• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Aung San Suu Kyi

మిలిటరీ కుట్రలు – ఐరోపా,అమెరికన్ల ద్వంద్వ ప్రమాణాలు !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2021 Myanmar coup d'état, Aung San Suu Kyi, Myanmar’s Military Coup, US double standards on coups


ఎం కోటేశ్వరరావు


మార్చి 27న మన పొరుగు దేశమైన మయన్మార్‌లో దేశ వ్యాపితంగా మిలిటరీ జరిపిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. ఆ దుశ్చర్యను యావత్‌ సమాజం ఖండిస్తోంది, నిరసిస్తోంది. గత ఏడాది నవంబరు పార్లమెంటరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి ఒకటవ తేదీ ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మయన్మార్‌ మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్దంలో 76 సంవత్సరాల క్రితం జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా మార్చి 27న మయన్మార్‌ సాయుధ దళాల ప్రతిఘటన ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ రోజున సాయుధ దళాల దినోత్సవం జరుపుతున్నారు. అదే రోజున నిరసనకారుల మీద జరిపిన కాల్పుల్లో 90 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సంఖ్య 114 అని, ఇంకా ఎక్కువ ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొత్తం మరణించిన వారు 510 మంది అని కొందరి లెక్క. మిలిటరీ చర్యల మీద యావత్‌ ప్రపంచంలో నిరసన వ్యక్తమైంది. ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. ప్రపంచంలో మిలిటరీ అధికారానికి వచ్చిన చోటల్లా మానవహక్కుల ఉల్లంఘన, ప్రాణనష్టం పెద్ద జరుగుతున్నది. అమెరికా దాని మిత్రపక్షాలుగా ఉన్న ఐరోపా, మరికొన్ని దేశాలు మయన్మార్‌పై ఆంక్షలను ప్రకటించాయి.


ఒక దేశ అంతర్గత వ్యవహారాలు, పరిణామాలపై ఎంత వరకు స్పందించాలి, ఎంత మేరకు జోక్యం చేసుకోవాలి అన్నది ఒక ఎడతెగని, ఏకీభావం కుదరని సమస్య. ఇలాంటి సమస్యలు తలెత్తిన దేశాలన్నింటి పట్ల అన్ని దేశాలూ ఒకే వైఖరి తీసుకుంటే అసలు ఇలాంటి పరిణామాలు తలెత్తవు, ఒకవేళ జరిగినా మారణకాండకు అవకాశాలు పరిమితం.ఐక్య రాజ్యసమితి వంటి సంస్ధలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలను నివారించలేకపోతున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన పరిణామాల సమయంలోనే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. గతవారాంతంలో జరిగిన పరిణామాల తరువాత దౌత్య, సంబంధాలన్నింటినీ పక్కన పెట్టింది.హింసా కాండ భయానకంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్‌ వర్ణించారు. మిలిటరీ తిరుగుబాటు అయినా, దానికి ప్రజాప్రతిఘటన అయినా అది అంతర్గత సమస్యగానే పరిగణించాల్సి ఉంది. మరో దేశం జోక్యం చేసుకొనే పరిస్ధితి తలెత్తినపుడు ఒకవేళ జోక్యం చేసుకుంటే అది సమర్దనీయమా కాదా అన్న చర్చ జరుగుతుంది. మార్చినెల 26వ తేదీన బంగ్లాదేశ్‌ విముక్తి 50సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ తాను రాజకీయ జీవితం ప్రారంభించినపుడు బంగ్లా విముక్తికోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లినట్లు ప్రకటించారు.దానిలో నిజమెంత అనేది ఒక అంశమైతే పాకిస్ధాన్‌లో ఒక భాగమైన నేటి బంగ్లాదేశ్‌లో నాటి పాక్‌ నియంతల మారణకాండకు స్వస్తి పలికేందుకు మన దేశం సైనిక జోక్యం చేసుకున్నది.దాన్ని ఎందరో హర్షించినా, పాక్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు పూనుకుంది అనే పేరుతో మనలను బెదిరించేందుకు ముందుగానే అమెరికన్లు తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాతానికి దింపారు. అమెరికా చర్యను మాత్రం నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండించలేదు. అమెరికా దాడి చేస్తే రక్షణ కోసం ఆ రోజు మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంది. జనసంఘం బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసింది తప్ప నిజానికి బంగ్లా మీద ప్రేమతో కాదు. ఏది ఏమైనా నాటి జోక్యం సరైనదే, అందువలన ప్రతి జోక్యాన్ని తప్పు పట్టలేము, అలాగని ప్రతి ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని సమర్ధించకూడదు. దేనికి దాన్నే విడిగా విచక్షణగా చూడాలి.


తాజా విషయాలకు వస్తే మయన్మార్‌ పరిణామాలపై అన్ని దేశాలూ ఒకే విధంగా స్పందించటం లేదు. మార్చి 27న మయన్మార్‌ మిలిటరీ దినోత్సవంలో పాల్గొని మన దేశంతో సహా ఎనిమిది దేశాల ప్రతినిధులు హాజరై సామాన్యుల రక్తంతో తడిచిన మిలిటరీ అధికారుల చేతులతో కరచాలనం చేశారు. పాకిస్ధాన్‌, రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం, లావోస్‌, థారులాండ్‌ ప్రతినిధులు కూడా వారిలో ఉన్నారు. మన సంఘపరివార్‌ సంస్దలు చెబుతున్నదాని ప్రకారం ఈ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు కనుక వెళ్లారని కాసేపు అనుకుందాం, మరి మన ప్రధాని మన ప్రతినిధిని ఎందుకు పంపినట్లు ? ముందే చెప్పుకున్నట్లు తాను పాక్‌ మిలిటరీ నియంత్రత్వానికి వ్యతిరేకంగా జరిగిన బంగ్లా విముక్తి ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రకటనకూ దీనికీ పొంతన కుదరటం లేదు. ఒక చోట మానవహక్కులను హరించటాన్ని ఖండిస్తారు-మరోచోట హరిస్తున్నవారితో కరచాలనం చేస్తారా ? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు ? మయన్మార్‌ విషయంలో సత్యాగ్రహం చేయకపోయినా ఖండన ప్రకటన ఎందుకు చేయలేదంటే ఏమి చెబుతారు ? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే భారత్‌ మా రక్తంతో తడిచిన మిలిటరీతో కరచాలనం చేసేందుకు తన ప్రతినిధిని ఎందుకు పంపింది అని మయన్మార్‌ ప్రజాస్వామిక వాదులు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించారు. చైనాను కూడా వారే అదే ప్రశ్న వేయవచ్చు. ఆంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి ఎంపీల కమిటీ కూడా భారత చర్యను ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మన దేశం కూడా సభ్యురాలే అయినప్పటికీ ఇంతవరకు హింసాకాండను ఖండించలేదు.ప్రస్తుతం మన దేశం భద్రతా మండలి సభ్యురాలిగా ఉండి,పొరుగుదేశం గురించి ఏమి చేసింది అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమివ్వాలా లేదా ?


దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్టవేస్తామంటూ బయలు దేరిన చతుష్టయ దేశాలలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి సాధారణ పరిస్ధితుల పునరుద్దరణ జరగాలని మన దేశం కోరింది. మరి మిగిలిన మూడూ మయన్మార్‌ మీద ఆంక్షలను విధించాలని అంటుంటే మన దేశం మౌనంగా ఉంది, అంగీకరించటం లేదు. మయన్మార్‌లో పరిణామాలు అంతర్గత విషయాలని చైనా, రష్యా బహిరంగంగానే ప్రకటించాయి. మయన్మార్‌లో మిలిటరీ చర్యలకు నిరసనగా ఆంక్షలను కఠినంగా అమలు జరుపుతామని ప్రకటించింది అమెరికా, దాని నాయకత్వంలో ఐరోపా పశ్చిమ దేశాలు అన్నది తెలిసిందే. ఆంక్షల వలన ఫలితం లేదని మన దేశం ఇప్పటికే ఈ దేశాలన్నింటికీ మన దూతల ద్వారా తెలిపింది.


మయన్మార్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగితే అక్కడి జనం వాటి సంగతి చూసుకుంటారు. మిలిటరీ జోక్యం చేసుకోవటాన్ని ఎవరూ హర్షించరు, ఖండించాల్సిందే. కానీ ఆంక్షలు విధించటానికి అమెరికా, పశ్చిమ దేశాలకు ఉన్న హక్కేమిటి ? ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన ప్రతి ఉదంతంలోనూ అదే విధంగా ప్రవర్తిస్తే పోనీ అదొక తీరు. అనేక దేశాల్లో వారే స్వయంగా మిలిటరీ నియంతలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించటమే కాదు, పెద్ద సంఖ్యలో పౌరుల పాణాలను బలిగొన్న రక్త చరిత్ర మన కళ్ల ముందు ఉంది. తమ ప్రయోజనాలను ప్రపంచ ప్రయోజనాలుగా చిత్రించటంలో పశ్చిమ దేశాలు, వాటికి మద్దతు ఇచ్చే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో అమెరికా తదితర దేశాలు జోక్యం చేసుకొని సద్దాంతో సహా లక్షలాది మంది సామాన్య పౌరులను హత్య చేశారు. తరువాత అబ్బే ఎలాంటి మారణాయుధాల ఆనవాళ్లు లేవని అదే అమెరికా ప్రకటించింది. యెమెన్‌లో ప్రభుత్వం-దాన్ని వ్యతిరేకించే శక్తుల మధ్య అంతర్యుద్దం జరుగుతోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అక్కడి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయి. సౌదీ అరేబియాను తమ ప్రతినిధిగా నియమించి దాడులు చేయిస్తున్నాయి. వేలాది మందిని హతమార్చాయి. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద మూకలను రెచ్చగొట్టి ఆయుధాలు అందించి అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈజిప్టులో 2013లో జనరల్‌ శిసి తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేశాడు.దానికి నిరసనగా పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహమ్మద్‌ మోర్సీ మద్దతుదారులు రాజధాని కైరోలో నిరసన తెలుపుతున్న సమయంలో మిలిటరీ విరుచుకుపడి మారణకాండ సాగించింది.ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతున్న రబ్బా చౌక్‌ మారణకాండ గురించి తెలిసిందే. 2013 ఆగస్టు 14న రబ్బాతో పాటు మరొక ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య వెయ్యి నుంచి రెండువేల ఆరువందల వరకు ఉంది.గాయపడిన వారు కొన్నివేల మంది ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వేలాది మందిని హత్య చేశారు, తప్పుడు కేసులు పెట్టి ఉరితీశారు. డెబ్బయి వేల మంది రాజకీయ ఖైదీల కోసం 23 జైళ్లను ప్రత్యేకంగా నిర్మించిన అపర ప్రజాస్వామిక మిలిటరీ నియంతను బలపరించిది అమెరికా. అలాంటి నిరంకుశ పాలకుల చేతిలో జనం ఎంతో సుఖవంతంగా ఉన్నారంటూ టైమ్‌ వంటి పత్రికలు రాతలు రాశాయి. ఇప్పటికీ జనరల్‌ శశి నిరంకుశపాలన కింద ఈజిప్టు మగ్గిపోతూనే ఉంది. తమ తొత్తుగా ఉన్న కారణంగానే అమెరికా అన్ని రకాల మద్దతు ఇస్తోందన్నది స్పష్టం. ఎలాంటి ఆంక్షలు లేవు, ఎందుకని ? ఇది ద్వంద్వప్రమాణం కాదా ? తమకు అనుకూలంగా ఉండే మిలిటరీ పట్ల ఒక వైఖరి, లేని వారి పట్ల భిన్న వైఖరి.


అమెరికన్లు తమకు నచ్చని లేదా లొంగని పాలకులను తొలగించేందుకు చేసిన కుట్రలకు అంతే లేదు. ప్రతి ఖండంలో అలాంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. 1946 నుంచి 2000 సంవత్సరం వరకు కనీసం 81దేశాలలో పాలకులను మార్పు చేసేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. మిలిటరీ నియంతలను సమర్ధించింది, నియంతలుగా మారిన వారిని ప్రోత్సహించింది. బొలీవియాలో జరిగిన ఎన్నికల్లో ఇవో మోరెల్స్‌ విజయం సాధిస్తే అక్రమాలతో గెలిచారంటూ అక్కడి పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి మోరెల్స్‌, ఇతర నేతలను దేశం నుంచి బయటకు పంపారు. ఆ దుర్మార్గాన్ని అమెరికా నిస్సిగ్గుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సమర్దించాయి. ఎలాంటి ఆంక్షలు విధించకపోగా అన్ని రకాలుగా సాయం చేశాయి. వెనెజులాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి తమ తొత్తును పాలకుడిగా గుర్తించాయి. అందువలన మయన్మార్‌లో ఆంక్షలు విధించటానికి వారికి ఉన్న అర్హత, హక్కేమిటి ? అమెరికా చర్యలను గనుక సమర్ధిస్తే లాటిన్‌ అమెరికాలో తమను వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోట ఆదే సాకుతో ప్రభుత్వాలను కూలదోస్తారు.
ప్రపంచ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంతో పాటు అనేక ఇతర అంశాలూ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. మయన్మార్‌ విషయానికి వస్తే అక్కడి నియంతల తీరుతెన్నులు ఒక పట్టాన అంతుబట్టవు. ప్రపంచ వ్యాపితంగా ప్రతి మిలిటరీ నియంత అమెరికా మద్దతు పొందిన వాడే. ఇక్కడ నియంతలను మాత్రం అమెరికా వ్యతిరేకిస్తోంది.మిలిటరీ నియమించిన మంత్రుల్లో కొంత మంది గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారున్నారు కనుక చైనాకు మిలిటరీ అనుకూలం అనే విధంగా కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మిలిటరీ పాలనకు మద్దతుగా చైనా ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. 2015 ఎన్నికల్లోనే అంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చింది. గడచిన ఐదు సంవత్సరాలలో ఆ ప్రభుత్వం చైనాతో సన్నిహితంగానే మెలిగింది తప్ప మరొక విధంగా వ్యవహరించలేదు. గతేడాది ఎన్నికల్లో అదే పార్టీ తిరిగి విజయం సాధించింది. మిలిటరీ తిరుగుబాటుకు కొద్ది రోజుల ముందు ఈ ఏడాది జనవరిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఉన్నత స్దాయి ప్రతినిధి వర్గంతో మయన్మార్‌ పర్యటనకు వచ్చి సూకీతో భేటీ కావటం, ప్రభుత్వంతో ఆర్దిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులు అక్కడ ఉన్నందున శాంతియుత వాతావరణం ఉండాలనే కోరుకుంటుంది తప్ప మరొకటి కాదు.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ కార్యక్రమంలో మయన్మార్‌ కూడా ఉంది. అక్కడ మిలిటరీ అధికారాన్ని చేపట్టిన నేపధ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు ప్రకటించాయి. అందువలన అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చైనా ఒప్పందాలు ఉన్నాయి గనుక మిలిటరీ పాలకులు అయినా మరొకరైనా ఉనికికోసం పెట్టుబడుల గురించి చైనా మీద ఆధారపడక తప్పదు. ఆ కారణంగానే గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారిని మంత్రులుగా నియమించి ఉండవచ్చు.చైనా కూడా మిలిటరీ చర్యలు అంతర్గత వ్యవహారమని భావిస్తున్నందున మన వైఖరిని ప్రశ్నిస్తున్నట్లుగానే బర్మీయులు చైనా వైఖరిని కూడా ప్రశ్నించవచ్చు. మయన్మార్‌ మిలిటరీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఒక పట్టాన అంతుపట్టదు. అంగ్‌సాన్‌ సూకీ తండ్రి అంగ్‌సాన్‌ బర్మా స్వాతంత్య్రసమర యోధుడు, సోషలిస్టు, కమ్యూనిస్టు.జపాన్‌ దురాక్రమణ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అప్పటికే పక్కనే ఉన్న చైనాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో అంగ్‌సాన్‌ నాయకత్వంలో బర్మా కూడా కమ్యూనిస్టు దేశంగా మారుతుందనే భయంతో బ్రిటీష్‌ వారు చేసిన కుట్రలో భాగంగా అంగ్‌సాన్‌ నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తాన్ని హత్య చేశారు. మిలిటరీలోని కొందరు దీని వెనుక ఉన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వారు అమెరికా, బ్రిటన్‌ ప్రోద్బలంతో చైనా చాంగ్‌కై షేక్‌ మిలిటరీకి బర్మాలో ఆశ్రయం కల్పించి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అస్దిరపరచేందుకు దాడులు చేయించిన చరిత్ర ఉంది. గత ఏడు దశాబ్దాలలో మయన్మార్‌లో మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం నాలుగో వంతు మంది ఎంపీలు మిలిటరీ నియమించిన వారే, కీలకమైన శాఖల మంత్రులుగా కూడా వారే ఉంటారు. అదేమీ ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం కాదు. అంగ్‌సాన్‌ సూకీకి శాంతి నోబెల్‌ బహుమతి ఇచ్చారు. ఆమె పాలనలోనే రోహింగ్యా మైనారిటీలపై దాడులు, దేశం నుంచి తరిమివేయాటాలు జరిగాయి. ఇప్పుడు ఆమే బందీ అయ్యారు. అందువలన నిరంకుశ, అప్రజాస్వామిక చర్యలకు ఎవరు పాల్పడినా ఖండించాల్సిందే. తమ విముక్తి కోసం తోడ్పడిన దేశ ప్రతినిధిగా మన ప్రధానిని బంగ్లాదేశ్‌ ఆహ్వానించింది. కానీ అదే బంగ్లాదేశ్‌ నుంచి శరణార్దులుగా, దేశ విభజన సమయంలో వచ్చిన వారి పట్ల బిజెపి అనుసరించిన వైఖరికి నిరసనగా నరేంద్రమోడీ రాకను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసిస్తూ ప్రదర్శనలు, జనం మీద కాల్పులు, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అంతిమ నిర్ణేతలు ప్రజలే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ స్ఫూర్తి : మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు !

02 Tuesday Feb 2021

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Aung San Suu Kyi, Myanmar, Myanmar Crisis, Myanmar’s Military Coup


ఎం కోటేశ్వరరావు


మన పొరుగు దేశమైన మయన్మార్‌( గతంలో బర్మా అని పిలిచేవారు)లో ఫిబ్రవరి ఒకటవ తేదీన తిరుగుబాటు చేసిన మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. నవంబరు 8న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినందున నూతన పార్లమెంట్‌ను ఏర్పాటు చేయవద్దని చేసిన హెచ్చరికలను ఖాతరు చేయనందున ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది తరువాత ఎన్నికలు జరుపుతామని విజేతలకు అధికారాన్ని అప్పగిస్తామని పేర్కొన్నది. అధికార పార్టీ ఎన్‌ఎల్‌డి నేత, ప్రధాని పదవితో సమానమైన రాజ్య కౌన్సిలర్‌గా ఉన్న అంగ్‌సాన్‌ సూకీ, అధ్యక్షుడు యు విన్‌ మైయింట్‌ తదితరులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగంపై అనేక ఆంక్షలు విధించారు. సాధారణ జనజీవితం సాఫీగానే సాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు అక్కడేం జరుగుతోందో పూర్తిగా తెలియటం లేదు.


మిలిటరీ ప్రధాన కమాండర్‌ మిన్‌ అంగ్‌ లైయింగ్‌ అధికారాన్ని చేపట్టారని మిలిటరీ టీవీ ప్రకటించింది. ఏడాదిలోపల ఎన్నికల సంస్కరణలు తీసుకు వస్తామని తరువాత ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. గత నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయని మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్‌ పార్టీ ఆరోపించింది. మిలిటరీ కూడా అదే ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలోనే కొత్త పార్లమెంట్‌ కొలువు తీరటాన్ని వాయిదా వేయాలని కోరామని అంగీకరించకపోవటంతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నట్లు, గత ఎన్నికలను రద్దు చేసినట్లు మిలిటరీ ప్రకటించింది. ఎన్నికల అక్రమాల ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది.


మయన్మార్‌ పరిణామాల గురించి పలు వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అక్కడ జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, విజేత జో బైడెన్‌ విజయాన్ని గుర్తించేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. బైడెన్‌ విజయాన్ని ఖరారు చేసే పార్లమెంట్‌ సమావేశం మీద జనవరి ఆరున తన మద్దతుదారులతో దాడి చేయించి ఎన్నికను వమ్ము చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ స్ఫూర్తితో మయన్మార్‌ మిలిటరీ కూడా సరిగ్గా కొత్త పార్లమెంట్‌ తొలి సమావేశమై పదవీ బాధ్యతలు చేపట్టే రోజునే తిరుగుబాటు చేసిందనే వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. తమ చర్యకు ఎన్నికల అక్రమాలే కారణమని మిలిటరీ ప్రకటించింది.


నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికలలో ప్రజా ప్రతినిధుల సభలోని 440కిగాను 315, జాతులకు ప్రాతినిధ్యం వహించే ఎగువ సభలోని 224కిగాను 161స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్దానాలను ఎన్‌ఎల్‌డి సాధించింది. ప్రజాప్రతినిధుల సభలో 258, జాతుల సభలో 138 సీట్లు పొంది పూర్తి మెజారిటీని సాధించింది. మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్‌ పార్టీకి 26, 7 రాగా మిగిలిన స్ధానాలను చిన్న పార్టీలు పొందాయి.రాష్ట్ర, ప్రాంతీయ ఎన్నికల్లో కూడా ఎన్‌ఎల్‌డి ఇదే మాదిరి ఘనవిజయం సాధించింది.


అక్కడి రాజ్యాంగం ప్రకారం ఎన్నికలలో మయన్మార్‌ పౌరులు మాత్రమే అర్హులు. జాతీయ, రాష్ట్రాల చట్ట సభల్లో మూడోవంతు సీట్లు మిలిటరీకి రిజర్వు చేశారు. ఎన్నికల అనంతరం ఏర్పడే జాతీయ ప్రభుత్వంలో రక్షణ, సరిహద్దులు, హౌం శాఖల మంత్రులుగా మిలిటరీ నియమించిన వారే ఉండాలి. కొత్త పార్లమెంటు కొలువు తీరిన తరువాత అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులను ఎన్నుకొనేందుకు ఎలక్ట్రరల్‌ కాలేజిని ఏర్పాటు చేస్తారు. ఉభయ సభల నుంచి, అదే విధంగా మిలిటరీ నియమించిన సభ్యులతో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో కమిటీ నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. వారిలో అత్యధిక ఓట్లు వచ్చిన వారిని అధ్యక్షుడిగా, మిగిలిన రెండు కమిటీలలో వచ్చిన ఓట్లను బట్టి ఎక్కువ తెచ్చుకున్న ప్రతినిధి తొలి ఉపాధ్యక్షుడు, రెండవ ఉపాధ్యక్షుడు అవుతారు. మయన్మార్‌ జాతీయులను కాని వారిని వివాహం చేసుకున్న వారు,మయన్మార్‌ పౌరసత్వం లేని వారి పిల్లలు గానీ ఈ పదవులకు అనర్హులు. ఈ నిబంధన కారణంగా బ్రిటీష్‌ జాతీయుడిని వివాహం చేసుకున్న అంగ్‌సాన్‌ సూకీ ఎంపీగా, ఇతర పదవులను మాత్రమే చేపట్టవచ్చు తప్ప అధ్యక్షురాలయ్యే అవకాశం లేదు. ఆమె పిల్లలకు మయన్మార్‌ పౌరసత్వం లేనందున వారు కూడా అనర్హులే. ఈక్రమంలో ఎన్నికైన వారు మార్చి 21న పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అలాంటి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని మిలిటరీ చేసిన సూచనను మెజారిటీ సీట్లు తెచ్చుకున్న ఎన్‌ఎల్‌డి తిరస్కరించి పార్లమెంటు సమావేశ నిర్వహణకు పూనుకున్నది. దీంతో తాము అధికారాన్ని హస్తగతం చేసుకున్నట్లు మిలిటరీ ప్రకటించింది.

మయన్మార్‌ చరిత్రను చూసినా దాని ప్రస్తుతం రాజ్యాంగాన్ని చూసినప్పటికీ మిలిటరీదే పైచేయిగా ఉందని చెప్పవచ్చు.1948 జనవరి నాలుగవ తేదీ బ్రిటీష్‌ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1962వరకు పౌరపాలనలో ఉంది. ఆ ఏడాది మార్చి రెండవ తేదీన తిరుగుబాటుతో మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్ధిర పరిస్ధితులు, మిలిటరీ పట్టులోనే ఉంది.1988 వరకు మిలిటరీ లేదా దాని మద్దతు ఉన్న ఏకపార్టీ పాలనే కొనసాగింది. దీనికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి అంగ్‌సాన్‌ సూకీ నాయకత్వం వహించారు. ఆమె తండ్రి అంగ్‌సాన్‌ జాతీయవాది. బర్మా కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలను ఏర్పాటు చేశారు. అధికారాన్ని అప్పగించేందుకు అంగీకరించిన బ్రిటీష్‌ ప్రభుత్వం కుట్ర చేసి స్వాతంత్య్రానికి ఆరునెలల ముందు అంగ్‌సాన్‌ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వ మంత్రివర్గ సభ్యులను మొత్తంగా సామూహికంగా హత్య చేయించింది. అంగ్‌సాన్‌ను బర్మా జాతిపితగా పరిగణిస్తారు.


1945లో జన్మించిన సూకీ తండ్రి మరణించినప్పటికీ రెండు సంవత్సరాల పసిపిల్ల. బాల్యమంతా బ్రిటన్‌లోనే గడిచింది. అక్కడే విద్యాభ్యాసం తరువాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన సూకీ దేశంలో ప్రజాస్వామ్యం కోసం సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. విధిలేని పరిస్ధితిలో మిలిటరీ ఎన్నికలకు అంగీకరించింది. 1990లో మూడు దశాబ్దాల తరువాత జరిగిన ఎన్నికల్లో సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి 492 స్దానాలకు 392 సాధించింది. ఆ ఎన్నికలను మిలిటరీ గుర్తించలేదు.దాని పాలనే కొనసాగింది.2010లో జరిగిన ఎన్నికలలో మిలిటరీ అనుకూల పార్టీకి అత్యధిక స్దానాలు వచ్చినట్లు ప్రకటించారు. దాన్ని ఎవరూ గుర్తించలేదు. చివరకు 2011లో మిలిటరీ ఆ ఎన్నికను రద్దు చేసింది. తరువాత అంగ్‌సాన్‌ సూకీని గృహనిర్బంధం నుంచి విడుదల చేయటంతో పాటు కొంత మేరకు మిలిటరీ చర్యలను సడలించింది.2015లో జరిగిన ఎన్నికలు స్వేచ్చగా నిర్వహించటంతో అంగ్‌సానీ సూకీ నాయకత్వంలోని పార్టీ అధికారానికి వచ్చింది.ఆమె దేశపాలనా పగ్గాలు చేపట్టేందుకు అనర్హురాలు కావటంతో 2016లో ప్రధానితో సమానమైన రాజ్య కౌన్సిలర్‌ అనే పదవిని సృష్టించి ఆమెను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి తాజాగా అరెస్టు అయ్యేంతవరకు దానిలో కొనసాగుతున్నారు.

తాజాగా జరిగిన పరిణామాలు మయన్మార్‌ ప్రజాస్వామ్య ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి జనంలో నిరసన వ్యక్తం అయినట్లు తెలియదు, అయితే మిలిటరీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తారని చెప్పలేము. ప్రభుత్వ టీవి ప్రసారాలను మిలిటరీ నిలిపివేసింది. రాజ్యాంగం ప్రకారం ఒక ఏడాది పాటు మాత్రమే అత్యవసర పరిస్ధితి విధించేందుకు అవకాశం ఉంది. మిలిటరీ అధిపతికి ఆమేరకు ఏడాది పాటు మిలిటరీ, న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు దఖలు పడ్డాయి. ప్రస్తుతం మిలిటరీ ప్రతిపాదించిన ఉపాధ్యక్షుడు మిలిటరీ మాజీ జనరల్‌ అయిన యు మియింట్‌ స్వే ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. నూతన ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసి కొత్తగా ఎన్నికలను నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.


అంతర్గతంగా తలెత్తిన సమస్యలను బయటి జోక్యం లేకుండా మయన్మార్‌ పరిష్కరించుకోగలదని చైనా వ్యాఖ్యానించింది. సరిహద్దుతో పాటు వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న మయన్మార్‌ పరిణామాల మీద ఆచితూచి వ్యాఖ్యానించింది. తక్షణమే మిలిటరీ తన అధికారాన్ని వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ డిమాండ్‌ చేశారు. లేనట్లయితే తీవ్రమైన కొత్త ఆంక్షలను విధిస్తామని హెచ్చరించారు.మయన్మార్‌లో జరిగిన పరిణామాలకు చైనా మద్దతు ఉన్నట్లు చిత్రించే యత్నం కనిపిస్తోంది. మూడు వారాల క్రితం మిలిటరీ కమాండర్‌ ఒకరు చైనా ప్రతినిధి వాంగ్‌ ఇతో మయన్మార్‌ రాజధానిలో సమావేశమయ్యారని, ఒక వేళ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తే తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు, నవంబరుఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదించారనే వార్తలు వచ్చాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో అమెరికా నాయకత్వంలో జపాన్‌, ఆస్ట్రేలియా, మన దేశమూ క్వాడ్‌పేరుతో వివాదపడుతున్న విషయం తెలిసిందే. మయన్మార్‌ ఒక కీలక ప్రాంతంలో ఉన్నందున అక్కడ జరిగే ప్రతిపరిణామానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపధ్యంలో పశ్చిమ దేశాలు, వాటి కనుసన్నలలో నడిచే మీడియా ఇచ్చే వార్తల పట్ల జాగ్రత్త వహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!
  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!
  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!
  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: