి లేకపోతే తెలుగుదేశం మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. అధికారం ఎంతపని అయినా చేయిస్తుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు నాంది పలికింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో, రాష్ట్ర రాజకీయాలను ఎటు మళ్లిస్తుందో , ఏ ప్రస్తానానికి దారితీస్తుందో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏది నిజం ! ఏది కల్ల !! అసలేం జరుగుతోంది ఓ మహాత్మా !!!

05 Tuesday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Others, Politics, STATES NEWS

≈ Leave a comment

Tags

Amaravathi, Andhrapradesh, CHANDRABABU

విన్నపం: ఈ సైట్‌లో వస్తున్న సమాచారంలో చిన్న నలుసైనా వుపయోగం అనుకుంటున్నారా ? వ్యాఖ్యలు, విమర్శలలో వాస్తవం వుందనుకుంటున్నారా ? మీ అభిప్రాయాలు చెప్పండి ? వాటిని మీరు అభిమానించండి(లైక్‌) మీరు నలుగురితో పంచుకోండి(షేర్‌).

సత్య

చంద్రబాబు నాయుడు అంటేనే ఓ రంగుల కల. భవిష్యత్‌ దార్శనికుడిగా కొందరు వర్ణించిన ఆయన గతంలో ముఖ్య మంత్రిగా వున్నపుడు విజన్‌ 2020ని ప్రకటించి నానా హంగామా సృష్టించారు. తమ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన బాబు బాగోతం మాకు తెలియదా అంటూ దానిని విజన్‌ 420గా వర్ణించిన కాంగ్రెస్‌ వారిపై తెలుగుదేశం వీరాభిమానులు విరుచుకు పడ్డారు. ఆ విజన్‌ ఏమైందో చూశాము. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు అంతకంటే పెద్ద విజన్‌ 2050ని జనం ముందుకు తెస్తున్నారు. అప్పటికి రాజెవరో రెడ్డెవరో అన్న తెలుగు సామెతను గుర్తుకు తెచ్చుకోక తప్పదు.

గతంలో గ్రామాలలో తమ కళలను ప్రదర్శించి పొట్టపోసుకున్న జానపదులు వెళ్లిన ప్రతి చిన్న పల్లెనూ మీ వూరు చుట్టుపక్కల అరవైఆరు గ్రామాలకు పోతుగడ్డ అని పొగిడేవారు. పిట్టలదొరల సంగతి చెప్పనే అవసరం లేదు. నాకున్న కోట్లను కుక్కలు తింటున్నాయి, లక్షలను నక్కలు తింటున్నాయి, మీకు డబ్బేమన్నా కొదవ వుంటే చెప్పండి, కోరుకున్న కోరుకున్నంత ఇస్తా, కోట్లున్నా కడుపునిండా తినటానికి తిండి లేదు, అందుకే మీ ముందుకు వచ్చా, నాలుగు డబ్బుల్విండి బాబయ్యా అంటూ సాగుతుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దానిని చూస్తుంటే వూరూరా, వాడవాడలా ఆధునిక జానపదులు, పిట్టల దొరలు దర్శనమిస్తున్నారు. మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటాల మధ్య గొడవలతో తెరవెను ఎడమొఖం పెడమొఖంగా వుంటారని చెబుతారు. అయితే గత శుక్రవారం నాడు విశాఖ వుత్సవ్‌ను ప్రారంభించి విశాఖను సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని యుగళగీతం పాడారు. సేనానులే ఇలా మాట్లాడితే సోమవారం నాడు జన్మభూమిలో మాట్లాడిన వారి సేనాధిపతి చంద్రబాబు నాయుడు తెనాలి పట్టణాన్ని సాంస్కృతిక కేంద్రంగా మారుస్తానని ప్రకటించారు. ఒకపుడు తెనాలి, గుడివాడ, విజయవాడ, బందరు వంటి పట్టణాలు కళాకారులు, సాహితీవేత్తలకు కేంద్రాలుగా వున్నాయి. తెనాలికి ఆంధ్రా పారిస్‌ అన్న పేరు కూడా వుంది. విజయవాడను తెలుగుజాతి సాంస్కృతిక కేంద్రంగా ఎందరో వర్ణించారు. అంతకు ముందు రోజు చంద్రబాబు నెల్లూరు వెళ్లినపుడు ఆ నగరాన్ని మెగాసిటీగా, పరిశ్రమల కేంద్రంగా మారుస్తానని చెప్పారు.జన్మభూమి కార్యక్రమం ముగిసేలోగా ఇలాంటి విపరీతాలు, విడ్డూరాలను ఇంకా ఎన్ని వినాల్సి , కనాల్సి వస్తుందో తెలియదు.

నాలుగు వందల సంవత్సరాలకుపైగా చరిత్ర, విస్తరణ వున్న హైదరాబాదులో ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్దలు, ప్రయివేటు పరిశ్రమలు, ఐటి కేంద్రంగా వున్న చోటే మొత్తం జనాభాయే కోటి వరకు వుంది. అలాంటిది 2050 నాటికి అంటే మరో 34 సంవత్సరాలలో అమరావతి రాజధాని ప్రాంతంలో 60లక్షల వుద్యోగాలే కల్పిస్తానని చంద్రబాబు నాయుడు విజన్‌ 2050 పేరుతో మరో పెద్ద రంగుల కలకు తెరతీశారు. వున్న పరిశ్రమలే మూతపడుతూ వుత్పత్తులను తగ్గించాయని, ఎగుమతులు పడిపోయాయని, మన సరుకులను కొనేవారు ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నట్లు వార్తలు వస్తున్నాయి.అవేమీ తెలియనట్లు, మనకు వర్తించవన్నట్లుగా మరోవై పు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆప్రాంతాన్ని పారిశ్రామికంగా, వాణిజ్య కేంద్రంగా మారుస్తానని చెబుతున్నారు.మరోవైపు రాజధాని ప్రాంతంలో కూడా ప్రత్యేక నగరాలు లేదా ప్రాంతాలుగా వాటిని అభివృద్ధి చేస్తామని నమ్మబలుకుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అన్ని విధాలుగా అమలు జరిపితే పచ్చని పంటపొలాలను నాశనం చేసి రాజధానికి 33వేల ఎకరాలు తీసుకోవాల్సిన పనేముంది? దాని చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు అంటూ మరో భ్రమ కల్పించాల్సిన అవసరం ఏముంది? అసలేం చేస్తారు? ఎలా చేస్తారు? ఏం చేయబోతున్నారు ?

కొద్ది నెలల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన ఏపి సమాచార శాఖ మంత్రి పల్లె రఘనాధ రెడ్డి చెప్పినదాని ప్రకారం అమెరికా నుంచి ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని వాటితో పదివేల మందికి వుపాధి కల్పించవచ్చన్నారు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన ఒక వార్త ప్రకారం అమెరికాలో వంద భారతీయ కంపెనీలు 1500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి 91వేల వుద్యోగాలను అమెరికన్లకు కల్పించినట్లు వుంది. అందువలన పెట్టుబడి అన్నది ఎక్కడ లాభం వుంటే అక్కడకు పోతుంది తప్ప వ్యక్తుల పలుకుబడి, వడ్డూ పొడుగులను చూసి రాదు, మాటల గారడీలకు పడిపోదు. ఐదువేల కోట్లకు పదివేల వుద్యోగాలైతే 60లక్షల వుద్యోగాలకు ఎన్నిలక్షల కోట్లు కావాలి? అరచేతిలో వైకుంఠాన్ని చూపి రెండేళ్లు అవుతోంది. గతంలో ఖాళీగా వున్న కొన్నిపోస్టులను నింపటం తప్ప కొత్తగా సృష్టించిన వుద్యోగాలెన్ని? అందుకోసం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు ఇప్పుడే దశలో వున్నాయి అన్నది బేతాళుడి ప్రశ్న. ఎవరైనా సమాధానం తెలిసి కూడా చెప్పకపోయారో వారి తల ఒక్కలు కాదు కానీ ఏం జరుగుతుందో ప్రయత్నించి చూడండి, తెలిస్తే చెప్పండి.

ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, అలాంటి వారి మాటలు నమ్మి మీసాలు మెలేసేవారు అమాయకులు సుమతీ అనుకోవాలా ?

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చట్టం తనపని తాను చేసుకుపోతుంది, అబ్బ చా !!

16 Wednesday Dec 2015

Posted by raomk in AP NEWS, Current Affairs, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, AP CM, call money, Law, YS jagan

 

ఎంకెఆర్‌

ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఇసుక మాఫియా వార్తలు, నిన్న విజయవాడలో కల్తీ మద్యంతో మరణాలు, అదే విజయవాడలో కాల్‌ మనీ మాఫియా చేతుల్లో ఎన్నో కుటుంబాలు, ఎందరో మహిళల బలి. ఎప్పుడూ ! ఇదంతా చట్టం తన పని తాను చేసుకుపోతుండగానే సుమా !! అలా తన పని తాను చేసుకుపోతున్నారనే కారణంతోనే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌పై సెలవు వేటుతో కాల్‌ మనీ కాటు పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఒక దారుణానికి అధికార పక్షం, మరో ఘోరానికి ఒక ప్రతిపక్ష మాజీ ఎంఎల్‌ఏ కారణం, అత్యంత నీచమైన మరో దుర్మార్గానికి పాలకపార్టీ ఎంఎల్‌ఏలు, నాయకులు వారితో చేతులు కలిపిన పెద్దలు కారణం ! చట్టం తన పని తాను చేసుకుపోతూనే వుంది.

ఏ పార్టీ వారైనా ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు ,చట్టం తనపని తాను చేసుకుపోతుందని అధికార పార్టీనేత వువాచ ! అధికార పార్టీలోని ఎంఎల్‌ఏలు, కార్యకర్తల పేర్లు బయట పెట్టాలని ప్రతిపక్ష నేత డిమాండ్‌ !! విజయవాడ కాల్‌మనీ గురించి ముందే నిఘా సంస్ధలు నివేదించవలసి వుండాల్సింది, వారిది వైఫల్యం. ముఖ్యమంత్రి ప్రకటన. ఇవన్నీ చట్టం తనపని తాను చేసుకుపోతుండగానే జరిగాయి.

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ వారు పరిపాలిస్తుంటే వారు తమకు అవసరమైన మేరకు చట్టాలు చేసుకున్నారు తప్ప జనం కోసం కాదని మన తాత ముత్తాలందరూ వారికి వ్యతి రేకంగా పోరాడిన వారే. అశేష త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. మన చట్టాలు మనం చేసుకున్నాం అని చెప్పారు పెద్దలు. తీరా చూస్తే అనేక పాత బ్రిటీష్‌ వాడి చట్టాలకు మన రంగు కండువాలు కప్పి కొద్దిగా మేకప్‌ చేసుకున్నాం, కొత్త సీసాలో పాతసారా పోసుకున్నాం తప్ప ప్రజోపయోగ చట్టాలుగా వాటిని చెప్పలేం. ఎందుకంటే చట్టం ఎప్పుడూ అధికారంలో వున్న వారికి చుట్టంగా పని చేయటం తప్ప మనకు మరొక విధంగా తెలియదు.

బాబరీ మసీదును కూల్చటం వాస్తవం, మనమందరం చూశాము. దానిని కూల్చినవారు ఆ పేరు చెప్పి గాక రామాలయ నిర్మాణానికి కరసేవ పేరుతో మరొక ప్రార్ధనా స్దలాన్ని కూల్చివేశారు.(ఆ శక్తులే నేడు మత సహనానికి తామే ప్రతీకలం తమను సహనం లేని వారని అనవద్దు అని బెదిరించటం వేరే సంగతి) మసీదు కూల్చివేసిన వారిని ఇంతవరకు శిక్షించలేదు. అయినా చట్టం తనపని తాను చేసుకుపోతోంది.

గుజరాత్‌లో గోద్రా రైలు బోగీ దురంతం( ఎవరు చేశారన్నది వివాదాస్పదం) ఆ పేరుతో ఆ రాష్ట్రంలో మైనారిటీలపై మారణకాండ, వేలాది మంది హత్య, ఆస్తుల విధ్వంసం. ఆ కేసులు ఏమయ్యాయి? ఎంత మందిని శిక్షించారు? ఎంత కాలమైంది. చట్టం తనపని తాను చేసుకుపోతూనే వుంది.

మధ్యప్రదేశ్‌లో పరీక్షలు, వుద్యోగాల కుంభకోణం, వాటిని బయట పెట్టిన వారిని కొంత మందిని గుర్తు తెలియకుండా చంపేస్తే మరికొందరు నిత్య ప్రాణ భయంతో బ్రతుకుతున్నారు. దానిని దర్యాప్తు చేస్తున్నవారు, దాని గురించి వార్తలు రాద్దామని వెళ్లిన విలేకరితో సహా దాదాపు 70 మంది అనుమానాస్పదంగా మరణించారు.చిత్రమేమిటంటే అక్కడా చట్టం తనపని తాను చేసుకుపోతుండగానే ఇవన్నీ జరిగాయి.

సల్మాన్‌ ఖాన్‌ నిర్దోషి, జయలలిత నిర్దోషి, ఇలాంటి పెద్దలు ఎందరో, ఎన్నో కేసులు ఇంకా సాగుతూనే వున్నాయి. ఇవన్నీ చట్టం తనపని తాను చేసుకుపోయిన ఫలితమే అని తెలుసుకోవాలి.

ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు ఎందుకు జరిగి వుండేవి. చట్టం తన పని తాను చేసుకుపోతే ఇంతకాలంగా ఇప్పుడు బయటికి వచ్చిన అక్రమాలు ఎందుకు వెల్లడి కాలేదు, చట్టం ఏం చేసిందో కాంగ్రెస్‌, వైసిపి తెలుగుదేశం నాయకులు చెబుతారా ?అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టం తనపని తాను ఎప్పుడైనా చేసుకుపోయిందా ? నిజంగా పని చేసి వుంటే ఇన్ని దారుణాల గురించి మనం ఎందుకు వినాల్సి వచ్చింది? అంటే చట్టాన్ని పని చేయనివ్వకుండా అయినా ఎవరో ఒకరు చేసి వుండాలి లేదా అది ముసలి ఎద్దయినా అయి వుండాలి. తమ వారే కాల్‌ మనీ రాకెట్‌లో వున్నారని తేలటంతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుకు వైరాగ్యం వచ్చి తెల్లవారిన తరువాత పొద్దుగూకక మానదు, బతికిన మనిషి చావకతప్పదు అన్నట్లుగా చట్టం గురించి చెబితే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనుకుంటున్నారా ? కాల్‌ మనీ దురాగతాలకు ఎవరు బాధ్యులైనా చర్యలు తీసుకుంటామని అధికార పక్ష పెద్దలు చెప్పటం పెద్ద జోకు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిఘా వ్యవస్ధ విఫలం అయిందని వ్యాఖ్యానించారంటే నేను బాగానే పని చేస్తున్నా, యంత్రాంగమే కదలటం లేదని తన బాధ్యతను తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న నేరాలు,ఘోరాల గురించి జనానికి కంతటికీ తెలిసిన విషయాలు నిఘా యంత్రాంగానికి తెలియవని చెప్పటం గడసరి తనం. విజయవాడలోనే మకాం వేస్తున్నా, అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నా అని చెప్పే ముఖ్యమంత్రి తీరు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. అధికార పార్టీ తమ నేతల పేర్లు రాగానే ముందు వారిని పార్టీ నుంచి పక్కన పెట్టాలి. ఆ పని చేయకుండా ఏ పార్టీవారైనా వదలం అని కబుర్లు చెబితే చాలదు. గద్దెపై ఎవరున్నా పాలకులకు మన రాష్ట్రంలో అటువంటి విశ్వసనీయత లేదు, ఒక వేళ వుందని ఎవరైనా చెప్పుకున్నా అది అనేక అతిశయోక్తులలో అదొకటి మాత్రమే. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పిన అధికార పార్టీ కాల్‌మనీ కేసు వివరాలు పూర్తిగా బయటకు రాక ముందే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను సెలవుపై ఆకస్మికంగా పంపటం, ఆయన స్ధానంలో మరొకరిని ఇంఛార్జిగా నియమించటం జనానికి ఎలాంటి సందేశం పంపుతున్నది ? ఆయన ఎప్పుడో సెలవు అడిగారని ఇప్పుడు మంజూరు చేశామని చెబుతున్నారు. అందులో నిజం వుందో లేదో తెలియదు. కాల్‌మనీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాపితంగా దాడులు జరుగుతున్న సమయంలో దానిని ముందుగా బయట పెట్టి అరెస్టులు చేయించిన అధికారిని ఆకస్మికంగా సెలవుపై పంపితే ఎలాంటి సందేశం జనంలోకి వెళుతుందో తెలియనంతటి అమాయకుడు చంద్రబాబు నాయుడని ఎవరూ అనుకోరు, పోనీ ఆయన సలహాదారులకు కూడా బుర్రపని చేయలేదా ?

బాబు మాఫియాను నడిపిస్తున్నారని వైసిపి నేత జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కాల్‌మనీ గురించి అది అధికారయుతంగా బయటకు రాకముందే ఎందుకు గవర్నర్‌కు ఫిర్యాదు చేయలేదు ? తన కుటుంబానికి ఒక పెద్ద పత్రిక, టీవీ ఛానల్‌ వున్నాయే అవైనా ఎందుకు బయట పెట్టలేదు? ఏదైనా ఒక ఘోరం జరిగినపుడు ఎవరు దానికి బాధ్యులో వెంటనే వెల్లడి చేసే పద్దతి, లేదా సాంప్రదాయం వుంటే మీ తండ్రి హయాంలో జరిగిన అక్రమాల వెనుక ఎవరున్నది ఎందుకు వెల్లడించలేదు జగన్‌ గారూ అని అడిగితే ఏం చెబుతారు? ముందు మీపై మోపిన కేసులకు సంబంధించి మీరు నిజాలు చెప్పి మిగతా కేసుల నిందితుల గురించి అడిగితే మీకు విస్వసనీయత వుంటుంది.

ఇక కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా వుండి ఎన్నికలకు ముందు, తరువాత తెలుగుదేశంలో చేరిన నాయకులు కాల్‌మనీ, కల్తీ మద్యం వంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

విజయవాడ కాల్‌మనీ మాఫియా గురించి బయటకు రాగానే రాష్ట్రమంతటా వడ్డీ వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయి. మంచిదే, కానీ విజయవాడలో పట్టుబడిన, లేదా దాని వెనుక వున్న అధికారపార్టీ నాయకులపై తీవ్రతను నీరు గార్చేందుకు, కేసులకు బలం లేకుండా చేసేందుకే ఈ దాడులని కొందరు చెబుతున్నారు. అసలే అప్పుపుట్టని ఈ రోజుల్లో ఇలా దాడులు చేస్తే ఎవరైనా అప్పిస్తారా ? అప్పులేకపోతే అవసరాలు వున్న వారు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? అప్పుతీసుకున్న వారు ఇచ్చిన వారి షరతులకు(అనుచిత సంబంధాలకు అంగీకరించటంతో సహా) లొంగటం ఇవాళ కొత్తగా ప్రారంభమైందా, కాల్‌ మనీ డబ్బు ఎగ్గొట్టమని నాయకులు చెబుతున్నారు అప్పుడు వడ్దీకి ఇచ్చిన కుటుంబాలు ఏమి కావాలి అని వాదించే వారు కూడా బలంగా వుండటం మన సమాజ దౌర్బాగ్యం.

స్వయం సహాయక సంఘాలు బాగా పని చేస్తున్నాయి, వారి అవసరాలకు డబ్బు బాగా సమకూరుతోంది, ఆ ఘనత మాదే అని చెప్పుకున్న ఏ పార్టీ వారైనా కాల్‌మనీ కాలనాగులకు జనం చిక్కటం, మహిళలు మానాలు పోగొట్టుకోవటం ఎవరి పుణ్యం? కొంపదీసి ఇది కూడా చట్టం తన పని తాను చేసుకుపోయిన ఫలితమే అంటారా ? అదే అయితే అలాంటి చట్టాలు అవసరమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: