• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP activist

నేనెందుకు బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నాను ? ఒక మేథావి ఆత్మశోధన

19 Tuesday Jun 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP activist, BJP leaders lies, Naredra Modi, Shivam Shankar Singh, Shivam Shankar Singh Political Consultant

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌, శివం శంకర్‌ సింగ్‌

శివం శంకర్‌ సింగ్‌

(బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ నాయకత్వంలోని బృందంలో అనేక ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో శివం శంకర్‌ సింగ్‌ పని చేశారు. రచయిత, ఇండియా ఫౌండేషన్‌లో సీనియర్‌ పరిశోధకుడు అయిన సింగ్‌ బిజెపి రాజకీయ ప్రచారాల సమాచార విశ్లేషకుడిగా పనిచేశారు. అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్‌. ఒక పార్లమెంట్‌ సభ్యుని వద్ద సహాయకునిగా కూడా పని చేశారు )

దేశంలో రాజకీయ చర్చ, కనీసం నా జీవిత సమయంలో అత్యంత నీచమైన స్ధానంలో వుంది.భాగస్వామ్యం అనూహ్యం. తమ పక్షాన వున్న రుజువు ఏమిటి అనేదానితో నిమిత్తం లేకుండా జనాలు మద్దతు కొనసాగిస్తున్నారు. తాము కుహనా వార్తలను వ్యాపింప చేస్తునాసషశ్రీతీయత్నీమని రుజువు అయిన తరువాత కూడా వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదు. ఇది ప్రతివారిలో వుంది, పార్టీలు మరియు ఓటర్లు లేదా మద్దతుదార్లందరూ దీనికి బాధ్యులే అని చెప్పాల్సి వుంది. నమ్మశక్యం గాని విధంగా అత్యంత శక్తివంతమైన ప్రచారం ద్వారా కొన్ని ప్రత్యేక సందేశాలను వ్యాపింప చేయటంలో భారతీయజనతా పార్టీ ఎంతో చేసింది. ఆ పార్టీకి ఇంకేమాత్రం మద్దతు ఇవ్వకూడదని నేను నిర్ణయించుకోవటానికి ప్రాధమిక కారణాలు ఆ సందేశాలే. అయితే అవేమిటి అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఏ పార్టీ కూడా పూర్తిగా మంచిదీ కాదు పూర్తిగా చెడ్డదీ కాదు అని అర్ధం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాలన్నీ ఎంతో కొంత మంచి చేశాయి, కొన్ని రంగాలలో మురికిగా వ్యవహరించాయి.ఈ ప్రభుత్వం దీనికి మినహాయింపేమీ కాదు.

మంచి పనులు

1.గతంతో పోలిస్తే రోడ్ల నిర్మాణం వేగంగా వుంది. రోడ్డు పొడవును లెక్కించే పద్దతిలో తేడా వుంది, దానిలో కారణాంకనాలున్నప్పటికీ అది వేగంగానే జరిగినట్లు కనిపిస్తుంది.

2.విద్యుత్‌ కనెక్షన్లు పెరిగాయి. అన్ని గ్రామాలు విద్యుదీకరించబడ్డాయి, జనానికి ఎక్కువ గంటలు విద్యుత్‌ లభిస్తోంది.( కాంగ్రెస్‌ ఐదులక్షల గ్రామాలను విద్యుదీకరించింది. చివరి 18వేలకు పైగా వున్న గ్రామాలను మోడీ పూర్తి చేశారు. ఈ సాధనను మీరు కోరుకున్న విధంగా పరిగణించవచ్చు. ఇదే విధంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ విద్యుత్‌ సరఫరా పెరుగుతూనే వుంది, కానీ మనకు బిజెపి హయాంలోనే పెద్ద పెరుగుదల వున్నట్లు మనం చూడవచ్చు) 3. వున్నత స్ధాయిలో అవినీతి తగ్గింది- ఇప్పటి వరకు మంత్రుల స్ధాయిలో పెద్ద కేసులేమీ లేవు( అయితే యుపిఏ ఒకటి హయాంలో కూడా ఇలాగే వున్నమాట నిజం. దిగువ స్ధాయిలో అలాగే వున్నాయి, చెల్లించాల్సిన మొత్తాలు పెరిగాయి, పోలీసులు, పట్వారీలు తదితరుల ను అదుపు చేయగలవారెవరూ కనిపించటం లేదు.) 4. స్వచ్చభారత్‌ కార్యక్రమం నిస్సందేహంగా విజయవంతమైంది. గతం కంటే ఎక్కువగా మరుగుదొడ్లు నిర్మించారు ఇప్పుడు జనాల మనస్సులో స్వచ్చత భావన నెలకొన్నది. 5. వుజ్వల యోజన ఒక గొప్ప చొరవ అయితే రెండవ సిలిండర్‌ను ఎంత మంది కొన్నారో చూడాల్సి వుంది. మొదటిది, స్టవ్‌ వుచితం, అయితే జనాలు ఇప్పుడు వాటికి డబ్బు చెల్లించాల్సి వుంది, ప్రభుత్వం కార్య క్రమం చేపట్టినప్పటి నుంచి సిలిండర్‌ ఖర్చు రెట్టింపైంది, ఇప్పుడు ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలకంటే ఎక్కువ వుంది. 6. ఈశాన్య భారత్‌తో సంబంధాలు నిస్సందేహంగా పెరిగాయి. రైళ్లు, రోడ్లు, విమానాలు పెరిగాయి. అన్నింటికంటే ముఖ్యమైనదేమంటే ప్రధాన స్రవంతి న్యూస్‌ ఛానళ్లలో ఈ ప్రాంతం గురించి చర్చ జరుగుతోంది. 7. ప్రాంతీయ పార్టీల పాలనతో పోలిస్తే శాంతి భద్రతల పరిస్ధితి మెరుగ్గా వుంది.

చెడ్డ పనులు

జాతులు, వ్యవస్ధలను నిర్మించాలంటే దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది. బిజెపి పాలనలో నేను చూసిన అతి పెద్ద వైఫల్యం ఏమంటే చాలా దుర్బలమైన కారణాలను చూపి కొన్ని గొప్పవాటిని నాశనం చేయటం.

1. ఎలక్ట్రరల్‌ బాండ్లు ా ఇది అవినీతిని చట్టబద్దం చేస్తుంది, మన రాజకీయపార్టీలను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్లు, విదేశీశక్తులకు అవకాశమిస్తుంది. ఈ బాండ్లు అజ్ఞాతమైనవి. కాబట్టి ఒక కార్పొరేట్‌ సంస్ధ మీరు గనుక ఒక నిర్ణీత విధానాన్ని ఆమోదిస్తే వెయ్యి కోట్ల విలువైన ఎలక్ట్రొరల్‌ బాండ్లు ఇస్తాను చెబుతుంది, దానిని శిక్షించేవారుండరు. దీని వలన ఒక అజ్ఞాత సాధనం ద్వారా నీకిది నాకది అని నిరూపించే అవకాశం వుండదు. ఇది మంత్రిత్వస్ధాయికి అవినీతిని ఎలా దించిందో కూడా వివరిస్తోంది. దీనికి ఫైలు లేదా వుత్తరువులతో పని లేదు. ఇది అమెరికాలో మాదిరి విధాన స్ధాయిలోనే జరుగుతోంది. 2. ప్రణాళికా సంఘ నివేదికలు :సమాచార ప్రధాన వనరులుగా వీటిని వినియోగించుకోవచ్చు.ప్రభుత్వ పధకాలను అవి ఆడిట్‌ చేస్తాయి, ఎలా జరుగుతున్నదీ చెబుతాయి. అది పోయిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని నమ్మటం తప్ప మరొక మార్గం లేదు.(కాగ్‌ నివేదికలు చాలా కాలం తరువాత వస్తాయి) నీతి అయోగ్‌కు ఈ బాధ్యత లేదు, అది మౌలికంగా సలహాలిచ్చే మేథావులతో నిండిన, ప్రజా సంబంధాల సంస్ధ మాత్రమే. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయకుండానే ప్రణాళిక లేదా ప్రణాళికేతరానికి తేడా లేకుండా చేయవచ్చు.3. సిబిఐ, ఇడిల దుర్వినియోగం: నేను చూసినంత వరకు వీటిని రాజకీయ ప్రయోజనాల కొరకు వినియోగిస్తున్నారు. ఒక వేళ అలాంటిదేమీ లేదనుకుంటే మోడీ లేదా అమిత్‌ షాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఈ సంస్ధల ద్వారా వారిమీద దాడిచేయిస్తారనే భయం వున్న మాట నిజం. ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైన భిన్నాభిప్రాయాన్ని హతం చేయటానికి ఇది చాలు. 4. కాలిఖో పాల్‌ ఆత్మహత్య నోట్‌, జడ్జి లోయా మరణం, సొహ్రబుద్దీన్‌ హత్యల దర్యాప్తులో విఫలం, వున్నావోలో ఒక రేప్‌ కేసులో నిందితుడైన ఎంఎల్‌ఏను వెనకేసుకురావటం, అతని బంధువు ఆ బాలిక తండ్రిని హత్యకేసులో నిందితుడు కావటం, ఒక ఏడాది పాటు ఎఫ్‌ఐర్‌ నమోదు చేయకపోవటం.5. పెద్ద నోట్ల రద్దు: ఇది విఫలమైంది, అంతకంటే దారుణం ఏమంటే ఆ వైఫల్యాన్ని బిజెపి అంగీకరించలేకపోవటం. ఈ చర్య ద్వారా వుగ్రవాదులకు నిధులు నిలిచిపోతాయని, నగదు లావాదేవీలు తగ్గుతాయని, అవినీతి అంతమౌతుందని చేసిన ప్రచారమంతా అసంబద్దమైనది. ఇది వాణిజ్యాన్ని అంతం చేసింది. 6. జిఎస్‌టి అమలు: దీన్ని హడావుడిగా అమలు జరిపారు, వ్యాపారానికి హాని చేసింది. వ్యవస్ధను సంక్లిష్టం గావించింది. వివిధ వస్తువుల మీద అనేక రేట్లు, పన్నుల దాఖలులో సంక్లిష్టత. కొంత వ్యవధిలో స్ధిరపడుతుందని అనుకున్నారు, కానీ అది హాని చేసింది. ఈ వైఫల్యాన్ని అంగీకరించేందుకు బిజెపి ఎంతో దురహంకారంతో వ్యవహరించింది.7.కేవలం చప్పట్లు కొట్టించుకొనేందుకు విదేశాంగ విధానాన్ని గందరగోళపరచటం: శ్రీలంకలో చైనాకు ఒక రేవు వుంది, బంగ్లాదేశ్‌, పాకిస్ధాన్లలో పెద్ద ప్రయోజనాలున్నాయీభారత్‌ను చుట్టుముడుతోంది, మాల్దీవులలో వైఫల్యం( భారత విదేశాంగ విధాన వైఫల్యం కారణంగా అక్కడ ఇంకే మాత్రం భారతీయ కార్మికులకు వీసాలు దొరికే అవకాశం లేదు) మోడీగారు విదేశాలు తిరుగుతూ 2014కు ముందు విదేశాలలో భారతీయులంటే గౌరవం లేదని ఇప్పుడు ఎంతగానో గౌరవిస్తున్నారని చెబుతున్నారు.( ఇదొక చెత్త మన ఆర్ధిక వ్యవస్ధ మరియు ఐటి రంగంలో పురోగమనం కారణంగా విదేశాలలో భారత్‌కు గౌరవం ప్రత్యక్ష ఫలితం, మోడీ కారణంగా అది ఒక్క ఔన్సు కూడా మెరుగుపడలేదు, బీఫ్‌ పేరుతో వధించటాలు, జర్నలిస్టులకు బెదిరింపుల వంటి వాటితో అదింకా దిగజారి వుండవచ్చు) 8. పధకాల వైఫల్యం, వాటిని గుర్తించటంలో లేదా సరిచేయటంలో వైఫల్యం : సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన, మేకిన్‌ ఇండియా, నైపుణ్య అభివృద్ధి, ఫసల్‌ భీమా( తిరిగి చెల్లింపులను చూస్తే బీమా కంపెనీల జేబులు నింపటం కనిపిస్తుంది.) నిరుద్యోగం, రైతాంగ సంక్షోభాలను గుర్తించటంలో వైఫల్యం, ప్రతి వాస్తవ సమస్యను ప్రతిపక్ష నాటకంగా వర్ణించటం. 9. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల : కాంగ్రెస్‌ అధికారంలో వుండగా మోడీ, బిజెపి మంత్రులు మరియు మద్దతుదార్లందరూ వాటి ధరలు ఎక్కువగా వున్నాయని విమర్శించారు. అప్పటితో పోలిస్తే అప్పుడు ముడిచమురు ధర తక్కువగా వున్నప్పటికీ ఎక్కువగా ధరలు వుండటాన్ని ఇప్పుడు సమర్ధిస్తున్నారు. ఇదేమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. 10. అత్యధిక మౌలిక సమస్యల విషయాలపై పని చేయటంలో వైఫల్యం : విద్య, ఆరోగ్య సంరక్షణ. విద్యారంగంలో చేసిందేమీ లేదు, జాతీయంగా అది అతి పెద్ద వైఫల్యం.దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల నాణ్యత తగ్గిపోయింది(ఎఎస్‌ఇఆర్‌ నివేదికలు) ఎలాంటి చర్య తీసుకోలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణకు వారు చేసిందేమీ లేదు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రకటించారు. చేసిందేమీ లేకపోగా ఆ పధకం నన్ను మరింత భయపెడుతోంది.బీమా పధకాలు భయంకర బాటలో నడుస్తున్నాయి అవి అమెరికా బాటలో నడుస్తున్నాయి.అది ఆరోగ్య రక్షణలో భయంకరమైన గమ్యం(మైఖేల్‌ మూర్‌ సినిమా సికో చూడండి)

మీరు కొన్నింటిని జోడించవచ్చు, సమస్యను మీ స్వంత అవగాహన మేరకు మరికొన్నింటిని తీసివేయవచ్చు, కానీ ఇది నా మదింపు. ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ సమస్య పెద్దది, సుప్రీం కోర్టు దానిని రద్దు చేయవచ్చని అనుకుంటున్నాను. ప్రతి ప్రభుత్వానికి కొన్ని వైఫల్యాలు, కొన్ని చెడులు వుండవచ్చు గానీ అన్నింటికంటే పెద్ద సమస్య నైతికవిలువలకు మించి లేదు.

వికారమైనది

ఈ ప్రభుత్వ నిజమైన ప్రతికూలత ఏమంటే ఎంతో యోచించిన పధకం ప్రకారం జాతీయ చర్చను అది ఎలా దెబ్బతీసిందనేదే. ఇది వైఫల్యం కాదు, ఇదొక పధకం.

1. ఇది మీడియాను నమ్మరానిదిగా చేసింది. దాంతో ఇప్పుడు ప్రతి విమర్శ వెనుక ఒక జర్నలిస్టు బిజెపి లేదా కాంగ్రెస్‌ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు చిత్రితమౌతున్నది. అనేక మంది జర్నలిస్టుల విషయంలో అది వాస్తవం కాదని నాకు తెలుసు. అంతకంటే ముఖ్య మైన అంశమేమంటే ఏ ఒక్కరూ ఆరోపణలు లేదా ఫిర్యాదుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు కేవలం సమస్యను ముందుకు తెచ్చి వ్యక్తుల మీద దాడిచేయటం, తరువాత సమస్యను కూడా విస్మరిస్తున్నారు. 2.గత డెబ్బయి సంవత్సరాలలో ఏమీ జరగలేదనే ఒక అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దారు. ఇది పూర్తిగా అనుచితం, ఫలితంగా తలెత్తే మానసిక ప్రవృత్తి దేశానికి హానికరం. ప్రభుత్వం ప్రకటనల మీద నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, ఇప్పుడది ఒక ధోరణిగా మారింది. చిన్న పనులు చేసినా పెద్దగా ప్రచారం చేసుకోవటం. మొదటిసారిగా రోడ్లను మోడీ నిర్మించలేదు. మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ల మానసపుత్రికల వంటి పధకాల ద్వారా నిర్మించిన కొన్ని మంచి రోడ్ల మీద నేను ప్రయాణించాను. 1990 దశకం నుంచి భారత్‌ ఐటి శక్తి కేంద్రంగా మారింది. నేడున్న పరిస్ధితులను బట్టి గత పని తీరును అంచనా వేస్తూ గత నాయకులను దూషించటం సులభం. వుదాహరణకు ఎవరైనా కాంగ్రెస్‌ 70 సంవత్సరాలుగా మరుగుదొడ్లను ఎందుకు నిర్మించలేదని అడగవచ్చు. వారు కొన్ని మౌలికమైనవి కూడా చేయలేకపోయారు. ఈ వాదన ఎంతో తర్కబద్దంగా వినిపించవచ్చు, దేశ చరిత్రను చదవటం ప్రారంభించే వరకు నేను కూడా నమ్మాను. 1947లో మనం స్వాతంత్య్రం సంపాదించుకొనే నాటికి మనది చాలా పేద దేశం. మనకు ఒక రాజధాని లేదు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వనరులు లేవు. దీన్ని అధిగమించేందుకు నెహ్రూ సోషలిస్టు మార్గం పట్టి ప్రభుత్వరంగ సంస్ధలను ఏర్పాటు చేశారు. మనకు వుక్కు ఫ్యాక్టరీ నిర్మించుకొనే సామర్ధ్యం లేకపోతే రష్యన్ల సాయం తీసుకున్నారు. దేశంలో యంత్రాలు, వుక్కు తయారీకి రాంచీలో హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఇవి లేకుండా మనకు వుక్కు వుండేది కాదు, ఇతర మౌలిక సదుపాయాలూ వుండేవి కావు. మనకు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కరవులు వచ్చేవి,పెద్ద సంఖ్యలో జనం మరణించేవారు. జనానికి తిండి పెట్టటం ప్రాధాన్యత, అప్పుడు మరుగుదొడ్లు విలాసం దానికోసం ఎవరూ చూడలేదు. హరిత విప్లవం వచ్చి 1990దశకం నాటికి ఆహార కొరత అదృశ్యమైంది. ఇప్పుడు మనం మిగులు సమస్యను ఎదుర్కొంటున్నాము. మరుగుదొడ్ల మాదిరే పాతికేండ్ల తరువాత నరేంద్రమోడీ అన్ని ఇండ్లకు ఎసి ఎందుకు పెట్టించలేదని అడుగుతారు. అది ఈ రోజు ఒక విలాసంగా కనిపించినట్లే ఒక రోజు మరుగుదొడ్లు కూడా విలాసమే. ఈ పరిణామం త్వరలో జరగవచ్చు లేదా పదిపదిహేనేండ్ల క్రితమే జరిగి వుండవచ్చు. కానీ 70ఏండ్లలో ఏమీ జరగలేదని చెప్పటం బలవంతంగా రుద్దే ఒక భయంకరమైన అవాస్తవం. 3. కుహనా వార్తల వ్యాప్తి, వాటిపై ఆధారపడటం : బిజెపి వ్యతిరేక కుహనా వార్తలు కూడా కొన్ని వున్నాయి, కానీ బిజెపి అనుకూల, ప్రతి పక్ష వ్యతిరేక కుహనా వార్తలు జనానికి చేరటంలో మైళ్ల దూరం ముందున్నాయి. వాటిలో కొన్ని మద్దతుదార్లవి, అయితే ఎక్కువ భాగం పార్టీ నుంచే వస్తున్నాయి. తరచూ అవి విద్వేషపూరితంగానూ జన సమీకరణ వైఖరి అంతకంటే నీచమైనవిగా కూడా తయారవుతున్నాయి. ఈ ప్రభుత్వ మద్దతు వున్న ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ మనకు తెలిసినదాని కంటే సమాజానికి ఎక్కువ హాని చేస్తున్నాయి. 4. హిందూయిజం ప్రమాదంలో వుంది: హిందువులు, హిందూయిజం ప్రమాదంలో వుందనే భావనను, మనల్ని రక్షించాలంటే మోడీ మాత్రమే దిక్కు అని జనాల బుర్రలోకి నూరిపోశారు. వాస్తవంలో జనాల భావంలో మార్పు తప్ప ఈ ప్రభుత్వం రాకముందు హిందువులు ఎలా జీవిస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే వున్నారు, మారిందేమీ లేదు. హిందువులమైన మనం 2007లో ప్రమాదంలో పడ్డామా? నావరకైతే దాని గురించి రోజూ వినలేదు, మరింత భయం, విద్వేషం తప్ప హిందువుల స్ధితిగతులలో నాకైతే మెరుగుదల కనిపించలేదు. 5. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు దేశవ్యతిరేకులు, ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ఈ విధమైన ముద్రవేయటం ద్వారా న్యాయమైన విమర్శను బయటకు రాకుండా చేస్తున్నారు. మీ జాతీయతను రుజువు చేసుకోండి, ప్రతిచోటా వందేమాతరం పాడండి( బిజెపి నేతలకు దానిలో వుండే పదాలేమిటో కూడా తెలియనప్పటికీ దానిని పాడాలని మిమ్మల్ని బలవంతం చేస్తారు.) నేను జాతీయవాదిగా గర్వపడతాను, అయితే దాన్ని బహిరంగంగా ప్రదర్శించమని ఏవరైనా బలవంతం చేయటాన్ని నా జాతీయవాదం అనుమతించదు. అవసరమైనపుడు లేదా నాకు పాడాలని అనిపించినపుడు జాతీయ గీతాన్ని జాతీయ పాటను నేను పాడతాను. అయితే ఇతరుల వెర్రులకు అనుగుణ్యంగా పాడాలని ఎవరైనా బలవంతం చేస్తే నేను పాడను.6. బిజెపి నేతలు నిర్వహిస్తున్న వార్తా ఛానళ్ల ఏకైక కార్యక్రమం హిందూ-ముస్లిం, జాతీయవాదం-జాతి వ్యతిరేకులు, భారత్‌-పాకిస్ధాన్‌, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే, విడిపోయే సమీకరణలను రెచ్చగొట్టే చర్చలు మాత్రమే. అవి ఏవో మీ అందరికీ తెలుసు, నీచమైన ప్రచారాన్ని వెదజల్లే చర్చలు జరిపేవారికి నజరానాలు అందచేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. 7. సమీకరణ : అభివృద్ధి సందేశం గతించింది. వచ్చే సాధారణ ఎన్నికలకు బిజెపి వ్యూహం ఏమిటంటే విభజించే సమీకరణలను, కుహనా జాతీయవాదాన్ని రెచ్చగొట్టటం. మోడీగారు స్వయంగా తన ప్రసంగాల్లో చెప్పారు. జిన్నా, నెహ్రూ, భగత్‌ సింగ్‌ జైల్లో వున్నపుడు కాంగ్రెస్‌ నేతలు ఆయనను పరామర్శించలేదు( ఆ నకిలీ వార్త స్వయంగా ప్రధాని నోటి నుంచి వెలువడింది). గుజరాత్‌లో మోడీని ఓడించేందుకు కాంగ్రెస్‌ నేతలు పాకిస్ధాన్‌లో సమావేశమయ్యారు. అక్బర్‌ కంటే మహారాణా ప్రతాప్‌ గొప్పవాడని అని యోగి గారు చెబుతారు. జెన్‌యు విద్యార్ధులు జాతి వ్యతిరేకులు, వారు దేశాన్ని ముక్కలు చేస్తారు. ఈ ప్రచారమంతా విడదీయండి, ఎన్నికల్లో గెలవండి అనే ఒక ప్రత్యేక లక్ష్యంతో రూపొందించినది. ఇటువంటి దానిని మా నేతల నుంచి వినాలని కోరుకోవటం లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం కొట్లాటలతో దేశం తగుల బడాలని కోరుకొనే ఎవరినైనా అనుసరించేందుకు నేను వ్యతిరేకిస్తాను.

జాతీయ చర్చను ఒక చీకటి కోణంలోకి బిజెపి ఎలా నెడుతోందో చెప్పేందుకు కొన్ని వుదాహరణలు మాత్రమే ఇవి. దీని కోసం నేను బిజెపిలో చేరలేదు, వీటన్నింటికీ నేను మద్దతు ఇవ్వలేను, అందుకే నేను బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నా.

గమనిక: భారత ఆశాకిరణం మాదిరి నరేంద్రమోడీ గారు కనిపించటంతో నేను 2013 నుంచి  బిజెపిలో పని చేస్తున్నాను, అభివృద్ధి  సందేశాన్ని నమ్మాను. ఆ సందేశం, ఆశ ఇప్పుడు పూర్తిగా పోయాయి. నావరకైతే నరేంద్రమోడీ మరియు అమిత్‌ షా ప్రభుత్వంలోని సానుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా వున్నాయి.అయితే ప్రతి ఓటరు స్వంతంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. వాస్తవాన్ని, చరిత్రను ఎలా సంక్లిష్టం గావిస్తున్నారో తెలుసుకోండి. ప్రచారాన్ని తేలికగా తీసుకోవటం, ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఆరాధించటం హీనమైన అంశాలు. ఇది ఈ దేశం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనవి.

ఎన్నికలు దగ్గరపడుతున్నందున మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. దాంతో మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఏ భావజాలాన్ని లేదా ఏ పార్టీ అని కాదు, అది మెరుగైన, బలమైన, దారిద్య్రం లేని, అభివృద్ధి చెందిన భారత్‌ను నడిపించేదిగా వుండేదానికి మనం మద్దతు ఇవ్వాలి. నా ఏకైక ఆశ ఏమంటే మనమందరం సామరస్యతతో పని చేస్తామన్నదే. రెండు వైపులా మంచి వారుంటారని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. వారు భిన్న పార్టీలలో వున్నప్పటికీ వారికి ఓటరు మద్దతు, వారి మద్దతు ఓటర్లకు వుండాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సుబ్రమణ్యస్వామి పర్యవేక్షణలో ఆర్ బి ఐ గవర్నర్‌గా బిజెపి కార్యకర్త ?

19 Sunday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP activist, mody, Raghu ram rajan, RBI, RBI governor, Subramanya swamy

ఎం కోటేశ్వరరావు

     జపాన్‌-ఇండియా, అక్కడ ధరలను ఎలా పెంచాలా అని తలబద్దలు కొట్టుకుంటుంటే, ఇక్కడ ఎలా తగ్గించాలా అని చూస్తున్నారు. ఇక్కడ వడ్డీరేటు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడ బ్యాంకులో ఎవరైనా డబ్బు దాచుకుంటే వారే 0.10 శాతం ఎదురు చెల్లించాలి. వడ్డీ రేటు ఎక్కువ వుంటే ఆర్ధికాభివృద్ధి వుండదా ? ప్రపంచంలో అత్యధిక వడ్డీ రేటు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనాలో 34.45 శాతం (మే 2016) వుంది. అక్కడ వృద్ధి రేటు గతేడాది 2.1శాతం. పక్కనే వున్న అమెరికాలో వడ్డీ రేటు 0.50 శాతమే అక్కడా వృద్ధి రేటు రెండు శాతం వరకు వుంది. స్వీడన్‌, డెన్మార్క్‌, స్విడ్జర్లాండ్‌లలో ఎవరైనా బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే వారే 0.5,0.65,0.75శాతం చొప్పున బ్యాంకులకు ఎదురు వడ్డీ చెల్లించాలి. మరి అక్కడ అభివృద్ధి లేదా ? అంతెందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌లో వడ్డీ రేటు 5.5శాతం కాగా వృద్ధి రేటు 4.8శాతం వుంది. ఇంకా ఇలాంటి వివరాలను పేర్కొంటే బుర్ర బద్దలు అవుతుంది. ఈ దేశాలన్నీ పెట్టుదారీ విధానాన్ని అనుసరిస్తున్నవే. మరి ఈ వడ్డీ రేట్లేమిటి ? కొన్ని దేశాలలో బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చి జనం డబ్బు ఎందుకు దాచుకుంటున్నారు? వారికి పెట్టుబడి అవకాశాలు లేవా ? అభివృద్ధి రేటులో ఇంత వ్యత్యాసం ఏమిటి ? ఎందుకీ ప్రయాస అంటారా ?

     వడ్డీ రేటు తగ్గింపు, తదితర విధానాలపై విబేధాలు, ఆరోపణలు, అవమానాల కారణంగానే రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అసాధారణరీతిలో తాను పొడిగింపును కోరుకోవటం లేదని, తనపని తాను చూసుకుంటానని బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది.చరిత్రలో అనేక మంది గవర్నర్లు వచ్చారు, పోయారు. బహుశా ఇలాంటి పరిస్ధితి ఎవరి విషయంలోనూ తలెత్తి వుండదు. కొద్ది వారాల ముందు రాజన్‌ ఈ ప్రకటన చేసి వుంటే నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల జాబితాలో దీనిని కూడా చేర్చి వుండేది లేదా సుబ్రమణ్యస్వామి వంటివారి చేత ప్రకటనలు చేయించి వుండేదేమో ? వడ్డీ రేటుకు, అభివృద్ధి రేటుకూ సంబంధం లేదని చెప్పేందుకే పైన అన్ని వివరాలను పేర్కొని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నరేంద్రమోడీ చెప్పినట్లుగా గుజరాత్‌ మోడల్‌ లేదూ, అభివృద్దీ లేదు దాన్ని అంగీకరించటానికి పాలక కూటమికి ధైర్యమూ లేదు, ఈ రోజు కాకున్నా రేపయినా జనం అడుగుతారు. ఇదిగో రఘురామ్‌ రాజన్‌ కారణంగానే ఇదంతా జరిగింది, దాన్ని సరిదిద్దటానికి మూడు సంవత్సరాలు పట్టింది, మరోసారి మాకు అవకాశం ఇస్తే మాజిక్‌ చూపిస్తాం అని 2019ఎన్నికలలో సాకు చెప్పేందుకే ఇంతా చేశారా ? ఏమో గత 24 సంవత్సరాలలో ప్రతి గవర్నర్‌కూ రెండవ సారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం రాజన్‌ పట్లనే ఇలా ఎందుకు వ్యవహరించింది? దీని వలన ప్రభుత్వానికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి? సమాధానం లేకపోగా మంచిది కొత్త గవర్నర్‌ను చూస్తాం అని ఆర్ధిక మంత్రి జైట్లీ తాపీగా చెప్పారు.

    ఒకటి మాత్రం స్పష్టం. వచ్చే రిజర్వుబ్యాంకు గవర్నర్‌ తమకు తాన తందానా పలకాలన్న సందేశాన్ని మోడీ సర్కార్‌ స్పష్టంగా పలికింది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలన్నింటినీ తన పార్టీ కార్యకర్తలతో నింపుతోంది. టీవీ సీరియల్స్‌లో గుడ్డి పాత్రల వంటి చిన్నా చితకా అనుభవ తప్ప పెద్ద అనుభవం లేని గజేంద్ర చౌహాన్‌ను ప్రతిష్టాత్మక పూనా ఫిల్మ్‌ఇనిస్టిట్యూట్‌కు అధిపతిగా చేసిన విషయం తెలిసిందే. అదే బాటలో మరో చౌహాన్‌ రంగం మీదకు వచ్చారు. ఈయనకు ఆ పరిమిత అనుభం కూడా లేదు. తాజాగా జాతీయ ఫ్యాషన్‌ టెక్నాలజీ సంస్ధ అధిపతిగా 68 సంవత్సరాల మాజీ క్రికెటర్‌ చేతన చౌహాన్‌ను నియమించింది. ఈ సంస్థ అధిపతులుగా సుప్రసిద్ద విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతికవేత్త, ప్రొఫెషనల్‌ను నియమించాలని చట్టంలో స్పష్టంగా వుంది.దాన్ని పక్కన పెట్టి పార్టీ కార్యకర్తను అందలమెక్కించారు.దీనిపై సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ చర్యను పరిహసిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో అధిపతిగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను వేస్తారేమో అన్నది వాటిలో ఒకటి. ఇవన్నీ చూస్తే రేపు ఏ బిజెపి కార్యకర్తనో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా నియమించినా చేసేదేమీ లేదు. ఎందుకంటే ఆర్ధికవేత్త సుబ్రమణ్య స్వామి ఎలాగూ మార్గదర్శనం చేసేందుకు వున్నారు కదా !

    ప్రతి దేశ రిజర్వు బ్యాంకు నెలా లేదా రెండు నెలలు, లేదో ఒక నిర్ణీత వ్యవధిలో తన విధాన సమీక్ష చేసుకొని వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాల ప్రకారం ద్రవ్యోల్బణ రేటు వస్తువులు, సేవల ధరల పెరుగుదల తీరుతెన్నులను ప్రతిబింబిస్తుంది. సాధారణ సూత్రం ప్రకారం వడ్డీరేటు తక్కువ వుంటే ఎక్కువ మంది అప్పుచేస్తారు, ఆ సొమ్ముతో వస్తువులను కొంటారు, అది ఆర్ధికవ్యవస్ధ పురోగతికి దారితీస్తుంది.ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మనదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు వాయిదాల మీద ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనే వారికి వడ్దీ రాయితీ గురించి వల విసిరే వారు. ఇప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువుల కొనుగోలుకు అప్పులిస్తున్నారు. అంటే కంపెనీలే వస్తువు ధరలో వడ్డీని కూడా కలుపుతాయి అది వేరే విషయం. వడ్డీ రేట్లు పెరిగితే జనం తమ సొమ్మును పొదుపు చేసుకోవటం ఎక్కువ చేసి వస్తు కొనుగోలు తగ్గిస్తారు.అది ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే కాదు, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అందువలన వడ్డీరేటు తగ్గింపు, పెంపుదల అనేది ఆర్ధిక వ్యవస్థను సమతూకంలో వుంచే సాము గరిడీ వంటిది.

    టీవీ సీరియల్స్‌లో బ్రేక్‌ మాదిరి ఇక్కడొక చిన్న పిట్ట కధ చెప్పాలి. ఒక పెద్దమనిషి కారణాలేమైనా ఇద్దరిని వివాహం చేసుకున్నాడట. పెద్ద భార్య జుట్టు నెరిసింది, భర్త జుట్టులో నలుపు తెలుపూ రెండూ వున్నాయి. అందుకని ఆమె నల్ల వెంట్రుకలను పీకివేసేదట. చిన్న భార్య తన జుట్టు నలుపు కనుక తన భర్త జుట్టులో వున్న తెల్ల వెంట్రుకలను నిర్ధాక్షిణ్యంగా తీసివేసేదట. చివరికి ఏమైందో చెప్పక్కర లేదు. ఆర్ధిక వ్యవస్థలో కూడా విరుద్ధ శక్తులు విధానాన్ని తమవైపు వుండేట్లు చూసుకుంటాయి. కరెన్సీ విలువనే చూడండి. విలువ ఎక్కువగా వుంటే దిగుమతి చేసుకొనే వస్తువులు చౌకగా వస్తాయి.తక్కువగా వుంటే మన వస్తువుల ధరలు అంతర్జాతీయ విపణితో తక్కువగా వుండి ఎగుమతులు పెరుగుతాయి. అందువలన ఒకరు మన రూపాయి విలువ తగ్గించాలని కోరితే, మరొకరు పెంచాలని కోరతారు. వడ్డీ రేటు కూడా ఇంతే.

   ఇక రఘురామ రాజన్‌ విషయానికి వస్తే ఆయన పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు తప్ప వ్యతిరేకించే ఆర్ధికవేత్త కాదు. అందువలన ఆయన కొనసాగితే సామాన్య జనానికి ఏదో మేలు జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు, జరగాల్సిన కీడు ఇప్పటికే జరిగింది కనుక జనానికి పెద్దగా నొప్పి కూడా వుండదు. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తమ ప్రభుత్వం పాలన ముగిసిన తరువాత ఎన్నికలలో దేశం వెలిగిపోతోంది అని ప్రచారం చేసుకుంది. నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ ప్రధాని కనుక పాలన చేపట్టిన మరుసటి రోజు నుంచే వెలిగి పోతోందని ప్రచారం ప్రారంభించారు. మన రిజర్వుబ్యాంకు గవర్నర్లలో రాజన్‌ పిన్న వయస్కుడు. నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావం వుందని చెబుతారు. అమెరికాలో వుండి వచ్చారు కనుక అక్కడి మాదిరి ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు అనుకున్నారేమో. నరేంద్రమోడీ సర్కార్‌ అతిశయోక్తులను భరించలేక అంధుల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అని పరోక్షంగా చురక అంటించారని అంటున్నారు.దాని మీద ఎవరు ఎలా విరుచుకుపడిందీ దేశం చూసింది. అప్పుడే రాజన్‌కు మరొక అవకాశం రాదని చాలా మంది అనుకున్నారు. ఆ తరువాతే శిఖండి మాదిరి నోటి తుత్తర సుబ్రమణ్య స్వామిని రంగంలోకి దించారు. ఇదంతా పొమ్మనకుండా పొగబెట్టటం అని తెలియనంత అమాయకంగా రాజన్‌ లేరు కనుక ఆయన కూడా అసాధారణ రీతిలో పదవీ విరమణకు 80 రోజుల ముందుగానే ఒక బహిరంగ లేఖ రాసి తానేమిటో ప్రదర్శించుకున్నారు. ఇదంతా లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా రాజన్‌ తప్పుకునే అవకాశాన్ని మోడీ సర్కార్‌ సృష్టించి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. అలా జరిగితే సలహాదారులకు పనేముంటుంది?

    ఇప్పుడు ప్రభుత్వ పరిస్ధితి ఒకరకంగా ఇరకాటంలో పడింది.ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో ప్రారంభమైన ఇప్పడప్పుడే పరిష్కారమయ్యే సూచనలు కనిపించటం లేదు. ఈ స్ధితిలో మోడీ జనంలో ఎన్నో ఆశలు కల్పించారు. దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ రోజులు గడిపి తానేదో అద్బుతదీపాన్ని తెస్తున్నట్లు హడావుడి చేశారు. రాబోయే రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌ ప్రతి చర్యను రాజన్‌ హయాంతో పోల్చుతారు. రాజన్‌ అయినా మరొకరైనా మన జీవనాడులను చేజిక్కించుకున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గీచిన పరిధులలో మాత్రమే పనిచేయాల్సి వుంటుంది. దానికి భిన్నంగా వెళ్లే అవకాశం లేదు.

     ప్రపంచీకరణలో భాగంగా మన ఆర్థిక వ్యవస్థను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులకు తెరిచారు. ఫోర్టుపోలియో పెట్టుబడులు అంటే వడ్డీ వ్యాపారుల వంటి వారు. మన ప్రభుత్వం తీసుకొనే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా వుంటే మన రుణపత్రాలు(బాండ్లు) కొంటారు. లేకపోతే ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడకు వెళ్లిపోతారు. మనకు ఆ రూపంలో విదేశీ మారక ద్రవ్యం రాకపోతే మన విదేశీ చెల్లింపులు ప్రమాదంలో పడతాయి, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన రోజులు వస్తాయి. అందువలన రిజర్వు బ్యాంకు గవర్నరు లేదా వడ్డీ రేటు విధానం గురించి మోడీ సర్కార్‌ ఎంతగా వివాదం లేదా ప్రచారం చేస్తే అంతగా జనం దృష్టి వాటిమీద పడుతుంది. పర్యవసానాలపై స్పందన కూడా ఎక్కువగానే వుంటుంది.

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు గత రెండు సంవత్సరాల కాలంలో పెరిగారు, అలాంటివారిపై చర్యలకు వాణిజ్యబ్యాంకులను రాజన్‌ కదిలించారని కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే కావూరి సాంబశివరావు వంటి ఎందరో బిజెపిలో చేరిన రుణ ఎగవేతదారుల వత్తిడి కూడా నరేంద్రమోడీ మీద వుందా ? రాబోయే రోజుల్లో ఇలాంటి అంశాలన్నీ అజెండాలోకి వస్తాయి. పశ్చిమ దేశాల పరిణామాలను చూస్తే ఆర్ధిక సంక్షోభ భారాలను సామాన్య జనం మీద నెట్టటం కనిపిస్తోంది. దానికి అయా దేశాలలో వున్న రిజర్వుబ్యాంకులు సాధనాలుగా పనిచేస్తున్నాయి. అందువలన మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు మరింతగా కట్టబెట్టాలన్నా, జనంపై భారాలు మోపాలన్నా రిజర్వుబ్యాంకు విధానాలు ముఖ్యం. అందువలన కొత్త గవర్నర్‌గా ఎవరిని తెస్తారు ? ఇప్పటి కంటే మౌలిక మార్పులు ఏం చేస్తారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !
  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: