• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ANTI NATIONAL

వేదాలను ప్రశ్నించిన మహాకవి వేమన కూడా జాతి వ్యతిరేకి, కమ్యూనిస్టేనా ?

02 Wednesday May 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION

≈ 1 Comment

Tags

ANTI NATIONAL, communal forces, communalism, communist, everything lies in veda’s only, Religious Fundamentalists, vedas, Vemana

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేన్ని సహించాలి? దేన్ని సహించకూడదు ?

28 Monday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

ANTI NATIONAL, BJP, Intolerance, NATIONAL, RSS, Tolerance, what is tolerable

 ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్‌ కూడా సంపాదించండి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు

ఎంకెఆర్‌

    తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ! మళ్లీ అదే, మళ్లీ మళ్లీ అదే !! నిర్మొహమాటంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచాన్ని వూపివేస్తున్న వినిమయదారీ తత్వం నేటి తరాలకు నేర్పుతున్నది అదే. మనకు తెలియకుండానే దీనిలో పడిపోతున్నాం. దీని ఒక లక్షణం ఏమంటే ప్రశ్నించేతత్వాన్ని మొదట అది నాశనం చేస్తుంది. ఇప్పుడు ప్రతి వారి చేతిలో కనిపించే సెల్‌ ఫోన్నే తీసుకుందాం. మనకు అంత వెల వున్న సెల్‌ఫోన్లు అవసరమా అని ఆలోచించేవారెందరు? ఫీచర్లు తక్కువ వున్న సెల్‌ ఫోన్‌ ఎవరి చేతుల్లో అన్నా చూస్తే వారిని పాతకాలం వారనుకుంటున్నామా లేదా ?

    ఇలాంటి స్థితిలో ఏ దేవుడు లేక దయ్యం వలన బుద్ధి పుట్టిందో గానీ కొంత మంది సైద్ధాంతిక యుద్ధానికి తెరలేపారు. యుద్ధం అంటే ముందు బలయ్యేది నిజం. వాస్తవాలు అడుగు దూరం ప్రయాణించేలోపు అవాస్తవాలు వంద అడుగులు వెళ్లి కొత్త రూపంలో మనదగ్గరకే తిరిగి వచ్చి మనలను కూడా అనుమానంలో పడేస్తాయి. మహాభారత, రామాయణాలు మనకు చెప్పినది అదే. అందువలన సైద్ధాంతిక యుద్ధంలోని ఒక పోరులో తాము విజయం సాధించామని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించేశారు. అలా వాదించకపోతే ఆయన ప్రముఖ లాయర్‌ ఎలా అవుతారు. హత్య చేసిన వ్యక్తి తరఫున వాదించటానికే పేరు మోసిన లాయర్లు అవసరం. మా కక్షిదారు ఎలాంటి వాడు అంటే అసలు కత్తి అనేదే తెలియని అమాయకుడు, అలాంటి వ్యక్తి ఆ రోజు అసలు అక్కడ లేడు, ఈ హత్య చేయలేదు అని బల్లచరిచి మరీ వాదిస్తాడు. సైద్దాంతిక పోరులో విజయం సాధించామని ఏకపక్షంగా ప్రకటించుకోవటంలో మతలబు అదే.

     చిత్రం ఏమంటే రెండు సంవత్సరాల క్రితం బిజెపి ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక, చేసిన వాగ్దానాలు, ప్రసంగాలలో ఎక్కడా దేశంలో తాము సైద్దాంతిక యుద్ధాన్ని ప్రారంభిస్తామని చెప్పలేదు. నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు పంచుతామని, రైతాంగానికి రెట్టింపు ఆదాయాలు సమకూర్చుతామని, ధరలు తగ్గిస్తామని, అన్నింటికీ మించి మేకిండియా పేరుతో ప్రపంచం మొత్తానికి వస్తువులను ఇక్కడే తయారు చేసి ఇక్కడి నుంచే సరఫరా చేస్తామని, ఆ విధంగా వుద్యోగ కల్పన చేస్తామంటూ ఎన్నోఎన్నో వాగ్దానాలు చేశారు.జౌరంగజేబును ఆదర్శంగా తీసుకొని జనం మీద చెత్తపన్ను వేశారు. అదేం చిత్రమో గాని పన్ను వసూలు చేస్తున్నారు గానీ చెత్తను తీయటం లేదు. వాటి అమలుకు అసలు ప్రయత్నమే లేదు గానీ చెప్పని అంశంలో మాత్రం విజయం సాధించారట !

    మీ పిచ్చిగానీ ఇవన్నీ ఎవరికి పట్టాయి. ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్‌ కూడా సంపాదించండి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు వచ్చాయని ఒక మిత్రుడు చలోక్తి విసిరాడు.

      మా పక్కింటి పెద్దాయన కూడా రోజులు బాగాలేవు సార్‌, సర్దుకు పోవాలి అన్నాడు. అదేంటి సార్‌ మరి ఆటు, పోట్లను ఎదుర్కొని నిలవటమే జీవితం అని కదా పెద్దలు చెప్పారు? ఆటు పోట్లను ఎదుర్కోవటం అంటే సాధారణ అర్ధంలో కష్ట సుఖాలు అని, అలాగాక నిజమైన అర్ధం ప్రకారం వాటికి ఎదురు నిలవమని కాదు. ఎవరైనా అలా నిలబడితే సముద్రం మింగేస్తుంది. ఆటు, పోట్లు వచ్చినపుడు వెనక్కి వంగి తప్పించుకోవాలి తప్ప ఎదురు నిలబడి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోమని కాదు అన్నారు.(పోటు అంటే సముద్రం మీద నుంచి లేచే అలలు తీరానికి రావటం, ఆటు అంటే తీరానికి వచ్చిన అలలు తిరిగి సముద్రంలోకి పోవటం, కొన్ని సందర్భాలలో అవి చాలా తీవ్రంగా వుంటాయి. వాటికి ఎదురు నిలబడితే ప్రాణాలకే ముప్పు)

     ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రంగాలలో ఎలాంటి సైద్ధాంతిక, మేథో,విద్యాపరమైన చర్చలు మృగ్యమైన కారణంగా ప్రతి ఒక్కరూ బి పాజిటివ్‌ అన్నట్లుగా వుంటున్నారు. ఏదైనా ఒక విషయంపై ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, విమర్శనాత్మకంగా చెప్పినా, చెప్పేందుకు ప్రయత్నించినా మీ రెందుకు ప్రతిదానికీ బస్తీమే సవాల్‌ అంటారు, కావాలంటే మీ అభిప్రాయాలు మీరు వుంచుకోండి, మాకు చెప్పండి, భరించక తప్పదు కదా, ఇతరులు ఏది నమ్మితే మీకెందుకు, వారిష్టం వచ్చినట్లు వారుంటే మనకు నష్టమేమిటి ? అని కుటుంబ సభ్యులే వెనక్కు లాగుతారు. ఇంకా కొందరు మనకెందుకులే దుష్టుడికి దూరంగా వుండాలన్నట్లు వినీ వినట్లు తప్పించుకుంటారు.

      అంటే దీని అర్ధం ఏమిటీ ఎక్కడ ఏం జరిగినా, ఎవరేం చెప్పినా మనం ఆలోచించకూడదు, బుర్రకు పని పెట్ట కూడదు, దేనినీ పట్టించుకోకూడదు, మన అభిప్రాయాలు వెల్లడించకూడదు, మనం అసలు మాట్లాడ కూడదు, ఏదైనా వుంటే మనలోనే అణచివేసుకోవాలి. అప్పుడే అంతా మనతో బాగుంటారు, మనమూ బాగుంటాము. ప్రతిదానికీ ఇతరులతో దెబ్బలాటలకు దిగటం ఎందుకు ? కానీ గత చరిత్ర అంతా అలా లేదే. పోరాటాల మయం ! ముందుకే మున్ముందుకే !! కౌరవులు దుష్టులు మన కెందుకులే వారి పాపాన వారు పోతారులే అని కృష్ణుడు వూరుకుంటే బకుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, కంసుడు మొదలైన వారందరిదీ పై చేయి వుండేది. ప్రపంచంలో తనకు ఎదురు లేదు అని విర్రవీగిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు అడ్డగించకపోతే, ఫాసిస్టు హిట్లర్‌ను కమ్యూనిస్టు స్టాలిన్‌ అడ్డుకొని వుండకపోతే ప్రపంచ పరిణామాలు ఎలా వుండేవి? చచ్చిన చేప వరదలో కొట్టుకుపోతుంది. బతికి వున్న చేప ఎదురు ఈదుతుంది. మనం ఎవరిగా వుండాలి?

    మహాభారతంలో సహనం, సంయమనం గురించి ఎన్నో పాఠాలు వున్నాయి.కంసుడి వంద తప్పుల వరకు కృష్డుడు సహించి సంయమనం పాటించాడు. అందువలన దేన్ని సహించాలి,దేన్ని సహించకూడదు అని ఈ రోజు మనం కొత్తగా ఆలోచించనవసరం లేదు. చరిత్రే మనకు నేర్పింది. పులి మనుషులకు హాని చేయనంతవరకు దాని మానాన దాన్ని అరణ్యంలో తిరగనివ్వాలి. అది జనారణ్యంలోకి వస్తే బోనులో బంధించి తిరిగి అడవిలో వదలి వేయాలి. అదే అదుపు తప్పితే ఏం చేయాలో చెప్పనవసరం లేదు.

    మీరు ప్రజల నమ్మకాలను గౌరవించాలి అంటారు. నిజమే ! భక్తితో అగ్ని గుండం మీద నుంచి నడిస్తే ఏమి కాదు అన్నది ఒక నమ్మకం. అది హిందువులు, ముస్లింలలోనూ వున్న ఒక మూఢనమ్మకం అని చెప్పేందుకు హేతువాదులకు హక్కు వుందా లేదా? అలాగాక మా విశ్వాసాన్ని, మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఎవరైనా దెబ్బలాటలకు వస్తే సహించాలా ? ఎదుటివారి అభిప్రాయాలను విను, సబబనిపిస్తే అంగీకరించు లేకుంటే అనుభవించు అని ముగించటం తప్ప చేసేదేముంది? హేతువాదుల మాటలను ఖాతరు చేయకుండా గతేడాది కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక కాళికాంబ ఆలయం దగ్గర బసవన నడక పేరుతో అగ్ని గుండంలో నడిచిన ఒక పూజారి గుండంలో పడిపోయి ఆరు రోజుల తరువాత దుర్మరణం చెందాడు. అందువలన మరొకరు అలాంటి పని చేస్తే వద్దని వారించకుండా వుండాలా, పోతే పోతాడు లెమ్మని చూస్తూ వూరుకోవాలా, పశువులకూ మనకూ తేడా ఏముంటుంది? అయితే వారికి ఎలా చెప్పాలి. చాలా మంది అలా నడుస్తున్నారు కదా వారికెందుకు ప్రాణాల మీదకు రాలేదు అనే వారిని ఒకరికైనా ఎందుకు వచ్చిందో, విశ్వాసం ఎందుకు కాపాడలేకపోయిందో చెప్పమనాలి.

    ఎవరైనా అలాంటి మూఢనమ్మకాలు కలిగి వుంటే బాబూ మంచిది కాదు అని చెప్పాలి. కాదు నా యిష్టం అంటే , నీ మనోభావాలను ఎందుకు దెబ్బ తీయాలి, ఎలాంటి అభిప్రాయాలు కలిగి వుండాలన్నది నీ హక్కు అంటూ దానిని గౌరవించటం తప్ప మరొక పద్దతి లేదు.వాటిని ఇతరులకు శాంతియుత పద్దతుల్లో వెల్లడించటాన్ని కూడా మనం గౌరవించాలి, సహించాలి.

    కానీ నీకు దేవుడి మీద నమ్మకం లేదు, మన కాలనీలో నువ్వుండటం వల్లనే ఈ ఏడాది వర్షాలు పడలేదు, నువ్వు మంచోడివి కాదు అనే ఎదుటి వారి నమ్మకాన్ని గౌరవించాలా ? వారి అభిప్రాయాన్ని వారిని వ్యక్తం చేయనివ్వండి, నష్టం లేదు, దానితో అంగీకరించాల్సిన అవసరం లేదు. సమాజంలో కొంత మంది చేత బడి చేస్తున్నారనే ఒక మూఢనమ్మకం వుంది. దానికి విరుగుడు పేరుతో లెక్కలేనన్ని పూజలు కూడా వున్నాయిగా నమ్మకం వున్న వారిని చేయించుకోనివ్వండి, డబ్బులు వదిలించుకోనివ్వండి. కానీ చేతబడి చేస్తున్నారనే పేరుతో ఎవరిమీదైనా దాడులు చేస్తే, చంపటానికి ప్రయత్నిస్తే సహించకూడదు. ఇలాంటి దాడులకు గురవుతున్నవారెరు. ఎక్కువ మంది దళితులు, ఇతర బలహీన వర్గాల వారే. నిజానికి వారికి అలాంటి శక్తులే గనుక వుంటే వారిపై దాడులు, అత్యాచారాలకు పాల్పతున్నవారిని ఎప్పుడో రిమోట్‌ కంట్రోలు మాదిరి తమ గుడిసెల్లో వుండే మట్టుబెట్టి వుండేవారు.

    కానీ వాస్తవానికి డబ్బున్నవారు, ధనికులు, డబ్బు లేక పోతే లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ బాబాలు, చేతులు, కాళ్లు చూసే జ్యోతిష్కుల వంటి రకరకాల వ్యక్తుల చేత క్షుద్రపూజలు, హోమాలు చేయిస్తున్నారా లేదా ? చేతబడికి, వాటికీ తేడా ఏమిటి? చేతబడి అంటే భయపడతారు, హోమం, పూజలు అంటే చేతులు కట్టుకు ప్రణమిల్లుతారు. మరి అలాంటి వాటిని గౌరవించాలా? అవసరం లేదు. అయితే అవి చేసే వారితో తగాదా తెచ్చుకోనవసరం లేదు.

    సహనం, అసహనం, దేశభక్తి, దేశ ద్రోహి, మాత, పిత వంటి అంశాలు సమాజంలో ఎప్పటి నుంచో వున్నాయి. అవి ఎప్పుడు వెలుగులోకి వస్తాయంటే ఏదైనా ఒక పరిణామం సంభవించినపుడు దాని స్వభావాన్ని బట్టి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. వుదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ , అది 1925లోనే ఒక స్వచ్చంద సంస్ధగా ఏర్పడింది. అయితే దానిలో ఒకప్పుడు సభ్యుడిగా వున్న గాడ్సే 1948 జనవరి 30న మహాత్మా గాంధీని హత్య చేసినపుడే దాని భావజాలమేమిటో దేశానికి తెలిసింది. తరువాత సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం దానిపై విధించిన నిషేధాన్ని తొలగించారు. అప్పుడు సుప్రీంకోర్టు విధించిన షరతు ప్రకారం దేశ రాజ్యాంగానికి బద్దులమై వుంటామని, త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా గౌరవిస్తామని రాతపూర్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ విధేయత పత్రాన్ని అందచేయాలి.ఈ విషయాలను బహిరంగంగా ప్రకటించాలి.ఆ మేరకు 1949 ఏప్రిల్‌ 11న నాటి అధిపతిగా వున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ఒక ముసాయిదా ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనావళిని కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. దానిని పరిశీలించి అంగీకరిస్తూ అదే ఏడాది జూలై 11న నిషేధాన్ని ఎత్తివేశారు.అంటే స్వాతంత్య్రం వచ్చిన రెండు సంవత్సరాల వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్రం లేదు, రాజ్యాంగం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవం లేదు, ఇవేవీ లేకపోయిన తరువాత వారి దేశభక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. దేశంలో అనేక సాంస్కృతిక సంస్ధలున్నాయి. ఏది కూడా ఇలా రాజకీయాలు చేయలేదు. పోనీ స్వాతంత్య్రానికి ముందు తమది స్వచ్చంద సంస్ధ అని చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణ పతాకం బదులు కాషాయ పతాకాన్ని జాతీయ జండాగా ఆమోదించాలని తన పత్రిక ఆర్గనైజర్‌లో 1947 జూలై 17న రాసింది. అదే నెల 22న రాజ్యాంగ పరిషత్‌ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. తరువాత స్వాతంత్య్రానికి ఒక రోజు ముందు ఆగస్టు 14 ఆగస్టు సంచికలో ఆర్గనైజర్‌ జాతీయ జెండా గురించి విషం కక్కింది. కాషాయ పతాకం వెనుక రహస్యం అనేపేరుతో రాసిన వ్యాసంలో ‘ ప్రారబ్దం కొద్దీ అధికారానికి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టి వుండవచ్చు, కానీ దానిని హిందువులెవ్వరూ గౌరవించరు, స్వంతం చేసుకోరు. మూడు అంటేనే కీడు, మూడు రంగులు కలిగిన ఒక జెండా అనివార్యంగా దేశంపై మానసికంగా తీవ్రమైన చెడు ప్రభావాన్ని , వుపద్రవాన్ని కలిగిస్తుంది.’ అని పేర్కొన్నది. పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ రోజైన 1947 ఆగస్టు 14న, 1950 జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌లోని తన ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. తరువాత నిలిపివేసింది. 2001లో రాష్ట్రప్రేమీ యువదళ్‌ పేరుతో వున్న ఒక సంస్ధకు చెందిన బాబా మెంధే, రమేష్‌ కుమార్‌ కాలంబే, దిలీప్‌ చట్టానీ అనే వారు రిపబ్లిక్‌ దినోత్సవం రోజున నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద బలవంతంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు, పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన తరువాత 2013లో విడుదలయ్యారు.ఆ వుదంతం తరువాత 2002 నుంచి అంటే స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాల తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.రాజ్యాంగం, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని రాతపూర్వంగా రాసి ఇచ్చిన సంస్ధ దేశభక్తి ఇది.

     ఇలాంటి వారు ఇప్పుడు రాజ్యాంగంలో లేని భారత మాతాకు జై అంటేనే దేశ భక్తి అని అనని వారు వారు దేశద్రోహులు అని చిత్రిస్తున్నారు. దాన్నొక సైద్ధాంతిక యుద్ధంగా వర్ణించి దానిలో తాము తొలి విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. చరిత్ర పట్ల, జనం జ్ఞాపక శక్తి పట్ల ఎంత చిన్న చూపు.వుల్లికి మల్లికి తేడా తెలియనంత అమాయకంగా జనం వున్నారనుకుంటున్నారా ? మల్లె తోటలో నాటి నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘సంఘపరివార్‌కు అభినందనలు ‘

06 Sunday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

ANTI NATIONAL, BJP, Bjp nationalism, Durga, HRD ministry, JNU, JNU ROW, Mhishasura, nationalism, RSS, sangh parivar

ఎక్కడైతే తమ భావజాలానికి తావివ్వకుండా సాధ్యమైన మేరకు ప్రతిఘటిస్తోందో, దాని సంగతేమిటో తేల్చాలనుకున్నారో , తమ పెత్తనాన్ని రుద్దాలనుకున్నారో అదే జెఎన్‌యులో ఎబివిపి నాయకులు ముగ్గురు తమ నాయకత్వం మీద తిరుగుబాటు చేయటాన్ని ఎవరైనా వూహించారా ?

సత్య

     విస్సన్న చెప్పిందే వేదం అన్నట్లుగా తాము చెప్పిందే అసలైన జాతీయవాదం, దానికి భిన్నమైనది దేశ ద్రోహం అని సంఘపరివార్‌ ఈ దేశ పౌరుల చేత బలవంతంగా అంగీకరింపచేయాలని చూస్తున్నది. దానితో ఏకీభవించినా లేకపోయినా ఒకటి మాత్రం వాస్తవం. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ వుదంతాలపై మొత్తానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌ ప్రసంగపు కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ఎవరిదో గానీ అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్న పాత సినిమా పాటలా అయింది. పెద్ద పెద్ద చదువులు, పట్టాలు పొందటం,పరిశోధనలు చేయటం, తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్లు తప్ప సామాజిక అంశాలపై అసలు చర్చలు, వాదోపవాదాల మధనం లేకుండా నిస్సారంగా, నిస్తేజంగా, తాతగారి నాన్నగారి భావాలకు దాసులుగా తయారవుతున్న మెజారిటీ యువతను మరోమారు మంచి-చెడు చర్చించే దిశగా కాషాయ పరివార్‌ వ్యవహరించింది. అది చెప్పే భావజాలాన్ని అంగీకరించే లేదా వ్యతిరేకించే శిబిరాలుగా సమీకృతం అయ్యే విధంగా జనాన్ని ముందుకు నెడుతున్న సంఘపరివార్‌కు  ‘అభినందనలు’చెప్పాలి.

   మానవ సమాజం ఎప్పుడూ ముందుకే పోయిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. దానిని వెనక్కు తిప్పే శక్తులు ప్రతి తరంలోనూ ప్రయత్నిస్తాయి, ఎదురు దెబ్బలు తింటాయి. అందువలన పురోగమన వాదులెవరూ చర్చకు భయపడరు. మా తాత చెప్పాడు గనుక మానాన్న చేశాడు, మా నాన్న చేశాడు గనుక ఎలాంటి ఆలోచన లేకుండా నేనూ చేస్తున్నాను, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, దాని వలన లాభం సంగతేమో తెలియదు గానీ నష్టం లేదు కదా అనే గొర్రెదాటు పద్దతి ఇటీవలి కాలంలో పెరిగి పోయింది. అలాంటి వారిని సున్నితమైన మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా ఆకట్టుకోవటం సులభం. ప్రపంచంలో ప్రతి తిరోగమన శక్తీ ఈ బలహీనతను వుపయోగించుకొనేందుకు ఎల్ల వేళలా ప్రయత్నిస్తుంది. మన దేశం అందుకు మినహాయింపు కాదు. అలా చేయటం తనకు లాభదాయకమన్న దురాశ అంతర్గతంగా లేకపోతే సంఘపరివార్‌ తన అజెండాను ముందుకు నెట్టదని అనేక గత వుదంతాలు, పరిణామాలు రుజువు చేశాయి. అది శృతి మించి బలప్రయోగానికి దిగినపుడు ప్రతిఘటన ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మన దేశంలో జరుగుతోంది అదే.

   

       జాతీయవాదానికి మన స్వాతంత్య్ర వుద్యమం చెప్పిన అర్ధం, ఆచరణ వేరు.ఇది బానిస బంధాల నుంచి విముక్తి . జర్మన్‌ నాజీ హిట్లర్‌ తన దేశంలో ముందుకు తెచ్చిన జాతీయవాదపు లక్ష్యం, లక్షణం వేరు. అది ప్రపంచ దేశాలను ఆక్రమించుకొనే, కార్మిక వర్గాన్ని అణచేందుకు. స్వాతంత్య్ర వుద్యమ జాతీయ వాదంతో సంఘపరివార్‌ ఏకీభవించలేదు కనుకే అది దూరంగా వుంది. దాని నాయకత్వం బ్రిటీష్‌ ప్రభుత్వానికి సలాం కొట్టి లొంగిపోయింది. హిట్లర్‌ మాదిరి తాను చెప్పే అఖండ భారత్‌ జాతీయ వాదానికి తనదైన భాష్యం, లక్ష్యంతో సంఘపరివార్‌ ఒక మతాన్ని, ఒక పరాయి దేశాన్ని మిళితం చేసి మనోభావాన్ని చొప్పించి యువతను ప్రభావితం చేసేందుకు పూనుకుంది. కేంద్రంలో, పలు రాష్ట్రాలలో తన అధికారాన్ని వుపయోగించి ప్రతి చోటా తన భావజాలాన్ని రుద్ధేందుకు, అలాంటి శక్తులకు స్ధానం కల్పించేందుకు పూనుకుంది. గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర తప్ప పెద్దగా మరో అనుభవం లేని తన సభ్యుడైన ఒక చిన్న నటుడిని ప్రతిష్టాత్మక పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ అధిపతిగా నియమించినదానికి ప్రతిఘటన తలెత్తినపుడు , తరువాత మద్రాస్‌ ఐఐటిలో గుర్తింపు పొందిన పెరియార్‌ అంబేద్కర్‌ అధ్యయన కేంద్రం నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించే కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ ఆకాశరామన్న పేరుతో చేసిన ఫిర్యాదుపై దాని గుర్తింపు రద్దు చేసినపుడు జనం పెద్దగా స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యు వుదంతాలతో ఇప్పుడు మొత్తం చదువుకున్న వారందరూ ఇదేమిటి అని చర్చించకపోయినా ఒక గణనీయ భాగమైనా ఆలోచిస్తున్నది. కొన్ని శక్తులు, సంస్ధలు, వ్యక్తుల గురించి సానుకూల వైఖరితో గుడ్డిగా నమ్మే వారు ఇదేదో తేడాగా వుంది అనుకుంటున్నారా లేదా ? అది చాలు నిజాలేమిటో తెలుసుకొనేందుకు ? ఎక్కడైతే తమ భావజాలానికి తావివ్వకుండా సాధ్యమైన మేరకు ప్రతిఘటిస్తోందో, దాని సంగతేమిటో తేల్చాలనుకున్నారో , తమ పెత్తనాన్ని రుద్దాలనుకున్నారో అదే జెఎన్‌యులో ఎబివిపి నాయకులు ముగ్గురు తమ నాయకత్వం మీద తిరుగుబాటు చేయటాన్ని ఎవరైనా వూహించారా ?

     సంఘపరివార్‌ అసలు తర్కానికి, వాదోపవాదాలకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే అది మా విశ్వాసం అంటారు తప్ప తర్క, హేతుబద్దతకు కట్టుబడే తెగ కాదు. వేదకాలంలోనే మన దగ్గర పైలట్లు, ఇంధనంతో పనిలేని ఖండాంతర విమానాలు వున్నాయి అంటారు. దానికి రుజువు ఏమిటంటే పురాణాల్లో , ఇతిహాసాలలో వుంది, మేం నమ్ముతున్నాం, మా విశ్వాసం అంటారు తప్ప మరో మాట వుండదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో వెల్లడించి దేశాన్ని అగ్రస్ధానంలో వుంచి మేరా భారత్‌ మహాన్‌ అనే పుణ్యం కట్టుకోండి, దేశభక్తులని నిరూపించుకోండి అని ఎవరైనా అంటే మన వేదాలూ, పురాణాలను అపహాస్యం చేస్తున్నారు, మా మనోభావాలను గాయపరుస్తున్నారంటూ దెబ్బలాటలకు దిగుతారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇంత పెద్ద దేశంలో సమాచారం అందుబాటులోకి వచ్చిన తరుణంలో మనోభావాల చాటున తప్పించుకోవాలంటే అంటే నడవదు. వక్రీకరణలు కుదరవు. అందుకే ప్రతి విద్యా సంస్ధ, ప్రతి ఫ్యాక్టరీ, వాణిజ్యసంస్ధ , ఆఫీసు, ఇల్లు , చివరికి ప్రతి మనిషీ ఒక చర్చా కేంద్రం కావాలి. మధనం జరగాలి. వాస్తవాన్ని రాబట్టాలి.

     దుర్గ అంటే మహిషాసురుడిని మర్ధించిన ఒక దేవతగా పురాణాలను బట్టి జనం ఇప్పటి వరకు అనుకుంటున్నారు. అవి పుక్కిటి పురాణాలని కూడా అనుకొనే వారు లేకపోలేదు. తమ వాదనలకు మద్దతుగా వాటి నుంచే వుదాహరణలుగా తీసుకొని ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. పురాణాలకు భిన్నమైన రీతిలో దుర్గ గురించి ఎక్కడా మనకు తెలియదు. ఆమె ఒక వ్యభిచారిణి అని ఒక సంఘం వారు ఒక కరపత్రంలో రాశారని కేంద్ర మంత్రిగారు పార్లమెంట్‌లో చదివి రికార్డులలో ఎక్కించటాన్ని ఏమనాలి. ప్రపంచంలో ఏసుక్రీస్తు, మేరీ, మహమ్మద్‌ ప్రవక్త, రాముడు, కృష్ణుడో మరొక దేవతో దేవుడి గురించో తూలనాడిన వారు చరిత్రలో మనకు ఎందరో కనిపిస్తారు. కానీ అలాంటి వాటన్నింటినీ సేకరించి చట్ట సభల్లో ప్రస్తావించిన ఘనత ప్రపంచంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏకు తప్ప నాకు తెలిసినంతవరకు మరొకరికి దక్కదు. ఎవరైనా వుదాహరణలు చూపితే నా అభిప్రాయాన్ని సవరించుకుంటాను. చట్ట సభలను ఎలా దుర్వినియోగం చేయవచ్చో ఇటీవల కాలంలో అందరూ చూస్తున్నారు. వాటిలో ఇది హైలెట్‌. దుర్గ కల్పిత పాత్రో లేక అనేక మంది నమ్ముతున్నట్లు దేవతా మరొకరా అన్నది వేరే విషయం. ఒక కరపత్రానికి వున్న సాధికారత ఏమిటన్నది ఇక్కడ ప్రశ్న. ఒక పుస్తకమో, ఒక అధికారిక పత్రికో, వెబ్‌సైట్‌లో అలాంటి వర్ణన చేసి వుంటే అది చట్ట ప్రకారం నేరమైతే చర్య తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు. రెచ్చగొట్టటానికి , చిచ్చు పెట్టటానికి ప్రతి మూలనా రోజూ ఏదో ఒక కరపత్రం వెలువడుతూనే వుంటుంది. ఏదో ఒక పేరుతో ఎవరు ఒక కరపత్రం వేస్తే దానిని పార్లమెంట్‌ రికార్డులకు ఎక్కిస్తే వాటికి అంతం ఎక్కడ. అసలు తామా కరపత్రం వేయలేదని మహిషాసుర దినోత్సవ నిర్వాహకులలో ఒకరు చెబుతున్నారు.ఆ వుత్సవం తలపెట్టింది 2014 అక్టోబరులో, అప్పటికి కేంద్రంలో అధికారంలో వున్నది బిజెపి. దుర్గను అలా అమర్యాదకరంగా చిత్రిస్తూ తొలుత ప్రచురించింది యాదవ శక్తి అనే ఒక పత్రిక. దానిపై చర్య తీసుకోవటానికి కేంద్రానికి అధికారం వుంది. దానిని మరొక పత్రిక తరువాత కొద్ది మార్పులతో ప్రచురించిందని సంఘపరివార్‌ అనుయాయులే మరొకవైపు చెబుతున్నారు.మహిషాసుర దినోత్సవం సందర్భంగా ఆ పత్రికను పంపిణీ చేయటంతో ఘర్షణ జరిగి రెండో పత్రికపై కేసు కూడా నమోదైంది. నాటి వుదంతానికి ఇప్పుడు జెఎన్‌యు ఘటనలకు లంకెపెట్టి పార్లమెంట్‌లో ప్రస్తావించటం దురుద్ధేశం, ఎన్నికలలో లబ్దికోసం ప్రచార ఆస్త్రంగా చేయటం తప్ప మరొకటి కనిపించటం లేదు.

   రెండవది మంత్రి అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. మహిషాసుర దినోత్సవాన్ని జరపటాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదా లేక దుర్గను కించపరచటాన్ని తప్పుపడుతున్నారో స్మృతి ఇరానీ స్పష్టం చేయాలి. దుర్గను కించపరచటంపై కావాలంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చు. మహిషాసుర దినోత్సవాన్ని వ్యతిరేకించటం అంటే భిన్నత్వాన్ని , మరొక అభిప్రాయాన్ని అణచివేయటం తప్ప మరొకటి కాదు. అసలు ఏ మాంసం తినని వారు ఈ దేశంలో చాలా మంది వున్నారు. అనేక మంది మహిళలు తాము తినకపోయినా ఇంట్లో తినేవారు వుంటే వండి పెట్టటం లేదా ? తినేవారిని అడ్డుకోవటం లేదే !అలాంటపుడు గొడ్డు మాంసం తినే వుత్సవం జరపాలని తినే వారు అనుకుంటున్నపుడు దానిని ప్రతిఘటించాల్సిన అవసరం ఏముంది. ఇష్టం లేకపోతే తినటం మానుకోవాలి లేదా ఆ పరిసర ప్రాంతాలకు ఆ సమయంలో దూరంగా వుండవచ్చు. గణేష్‌ వుత్సవాలు, దసరా వుత్సవాల పేరుతో పెద్ద పెద్దగా లౌడ్‌ స్పీకర్లు పెట్టటం, వూరేగింపుల పేరుతో రవాణాకు ఆటంకం కలిగించటం కొంతమందికి నచ్చదు.అర్ధరాత్రి అపరాత్రి వరకు భారీ సౌండ్‌తో ప్రార్ధనా స్ధలాలలో మైకులు పెడితే చుట్టుపక్కల విద్యార్ధులు, రోగులకు ఎంత ఇబ్బంది. అయినా చేయగలిగిందేమీ లేదు మన ఖర్మ అనుకొని అలాంటి వారు వాటికి దూరంగా తప్పుకుంటున్నారు తప్ప అడ్డుకోవటం లేదే? మహిషాసుర లేదా రావణలీల వుత్సవాలు జరపటం దేశ ద్రోహమా ? జరుపుకోనివ్వండి ఎవరికి నచ్చిన వారిని వారు అభిమానిస్తారు ! అసలు ఏ దేవుడు, దేవతను , రాక్షసులను నమ్మనివారిని కూడా పౌరులుగా దేశ రాజ్యాంగం గుర్తించిందని మర్చిపోతున్నారా ?

     ప్రపంచంలో ప్రతి మతం వాటి దేవతలు, ప్రవక్తల గురించి నిందలు వేయటం కొత్త విషయం కాదు. వాటిని సమాజం పెద్దగా పట్టించుకోదన్నది కూడా వాస్తవం. కొన్ని సందర్బాలలో కొన్ని శక్తులు పధకం ప్రకారం వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పూనుకుంటాయి. క్రైస్తవంపై తిరుగుబాటు నుంచి ఇస్లాం మతం ఆవిర్బవించింది. దాని ప్రవక్త మహమ్మద్‌కు విగ్రహారాధనపై విశ్వాసం లేదు, అందువలననే మక్కాలోని విగ్రహాలన్నింటిని ధ్వంసం చేయించారని చెబుతారు. ఐరోపా దేశాలలోని కొన్ని శక్తులు ముస్లింల ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేసేందుకు ఏకంగా ప్రవక్త బొమ్మలు గీయటం అన్నది ప్రతి శతాబ్దంలో ఎక్కడో అక్కడ జరుగుతూనే వుంది. అలాంటి సందర్బాలలో నిరసన వ్యక్తం అవుతోంది. తరువాత ఎవరి జీవన క్రియల్లో వారు వుంటారు. దేవుళ్ల గురించి హేతువాదులు అనేక విమర్శలు చేశారు, తమ తర్కం ప్రకారం ప్రశ్నలు లేవనెత్తారు.వేమన ఇంకా అనేక మంది తమ రచనల్లో ఆచారాలు, మూఢనమ్మకాలు మొదలైన వాటిని చీల్చి చెండాడారు. అంతకు ముందు చార్వాకులు, లోకాయతులు దేవుడు, దేవతల వునికిని ప్రశ్నించారు. ఇప్పుడూ ఎవరైనా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. అంతే తప్ప దుర్గ గురించి మరొక దేవత గురించి ఎవరైనా అసభ్యంగా చిత్రించి, వర్ణించి వారిపై విశ్వాసం పొగొట్టగలమని, లేదా మహిషాసురుడు మరొకరి మీద ప్రేమపెంచగలమని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. నేలవిడిచి సాము చేయటం తప్ప మరొకటి కాదు. విమర్శ సభ్యతతో కూడినదిగా వుండాలి. శైవ-వైష్ణవ మతాల మధ్య మధ్యయుగాలలో ఎంతటి శతృత్వం వుందో ఆ కాలపు రచయితలు రాసిన గ్రంధాలలో సవివరంగా వుంది. విష్ణాలయంలో మోగే గంటను విన్న శివభక్తుడు శ్వపచుడితో (కుక్క మాసం తినేవారితో)సమానం అని శివపురాణంలో రాశారు.ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో కుక్క మాంసం తినేవారు ఇప్పటికీ వున్నారా లేదా ? మరి వారు నాటి పురాణాలు మా మనోభావాలను దెబ్బతీశాయని అంటే ఏం చెబుతారు ? ప్రపంచంలో అనేక దేశాలలో దాన్ని తినేవారు వున్నారు. ఇటీవలి కాలంలో దానిని కూడా వివాదాస్పదం చేశారు.కృష్ణుడి చోర చర్యలను, శృంగారం భక్తులకు పరవశం కలిగిస్తుంది. హేతువాదులకు జారత్వం, చోరత్వం కనిపిస్తుంది, అలాంటి విమర్శలు చేసినంత మాత్రాన కృష్ణ భక్తులందరూ పార్లమెంట్‌లో వాటిని పట్టుకొని చర్చిస్తారా ? అలాగే ప్రతి మతావలంబకులూ పార్లమెంట్‌ను మత విశ్వాస ప్రదర్శన సభగా మార్చివేస్తారా ?

     సృష్టి కర్త దృష్టిలో అందరూ సమానమే అని ఒకవైపు చెబుతారు, మరో వైపు అదే కర్త అందరినీ దేవతలుగా సృష్టించ కుండా కొందరిని రాక్షసులుగా పుట్టించటమెందుకు ? వారి చేత ముందు దేవతలను చావ చితక కొట్టించటం ఎందుకు, అంతా అయిపోయాక వారిని హతమార్చటానికి కొత్త శక్తులను సృష్టించటం ఇవేగా ప్రతి పురాణ సారాంశం. అలా ఎందుకు అంటే లీలా మానుష వినోదం అని టక్కున సమాధానం.అలాగే దుర్గ కూడా కొందరి నిందలకు గురికావటం కూడా అదే అని అలా రాసి పెట్టి వుందని ఎవరి పాపాన వారు పోతారులే అని ఎందుకు ఊరుకోరు ? వుదాహరణకు మహిషాసురుడినే తీసుకుందాం. మైసూరు ఆయన పేరునుంచే పుట్టిందండోయ్‌(మహిషాసుర వూరు మైసూరు అయిందట). జన్మ అంటూ ఎత్తిన తరువాత దానికి పరమార్ధం వుండాలంటారు. అదేమిటో ప్రతి యుగంలో దేవుడి, దేవత హయాంలో రాక్షసులు వారి చేతిలో చావటానికే పుట్టినట్లు అన్ని కధలూ చెబుతాయి. సత్య యుగంలో అందరూ ఒకటే అన్నారు కనుక మనకు రాక్షసులు కనిపించరు. త్రేతాయుగం, ద్వాపరయుగాలలోనే వారు దర్శనమిస్తారు, ధర్మం ఒంటి పాదంలో నడుస్తుందని చెబుతున్న కలియుగంలో మనకు ఎక్కడా కనపడరు. రాక్షసుల వలన జరిగేది యుద్ధాలు తప్ప లోక కల్యాణమేమీ లేదని త్రేతా యుగంలోనే తెలిసిపోయింది కనుక సృష్టి కర్త ద్వాపర యుగంలో అయినా రాక్షసుల సృష్టి నిలిపివేయాలి కదా ఎందుకా పనిచేయలేదు? రాక్షసులు లేకపోతే దేవతలకు గుర్తింపు వుండదనా ? అందువలన విశ్వాసులూ వుద్రేకాలను తగ్గించుకొని వెనుకా ముందూ చూసుకొని స్పందించాలి. చరిత్రలో లోకాయతులూ, చార్వాకులే ఎంతో హుందాగా విమర్శలు చేశారు, వారి వాదనల్లో తర్కం వుంది. మతశక్తులే పరమతాలను, తాము అంగీకరించని దేవతలను బండబూతులు తిట్టాయి. అందువలన లోకాయతుల వారసులు అనుకొనే వారు ఎవరినీ కించపరచకుండా, సభ్యతగా ప్రవర్తించటం ద్వారానే ఎక్కువ మందిని ఆ భావజాలంవైపు కర్షించగలం అని గుర్తిస్తే మంచిదేమో ఆలోచించండి. ఏమైనా ఇలాంటి చర్చలు జరిగేందుకు తెరతీసిన సంఘపరివార్‌కు మరోసారి ‘అభినందనలు’ చెప్పకుండా వుండగలమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీగారూ పాచి పాటతో బోర్‌ కొట్టిస్తున్నారు !

22 Monday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, BJP, Bjp nationalism, JNU, JNU ROW, Media, Narendra Modi, RSS

ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

ఎం కోటేశ్వరరావు

       ప్చ్‌ ! నరేంద్రమోడీ కూడా నిరాశపరుస్తున్నారు. ఆదివారం నాడు ఒడిషాలో మోడీ పాడిన పాచి పాత పాట జనానికి బోర్‌ కొట్టింది. ప్రతివారికీ పదిహేను లక్షల నల్లధన సొమ్ము పంపిణీ, దేశమంతటా గుజరాత్‌ నమూనా విస్తరణ మాదిరి కిక్కిచ్చే కొత్త అంశాలు ఇంకా తమ మహా మౌనబాబా నోటి నుంచి వెలువడతాయని అభిమానులు ఎదురు చూస్తుంటే తన అంబుల పొదిలోంచి పాతపడిన, పదునులేని బాణాలు బయటకు తీస్తున్నారు.అదేదో సినిమాలో డైలాగు మాదిరి ఇదేం చాలా బాగోలేదు, వ్యతిరేకులను ఎలాగూ ఎదుర్కోలేరు, కనీసం భక్తులకు అయినా నమ్మకం కలిగించాలి కదా. ఇందిరా గాంధీ తన పాలన ఇబ్బందుల్లో పడినపుడు, ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్నపుడల్లా తన ప్రభుత్వానికి విదేశీ హస్తం నుంచి ముప్పు వుందని చెప్పేవారు, ముఖ్యంగా 1975లో అత్యవసర పరిస్ధితి విధించబోయే ముందు ఈ మాటలు ఎక్కువగా చెప్పారు. నాడు జనసంఘం ముసుగులో వున్న నేటి బిజెపి నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు, ఆ హస్తాన్ని బయట పెట్టమని అడిగేవారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ఒడిషాలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని, ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చేసిన ఆరోపణ నరేంద్రమోడీకి అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకయ్య నాయుడి మూస ప్రాసలో చెప్పాలంటే రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడిలా మరోసారి ఇందిరా గాంధీని జ్ఞప్తికి తెచ్చింది. ఇలా అయితే మనం గతంలో కాంగ్రెస్‌ను ఏడిపించినట్లుగా ఇప్పుడు వారు మనల్ని కూడా ఆడుకుంటారు సార్‌ అని మోడీ అభిమానులు లోలోపలే మధన పడుతున్నారు. మంత్రసానితనానికి అంగీకరించిన తరువాత ఏదొచ్చినా పట్టక తప్పదు మరి. దేశంలో అత్యవసర పరిస్ధితి పునరావృతమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని గతేడాది జూన్‌లో బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అది కచ్చితంగా నరేంద్రమోడీని వుద్దేశించే చేశారని లోకం కోడై కూసింది. మోడీ ఆరోపణ దానిలో భాగమేనా ? ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

      గత ఇరవై నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైంది. రానున్న రోజులలో మరింత తిరోగమనం తప్ప పురోగమన దాఖలాలు కనిపించటం లేదు. పెట్టబోయే బడ్జెట్‌ కూడా అంత ఆకర్షణీయంగా వుండబోదని ముందే వార్తలు వెలువడుతున్నాయి. వేతన సంఘసిఫార్సులను వుద్యోగులు అంగీకరించటం లేదు. ఈ స్ధితిలో కాషాయ మార్కు జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి కొంతకాలం జనం దృష్టిని మరల్చాలి. అందుకు తగిన అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యులో జరిగిన సభలు, వాటి పర్యవసానాలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వాటిని వుపయోగించుకోకుండా ఏ విఫల అధికారపక్షమైనా ఎలా వుంటుంది. అయితే బిజెపి ఈ బస్సు కూడా మిస్సయినట్లే. కానీ ఒకందుకు మాత్రం బిజెపి మేథోచెరువులో ఈదులాడుతున్న వారిని అభినందించాలి. తిను,తాగు, తిరుగు అనేవి తప్ప దేశంలో వేరే ఇజాలేవీ లేవు అన్న వాతావరణం పెరిగిపోయి యువత అనేక విధాలుగా క్షీణ సంస్కృతి ప్రభావానికి లోనవుతున్న దశలో వారికి తెలియకుండానే ఒక సైద్ధాంతిక చర్చకు దోహదం చేశారు. ఢిల్లీ జెఎన్‌యులోని ఎబివిపి నాయకుల నుంచే తమకు ఎదురు దెబ్బ తగులుతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. మేకతోలు కప్పుకున్న పులి వంటి సంఘపరివార్‌ సంస్ధల నైజం తెలియక లేదా వారే అసలైన దేశభక్తులనే ప్రచారం నిజమే అని నమ్మిగాని లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో గాని అనేక మంది దాని అనుబంధ సంస్ధలలో చేరుతున్నారు, మద్దతతు ఇస్తున్నారు. అయితే వారందరూ శాశ్వతంగా వాటితోనే వుండిపోతారనుకుంటే భ్రమే. ‘జెఎన్‌యులో ప్రస్తుత సంఘటన, మనుస్మృతిపై పార్టీలో కొనసాగుతున్న దీర్ఘకాల విబేధాలతో పాటు రోహిత్‌ వేముల ఘటన.ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విశ్వవిద్యాలయంలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరం.అవి గుండెలు పగిలేలా వున్నాయి.వాటికి కారణమైన వారిని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్షించాల్సిందే……విద్యార్ధి లోకంపై అణచివేతకు దిగిన ప్రభుత్వానికి మేం బాకాలుగా వుండలేం. ప్రభుత్వానికి చెందిన ఓపి శర్మ వంటి శాసనసభ్యుడు పాటియాలా కోర్టులో గానీ, జెఎన్‌యు వుత్తర గేటు వద్దగానీ చేసిన దాడులు మితవాద ఫాసిస్టు చర్యకు నిదర్శనం…..’ అని నిరసన తెలిపిన ఏబివిపి విద్యార్ధి నాయకులు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ముగ్గురే కావచ్చు కానీ వారి ప్రకటన సంఘపరివార్‌కు తగలరాని చోట తగిలిన దెబ్బ.

     ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు కొన్ని టీవీ ఛానల్స్‌ తప్పుడు వార్తల ఆధారంగా తప్పుడు కేసులతో 1975 నాటి అత్యవసర పరిస్థితి మాదిరి వ్యవహరించటం, సంఘపరివార్‌ శక్తులు పాటియాలో కోర్టులో విద్యార్ధులు, జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసినా, సుప్రీంకోర్టు స్పందించినా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు. గతంలో కూడా పలు వుదంతాలలో ప్రధాని బిజెపికి జరిగే నష్ట నివారణ చర్యలలో భాగంగా నోరు విప్పారే తప్ప సకాలంలో ఎన్నడూ స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజెపి నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరుతో ప్రతిష్టను కోల్పోయిన బిజెపిని ఇప్పుడు జెఎన్‌యు వుదంతాలు మరింతగా దెబ్బతీశాయి. అయినా ఎదురుదాడులతో జనం నోరు మూయించాలని చూస్తున్నారు. తమ ప్రభుత్వ చర్యను తాము సమర్ధించుకొనే ధైర్యం లేక తమ కనుసన్నలలో మెలిగే మాజీ సైనికులను ఢిల్లీ వీధులలో ప్రదర్శనలు చేయించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు మరిన్ని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు, పార్లమెంట్‌ సమావేశాలలో ఎదురుదాడికి దిగేందుకు బిజెపి నిర్ణయించినట్లుగా ఒడిషాలో మోడీ ఆరోపణలు వున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలకు విదేశీ నిధులు వస్తున్నాయని తమ ప్రభుత్వం దానిని తప్పుపట్టకపోయినా లెక్కల్ని అడగటం ప్రారంభించేసరికి వారంతా కలసి మోడీని కొట్టండి, మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.

     స్వచ్చంద సంస్ధలకు విదేశాల నుంచి వస్తున్న నిధుల గురించి ఒక శ్వేత పత్రం సమర్పించటానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలూ వున్నాయి. అసలెన్ని సంస్ధలున్నాయి, వాటికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాటికి లెక్కలు చెప్పమని ఎన్నింటిని కేంద్రం అడిగిందీ, ఎన్ని జవాబిచ్చాయి. ఏవేవి ప్రధానిని కొట్టమని చెబుతున్నాయో ప్రకటిస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి. నిధులు రావటాన్ని తప్పు పట్టవద్దని అసలు ఎవరు అడిగారు, అడిగితే వూరుకుంటారా ? ఇరవై నెలలు గడిచినా ఏ చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? ఇప్పుడెందుకు తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని చీకట్లో బాణాలు వేస్తున్నట్లు ? ఇంత పెద్ద దేశంలో లెక్కలు చెప్పని కొన్ని స్వచ్చంద సంస్ధలు కుట్రలు చేస్తే పడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్‌ వుందా ? ఒక బూచిని చూపి ప్రజల దృష్టిని మళ్లించటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.

      ఆర్ధిక, పాలనా రంగాలలో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి రానున్న పార్లమెంట్‌ సమావేశాలలో తప్పించుకోవాలని చూస్తున్నది.ఒకవేళ నిజంగా అదే జరిగితే దీనిలో కూడా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయం. జనసంఘం నుంచి జనతా తరువాత భారతీయ జనతా ఏ పేరు పెట్టినా అది సంఘపరివార్‌ రాజకీయ ప్రతినిధిగానే పని చేసింది. జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో హిట్లర్‌,ముస్సోలినీ వంటి ఫాసిస్టులు కూడా జాతీయ వాదం పేరుతో జనాన్ని రెచ్చగొట్టారు.జాతీయోద్యమాలు పరాయిపాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వుద్యమాలు. అవి దేశ స్వాతంతంత్య్రాలకు దారితీశాయి. కానీ నియంతల జాతీయ వాదాలు ప్రభుత్వ వ్యతిరేకుల అణచివేతలకు, ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. హిట్లర్‌ తన జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీపై రుద్దిన ఒప్పందాలతో పాటు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. అందుకే ఈనాడు ఐరోపాలో ఎవరైనా జాతీయవాదాన్ని ముందుకు తెస్తే దానిని ఫాసిజంగా భావించి జనం ఛీకొడుతున్నారు. ఐరోపాలో జాతీయ వాదం అంటే బూతుపదం కన్నా నీచంగా చూస్తారు. దేశంలో వువ్వెత్తున జాతీయోద్యమం జరిగినపుడు సంఘపరివార్‌ శక్తులు దూరంగా లేదా వ్యతిరేకంగా, చివరికి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపాయి. అందుకు సావర్కర్‌ లేఖ తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు జాతీయ వాదం పేరుతో ఎక్కడలేని దేశభక్తిని తామే కలిగి వున్నట్లు ఫోజు పెడుతున్నాయి.ఈ జాతీయ వాదం ఏ వలస దేశానికి వ్యతిరేకం? సంఘపరివార్‌ ఆదిపురుషులు జాతీయవాదం ఏమిటంటే హిందూయిజమే జాతీయ వాదం,జాతీయ వాదమంటే హిందూయిజం అని ఎప్పుడో నిర్ధారించారు. హిట్లర్‌ యూదు , కమ్యూనిస్టు వ్యతిరేకత మాదిరి భారత్‌లో ఇస్లాం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ పరివార్‌ పూనుకుంది. అందువలన ఏది సిసలైన జాతీయత? ఇప్పుడు కావాల్సింది ఏమిటి అనే చర్చ జరగటం అనివార్యం, ఆరోగ్యకరం కూడా. ఎవరి రంగు ఏమిటో తెలిసి పోతుంది.ముస్లింలను వ్యతిరేకించటం, పాకిస్తాన్‌ను తిట్టిన వారే జాతీయ వాదులుగానూ కానటువంటి మిగతా వారందరినీ జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారు. అందువల్లనే కమ్యూనిస్టులు కానటువంటి రాజదీప్‌ సర్దేశాయ్‌, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులు తాము జాతీయ వాదులం కామని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియాలో జాతీయత, బిజెపి కుహనా జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.

      మీడియాలో సంఘపరివార్‌కు తోడ్పడే శక్తుల బండారం గూడా ఈ సందర్బంగా బయట పడింది. తాము నిష్పాక్షికం అని చెప్పుకున్నంత మాత్రాన ఆచరణలో అలా వుండరని అనేక ఛానళ్లు, పత్రికలు జెఎన్‌యు వంటి వుదంతాల సందర్భంగా తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాయి. స్థూలంగా కాషాయపరివార్‌ జాతీయ వాదాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా రెచ్చగొట్టే శక్తులు, బిజెపి జాతీయవాదాన్ని అంగీకరించకుండా వాస్తవాలను, వాస్తవాలుగా పాఠకులు ముందుంచే వారిగా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. రానున్న రోజులలో ఇది మరింత స్పష్టం కానుంది.సంఘపరివార్‌ చర్యలు,అజెండాతో మీడియాలో ఇంకే మాత్రం కాషాయ పులులు మేకతోళ్లు కప్పుకొని వుండలేని పరిస్ధితి.తమ ఛానల్‌ జెఎన్‌యు వుదంతంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ రాజీనామా చేయటం మీడియాలోని పరిస్ధితికి దర్పణం.వార్తలపై ఎవరైనా ఎటువంటి అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు. కానీ వృత్తికే కళంకం తెచ్చేలా వీడియోలను తారు మారు చేయటం దుర్మార్గం. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని కొందరు జెఎన్‌యు విద్యార్ధులు నినదించినట్లు చూపిన వీడియోలో మార్పులు జరిగాయి.దురభిమానాల కారణంగా భారతీయ కోర్టు జిందా బాద్‌ అన్న నినాదం కాస్తా పాకిస్తాన్‌ జిందాబాద్‌గా మారిపోయిందని విశ్వదీపక్‌ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా కొందరి జీవితాలు, వారి ఆశలు, కుటుంబాలను ప్రమాదపుటంచులలోకి నెట్టారని ఆయన వాపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులా లేక కిరాయి హంతకులా అనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే అసలు మనం జర్నలిస్టులమేనా అన్న ఆశ్చర్యానికి తాను లోనుకావటం ప్రారంభమైందని కూడా ఆవేదన చెందారు. ‘ హింసాకాండను రెచ్చగొట్టటానికి, మరియు జనాన్ని దేశద్రోహులు, లేదా జాతి వ్యతిరేకులు అని పిలవటానికి ,మాట్లాడటానికి గాక బెదిరించటానికి మనం టీవీని అనుమతించాలా అని ఎన్‌డిటివి చెందిన రవీష్‌ కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. పాటియాల కోర్టుల భవనం వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కొందరు జర్నలిస్టులు ప్రదర్శన చేస్తే దానికి సంబంధించిన వార్తల విషయంలో అత్యవసర పరిస్ధితి నాటి స్పందన కనిపించింది. ఆరోజులలో కొన్ని మీడియా సంస్ధలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కొన్ని అనుకూలబాకాలుగా వ్యవహరించాయి. అనేక మంది జర్నలిస్టులు దేశానికి విధేయులుగా వుండాలా ఒక రాజకీయ వైఖరి, వ్యవస్దకు విధేయులుగా వుండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని యాజమాన్యాల కారణంగా జర్నలిస్టులు కూడా ఏ సంస్ధలో వుంటే అది అభిమానించే పార్టీల ప్రతినిధుల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎటు అన్నది తేల్చుకొనే విధంగా సంఘపరివార్‌ ఎగదోస్తున్నది. ఆ విభజన తమకు లాభం అనుకుంటున్నది. జర్మనీ, ఫాసిస్టు హిట్లర్‌ పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరైనా మూర్ఖంగా, మొరటుగా నిప్పును చేత్తో పట్టుకుంటామంటే చేసేదేముంది, పట్టుకొని చూడమని చెప్పటమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ?

17 Wednesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, Anti communist, ANTI NATIONAL, BJP, democracy, JNU, JNU ROW, RSS, students

ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో  సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి.

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అణచేపేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అణచివేత వైఖరి బంగారం లాంటి ఒక యువశాస్త్రవేత్త వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైంది.ఈ వుదంతంపై జరుగుతున్న ఆందోళన ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. ఒక వుదంతం జరిగితే దాన్నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నది సమాజం నేర్పిన పాఠం. హైదరాబాదు వుదంతం నుంచి కేంద్రం ప్రభుత్వం ఏమి నేర్చుకున్నది? తన భావజాలానికి వ్యతిరేకులుగా వున్న వారిని అణచివేసేందుకే ముందుకు పోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగమే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో వామపక్ష భావజాలం వున్న విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలపై దేశద్రోహ ముద్రవేసి అరెస్టులకు పూనుకున్నది. దానిలో భాగంగానే విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తదితరుల అరెస్టు. హైదరాబాదు వుదంతంలో స్ధానిక ఎంఎల్‌ఏ,ఎంఎల్‌సిలు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ లేఖలు, ఇతర రూపంలో విశ్వవిద్యాలయ అధికారులపై వత్తిడి, ఏబివిపి విద్యార్ధులతో అసత్య కేసుల నమోదు వంటి పనులు చేశారు. న్యూఢిల్లీలో ఏకంగా బిజెపి ఎంఎల్‌ఏ ఒపి శర్మ కోర్టుకు వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఏకంగా పోలీసుల సమక్షంలో చేయి చేసుకున్నాడు. అంతే కాదు తనకు చిన్నప్పటి నుంచి జాతి వ్యతిరేకులుగా వున్నవారిపై దాడి చేయటం అలవాటని ఆ పెద్దమనిషి సమర్ధించుకున్నాడు.అంటే అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటమే కాదు, తమతో విబేధించేవారిపై సంఘపరివార్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగా గూండాగిరీ చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారనుకోవాలా ? ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్బంగా భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ ఇతర వారి అనుబంధ సంఘాల కార్యకర్తలు వీధులు, పార్కుల వెంట తిరిగి అనుమానం వచ్చిన యువతీ యువకులను కొట్టటాన్ని మాత్రమే చూశాము.ఇప్పుడు వారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు.జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రతి ప్రదర్శన చేశారు. అలాంటి వారికి కేంద్రంగా వుందంటూ పనిలో పనిగా అసలు ఆ విశ్వవిద్యాలయాన్నే మూసివేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

జెఎన్‌యులో ఏం జరిగింది? అసలు జాతి వ్యతిరేకత అంటే ఏమిటి? అన్నది ప్రతివారిలోనూ వస్తున్న సందేహం? విద్యార్ధులు ఏవైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాలా లేక జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైళ్లకు పంపాలా ? ‘ఫిబ్రవరి తొమ్మిది రాత్రి నిజంగా ఏం జరిగింది ?’ అనే శీర్షికతో హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక ఫిబ్రవరి 16న ఒక విద్యార్ధి కధనాన్ని ప్రచురించింది. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్ష పడిన అప్జల్‌ గురు స్మారకార్ధం ‘ఏ కంట్రీ వితౌట్‌ పోస్టాఫీసు’ అనే పేరుతో ఒక విద్యార్ధి సంఘం ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసింది. దాని గురించి హర్షిత్‌ అగర్వాల్‌ అనే విద్యార్ధి క్వోరా వెబ్‌సైట్‌లో రాసిన అంశాలను హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది.’ ఫిబ్రవరి తొమ్మిదిన డిఎస్‌యు అంటే డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో వ్యవహరించే విద్యార్ధి సంఘం ఒక సాంస్కృతిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు పేర్కొన్నట్లుగా కాశ్మీరీ పౌరుల ప్రజాస్వామిక హక్కయిన స్వయంత్రిపత్తి పోరాటానికి మద్దతుగా మరియు న్యాయవ్యవస్ధ హత్యకు గురైన అప్జల్‌ గురు మరియు మక్బూల్‌ భట్ల సంస్మరణగా ఆ సభ జరిగింది. క్యాంపస్‌(జెఎన్‌యు)లోని మరియు వెలుపలి నుంచి పెద్ద సంఖ్యలో కాశ్మీరీ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.’ డిఎస్‌యు మావోయిజాన్ని నమ్మే విద్యార్ధులతో కూడిన ఒక చిన్న వుగ్రవాద వామపక్ష సంస్ద. వారు ఏ అర్ధంలో చూసినా టెర్రరిస్టులు గానీ నక్సల్స్‌గానీ కాదు. నేను రెండు సంవత్సరాలకుపైగా కాంపస్‌లో వుంటున్నాను. వారు ఎప్పడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడటం గురించి రాజ్యాన్ని కూలదోయటానికి ఒక రాయి వేయటం వంటివిగానీ నేను చూడలేదు. వారి మీటింగ్‌ ప్రారంభం కావటానికి 20 నిమిషాల ముందు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ అధికారయంత్రాంగానికి ఒక లేఖ రాసింది.కాంపస్‌ వాతావరణానికి హానికరం గనుక ఆ సమావేశానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరింది. ఘర్షణలు జరుగుతాయనే భయంతో అధికారయంత్రాంగం అనుమతి నిరాకరించింది. జెఎన్‌యు అన్ని రకాల గళాలను వినటానికి ఒక అనువైన ప్రజాస్వామిక భావనల కేంద్రం. భావాలు తీవ్రవాదంతో కూడినప్పటికీ వ్యక్తం చేయటాన్ని గౌరవిస్తారు. ఇపుడు ఎబివిపి అటువంటి దాన్ని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో తమ సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి. సభజరగాల్సిన బ్యాడ్‌మింటన్‌ కోర్టు వద్దకు అధికార యంత్రాంగం భద్రతా సిబ్బందిని పంపింది. అయితే మైకులను వినియోగించటానికి మాత్రం అనుమతి నిరాకరించింది. అందుకు నిర్వాహకులు అంగీకరించి మైకులు లేకుండానే సభ జరుపుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎబివిపి తన కార్యకర్తలను సమీకరించి హాజరైన విద్యార్ధులు, నిర్వాహకులను బెదిరించటం ప్రారంభించింది. ఏ కాశ్మీర్‌ హమారా హయ్‌, సారా కా సారా హయ్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా సభ నిర్వాహకులు హమ్‌ క్యా చాహతే అజాదీ అని నినాదాలు చేశారు.తరువాత తుమ్‌ కితనే అఫ్జల్‌ మారోగె, హర్‌ ఘర్‌ సె అఫ్జల్‌ నికేగా అని నినదించారు. జెఎన్‌యు బయటి నుంచి వచ్చిన కాశ్మీరీ విద్యార్ధుల బృందం ఒకటి సభకు వచ్చిన వారి మధ్యలో ఒక వలయంగా ఏర్పడ్డారు. నన్ను నమ్మండి వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారు లేరు. ఆ కార్యక్రమం సందర్బంగా నేను కొద్ది సేపు వున్నాను. వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారిని నేను గుర్తించలేదు. దశాబ్దాల తరబడి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట అణచివేతకు గురైన కాశ్మీరీ విద్యార్ధులు ఏబివిపి వారిని చూడగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. నేను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జెఎన్‌యులో వున్నాను. అటువంటి నినాదాలు నేను ఎక్కడా వినలేదు, డిఎస్‌యును మినహాయిస్తే ఏ వామపక్ష పార్టీ భావజాలానికి దగ్గరగా లేవు. పాకిస్ధాన్‌ జిందాబాద్‌ అనే నినాదానికి సంబంధించి అది వివాదాస్పాదం. నేను అక్కడ వున్నంత వరకు ఆ నినాదాన్ని వినలేదు. అటువంటి నినాదం చేసినట్లు ఒక వీడియో వుంది. అయితే అది స్పష్టంగా లేదు, కాశ్మీరీ విద్యార్ధులు చేశారా లేదా ఎబివిపి కుట్ర అన్నది తెలియటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘనాయకుడు కనయ్య కుమార్‌ ఎలాంటి నినాదాలు చేయలేదు.అతను ఎఐఎస్‌ఎఫ్‌( సిపిఐ విద్యార్ధి విభాగం) సభ్యుడు మావోయిస్టు లేదా వేర్పాటు వాదానికి వారు వ్యతిరేకం’ అని అగర్వాల్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ సమస్య ఏబివిపి అభ్యంతర పెట్టినా అడ్డుకున్నా ఆ సభ జరిగింది. సభ జరగటానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు సహకరించాయనే దుగ్డతో ఎలాగైనా నిరంకుశ,అణచివేత చర్యల ద్వారా వారిని బెదిరించాలి, విశ్వవిద్యాలయంలో తమ పలుకుబడిని పెంచుకోవాలన్నది తప్ప మరొకటి కనిపించటం లేదు. పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయించటాన్ని దేశ, విదేశాలలో లోని అనేక మంది విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పలు సంస్ధలు దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేకం పేరుతో తమ వ్యతిరేకులను, ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. ప్రజాస్వామిక పద్దతులలో చర్చల ద్వారా ఒప్పించి తమ భావాలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, మద్దతుదార్లను కూడగట్టుకోవచ్చు. కానీ తమ వాదనలో పసలేనపుడు ఎదుటివారిపై భౌతికదాడులకు దిగి నోరు మూయించటం ప్రజాస్వామ్యమా ? ఫాసిజమా ? జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు ఇస్తున్నందుకు ఢిల్లీలోని సిపిఎం కేంద్రకార్యాలయంపై దాడికి ప్రయత్నించటం, తరువాత పాటియాల కోర్టు ఆవరణలో బిజెపి ఎంఎల్‌ఏ నాయకత్వంలో పరివార్‌ మద్దతుదారులైన న్యాయవాదులు కూడా నల్లకోట్లు వేసుకొని విద్యార్ధులు, అధ్యాపకులు, వార్తల సేకరణకు వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేయటం, మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా దాడులకు దిగటం ప్రమాదకర పోకడలకు నిదర్శనం.

అఫ్జల్‌ గురువంటి వుగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేయటం ద్వారా వుగ్రవాదులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అవమానించటమే అని వారి త్యాగాలను అపహాస్యం చేయటమే అని మనోభావాలను రెచ్చగొడుతూ తమ తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది.పంజాబు, కాశ్మీరులలో అమెరికా కుట్రలో భాగంగా పాకిస్ధాన్‌ కేంద్రంగా వున్న వుగ్రవాదులు జరిపిన దాడులలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలలో వారిని ఎదుర్కొని ఎందరో నాయకులు, కార్యకర్తలను కోల్పోయిన సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు , అకాలీదళ్‌ తప్ప దేశభక్తి,దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకొనే బిజెపి , ఇతర పార్టీలకు చెందిన వారు ఎందరున్నారో చెప్పమనండి. బిజెపి కుహనా (నకిలీ) దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేక పోరాట బండారం గురించి గతేడాది జూలైలో మన రిసర్చ్‌ మరియు ఎనాలసిస్‌ వింగ్‌( రా)లో పనిచేసిన మాజీ అధికారి ఎఎస్‌ దౌలత్‌ గతంలో బిజెపి అధికారంలో వున్నపుడు 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ వుదంతంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. వందలాది మంది పౌరుల, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన వుగ్రవాదులతో రాజీపడిన వాజ్‌పేయి సర్కార్‌ ముగ్గురు కరడు గట్టిన తీవ్రవాదులను విడుదల చేసింది. పోనీ విమాన ప్రయాణీకుల ప్రాణాలు కాపాడేందుకు ఆ పనిచేసిందని సరిపెట్టుకోవచ్చు.కానీ పాకిస్ధాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజబుల్‌ ముజహిదీన్‌ అధిపతి సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడికి 1999లో బిజెపి ప్రభుత్వం మనదేశంలోని ఒక మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించటం దేశ భక్తా, వుగ్రవాదులతో కుమ్మక్కా? ఏ ప్రయోజనం ఆశించి చేసినట్లు ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం నోరు విప్పదు. ఆ విమాన హైజాక్‌ వుదంతంలో అది అమృతసర్‌ నుంచి బయలుదేరి వెళ్లటానికి అనుమతించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది అమృతసర్‌ నుంచి వెళ్లిన తరువాత వుగ్రవాదులది పైచేయి అయిందని రా మాజీ అధికారి వ్యాఖ్యానించారు. నాటి బిజెపి ప్రభుత్వం రాజీపడి మన జైళ్లలో వున్న ముగ్గురు వుగ్రవాదులను విడుదల చేసింది.

నినాదాలు చేయటం చట్ట ప్రకారం వ్యతిరేకం, అందుకు పాల్పడిన వారిని శిక్షించవచ్చు, కానీ కాశ్మీర్‌లో ప్రతిరోజూ అనేక కారణాలతో అక్కడి పౌరులు ఏదో ఒకచోట నిరసన తెలుపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. వారందరినీ దేశవ్యతిరేకులుగా పరిగణించి జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుందా ? లేదు కొందరు నినాదాలు చేసినంత మాత్రానే కాశ్మీర్‌ విడిపోయి వుంటే ఈ పాటికి అ పని ఎప్పుడో జరిగి వుండేది. కానీ బిజెపి అలాంటి వుదంతాలను సాకుగా చూపి నకిలీ దేశభక్తిని ప్రదర్శిస్తోంది. చరిత్రలోకి వెళ్లేట్లయితే అసలు కాశ్మీర్‌ భారత్‌లో విలీనం విషయంలో నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తటపటాయింపులు, విలీనానికి ఒక దశలో విముఖత, దానికి నేటి బిజెపి, అంతకు ముందు జనసంఘరూపంలో వున్న, సంఘపరివార్‌కు చెందిన వారంతా రాజుకు మద్దతుగా విలీనానికి విముఖత తెలిపిన వారే అన్నది చరిత్రలో నమోదయ్యే వుంది. రాజుకు వ్యతిరేకంగా నాడు షేక్‌ అబ్దుల్లా పోరాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు కారకుడయ్యాడు కనుకనే విలీనం తరువాత ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను నియమించమని నాటి రాజు హరిసింగ్‌ స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి రాశారు. నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, యువతలో నిరుద్యోగం, దారిద్య్రం వంటి కారణాలకు తోడు నిరంతరం పాకిస్ధాన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదుల కుట్రకారణంగా కాశ్మీర్‌ వేరుపడి స్వతంత్ర రాజ్యం ఏర్పడాలనే భావనలు అక్కడ తలెత్తాయి. దానికి తోడు కాశ్మీర్‌కు రాజ్యాంగబద్దంగా కల్పించిన రక్షణలైన ఆర్టికల్‌ 370కు వ్యతిరేకంగా సంఘపరివార్‌ రాజకీయ రూపం ఎలా వున్నప్పటికీ నిరంతరం కాశ్మీరీయులకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొడుతూనే వున్న అపర దేశభక్తులు వారు. కాశ్మీర్‌లో తలెత్తిన వేర్పాటు వాద ధోరణులు, పాక్‌, అమెరికా సామ్రాజ్యవాదుల వుగ్రవాదుల కార్యకలాపాలను ఒకేగాటన గట్టిన కాంగ్రెస్‌, బిజెపి పాలకుల వైఖరి కారణంగా ఎవరు వేర్పాటు వాదో, ఎవరు వుగ్రవాదో తెలియని స్ధితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండుశక్తులను దగ్గరయ్యేట్లు చేశారు. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సోం, తదితర రాష్ట్రాలన్నింటా వేర్పాటు వాదశక్తులు తలెత్తి సాయుధ పోరాటాలను కూడా సాగించిన విషయంతెలిసిందే. ఆ రాష్ట్రాలలో వాటికి ప్రభావితులైన యువతరాన్ని దేశద్రోహులుగా పరిగణించి జైళ్లలో పెడితే ఈశాన్య ప్రాంతంలో పరిస్ధితులు వేరే విధంగా వుండేవి. అందువలన కొత్తబిచ్చగాడికి పంగనామాలెక్కువ అన్నట్లు అసలు ఏనాడూ దేశభక్తులుగా లేని సంఘపరివార్‌ శక్తులు ఈనాడు తాము చెప్పిందే దేశభక్తి దానికి భిన్నంగా వుండేవారందరూ దేశద్రోహులే అన్నట్లు మాట్లాడుతూ నానా యాగీ చేయటమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేసేందుకు పూనుకుంది.

సంఘపరివార్‌ నాయకులలో ఒకరైన వీర సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి వారికి విధేయుడిగా పనిచేస్తానని 1914లోనే రాసిన లేఖ వారి దేశభక్తికి పెద్ద నిదర్శనం. దానికి అనుగుణంగానే తరువాత ఎక్కడా సంఘపరివారెవరూ స్వాతంత్య్ర వుద్యమంలో మనకు కనపడరు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన లేఖ బయటపడగానే ఈ దేశభక్తులు కొత్త పల్లవి అందుకున్నారు. చరిత్రలో చాలా మంది ఒక ఎత్తుగడగా తమ శ త్రువులకు లొంగిపోయినట్లు లేఖలు రాసినట్లుగానే సావర్కర్‌ కూడా బ్రిటీష్‌ వారికి లేఖ రాసిన మాట నిజమే అని హాస్యాస్పదమైన ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఈ కాషాయ దళం భాగస్వామి అయి వుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి వుండేవాడు కాదు. గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత సంఘపరివార్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 1970 జనవరి 11 సంచిక సంపాదకీయంలో ఇలా రాశారు.’ పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూకు మద్దతుగా గాంధీజీ దీక్షకు దిగారు, ఈ క్రమంలోనే జనాగ్రహం స్వయంగా ఆయనపైకి మళ్లింది. కాబట్టే నాధూరామ్‌ గాడ్సే ‘ప్రజలకు’ ప్రాతినిధ్యం వహించాడు మరియు జనాగ్రహానికి స్పందన అన్నట్లుగా హత్యకు పాల్పడ్డాడు’ అని నిస్సిగ్గుగా గాడ్సేసు, గాంధీజీ హత్యను సమర్ధించారు.అంతకు ముందు 1961లో దీన దయాళ్‌ వుపాధ్యాయ ఇలా చెప్పారు.’ గాంధీజీపై అన్ని రకాల గౌరవభావంతో మనం ఆయనను జాతిపిత అని పిలవటం మానివేద్దాం. మనం జాతీయవాద పాత ప్రాతికను అర్ధం చేసుకుంటే అది హిందూయిజం తప్ప మరొకటి కాదని మనకు స్పష్టం అవుతుంది.’ అన్నారు. 1989 అక్టోబరు 17నాటి సంపాదకీయంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇలా వ్యాఖ్యానించింది.’ శ్రీ అద్వానీ భారత మాతను ముందుకు తెస్తున్నారంటే ఇప్పటివరకు జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మాగాంధీని నిరాకరించటమే అవుతుంది’ అన్నది. గాడ్సేను కీర్తిస్తూ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు గోవాలో అధికారంలో వున్న బిజెపి నాయకుడు అంగీకరించటమే గాక, తాను అధ్యక్షుడిగా వున్న ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను వేదికగా కూడా ఇచ్చిన ఆ పెద్దమనిషి దేశభక్తుడు, దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, తిమ్మినిబమ్మిని చేయటం అంటే ఇదే.ఈ లెక్కన బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏది చెబితే దాన్ని దేశ ప్రజలందరూ అంగీకరించాలి. అది హిందూయిజాన్ని జాతీయ వాదం అంటే అంగీకరించాలి, ఆ ప్రాతిపదికన దేశ భక్తులు ఎవరో ఎవరు కాదో నిర్ణయించేది వారే. వారి జాబితాలో వున్న గాడ్సే లాంటి వారందరూ దేశ భక్తులు, ఎవరైనా కాదంటే దేశద్రోహులు, కాదని గట్టిగా వాదిస్తే వారిపై దాడి చేసి ఒప్పిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక మంత్రులతో వత్తిడి చేయించి ఐదుగురు అంబేద్కరిస్టు దళిత విద్యార్ధులపై చర్య తీసుకొనేట్లు వత్తిడి చేశారు. జెఎన్‌యులో డిఎస్‌యు సభకు అధికారులే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు కనుక తమ చేతిలో వున్న పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించారు.అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువస్తున్న సందర్భంగా చూసేందుకు వచ్చిన విద్యార్ధులు, అద్యాపకులు, వార్తలు సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులపై బిజెపి ఎంఎల్‌ఏ, న్యాయవాదులుగా వున్న పరివార్‌ కార్యకర్తలు దాడికి దిగారు. బిజెపికి మార్కు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీన్ని నోర్మూసుకుని జనం అంగీకరించాలా ? మధ్య యుగాలలో శైవులు, వైష్ణవులు తమ మతాలను అనుసరించని వారిని, వ్యతిరేకించిన జైన, బౌద్ధ మతాలవారిని, చార్వాకులు, లోకాయతులపై భౌతికంగా దాడి చేసి హతమార్చారని, జైన, బౌద్ధ కేంద్రాలను వీర శైవమతస్దులు శివాలయాలుగా మార్చివేశారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు తిరిగి బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్నదానికి గతంలో జరిగినదానికీ పెద్ద తేడా కనిపించటం లేదు. జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ యూదులు, కమ్యూనిస్టులపై వ్యతిరేకతను రెచ్చగొడితే మన దేశంలో సంఘపరివార్‌ ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై జనాన్ని వుసిగొల్పుతున్నది.అలాంటి శక్తులకు ఐరోపాలో, ప్రపంచంలో ఇతర చోట్ల ఏమి జరిగిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు.

సంఘపరివార్‌ ఇలాంటి దాడులకు ఎందుకు పూనుకున్నది, విశ్వవిద్యాలయాలను అది వేదికగా ఎందుకు చేసుకున్నది అన్నది అనేక మందిలో నలుగుతున్న సందేహం. విశ్వవిద్యాలయాలెప్పుడూ పురోగామి కేంద్రాలు తప్ప తిరోగాములకు ఆలవాలం కాదు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రతి భావాన్ని వ్యక్తం చేసే విశాల ప్రజాస్వామిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సహజంగానే అవి వివిధ వామపక్ష, ప్రజాస్వామిక భావజాల కేంద్రాలుగా వున్నాయి. సంఘపరివార్‌కు చెందిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ చరిత్రను వెనక్కు నడపాలని చూసే ఒక తిరోగామి శక్తి. సైద్ధాంతిక చర్చలో అది ప్రతి చోటా పాడిందే పాడరా అన్నట్లు సభ్య సమాజం ఎప్పుడో తిరస్కరించిన భావజాలాన్నే ముందుకు తెస్తోంది. సహజంగానే అది విద్యార్ధులలో తిరస్కరణకు గురి అవుతోంది. అందువలన వాటిని ఎలాగైనా తమ అదుపులోకి తెచ్చుకోవాలని, వాటిని కూడా మత కేంద్రాలుగా మార్చాలన్నది ఎప్పటి నుంచో వున్న దాని పధకం. ఇప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వుంది కనుక అధికారిక సంస్ధలన్నింటినీ తన భావజాలంతో వున్నవారు లేదా వారి కనుసన్నలలో నడిచే వారితో నింపుతోంది. పూనా ఫిలిం సంస్ధ వంటి ప్రఖ్యాత అకేంద్రానికి మహాభారత్‌ సీరియల్‌లో గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర ధరించటం మినహా మరొక అర్హతలేని చిన్న నటుడిని అధిపతిగా నియమించటాన్ని అక్కడి విద్యార్ధులు వ్యతిరేకించి నెలల తరబడి ఆందోళన జరిపినా పోలీసు బలప్రయోగంతో అణచివేసింది తప్ప ప్రజాభిప్రాయాన్ని మన్నించలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఎంఎం కలుబర్గిని హిందూత్వ శక్తులు హత్య చేసిన కారణంగానే ఆ చర్యను ఖండించేందుకు అకాడమీ ముందుకు రాలేదన్నది తెలిసిందే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగే వ్యక్తిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే మంత్రులు వత్తిడి చేయటం తదనంతర పరిణామాలో వేముల రోహిత్‌ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. దానిలో కూడా అతడు దళితుడు కాదు, బిసి అని తప్పుడు ప్రచారం చేసి సమస్యను పక్కదారి పట్టించాలిని చూశారు. దళితుడు కాకపోతే బిసి అయినా ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడేట్లు చేయటం ఏమిటి ? అసలు సమస్య అతను దళితుడా, బిసి అని కాదు, సంఘపరివార్‌ భావజాలాన్ని వ్యతిరేకించాడు అందుకే అంతటి కక్షగట్టారు. ఇటువంటి సంఘపరివార్‌ వ్యతిరేక, వామపక్ష భావజాలానికి కేంద్రంగా వున్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే మిగతా విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం సులభం అని అక్కడ తమ పధకాన్ని అమలు జరుపుతున్నారు. అక్కడి పరిణామాలకు అదే మూలం. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశమంతటా వేర్పాటు వాదానికి వ్యతిరేక ప్రచారం పేరుతో జాతీయవాదాన్ని ప్రచారం చేయాలని బిజెపి పధకం వేసింది.

అన్నింటి కంటే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడికి ఇరవై నెలలు నిండింది. రూపాయి విలువ దగ్గర నుంచి ఎగుమతుల వరకు అన్ని రంగాలలో ప్రతికూల పరిస్ధితులు ముసురుకుంటున్నాయి.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నరేంద్రమోడీ వచ్చిననాటికి సూచీలు పతనమయ్యాయి. ధరలు తగ్గటం లేదు, అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనా పన్నులు విధిస్తూ స్ధానికంగా ధరలు తగ్గకుండా చూస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావటం లేదు, వున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంకెల్లో చెబుతున్న అభివృద్ధి అంతా వుపాధి రహితమే. వేతన కమిషన్‌ సిఫార్సులపై వుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రైల్వే వంటి చోట్ల సమ్మె బ్యాలట్‌ తీసుకొనే వరకు వచ్చింది. మిగతా రంగాలలో కూడా ఆందోళనకు రంగం సిద్ధం అవుతోంది. స్వచ్ఛభారత్‌, మేకిన్‌ ఇండియా వంటి వన్నీ నినాదాలకే పరిమితం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలో ఒకవైపు సంఘపరివార్‌కు చెందిన భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు రామాలయ నిర్మాణ సమస్యను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించేవే. జెఎన్‌యు, ఇతర విశ్వవిద్యాలయాలలో రాజేసిన కాష్టం కూడా దానిలో భాగమే అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Editors Guild Condemns ABVP Threats to The Wire‘s Founding Editor

25 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, communalism, RSS

12628388_945979525487243_1572144722424597240_o (1)

New Delhi: In a statement issued on Saturday, the Editors Guild of India strongly condemned “the blatant acts of intimidation and threats to Siddharth Varadarajan, Editor of The Wire, by student members of the ABVP in Allahabad University that forced the police to intervene to escort him to safety.”

Varadarajan had been invited to deliver a public lecture on ‘Loktantra, media aur abhivyakti ki svatantrata’ (Democracy, the Media and Freedom of Expression)” by the president of the Allahabad University Students’ Union and the event was scheduled to be held at the university’s Senate Hall on January 20, 2016.The Editors Guild statement notes that after students belonging to the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) – the student wing of the Bharatiya Janata Party – threatened violence, the university’s vice-chancellor withdrew permission for the programme and got the district administration to prohibit it from being held anywhere else on campus. As a result, “Varadarajan was forced to deliver the lecture at a hall near the campus.”After the lecture, when The Wire’s founding editor went to meet the V-C in his office along with the students’ union president, Richa Singh, the ABVP – which declared that Varadarajan was “anti-national” and would not be allowed to set foot inside the university campus – surrounded the exit.

The university security warned Varadarajan that they could not guarantee his safety, and it was only after the police arrived that he was escorted to safety.

“For a senior journalist to be threatened in such a manner at a leading university is deplorable. It is a brazen attack on freedom of expression, and the Editors Guild of India finds this mob mentality to silence those with divergent views unacceptable”, the Editors Guild statement said.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: