• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ap special status

బిజెపి రాజధాని ‘తర్కం’ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు వర్తించదా ?

06 Thursday Feb 2020

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, Amaravathi capital, Amaravati capital controversy, ap special status, BJP's capital logic, CM YS Jagan

Image result for why not bjp's  capital logic apply to ap special status too
ఎం కోటేశ్వరరావు
మూడు రాజధానుల రాజకీయం మరో మలుపు తిరిగింది. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జనంలో గందరగోళం మరింత పెరిగింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర పాత్ర ఉండదని, 2015 నోటిఫికేషన్‌ ప్రకారం రాజధాని అమరావతే అని, మూడు రాజధానుల విషయం పత్రికల్లో మాత్రమే చూస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. దీని గురించి ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. నిజానికి ఇది రాజధాని మార్పును ఆమోదించటమూ కాదు, తిరస్కరించటమూ కాదు. ప్రస్తుతం ఉన్న స్ధితిని తెలియచేయటమే అన్నది ఒక అభిప్రాయం. రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని చెప్పటం వెనుక రాజకీయం లేకపోలేదు.
కేంద్ర బడ్జెట్‌ వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఒకవైపు చెబుతారు, మరోవైపు మంచి బడ్జెట్‌ అని కితాబు, ప్రత్యేక హౌదా గురించి మరచిపొమ్మని మరోసారి పార్లమెంట్‌లో చెప్పిన తరువాత దాన్ని పరిశీలించాలని లేఖ రాయటం నక్కపోయిన తరువాత బక్క కొట్టుకున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. రాజధాని రాజకీయంలో జనసేన-బిజెపి ఏమి చేయనున్నాయన్నది ఆసక్తి కరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని విషయమై శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రమే. రాజధాని ఖరారు అయ్యేంత వరకు పదేండ్ల పాటు హైదరాబాదులో రాజధాని కొనసాగవచ్చనే అవకాశం ఇచ్చిందీ కేంద్రమే. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులపై తెలుగుదేశం-బిజెపి సంకీర్ణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అది చేసిన సిఫార్సుల ప్రకారం రాజధానిని ప్రతిపాదించింది. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అమరావతిని ఖరారు చేయటాన్ని కేంద్రం అంగీకరించింది. తాము నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక స్ఫూర్తి లేదా సిఫార్సులకు అనుగుణ్యంగా అమరావతి ఎంపిక లేదని కేంద్రం ఎలాంటి వివరణా కోరలేదు, అభ్యంతరమూ వ్యక్తం చేయలేదు. అక్కడ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేసి విడుదల చేసింది. ఆ నిధులను ఎలా ఖర్చు చేశారన్నది ఒక ప్రశ్న. జనానికి కూడా అర్ధం కావటం లేదు. తాము ఇచ్చిన నిధుల ప్రకారం వాటిని నిర్మించిందీ లేనిదీ నిర్ధారించాలని, ఏ దశలో ఉన్నాయో తెలపాలని గానీ కేంద్రం ఇంతవరకు రాష్ట్రాన్ని కోరినట్లు జనానికి తెలియదు. చంద్రబాబు కొన్ని భవనాలను నిర్మించి వాటిలో తాత్కాలికంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దాని ప్రకారం వాటిలో కార్యాలయాలు తాత్కాలికం తప్ప భవనాలు శాశ్వత ప్రాతిపదికన నిర్మించినవే.
ఇక రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు జనానికి చెప్పటమే తప్ప కేంద్రానికి అధికారికంగా ఇంతవరకు తెలియచేయలేదు. అందుకే వాటి గురించి మీడియాలో మాత్రమే చూశామని కేంద్రం చెప్పాల్సి వచ్చింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లులో కూడా పాలనా వికేంద్రీకరణలో భాగంగా కొని చర్యలను ప్రతిపాదించింది తప్ప రాజధానుల ఏర్పాటుగా వాటిని పేర్కొనలేదు. విజిలెన్స్‌ కమిషన్‌, ఎంక్వైరీస్‌ కమిషన్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో తరలించకూడదని ఎక్కడ ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. తన కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటు చేసుకొనే స్వేచ్చ ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొనే సచివాలయాన్ని, హైకోర్టును తరలిస్తామని జగన్‌ ప్రభుత్వం చెబుతున్నది. న్యాయమూర్తుల నియామకం, హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు వంటివి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ వ్యవహారం కనుక హైకోర్టు తరలింపు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీం కోర్టు, కేంద్రమే. సచివాలయాన్ని తరలిస్తే కేంద్రం చేయగలిగిందేమీ లేదు. అందుకే బిజెపి నేతలు పార్టీగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాం తప్ప ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకొనే అవకాశం లేదని చెబుతున్నారు, దీనిలో పెద్ద తెలివితేటలేమీ లేవు.
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు లేదా తీరుస్తారు అన్నట్లుగా హైకోర్టు తరలింపును సుప్రీం కోర్టు ఆమోదించకపోతే, అది జరగకుండా కేవలం సచివాలయాన్నే తరలిస్తే జగన్‌ సర్కార్‌ రాజకీయంగా చిక్కుల్లో పడుతుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకు బిజెపి రంగంలోకి దిగవచ్చు. ఇక 2015లో వెలువరించిన గజెట్‌ నోటిఫికేషన్‌ లేదా రాజధానిగా అమరావతి ఉత్తర్వు మార్చటానికి వీలు లేని శిలాశాసనమో, చంద్రబాబు చెక్కిన శిలాఫలకమో కాదని, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మరొకదానిని జారీ చేయవచ్చని బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు చెప్పారు. 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని కూడా నరసింహారావు చెప్పారు. అదే ముక్క పార్లమెంటు సమాధానంలో ఎందుకు చెప్పలేదన్నది ప్రశ్న. కేంద్ర వైఖరి గురించి ఆయనకు ఉన్న సాధికారత ఏమిటి ? లేకపోతే బిజెపి-వైసిపి మధ్య కుదిరిన తెరవెనుక ఒప్పందానికి సూచికా, ఎలా అర్ధం చేసుకోవాలి. మొత్తం మీద రాజకీయ దోబూచులాట నడుస్తోంది.

బిజెపి నేతలను ఇక్కడ ఒక సూటి ప్రశ్న అడగాలి. జివిఎల్‌ తర్కం ఒక్క అమరావతికేనా దేనికైనా వర్తిస్తుందా ? ఏదీ శిలాఫలకం, శాసనం కానపుడు, మార్చుకోవటానికి అవకాశం ఉన్నపుడు స్వయంగా బిజెపి నేతలు కోరిన పదేండ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు విధానాలను మార్చటానికి, ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్రానికి ఉన్న అడ్డంకి, అభ్యంతరం ఏమిటి? ఎందుకు హౌదా ఇవ్వరు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని గతంలోనే పలుమార్లు చెప్పామని జీవీఎల్‌ నరసింహారావు అంటున్నారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని, ముగిసిన అనేక అధ్యాయాలను తిరిగి తెరుస్తున్నది బిజెపి, జరిగిన తప్పిదాలను సరిచేస్తామని చెబుతున్నది ఆ పార్టీ, అలాంటపుడు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు చేతులు రావటం లేదా ? ప్రత్యేక హోదా కొనసాగించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందనే సరికొత్త వాదనను బిజెపి నేత ముందుకు తెచ్చారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే కార్పొరేట్లకు లక్షా 45వేల కోట్ల రూపాయల మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలోనే కేంద్రం ఎలా కట్టబెట్టగలిగింది? తాజా బడ్జెట్‌లో డివిడెండ్‌ పన్ను చెల్లింపు పన్నుతో సహా అనేక రాయితీలను తాజా బడ్జెట్‌లో ఎలా ప్రకటించారు. వాటికి లేని ఆర్ధిక ఇబ్బందులు ఆంధ్రప్రదే శ్‌ ప్రత్యేక హోదాకే వస్తాయా ? ప్రత్యేక హోదా డిమాండ్‌ చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్లే పదేపదే ఈ డిమాండ్‌ లేవనెత్తితే జగన్‌ కూడా ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జివిఎల్‌ అనటం బెదిరింపా మరోసారి అడగవద్దని హెచ్చరించటమా ?

చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక భ్రమరావతిగా చూపుతూ సింగపూర్‌, కౌలాలంపూర్‌, మరొకటో మరొక దాని పేరో చెప్పి రైతులకు, జనాలకు భ్రమలు కల్పించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారు. తేడా ఏమిటంటే చంద్రబాబు విదేశీ బూట్లు వేసుకుంటే జగన్‌ స్వదేశీ తగిలించుకున్నారు. చంద్రబాబు కార్పొరేట్‌ పరిభాషలో గతంలో తనను సిఇఓగా వర్ణించుకుంటే జగన్‌ ఫ్యూడల్‌ పద్దతిలో రాష్ట్రానికి తండ్రినని చెప్పుకున్నారు. విజయవాడ గేట్‌వే హౌటల్‌లో నిర్వహించిన హిందూ పత్రిక కార్యక్రమంలో మాట్లాడుతూ అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10 శాతం విశాఖలో ఖర్చు చేస్తే పదేళ్లలో విశాఖ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడగలదని చెప్పారు. ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు, అభివ అద్ది కోసం నిర్ణయాలు తీసుకున్నానని స్పష్టం చేశారు.
ఆరువందల సంవత్సరాల నాటి విజయనగర సామ్రాజ్యంలో చెన్నై ఒక రేవు పట్టణంగా ఎదిగింది, దానిని 1639లో బ్రిటీష్‌ వారు తీసుకున్నట్లు చరిత్ర, అదే విధంగా బెంగలూరు నగరం 1535లో, హైదరాబాద్‌ 1591లో ప్రారంభమైంది. స్వాతంత్య్రం రాకముందే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి అయ్యాయి. తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి అనేక సంస్ధలను నెలకొల్పారు. వాటి అభివృద్ధిలో అవి పధాన పాత్ర పోషించాయి. అమరావతిలో మౌలిక సదుపాయలకే లక్ష కోట్ల రూపాయలకు పైగా అవుతుందని, అంతసొమ్ము తాము అక్కడ వెచ్చించలేమని చెబుతున్న జగన్‌ దానిలో పదోవంతు పదివేల కోట్లతో విశాఖలో సచివాలయం నెలకొల్పితే ఆ మూడు నగరాలతో పోటీబడి అభివృద్ధి చెందుతుందని చెప్పటం అంటే భ్రమలు కొల్పటం గాక మరేమిటి ? ప్రభుత్వ రంగంలో కేంద్రం, లేదా రాష్ట్రం పెట్టుబడులు పెట్టటాన్ని ఎప్పుడో నిలిపివేశాయి. ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభం ఉంటే అక్కడకు పోతాయి తప్ప మూడు రాజధానులు పెడితే పదమూడు జిల్లాలకు ఎలా చేరతాయి. ఎవరూ పెద్దగా ప్రయత్నం చేయకుండానే, రాజధానిగాక ముందే విశాఖలో ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు కారణంగా, దానికి ఉన్న రేవు, ఇతర కారణాలతో అభివృద్ధి అయింది. రాబోయే రోజుల్లో కూడా అది కొనసాగుతుంది. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు విశాఖను తామే అభివృద్ధి చేశామని చెప్పుకొనే ఎత్తుగడ తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. ఒక సైబర్‌టవర్‌ నిర్మించి మొత్తం సైబరాబాద్‌ను, ఐటి పరిశ్రమను తానే తెచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. గొప్పలు చెప్పుకోవటంలో ఆయనతో జగన్‌ పోటీ పడదలచుకున్నారా ?

కేంద్ర బడ్జెట్‌పై ప్రజల అసంతృప్తిాజగన్‌ అభినందనలా ?
” ఏపీని ఆదుకునేందుకు తాజా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ అసంత అప్తితో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని” సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు.
విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దఅష్టికి తెస్తున్నానని, ప్రత్యేక హౌదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరారు. బడ్జెట్‌ మీద జనం అసంతృప్తి సరే ముఖ్యమంత్రి జగన్‌ సంగతేమిటి?
”ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సంక్లిష్ట తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, వఅద్ధి రేటును పెంచేదిగా విశ్వాసాన్ని కలిగించి,నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.” అని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఒక వైపు రాష్ట్రానికి తండ్రినని చెప్పుకుంటారు. మరో వైపు మీ చర్యల కారణంగా మా పిల్లలు అసంతృప్తి చెందారు గానీ నేనైతే అభినందనలు చెబుతున్నా అన్నట్లు లేఖ ఉంది. పిల్లలకు జరిగిన అన్యాయానికి కనీసం నిరసన కూడా తెలపకుండా వేరే విషయాలకు అభినందనలు తెలిపే తండ్రిని ఏమనుకోవాలి? మొగుడు పోతే పోయాడు గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే ఉందే అని వెనకటికి ఎవరో అన్నట్లుగా లేదూ !
2020ా-21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హౌదా కల్పించాలని విజ్ఞప్తి చేశాయని, కానీ ఆ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని జగన్‌ కోరారు. 2018 అక్టోబర్‌లో మీడియా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ ప్రత్యేక హౌదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేదని కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక హౌదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తీవ్ర అసంత అప్తికి గురి చేస్తోంది. దయచేసి ఈ అంశంపై మీరు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.
బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి కనీసం నిరసన తెలపరు, ఆర్ధిక సంఘం పరిధిలో ప్రత్యేక హోదా అంశం లేదని ముందే తెలిసి కూడా బడ్జెట్‌కు హారతులు పడుతూ ప్రత్యేక హోదా కల్పించాలని కోరటం భలే ఉందిలే ! ఇప్పటికే బిజెపి జనం చెవుల్లో పూలు పెట్టింది, ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ కూడా అంతకు మించి మరొకటి కాదు. మోడీగారికి పంపేందుకు పోస్టల్‌ ఖర్చు దండగ తప్ప లేఖలతో రాష్ట్రానికి ఒరిగేదేముంది ?
రాజధాని అమరావతి విషయమై జనసేన-బిజెపి ప్రకటించిన విజయవాడ లాంగ్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు లేదా వాయిదా వేశాం అంటారు. మూడు రాజధానులకు పార్టీగా వ్యతిరేకం తప్ప తమ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుకూలం అంటుంది బిజెపి, ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేసేందుకు ఈ ద్వంద్వ మాటలు ? జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కేంద్రం తోలు వలుస్తారా ? తాట తీస్తారా? పార్టీ నిర్వహణ నిధుల కోసమనే పేరుతో హీరోయిన్లతో తైతక్కలాడుతూ సినిమాలు తీస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సీతయ్య ఎవరి మాటా వినడు !

06 Tuesday Jun 2017

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH Politics, Andhrapradesh, ap special asistance, ap special status, chandrababu naidu, Congress party, Rahul gandhi

ఎంకెఆర్‌

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా పండే రొయ్య మీసాల పొడవు- విస్తృత ప్రచారం పొందిన చంద్రబాబు నాయుడి సీనియారిటీ గురించి ఎవరైనా విబేధిస్తే అంతకంటే అమాయకులు మరొకరు వుండరు. అయితే ఎవరూ వివాదం చేయకపోయినా ఈ మధ్యకాలంలో, తాజాగా తన సీనియారిటీ గురించి తానే చెప్పుకుంటున్న చంద్రబాబు గురించి ప్రస్తావన రాకుండా ఎలా వుంటుంది? అసలా అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. తాను మారానని మూడో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో, అంతకు ముందు చంద్రబాబు చెప్పారు. చూస్తుంటే ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతీ అన్న నీతి బాగా వంట పట్టించుకున్నట్లు తేలిపోయింది.

గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ రాజకీయాల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మోడీ భయం పట్టుకుందని విమర్శించారు. ఆ మాటకు వస్తే నరేంద్రమోడీ, చంద్రబాబు కూడా సభలలో తాము చెప్పదలచుకున్నవి చెప్పారు, అతి వినయం ప్రదర్శించి చేయాల్సిన నటన చేయలేదా, ఎవరు తక్కువ ? అలాగే రాహుల్‌ చెప్పిన మాటలు వినటమా లేదా, చేసిన విమర్శలను పట్టించుకోవటమా లేదా సూచనలను పాటించటమా లేదా అన్నది వేరే విషయం. తాను ఎవరికీ భయపడటం లేదని, దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తను కనుక ఇప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న వారు చెబితే వినేది లేదని చంద్రబాబు చెప్పాల్సిన పనేముంది. నిజానికి అది నరేంద్రమోడీకి ఎక్కడో మండే మాట. మరో విధంగా అలా అనటం అంటే జ్ఞాన ద్వారాన్ని మూసుకోవటమే. ఆ మాట అన్న తరువాత ఈగలు, చీమలు, దోమల మాదిరి అధికారం చుట్టూ మూగే ఇతర పార్టీల వారూ, తెలుగుదేశం పార్టీలోని సహచరులు, జూనియర్లు చెప్పిందానిని కూడా చంద్రబాబు ఎలా వింటారు. ఇప్పటికే ‘సీతయ్య నివాస్‌’ మాదిరి తెలుగు దేశం పార్టీలో అసలు అలా చెప్పే వాతావరణం ఎక్కడుంది. గతంలో ఒక్క పెదబాబే అనుకుంటే తండ్రికి తగ్గ తనయుడు చినబాబు కూడా తోడయ్యారు. దీంతో చంద్రబాబు తప్ప తెలుగుదేశంలోని సీనియర్లందరూ నారావారి కుటుంబంలో పుట్టబోయే వారికి అన్నలుగానూ పుట్టిన వారికి తమ్ములుగానూ మారిపోయారు. గతంలో పది సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, మరో పది సంవత్సరాలు ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు శైలిని దగ్గరగా చూసిన వారికి ఆయనకు సీనియారిటీతో నిమిత్తం లేకుండానే ఇతరులు చెప్పేదానిని పరిగణనలోకి తీసుకొనే తత్వం లేదన్నది బాగా తెలిసిందే. ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మహాకవి కాళిదాసు గర్వభంగం కథను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. సరస్వతి దేవి పెట్టిన పరీక్షలో సున్నా మార్కులు తెచ్చుకున్న కాళిదాసుకు కనువిప్పు కలగగానే విద్యతో వినయం వృద్ధి చెందాలి గాని అహంకారం కాదు నాయనా కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధిని మార్చటానికే ఈ పరీక్ష అని దాహంతో వచ్చిన కాళిదాసుకు మంచినీరు ఇచ్చి అనుగ్రహిస్తుంది.

అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ, బయట ప్రతిపక్షాలకు తాను చెప్పటం తప్ప ఇతరులు చెప్పింది వినే అలవాటు లేదనే విమర్శలు వున్న చంద్రబాబు ఎవరూ చూడకుండా అయినా వేమన, సుమతీ శతకాలు ఒక్కసారి తిరగేసుకుంటే మంచిది.

వినదగు నెవ్వరు చెప్పిన,

వినినంతనే వేగపడక వివరింపదగున్‌,

గని కల్లనిజము లెరిగిన,

మనుజుడే పో నీతిపరుడుడు మహిలో సుమతీ

అన్న ప్రబోధ పద్యాన్ని చంద్రబాబు మరిచి పోయి వుంటారు.

మూడు సంవత్సరాల పాలనలో సున్నా మార్కులు తెచ్చుకున్న చంద్రబాబు వైఫల్యాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే మండిపడుతున్నారు. తానే చెప్పుకున్నట్లు ఒక సీనియర్‌గా గోబెల్స్‌ ప్రచారంలో కూడా ఆయనను మించిన వారు లేరు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్నది హిట్లర్‌ ప్రచార మంత్రి గోబెల్స్‌ సూత్రం. చంద్రబాబుకు గోబెల్స్‌ను మించిన బిజెపి తోడు కావటంతో ఇక చెప్పాల్సిందేముంది.

రాష్ట్ర విభజన సమయంలో వ్యతిరేకించింది ఒక్క సిపిఎం తప్ప మరొకపార్టీ లేదు.అందుకే ఆ పార్టీ దానికి ప్రత్యామ్నాయంగా ఫలాన వరం ఇవ్వాలని కోరలేదు. గతంలో అలా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అలా అడగటం అంటే విభజనను అంగీకరించినట్లే. ఆసుపత్రులలో పెద్ద ఆపరేషన్లు చేయాల్సి వచ్చినపుడు సంభవించే పర్యవసానాలకు అంగీకారం తెలుపుతూ రోగి లేదా సమీప బంధువుల సంతకాలతో లేఖలు తీసుకుంటారు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడవటానికి ఆమోదం తెలిపి ఒకటికి రెండు లేఖలు ఇచ్చింది చంద్రబాబు. ఆపరేషన్‌ చేసే వైద్యుడు కోరిన కత్తులు, కటార్లు అందించి సహకరించే సిబ్బంది మాదిరి ఆంధ్రప్రదేశ్‌ కన్ను పొడిచే సమయంలో పెద్ద ఎత్తున హడావుడి చేసి కాంగ్రెస్‌కు అన్ని విధాలుగా సహాయపడింది బిజెపి. తిరుపతి సభలో ప్రత్యేక హోదా గురించి వెంకన్న సాక్షిగా వాగ్దానం చేసింది నరేంద్రమోడీ. తరువాత దానిని తిరస్కరించిందీ ఆ పెద్ద మనిషే. మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని జరిగితే వాటన్నింటినీ వదలి పెట్టి చంద్రబాబు నాయుడు కేవలం కాంగ్రెస్‌ మీదే ఎదురుదాడులకు దిగారు. రాష్ట్రానికి హాని చేయటంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంతో బిజెపిదీ అంతే. హోదా బదులు ప్రత్యేక పాకేజీ ఇచ్చారని, దాని కంటే హోదా వలన అదనంగా వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని కూడా చంద్రబాబు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు సమస్య పాకేజి వలన కలిగిన ప్రయోజనం ఏమిటన్నదే, ఆ ప్రశ్నకు ఇంతవరకు ఆ పెద్ద మనిషి లేదా బిజెపి నేతలు గానీ నోరు విప్పటం లేదు.

ఏ పార్టీలో ఎంతకాలం వుంటారో, ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని విశ్వసనీయతలేని నాయకులతో తెలుగుదేశం పడవ నడుస్తోంది. అలాంటి పార్టీ నేతగా దానిని నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఆయన చెప్పే కాంగ్రెస్‌ అడ్డగోలు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఎలా నష్టపోయిందో, ఆ నష్టాన్ని పూడ్చేందుకు మిత్రపక్షం బిజెపి ఇచ్చిన ప్రత్యేక పాకేజి కారణంగా వచ్చే లాభాలు ఏమిటో, తెలుగుదేశం పార్టీ చెప్పే న్యాయబద్ద విభజన కోసం తాము చెప్పిందేమిటో, చేసిందేమిటో ప్రభుత్వం తరఫున ఒక శ్వేత పత్రం ప్రకటించి వాస్తవాలు చెప్పటం తప్ప మరొక మార్గం లేదు. అదేమీ లేకుండా అడ్డగోలు రాజకీయాలు, దాడులు చేస్తే రాష్ట్ర ప్రజలకు పూచికపుల్ల ప్రయోజనం కూడా వుండదు. క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆ కాంగ్రెస్‌లో చివరి వరకు వుండి తెలుగు దేశం పడవలోకి ఎక్కిన నేతలను మాత్రం ఎలాంటి క్షమాపణ అడగకుండానే పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి అందలమెక్కించారు. అదే కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో కూడా చేరి దానిని కూడా పునీతం చేశారు. తెలుగుదేశం సరసన కూర్చొని వారిపుడు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపికి కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా వున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఆ విషయాన్ని నొక్కి వక్కాణిస్తే ఆయనకే నష్టం. ఒక రాజకీయపార్టీ పట్ల మరొక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలనేది అది వారిష్టం.కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆని చెబుతున్నారు కనుక సాధించిన అదనపు ప్రయోజనాలేమిటో కూడా చెప్పాలి.ప్రతి ఏటా నవనిర్మాణ దీక్షలంటూ ప్రత్యర్ధులపై ఎదురుదాడులు తప్ప జనానికి సానుకూల అంశాలను వివరించిన పాపాన పోలేదు. కులం, మతం, ప్రాంతీయ భావనలను తలకెక్కించుకున్న జనంలోని ఒక తరగతి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర వైఫల్యాల గురించి పట్టించుకోకపోవచ్చు. ఎల్లకాలం ఇదే పరిస్ధితి వుండదు. అటు బిజెపి తెలుగుదేశం పార్టీని ముందుగదిలో కూర్చో పెట్టి దాని ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వెనుక ద్వారం తెరిచింది. శ్రీకృష్డుడి రాజకీయం మాదిరి ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జునుడిని చూచితి నేను అన్నట్లుగా బిజెపి తనకు ఏది వాటంగా వుంటే అది చేసేందుకు పావులు కదుపుతోంది. చంద్రబాబు అస్త్రాలు తుప్పు పట్టటం లేదా ఒక్కొక్కటిగా మొద్దుబారి పనికి రాకుండా పోతున్నాయి. అవ్వతో వసంతమాడినట్లు కాంగ్రెస్‌ క్షమాపణలతో కాలక్షేపం చేస్తే కుదురుతుందనుకుంటే పొరపాటు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జర్నలిస్టుల ముసుగులో పోలీసులు- మీడియాలో కట్టు కథలు !

27 Tuesday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ap special asistance, ap special status, cia, fake news, fake stories, fake stories in media, FBI, journalism, journalist, Police agents as journalist, pope on journalism, popefrancis

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.

ఎం కోటేశ్వరరావు

     జర్నలిజం, జర్నలిస్టుల పాత్ర, తీరు తెన్నుల గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి రోజూ ఏదో ఒక మూల చర్చ జరుగుతూనే వుంది. ప్రసార మాధ్యమాల విస్తృతితో వారి సంఖ్య, కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మీడియాలో అనేక అవాంఛనీయ ధోరణులు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అవాంఛనీయ శక్తులు మీడియా రంగాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ప్రపంచాన్ని చాపమాదిరిగా చుట్టి తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచ పౌరులను తప్పుదారి పట్టించేందుకు తమ అజెండాను అమలు జరిపేందుకు కట్టుకధలు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మీడియాలో కట్టుకథలను చొప్పించటం, అందుకు గాను గూఢచారులు, పోలీసులకు జర్నలిస్టుల ముసుగు వేయటం, జర్నలిస్టులను డబ్బుతో లొంగదీసుకొని వారి పేర్లతో కట్టుకధలను ప్రచారంలో పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి పరిణామాలపై విహంగ వీక్షణమిది.

   దర్యాప్తు సమాయాలలో ఎఫ్‌బిఐ(మన సిబిఐ మాదిరి) ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో పని చేయవచ్చని ఆ సంస్ధ ఇన్సపెక్టర్‌ జనరల్‌ తాజాగా ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా పోలీసు ఏజంట్లు ప్రవేశించి పని చేయటం కొత్త కాదని, ఎప్పటి నుంచో జరుగుతున్నదని కూడా వెల్లడించారు. అయితే ఎవరు జర్నలిస్టుల ముసుగులో వున్న పోలీసులో ఎవరు కాదో తెలియటం అంత సులభం కాదు. వివిధ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల పెద్ద సంఖ్యలో పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో మీడియాలో తిష్ట వేశారు.లేదా జర్నలిస్టులను తమ ఏజంట్లుగా మార్చుకొని తమ అజెండా, కార్యకలాపాలను వారితో నిర్వహిస్తున్నారు. కాబట్టి వార్త లేదా వాస్తవాలు పవిత్రం, వ్యాఖ్యలు మీ ఇష్టం అనేది ఇంకే మాత్రం చెల్లదు. పోలీసు ఏజంట్లు, అవాంఛనీయ శక్తులు మీడియాలో ప్రవేశించిన తరువాత వార్తలకున్న పవిత్రత ఎప్పుడో గంగలో కలిసింది. కనుక వాస్తవాల పేరుతో పచ్చి అవాస్తవాలు, వ్యాఖ్యల పేరుతో తమకు అనుకూలమైన కథనాలను ప్రచారంలో పెడుతున్నారన్నది జనం గ్రహించాలి. ఈ పని పోలీసులే కాదు, అధికారంలో వున్న రాజకీయ పార్టీలు కూడా గుండుగుత్తగా మీడియా సంస్ధలతో కుమ్మక్కు, కొనుగోలు చేసి తమ బాకాలుగా మార్చుకోవటం తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పార్టీ, ఏ వ్యక్తులు ఈ పని చేశారని ప్రశ్నించే వారికి చేయని ప్రధాన పార్టీ, వ్యక్తులు ఎవరు అందరూ చేశారన్నదే సమాధానం !

    రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ ‘ఆపరేషన్‌ మోకింగ్‌ బర్డ్‌ ‘ పేరుతో మీడియాలో తన ఏజంట్లను ప్రవేశపెట్టటానికి తెరతీసింది. అది నిధులిచ్చి వివిధ సంస్ధల పేరుతో కొన్ని పత్రికలను కూడా నడిపించింది. ఒక్క సిఐఏ మాత్రమే కాదు, ఎఫ్‌బిఐ కూడా అదే పనిచేసిందని కొద్ది రోజుల క్రితం ఆ సంస్ధ స్వయంగా ఏకంగా ఒక నివేదికనే విడుదల చేసింది. ఆసక్తి వున్న వారు ఆ లింక్‌లో పూర్తి నివేదిక చదవచ్చు.https://oig.justice.gov/reports/2016/o1607.pdf తన చర్యలను సమర్ధించుకొనేందుకు, నిజమే కదా అలాంటి సందర్బాలలో వాస్తవాలను బయట పెట్టటం, నిందితులను పట్టుకొనేందుకు ఏ పద్దతి అనుసరించినా తప్పేముంది అని జనం అనుకొనేందుకు వీలు కలిగించే అంశాలనే ఎఫ్‌బిఐ ఆ నివేదికలో పొందుపరచిందని వేరే చెప్పనవసరం లేదు. మచ్చుకు ఆ నివేదిక నుంచి అలాంటి వుదాహరణనే చూడవచ్చు.

    2007 జూన్‌లో ఒక 15 ఏండ్ల హైస్కూలు బాలుడు సియాటిల్‌ పట్టణ సమీపంలోని ఒక హైస్కూలు సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి వారం రోజుల పాటు ఇమెయిల్స్‌ పంపుతూ బాంబు బెదరింపులకు పాల్పడ్డాడట. ప్రతి రోజూ స్కూలును ఖాళీ చేయించటం తనిఖీ చేసి బాంబులేవీ లేవని నిర్ధారించుకోవటం జరిగింది. ఆ మెయిల్స్‌ ఎక్కడి నుంచి పంపుతున్నదీ పసిగట్టకుండా వుండేందుకు ఒక సారి ఒక దగ్గర నుంచి పంపిన మెయిల్‌ను మరొకసారి అక్కడి నుంచి కాకుండా వేరే చోటు నుంచి పంపాడట.దీంతో అతడిని పట్టుకోవటం పెద్ద సవాలుగా మారింది. ఎవరైనా ఏ కంప్యూటర్‌ నుంచి పని చేస్తున్నారో, అది ఎక్కడ వుందో తెలుసుకొనే ఒక రహస్య సాప్ట్‌వేర్‌ను జత చేసి అసోసియేటెడ్‌ ప్రెస్‌ (మన పిటిఐ, యుఎన్‌ఐ మాదిరి వార్తా సంస్ధ) ఎడిటర్‌ పేరుతో ఒక తప్పుడు వార్త, ఫొటోల లింక్‌లను సామాజిక మాధ్యమాలలోకి వదిలాడు. వాటిపై క్లిక్‌ చేసిన వారి చిరునామా ఆ లింక్‌లను పంపిన వారికి వెంటనే చేరి పోతుంది. ఆ వుచ్చులో పడిన ఆ కుర్రాడు దొరికిపోయి నిజాన్ని ఒప్పుకున్నాడట. ఆ నిందితుడిని ఎలా పట్టుకుందీ మీడియాకు చెప్పలేదు. అయితే దానిని పసిగట్టిన ఒక వెబ్‌సైట్‌ కొద్ది రోజుల తరువాత ఎలా పట్టుకుందీ వెల్లడించిందట. ఏడు సంవత్సరాల తరువాత సియాటిల్‌ టైమ్స్‌ అనే పత్రిక ఎఫ్‌బిఐ ఏజంటు జర్నలిస్టు ముసుగులో బాంబు బెదరింపులకు పాల్పడ్డ విద్యార్ధిని పట్టుకున్నట్లు వెల్లడించింది. తమ వార్తా సంస్ధ జర్నలిస్టు ముసుగులో ఎఫ్‌బిఐ ఏజంట్లు దర్యాప్తు చేయటాన్ని నిరసిస్తూ ఏపి వార్తా సంస్ధ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో అనేక పత్రికలు ఎఫ్‌బిఐ ఎత్తుగడలను ప్రశ్నిస్తూ వార్తలు రాశాయి. ఒక వారం తరువాత ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు రాసిన లేఖలో సంస్ధ మార్గదర్శక సూత్రాల ప్రకారం అలాంటి పని చేయవచ్చని తమ చర్యను సమర్ధించుకున్నారు.

   దేశ రాజధాని, రాష్ట్ర రాజధానులు, ఇతర పెద్ద నగరాలలో అనేక మంది పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో విలేకర్ల సమావేశాలకు హాజరవుతుంటారు. ఎవరైనా అభ్యంతర పెడితే మౌనంగా వెళ్లిపోతారు. లేదా విలేకర్ల సమావేశాలు జరిగే చోట బయట వేచి వుండి విలేకర్ల వెంటపడి ఎవరేం చెప్పారో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు.అమెరికన్‌ ఎఫ్‌బిఐ చర్యలను నిరసిస్తూ రిపోర్టర్స్‌ కమిటీ ఫర్‌ ప్రీడమ్‌ ఆఫ్‌ ద ప్రెస్‌ ( పత్రికా స్వేచ్చ కోసం పని చేసే విలేకర్ల కమిటి ) మరో 25 సంస్ధల తరఫున ఒక లేఖ రాస్తూ ఎఫ్‌బిఐ చర్య జర్నలిస్టుల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, స్వతంత్రకు భంగం కలిగిస్తుందని అభ్యంతరం తెలిపింది. అయితే ఎఫ్‌బిఐ ఇలాంటి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. జర్నలిస్టుల ముసుగులో తన ఏజంట్లు పనిచేసేందుకు వున్నతాధికారుల అనుమతి తీసుకోవాలంటూ ఒక చిన్న నిబంధన చేర్చి 2016 మార్గదర్శ సూత్రాలను తయారు చేసింది. అంటే తాను చేసే తప్పుడు పనులకు అధికారిక ముద్ర వేయటం, మరింత బరితెగించి చేయటం తప్ప మరొకటి కాదు.

     ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. పోలీసులు, గూఢచారులు అల్లే కట్టుకధలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారానికి విశ్వసనీయత కలిగించేందుకు జర్నలిస్టుల పేర్లను వాడుకోవటం కూడా జరుగుతోంది. జర్మనీలోని అతి పెద్ద పత్రికలలో ఒకటైన ఫ్రాంక్‌ఫర్టర్‌ అల్‌జెమినీ జీటుంగ్‌ పత్రికకు రెండు దశాబ్దాలకు పైగా సంపాదకుడిగా వున్న జర్మన్‌ జర్నలిస్టు డాక్టర్‌ యుడో అల్‌ కొటే రష్యాకు చెందిన ఆర్‌టి న్యూస్‌ అనే టీవీలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించి వుద్యోగం పోగొట్టుకున్నాడు. గూఢచారులు తయారు చేసిన కధనాలను తన పేరుతో ప్రచురించాలని వత్తిడి చేశారని, దానిని తిరస్కరించినందుకు యాజమాన్యం వుద్యోగం నుంచి తొలగించింది. తనకు పిల్లలు లేనందున ఎవరూ తనను బెదిరించలేరంటూ అనేక విషయాలు వెల్లడించిన ఆ జర్నలిస్టు మాటల్లోనే ఏం జరిగిందో చూడండి.’ నేను పాతికేండ్లుగా జర్నలిస్టుగా వున్నాను. జనానికి నిజం చెప్పకుండా మోసం చేసేందుకు, అబద్దాలు చెప్పేందుకు నాకు శిక్షణ ఇచ్చారు. రష్యాతో యుద్ధానికి తలపడేందుకు గాను ఐరోపా పౌరుల ముంగిటికి కూడా యుద్ధాన్ని తెచ్చేందుకు జర్మన్‌, అమెరికన్‌ మీడియా గత కొద్ది నెలలుగా ప్రయత్నించటాన్ని చూశాను.గతంలో నేను చేసింది సరైంది కాదని ఇంకే మాత్రం దీనిని సహించకూడదని, ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాను. రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు, తిమ్మిని బమ్మిని చేసి జనాన్ని నమ్మించేందుకు గతంలో ప్రయత్నించాను. ఒక్క జర్మన్లనే కాకుండా యావత్‌ ఐరోపా వాసులను మోసం చేసేందుకు ముడుపులు తీసుకున్న నా సహజర్నలిస్టులు చేసింది కూడా సరైంది కాదని , తాను స్వయంగా సిఐఏ కధనాలను తన పేరుతో అందించానని తెలిపారు.ప్రధాన మీడియా సంస్ధలలోని జర్నలిస్టులను అవినీతి పరులుగా చేయటం పశ్చిమ దేశాల మీడియాలో అందరూ అంగీకరించే సిఐఏ రోజువారీ వ్యవహారం. ఎవరైనా అందుకు అంగీకరించకపోతే వారికి మరో చోట ఎక్కడా వుద్యోగాలు రానివ్వరు లేదా అర్ధంతరంగా ముగిసిపోతాయి. సిఐఏ అవినీతి గురించి బట్టబయలు చేస్తూ ‘జర్నలిస్టుల కొనుగోలు’ పేరుతో రాసిన పుస్తకానికి సంబంధించి సమీక్షలను జర్మనీలోని ప్రధాన పత్రికలలో రాకుండా అడ్డుకున్నారని కూడా తెలిపారు. తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తూ లిబియా అధ్యక్షుడు గడాఫీ విషవాయువుల ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నట్లు కట్టుకధలు ప్రచురించాలని 2011లో తనను అదేశించారని, ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో వార్తల సేకరణకు వెళ్లిన తాను విషవాయు దాడిలో గాయపడ్డానని సద్దాం హుస్సేన్‌ వుపయోగించిన విషవాయువుల గురించి రాయవద్దని కూడా చెప్పారని, ఆ సమయంలో సద్దాం అమెరికాకు స్నేహితుడిగా వుండటమే కారణమని పేర్కొన్నారు. అమెరికా నుంచి వెలువడై టైమ్స్‌ పత్రిక యాజమాన్య స్ధాయిలోనే సిఐఏ మనుషులు వున్నందున దశాబ్దాల తరబడి దానిలో సిఐఏ కధనాలు వెలువడేవని జర్మన్‌ జర్నలిస్టు వెల్లడించారు.

   కొన్ని సార్లు సమాచారాన్ని వక్రీకరించటానికి లేదా ఎంపిక చేసిన సమాచారాన్ని వార్తలుగా ఇచ్చేందుకు తమకు అమెరికా ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వాలు డబ్బు చెల్లించేవని, ఆ సమాచారాన్ని వీక్షకులు, చదువరులకు ఎలా అందచేయాలో కూడా ప్రభుత్వాలే ఎడిట్‌ చేసి ఇచ్చేవని మూడు సార్లు ఎమ్మీ అవార్డు పొందిన జర్నలిస్టు అంబర్‌ లేయాన్‌ వెల్లడించారు.’ అనేక అంశాలకు సంబంధించి ఏం జరుగుతోందన్న మన అవగాహనను అనేక సార్లు పూర్తిగా అదుపు చేశారు. అందుకు పెద్ద వుదాహరణ ‘వుగ్రవాదంపై పోరు’ ఇంకా స్పష్టంగా అయితే వుగ్రవాదం గురించి తప్పుడు చిత్రీకరణ. వీటన్నింటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులే అనే దానికి అనుగుణంగా మా బుర్రలను తయారు చేశారు.అందుకు 9/11 మంచి వుదాహరణ. సామూహిక మారణాయుధాల పేరుతో మధ్యప్రాచ్యంపై దాడి చేయటాన్ని సమర్ధించుకొనేందుకు ఎవరైతే ఈ వుదంతాన్ని వుపయోగించుకొనేందుకు ప్రవర్తించారో వారే దానిని సృష్టించారు. జన్యుమార్పిడి ఆహారం, ఔషధాలు, పండిత చర్చలు మొదలైన వాటన్నింటికీ సంబంధించి వాటికి అనుగుణ్యంగా మన అవగాహనను మలిచారు ‘ అని ఆమె చెప్పారు. ప్రపంచ కార్పొరేట్‌, సామ్రాజ్యవాదుల చేతులలో మీడియా పురోగామి, సోషలిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక, ప్రచారదాడి అస్త్రంగా తయారైంది. లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న వెనెజులా వామపక్ష ప్రభుత్వం, అక్కడి అధికార సోషలిస్టు పార్టీకి వ్యతిరేకంగా మీడియా జరిపిన విషపు దాడి, వ్యాపింప చేసిన అవాస్తవాల గురించి స్పెయిన్‌కు చెందిన లాయర్‌, విశ్లేషకుడైన ఫెర్నాండో కసాడో ఒక గ్రంధమే రాశాడు. వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌, ఆయన భావజాలమైన 21వ శతాబ్దపు సోషలిజాన్ని ప్రపంచ మీడియా ప్రధమ శత్రువుగా ఎందుకు పరిగణిస్తోంది, నిజమైన వెనెజులాకు, మీడియా చిత్రిస్తున్నదానికి తేడా వుందేమిటి అన్న ఆలోచన ఫెర్నాండోకు కలిగి వివరాల్లోకి వెళ్లారు. అది ఒక పెద్ద పుస్తకంగా తయారైంది. దాని గురించి స్పుత్నిక్‌ అనే పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచ మీడియా తరచూ వాస్తవాలను వక్రీకరించి వాటినే ‘నిజాలు’గా జనం ముందుంచేందుకు పని చేస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయంటూ వాటిలో మొదటిది, ముఖ్యమైనది 21వ శతాబ్దపు సోషలిజంతో మీడియా సైద్ధాంతిక దాడికి పూనుకోవటం. బడా మీడియా అంతా కంపెనీల చేతుల్లో వుంది, వాటి ప్రధాన ప్రేరణ లాభాలు. ఈ కంపెనీలకు ఇతర కంపెనీలకు వున్న తేడా ఏమిటంటే ఇవి వస్తువులకు బదులు సమాచారాన్ని విక్రయిస్తాయి. బడా మీడియా సంస్ధలు తరచూ తమ సిద్ధాంతాలు, వాణిజ్య ప్రయోజనాలకు అదే విధంగా తమకు ప్రకటనలు ఇచ్చే వారి ప్రయోజనాలకు ముప్పు వచ్చినపుడు దాడులకు తెరతీస్తాయి. ‘ ఇరాక్‌ కంటే మరింత ప్రమాదకరమైనది వెనెజులా అంటే ఆశ్చర్యం ఎందుకు ?’ అనే శీర్షికతో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని చూడండి, ఇతర విషయాలతో పాటు ఇరాక్‌లో కంటే వెనెజులాలో ఎక్కువ మంది జనాన్ని చంపినట్లు దానిలో రాశారు. మీడియా సాయంతో అబద్దాలు నిజాలుగా మారిపోతున్నాయి. అటు వంటి తిమ్మిని బమ్మిని సమాచారం తరచుగా ప్రచురితమైతోంది. అత్యంత దారుణమైన విషయం ఏమంటే ఇటువంటి ప్రచారం పశ్చిమ దేశాల మీడియాతో పాటు లాటిన్‌ అమెరికా పత్రికలు కూడా చేస్తున్నాయి. కొంత మంది జర్నలిస్టులకు ఎలాంటి పక్షపాతం వుండదు, వారికి వాస్తవ పరిస్థితి తెలుసు, మంచి వేతనాలు, మెప్పు పొందాలంటే ఎడిటర్లు కోరుకున్నది తప్ప వాస్తవాలను రాసే అవకాశం వుండటం లేదు. ఇలాంటి ప్రచురణ సంస్ధల దృష్టి మరిన్ని లాభాలు, అందుకోసం సంచలనాత్మకతకు పాల్పడటం తప్ప తాము ప్రచురిస్తున్నది వాస్తవమా కాదా అనే దానితో వాటికి నిమిత్తం లేదు ‘ అని ఫెర్నాండో వ్యాఖ్యానించారు.

    కట్టు కథలు, సత్యదూరమైన అంశాలు పత్రికలు, టీవీలలోనే కాదు, సామాజిక మాధ్యమాలలో కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి.ప్రముఖ వ్యక్తుల బొమ్మలు పెట్టి వారి పేర్లతో కొటేషన్లు పెడతారు. వాటిలో వాస్తవం ఎంతో కూడా ఆలోచించ కుండా అనేక మంది వాటిని లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తుంటారు. అంతవరకైతే అదొక తీరు, దాని మీద వ్యాఖ్యానాలు, సంస్కార రహితమైన బూతు, తిట్లు విపరీతం. వుదాహరణకు అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ 1861-65 మధ్య పదవిలో వున్నారు. ఆయనను 1965లో హత్య చేశారు. ఆయన బొమ్మతో ఒక కొటేషన్‌ పెట్టి వదిలారు. దానిలో ఇంటర్నెట్‌లో ఒక కొటేషన్‌, దాని పక్కనే ఒక బొమ్మ పెట్టిన వాటన్నింటినీ నమ్మ వద్దు అని రాసి వుంది. అది వాస్తవమే. అయితే ఆ విషయాన్ని అబ్రహాం లింకన్‌ చెప్పారని ఆయనకు ఆపాదించటమే నకిలీ. ఎందుకంటే ఆయన మరణించిన వంద సంవత్సరాల తరువాత ఇంటర్నెట్‌కు అంకురార్పణ జరిగింది. పాపం లింకన్‌కు ఇంటర్నెట్‌ అనే పదమే తెలిసి వుండదు. ఇలా అనేకం వున్నాయి. మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ ప్రయోగాలు అనేక జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ గొప్పతనాన్ని గురించి చెప్పేందుకు ఒక ఫొటోను ప్రయోగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్బంగా గదులను శుభ్రం చేసిన ఒక నిరాండంబర వ్యక్తిగా చిత్రించే ప్రయత్నంలో భాగంగా అది జరిగింది. ఇలా చాలా చెప్పుకోవచ్చు.

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.సెప్టెంబరు 23న ఇటలీ జర్నలిజం గిల్డ్‌ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్పిత కధనాలు, గాలి వార్తలపై ఆధారపడి ఐరోపాకు వస్తున్న శరణార్ధుల వంటి మానవత్వ సంక్షోభ సమయాలలో వారికి వ్యతిరేకంగా రాస్తున్న వార్తలు ఒక రకమైన వుగ్రవాదం తప్ప మరొకటి కాదన్నారు. విమరశ న్యాయమైనదే,దుర్నడతలను ఆక్షేపించటానికి అది అవసరం కూడా అని నేను అంటాను, అయితే జర్నలిజం కొంత మంది వ్యక్తుల లేదా దేశాల మానవ వినాశకర ఆయుధం కాకూడదు. గాలి కబుర్ల అలవాటు వుగ్రవాదపు అలవాట్లలో ఒకటి. వుగ్రవాదుల మాదిరి నాశనం చేయటానికి గాలి కబుర్ల వారు మాటల బాంబులు వేస్తారు ‘ అని కూడా చెప్పారు.

     మీడియా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే దాని పర్యవసానాలు ముందుగా ఫీల్డ్‌లో పని చేసే విలేకర్లు అనుభవిస్తారన్నది అనేకసార్లు రుజువైంది. దాడుల వుదంతాలు పెరగటం కూడా వాటిలో ఒకటి. యురి సైనిక కేంద్రంపై వుగ్రవాదుల దాడి తరువాత సెప్టెంబరు 20వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కొంత మంది జర్నలిస్టులు ఇళ్లకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న వాహనంపై మీడియా అని రాసి వుండటాన్ని చూసిన కొందరు నిరసనకారులు వాహనంపై దాడికి దిగారు. మీడియా రాజ్య ప్రచార సాధనంగా మారిందని, జర్నలిస్టులు నిజాలు దాస్తున్నారని జనం భావించటమే దీనికి కారణం తప్ప వేరు కాదు. కాశ్మీర్‌లో జర్నలిస్టులు అటు జనం ఇటు సైనిక, పోలీసుల మధ్య నలిగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అటు భద్రతా దళాలు జర్నలిస్టులను పాకిస్తానన లేదా వేర్పాటు వాద హురియతన ఏజంట్లని, ఇటు జనం ప్రభుత్వ ఏజంట్లని నిందిస్తున్నారు.మన రాష్ట్రంలో కూడా అనేక సందరా&భలలో తమ న్యాయమైన సమస్యలపై పోరాడుతున్నపుడు మీడియాలో వాటిని విస్మరించినా లేదా అప్రాధాన్యంగా ఇచ్చినా జర్నలిస్టులు కుమ్మక్కయ్యారని ఆరోపించటం లేదా విమరి&శంచటం చూస్తున్నాం.

     అవాంఛనీయ ఘటనలు ముఖ్యంగా వుగ్రవాద దాడులు, మత ఘర్షణలు జరిగినపుడు కొంత మంది వుగ్రవాదులను కాల్చి చంపామనో, విద్రోహులను పట్టుకున్నామనో పోలీసులు కల్పిత కథలు, సంఘటనలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే.అధికార యంత్రాంగం, అధికారంలో వున్న వారి పరువు పోకుండా చూడటం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. కొంత మంది అమాయకులను కాల్చి చంపి వుగ్రవాదులను హతమార్చామని చెప్పిన వుదంతాలు కూడా వున్నాయి. తమ రేటింగ్‌లను పెంచుకొనేందుకు చిలవలు పలవలుగా కొన్ని వుదంతాలపై మీడియా స్పందించటం కూడా తెలిసిందే. తమకు ఇష్టం లేని వార్తలను తొక్కి పెట్టటం అన్నది లేదా వివిధ కారణాలతో కొన్ని వార్తలకు ప్రాముఖ్యత కల్పించటం మన దేశంలో కూడా జరుగుతున్నది. దీనికి తాజా వుదాహరణ జమ్మూ-కాశ్మీర్‌లో యురి సైనిక స్ధావరంపై వుగ్రవాదులు దాడి జరిపి నిద్రమంచాల మీద వున్న 18 మంది సైనికులను చంపిన ఘటన గురించి తెలిసిందే. ఇలాంటి సమయాలలో దేశ పౌరుల్లో మనో నిబ్బరం కల్పించే పేరుతో ప్రభుత్వం పైన చెప్పిన మాదిరి కొన్ని కట్టుకధలను ప్రచారంలో పెట్టటం చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చేస్తుంది కనుక అంత వరకు ఆగటం ఎందుకు మనమే అలాంటి కట్టుకధలను ప్రచారంలో పెట్టి రేటింగ్స్‌ పెంచుకోవాలని కొన్ని మీడియా సంస్ధలు అలాంటి కట్టుకథనే వండి వడ్డించాయి.

    మన సైన్యంలోని ప్రత్యేక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలోకి రహస్యంగా ప్రవేశించి వుగ్రవాద స్ధావరాలపై దాడి చేసి 20 మంది వుగ్రవాదులను హతమార్చి బదులుకు బదులు తీర్చుకున్నాయంటూ టీవీ ఛానల్స్‌, పత్రికలు ఒక వార్తను ప్రచారంలో పెట్టాయి. నిజానికి అలా జరిగి వుంటే అదొక పెద్ద సమస్యగా మారి వుండేది. తామలాంటి దాడులు చేయలేదని మన సైన్యం ఒక ప్రకటన చేసింది. అయితే ఒక వెబ్‌సైట్‌ మాత్రం తాను రాసిన కథనం వాస్తవమేనని, వాస్తవాలను నిర్ధారించుకున్నానని చెప్పుకుంది. అదే వార్తను ప్రసారం చేసిన ఇతర మీడియా మాత్రం మిన్నకుండి పోయింది తప్ప అలాంటి దుస్సాహసానికి పాల్పడలేదు. యురి ఘటనతో మధ్యతరగతి, యువత ఆగ్రహంతో స్పందించటాన్ని అవకాశంగా తీసుకొని వారిని సంతృప్తిపరచే అనేక కథనాలను బడా మీడియా సంస్ధలు ప్రచారంలో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాని గురించి మల్లగుల్లాలు పడుతోంది తప్ప అసలు ఎలా జరిగిందో కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేకపోయింది. సైనిక శిబిరంలో గడ్డి దుబ్బులుగా పెరిగిందని, పక్కనే వున్న నది ద్వారా సరిహద్దులు దాటిన వుగ్రవాదులు దానిలో దాగి వుండి దాడులకు పాల్పడ్డారనే ఒక కథనాన్ని కూడా ప్రచారంలో పెట్టారు.

    మీడియా ఇటీవలి కాలంలో మరొక బాధ్యతను కూడా పుచ్చుకుంది. ఎవరు దేశ భక్తులో,ఎవరు దేశ ద్రోహులో, ఏది దేశ ద్రోహుల కేంద్రంగా వుందో కూడా ప్రకటించేస్తోంది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ(జెఎన్‌యు) విద్యార్ధి యూనియన్‌ మాజీ అధ్యక్షుడు కన్నయ్య, మరికొందరు విద్యార్ధులు, కొన్ని సంస్ధలను అలాగే జమ కట్టి నకిలీ వీడియోలను కూడా తయారు చేసి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయం దేశద్రోహులకు మద్దతు ఇచ్చే శక్తులకు నిలయంగా మారిందని, దానిని మూసివేయాలని, అక్కడి విద్యార్ధినీ, విద్యార్ధులు మద్యం తాగుతూ, వ్యభిచారానికి పాల్పడుతున్నారని అందుకు నిదర్శనంగా మద్యం సీసాలు, నిరోధ్‌లు పెద్ద సంఖ్యలో కనిపించాయని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వాటి అనుబంధ సంస్ధల నేతల ఆరోపణలకు విశ్వసనీయత కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంలో మీడియాలోని మెజారిటీ సంస్ధలు తమ పంతు పాత్ర పోషించాయి. పాటు అనేక మంది విద్యార్దులపై తప్పుడు కేసులు పెట్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులలో వున్న విద్యార్ధులను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా వార్తలను సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై బిజెపి మద్దతుదారులైన లాయర్లు దాడికి పాల్పడిన వుదంతం కూడా తెలిసిందే. జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్నారంటూ మహిళాజర్నలిస్టులను కూడా వదల కుండా అవమానించిన ఘటనలు ఇంకా కళ్ల ముందున్నాయి.

    అలాంటి వుదంతానికి కేంద్ర బిందువుగా వున్న జెఎన్‌యు విశ్వవిద్యాయ విద్యార్ధి సంఘానికి సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో దేశభక్తులకు ప్రతినిధులుగా వున్నామని చెప్పుకున్న ఎబివిపి అభ్యర్ధులను విద్యార్ధులు చిత్తు చిత్తుగా ఓడించారు. వేర్పాటు వాదులు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశద్రోహులుగా ముద్రవేసిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ విద్యార్ధి సంఘాల కూటమికి ఘన విజయం చేకూర్చారు. ఈ వార్తను మీడియా మొత్తంగా తొక్కి పెట్టింది లేదా ఎవరూ గమనించని విధంగా అప్రాధాన్యంగా ఇచ్చింది. అదే అక్కడ ఎబివిపి గెలిచి వుంటే ఎంత హంగామా జరిగి వుండేదో వూహించుకోవచ్చు.

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే వుమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా వాగ్దానం చేసిన ప్రత్యేక తరగతి హోదా కల్పన విషయాన్నే చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని పత్రికలలో, ఛానల్స్‌లో ఎన్ని కట్టుకధలు ప్రచురితం, ప్రసారమయ్యాయో చూశాము. కొన్ని రోజులు ప్రత్యేక హోదా గురించి కసరత్తు జరుగుతోందని, ప్రకటన వెలువడటమే తరువాయని కొన్ని కధలు. ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకుంటుందని, ఏదో ఒకటి తేల్చుకోవాలని, తానిక ఢిల్లీ రానని చంద్రబాబు నాయుడు అల్టిమేటం ఇచ్చారని మరికొన్ని కథలు. ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి లేదా కొందరికి ప్రయోజనం కలిగించేందుకు వండి వార్చిన కధలన్నది జనానికి బాగా అర్ధమైంది. ప్రత్యేక హోదా వలన వచ్చే లాభాల గురించి చెప్పిన వారే తీరా దాన్ని ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత హోదా వలన ప్రయోజనం లేదని అంతకంటే మెరుగైనా పాకేజి వల్లనే ఎక్కువ ప్రయోజనమనే వార్తలు, వాదనలకు పెద్ద ఎత్తున చోటు కల్పించటాన్ని ఏమనాలి?

    మీడియాలో ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకూ పెరిగి పోతున్న కారణంగానే అది అందచేసే వార్తలకు విశ్వసనీయత వుండటం లేదు. ఒక కొత్త వార్తను ఒక ఛానల్‌ లేదా ఒక పత్రికలో చూసి నమ్మే పరిస్ధితులు అంతరించాయి. ఇది మీడియా సంస్ధల విశ్వసనీయతనే కాదు, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయి. కిరాయి రాతగాళ్లుగా జనం భావించే రోజులు దాపురించాయి. ఏ మీడియా సంస్ధలో పని చేస్తే దాని యాజమాన్య వైఖరికి అనుగుణంగా ఆ జర్నలిస్టుల రాతలూ, వాదనలూ మారిపోతుండటమే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. స్వతంత్ర భావాలు, తాము చూసిన దాన్ని వీక్షకులు, చదువరులకు అందించే పరిస్థితి లేదు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వుద్యోగానికి వుద్వాసన. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పట్ల విమర్శనాత్మక వ్యాఖ్యలు, వైఖరిని ప్రదర్శించిన కారణంగా ఒక సీనియర్‌ జర్నలిస్టును ఆ సంస్ధ నుంచి తొలగించేదాకా అధికారంలో వున్న పెద్దలు వత్తిడి చేశారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియాను ఒక లాభదాయకమైన వ్యాపారంగా భావించి పెట్టుబడులు పెట్టిన యాజమాన్యాలు ప్రభుత్వంతో వైరం తెచ్చుకొని తమ లాభాలను వదులుకోవటానికి సిద్ధంగా వుండవని వేరే చెప్పనవసరం లేదు. అందువల్లనే మీడియాలో జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో మిలాఖత్‌ అవుతున్న యాజమాన్యాలు చట్టాలను, వేతన సిఫార్సులను అమలు జరపకపోయినా,అసలు వేతనాలు చెల్లించకపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజకీయ నేతలు తమకు అనుకూలమైన వార్తలు రాయకపోతే యజమానులకు ఫిర్యాదులు చేస్తామనే బెదిరింపులు రాజధాని నుంచి మండల కేంద్రం వరకు వున్న విలేకరులకు ఏదో ఒక సందర్భంగా ఎదురై వుంటుందన్నది కాదనలేని సత్యం.

గమనిక:ఈ వ్యాసం అక్టోబరు నెల ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’లో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనంపై తెలుగు దేశం-బిజెపి ఎదురుదాడి !

15 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Politics

≈ Leave a comment

Tags

AP Package, ap special asistance, ap special status, chandababu duplicity, Narendra Modi, Venkaiah naidu

Image result for Telugu desam started offensive against people

ఎం కోటేశ్వరరావు

     మహానటుడు నందమూరి తారకరామారావు సినిమాలలో చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచితే సినిమా పరిభాషలో చెప్పాలంటే కొంతమంది దృష్టిలో అయినా ‘తోడు దొంగలు ‘ గా కనిపిస్తూ, ఎన్‌టిఆర్‌ అసలు సిసలు వారసులం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, మితృపక్షం బిజెపి నాయకులు నిజజీవితంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరుల ముందు నటిస్తున్నారు. ఎన్‌టిఆర్‌ సినిమాలు చివరకు సుఖాంతంగా ముగిశాయి. ప్రత్యేక తరహా హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కలిగే ప్రత్యేక సాయం అనే వీరి నటన ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరం. ఎందుకంటే రియాలిటీ షో కదా ! ఇలాంటి షోలు ఫలానా విధంగా మాత్రమే నిర్వహించాలనే , ఫలానా విధంగా ముగించాలనే నిబంధనేమీ లేదు. వ్యాపారం కనుక వారికి అనుకూలమైన రీతిలో వాటిని రూపొందిస్తారు.ఈ రియాలిటీ షోలో రాని ప్రత్యేక హోదా , దాని కంటే ఎలా మెరుగో తెలియని లేదా వారైనా చెప్పని ప్రత్యేక సాయంపై జనంపై ఎదురు దాడికి దిగారు. త్వరలో ఈ సాయానికి కేంద్ర కాబినెట్‌ ఆమోద ముద్ర వేసిన తరువాత అదింకా పెరగవచ్చు లేదా జనంలో ప్రతికూలత వ్యక్తమైతే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గ వచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం తమ ఆత్మరక్షణ, సమర్ధనకు వూరూరా ఎదురుదాడి చేయాలనే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Image result for venkaiah naidu

దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి ‘పంచాంగ ‘ వెంకయ్య

      రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇక రాదు అన్నది సుస్పష్టం. దీనికి జనాన్ని మానసికంగా సిద్ధం చేయటానికి 27నెలల పాటు కసరత్తు చేయాల్సి వచ్చిందంటే ఈ విషయంలో తెలుగుదేశం, బిజెపిలు ఎంత భయపడ్డాయో, ఆందోళనకు గురయ్యాయో చెప్పకనే చెప్పినట్లయింది. ఎంతైనా బిజెపివారి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలు, తెలుగుదేశం వారి సినిమా దర్శకత్వాలతో పార్లమెంటరీ చర్చల ట్విస్టులమీద ట్విస్టులు, అసెంబ్లీ తీర్మానాల ప్రహసనాలు, అనుకూల, సానుకూల పత్రికలు, టీవీలలో లీకుల వార్తల వడ్డన, వుత్తుత్తి బెదిరింపులు, అలకలు , పిట్టకథలు అబ్చో ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేశారు. జనానికి ఎంతో వినోదం కలిగించారు. ఇప్పుడు చెబుతున్న ఆసాధ్యాలు, సుసాధ్యాల గురించి వుభయ పార్టీల పెద్దలు పార్లమెంట్‌, అసెంబ్లీ చర్చలలో ఎందుకు చెప్పలేదని ఎవరైనా అడిగితే అది రాష్ట్ర ద్రోహం అవుతుంది. కనీసం ఎప్పుడు జ్ఞానోదయం అయిందో అదైనా చెప్పాలి. దొంగను దొంగంటే నువ్వు దొంగ, నీ కుటుంబం అంతా దొంగలే అని ఎదురుదాడి చేస్తారు. తెలుగుదేశం,బిజెపిలు ఇపుడు ఎదురుదాడికి దిగాయి. పార్లమెంట్‌లో తానొక్కడినే మాట్లాడానని,కమ్యూనిస్టులుగానీ మిగతా వారు ఎందుకు మాట్లాడలేదని వెంకయ్య నాయుడు, పాకేజి కంటే ఇంకా మెరుగైనదేమిటో చెబితే తాను పోరాడతానని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. వెంకయ్య నాయుడి వ్యవహారం దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి తానొక్కడినే పట్టుబట్టినట్లు ఒక ఘనతగా చెప్పుకున్నారు. తీరా తామే దానికి మొండిచేయి చూపాల్సి వచ్చేసరికి తానసలు అంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాదని అయినా దానికోసం ఎంతో చేస్తే విమర్శిస్తారా అంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో ఎన్నడూ ఈ మాట ఎక్కడా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పలేదు ? కావమ్మ మొగుడని మీరంతా అంటే కామోసు కామోసనుకొని ఇంతకాలం కాపురం చేశా, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే వెళ్లి పోతా అన్నాడట వెనుకటి కెవడో ! ‘పంచాంగ’ నాయుడిగారి తీరు అలాగే వుంది.

     రాష్ట్ర విభజన ఒక రాజకీయ నిర్ణయం. దానిలో భాగస్వాములు కానిది ఒక్క సిపిఎం మాత్రమే. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు మిగతా పార్టీలన్నీ ఎంతో కొంత దానిలో భాగస్వాములే. ఒక వైపు రెండు కళ్ల సిద్ధాంతం చెబుతూ చంద్రబాబు నాయుడు తన పాత్రను చక్కగా పోషించారు. విభజన చట్టంలోని అంశాల గురించి ఏం మాట్లాడితే జనం ఏమనుకుంటారో, రాజకీయంగా నష్టమా లాభమా అని ఆలోచించి విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో విభజన సరిగా లేదంటూ తెలుగుదేశం పార్టీ గోడమీది పిల్లివాటం ప్రదర్శించింది. భాషా ప్రయ్తు రాష్ట్రాలను విడదీయకూడదన్న తమ సూత్రబద్ద వైఖరికి సిపిఎం కట్టుబడి వుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా విభజితమయ్యే రెండు రాష్ట్రాలలోనూ తమ పలుకుబడి పెంచుకోవచ్చన్న దురాశతో బిజెపి నేతలు కాంగ్రెస్‌ నిర్ణయానికి వంతపాడారన్నది నగ్నసత్యం. అందుకే వెంకయ్య నాయుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు తప్ప నిజానికి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కాదు. ఆ పెద్దమ్మనే (సోనియా గాంధీ) కాదు, ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండని సుష్మాస్వరాజ్‌ తెలంగాణా వాసులను, కాంగ్రెస్‌ ఐదంటే కాదు పది అని పట్టుబట్టి ప్రత్యేక హోదాకు ఒప్పించింది తామే అని బిజెపివారు ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకున్న విషయాన్ని కాదంటారా ? అప్పుడు ఏ పార్టీ వారు కూడా పాకేజి గురించి మాట్లాడలేదు. మాట తప్పింది, ద్రోహం చేసింది బిజెపి . అందువలన హోదా గురించి మాట్లాడింది మీరే కనుక ఆ ఖ్యాతిని కూడా గుండుగుత్తగా వుంచుకోండి , ప్రత్యేక హోదాను తప్ప అందుకు వచ్చే ఖ్యాతిలో వాటా ఇమ్మ ని ఎవరైనా అడిగితే వెంకయ్యకు కోపం వస్తే అర్ధం వుంది. ఎవరూ అడగటం లేదే ! ఒక రాజకీయ పార్టీ మీద మరొక పార్టీ ఎదురుదాడి చేస్తే కొంత వరకు అర్ధం చేసుకుంటారు, కానీ మొత్తం జనం మీదే ఎదురుదాడికి దిగి లబ్ది పొందిన రాజకీయ పార్టీ మనకు ఎక్కడా కనపడదు. ఇపుడు కొన్ని రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని బిజెపి,తెలుగుదేశం పార్టీలు ప్రశ్నించిన జనం మీదే తుపాకులు ఎక్కుపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాకపోయినా నన్నే తిడతారా అంటూ వెంకయ్య నాయుడి రుసరుసలు.ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి కాకపోయినా రాష్ట్రానికి ఎంతో చేశారంటూ ఆ పెద్దమనిషికి బిజెపి నేతలు సన్మానాల మీద సన్మానాలు చేస్తున్నారు. రెండు పార్టీలకు చట్ట సభల్లో సరిపడా తగిన మద్దతు వుంది,కావాలనుకుంటే ఎదుటి పార్టీల ప్రతినిధులను ఆకర్షించగలిగే అధికారం వుంది, నీతి నియమాలను ఎప్పుడో గాలికి వదిలి నిరంతరం ఎక్కడ అధికారమనే పంచదార వుంటే అక్కడికి చేరే చీమల మాదిరి పార్టీలు మారటానికి సిద్ధంగా వున్న జనం వున్నారు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ఎదురు దాడి ప్రారంభించిన చంద్రబాబు

    వెంకయ్య నాయుడి మాటలలో చెప్పాలంటే ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండానే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకున్నారు. పదేళ్లలో చేయాల్సిందానిని రెండు సంవత్సరాలలోనే కేంద్రం ఎన్నో చేసిందని వెంకయ్య నాయుడు టాం టాం వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దీనికి కృతజ్ఞతల మీద కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరూ వాడా ప్రచారం చేసింది, అశలు కల్పించింది మీరు. ఎప్పుడూ పాకేజి గురించి చెప్పలేదు. ఇప్పుడు పాకేజి కంటే మెరుగైనదేమిటో చెప్పమని చంద్రబాబు, తెలుగుదేశ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అది కూడా చెప్పాల్సింది మీరే. పద్నాలుగవ ఆర్ధిక సంఘం కొత్తగా ప్రత్యేక హోదాను ఇవ్వకూడదని సిఫార్సు చేసిందని ఒక మాట, ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతావన్నీ తమకూ అడుగుతాయి,ఇవ్వకపోతే ఎన్‌డిసిలో వ్యతిరేకిస్తాయి అని మరోమాట, ఇప్పటికే వున్న రాష్ట్రాలకు కూడా రద్దు చేయబోతున్నాం అని ఇంకోమాట. ఏదో ఒక మాట మీద కట్టుబడి వుండాలి కదా !

    ప్రత్యేక హోదాకు ఇన్ని ఆటంకాలు చెప్పిన పెద్ద మనుషులు ప్రత్యేక పాకేజీ కూడా లేకుండా ప్రత్యేక సాయం అని పేరు పెట్టి ఒక ప్రకటన చేశారు. ఓకే ఆంధ్రప్రదేశ్‌ పట్ల జాలి, దయ, కరుణతో ఈ సాయం చేస్తున్నారని అనుకుందాం. అది నిబంధనలకు అనుగుణంగానా, లేక పక్కన పెట్టారా ? అనుగుణ్యంగానే అయితే దానిలో ప్రత్యేకత ఏమున్నట్లు. వుదాహరణకు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన ఆదాయలోటు రు.22,113 కోట్ల మొత్తాన్ని ఐదు సంవత్సరాలలో కేంద్రం చెల్లిస్తుంది. దీన్ని ప్రత్యేక సాయం అంటున్నారు, అది ఎలా అవుతుంది ? రాష్ట్రాన్ని విడగొట్టకపోయినా ఆ మొత్తం వచ్చేదే. ఎందుకంటే మన రాష్ట్ర విభజనతో నిమిత్తం లేని పధ్నాలుగవ ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పదకొండు రాష్ట్రాలకు రు.1,94,821 కోట్ల రూపాయలను ఐదు సంవత్సరాల కాలంలో చెల్లించాలని సిఫార్సు చేసింది. విశాఖ పట్టణం నగరం కంటే తక్కువ జనాభా వున్న నాగాలాండ్‌ రాష్ట్రానికి రు.18,475, జమ్ము కాశ్మీర్‌కు 60, హిమచల ప్రదేశ్‌కు 40వేల కోట్లు ఇవ్వనున్నారు. దీన్ని గురించి ఏమంటారు ?http://ficci.in/SPdocument/20563/Highlights_14thFinance_Commission_Report.pdf

    ప్రత్యేక హోదాకు,పరిశ్రమల రాయితీలకు సంబంధం లేదని ఒక మాట. విభజన చట్టంలోనే హోదా గురించి అప్పుడు కాంగ్రెసే పెట్టి వుంటే పోయేది, ఆ పని చేయకుండా అన్యాయం చేసిందని ఒక విమర్శ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలన్నీ అక్కడికే తరలి పోతాయని తమిళనాడు అభ్యంతరం చెబుతున్నదని వెల్లడించింది ఎవరు ? హోదాకు రాయితీలకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ జనాల మెదళ్లకు ఎక్కించేందుకు కష్టపడకపోతే అదేదో అభ్యంతరాలు పెట్టే రాష్ట్రాలకు ఎందుకు నచ్చచెప్పలేకపోయినట్లు ? రాని హోదా గురించే పట్టుబట్టి ఇచ్చే రాయితీలసు కూడా వద్దందామా అని మరొక ఎదురుదాడి.ఈ కాలంలో వెంకయ్య నాయుడి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమిటో, హోదాతో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చేసిందేమిటో ఒక శ్వేతపత్రం ప్రకటించి వివరిస్తే తప్ప జనానికి వాస్తవం అర్ధం కాదు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ప్రధాని అలా మనవి చేసుకుంటారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ?

      అన్నింటికీ కొత్త అర్ధాలు చెబుతున్న మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశానికి కూడా కొత్త భాష్యం చెప్పినట్లు ఒక అస్మదీయ పత్రిక వార్తలను బట్టి తెలిసింది. ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్‌ భేటీ అయ్యారని 40 నిమిషాలలో సగం పాకేజి,ఆంధ్రప్రదేశ్‌ గురించే మాట్లాడారని లీకుల కధనం. ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ప్రధానో లేక గవర్నరో అస్మదీయ పత్రికల విలేకర్లను పిలిచి చెవిలో వూది వుండాలి. లేకపోతే వారి ప్రతినిధులు కల్పించిన కధనమైనా అయి వుండాలి. తామేం చేసినా, చెప్పినా నోరు మూసుకొని వినాలి, పడి వుండాలన్న బరితెగింపు కాకపోతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే సమస్య మరింత జఠిలం అవుతుందని ప్రధాని మోడీ అభిప్రాయ పడినట్లు ఆ కధనంలో వుంది.అలాంటపుడు మజ్లిస్‌ పార్టీ ప్రతినిధితో సహా అఖిల పక్ష బృందాన్ని కాశ్మీర్‌కు ఎందుకు పంపినట్లు ? సమస్యను మరింత జఠిలం చేయటానికా ? ఇక ముందు ఎలాంటి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయరని భావించాలా ? అభివృద్ధి కావాలనుకున్నవారు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్నవారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్యాకేజికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. కొన్ని ప్రాంతాలలో ఇలాంటి వాటిని పోసుకోలు కబుర్లు అంటారు. హోదా బదులు వట్టిస్తరి మంచినీళ్ల వంటి పాకేజీకి జనాన్ని ఒప్పించటానికి పడుతున్న పాట్లు తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. పాకేజి పట్ల 60శాతం జనం సంతృప్తిగా వున్నారని ప్రతిపక్షాలు మాత్రం హోదా వల్ల అమిత ప్రయోజనాలు కలుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయని గవర్నర్‌ ప్రధానితో చెప్పినట్లుగా వుంది. ఒక గవర్నర్‌ ప్రధానితో కలిసినపుడు ఒక వేళ చెప్పాల్సి వస్తే ఏ పార్టీ వైఖరి ఏమిటో చెబుతారు తప్ప దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఒక రాజకీయ నేత మాదిరి ఫిర్యాదు చేస్తారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ? ప్రతిపక్షాలపై తాము చేయదలచుకున్న ఆరోపణలను గవర్నర్‌కు ఆపాదించి వాటికి విశ్వసనీయత కల్పించ చూసే అతి తెలివి తప్ప మరొకటి కాదు . అంతకంటే పెద్ద తెలివి తక్కువ పదజాలం చూడండి. ‘ ఇంకొన్ని అంశాలలో ఏపీకి సాయం అవసరమనే విషయం మేమూ గుర్తించాం. వాటిని కూడా అందించటానికి ప్రణాళిక రూపొందించుకుంటాం ‘ అని ప్రధాని పేర్కొన్నారట. ప్రణాళికను రూపొందించుకుంటాం అని ప్రధాని అన్నట్లుగా రాయటం చంద్రబాబు మెప్పు పొందటానికి తప్ప మరొకటి కాదు. ఒక కింది స్ధాయి అధికారి పెద్ద అధికారితో ‘మనవి’ చేసుకున్నట్లుగా వుంది తప్ప ఒక ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్య మంత్రితో మాట్లాడినదిగా లేదు. అయితే ఇక్కడ ఒకటి జరిగి వుండటానికి ఆస్కారం వుంది. ఆంగ్ల భాషలో ప్రధాని అంత పండితుడు కానట్లే హిందీలో కూడా చంద్రబాబు అంతే. అందువలన ఒకరు హిందీలో మరొకరు ఆంగ్లంలో ఫోన్లో మాట్లాడి నపుడు సదరు వార్త రాసిన విలేకరి పక్కనే వుండి విని రాసుకోవటం లేదా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడిన దానిని తర్జుమా చేయటంలో వచ్చిన ఇబ్బంది కానీ అయి వుండాలి.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

చంద్రబాబు చక్రం తిప్పటంపై జనంలో ఇంకా ఆశలు

    తెలుగుదేశ నాయకత్వ ఆరోపణలను వారి మాటల్లో చెప్పాలంటే వారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు జనాన్ని రెచ్చగొడుతున్నాయి. జనం రెచ్చిపోయిన సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. అంతా శాంతియుతంగా వుంది. కనుక తెలుగుదేశమే ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నది అనుకోవాలేమో ! ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా రాష్ట్రం అంటే ఏమిటో జనానికి ఒక బ్రహ్మ పదార్ధంగా తయారైంది. అది రాదని తెలిసిన తెలుగుదేశం, బిజెపిలు , వాటికి కొమ్ముకాసే మీడియా దాని వలన కలిగే ప్రయోజనాలను జనానికి వివరించి చైతన్య పరచటం, ఆశలు కలిగించటం తమకు నష్టమని భావించాయన్నది కొందరి అభిప్రాయం. కర్ణుడి రధం నడుపుతూనే అతనిని దెబ్బతీయటానికి ప్రయత్నించిన సారధి శల్యుడి మాదిరి అస్మదీయ మీడియా జనం పక్షం అని చెపుతూనే ప్రత్యేక హోదా పట్ల జనంలో ఆసక్తి సన్నగిల్లి పోవటానికి శల్యసారధ్యం చేస్తున్నదా ? ఆ మేరకు జయప్రదమైనట్లే కనిపిస్తున్నది. ప్రత్యేక హోదా రాదన్న నిరాశ, నమ్మిన వారే మోసం చేశారన్న ఆశక్తత జనంలో కనిపిస్తోందన్నది ఒక అభిప్రాయం. రెండో వైపు ప్రతిపక్షంపై విస్వసనీయత లేకపోవటంతో నిజం చెప్పినా నమ్మని స్ధితి, వామపక్షాలు నామమాత్రంగా మారటం. మూడో అభిప్రాయం కూడా వుంది అదేమంటే తిమ్మిని బమ్మిని చేయగల చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఐటి రంగంలో అమరావతిని మరో హైదరాబాదుగా మారుస్తారనే గుడ్డి విశ్వాసం బలంగా వుండబట్టే హోదా లేకపోయినా ఇచ్చిందాంతో సంతృప్తి చెందుదామనే భావనకు లోనయ్యారనే అభిప్రాయమూ వుంది.

  ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న శతకకారుడిని బిజెపి-తెలుగుదేశం పార్టీలు ఆశ్రయించినట్లు ఇప్పుడు వారి మాటలను బట్టి చెప్పవచ్చు. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి జనాన్ని భ్రమ పెడితే ఇప్పుడు ప్రత్యేక హోదా లేకపోయినా రాయితీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తారని బాబొస్తే జాబొస్తుందన్న పాత నినాదాన్ని తిరిగి జనానికి గుర్తు చేశారు. ఇది మరొక ఆశాభంగానికి నాంది అవుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సాయ ముఖ్యాంశాలు

08 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ 1 Comment

Tags

ANDHRA PRADESH, AP crisis, ap special status, Central government, Special Assistance To Andhra Pradesh, Special Assistance To Andhra Pradesh in brief

ఎంకెఆర్‌

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చివరికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజి కూడా లేకుండా ప్రత్యేక సాయం పేరుతో దిగువ గురువారం సాయంత్రం ఆర్ధిక మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఒక వివరణాత్మక నోట్‌ను వుంచింది. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

   పద్నాలుగవ ఆర్ధిక సంఘం నివేదికలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక లోటు మొత్తం రు.22,113 కోట్లు.ఈ మొత్తాన్ని ఐదు సంవత్సరాల వ్యవధిలో కేంద్రం చెల్లిస్తుంది.

    రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన ఆర్ధికలోటు పూడ్చటంలో భాగంగా ఇప్పటికే రు.3,979.5 కోట్లను కేంద్రం ఇచ్చింది, మిగలిన మొత్తాన్ని వార్షిక వాయిదాలలో చెల్లిస్తుంది.

    రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణ నిమిత్తం ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు చెల్లించింది. మిగిలిన వెయ్యి కోట్ల రూపాయలను తగు సమయంలో చెల్లిస్తుంది.

   వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక పాకేజి కింద ఇప్పటికే రు.1050 కోట్లు చెల్లించింది, మరో 1050 కోట్లను వచ్చే సంవత్సరాలలో అందచేస్తుంది.

   పోలవరం ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్ల విద్యుత్‌ వుత్పత్తి, 7.2లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది, ఎనభై టిఎంసిల నీటిని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లించే విధంగా రూపొందించారు. 2005-06 ధరలలో ఈ ప్రాజెక్టుకు రు 10,152.04 కోట్ల మేరకు ప్రణాళికా సంఘం అనుమతించింది. తరువాత కేంద్ర జలవనరుల సలహా సంఘం సిఫార్సుల మేరకు 2010-11 ధరలలో రు.16,010..45 కోట్లకు పెంచింది. దీనిలో రు.2,868 కోట్ల విద్యుత్‌, మంచి నీటి పధకాల మొత్తం కలసి వుంది.ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్ట ఆమోదం పొందక ముందు కేంద్ర ప్రభుత్వ ఏఐబిపి సాయంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి 2014 మార్చి 31వరకు రు.5,135.87 కోట్లు ఖర్చు చేసింది. దీనిలో కేంద్రసాయం రు.562.469 కోట్లు వుంది. దిగువ పద్దతిలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సాయం ఇలా వుంటుంది.

    2014 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి ప్రాజెక్టులో సాగునీటి అవసరాలకు అయ్యే ఖర్చులో మిగిలిన మొత్తాన్ని నూరుశాతం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రాజెక్టు నిర్మాణానికి తమను అనుమతించాలన్న ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్ధనను కేంద్రం అంగీకరించింది.

   అర్హత కలిగిన వెనుకబడిన ప్రాంతాలను నోటిఫై చేసినప్పటి నుంచి నగదు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది.

  విద్యా సంస్థల ఏర్పాటు విషయానికి వస్తే పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించారు.తాత్కాలిక ప్రాంగణంలో ఐఐటి పని చేయటం ప్రారంభమైంది. ప్రధాన ప్రాంగణ నిర్మాణం జరగాల్సి వుంది. కర్నూలులో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సెంటర్‌ తాత్కాలిక భవనాలలో ప్రారంభమైంది. ప్రధాన కాంపస్‌ నిర్మాణం జరగాల్సి వుంది. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్ధలాన్ని ఇప్పటికే ఎంపిక చేశారు. తిరుపతిలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ మరియు పరిశోధనా సంస్ధను, విశాఖలో ఐఐఎంను ఏర్పాటు చేశారు. గుంటూరులో ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపి, స్ధలాన్ని కూడా తీసుకున్నారు. గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థల ఎంపిక కమిటీ ఇప్పటికే స్థలాన్ని ఆమోదించింది. జాతీయ విపత్తు యాజమాన్య సంస్ధ ఏర్పాటకు అవసరమైన స్ధలాన్ని తీసుకోవలసి వుంది.

  ఆచరణ సాధ్యతకు లోబడి దుగ్గరాజపట్నంలో పిపిపి పద్దతిలో ప్రధాన రేవు ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆర్ధిక వ్యవహారాల మంత్రి వుపసంఘం అంగీకరించింది. వుక్కు, ఆయిల్‌ కార్పొరేషన్‌ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించాల్సి వుంది.

   విమానాశ్రయాలకు సంబంధించి విశాఖలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. తదుపరి విస్తరణకు భోగాపురంలో స్ధలాన్ని గుర్తించారు. దానిని ఎయిర్‌పోర్ట్‌ అధారిటీకి అప్పగించాల్సి వుంది. దానిని ఆ సంస్ధ లేదా పిపిపి పద్దతిలో అభివృద్ధి చేయవచ్చు. సాంకేతిక, ఇర్ధిక సాధ్యత నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాల్సి వుంది. విజయవాడ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 698 ఎకరాలను సేకరించాల్సి వుంది. తిరుపతి విమానాశ్రయంలో నూతన టెర్నినల్‌ను గతేడాది అక్టోబరు 22న ప్రధాని ప్రారంభించారు. మూడు విమానాలను పార్కింగ్‌ చేయటానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వున్న సౌకర్యాలు అంతర్జాతీయ విమానాలు దిగటానికి సరిపోతాయి. మరో నాలుగు విమానాల పార్కింగ్‌కు వున్న స్ధలంలోనే ఏర్పాట్లు చేస్తారు.

   జాతీయ రహదారుల ఏర్పాటు జాతీయ రహదారుల సంస్ధ అనేక చర్యలు తీసుకుంది. ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానితో హైదరాబాదు, ఆ ప్రాంతంలోని ఇతర పట్టణాలకు వేగంగా ప్రయాణించేందుకు అవసరమైన చర్యలు పరిశీలనలో వున్నాయి. విశాఖ, విజయవాడ-గుంటూరు-తెనాలి పట్టణ ప్రాంతాలలో మెట్రో రైళ్ల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలను చురుకుగా పరిశీలించటం జరుగుతున్నది.

   పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి పూర్తిగా చెల్లించటం జరుగుతున్నది. ఫలితంగా 2014-15తో పోల్చితే 2015-16లో 55శాతం పెరిగి అదనంగా రు.7787 కోట్లు వచ్చాయి. మరుసటి ఏడాదికి కూడా అలాగే చెల్లించటం జరుగుతున్నది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Central Government announced  Special Assistance To Andhra Pradesh 

08 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP crisis, ap special status, Central government, Special Assistance To Andhra Pradesh

1 The Central Government is committed to help and assist the newly created State of Andhra Pradesh. The commitments of the Centre emanate from four basic documents, namely, the provisions of the Andhra Pradesh Reorganisation Act, 2014, the report of the Fourteenth Finance Commission, the statement of the then Prime Minister before the Parliament on 20.2.2014 and the Report dated 1.12.2015 of Vice Chairman, NITI Aayog on Developmental Support to the Successor State of Andhra Pradesh under the Andhra Pradesh Reorganisation Act 2014.

2. The above mentioned commitments are broadly categorized as under:-

(i) The Andhra Pradesh Reorganisation Act:

(a) Section 46 of the Act provides for a reference to be made to the Fourteenth Finance Commission to take into account the resources available to the Successor States and make separate awards to them. It further provides for a developmental package to be given to the backward areas of the State of Andhra Pradesh. It also provides for adequate incentives in particular for Rayalaseema and north coastal regions of the State.

(b) Section 90 of the Act declares the Polavaram Irrigation Project as a National Project.

(c) Under Section 93 of the Act, the details of institutions and infrastructure to be developed in the State are outlined in the Thirteenth Schedule to the Act.

(d) Section 94 of the Act provides for appropriate fiscal measures, including offer of tax incentives, to be given to the Successor States to promote industrialization and economic growth. It further provides for support to programmes for backward areas including physical and social infrastructure. In addition, it provides for giving special financial support for creation of essential facilities in the new capital of the successor State of Andhra Pradesh, including the Raj Bhawan, High Court, Government Secretariat, Legislative 2 Assembly, Legislative Council and such other essential infrastructure.

(ii) Statement of the then Prime Minister Dr. Manmohan Singh on 20.2.2014: The then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 stated before the Rajya Sabha that Special Category Status would be extended to the State of Andhra Pradesh for a period of five years. This would be done to put the State’s finances on a firmer footing. He further stated that the resource gap for the year 2014-15 would be compensated by the Central Government.

(iii) Fourteenth Finance Commission: The Fourteenth Finance Commission defined the financial relationship between Centre and the States for the five year period ending 2019-20. The Commission did not make a distinction between Special and General Category States. Its approach was to fill the resource gap of each State to the extent possible through tax devolution. Accordingly, the Commission recommended an enhanced devolution of 42% of the Central Government’s tax revenues to States. If devolution alone could not cover the assessed gap, for certain States, a revenue deficit grant was provided. Andhra Pradesh was one of the States determined to be a revenue deficit State, and the Commission recommended that the Centre would provide revenue deficit grant for the period of the Fourteenth Finance Commission. The amount of deficit for each year was mentioned in the report itself and a total of Rs.22,113 crores is to be paid to Andhra Pradesh as revenue deficit grant for the 5 year period.

(iv) Report on Developmental Support to Andhra Pradesh dated 1.12.2015: The Vice Chairman, NITI Aayog Dr. Arvind Panagariya studied various aspects of the support to be given to Andhra Pradesh under the Reorganisation Act and made recommendations regarding effective implementation.

3 The Central Government’s commitments to the State of Andhra Pradesh

. Under the Andhra Pradesh Reorganisation Act, the commitment for the resource gap for the year 2014-15 is being met on the basis of standardized expenditure for that year. The revenue gap has been tentatively quantified subject to further adjustment on account of figures relating to certain pension schemes. A part of the revenue gap compensation amounting to Rs.3,979.5 crore has already been paid and the balance is being paid in annual instalments.

An amount of Rs.2,500 crore has already been paid as support for creation of new capital of State of Andhra Pradesh and a balance of Rs.1,000 crore would be paid in due course. An amount of Rs.1,050 crore has been disbursed as special package for backward areas and a further amount of Rs.1,050 crore would be paid in the coming years.

4. The Polavaram Project is on the river Godavari near Ramayyapeta village of Polavaram mandal, about 42 km upstream of Sir Arthur Cotton Barrage in the State of Andhra Pradesh. It envisages construction of a dam and canal system to create ultimate irrigation potential of 2,91,000 ha. (7.2 lakh acres), generation of 960 MW of hydro power, drinking water supply to a population of 28.50 lakh in 540 villages and diversion of 80 TMC of water to Krishna river basin. The project was accorded investment clearance by the Planning Commission for Rs.10,151.04 crore (at 2005-06 price level) in 2009. Further, the Advisory Committee of Ministry of Water Resources approved the cost at 2010-11 price level as Rs.16,010.45 crore during January, 2011 including power and drinking water component of Rs.2868 crore. Prior to the passage of the AP Reorganisation Act, the Polavaram Project was being implemented by the Government of Andhra Pradesh with Central Assistance under the Accelerated Irrigation Benefits Programme (AIBP). An expenditure of Rs.5,135.87 crore had been incurred up to 31.3. 2014 including Central Assistance of Rs.562.469 crore.

The Central Government will fund the Polavaram Irrigation Project in the following manner:

(i) It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1.4.2014, to the extent of the cost of the irrigation component on that date.

(ii) In view of the recommendations of the Vice Chairman NITI Aayog that it will be appropriate for the State of Andhra Pradesh to execute this project (as it is an important project and the State Government is keen to complete it at the earliest), the Government of India has agreed to the State’s request for the execution of the project by the State Government on behalf of the Government of India.

5. Government of India has already legislated for fiscal incentives of enhanced investment allowance and accelerated depreciation. They will come into effect once notified, after the State of Andhra Pradesh identifies the eligible backward areas.

6. In respect of educational and other institutions:  A Petroleum University has already been established.

 The IIT has already been functioning from a transit campus and the main campus is being constructed.

 The National Institute of Technology has already been functioning since September 2015 in a temporary campus and its main campus is being constructed.

 The Indian Institute of Information Technology, Kurnool has already started functioning from the temporary campus and would start functioning and its main campus is being constructed.

 The site for the Central University in Anantapur district has already been selected. 5  The Indian Institute of Science Education and Research has been established in Tirupati.

 The Indian Institute of Management has been established at Visakhapatnam.

 An All India Institute of Medical Sciences has been approved at Guntur and the land for the same is being taken over.

 A Tribal University is to be established in the State of Andhra Pradesh for which a Site Selection Committee of the State has already approved the land.

 A National Institute of Disaster Management is being established in the State of Andhra Pradesh for which identification and takeover of the land is being completed.

7.(i) The Cabinet Committee on Economic Affairs has given in-principle approval for the establishment of a major port at Dugarajapatnam in Andhra Pradesh on PPP basis, subject to feasibility.

(ii) Proposals with regard to the Steel Authority of India, Indian Oil Corporation/HPCL to set up units in Andhra Pradesh are being examined as provided in the Reorganisation Act.

(iii) Regarding airports:  In Vishakhapatnam, international flights are already operating. For further expansion, land has been identified at Bhogapuram. The State is to acquire and hand over land for development by AAI as per the standard terms for such development or develop on its own by PPP. A techno economic feasibility report is to be undertaken by State Government.  For Vijayawada, MoU has been signed by AAI with Govt. of Andhra Pradesh to develop the existing terminal. The State is to 6 acquire 698 acres of land required for the expansion as per the standard terms.  For Tirupati, the new terminal was inaugurated by the Prime Minister on 22.10.2015. A new apron for parking for 3 aircraft has been completed. The existing runway, apron and terminal building are adequate for commencing international flights. Expansion of new apron for parking additional 4 aircraft and isolation bay is under construction within the available land.

(iv) The National Highway Authority of India has taken several steps for establishment of the National Highways in the State of Andhra Pradesh. The Railways is considering measures for establishing a rapid rail and road connectivity between the new proposed capital of Andhra Pradesh with Hyderabad and other cities in the region. The Government of India is actively considering proposals for the establishment of the Metro Rail in Visakhapatnam and VijayawadaGuntur-Tenali urban area.

8. The Fourteenth Finance Commission’s award came into effect from 1.4.2015. The enhanced devolution amount due to Andhra Pradesh is being paid in entirety. This has resulted in an increase of Rs.7,787 crore in tax devolution in 2015-16 compared to 2014-15, a growth of 55%. The revenue deficit grants for each of the years recommended by the Fourteenth Finance Commission will also be paid by the Government of India to the State of Andhra Pradesh. The same has been done for the year 2015-16 and 2016-17. There are no issues pending on that score.

9. The Government of India is thus honouring and shall honour all commitments made under the Andhra Pradesh Reorganisation Act.

10. The statement of the then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 contains six paragraphs. There are no issues with regard to five out of the six paragraphs. With regard to the first point i.e. the grant of special status, an apparent conflict has set in, between the statement and the recommendations of the Fourteenth Finance Commission which came subsequently. On page 17 (para 2.29 & 2.30) of the Report, the Commission has stated (inter alia):

“We did not make a distinction between special and general category states in determining our norms and recommendations…… In our assessment of State resources, we have taken into account the disabilities arising from constraints unique to each State to arrive at the expenditure requirements. In this regard, we have observed that the North-eastern and hill States have several unique features that have a bearing on their fiscal resources and expenditure needs, such as low level of economic activity, remoteness and international borders. Our objective has been to fill the resource gaps of each State to the extent possible through tax devolution. However, we have provided post-devolution revenue deficit grants for States where devolution alone could not cover the assessed gap……

We are of the view that intra-state inequality is within the policy jurisdiction of the States and provisioning of adequate resources through tax devolution should enable them to address intra-state inequalities in an effective manner.”

Thus following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceases to exist. However, the Central Government has agreed to give a special assistance measure for Government of Andhra Pradesh for five years, which would make up for the additional Central share the State might have received during these years, i.e. 2015-16 to 2019-20, as envisaged in the then Prime Minister’s statement dated 20.2.2014. This will be in the form of Central Government funding for externally aided projects for the state for Andhra Pradesh signed and disbursed during these years.

11. Thus the Government of India has effectively addressed all commitments made to the State of Andhra Pradesh in the Andhra Pradesh Reorganisation Act, the Fourteenth Finance Commission and the statement of the then Prime Minister on 20.2.2014.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పవన్‌ కల్యాణ్‌ గబ్బర్‌ సింగా ? రబ్బర్‌ సింగా ?

30 Tuesday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, ap special status, BJP, jana sena party, Pawan kalyan, tdp

విశ్వసనీయత సమస్య ఎదుర్కొంటున్న పవర్‌ స్టార్‌

ఎంకెఆర్‌

    సినిమా వాళ్లు ఏది చేసినా నాటకీయంగా వుంటుంది.అది లేకపోతే జనానికి కిక్కు వుండదు. ప్రేక్షకులకు కిక్కు ఎక్కితేనే పోనీలెమ్మని సినిమాలు చూసిపెట్టి నాలుగు డబ్బులు నిర్మాతల మొహాన వేస్తారు. సినిమా కధ వూహించని మలుపులు తిరిగి వీక్షకులకు వుత్కంఠ కలగ చేసినట్లుగా ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనే డాక్యుమెంటరీ కూడా ఆసక్తికలిగిస్తోంది. దీనిలో నటులు, పాత్రలు కాకుండా నిజమైన వ్యక్తులే నటిస్తున్నారు గనుక డాక్యుమెంటరీ అనాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకస్మికంగా పవర్‌ స్టార్‌ పవర్‌ కల్యాణ్‌ తిరుపతిలో ఒక సభ జరిపి ఏకపాత్రాభినయంతో ప్రత్యేక హోదా గురించి పోరు ప్రకటన చేశారు. అనేక మందికి ముఖ్యంగా అధికారంలో వున్న తెలుగుదేశం-బిజెపి కూటమికి ఇష్టం లేని మాటలలో ప్రత్యేక హోదా ఒకటి.ఎందుకంటే అది గుర్తుకు వచ్చినపుడల్లా ఆంధ్రప్రదేశ్‌ జనం ఇంకా దాని కోసం ఎదురు చూస్తున్నారేమో అనే చిన్న అనుమానంతో కొద్ది క్షణాలే అయినా వారి మనసంతా వికలం అవుతుంటుంది.

     అన్నట్లు నాటకీయం అంటే తిరుపతి సభకు వారం రోజుల ముందు హైదరాబాదులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి ప్రత్యేకంగా వచ్చి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఆ సమయంలో వారు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి సినిమా విడుదల సందర్భంగా పవన్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని కుమారస్వామి చెప్పారు. కానీ అంతకు ముందే రాబోయే ఎన్నికలలో పవన్‌ కల్యాణ్‌ మద్దతును కుమారస్వామి కోరుతున్నట్లు దాని గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అటు న్యూఢిల్లీలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక హోదా గురించి తీవ్ర చర్చ, బంద్‌ జరిగిన సమయంలో పవన్‌ కల్యాణ్‌ మౌనంగా వున్నారు. ఈ పూర్వరంగంలో కుమార స్వామితో కలసి మీడియా ముందుకు వచ్చినపుడు పవర్‌ స్టార్‌ ఎంతో ప్రశాంతంగా, స్ధిత ప్రజ్ఞుడి మాదిరి ప్రత్యేక హోదా ఇవ్వను అని ఇంకా కేంద్రం స్పష్టంగా చెప్పలేదు, అయినా ఇది సున్నితమయిన అంశం కనుక ఇపుడే మీ మాట్లాడను తగు సమయంలో స్పందిస్తా అని చెప్పి ఎంతో సంయమనం పాటించారంటూ కొందరు విలేకర్లు వ్యాఖ్యానించారు.మరి అలాంటి వ్యక్తికి వారం రోజుల్లో ఏం మార్పులు కనిపించాయి, అదనంగా వచ్చిన స్పష్టత ఏమిటి, సున్నితాంశం కాస్తా తక్షణాంశంగా దాని స్వభావం ఎలా మార్చుకుంది, అసలు ప్రత్యేక హోదా గురించి రాజకీయ పార్టీలు, జనం కూడా మరిచి పోతున్న తరుణంలో పవన్‌ కల్యాణ్‌కు గుర్తుకు వచ్చి ఎందుకు ఆగ్రహం వచ్చింది అని అనేక మంది పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు. చీకట్లో ఏదైనా చెట్టు తొక్కాడా లేక తెలియకుండా ఎక్కడైనా బోధి వృక్షం కింద కూర్చొని వచ్చారా ? పవన్‌ కల్యాణే స్వయంగా చెబితే తప్ప తెలియదు, అప్పటి వరకు పది మంది నానా రకాలుగా అనుకుంటూనే వుంటారు.

     పుష్కరాల సందర్బంగా తాను స్వయంగా మునిగి జనాన్ని కృష్ణ నీటిలో మునకలు వేయించి ఎంతో పుణ్యం జనం ఖాతాలలో ఎంతో పుణ్యం జమ చేయించిన చంద్రబాబు, ఆయన పరివారం తమకు వచ్చిన ప్రచార కండూతి, ఇతర పుష్కర లాభాల గురించి లెక్కించుకుంటుండగా పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం, బిజెపి పార్టీని కూడా విమర్శించి కాస్త ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజి వస్తుందనీ చెప్పలేరు, రాదనీ చెప్పలేని స్ధితిలో వారు వున్నారు. పవన్‌ కల్యాణ్‌ మాటల్లో చెప్పాలంటే మేడమ్‌ ఎలాగూ లేరు కనుక బిజెపి వారు సార్‌తో భైంటక్‌( సమావేశం) ఏర్పాటు చేయిస్తామని మాత్రమే చెప్పగలరు. వారి దగ్గర అంతకంటే మాటలు లేవు.

   రాజకీయాల్లోకి రావాలని, చక్రం తిప్పాలని, నాలుగు డబ్బులు చేసుకోవాలని అనేక మంది కోరుకుంటున్నపుడు పవన్‌ కల్యాణ్‌ కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎన్‌టి రామారావు జనం కోసం సినిమాలను వదులుకొని ఎంతో త్యాగం చేశానని చెప్పుకున్నారు, కానీ ముందు జాగ్రత్తగా వవన్‌ కల్యాణ్‌ రాజకీయ, సినిమా నటన రెండూ చేస్తానని చెప్పారు. ఎందుకంటే పెద్ద కుటుంబం కదా ! గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రంగంలోకి వచ్చి చివరిదాకా నిలబడినట్లుగా తిరుపతి సభలో ఆ జాబితాలో బిజెపి, తెలుగుదేశం పార్టీలను కూడా జమ చేశారు, ఆ పార్టీలను ఎంత గట్టిగా విమర్శించారు, ఏకి పారేశారు అని కాదు, వాటికి అనుగుణంగా కట్టుబడి వుంటారా లేదా ఆ డైలాగులను పెట్టుబడిగా పెట్టి లబ్ది పొందుతారా అన్నదే సమస్య. రాజకీయాలలో విస్వసనీయతను ఏడు నిలువుల లోతున పాతరేసిన పార్టీలలో బిజెపి, తెలుగుదేశం తక్కువేమీ తినలేదు. వాటినేమీ పట్టించుకోకుండా, తెలిసినా తెలియనట్లు గా గత ఎన్నికలలో వాటి కొమ్ముకాశారు. ఎందుకైనా మంచిది అన్నట్లు స్వంతంగా జనసేన అనే స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో కొన్ని డైలాగులు తప్ప ఇంతవరకు తెలుగుదేశం, బిజెపిలను విమర్శించలేదు. అవి చెప్పిన మాటలను ఇంతకాలం గాఢంగా నమ్మటానికి దారితీసిన పరిస్థితులేమిటి ? ఇప్పుడు జ్ఞానోదయం కావటానికి కారణాలేమిటి అన్నది జనానికి సూటిగా చెప్పాలి. అప్పుడే తాను ప్రారంభిస్తానంటున్న ప్రత్యేక హోదా ఆందోళన వెనుక జనం చేరే అవకాశం వుంటుంది. గత ఎన్నికల నాటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటంటే విస్వసనీయతలేని రాజకీయ నాయకుల సరసన పవన్‌ కల్యాణ్‌ కూడా చోటు సంపాదించుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా పాకేజి కుదుర్చుకున్నారని విమర్శలు ఎదుర్కొన్న పవన్‌ కల్యాణ్‌ మరోసారి అలాంటిదానికి పూనుకోరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న వుండనే వుంది.

    రాజకీయాలలో ముందురోజు పొద్దు పోయే వరకు ఎదుటి పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన వారు తెల్లవారే సరికి అదే పార్టీలోకి ఫిరాయిస్తున్నారు, అంతకు ముందు వరకు తాను వున్న పార్టీని అంతకంటే ఎక్కువగా వుతికి పారేస్తున్నారు. ఏమిటీ ఈ విపరీతం అంటే ఈ రోజుల్లో మీకు తెలియందేముంది మాకు ఇష్టం వున్నా లేకపోయినా అధినాయత్వ చెప్పినట్లు చేయాలి కదా అని ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా సమర్ధించుకుంటున్నారు. ఇటువంటి స్ధితిలో గత ఎన్నికల తరువాత ఏడాదికి ఒకసారి వచ్చే సైబీరియా పక్షుల మాదిరి ఇలా వచ్చి అలా ఒక ప్రకటన చేసి పోతున్నారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ సారి కూడా అలాగే చేస్తారా అని అనుమానిస్తున్నవారు లేకపోలేదు. ఆర్ధికంగా ఇబ్బందులలో వున్న పవన్‌ కల్యాణ్‌ ఈమధ్య తాను ఎంతో అభిమానించే ఒక వాహనాన్ని కూడా అమ్ముకున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఒక పార్టీని స్ధాపించటం అంటే వందల కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చిన సొమ్మయినా వుండాలి లేదా ఎన్నికలలో అభ్యర్ధిగా నిలబెడతానని చెప్పి సీట్లు అమ్ముకొని అయినా ఆమేరకు పోగెయ్యాలి. పవన్‌ కల్యాణ్‌ దగ్గర అంత సొమ్ము వుందని ఎవరూ అనుకోరు, పోనీ సీట్లు అమ్ముకోవటానికి ఇంతవరకు పార్టీ లేదు, కార్యకలాపాలు లేవు, అన్నింటికీ మించి అప్పుడే ఎన్నికలు లేవు, అధికారానికి వస్తారనే వాతావరణమూ లేదు. బద్దశత్రువులు అనుకుంటున్నవారే జనం కోసం అనే పేరుతో చేతులు కలిపిన విపరీత పోకడల మన కళ్ల ముందే వున్నాయి. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం అధికారానికి వస్తే, అధికారానికి వచ్చిన తరువాత జనతా పార్టీ ఏర్పడిన చరిత్రా మన దేశంలో వుంది. అందువలన జనం తలచుకుంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. సినిమాలు మారినపుడు డైలాగులు కూడా మారతాయి, ఒక నటుడు ఒకే డైలాగులతో రెండు సినిమాలలో నటిస్తే జనం చూడరని తెలిసిందే. అందువలన బిజెపి, తెలుగుదేశం పార్టీలను విమర్శించినప్పటికీ రాజకీయ చాణక్యంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ను ఆకస్మికంగా వారే ప్రయోగించారన్న ప్రచారాలు వున్నాయి.

   ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తే ఏ ఏ రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయో వెంకయ్య నాయుడు వంటి వారు వారికి పదే పదే గుర్తు చేస్తారు. ఏపికి కల్పిస్తే మోడీని మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయని మరో మంత్రి చెబుతారు.తాను 21 సార్లు ప్రధానిని కలిశానని, 31 సార్లు కలిశానని మరోసారి అవసరమైతే ఇంకా ఎన్నిసార్లయినా కలుస్తానని, వత్తిడి పెంచుతానని చంద్రబాబు చెబుతూనే వుంటారు. పాకేజీల ప్రహసనమూ తెలిసిందే. బీహార్‌ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ వేల కోట్ల రూపాయల పాకేజీ ప్రకటించారు. దానిని అమలు జరిపిందీ లేనిదీ తెలియదు.టీ కప్పులో తుఫాను మాదిరి కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లుపై చర్చ తరువాత దానిని శీతల గిడ్డంగిలో పెట్టారు. ఒక రోజు బంద్‌ చేసి జనం కూడా తరువాత మౌనంగా వున్నారు. దీనికి విశ్లేషకులు కొందరు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ప్రత్యేక హోదా వస్తే పెద్దగా ఒరిగేదేమీ వుండదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా చెప్పారు. దాని కంటే భారీ పాకేజ్‌ మెరుగు అని వారితో పాటు వారికి నిత్యం సలహాలు చెప్పే జిగిని లేదా జిగురు జర్నలిస్టులు కూడా సందర్భం వచ్చినపుడు జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

    జనంలో ఇంకా ఏదో మూలన ప్రత్యేక హోదా గురించి మోజు వుందని, దాన్ని తాము తీర్చని కారణంగా ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్‌ వుపయోగించుకుంటాయామో, దాన్ని అడ్డుకోవాలంటే రాణీగారి అధికారపక్షం మాదిరి రాణీగారి ప్రతిపక్షాన్ని కూడా తామే ఏర్పాటు చేసుకోవాలనే ఎత్తుగడలో భాగంగా తెలుగుదేశం స్క్రిప్టు రాసి, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందన్నది ప్రచారంలో వున్న ఒక విశ్లేషణ. అయితే తెలుగుదేశం వారు కొందరు పవన్‌ కల్యాణ్‌ విమర్శలపై ఘాటుగా ఎందుకు స్పందిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒక బాణాన్ని వదిలిన తరువాత అది తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందో లేదో తెలియదు. కనుక ఒక జేబులో అనుకూల మరో జేబులో ప్రతికూల ప్రకటనలు, వివిధ పార్టీల జండాలు బొడ్డు చుట్టూ కట్టుకొని తిరుగుతూ ఏది వాటంగా వుంటే దాన్ని బయటకు తీసే రోజులివి. అందువలన కొందరు నేతలు పవన్‌ ప్రకటనను ఆహ్వానిస్తే ఎంతైనా వ్యాపార వేత్త గనుక దేనికి మార్కెట్‌లో డిమాండ్‌ వుంటుందో తెలిసిన వ్యక్తి కనుక టిజి వెంకటేష్‌ వంటి వారు కాస్త మసాలా దట్టించి డైలాగులు వదులుతున్నారు. గడ్డం పెంచి గడ్డం గీసుకున్నంత సులభం కాదు రాజకీయాలంటే అన్న గడ్డం భాష ఒకటి. దానికి కొద్ది నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎంత ఖర్చు చేసిందీ బహుశా గుర్తుకు వచ్చి వుంటుంది.

     తెలుగుదేశం అనే మర్రి చెట్టు నీడలో తాము ఎదగటం కష్టమనే విషయం బిజెపి నాయకత్వంలో మొదలైందని, తగినంత మెజారిటీ రాదనే కారణంతో ఎన్నికలకు ముందు కలసి నప్పటికీ ఇప్పుడు స్వంతంగా ఎదగాల్సిన అవసరం ఏర్పడిందన్నది ఆ పార్టీలో బహిరంగ చర్చ. అయితే ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ మాదిరే బిజెపి కూడా మోసం చేసిందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కారణంగా గతంలో వున్న మోజు చాలా మందికి తీరింది. తాము నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేనందున పవన్‌ కల్యాణ్‌ అనే బాణాన్ని బిజెపి వారే ప్రయోగించారన్న అభిప్రాయమూ వుంది. దీని వలన తెలుగుదేశాన్ని దెబ్బతీయటం, వైసిపి, కాంగ్రెస్‌లకు నోరు లేకుండా చేయవచ్చన్న ఎత్తుగడవుంది.రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఏదో విధంగా ప్రత్యేక హోదా సమస్యను సాగదీసి చంద్రబాబు వలన దాన్ని సాధించటం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని కలగచేయటం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయటం ఒకటి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వుత్తుత్తి పాకేజ్‌లు ప్రకటించి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన విధంగా అజాగళ స్ధనం మాదిరి పేరుకు ఏదో ఒక హోదా ప్రకటన చేసి దాన్ని పవన్‌ కల్యాణ్‌ ఖాతాలో వేసి ఇచ్చింది బిజెపి, తెచ్చింది జనసేన అనే పేరుతో మిగతావారిని పక్కకు పెట్టి తాము రాజకీయ లబ్ది పొందటంగా బిజెపి ఎత్తుగడ వుందన్నది ఒక అభిప్రాయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ సంస్ధలను ఏర్పాటు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అందెవేసిన చేయి. వాటిలో తమ అదుపులో వుండేవారిని ప్రవేశపెట్టి అవసరమైన సందర్భాలలో వుపయోగించుకుంటుంది. తిరుపతి సభలో విమర్శలు చేసినప్పటికీ బిజెపి, తెలుగుదేశం పార్టీలపై గతంలో కాంగ్రెస్‌ మాదిరి విరుచుకుపడలేదు. ఒకవేళ రానున్న రోజుల్లో విరుచుకుపడినా అది లాలూచీ కుస్తీ మాత్రమే అనే అభిప్రాయమూ వుంది. పవన్‌ కల్యాణ్‌కు కుల తత్వం వుందా లేదా అన్నది సమస్య కాదు, ఆయన చేసుకున్న వివాహాలను బట్టి కులతత్వాన్ని అంటకట్టలేరు. కానీ ఆయన వెనుక చేరుతున్న వారిలో కులశక్తులు వున్న వాస్తవాన్ని మాత్రం కాదనలేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాలలో కులం ప్రాధాన్యం వహిస్తున్న కారణంగా అలాంటి విమర్శలు లేదా ఆరోపణలు రావటం సహజం. అధికారం కోసం కులాలు, మతాలను, మూఢనమ్మకాలను పూర్తి స్ధాయిలో వుపయోగించుకుంటున్న రోజులివి.అందువల్లనే అది ఏ రాజకీయ పార్టీ లేదా నేత అయినా ఇప్పుడు విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ అందుకు మినహాయింపు కాదు.

    నేను సింహం లాంటోడ్ని అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అదే తేడా మిగతావన్నీ సేమ్‌ సేమ్‌టు సేమ్‌ అన్న డైలాగ్‌తో జనాన్ని ఆకట్టుకున్న పవన్‌ కల్యాణ్‌ తన విశ్వసనీయతను రుజువు చేసుకుంటారా లేక సేమ్‌ టు సేమ్‌ అన్నట్లు మిగతా రాజకీయ నేతల మాదిరి తానూ ఒకటే అని నిర్ధారిస్తారా ?ఎటు సాగదీస్తే అటు సాగే మాదిరి గబ్బర్‌ సింగ్‌ కాదు రబ్బరు సింగ్‌ అన్న విమర్శను నిజం చేస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏం సాధించారని చంద్రబాబు నవ్వారు ?

07 Sunday Aug 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

Amaravathi capital, Andhrapradesh, ap special status, BJP, tdp

ఎం కోటేశ్వరరావు

ఏమైంది,

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు.

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, నీకు కూడా నేను అదేచేశాను అంది అమ్మ.

ఏమైంది,

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు,

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, మీ అమ్మకు కూడా నేను అదేచేశాను అంది అమ్మమ్మ.

ఏమైంది ?

ఆంధ్రప్రదేశ్‌ పౌరులు వుగ్గపట్టుకు కూర్చున్నారు,

నాలుగు ఓదార్పు మాటలు చెప్పు, మీ అమ్మమ్మకు కూడా నేను అదేచేశాను అంది పెద్ద మామ్మ.

తరతరాలుగా ఓదార్పు మాటలు, ఎంతో విశ్వసనీయమైనవి, మీరూ వాటినే వుపయోగించండి !

   ఇవి చదవగానే తరతరాలుగా కొద్ది మార్పులతో వస్తున్న గుడ్‌ వర్డ్‌ గ్రైప్‌ వాటర్‌ వాణిజ్య ప్రకటన గుర్తుకు వచ్చి వుంటుంది.

  ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం-బిజెపి కూటములు నమ్మక ద్రోహానికి పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విచారించటం లేదు, ఏడవటం లేదు, కోపగించుకోవటం లేదు గానీ తామెన్నుకున్న పాలకులు, వాగ్దానాలు చేసిన వారు ఏం చేస్తారా అని వుగ్గపట్టుకు కూర్చున్నారు. ప్రత్యేక హోదా విషయంలో నమ్మక ద్రోహానికి గురయ్యామని తెలిసి కూడా ఎలాంటి అందోళనకు పాల్పడకుండా ఎంతో నిబ్బరంగా వున్నారు. బహుశా ఆంధ్రులు ఆరంభ శూరులు అనే విమర్శను తొలగించుకోవాలంటే ఎక్కడో అక్కడ ప్రారంభించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినపుడు చేసిన ఆందోళన, వెలిబుచ్చిన ఆగ్రహంతో పోల్చుకుంటే ఇప్పుడు తమ భవిష్యత్‌ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నా ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా వుండటాన్ని చూస్తే ఆంధ్రులు స్థిత ప్రజ్ఞులైనట్లు నిరూపించుకున్నారని అనుకోవాలి. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనే సింగపూర్‌ సిటీ నిర్మాణం జరిగితే గుప్తుల స్వర్ణయుగం మాదిరి చంద్రన్న స్వర్ణయుగం ఆవిర్భవించి ఎవరూ ఏమీ అడగకుండానే అన్నీ సమకూరుతాయనే ధీమా ఏర్పడిందా ? దీని పర్యవసానం ఏమిటి ?

    ఏడాదికి ఒకసారి మాత్రమే కనువిందు చేసే ‘మే ‘పుష్పం మాదిరి ప్రధాని నరేంద్రమోడీని కలిసి బయటకు రాగానే అరుదుగా కనిపించే చంద్రబాబు నాయుడి ముఖంలో నవ్వు వికసించింది. తాము అభిమానించే బాబా నోరు విప్పగానే సమక్షంలో వుండే భక్తులు బాబా మాట్లాడారు, బాబా మాట్లాడారు అని ఆనందంతో కేరింతలు కొట్టినట్లుగా, ఆర్కిమెడిస్‌ తాను కనుగొన్న సూత్రం గురించి యురేకా, యురేకా అంటూ బట్టలు వేసుకోవటం కూడా మరచి స్నానాల తొట్టి నుంచి లేచి వీధులలో పరుగెట్టినట్లుగా చంద్రబాబు నవ్వారని ఆయన భక్తులు మైమరచి పోతున్నారు. రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లు ఆర్ధిక పరమైనదా కాదా అని తేల్చేందుకు లోక్‌సభకు నివేదిస్తామనగానే సంతోషంతో కేరింతలు కొడుతూ బల్లలు చరిచిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాబోయే రోజుల్లో నయానో భయానో సాధిస్తాం తప్ప ప్రత్యేక హోదాపై ఇంకేమాత్రం నిరసనలు తెలుపబోమని విజయవాడలో చెప్పారు. సుజనా చౌదరి అలా బల్లలు చరిచి వుండాల్సింది కాదని చంద్రబాబు నాయుడు సర్ది చెప్పిన విషయం తెలిసిందే. ఇక వారి నేత బాలయ్య బాబు అయితే హోదా ఇవ్వకపోతే కంటి చూపుతో కాల్చేస్తా అన్నట్లుగా మాట్లాడతారు. అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో మాట్లాడుతూ విభజన హామీలు నెరవేరేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతారు. అసలు పోరాటం ఎప్పుడు మొదలు పెట్టారని ఎవరైనా అమాయకంగా లేదా అమాయకులు అడిగితే తెలుగుదేశం నేతలకు పట్టరాని ఆగ్రహం వస్తుందని సదా గమనంలో పెట్టుకోవాలి.జక్కన్న సినిమాలో బాలకృష్ణను అనుకరించి హాస్యం పండించటాన్నే లైట్‌గా తీసుకోలేని బాలకృష్ణ అభిమానులు హాస్యనటుడు ప్రధ్వీరాజ్‌ను బెదిరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఐదు కాదు పది అన్న వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఆ నాడు విభజన బిల్లులో ఎందుకు పెట్టలేదని మన్మోహన్‌ సింగ్‌ను ఇప్పుడు నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదాకు మరోవైపు ఎవరెవరు అభ్యంతరాలు తెలుపుతున్నారో వెంకయ్య నాయుడు మరోసారి గుర్తు చేసి అలాంటి వారిని అప్రమత్తం గావించారు. ప్రజాస్వామ్యం, సహనంపై జనంలో ఇంకా విశ్వాసం వుంది కదా అని ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, వాదించవచ్చు.

     నరేంద్రమోడీ మాట్లాడేందుకు సిద్దపడితే ఢిల్లీ వెళతానని చెప్పిన చంద్రబాబు ఎలాగైతేనేం ఢిల్లీ వెళ్లారూ, తిరిగి రానూ వచ్చారు. మోడీ గారి వేద గణితం మాదిరి చంద్రబాబు లెక్కల్లో ఇది 31వ సారి అనుకోవాలి. లేదా మోడీతో ప్రత్యేక హోదాపై మాట్లాడటంతో కొంత మంది భ్రమింప చేస్తున్నట్లుగా ఆవిర్భవించిన నూతన శకంలో తొలి పర్యటనగా అయినా లెక్కించుకోవాలి. ఢిల్లీ వెళ్లారా లేదా అని కాదు అన్నయా ఏం సాధించుకువచ్చారని చిలక నవ్వులు నవ్వినట్లు అన్నట్లు చంద్రబాబు సాధించిందేమిటి ? కలలో కూడా నెరవేరని గట్టి హామీ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి తమకు అభ్యంతరం లేదని, తమ రాష్ట్రాలకూ దాన్ని ఇవ్వాలని కోరుతున్న ముఖ్య మంత్రులను బుజ్జగింప చేసి ఆంధ్రప్రదేశ్‌కు ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని నరేంద్రమోడీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. నరేంద్రమోడీ-చంద్రబాబు భేటీ సందర్భంగా తాను పక్కనే వున్నట్లుగా ‘ఏపినీ అదుకొనే బాధ్యత నాది, మీరు నిశ్చింతగా వుండండి అని చంద్రబాబును వుద్ధేశించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారంటే ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని భావించవచ్చు. ప్రతిపక్షాలు కోరుతున్నట్లు ప్రత్యేక హోదా మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోకుండా ఆర్ధికంగా ఇబ్బందులు వున్న రాష్ట్రాన్ని ఆదుకోవటానికి ఇతోధికంగా సాయం చేయటంతో పాటు పన్ను రాయితీలు కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించటం శుభసూచకం’ అని వ్యాఖ్యాత పేర్కొన్నారు.నిజంగా అదే జరిగితే అంతకంటే కావాల్సిందేముంది. అలాంటి చిత్తమే వుంటే ఇంత రచ్చ జరగటానికి అవకాశం ఎందుకు ఇచ్చినట్లు ? ప్రతిపక్షాలు కోరుతున్నట్లు అన్నారు, తెలుగుదేశం కోరటం లేదనేనా ? తమకు లేని హోదా, రాయితీలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు అంగీకరించి తమ రాజకీయ పునాదిని తామే కూల్చుకునేంత అమాయకంగా మమతాబెనర్జీ,నవీన్‌ పట్నాయక్‌, జయలలిత వున్నారా ? పోనీ వారు ముగ్గుర్ని ఒప్పిస్తే మిగతావారి సంగతేమిటి? భారతంలో ద్రౌపది తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా అన్న సందేహం లేవనెత్తినట్లుగా ఆ వ్యాఖ్యాత తాను నమ్మి జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారా లేక జనాన్ని మాత్రమే నమ్మించేందుకు పూనుకున్నారా ?

    ఆదాయమున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని ఒక విధాన పరంగానే నిలిపివేసింది.నిధులు అంతగా లేని రాష్ట్రాలు కూడా అదేబాటలో నడుస్తున్నాయి. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించారు, దానికి రాజధాని కూడా లేదు నుక ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వటానికి వుదారంగా అంగీకరించండని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనధికారికంగానే అడిగారనుకోండి. విభజన సమయంలో మా అభిప్రాయం అడగలేదెందుకుని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు ? ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ముందుగా తాను అధికారంలో వున్న రాష్ట్రాలకు అలాంటి అభ్యంతరం లేదని ప్రకటింపచేసి మిగతావారిని అడిగితే నిజాయితీగా, నిజమైన రాజనీతిజ్ఞురాలిగా బిజెపిని పరిగణిస్తారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎక్కడకు తరలించాలా అని చూసిన టాటా నానో కార్ల కంపెనీకి రాయితీలు ఇచ్చే శక్తి లేక అనేక రాష్ట్రాలు ఆ పోటీలో వెనుకబడగా జనం సొమ్మును కార్పొరేట్లకు కట్టపెట్టటంలో ముందున్న గుజరాత్‌ దానిని దక్కించుకుంది. అటువంటపుడు ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రత్యేక రాయితీలు ఇవ్వటానికి ఎలా ఒప్పుకుంటుంది? ఒక రాష్ట్రానికి వుదారంగా నిధులు సాధ్యం కాదని సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్‌ట్లీ రాజ్యసభలో ప్రత్యేక హోదా అనధికార బిల్లుపై చర్చ సందర్భంగా చెప్పిన చారిత్రాత్మక సమాధానంలో స్పష్టం చేసిన విషయాన్ని అప్పుడే ఎలా మరిపోగలం ? ప్రత్యేక హోదా సినిమా చివరికి ఎలా ముగుస్తుందో తెలియదు గాని కధ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం అమోఘంగా వుందనే విధంగా ప్రచారం హోరెత్తుతోంది.

     ప్రత్యేక హోదా రాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిర్ణయించుకున్న తరువాత వాటిని ఇవ్వకూడదని నిర్ణయించుకున్న బిజెపి, ఇవ్వకపోయినా గట్టిగా అడగకూడదు, ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయాలని చూస్తున్న తెలుగు దేశం పార్టీలపై జనంలో తలెత్తిన చిరు అసంతృప్తి లేదా ఆగ్రహాన్ని కూడా వుపశమింపచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వాటిని చూస్తుంటే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. మొరటు సామెత మాదిరి వుపస్థ మినహా గర్భాదాన అన్నట్లు కీలకమైన అంశాలు లేకుండా తూతూ మంత్రంగా ప్రత్యేక హోదా కల్పించేందుకు ఏదైనా పధక రచన చేస్తున్నారా ? అన్నది వాటిలో ఒకటి. అదే అయితే వ్యతిరేకించే రాష్ట్రాలేవీ వుండవు. పన్నులు విధించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి హరించి కేంద్రం తీసుకొనేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం పొందటం లాంఛనమే కను ప్రత్యేక హోదా ప్రకటించిన రాష్ట్రాలలోని పరిశ్రమలు, వ్యాపారాలకు పన్నులను మినహాయించాల్సింది కూడా కేంద్రమే అవుతుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో ఏర్పాటయ్యే వాటికి మినహాయింపులు ఇవ్వటం ద్వారా ఖజానాకు వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తుందా? అన్ని రాష్ట్రాలు భరించాలా? పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు రాయితీలు ఇవ్వటాన్ని నిరుత్సాహపరచాలని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని వెనుకబడిన రాష్ట్రాల నుంచి ఒకవైపు డిమాండ్‌ పెరుగుతున్నది, అలాంటపుడు ముందుబడినట్టు చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపులు ఎలా ఇస్తారు ? వస్తు, సేవల పన్ను విధానాన్ని అమలు జరపటమే ఒక సవాలుగా మారనుందని విశ్లేషణలు వెలువడుతున్న తరుణంలో ఈ సమస్యలన్నీ మరింతగా ముందుకు వస్తాయా రావా ?

    రాష్ట్ర విభజనకు పూర్తిగా కాంగ్రెస్‌దే బాధ్యత అని నిత్యం దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో వుంది కనుక, అందుకు చొరవ తీసుకుంది కనుక దానిదే బాధ్యత అనటంలో సందేహం లేదు. కానీ మిగతా పార్టీలు ఎలా తప్పుకుంటాయి. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన బిజెపి, రెండు కళ్ల సిద్దాంతం పేరుతో విభజనకు అంగీకరించిన తెలుగుదేశం పార్టీ సంగతేమిటి ? అందువలన ముందుగా బిజెపి తన పాలిత రాష్ట్రాల అభిప్రాయాన్ని వెల్లడించి తన నిజాయితీ ఏమిటో జనం ముందు ప్రదర్శించాలి.

      గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు రాజకీయ పార్టీల ఆలోచనలు, గోత్రాలు వాటికి దగ్గరగా వుండే వారికే బాగా తెలుస్తాయి. అలాంటి వారిలో జిగిని జర్నలిస్టు తెగ ఒకటి.ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా సాధించిందేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తమకు రెండు వందల స్ధానాలకు మించి రావని, అప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టటం అవసరం అని బిజెపి పెద్దలు లెక్కవేస్తున్నారని అలాంటి ఒక జర్నలిస్టు విశ్లేషించారు. అంటే మోడీ గాలి పోవటం ప్రారంభమైందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై వున్న కేసులలో ఆయనకు శిక్ష పడితే , ఆ పార్టీ వెనుక వున్న జనం తిరిగి కాంగ్రెస్‌వైపే చేరతారని దాంతో కాంగ్రెస్‌ ఎన్నో కొన్ని సీట్లు పొందే అవకాశం వుంది కాబట్టి ప్రస్తుతానికి జగన్మోహన్‌రెడ్డి జోలికి పోగూడదన్నది బిజెపి ఆలోచనగా వుందట.వైసిపిని దెబ్బతీయటానికి సహకరిస్తే రాష్ట్రంలోని 25కు గాను 20 సీట్లు గెలుస్తామని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుందట. అంటే అలా చేస్తే జన్మజన్మల బంధం మాదిరి వచ్చే సారి కూడా మద్దతు ఇచ్చి ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ ముందస్తు ఆశ చూపుతోందా? అవినీతిని అంతం చేస్తామని, అక్రమార్జన పరుల తాటతీస్తామని తమ పార్టీ రూటే సపరేటని చెప్పుకున్న బిజెపి పత్రికల్లో రాసేంతగా తమ అధికార దాహ ఆలోచనలను వెల్లడిస్తోందా ? ఏ పార్టీలో గెలిచినా అమ్ముడు పోయే ఎంపీలు, ఎంఎల్‌ఏలు తామర తంపరగా పెరిగి పోతున్న ఈ రోజుల్లో వారిని కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బుండి, సైద్ధాంతిక, నైతిక బాదర బందీలేని బిజెపి,తెలుగుదేశం వంటి పార్టీలు రాబోయే అధికారం గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తే వారు ఇంక ప్రజల గురించేమి పట్టించుకుంటారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కావాల్సింది వృధా చర్చా ! నమ్మక ద్రోహంపై రచ్చా !

04 Thursday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, center's betrayal, CHANDRABABU, tdp

ఎం కోటేశ్వరరావు

     పుష్కర స్నానాల వలన పుణ్యం వస్తుందని బలంగా విశ్వసించటానికి కొంత మందికి ఎలా స్వేచ్ఛ వుందో అదొక మూఢనమ్మకం అని నమ్మేవారికి కూడా అంతే స్వేచ్చ మన దేశంలో వుంది. అందువలన సందర్భం వచ్చినపుడు దాని మంచి చెడ్డలను చర్చించటం తప్పుకాదు. వ్యతిరేక అభి ప్రాయాన్ని వ్యక్తీకరించటం ద్వారా మా మనోభావాన్ని దెబ్బతీశారని ఎవరైనా దెబ్బలాటకు వస్తేనే సమస్య. ప్రపంచంలో ప్రతి మతం, కులం, తెగ ఇలా ఎన్ని తరగతులుంటే అన్నింటికీ సారూప్యత గలిగిన మూఢనమ్మకాలు,ఆచారాలకు కొదవ లేదు. ఆధునిక ప్రవచన కారులు సరికొత్త మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నారు. పుష్కరాలనేవి ఒక మతానికి చెందిన నమ్మకం తప్ప వేరు కాదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు రోజుల పాటు పన్నెండు అంశాల మీద రోజుకొకదానిపై చర్చా గోష్టులు, సదస్సులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రజానీకంలో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించటానికి, ఓట్లు దండుకోవటానికి, చివరకు నమ్మక ద్రోహానికి మారుపేరుగా మారిన రాష్ట్ర ప్రత్యేక హోదా రాకపోతే ఏం చేయాలో, ఇప్పటికే చేయాల్సిందానికంటే ఎక్కువే చేశాం లెక్కలు చెప్పటం లేదంటున్న బిజెపి నేతల ప్రచార వాస్తవ అవాస్తవాలేమిటో ఒక సమగ్ర శ్వేత పత్రం ప్రకటించి పన్నెండు కోణాలలో పన్నెండు రోజులు చర్చలు జరపమని చంద్రబాబు నాయుడు రచ్చ చేసి వుంటే చర్చ సమంజసంగా వుండేది. కనీసం జనానికి వాస్తవాలు ఏమిటో అన్నా తెలిసేవి. కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధులతో ఆర్ధిక లోటు తీర్చి, ప్రత్యేక హోదాతో వచ్చే ఆకర్షణీయ రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర రూపు రేఖలు మార్చివేస్తామని చెప్పిన వారు అసలు ఆ ఆంశాలనే చర్చనీయాంశాల జాబితాలో లేకుండా చేశారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినట్లుగా ప్రత్యేక హోదాకు కూడా అదే చేస్తారా ? చిత్రం ఏమంటే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఒక మూఢనమ్మకం, ఒక మతానికి చెందిన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం జరప తలపెట్టిన చర్చలో సమాజ పురోగతికి అవసరమైన శాస్త్రీయ భావజాలాన్ని చర్చ నీయాంశంగా చేయకపోవటం. అసలు మత క్రతువుల సందర్భంగా ఇలాంటి కిరస్తానీ చర్చలేంటి అనే ‘గురజాడ అగ్నిహోత్ర అవధానులు’ ఎవరైనా వుంటే అది వేరే విషయం.

     చర్చ చేయండని చంద్రబాబు చెప్పిన పన్నెండు అంశాలు విజన్‌ 2050లో పేర్కొన్నవాటికి మించి సామాన్యజనానికి ఆసక్తి కలిగించేవి కొత్తగా ఏమన్నా వుంటే వాటి గురించి చర్చించవచ్చు. అన్నింటికీ మించి విచారకరమైన అంశం ఏమంటే రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితేమీ లేకున్నా, నమ్మక ద్రోహం జరిగిందని యావత్‌ ప్రజానీకం భావిస్తున్న స్ధితిలో గతాన్ని గోతిలో పారవేసి ఏం చేసినా పొత్తు పెట్టుకున్నోళ్లతో సర్దుకు పోక తప్పదన్న వైఖరి తీసుకోవటం ఒక విషాదం. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి విషయాలలో తాను రాజకీయాలు చేయనని, అందుకు ఇతర సందర్భాలుంటాయని చంద్రబాబు అనేకసార్లు చెప్పి పెద్ద రాజనీతిజ్ఞుడిగా అనేక మంది ప్రశంసలు పొందారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి తప్ప అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో పరిణితితో అన్ని పార్టీలను ఏకత్రాటిపై నడిపించి కేంద్రంపై వత్తిడి పెంచాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా తాను, తన సైనికుల ద్వారా రాజకీయాలు మాట్లాడించి నిజమైన రాజనీతిజ్ఞుడు, రాష్ట్రంకోసం నిజాయితీగా పని చేస్తున్నారు అనే పేరు తెచ్చుకొనే అవకాశాన్ని జారవిడుచుకున్నారు.ప్రత్యేక హోదా విషయంలో మిగతా పార్టీలను కలుపుకుంటే దాని ద్వారా పొందే రాజకీయలబ్ది తగ్గుతుందనుకున్నారా ? తద్విరుద్ధంగా ప్రవర్తించి బిజెపిని ఒక్క మాట కూడా అనకుండా మొదటికే మోసం తెచ్చుకొనేందుకు పునాది వేసుకున్నారా ? గోదావరి పుష్కరాలలో మునిగి పుణ్యం పొంది ప్రత్యేక హోదా, కనీసం లోటు పూడ్చుకొనేందుకు నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ పుణ్యం ఏమైనట్లు ?

     ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావించటం సందర్భ సహితం అని భావిస్తున్నాను.ముస్లిం లేదా ఇస్లాం హాజ్‌ సబ్సిడీలను 2022 నాటికి రద్దు చేయాలని ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అదే సమయంలో హిందు క్రతువులకు ప్రజల సొమ్మును ఖర్చు చేయటం విపరీతంగా పెరిగిపోతోంది. అవి పుష్కరాలు, కుంభమేళాలు, మానస సరోవర, చార్‌ధామ్‌ వంటి యాత్రలు ఏవైనా కావచ్చు. వాటి సందర్భంగా పెడుతున్న ఖర్చు హాజ్‌ సబ్సిడీల కంటే ఎంతో ఎక్కువగా వుంటోందా లేదా ? హాజ్‌ మాదిరి నగదు సబ్సిడీ ఇవ్వకపోవచ్చు, అందుకోసం ఏర్పాట్ల పేరుతో చేసే ప్రజాధనం ఖర్చు సంగతేమిటి ? ప్రతి సేవకూ రుసుము చెల్లించాల్సిందే ఏదీ వుచితం కాదు అని చెబుతున్న ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాల సందర్బంగా చేసే ఖర్చులకు ఒక ఖాతాను తెరిచి అందుకయిన ఖర్చును, వాటిలో పాల్గొన్నవారి నుంచి రాబడితే అది విమర్శలకు తావుండదు. అలా చేయటం లేదే ! పుష్కర యాత్రీకులను ఘాట్ల వద్దకు చేర్చేందుకు వుచితంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. అసలే ఆర్టీసి నష్టాల్లో వుందని చెబుతూ ఇలా చేయటాన్ని ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లు ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు ?

    బ్రిటీష్‌ వారి కాలంలో రాణీగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాజ్‌ సబ్సిడీ స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించారు. స్వాతంత్య్రపోరాట కాలంలో ముస్లింలను పోరుబాట నుంచి వేరు చేయటానికి తెల్లవారు అనేక ఎత్తుగడలు వేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. విమానాలు రాక ముందు ఓడలే ప్రయాణ సాధనాలు కనుక బ్రిటీష్‌ ప్రభుత్వం తమ దేశ ఓడల కంపెనీ ఓడ ఎక్కి సౌదీ వెళ్లిన వారికే సబ్సిడీ అని కూడా నిబంధన విధించినందున దానిలో కూడా షిప్పింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దాగి వుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తెల్లవారిని తరిమేసి వారి స్ధానంలో అధికారానికి వచ్చిన నల్లవారు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా దానిని కొనసాగించారని చేసే విమర్శలో వాస్తవం లేకపోలేదు. చేసిన మార్పేమిటంటే ఓడల రాయితీని విమానాలకు వర్తింప చేశారు. అది కూడా ప్రభుత్వ రంగ విమానాలకే వర్తిస్తుంది. ఇది లౌకిక వాదానికి విరుద్ధం అంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దానిని విచారించిన సుప్రీం కోర్టు 2012లో ఒక తీర్పు ఇస్తూ 2022 నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ సబ్సిడీని హిందూత్వ శక్తులు మతకారణంతో వ్యతిరేకిస్తే, మాకు సబ్సిడీ ఇచ్చే పేరుతో ఎయిరిండియాను బతికించేందుకు ప్రభుత్వం దానికి మాత్రమే ఇచ్చిందని, ఇతర కంపెనీల రేట్ల కంటే ఎయిరిండియా రేట్లు ఎక్కువని విమర్శించే ముస్లింలు కూడా లేకపోలేదు.

    పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి.ఒక మత పుష్కరాలను రాష్ట్ర వేడుకగా నిర్ణయించటం లౌకిక వ్యవస్ధకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమా, అనుకూలమా ? గతేడాది గోదావరి, ఈ ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెడుతున్న ఖర్చు, చేస్తున్న హడావుడి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు.ఎన్నడూ లేని కొత్త కొత్త పద్దతులను ప్రవేశపెడుతున్నారు. నిజంగా పుష్కరుడు వుండి వుంటే గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన దానికి నిరసనగా కృష్ణా పుష్కర బహిష్కరణ జరిగేదేమో? పుష్కరాల కంటే ముఖ్యమంత్రుల కీర్తి కండూతిని పెంచుకోవటం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ విదేశాల్లో వున్న వారికి, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నవారికి , షరా మామూలుగా గ్రామాలు, పట్టణాలలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంతకంతో కూడిన ఆహ్వానాలు పంపటం ప్రచార ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. వాటి కాంట్రాక్టు పుచ్చుకున్న ముద్రణా సంస్ధలకు తప్ప వాటిని అందుకున్నవారికి, అందుకయ్యే అనవసర ఖర్చు భరించే జనానికి ఒక్క పైసా ప్రయోజనం వుంటుందా? హాజ్‌ సబ్సిడీని రద్దు చేస్తూ అందుకు చేసే ఖర్చును కావాలంటే మైనారిటీల సామాజిక, విద్యా అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన సలహా ఇతర సందర్భాలకు వర్తించదా ?

   రెండు సంవత్సరాలు గడిచినా చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు జరపని స్ధితి.కొంతకాలం రాజధాని భూ సేకరణ, మరికొంత కాలం రాజధాని ఎలా వుండాలి, మరి కొంత కాలం తాత్కాలిక రాజధాని నిర్మాణం, మరి కొంత కాలం శాశ్వత రాజధాని ఎలా నిర్మించాలి, దానికి అప్పు ఎలా తేవాలి ఇలా ఆవు వ్యాసం రాసిన మాదిరి కాలక్షేపం చేయటం, ప్రతి సందర్భాన్ని అతిశయోక్తులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించటం తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇలాంటి వాటికి బుట్టలో పడేంత ఆమాయకంగా ఆంధ్రులు వున్నారా ? ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు. అతిగా ప్రచారంలో జనాన్ని ముంచితే తామూ దానిలోనే మునుగుతారని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘ప్రత్యేక హోదా ‘అనే తెలుగుదేశం తోలు బొమ్మలాట

31 Sunday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, narendra modi promises, tdp puppetry

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బిజెపి-తెలుగు దేశం మధ్య ఇంతకాల నడిచిన డ్రామా గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తేట తెల్లమైంది. ఈ అంశంపై తలెత్తిన పరిస్థితి పర్యవసానాలతో రెండు పార్టీల సంబంధాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఆదివారం నాడు తెలుగుదేశ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు మరికొంత కాలం గడపటానికి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తోంది. ఎంతకాలం అన్నది అప్పుడే చెప్పలేము. అభివృద్ధి పేరుతో అధికారాన్ని అంటి పెట్టుకొని వుండేందుకు అలవాటు పడిన శక్తులు ఎన్నికలు ఇంకా చాలా దూరం వుండి, అధికార పక్షానికి సంపూర్ణ మద్దతు వున్న స్థితిలో అంత తేలికగా కేంద్ర అధికారాన్ని వదులు కుంటాయని చెప్పలేము. రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యవహరించిన తీరు ప్రధాని నరేంద్రమోడీకి తెలియదన్నట్లుగా ఒకసారి ఆయనను కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదంతా రాజకీయం తప్ప మరొకటి కాదు. జనం కోసం తప్ప ఆమాయకులు, అవివేకులు ఎవరూ లేరు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు గురించి ఎంతో చర్చ జరిగిన విషయాన్ని పట్టించుకోనంతగా నరేంద్రమోడీ ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నారు? అసలు మోడీతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఇంతటి ముఖ్యఅంశంపై బిజెపి నేతలు ఆషామాషీగా పార్లమెంట్‌కు వచ్చారనుకుంటే జనం చెవుల్లో పువ్వు పెట్టటమే. అననుకూల పరిస్ధితులను కూడా తమ లబ్దికి వుపయోగించుకోవాలనే తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమే దీనిలో కనిపిస్తోంది. ఇంత జరిగాక ప్రధాని మోడీని, ఇతర మంత్రులను కలసి కూడా కొత్తగా ఏ వాదనలు వినిపిస్తారో, ఏం సాధించుకువస్తారో ముందు ముందు జనం చూస్తారు.

   ప్రత్యేక హోదా అంశాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన ప్రధమ పార్టీలుగా తెలుగుదేశం-బిజెపి వున్నాయి. అదే ఇప్పుడు భూతంగా మారి భయపెడుతోంది. జరగబోయే రాజకీయ నష్టాన్ని తగ్గించుకొనేందుకు తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నించినట్లే, ఇతర పార్టీలు రాబోయే రాజకీయ లాభాన్ని పెంచుకొనేందుకు పూనుకుంటాయి. జరిగిన మోసం గురించి ఆంధ్రులు ఎలా స్పందిస్తారు అనేది కూడా రానున్న రోజులలో ఆసక్తి కలిగించే అంశమే. మోసాన్ని తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో మౌనంగా వుంటారా ? లేదా గతంలో అనేక సందర్బాలలో మాదిరి తీవ్ర ఆందోళనకు పూనుకుంటారా అన్నది చూడాలి.

    టాటా-బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా మాదిరి తెలుగుదేశం-బిజెపి మధ్య వచ్చిన పవన్‌ కల్యాణ్‌ నుంచి ఎలాంటి పవనాలూ ఇంతవరకు వెలువడలేదు. ఇప్పటి వరకు అనేక మంది పవర్‌ స్టార్‌ను లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య మాదిరి భావిస్తున్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తారా లేదా అన్నది కూడా తేలిపోవటం అనివార్యం. ప్రత్యేక హోదా అంశం గురించి గతంలోనేను ఈ బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి మెచ్చుకున్నవారూ వున్నారు, అవన్నీ వూహాజనితం, అవాస్తవాలని త్వరలో తేలిపోతాయని వివిధ రూపాలలో వ్యతిరేకంగా స్పందించిన వారూ వున్నారు. గుడ్డి అభిమానుల బుర్రలలో లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ అలాగే వుంటే వారిని స్పందింప చేయటం సాధ్యంగాని పని. ప్రత్యేక హోదా రాదని నిర్ధారణ అయినందుకు నాకేమీ సంతోషం లేదు. ఏ ఒక్క పార్టీకి దీని గురించి చిత్తశుద్ధి లేదని తొలి నుంచి భావించిన వారిలో నేనూ ఒకడిని.

    కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన నిబంధనలను మార్చకుండా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజీ ఇవ్వటం సాధ్యం కాదు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానంలో అది తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అంటే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించి వాటి నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదా పరిశ్రమలు, సంస్ధల ఏర్పాటు సందర్బాలలో మాత్రమే కేంద్రంలో వున్న పెద్దలను ప్రభావితం చేసేందుకు అవకాశం వుంటుంది. అలాంటి వాటిని కేంద్ర పాలిత పాంతం లేదా ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి. ఒక రాష్ట్రంలో పెట్టదలచుకున్నదానిని మార్చి మరొక చోట పెట్టే విచక్షణ అధికారం వుంటుంది.అంతకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయిని కూడా కోరుకున్న లేదా బతిమిలాడిన, బెదిరించిన రాష్ట్రాలకు ఇవ్వటానికి లేదు. గత పాతిక సంవత్సరాలుగా రక్షణ రంగంలో తప్ప కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒక్క విద్యుత్‌ రంగంలో తప్ప మిగతా పరిశ్రమలు కొత్తగా పెట్టినవేమీ లేవు, భవిష్యత్‌లో పెట్టాలనే వైఖరి లేదు. విద్యుత్‌ కేంద్రాలను ఎక్కడ పెట్టినా తయారయ్యే విద్యుత్‌లో రాష్ట్రాలకు ఎలాగూ వాటా వుంటుంది. అవి కేంద్ర సంస్ధలు కనుక వుద్యోగాలు కూడా పెట్టిన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలూ వుండవు. అందువలన కేంద్రంతో సఖ్యతగా వుండాలి, ఆ పేరుతో రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని ఏ పార్టీ చెప్పినా అది తన రాజకీయ విధానానికి వేసుకొనే ముసుగుతప్ప మరొకటి కాదు. గత రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనినే రుజువు చేసింది.

   విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి కేంద్రం నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి విజన్‌ 2050 నాటికికూడా ప.ూర్తి కాదు. ప్రపంచ స్ధాయి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదులక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేందుకు ఇదొక చక్కటి వుదాహరణ.అదేదో సినిమాలో ఒక జేబులో ఒక ప్రకటన మరో జేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే పాత్ర మాదిరి బిజెపి వస్తే వంద అడిగితే పది అన్నా ఇవ్వకపోతారా అని గానీ, కాంగ్రెస్‌ వస్తే కోరినంత ఇవ్వలేదన్న దాడి చేయవచ్చన్న ముందుచూపుతో గానీ చంద్రబాబు ఐదులక్షల కోట్లు అడిగారు తప్ప ఇస్తారని నమ్మేంత అమాయకుడు కాదు. తీరా చూస్తే పదిశాతం కాదు కదా కనీసం ఒక శాతం మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. చివరికి పరిస్థితి చులకనగా, ఎంత దయనీయంగా తయారైందంటే బిజెపి గ్రామ స్ధాయి కార్యకర్త కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెబుతారా లేదా అని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది నెలలుగా అలా డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని దాని గురించిన వాస్తవాలను, వివరాలు చెప్పలేకపోయింది. కింది స్ధాయిలో తామెంత అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నామో బాగా తెలిసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు సహజంగానే ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది అనే అనుమాన బీజం పడింది.

    ఇంత జరిగినప్పటికీ అసలు వాస్తవాలను ఆంధ్ర జనం ముందు వుంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఎవరు సమాధానం చెప్పాలి? సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు అనుకూలమే కనుక అవే చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణి వినిపించకుండా చేసి తలుపులు మూసి, చీకటిలో బిల్లును ఆమోదించారని,సక్రమంగా విభజించలేదని తెలుగుదేశం పదే పదే చెబుతోంది. లోపల అంచనాలు, ఆలోచనలు ఏమున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ముసుగులో విభజనకు అంగీకరించింది. తీరా విభజన అనివార్యం అని తేలిన తరువాత ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళన గమనించి తమ రాజకీయ పునాది ఎక్కడ కదులుతుందో అనే భయంతో అక్కడ వ్యతిరేక ఆందోళనలో ఆ పార్టీ భాగస్వామి అయింది, పరోక్షంగానా, ప్రత్యక్షంగానా అన్నది వేరే విషయం.ఆ కారణంగానే సక్రమంగా విభజించటం లేదనే పేరుతో పార్లమెంట్‌లో ఒక పెద్ద డ్రామాకు తెలుగుదేశం తెరతీసింది. అప్పుడు సక్రమంగానే తమ వారు వ్యవహరించారని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నమ్మక ద్రోహం సందర్భంగా సరిగా వ్యవహరించలేదని తమ కేంద్ర మంత్రులు,ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, దానికి కారణం తగిన సమాచారం అందకపోవటమే అని వారు సంజాయిషీ ఇచ్చి, అవసరమయితే రాజీనామాలకు సిద్ధం అని చెప్పినట్లు లీకుల కధనాలు బయటకు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక తోలుబొమ్మలాట కంపెనీ అనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తోలు బొమ్మలు, వాటిని ఆడించే కధకుడు చంద్రబాబు. ప్రదర్శన రక్తి కట్టలేదంటే దానికి కారణం ఆడించేవారిది తప్ప బొమ్మలది కాదు అన్నది వేరే చెప్పనవసరం లేదు.నాడు పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా తెలుగుదేశం సభ్యులు చేసిన రచ్చను మెచ్చిన జనం నేడు ఇదేమిటంటూ తెగడుతున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా తెలుగుదేశం లీకుల విభాగం చురుకుగా కదలి నాయకుడు సమర్ధుడే మిగిలినవారే తమ పాత్రలను సరిగా పోషించలేదనే ట్టుకధలు వినిపిస్తున్నది. దీన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మేథావులు వుండవచ్చేమోగాని సామాన్య జనం లేరు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో మేథావుల తరగతిలోని అత్యధిక వర్గం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియని స్ధితి.

  అంతర్జాతీయంగా తగిలిన ఎదురు దెబ్బలు, బూర్జువా వ్యవస్ధ పార్లమెంటరీ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురయ్యే సమస్యలపై వామపక్ష పార్టీలు తీసుకొన్న వైఖరి, దానికి వున్న పరిమితులు, కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను పూర్తిగా కింది స్ధాయి కార్యకర్తలకు వివరించటంలో కూడా వామపక్షాలు జయప్రదం కాలేకపోయాయి. వామపక్షాలు అధికారంలో వున్న చోట్ల ఒక్క అవినీతి, అక్రమ ఆరోపణలు లేకపోయినా, ఎలాంటి కుంభకోణాలలో ఇరుక్కోకపోయినా, నాయకత్వంలో ఒకరో అరో తప్ప పార్టీలు మారటం వంటి అవకాశ వాద వైఖరి లేకపోయినా సామాన్య జనం ఆ పార్టీలు మంచివే అని భావించినప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపించలేవనే భావనతో ఓటింగ్‌ , ఇతర సందర్బాలలో దూరంగా వుంటున్నారు. జనానికి విశ్వాసం కలిగించటం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు.

     ఇంతకాలం కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మీద ఒంటి కాలితో లేచే పరిస్థితి ఇక ముందు తెలుగు దేశానికి వుండదు. ఎందుంటే కాంగ్రెస్‌ ద్రోహం బహిరంగం. బిజెపితో కుమ్మక్కయి ఆ పార్టీ వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది. ఇప్పుడు బిజెపి నాయకత్వం తెలుగుదేశంతో కుమ్మక్కయి నమ్మక ద్రోహం చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై వున్న కేసుల కారణంగా బిజెపి ప్రభుత్వం పట్ల మెతకగా వుంటున్నారనే దాడి ఇక ముందు కుదరదు.ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రం పట్ల ఎలా వున్నప్పటికీ అది రాష్ట్ర అభివృద్దిని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు. అధికారంలో వున్న మరొక ప్రాంతీయ పార్టీ కేంద్రంతో సఖ్యతగా వున్నా, రాజకీయంగా భుజం మార్చుకోకుండా కేంద్రంలో వున్న పార్టీని మోసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా నిరూపించింది. అందువలన రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు కొత్త రూపం సంతరించుకోవటం తధ్యం. కేంద్రంతో సఖ్యతతో వుండే రాష్ట్ర ప్రభుత్వమే సాధించేందేమీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభీష్టం మేరకు అధికారపక్షంలో చేరా అని చెప్పుకొనే జంప్‌ జిలానీల నోరు పడిపోవటం ఖాయం. వారంతా గత ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి వాటంగా వుంటే ఆ పార్టీ టిక్కెట్‌, జనం ఓట్లు కొనేందుకు అవసరమైన డబ్బు దండుకొనేందుకు తప్ప నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి అనేది ఒట్టి మాట. గతంలో ప్రతిపక్షంలో వుండి పార్టీ మారిన పెద్దలు నియోజకవర్గాలను చేసిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీలు అధికారంలో లేనపుడు ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే తమ జేబులు నింపుకోవటం, కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాయటం తప్ప జన క్షేమం పట్టదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: