• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP-led NDA

మోడీ నోరు మూస్తే ఏమిటి ? తెరిస్తే ఏమిటి ?

29 Friday Sep 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Arun jaitly, BJP, BJP-led NDA, economic mess, India economy, Narendra Modi, rupee value

ఎం కోటేశ్వరరావు

మిన్ను విరిగి మీద పడ్డా తన అంతరాత్మ అయిన అమిత్‌ షాతో మనకు లాభమో నష్టమో చెప్పు, అవసరమైతే నోరు విప్పుతా అంటారు ప్రధాని నరేంద్రమోడీ. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు దాన్నే నిర్ధారిస్తున్నాయి. ప్రయోజనం లేని మొగుడు తోటలో వుంటేనేం కోటలో వుంటే ఏమిటి ప్రయోజనం అన్న సామెత మాదిరి మోడీ వచ్చి మూడు సంవత్సరాల నాలుగు నెలలైంది ఆయన నోరు తెరిస్తే ఏమిటి మూస్తే ఏమిటి అని జనం అనుకోవటం ప్రారంభించారు. ఆ పెద్ద మనిషి మూసుకున్నా దేశం కోసం మేం నోరు తెరవక తప్పదంటున్నారు బిజెపి నేతలు. మోడీ పోయినా పార్టీని దక్కించుకోవాలి కదా మరి ! ఇంతకాలం చెప్పిన వాటికి భిన్నంగా ఇప్పుడు వాస్తవాలను చెప్పినా జనం నమ్ముతారా ? అన్నది అసలు సమస్య !

డాలరుతో మారకంలో రూపాయి బలపడినట్లే కనిపించి తిరిగి పతనం అవుతోంది. ఆ క్రమంలో అది పడుతూ లేస్తూ వుంది. సెప్టెంబరు ఎనిమిదిన గరిష్ట స్ధాయిలో రు.63.78 వున్నది కాస్తా ఆ తరువాత 194పైసల విలువ కోల్పోయింది. బుధవారం నాడు 65.72కి చేరింది. శుక్రవారం నాడు 65.31గా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా వేల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప. బ్యాంకులు చేశాయా, పాలకులు చేయించారా అన్నది జనానికి అనవసరం మనవి ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక పాలకులే మనకు బాధ్యులు. 2016 మార్చి వరకు అంతకు ముందు ఐదు సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం బకాయి 2,25,180 కోట్ల రూపాయలు. అంతకు ముందు ఆరు సంవత్సరాలవి కూడా కలుపుకుంటే రెండున్నరలక్షల కోట్ల రూపాయలు. రుణగ్రస్తులైన సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది తప్ప పెద్దలకు లేదు.విజయమాల్య వంటి వాడైతే అమ్మాయిలను వెంటేసుకొని మరీ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. గత ఆరునెలలుగా రూపాయి బలపడితే కొంత మంది వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు కొంత మంది వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అని పిస్తోంది. రూపాయి విలువ పెరిగినపుడే పెట్రోలు ధరలను మండిస్తుంటే ఇదేంట్రా బాబూ అనుకుంటున్న జనానికి రూపాయి విలువ పడిపోయిందంటే మరింతగా బాదుడు తప్పదు. అయినా సరే నరేంద్రమోడీ నోరు విప్పరు, ఇలాంటి మేళాన్నా మనం తలకెక్కించుకున్నాం !

కొత్తల్లుడు నోరు విప్పకపోతే మాఅల్లుడి పలుకే బంగారం అని అత్తామామలు మురిసి పోతారు, ఏదైనా వుంటే గదిలోకి తీసుకు వెళ్లి అమ్మాయికే చెబుతాడు అని అత్తింటి వారు సిగ్గుపడుతూ తొలి రోజుల్లో గొప్పగా చెప్పుకుంటారు. కానీ పాతపడిన తరువాత సమయం వచ్చినపుడు కూడా నోరు తెరవకపోతే మీ ఆయనకదేం జబ్బే అని అడిగితే నేనూ మోసపోయా, ఆయనకు నత్తి, మాట్లాడటం సరిగా రాదు అని కూతురు అసలు విషయం చెప్పక తప్పదు. మా మోడీ ఎలాగూ మాట్లాడరు కనుక మేం మాట్లాడక తప్పదు అంటున్నారు బిజెపి అగ్రనేతలలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా . ఆర్ధిక రంగాన్ని చిందరవందర చేసిన మంత్రి అరుణ్‌జైట్లీ గురించి ఇప్పటికీ నేను నోరు విప్పక పోతే నా బాధ్యతలను విస్మరించిన వాడిని అవుతాను. పార్టీలో పెద్ద సంఖ్యలో వున్నటువంటి, బయట మాట్లాడటానికి భయపడే వారి తరఫున నేను మాట్లాడుతున్నాను అన్నారాయన. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇలా ప్రతి చర్యనూ మోడీకి ఆపాదించిన పూర్వరంగంలో ఆయన పూలనే కాదు రాళ్లను కూడా భరించాల్సి వుంటుంది. అయితే ‘ అంత సహనం’ ప్రస్తుతం బిజెపిలో లేదు. అందుకే లోతు తెలుసుకొనేందుకు ఆంచులను తాకి చూస్తున్నట్లుగా యశ్వంత సిన్హా ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీని ఎంచుకున్నారు. ఆయనేమీ తక్కువ తినలేదు, అసలు విషయాలు చెప్పకుండా 80 ఏండ్ల వయస్సులో వుద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని సిన్హాను ఎత్తిపొడిచారు. అంతే కాదు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా వున్న సిన్హా కుమారుడు జయంత సిన్హా చేత పోటీగా తండ్రి వ్యాసానికి ఖండనగా మరో పత్రికలో వ్యాసం రాయించారు.మంత్రిత్వశాఖకు సంబంధం లేని తమ కుమారుడి చేత వ్యాసం రాయించిన పెద్దలు మరి అతనిని సహాయ ఆర్ధిక మంత్రిగా ఎందుకు తొలగించారో అని యశ్వంత సిన్హా ఎత్తి పొడిచారు. కొడుకు వ్యాసంలో పెద్ద పసేమీ లేదనుకోండి.

ఇంతకీ సీనియర్‌ సిన్హా చెబుతున్నదేమిటి? ప్రయివేటు పెట్టుబడులు గత రెండు దశాబ్దాల కనిష్టానికి తగ్గిపోయాయి. పారిశ్రామిక వుత్పత్తి మొత్తంగా కుప్పకూలిపోయింది. వ్యవసాయం సంక్షోభంలో వుంది. పెద్ద సంఖ్యలో వుపాధి కల్పించే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో వుంది. ప్రతి త్రైమాసికానికి అభివృద్ధి రేటు పడిపోతూ 5.7శాతానికి చేరింది. ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు నోట్ల రద్దు ఆజ్యం పోసింది. ప్రస్తుత ప్రభుత్వం 2015లో జిడిపి లెక్కింపు పద్దతిని మార్చింది. ఫలితంగా రెండువందల ప్రాతిపదిక పాయింట్లు పెరిగి అభివృద్ధి రేట్లు రికార్డయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.7, అదే పాత లెక్కల ప్రకారం అయితే 3.7 లేదా అంతకంటే తక్కువ. నరేంద్రమోడీ నోరు మూసుకొని గానీ ఇతర మంత్రులు, బిజెపి నేతలు తెరిచిగానీ ఈ అంకెలను సవాలు చేసే స్ధితిలో లేరు.

దేశ ఆర్ధిక వ్యవస్ధకు వుద్దీపన కలిగించనున్నారనే వార్తలు రావటంతోనే వరుసగా వారం రోజుల పాటు స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఇంటి పెద్ద సామర్ధ్యం మీద ఒకసారి అపనమ్మకం కలిగిన తరువాత బయటి వారే కాదు జాగ్రత్తగా గమనిస్తే ఇంట్లో వారే ఎవరికి వారు జాగ్రత్త పడటం వుమ్మడి కుటుంబాల్లో తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ పరిస్ధితి అలాగే వుందంటే అతిశయోక్తి కాదు. యశ్వంత సిన్హా చెప్పినట్లు గణాంక విధానం మార్చిన కారణంగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఒక ఏడాది తరువాత అభివృద్ధి ఎంతో పెరిగినట్లు కనిపించింది. అది వాపు తప్ప బలుపు కాదని అప్పుడే ఎందరో చెప్పారు. ఇప్పుడు రుజువైంది. ఇంకా వాపుగానే కనిపిస్తున్నప్పటికీ మూడు సంవత్సరాల కనిష్టానికి మన అభివృద్దిరేటు పడిపోయింది. నిజానికి ఈ పరిస్ధితిని అధికారంలో వున్న పెద్దలు వూహించలేదా అంటే నమ్మటం కష్టం. మార్కెట్లో చెలామణి అవుతున్న నల్లధనాన్ని వెలికి తీయటానికి పెద్దనోట్ల రద్దు అనే తప్పుడు ఇచ్చిందెవరో మోడీ పదవీచ్యుతుడై ఎన్‌డిఏలో ముసలం పుట్టిన తరువాత గానీ బయటకు రాదు. దానితో నాలుగు లక్షల కోట్లరూపాయల రాబడి అప్పనంగా ప్రభుత్వానికి వస్తుందని ఆ మొత్తంతో కొన్ని మెరుపులు మెరిపించి మంచి రోజులొచ్చయనే ప్రచార హోరులో మధ్యంతర ఎన్నికలతో మరో ఐదు సంవత్సరాలకు ఓట్లు కొల్లగొడదామని వేసిన అంచనాలు నీరు గారిపోయాయి. మోడీ ప్రతిష్టనిర్మాణంలో భాగంగానే నోట్ల రద్దు ఆయన తీసుకున్న నిర్ణయమే అని ఆపాదించిన వారు అదిప్పుడు శాపంగా మారిందని అర్ధమైన తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి వున్నారు.ముఖ్యమంత్రిగా వుండగా తీవ్రంగా వ్యతిరేకించిన జిఎస్‌టి అమలు మంచి చెడ్డలను పూర్తిగా ఆధ్యయనం చేయకుండానే ఆదరాబాదరా అమలులోకి తెచ్చారు. ఈ రెండు చర్యలూ తాత్కాలికంగా అయినా ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనానికి కారణమయ్యాయని మోడీ సర్కారు తప్ప అందరూ అంగీకరిస్తున్నారు. అంతా బాగుంది, ఏదైనా వుంటే అది తాత్కాలికమే అని సొల్లు కబుర్లు చెబుతున్న పెద్దలు వాటినే కొనసాగిస్తే ఒక దారి. కానీ ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పని చేయించేందుకు ఒక వుద్దీపన పధకం గురించి కసరత్తు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఆరుణ్‌జైట్లీ సెప్టెంబరు 20న చేసిన ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి.

మరో ఆరు రోజుల తరువాత గత మూడు సంవత్సరాలుగా మూలన పడవేసిన ప్రధాని ఆర్ధిక సలహా మండలి దుమ్ముదులిపారు. ఇది ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న భయాలను మరింత పెంచేదే తప్ప తగ్గించేది కాదు. ఇప్పటి వరకు ద్రవ్యలోటు 3.2శాతం కంటే పెరగరాదు అన్న ఆంక్షలను చూపి అన్ని రకాల పెట్టుబడులు, అభివృద్ధి పనులకు కోత పెట్టిన సర్కార్‌ ఇప్పుడు కట్టుకున్న ఆ మడిని పక్కన పెట్టి ఆర్ధిక వ్యవస్ధలోకి అదనంగా 50వేల కోట్లను కుమ్మరించి ఆర్ధిక మందగింపును ఆపగలమా అని సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న మంద్యానికి కారణంగా గత మూడు సంవత్సరాలుగా గ్రామీణ ఆర్ధిక వ్య వస్ధలో రైతాంగ వుత్పత్తులకు ధరలు పడిపోవటం ఒక ప్రధాన కారణంగా అనేక మంది చెబుతున్నారు. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్ధలో నిరర్ధక ఆస్థులు 2013 మార్చి నాటికి 1.56లక్షల కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది మార్చినాటికి 6.41లక్షల కోట్లకు పెరిగాయి. రుణాలు ఇచ్చింది మన్మోహన్‌ సర్కారే అనుకుందాం వసూలు చేయకుండా మోడీ సర్కార్‌ను అడ్డుకున్నదెవరు? యుపిఏ హయాంలో విజయమాల్య వేల కోట్లు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతుంటే నరేంద్రమోడీ సర్కార్‌ వెళ్లిరండి సార్‌ అని విమానం ఎక్కించిందా లేదా ? ప్రతి వారూ పరిశ్ర మలు, వ్యాపారాలకు వడ్డీ రేటు తగ్గించమని కోరేవారే తప్ప అదే సూత్రం వ్యవసాయానికి ఎందుకు వర్తింపచేయరని అడుగుతున్నవారేరి?

నరేంద్రమోడీ సర్కార్‌ అప్పుచేసి పప్పుకూడు అన్నట్లుగా వ్యవహరిస్తోందంటే చాలా మంది నమ్మరు. మన ప్రభుత్వాలు ఏటా ఎంత మొత్తం అప్పు తెచ్చుకోవాలో, దాన్నెట్లా తీర్చుకోవాలో ముందే నిర్ణయించుకుంటాయి. ఆ మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పన్నెండు నెలల్లో వంద రూపాయల అప్పు తీసుకోవాల్సి వుంటే మొదటి నాలుగు నెలల్లోనే 92 తీసుకొని అనుభవజ్ఞుడైన నరేంద్రమోడీ ఖర్చు పెట్టేశారు. అందువలన ఏ మాత్రం అదనంగా ఖర్చు చేయాలన్నా అప్పులన్నా తేవాలి లేదా అదనంగా నోట్లన్నా అచ్చువేయాలి. మొదటి పని చేస్తే అభివృద్ధి పనులు ఆగిపోయి అప్పులు తీర్చుకోవాల్సి రెండోది జరిగితే జనానికి ధరలు పెరుగుతాయి. బలి ఇవ్వటానికి మంచి యువకుడి కోసం దుర్భిణీ వేసి వెతికిన పాతాళభైరవి మాంత్రికుడి మాదిరి నరేంద్రమోడీ ఏదైనా మంత్రదండం దొరక్క పోతుందా అని వెతుకుతున్నారు. ఏదైనా పిచ్చిపని చేసి జనం దృష్టిని మళ్లిస్తే తప్ప అల్లావుద్దీన్‌ అద్బుత దీపాలకు, మంత్రదండాలకు పరిష్కారమయ్యేవి కాదిప్పుడు ముసురుకున్న సమస్యలు. వచ్చేటపుడు మంచిదినాలను తెస్తున్నా అన్న మోడీ చెడ్డదినాలతో పోయాడు అని పించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వాణిజ్య లోటులో మూడేండ్ల మోడీ సరికొత్త రికార్డు !

19 Friday May 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

3 years of narendra modi rule, BJP, BJP-led NDA, failure Modi, India employment, India trade gap, Narendra Modi, Narendra Modi Failures, NDA

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ మూడు సంవత్సరాల విజయాల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విజయగాధలు ప్రారంభమయ్యాయి. విమర్శనాత్మకంగా విశ్లేషించే వారి రాతలు, వ్యాఖ్యలు కనిపించకుండా, వినిపించకుండా సాధ్యమైన మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఎలాగైతేనేం విజయం సాధించారా లేదా అనేది ముఖ్యం అన్నట్లుగా పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలోనే కొందరైనా మీడియాలో ఏదో విధంగా నిజాలు చెప్పేందుకు తపన పడుతున్నారు. ప్రధానికి నొప్పి తగల కుండా పొగడుతూనే కొన్ని నగ్న సత్యాలను వెల్లడిస్తూ అమెరికా పత్రిక అఫింగ్టన్‌ పోస్టులో ఒక విశ్లేషణ మొదటి భాగం ఇలా సాగింది.’ మోడీ ప్రభుత్వం అధికారంలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఓటర్లలో దాని పలుకుబడి ఆశ్చర్యంగా వుంది. అత్యధిక ప్రభుత్వాల విషయంలో మూడో సంవత్సరంలో విసుగు పుట్టటం ప్రారంభమౌతుంది. దాన్నే ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభం కావటం అంటారు. మోడీ ప్రభుత్వ విషయంలో కూడా అదే జరుగుతుంది. మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను చంపివేస్తూనే వున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా కాశ్మీర్‌ పరిస్థితి దిగజారుతోంది, నిరుద్యోగ అంకెలు భయ పెడుతున్నాయి. దళితులు, ముస్లింలు, మహిళలపై హింసాకాండ ఇప్పటికే మామూలుగానే వుంది.మరో విధంగా చెప్పాలంటే కొద్దిగా కూడా మార్పు లేదు. మోడీ నూతన భారతంలో కొత్తదేమీ లేదు. సర్జికల్‌ దాడులు జరిగినప్పటికీ సైనికులను వధించటం పాకిస్థాన్‌ కానసాగిస్తూనే వుంది. వాస్తవాధీన రేఖ ఇప్పటికీ మండుతూనే వుంది.ఒక భారతీయుడిని వురి తీస్తామని పాకిస్థాన్‌ బెదిరిస్తోంది. దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఒంటరిపాటు చేయటం ప్రభుత్వ వ్యూహంగా వుంది. అయినప్పటికీ భారతే వేరుపడుతున్నట్లు కనిపిస్తోంది. తరువాత కళ్లెం లేని మోడీ రాజకీయ విజయం ఏమి వివరిస్తున్నది? చివరికి మున్సిపల్‌ ఎన్నికలలో కూడా మోడీ పేరుతో ఎదుర్కొంటున్నారు. 2014 కంటే నేడు మోడీ మరింత ప్రజాదరణ పొందారని అది తెలియ చేస్తున్నది.’ తరువాత వ్యాసమంతా విజయపరంపరకు మోడీ రహస్యమేమిటో వివరించారనుకోండి. ఇక్కడ సమస్య ఏమంటే మూడేండ్లలో ఎలాంటి మార్పు లేదని చెప్పిన తరువాత మోడీ విజయం సాధిస్తున్నారని చెప్పటంలోనే అసలు మర్మం దాగుంది. ఓట్ల చీలిక కారణంగా నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి వచ్చిన ఓట్ల శాతం కంటే ఎక్కువగా సీట్లు రావటానికి కారణాలేమిటో ప్రాధమిక గణితం చెబుతుంది. కానీ దానికి రాజకీయ వ్యూహం, ఎత్తుగడలంటూ లేని వాటిని ఆపాదించటమే విశేషం. నిజంగా అవి వుంటే గోవా, పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయినట్లు ?

నరేంద్రమోడీ వైఫల్యాల గురించి చెప్పేంత నిజాయితీ ప్రస్తుతం మన ప్రధాన స్రవంతి మీడియాకు లేదు.ఎందుకంటే అవన్నీ వాణిజ్యం కోసం పని చేస్తున్నవి కనుక ఆదాయాన్ని కోల్పోయేంత త్యాగం చేయవు.http://www.tradingeconomics.com/india/balance-of-trade ఈ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ ప్రభుత్వ నిర్వాకం వలన మన దేశ వాణిజ్య లోటు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 173.5లోటు పెరిగింది. దాని తీవ్రత ఎలా వుందంటే మార్కెట్‌ అంచనా 12.79 బిలియన్‌ డాలర్లయితే వాస్తవంగా 13.25 బిలియన్లు వుంది. ఇది 2014 నవంబరు తరువాత అత్యధికంగా ఒక రికార్డు నమోదు చేసింది. సర్కారు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు . ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా వున్న కారణంగా మనకు విదేశీ మారక ద్రవ్యం ఎంతో విలువైనది. చమురు వినియోగాన్ని కూడా పరిమితం చేయవచ్చు పోనీ సాధ్యం కాదనుకుంటే దిగుమతులు తప్పవు. బంగారం లేకపోతే మనకు రోజు గడవదా ? గతేడాది మొత్తంచమురు దిగుమతులు 49.1 శాతం పెరిగితే వాటిలో చమురు వాటా 30.1 కాగా బంగారం 211.4 శాతం పెరిగాయి. విలువైన రంగురాళ్లతో సహా మన దిగుమతుల్లో చమురు తరువాత 13శాతం అవే ఆక్రమిస్తున్నాయి. ధనికులు మాత్రమే తినే పండ్లు, కూరగాయల దిగుమతులకు కూడా దేశం మొత్తానికి చెందిన విదేశీమారక ద్రవ్యాన్ని వినియోగిస్తున్నారు. ఇలా చెప్పుకోవాల్సినవి ఇంకా వున్నాయి.

ఇదెక్కడి చోద్యం ! రైల్వే స్టేషన్లో టీ అమ్మానని చెప్పుకున్న మోడీకి ఈ దేశంలోని సామాన్యులకు ఏమి అవసరమో తెలియదా ? రంగురాళ్లు, బంగారం దిగుమతి చేయాలని ఏ చాయ్‌ వాలా అడిగాడు. గతంలో రాజులు రంగప్పలు తమ గొప్పను చూపించుకొనేందుకు, రాజకుటుంబాల ఆడంబరాన్ని ప్రదర్శించుకొనేందుకు ఇలాంటి పనులు చేశారు తప్ప సామాన్యుల గురించి ఆలోచించేవారెవరైనా చేస్తారా ? గుజరాత్‌ నమూనా పాలన ఇదేనా ? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే ఆ అనందాన్ని కూడా అనుభవించనివ్వకుండా అదే మోడీ సర్కార్‌ పన్నులు పెంచి మన జేబుల నుంచి డబ్బు కొల్లగొడుతోంది. మన ఆర్ధిక రంగంలోని ఒక ముఖ్యమైన ఎగుమతులు, దిగుమతుల తీరు ఇలా వుంది.

మోడీ, ఆయన అనుయాయులు చేసిన అనేక వాగ్దానాలలో వుపాధి కల్పన ముఖ్యమైనది. నైపుణ్య శిక్షణ అనో మరొకదాని గురించో ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ వుపాధి కల్పనలో ఘోరవైఫల్యం చెందింది. ఇదే సమయంలో చైనా కంటే అభివృద్ధి రేటు ఎక్కువగా వుందన్న ప్రచారం సాగుతోంది. ఒక వేళ అది నిజమనుకున్నా ఆ మేరకు వుపాధి ఎక్కడ పెరిగిందో వారే చెప్పాలి. యాభయ్యవ పడిలో వున్నవారికి నేను పెద్దగా చేయలేను గాని కొత్తగా వుపాధి కోరుకొనే రెండు పదుల ప్రాయంలో వున్నవారి జీవితాల రూపు రేఖలను మార్చివేయాలనుకుంటున్నాను అని నరేంద్రమోడీ అనేక సందర్బాలలో ఓట్లడుక్కుంటున్న సమయంలో చెప్పారు. ప్రభుత్వ గణాంకాలు, విశ్లేషణల ప్రకారం 2009-11 మధ్య 8.5శాతం అభివృద్ధి రేటు వుండగా ఏటా 9.5లక్షల నూతన వుద్యోగాలు వచ్చినప్పటికీ దానిని కూడా వుపాధి రహిత అభివృద్దిగా పేర్కొన్నారు.మోడీ హయాంలో 2015,16లో అంతకు ముందుతో పోల్చితే రెండు లక్షల వుద్యోగాలు తగ్గిపోయాయి. అంటే నాలుగో వంతు పడిపోయాయి. అయితే ప్రభుత్వం అసలు విషయాల జోలికి పోకుండా లెక్కలు వేయటంలో ఏదో తప్పుంది, లెక్కల పద్దతిని మార్చాలని నిర్ణయించింది. జిడిపి వృద్ధి రేటు లెక్కింపు విధానాన్ని కూడా మార్చిన విషయం తెలిసిందే. సంఘటిత రంగానికి, సేవా రంగాన్ని కూడా జోడించటంతో 2015తో పోల్చితే 2016లో కొద్దిగా వుద్యోగాలు పెరిగినట్లు కనిపించినా, అంతకు ముందుతో పోల్చితే తక్కువే. నోట్ల రద్దు కారణంగా వుపాధికి ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం ఒకటే మాట మీద వుంది. కానీ ఆ మూడునెలల కాలంలో ఎంత మందికి వుపాధి పోయిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కచ్చితంగా లెక్కలు తీసే యంత్రాంగం లేని కారణంగా ప్రభుత్వం అడ్డంగా వాదిస్తోంది.

పోలిక కాస్త కటువుగానే వుండవచ్చు. వయసు మీద పడిన తరువాత పురాతన వృత్తిలోకి నెట్టబడిన అభాగినుల పరిస్ధితి ఎంత దయనీయంగా వుంటుంతో నేడు ఐటి పరిశ్రమలో వయస్సు పైబడిన వారి పరిస్ధితి కూడా అగమ్యగోచరంగా వుండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటి, దాని అనుబంధ సంస్ధలలో ప్రస్తుతం వున్న 40లక్షల మంది వుద్యోగులలో 60శాతం మంది ప్రస్తుతం వున్న వారి నైపుణ్య స్ధాయిని బట్టి వుద్యోగాలకు పనికి రారని, వారికి శిక్షణ ఇచ్చినా ఏ మేరకు పనికి వస్తారన్నది ప్రశ్నార్ధకమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటికే వుపాధి తగ్గిపోయిన స్ధితిలో ఈ విద్యావంతులైన వారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరితే పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ లేబరు బ్యూరో సమాచారం ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో వుపాధి కల్పన ఇలా వుంది

డిసెంబరు నుంచి 2009 – డిసెంబరు 10 వరకు 8.70 లక్షలు

డిసెంబరు నుంచి 2010 – డిసెంబరు 11 వరకు 9.29

డిసెంబరు నుంచి 2011 – డిసెంబరు 12 వరకు 3.21

డిసెంబరు నుంచి 2012 – డిసెంబరు 13 వరకు 4.19

డిసెంబరు నుంచి 2013 – డిసెంబరు 14 వరకు 4.21

డిసెంబరు నుంచి 2014 – డిసెంబరు 15 వరకు 1.35

డిసెంబరు నుంచి 2015 – డిసెంబరు 16 వరకు 1.35

అన్నం వుడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్రమోడీ సాధించిన విజయాల తీరు తెన్ను గురించి ఈ రెండు ముఖ్యమైన అంశాలు వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మూడేండ్ల పాలన-తగ్గుతున్న మోజు !

16 Tuesday May 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP-led NDA, cotton farmers, Modi’s 3 years rule, Narendra Modi, Narendra Modi’s 3 years performance, NDA

ఎం కోటేశ్వరరావు

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న ఆసక్తి జనాలలో కలగటంపై సామాజిక మీడియాలో కొందరు వ్యంగ్యంతో సహా తమకు నచ్చిన రూపాలలో స్పందించారు. ఈ రెండు అంశాలూ చైతన్య సూచికకు సంబంధించినవి. నిరాశా జీవికి గ్లాసులో నీళ్లు సగమే అనిపిస్తాయి. ఆశాజీవికి ఆ సగమే ధైర్యాన్నిస్తాయి. కట్టప్ప-బాహుబలికి సంబంధించి రాజమౌళి ఆసక్తి రేపి దాన్ని సొమ్ము చేసుకోవటంలో కొత్త రికార్డు సాధించాడు. మూడు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ అంతకంటే పెద్ద ప్రచార వ్యూహంతో, కట్టుకధలతో న్యూఢిల్లీ బాహుబలి బిగినింగు (ప్రారంభం) విజయం సాధించింది. మైనారిటీ ఓట్లా మెజారిటీ ఓట్లతోనా అన్న విషయాన్ని పక్కన పెడితే మైనారిటీ ఓట్లతోనే అయినప్పటికీ గత మూడు దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ స్వంతంగా లోక్‌సభలో మెజారిటీ సాధించింది బిజెపి, దానికి సారధిగా మోడీ అన్నది తెలిసిందే. రాజమౌళి రెండో భాగాన్ని కూడా విజయవంతం చేశారు. ఒక కల్పిత కథతో నిర్మించిన సినిమా గురించి ఇంత ఆసక్తి పెంచుకున్న జనాలు తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న వాస్తవ అంశాలపై ఎందుకు ఆసక్తి చూపటం లేదు అన్నది కాస్త బుర్రలో గుంజు వున్నవారికి కలగటం సహజం. వారికి ఒక దండవేస్తే అలాంటి ఆలోచనలను దరిదాపులలోకి రానివ్వని వారికి వంద దండలు వేద్దాం. తన సినిమా గురించి ఆసక్తి కలిగించటానికి రాజమౌళికి మీడియా ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయన కూడా తనవంతు చేయాల్సింది చేశారు. న్యూఢిల్లీ బాహుబలి ఏం చేస్తున్నారు అని జనాలు ఆలోచించకుండా ఆసక్తిని వేరే వైపు మళ్లించటానికి మీడియా చేయాల్సిందంతా చేస్తోంది. అందుకు ఎన్నో రెట్ల ప్రతిఫలం కూడా అందుకుంటోంది. అదే రాజమౌళి-నరేంద్రమోడీకి వున్న తేడా అనిపిస్తోంది. మోడీ బాహుబలి కంక్లూషన్‌( ముగింపు) ఎలా వుండబోతోంది అన్నది ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో పాలకులు మీడియాను నయానో భయానో తమ చేతుల్లోకి తీసుకున్నారు. స్త్రోత్ర పాఠాలు, విజయగానాలు తప్ప మరొకటి వినిపించటం లేదు.

మోడీ మూడు సంవత్సరాల పాలన గురించి సర్వేలు వెలువడుతున్నాయి.చరిత్రలో హిట్లర్‌ను ఇప్పటికీ అభిమానించే వారు, అసహ్యించుకొనే వారు ఎలా వుంటారో చరిత్రలో పేరుమోసిన ప్రతివారికీ అభిమానులు, వ్యతిరేకులు ఎప్పుడూ వుంటారు.తన తండ్రిని స్మగ్లర్‌గా, అధోజగత్తు నేతగా చిత్రిస్తూ సినిమా తీస్తే వూరుకోబోనని, అటువంటి కార్యకలాపాలకు ఏ కోర్టూ అతనిని శిక్షించలేదని గుర్తు చేస్తూ హాజీ మస్తాన్‌ అనే మస్తాన్‌ మీర్జా పెంపుడు కొడుకుగా చెప్పుకున్న ఒక వ్యక్తి రజనీకాంత్‌ను హెచ్చరిస్తూ లేఖ రాసిన వార్తలను చదివాం. గుజరాత్‌ మారణకాండకు నరేంద్రమోడీ కారకుడని వూరూ వాడా కోడై కూసిన విషయం, అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వని విషయం తెలిసిందే. హాజీ మస్తాన్‌ కొడుకు మాదిరే తాము మోడీ పెంపుడు కొడుకులం అని చెప్పుకోకపోయినా సరిగ్గా ఇదే మాదిరి నరేంద్రమోడీని ఏ కోర్టూ తప్పు పట్టలేదు కనుక గుజరాత్‌ మారణకాండకు బాధ్యుడు అంటే సహించబోమని సామాజిక మీడియాలో ఇప్పటికీ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. అంటే చట్టం-అభిమానుల దృష్టిలో ఇద్దరూ మచ్చ లేనివారే !

మూడు సంవత్సరాల క్రితం అటు కేంద్రంలో నరేంద్రమోడీ, ఇటు తెలుగురాష్ట్రాలలో ఇద్దరు చంద్రులు అల్లావుద్దీను కంటే ఎక్కువగా రాజకీయ రంగంలో అద్బుతాలు చూపుతామని వాగ్దానాలు చేశారు. అవేమయ్యాయి, వారు దీపాన్ని రుద్దినట్లు జనం ముందు చూపటం తప్ప అద్బుతాలు కనిపించటం లేదు. నిజం మాట్లాడాల్సి వస్తే అసలు అద్బుతాలు చూపమని వారిని ఎవరు అడిగారు. చెప్పారు పో, ఎందుకు చూపటం లేదని అడిగేందుకు ముందుకు రాలేనంతగా మన జనం ఎందుకు నీరసించి పోతున్నారు అన్నది ఒక ప్రశ్న. దానికి ఈ మధ్య కొందరు చెబుతున్న సమాధానం ఏమంటే మన దేశంలో ‘వుత్తమ సంతతి’ తగ్గిపోయింది, అందువలన అలాంటి వారిని పుట్టించేందుకు ‘గర్భ సంస్కారం’ చేయాలి అంటూ కొందరు తయారయ్యారు, మనల్నందరినీ పనికిరాని వారిగా చిత్రిస్తున్న వారి గురించి తరువాత చూద్దాం.

మోడీ హయాంలో జనాన్ని బాగా ఆకట్టుకున్నదీ, అతి పెద్ద సంస్కరణగా చిత్రించినదీ, చర్చ జరిగిన అంశం పెద్ద నోట్ల రద్దు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు ద్వారా దేశంలో అవినీతిని అరికడతామని, నల్లధనాన్ని బయట పెడతామని చెప్పారు. నల్లధనం రద్దుతో పాటు ధరలు తగ్గుతాయి, కార్డులను గీకటం ద్వారా పన్ను వసూలు పెరుగుతుంది, కాశ్మీరులో రాళ్లు వేయటం ఆగిపోయింది, నక్సలైట్లకు డబ్లు ఇచ్చే మార్గాలు బందు అయిపోయాయి. అన్ని రకాల వుగ్రదాడులు తగ్గుతాయి వంటి కబుర్లన్నీ విన్నత తరువాత పాఠశాల రోజుల్లో అశోకుడి చెట్లు, ఆవు-ప్రయోజనాలేమిటి అంటే టీచర్లను మెప్పించేందుకు ఠావుల కొద్దీ రాసిన వ్యాసాలు మరోసారి గుర్తుకు వచ్చాయి. ఇవేమీ జరగవు, నోట్ల రద్దు వలన జనానికి ఇబ్బందులు, కొత్త నోట్ల ముద్రణకు చేతి చమురు వదలటం తప్ప ఒరిగేదేమీ వుండదు అని చెప్పిన వారిని నల్ల ధన కుబేరులకు మద్దతు పలికేవారుగానూ, నల్లధనంతో లబ్ది పోతోందనే వుక్రోషంతో చెబుతున్న మాటలుగానో చెప్పటంతో పాటు నోట్ల రద్దుకు మద్దతు ఇవ్వటం దేశ భక్తి అని చెప్పారు.

ఇంకేముంది బ్యాంకుల ముందు క్యూలలో నిలబడుతూ పొరపాటున ఎవరైనా నోట్ల రద్దును తప్పుపడితే వారిపై జనం విరుచుకుపడ్డారు. ఏం కొద్ది రోజులు ఇబ్బంది పడలేరా, ఓపిక పట్టలేరా అంటూ మందలించారు. అయినా తప్పన్న వారిని ఎయిడ్స్‌ వ్యాధి వచ్చిన వారి మాదిరి చీదరించుకున్నారు. సినిమాలో మంచి వాడనుకున్న బాహుబలిని కట్టప్ప చంపాడు. నిజ జీవితంలో వెంకయ్య నాయుడి మాటల్లో చెప్పాలంటే భారతీయుల బతుకులు బాగు చేసేందుకు వచ్చిన దేవదూత నరేంద్రమోడీ అనే బాహుబలి పెద్ద నోట్లు అనే శత్రువును సంహరించి దేశానికి దీపావళిని తెచ్చాడు. మంచిదే !

పాత నోట్ల మార్పిడి గడువు వరకు వాటి ప్రయోజనాల గురించి మాట్లాడిన మోడీ తరువాత ఒక్క మాట చెబితే ఒట్టు ! ఎందుకు మాట్లాడటం లేదు? రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన పాత నోట్ల విలువ ఎంత? నల్లధనం ఎంత బయట పడింది? దానిని ఏ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు? కొత్త నోట్ల ముద్రణ ఎంతకాలం పడుతుంది? నోట్ల రద్దుకు ముందు మాదిరి ఎటిఎంలలో సరిపడా నోట్లు పెట్టటానికి ఎంతకాలం పడుతుంది? ఇవేవీ జాతీయ లేదా ప్రాంతీయ మీడియాకు పట్టలేదు.అసలేమీ జరగనట్లే, అంతా బాగున్నట్లే అన్నట్లుగా మోడీ భజనలో మునిగిపోయింది. నవంబరులో జరిగే నోట్ల రద్దు తొలి వార్షికోత్సవం నాటికి అవసరమైన నోట్లు అందుబాటులో వుంటాయని సం’ తృప్తి చెందుదాం. తెలివయ్య అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు అన్నట్లుగా ప్రధాని చర్యను చూద్దాం !

రైతే రాజు, దేశానికి వెన్నెముక అనే నినాదాలు పాత బడ్డాయి. ఎందుకంటే రైతుల వెన్నెముకలు విరిగాయని గత ఏడు దశాబ్దాలలో తేలిపోయింది. అందువలన 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ కొత్త పల్లవి అందుకున్నారు. గుడ్డి కంటే మెల్ల ఎన్నో రెట్లు అన్న వేదాంతులం మనం. గత సంవత్సరాల గుడ్డి కంటే ముగిసిన పత్తి సీజన్‌లో ధరలు కొంత మెరుగ్గా వున్నాయని రైతులు సంతోషం వెలిబుచ్చారు. అయితే ఆ మేరకు మిర్చి రైతులకు ఆత్మహత్యల దారి చూపారనుకోండి. పత్తి ధర విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 2010-11 జె 4 అనే పొట్టి పింజరకం వార్షిక సగటు క్వింటాలు రు.5,771 వుంటే తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే పొడవు పింజరకాలకు సమానమైన ఎస్‌ 6 రు.5,271 వుంది. అప్పటికీ ఇప్పటికీ పెరిగిన ఖర్చులు, రైతాంగ అవసరాలను చూసుకుంటే కనీసం ఏడెనిమిది వేల రూపాయలైనా రావాల్సి వుంది. అయితే సీజన్‌లో బాగా తగ్గి తరువాత ఐదున్నరవేలకు పెరిగి కొంత మంది రైతులను సంతోష పెట్టి తరువాత తగ్గిందనుకోండి. ఇంకాస్త పెరగటానికి వున్న అవకాశాలను నరేంద్రమోడీ సర్కార్‌ దెబ్బతీసింది అనే విషయం మన రైతు బిడ్డలు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు మనకు చెప్పటం లేదు. దేశంలో పత్తి ధరలు పెరుగుతున్నప్పడల్లా దిగుమతులకు అనుమతించి రైతులను ఏడిపించి, మిల్లర్లను సంతోషపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు నరేంద్రమోడీ సర్కార్‌ ఎంత గుండెలు తీసిన బంటు అంటే పత్తి దిగుమతులలో గత వాజ్‌పేయి సర్కార్‌ 2001-02లో 25లక్షల బేళ్లతో రికార్డు దిగుమతులు చేసుకుంది. ఇప్పుడు 30లక్షలతో నరేంద్రమోడీ తన గురువు రికార్డును బద్దలు కొట్టారు.ఎవరికైనా అనుమానం వుంటే దిగువ లింక్‌లోని వార్త చదవండి.http://www.yarnsandfibers.com/news/textile-news/cotton-imports-touch-all-time-high-30-lakh-bales-season#.WRpwfcYlE2w అందువలన రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అంటే నమ్మాలో లేదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

లోకల్‌ సర్కిల్స్‌ అనే ఒక వేదిక రెండు లక్షల మంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణ ఫలితాలంటూ ఒక నివేదికను నరేంద్రమోడీ మూడు సంవత్సరాల పాలనపై తాజాగా విడుదల చేసింది. దానికి ఎలాంటి దురుద్ధేశ్యాలను, సదుద్ధేశ్యాలను అంట కట్టటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నో రావచ్చు. దాని వివరాల ప్రకారం జనం ఎలా వున్నారో చూద్దాం. ద్రవ్యోల్బణం మూడుశాతానికి తగ్గినప్పటికీ ధరలు పెరుగుతున్నాయని 66శాతం మంది చెప్పారు, గతేడాది కంటే 11శాతం వీరి సంఖ్య పెరిగింది. వుపాధి కల్పన గురించి అసంతృప్తి చెందిన వారి సంఖ్య 43నుంచి 63శాతానికి పెరిగింది. అవునని చెప్పిన వారు 35 నుంచి కేవలం 21శాతానికి తగ్గారు. నోట్ల రద్దు వలన అవినీతి తగ్గిందని చెప్పిన వారు 39శాతం కాగా, సరైన చర్య అని చెప్పిన వారు 51శాతం మాత్రమే వున్నారు. మోడీ హయాంలో ప్రపంచంలో భారత ప్రతిష్ట పెరిగింది అని నమ్మిన వారు 90 నుంచి 81కి తగ్గగా లేదు, చెప్పలేము అన్నవారు 10 నుంచి 19శాతానికి పెరిగారు.పాకిస్ధాన్‌తో వ్యహరించిన తీరు బాగుంది అన్న వారు గతేడాది 34శాతం కాగా సర్జికల్‌ దాడుల తరువాత ప్రస్తుతం ఆ సంఖ్య 64శాతానికి పెరిగింది.దేశంలో అసహనం పెరుగుతోందా అన్న ప్రశ్నకు గతేడాది లేదని చెప్పిన 74శాతం తాజాగా 69కు పడిపోయింది. మొత్తం మీద 61శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశాభంగం చెందిన వారి సంఖ్య గతేడాదితో పోల్చితే 36 నుంచి 39కి పెరిగింది. వాగ్దానాలను నెరవేర్చగలరని నమ్ముతున్నవారు 59శాతం వున్నారు.

ఈ సర్వే వెల్లడించిన అంశాలను మొత్తంగా చూస్తే నరేంద్రమోడీ మీద ఇంకా విశ్వాసం వున్న వారు గణనీయంగా వున్నారు. ఇదే సమయంలో భ్రమలు కోల్పోతున్నవారు పెరుగుతున్నారు.అందుకు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో సీట్లు దండిగా వచ్చినప్పటికీ ఓట్లు 2014 కంటే తక్కువ రావటం, గోవా, పంజాబులలో వున్న అధికారాన్ని కోల్పోవటం ఒక రుజువు. పైన పేర్కొన్న సర్వే ప్రకారం పాకనతో వ్యవహరిస్తున్న తీరును జనం మెచ్చుకుంటున్నారని తేలింది.అందువలన మిగతా రంగాలలో వైఫల్యాలు లేదా ముందుకు పోలేని స్ధితిలో పాకిస్ధాన్‌, కాశ్మీరు పరిస్ధితులను ముందుకు తెచ్చి మధ్యంతర ఎన్నికలలో ఓట్లను కొల్లగొట్టే పధకం వేస్తున్నట్లు కొందరు పరిశీలకులు ఇలాంటి సర్వేల వివరాలు వెల్లడి కాక ముందే అంచనావేశారు. పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. పాక్‌ రెచ్చగొట్టే చర్యలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలనటం, తగిన బుద్ధి చెప్పాలనటంలో రెండో మాట లేదు.అదే సందర్భంలో వారి మాదిరి మన విశ్వహిందూ పరిషత్‌ తొగాడియా లాంటి వారు రెచ్చగొట్టే ప్రసంగాలు పరిస్థితిని మరింతగా దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచవు. ఏదేశంతో అయినా సరిహద్దులలో ప్రశాంతత నెల కొల్పటంలోనే అసలైన రాజనీతి వుంటుంది. తగాదాలు పెట్టుకోవటం ఎంతసేపో పట్టదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని చూపి ఓట్లను కొల్లగొట్టిన అనుభవంతో అలాంటి వాటినే పునరావృతం చేయాలనే తప్పుడు ఎత్తుగడలకు ఎవరైనా పాల్పడితే అది దేశ ద్రోహం అవుతుంది తప్ప దేశ భక్తి కాదు. సరిహద్దులలో వుద్రిక్తతలు కొనసాగితే నష్టపోయేది మన సైన్యం, పంజాబ్‌, కాశ్మీరు పౌరులు, అమెరికా నుంచి కొనే ఆయుధాలకు ఖజానా ఖాళీ తప్ప తొగాడియాలు, సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయే వారు కాదు. మన దగ్గర వున్న మాదిరే అణ్వాయుధాలు, క్షిపణులు వారి దగ్గరా పుష్కలంగా వున్నాయి. ఏ పొరుగుదేశాన్నీ ఆయుధాలను చూపి, ప్రయోగించి అదుపు చేయలేరన్నది మన కంటే ఎన్నో రెట్లు పెద్దదైన అమెరికా అనుభవం.

పెద్ద నోట్ల సందర్భంగా వుగ్రవాదులు అంటే కాశ్మీరులో, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు వాదులు, మిగతా చోట్ల నక్సల్‌ వుగ్రవాదుల చర్యలు తగ్గకపోగా అంతకు ముందు మాదిరిగానే జరుగుతున్నాయి. కాశ్మీరులో నోట్ల రద్దుకు ముందు కాలేజీ విద్యార్ధులే రాళ్లు విసిరితే ఇప్పుడు హైస్కూలు పిల్లలు కూడా అదే పని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు తమ జీపు మీద ఒక యువకుడిని కట్టివేసి అతనిని రక్షణగా చేసుకొని ప్రయాణించిన వీడియోను ప్రపంచం యావత్తూ చూసింది. బహుశా ఎక్కడా ఇలాంటివి జరిగి వుండవు. వుగ్రవాద చర్యలు తగ్గిన దాఖలాలేమీ లేవు. ఎక్కడ అణచివేత పెరుగుతుందో అక్కడి జనం అంతగా వేరు పడిపోతారు, స్వార్దపరశక్తుల చేతులలో పావులుగా మారతారు. ఆఫ్‌ఘనిస్తాన్‌ అనుభవం అదే చెబుతోంది.తాలిబాన్లను అణచే పేరుతో అమెరికా, పాక్‌ దళాలు సామాన్య జనంపై దాడులు చేసిన కారణంగా అక్కడ తాలిబాన్లు తగ్గకపోగా పెరిగారు. విదేశాలకు విస్తరిస్తున్నారు.

నోట్ల రద్దుకు-వుగ్రవాదులకు సంబంధం లేదు, మోడీ బుర్ర నుంచి పుట్టింది తప్ప ఏ దేశంలోనూ అలా చెప్పలేదు. మోడీ చెప్పినట్లు డబ్బు అందటం ఆగిపోతే వారి కార్యకలాపాలన్నీ ఎలా సాగుతున్నాయి, పరిస్థితి మరింతగా ఎందుకు దిగజారింది అనే ప్రశ్నలు అడగలా వద్దా ? మన్‌కీ బాతంటూ తాను చెప్పదలచుకున్నదేదో చెప్పటం తప్ప దమ్మున్న కొద్ది మంది విలేకరులు అయినా అడిగేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రధాని పత్రికా గోష్టులు ఎందుకు పెట్టటం లేదు? నిజానికి వుగ్రవాద కార్యకలపాలు జరగటానికి పాలకులు కల్పించిన అనువైన పరిస్థితులే సగం వూతమిస్తున్నాయి. వాటిని విదేశాలు, విచ్చిన్న శక్తులు వుపయోగించుకుంటున్నాయి. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటును కోరుతున్నవారందరినీ వుగ్రవాద శక్తుల కింద జమకట్టి బలప్రయోగం చేస్తే ఫలితం కంటే జరిగే నష్టమే ఎక్కువ.రాళ్లు వేసే ప్రతివారూ దేశ ద్రోహులు అనుకుంటే అంతకంటే పిచ్చిపని మరొకటి లేదు.చేతులారా వుగ్రవాదాన్ని, వుగ్రవాదాన్ని పెంచి పోషించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా వుగ్రవాద ప్రభావ ప్రాంతాలలో జనాన్ని విశ్వాసంలోకి తీసుకొని వుగ్రవాదుల నిజస్వరూపాన్ని ఎండగట్టాలి. త్రిపురలో వామపక్ష ప్రభుత్వం అక్కడి వేర్పాటు, వుగ్రవాదులను శాంతి భద్రతల సమస్యగా చూడకుండా రాజకీయ వైఖరితో తీసుకున్న చర్యలు వారిని అదుపులోకి తెచ్చాయన్నది తెలిసిందే. అటువంటి చర్యలు మిగతా ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, కాశ్మీరులో లేని కారణంగానే అవాంఛనీయ శక్తులు చెలరేగుతున్నాయి.అమాయక యువత బలౌతోంది.

పైన పేర్కొన్న సర్వే వెలుగులో చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో విజయాలు చెప్పుకొనేందుకేమీ కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతసేపూ నూతన రాజధాని నిర్మాణం, పోలవరం చుట్టూ, తెలంగాణాలో మిషన్‌ కాకతీయ, భగీరధో అంటూ ప్రాజక్టుల అంచనాలు పెంచటం తప్ప మరొకటి పట్టలేదు. ఇవన్నీ కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల మధ్య పంపకాలకు తెరతీసే మెగా ప్రాజక్టులు తప్ప వేరు కాదు. ఐటి రంగంలో దాదాపు అన్ని కంపెనీలు వయసుపై బడిన వుద్యోగులను వూడబెరికే పనిలో పడినట్లు, రానున్న రోజుల్లో అది మరింతగా పెరగనున్నదని వార్తలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల సృష్టి జరుగుతోందన్నట్లు , దానికి చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు లోకేష్‌ నడుం కట్టినట్లు చూపేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోంది. లక్షల కోట్ల మేరకు కుదుర్చుకున్నట్లు చెబుతున్న అవగాహనా ఒప్పందాలేమయ్యాయో, వుద్యోగాలెక్కడున్నాయో తెలియదు. వాటన్నింటి గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అమెరికా పర్యటనలో తెలుసుకున్న సరికొత్త సాంకేతిక అంశాల గురించి జనానికి చెబుతున్నారు. అవి ఆయన కొత్తగా తెలుసుకున్నారేమో తప్ప జనానికి పాతవే. అవన్నీ వుపాధి రహిత వుత్పిత్తికి తోడ్పడేవే.ఆ కారణంగానే అమెరికాలో ట్రంప్‌ కొత్త వుద్యోగాలు ఇవ్వలేక విదేశీయుల రాకపై ఆంక్షలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడికి మూడవ సంవత్సర కానుకగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జగన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీని బిజెపి ఇచ్చింది. నరేంద్రమోడీ ఎవరు ఎపుడు అడిగినా ఇంటర్వ్యూలు ఇస్తూ వున్నట్లయితే దానికి పెద్ద ప్రాధాన్యత వుండేది కాదు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఒక సంచలనం. అది ఎటువైపు పయనిస్తుందన్నది చూడాల్సి వుంది. పైకి ఏమి చెప్పినా ప్రధాన రాజకీయపార్టీలన్నీ రాజకీయ లాభ నష్టాల లెక్కలలో వున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే రాజకీయాలలో కిక్కు ఎక్కుతుంది.

తెలంగాణా విషయానికి వస్తే గత ప్రభుత్వాలు లేదా అనుకూల పరిస్ధితుల కారణంగా హైదరాబాదులో అభివృద్ధి చెందిన ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలు, సహజంగానే వున్న అభివృద్ధి చెందిన ఫార్మా, ఇతర పరిశ్రమల కారణంగా చంద్రశేఖరరావు సర్కారు గత మూడు సంవత్సరాలుగా నెట్టుకు వచ్చింది. చేసిన వాగ్దానాలు గాలికిపోయాయి. దళితులకు భూమి, రెండు పడకగదుల ఇళ్లు, ప్రాజక్టుల నిర్మాణం, నీళ్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వున్నాయి.వుద్యోగాల విషయానికి వస్తే మూడు నోటిఫికేషన్ల విడుదల ఆరునోటిఫికేషన్ల రద్దు మాదిరి వుంది. మిర్చి ధర పతనం గురించి ఆందోళనకు దిగిన రైతుల చేతికి బేడీలు వేసి నిరసన తెలిపిన వారికి ఇదే గతి అన్నట్లుగా అవమానకరంగా పోలీసులు వీధులలో తిప్పిన వుదంతం చంద్రశేఖరరావు సర్కార్‌ రైతులకు చేసిన వాగ్దానలన్నింటినీ తుడిచిపెట్టింది. ఇదేమని అన్యాయం అని అడగటానికి, నోరెత్తటానికి వీలు లేకుండా ఇందిరా పార్కువద్ద వున్న ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌ను ఎత్తివేసి నిరసన గళం విప్పటానికి వీలు లేకుండా చేసేందుకు ఆంక్షలు జారీ చేశారు. ధర్నా చౌకు తమకు ఆటంకంగా వుందంటూ కాలనీ వాసుల పేరుతో ఒక మహిళా సిఐ, కానిస్టేబుళ్లతో సాధారణ దుస్తులు వేయించి పోటీ ధర్నా చేయించటం గమనించాల్సిన అంశం. నగర పోలీసు అధికారులు అంత బుర్రతక్కువ పధకాలు ఎలా వేసినట్లు ? అసలు ధర్నాలకు అనుమతి ఇవ్వని పోలీసులు పోటీ ధర్నాను ఎందుకు అనుమతించినట్లు ? రాజకీయంగా టిఆర్‌ఎస్‌ నాయకత్వం సంతృప్తి చెందే అంశం ప్రతిపక్షాలలో చీలిక. తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పూనుకున్న బిజెపి పెద్దన్న పాత్ర వహించి అనుచర పార్టీగా తెలుగుదేశం పార్టీని తయారు చేసుకోవచ్చు.ఈ క్రమంలోనే కేంద్రంలో బిజెపికి దగ్గర కావాలని చూస్తున్న తెరాసను దరి చేరనివ్వటం లేదు. పోయిన ప్రాభవాన్ని తెచ్చుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించవచ్చు. కాన్ని ప్రాంతాలకు పరిమితమైన వామపక్షాలు తమ బలాన్ని కాపాడుకొనేందుకు పూనుకుంటే మైనారిటీ ఓట్లతో తిరిగి అధికారానికి రాగలమన్నది తెరాస ధీమా. అందుకే ఆ పార్టీ చుట్టూ రాజకీయ తూనీగలు చేరుతున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ ప్రజాందోళనలను అణచటం ఒకే విధంగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడ వామపక్షాలు, వైఎస్‌ఆర్‌సిపి నేతలను ముందుగానే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దానికి ఎలాంటి కారణాలు వుండటం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇతర మంత్రులను డమ్మీలుగా చేసి తమ కుమారులను యువరాజుల మాదిరి తిప్పుతున్నారు. ఒక పధకం ప్రకారం వారి ప్రతిష్టను పెంచేందుకు పూనుకున్నారు. కేంద్రంలోని బిజెపికి రాజకీయంగా లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

జిఎస్‌టితో ప్రారంభంలో రేట్లు పెరుగుతాయని ముందే చెబుతున్నారు. మేకిన్‌ ఇండియా, వుపాధి కల్పన, నోట్ల రద్దు బండారం వంటి అన్ని అంశాలు మరింత వేగంగా బహిర్గతం గాక తప్పదు. నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుల మూడు సంవత్సరాల పాలనను మొత్తంగా చూస్తే భ్రమలు కోల్పోయే రేటు వేగం అందుకునే స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే అంతటా మధ్యంతర ఎన్నికల ఎత్తులు, జిత్తులతో పాలకులు, పార్టీల నేతలూ వున్నారు.

గమనిక : ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాసిన వ్యాసమిది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !
  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: