• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: brexit

చమురు, ఆహార కొరత బ్రిటన్‌ స్వయం కృతం !

06 Wednesday Oct 2021

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, Prices, UK

≈ Leave a comment

Tags

Boris Johnson, brexit, Britain's fuel and food shortages, British economy, UK Labor shortages


ఎం కోటేశ్వరరావు

వేలాది పందులను వధిస్తున్నారా ! ఇలాంటివి మామూలే కదా ! పెంపుడు జంతువులు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది. ఇరుగు పొరుగు దేశాల్లో లేని చమురు, వస్తు కొరత బ్రిటన్‌లోనే ఎందుకు తలెత్తింది ? అది గిరాకీని బట్టి ఉంటుంది.డైనోసార్‌ లేస్తోంది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు విలేకర్ల నుంచి ఎదురైన ప్రశ్నలు, ఆ పెద్ద మనిషి స్పందించిన తీరు ఇది. చైనాలో తలెత్తిన విద్యుత్‌ కొరత, ఎవర్‌గ్రాండే అనే రియెలెస్టేట్‌ కంపెనీ చెల్లింపుల సమస్య కారణంగా కొన్ని రేటింగ్‌ సంస్ధలు చైనా ఆర్ధిక రంగం గురించి తమ రేటింగ్స్‌ను సవరించాయి. దాంతో ఇంకేముంది చైనాలో సంక్షోభం తలెత్తిందని కొందరు తెగ సంతోషపడిపోతున్నారు. ఒక వేళ అదే జరిగినా చైనాతో పాటు ప్రపంచం కూడా నష్టపోతుందనే సృహ వారిలో ఉన్నట్లు కనపడదు. అలాంటి దుష్ట ఆలోచనలు పెట్టుకున్నవారు ఆశాభంగం చెందకతప్పదు. ఇదే సమయంలో ఐరోపా ధనిక దేశాల్లో ఒకటైన బ్రిటన్‌లో చమురు సరఫరాకు అవసరమైన వాహనాలను నడిపే డ్రైవర్లు లేక అక్కడ తీవ్ర సమస్య తలెత్తింది. దీని గురించి రేటింగ్‌ సంస్ధలు స్పందించలేదు.ఎనిమిది సంవత్సరాల నాటి గరిష్ట రికార్డును చమురు ధరలు అధికమించాయి. పెరిగిన చమురు ధరలతో పాటు సిబ్బంది వేతనాల పెంపుదలను కూడా వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నారు. బ్రెంట్‌ రకం చమురు ధర 82-83 డాలర్ల మధ్య కదలాడుతోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022లో అది 180 డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు వెల్లడయ్యాయి. చమురు టాంకర్లను నడిపేందుకు మిలిటరీ రంగంలోకి దిగింది. విదేశాల నుంచి పదివేల మంది డ్రైవర్లకు వీసాలు ఇస్తామని ప్రకటిస్తే మంగళవారం నాటికి కేవలం 127 మంది మాత్రమే ముందుకు వచ్చారని వార్తలు. తన ప్రభుత్వ విధానాలను బ్రిటన్‌ ప్రధాని పూర్తిగా సమర్ధించుకున్నారు. అసలు జరుగుతోందేమిటి ?


బ్రిటన్‌లో చమురు, గ్యాస్‌ పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని బంకుల్లోకి చేర్చేందుకు అవసరమైన టాంకర్లను నడిపే డ్రైవర్ల కొరత కారణంగా సరఫరాలో తీవ్ర సమస్య తలెత్తింది. దీంతో డ్రైవర్లు ఉన్నా చమురు లేక ఆసుపత్రులు, ఆహార, వస్తు దుకాణాల వంటి రవాణా సంబంధిత రంగాలన్నీ ప్రభావితం అయ్యాయి. అనేక దుకాణాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇది తాత్కాలిక సమస్యగానే భావిస్తున్నప్పటికీ అనేక మంది నమ్మటం లేదు. ఎంతకాలం ఉంటుందో తెలియని స్ధితి. దేశ ప్రధానే నిర్దిష్టంగా చెప్పలేకపోయాడు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం అని అందరూ వేలెత్తి చూపుతున్నారు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోయేందుకు(బ్రెగ్జిట్‌) నిర్ణయించుకున్న సమయంలో పర్యవసానాల మంచి చెడ్డలను పాలకులు బేరీజు వేయలేదనే అభిప్రాయం వెల్లడి అవుతోంది.
అమెరికా, జపాన్‌ ఆర్ధిక పోటీ నుంచి తట్టుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపా యూనియన్‌ రంగంలోకి వచ్చింది. దాని నిబంధనల ప్రకారం సభ్య దేశాలకు చెందిన పౌరులు ఎలాంటి అనుమతులు, అంగీకారాలు లేకుండా ఏ సభ్య దేశంలో అయినా పని చేసేందుకు, నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు వీలు కలిగింది. ఇది ధనిక దేశాల్లోని వాణిజ్య, పారిశ్రామిక సంస్దలకు చౌకగా శ్రమశక్తిని అందించే వ్యవస్ధగానూ, పేద దేశాలకు నిరుద్యోగ సమస్య తీరేందుకు, ఆదాయవనరుగా ఉపయోగ పడింది. 2020 జనవరి 31 నుంచి బ్రిటన్‌ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోయింది. దీంతో అక్కడి సంస్ధలకు అవసరమైన చౌకగా లభించే శ్రామికుల కొరత ప్రారంభమైంది. ఇప్పుడు వేతనాలు పెంచినా శ్రమజీవులు దొరకటం లేదు.


వర్తమాన స్ధితి గురించి మీడియాలో 1978-79 నాటి ఆర్ధిక దిగజారుడు, కార్మిక ఆందోళనల మాదిరి తయారు కావచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. స్టాగ్‌ఫ్లేషన్‌ (ఆర్ధిక వృద్ధి నిలిచిపోవటం-ధరల పెరుగుదల వలన ద్రవ్యోల్బణ పెరుగుదల)కు గురికావచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడి చమురు బంకులు, అనేక దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్రిటన్‌లో తమకంటే మెరుగైన వేతనాల కారణంగా గతంలో అనేక పేద దేశాల కార్మికులు వలసలు వచ్చారు. వలస విధానంలో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి కూడా వలసలను అనుమతించారు. పది సంవత్సరాల వ్యవధిలో నాలుగుశాతం వలస కార్మికులు పెరిగారు. దీంతో స్ధానికులకు అవకాశాలు తగ్గి అసంతృప్తి తలెత్తింది. తమ దుస్ధితికి ఐరోపాయూనియన్‌లో ఉండటమే కారణమని భావించి దానికి వ్యతిరేకత తెలిపారు. తమ పలుకుబడితో ఇతర దేశాలతో ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోవటం లాభదాయకంగా ఉంటుందని కార్పొరేట్‌లు కూడా విడిపోవటానికి మద్దతు ఇచ్చాయి. స్ధానికుల అసంతృప్తిని తగ్గించేందుకు ఇతర దేశాల నుంచి నైపుణ్యం తక్కువగా ఉండే కార్మికులను అనుమతించకూడదని బ్రిటన్‌ నిర్ణయించింది. అదే ఇప్పుడు వ్యవసాయం, కోళ్ల, పశుపెంపకం వంటి రంగాలలో పని చేసే కార్మికులు, డ్రైవర్ల కొరతకు దారి తీసింది. ఇతర ఉద్యోగాలతో పోల్చితే డ్రైవర్లకు ఇచ్చే వేతనాలు తక్కువ, పనిభారం ఎక్కువ, తగినంత గౌరవం కూడా లేకపోవటంతో స్ధానికులు వాటి పట్ల మొగ్గుచూపటం లేదు. బయటివారికి అవకాశం లేదు.

ఈ ఏడాది జూన్‌-ఆగస్టు మాసాల మధ్య పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జాతీయ గణాంక సంస్ధ వెల్లడించింది. సంస్ధ వివరాల ప్రకారం గతేడాది మార్చి నెలాఖరుకు ఉన్న సంఖ్యతో పోల్చితే భారీ వాహనాలను నడిపే ఐరోపా యూనియన్‌ డ్రైవర్ల సంఖ్య పదహారువేలు తక్కువగా ఉంది. బ్రిటన్‌ రవాణా అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం మొత్తం లక్ష మంది కార్మికుల కొరత ఉంటే వారిలో ఇరవైవేల మంది విదేశీయులని వెల్లడించారు. డ్రైవర్లు లేక కొన్ని వస్తువుల కొరత ఏర్పడి రెస్టారెంట్‌లు, పబ్‌లు, సూపర్‌మార్కెట్లను అనేక చోట్ల మూసివేశారు.కొన్ని చోట్ల సిబ్బంది కారత కూడా తోడైంది. కరోనా సమయంలో స్వదేశాలకు వెళ్లిన కార్మికులు కొందరు తిరిగి రాకపోవటం కూడా పరిస్ధితిని దిగజార్చింది. కరోనా కారణంగా ప్రభుత్వం వారానికి 20 పౌండ్లు (రు.2020) ఇవ్వటం కూడా కార్మికుల కొరతకు దారి తీసిందని కొందరు చెబుతున్నారు. పదిన్నరవేల మంది ట్రక్కు డ్రైవర్లు, ఐదువేల మంది కోళ్ల పరిశ్రమలో పనిచేసే విదేశీ కార్మికులకు తాత్కాలిక వీసాలు ఇవ్వాలని బ్రిటన్‌ సర్కార్‌ నిర్ణయించింది. కార్మికుల కొరత కారణంగా కొన్ని చోట్ల పంటలను పొలాల్లోనే వదలి వేస్తున్నారని, ఆహార పంటలు పనికి రాకుండాపోతున్నాయని వార్తలు వచ్చాయి. క్రిస్మస్‌ సందర్భంగా పెరిగే గిరాకీ కోసం టర్కీ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు, ఈ సారి వాటి కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా అమెరికన్లు టాయిలెట్‌ పేపర్లను విరగబడి కొనుగోలు చేసి నిలవచేసుకున్నట్లుగా ు్లగా ప్రస్తుతం బ్రిటన్‌లో సరఫరా కొరత కారణంగా చమురుతో పాటు మద్యం, నిల్వచేసుకొనే మాంసం, పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులను కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వచేసుకోవటంతో దుకాణాలు ఖాళీ అయ్యాయి. ధరలు కూడా పెరిగాయి. డిసెంబరు నాటికి మెరుగుపడకపోతే పరిస్ధితి మరింత దిగజారుతుందని భావిస్తున్నారు.

తాము కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన భుజాలను తానే తట్టుకున్నాడు. ప్రస్తుత పరిస్ధితికి బ్రెగ్జిట్‌ కారణమని కొందరు భాష్యం చెబుతున్నారు. అది పూర్తిగా వాస్తవం గాకపోయినా ప్రస్తుత సమస్య తీవ్రతరం అయ్యేందుకు బ్రెగ్జిట్‌ దోహదం చేసిందని మరికొందరు సూత్రీకరణ చేస్తున్నారు. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీ ఎంచుకున్న ఆర్ధిక నమూనాయే దీనికి మూలం అని చెప్పవచ్చు. ఆకస్మికంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకొనేందుకు దేశ ఆర్ధిక వ్యవస్ధ తగినదిగా లేదు. 2008లో తలెత్తిన సంక్షోభ సమయంలో బ్యాంకుల బలహీనతలు వెల్లడయ్యాయి. ఆసమయంలో కార్పొరేట్‌ సంస్ధలు తగిన నిధులు కలిగి ఉండటంతో నష్టాలను పూడ్చుకున్నాయని, ఇప్పుడు కంపెనీల వద్ద తగినన్ని నిధులు లేకపోవటం వలన ఉత్పాదక గొలుసు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నదని చెబుతున్నారు. ప్రతి దేశం ఇలాంటి సమస్యలతో ఉన్నప్పటికీ బ్రిటన్‌ ఎక్కువగా ప్రభావితమైందని తాజా పరిస్ధితి వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలుగా భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు బ్రిటన్‌ వదలి వెళుతున్నారనే సూచనలు వెలువడినప్పటికీ కాగల కార్యం గంధర్వులు తీరుస్తారులెమ్మనట్లు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వేందుకు పూనుకున్నట్లు ఇప్పుడు అనేక సంస్థలు వేతనాలు పెంచుతూ కార్మికులను ఆకర్షించేందుకు పూనుకున్నాయి, ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లకు, వాటి నిర్వహణకు పెట్టుబడులు అవసరం గనుక వాటి జోలికి పోకుండా ఇప్పటికి గడిస్తే చాలన్నట్లుగా గత కొంత కాలంగా వ్యయహరిస్తున్నారు. చలికాలం వస్తే గ్యాస్‌ వినియోగం పెరుగుతుంది.ప్రస్తుతం గత దశాబ్దికాలంలో కనిష్ట స్ధాయిలో నిల్వలున్నాయి. దేశ నిల్వసామర్ధ్యంలో 70శాతం కలిగిన రఫ్‌ అనే కేంద్రాన్ని 2017లో మూసివేశారు. నిల్వకేంద్రాల నిర్వహణకు అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తున్న కారణంగా ప్రయివేటు వారు కూడా ముందుకు రావటం లేదు. నాలుగు లేదా ఐదు రోజుల చలికాలానికి అవసరమైన నిల్వలు మాత్రమే బ్రిటన్‌లో ఉన్నాయి.


దేశంలో 8,300 చమురు బంకులు ఉంటే వాటిలో ఐదువేల వరకు మూతబడ్డాయి.పందుల వధశాలల్లో కార్మికుల కొరత కారణంగా రైతులు ఇటీవలి కాలంలో లక్షా 20వేల జీవాలను వధించి పారవేసినట్లు జాతీయ పందుల పెంపకదారుల అసోసియేషన్‌ ప్రకటించింది. విదేశీ వలస కార్మికులతో తక్కువ వేతనాలతో పని చేయించుకొనే పద్దతి నుంచి ఎక్కువ వేతనాలతో నిపుణులైన స్ధానిక కార్మికులతో పని చేయించుకొనే పద్దతికి మారుతున్నట్లు చెప్పుకుంటున్నా అంత తేలిక కాదని అనేక మంది చెబుతున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు చిల్లర దుకాణాల సిబ్బంది వేతనాలు 44శాతం పెరిగాయి, అయినా సిబ్బంది కొరత వెంటాడుతూనే ఉంది. వేతనాలు పెరుగుతున్నందున అంతర్జాతీయ మార్కెట్లో పోటీ, ఎగుమతుల సమస్య కూడా తలెత్తనుంది.

చమురు సంక్షోభం, పందుల వధ వంటి పరిణామాలు బ్రెక్సిట్‌ అనంతర సంధి దశలో తప్పదని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. పందుల వంటి పెంపుడు జంతు వధ మామూలు విషయమే అన్నారు వలసలు, తక్కువ వేతనాలతో కూడిన విఫలమైన పాత విధానానికి వెళ్లే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. కన్సర్వేటివ్‌ పార్టీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్‌ వరకు సరఫరాలోఅంతరాయం ఉంటుందన్నారు. పన్నులను మరింతగా పెంచే అంశాన్ని కూడా తోసిపుచ్చలేదు. సరఫరా వ్యవస్ధలో తలెత్తిన సమస్యల గురించి మాట్లాడుతూ ఏమౌతుంది ? కొద్ది దశాబ్దాల క్రితం రైతులు గ్రామీణ దుకాణాల్లో పాలు అమ్ముకొనేవారు, సూపర్‌మార్కెట్లనే వాణిజ్య భక్షకుల కారణంగా ఆ పరిస్ధితి పోయింది, తిరిగి అది వస్తే సంతోషిస్తా అన్నాడు.చమురు, వస్తువుల కొరత దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందన్నాడు. ఇలాంటి సమస్యలను మిగతా ఐరోపా దేశాలు ఎదుర్కోవటం లేదు ఎందుకంటే గిరాకీని బట్టి ప్రత్యేక సమస్య తలెత్తుతుందని సమర్ధించుకున్నాడు. తమ సర్కార్‌ విధిస్తున్న పన్నులు మార్గరెట్‌ థాచర్‌కంటే తక్కువ హరోల్డ్‌ విల్సన్‌ కంటే ఎక్కువ అన్నాడు.” అయినా మీరు మాట్లాడుతున్నదంతా చెత్త, ఎందుకంటే ఆ ప్రముఖులిద్దరూ మా మాదిరి మహమ్మారిని ఎదుర్కోలేదు. మా మాదిరి ద్రవ్య పరమైన ఉల్కాపాతాలకు గురి కాలేదు ” అన్నాడు.బ్రిటన్లో తలెత్తిన కొరతలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. క్రిస్మస్‌ నాటికి పరిస్ధితి ఒక కొలిక్కి రానట్లయితే కొత్త పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసే అవకాశం ఉంది. ఇది బ్రిటన్‌ స్వయం కృతం అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ విడిపోతుందా !

21 Wednesday Nov 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

brexit, brexit deal or no deal, European Union, Theresa May

Image result for brexit deal or no deal

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావన్ల ప్రకటనతో కన్యాశుల్కం నాటకం ఏ మలుపులు తిరిగిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఐరోపా యూనియన్‌(ఇయు)నుంచి విడిపోయిన(బ్రెక్సిట్‌) అనంతర సంబంధాల గురించి తాను కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆమె ప్రత్యర్దులు ఒప్పందాన్ని తిరస్కరించటం ద్వారా ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇయుతో తెగతెంపులు చేసుకోవాలనే కొత్త వాదనను తాజాగా ముందుకు తెస్తున్నారు. దాంతో ఒప్పందం వుంటే ఏమిటి లేకుంటే ఏమి జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు బ్రిటన్‌లో జరుగుతోంది. మరోవైపు బడాకార్పొరేట్‌ లాబీ ఇయు నుంచి బయటకు పోయినా తమ లాభాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొనే విధంగా ప్రయత్నిస్తున్నది. బ్రిటన్‌లోని వివిధ కమ్యూనిస్టు పార్టీలు బ్రెక్సిట్‌కు అనుకూలంగా రెండు సంవత్సరాల క్రితం ఓటు వేశాయి. ప్రధాన టోరీ, లేబర్‌ పార్టీలలో పునరాలోచన తలెత్తినప్పటికీ విడిపోయే విషయంలో కమ్యూనిస్టుపార్టీలు ఎలాంటి పునరాలోచన చేయటం లేదు. అయితే అక్కడి రాజకీయాలలో వీటి పాత్ర పరిమితం అన్న విషయం తెలిసిందే. పార్టీలోని పచ్చి మితవాదులు ప్రధాని థెరెసా మే మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తుండగా మరికొందరు అంతవరకు రాకుండా పార్టీలోనే సభా నాయకురాలిగా విశ్వాసతీర్మానం ఎదుర్కోవాలనే ప్రయత్నాల్లో వున్నారు. మరోవైపు ఒక వేళ ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి విడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంకేతికపరమైన నోటీసుల పేరుతో ప్రభుత్వం అన్ని తరగతులకు సమాచారాన్ని తెలియ చేస్తున్నది. దీంతో ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ వేరు పడుతుందా అన్న వూహాగానాలకు తెరలేచింది. ఈ సమస్య చివరకు థెరెసా మే వుద్యోగం వూడగొతుందా? ఆమె ప్రత్యర్ధులు చిత్తవుతారా అనేది వెండితెరపై చూడాల్సిందే. అసలు సమస్య ఏమిటి?

రెండు సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. దాన్నే క్లుప్తంగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. వెళ్లిపోవాలనే అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ఎలా వుపసంహరించుకోవాలనే అంశం మీద కూడా మరో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నాయి.ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ చేరటం నుంచి విడిపోవటం, అంతిమంగా ఎలా విడిపోవాలన్నది కూడా వివాదాస్పదం కావటం అంటే ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను వెల్లడించటమే. ఎలా విడిపోవాలి అనే అంశంపై కుదుర్చుకున్న ఒప్పందానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.మెరుగైన తన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని ప్రకటించిన 24 గంటలు కూడా గడవ ముందే బ్రెక్సిట్‌ మంత్రి, మరొకరు రాజీనామా ప్రకటించి వత్తిడి పెంచారు. స్వపక్షంతో పాటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది.

2016 జూన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది ఇయు నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని ఓటు వేయగా 48శాతం వుండాలని ఓటు వేశారు. బయటకు వస్తేనే సార్వభౌమత్వాన్ని తిరిగి పొందటం, వలసల విషయంలో భూభాగంపై మరింత అదుపు సాధ్యమని బ్రెక్సిట్‌ మద్దతుదార్లు పేర్కొన్నారు. బయటకు వస్తే ఆరోగ్య పరిరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం వుంటుందని ఓటర్లను తప్పుదారి పట్టించారు. దశాబ్దాల పాటు యూనియన్‌లో కొనసాగి ఇప్పుడు వుపసంహరించుకుంటే అనూహ్య సమస్యలు తలెత్తుతాయని సమర్ధకులు పేర్కొన్నారు.నిజానికి ఐరోపా యూనియన్‌లో వున్నప్పటికీ బ్రిటన్‌ కోల్పోయిందేమీ లేదు. మిగతా దేశాలన్నీ తమ కరెన్సీలను రద్దు చేసుకొని యూరోకు మారితే బ్రిటన్‌ తన పౌండ్‌ను అలాగే కొనసాగిస్తోంది. తన స్వంత వడ్డీ రేట్లు,ద్రవ్య విధానాలు, సరిహద్దులలో సందర్శకుల తనిఖీ స్వంత నిబంధనలు అమలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ చట్టబద్దమైనది కాదు. పార్లమెంట్‌ అనుమతి లేనిదే వుపసంహరణ ప్రక్రియ ప్రారంభం కారాదని బ్రిటన్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో పార్లమెంట్‌ ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఐరోపా యూనియన్‌ నిబంధన ప్రకారం ఏ సభ్యదేశమైనా బయటకు వెళ్ల దలచుకుంటే ఆర్టికల్‌ 50 అమలు జరపాలని కోరాల్సి వుంది. ఆ మేరకు పరివర్తనా కాల వ్యవధి ముగిసే 2019, మే 29నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంది. ఈలోగా గతంలో కుదిరిన ఒప్పందాలు,భవిష్యత్‌ సంబంధాలపై బ్రిటన్‌ -ఇయు మధ్య ఒక ఒప్పందం జరగాల్సి వుంది. ఇప్పుడు ప్రధాని థెరేసా మే దాన్నే ప్రతిపాదించారు.

Image result for brexit deal or no deal cartoons

ఒప్పందానికి కట్టుబడతారో లేదో తేల్చుకోవాల్సింది బ్రిటన్‌ తప్ప బ్రెక్సిట్‌ విషయంలో ఎలాంటి పున:సంప్రదింపులు లేవని ఐరోపాయూనియన్‌ కరాఖండిగా చెప్పింది. పరివర్తన కాల వ్యవధి పొడిగింపు, అస్పష్టంగా వున్న కొన్ని అంశాల గురించి సంప్రదింపులు తప్ప ప్రధాన మార్పులకు అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ స్పష్టం చేసింది.యూనియన్‌ చర్చల ప్రధాన ప్రతినిధి మైఖేల్‌ బార్నియర్‌ విలేకర్లతో మాట్లాడుతూ బ్రిటన్‌లో రాజకీయ పరిస్ధితి ఎలా వున్నప్పటికీ ఇయు రాయబారులెవరూ వారితో విడిగా మాట్లాడవద్దని కోరారు. అనేక మంది ఐరోపా నేతలు బ్రిటన్‌ ప్రధాని వైఖరికి మద్దతుగా మాట్లాడటం విశేషం. వారిలో ఆస్ట్రియన్‌ ఛాన్సలర్‌ సెబాస్టియన్‌ కర్జ్‌ ఒకరు. ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయవద్దని డచ్‌ ప్రధాని మార్క్‌ రూటే వ్యాఖ్యానించారు. యూనియన్‌ నుంచి బయటకు వస్తే బ్రిటీష్‌ పౌరులకు బంగారు భవిష్యత్‌ వుంటుందని అక్కడి బాధ్యతారహితమైన అనేక మంది రాజకీయ నాయకులు జనానికి చెప్పారు, నిజం ఏమిటంటే ఆ నిర్ణయం వారికి కాళరాత్రి అవుతుంది అని ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 29లోగా ఒప్పందం కుదరకపోతే వెంటనే సంబంధాలు రద్దవుతాయి. ఎలాంటి పరివర్తన వ్యవధి వుండదు.

బ్రిటన్‌లో టోరీ లేదా లేబర్‌ పార్టీగానీ రెండూ మౌలికంగా పెట్టుబడిదారీ వర్గప్రతినిధులే.అయినా వాటి మధ్య అధికారం విషయంలో తగాదాలున్నాయి.వివరాలు వెల్లడైన మేరకు ఒక అభిప్రాయం ప్రకారం ఆ ఒప్పంద సారాంశాన్ని చెప్పాలంటే కార్పొరేట్‌, ఇతర ధనికుల ప్రయోజనాలను రక్షించేదిగా, వలస వచ్చే వారి మీద దాడి చేసేదిగా వుంది. గతంలో బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది మార్చినెలాఖరుకు ఐరోపా యూనియన్‌(ఇయు) నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత 21నెలల పాటు పరివర్తన కాలం వుంటుంది. ఆ సమయంలో అనేక ఐరోపా స్వేచ్చా మార్కెట్‌ నిబంధనలు వర్తించే కస్టమ్స్‌ పన్నుల పరిధిలో బ్రిటన్‌ వుంటుంది. తరువాత ఏమిటన్నది సమస్య. తరువాత కూడా కార్పొరేట్‌, ధనికులకు వుపయోగపడే విధంగా బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను రూపొందించాలన్న వత్తిడి మేరకు బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను పొందుపరిచారన్నది ఒక అభిప్రాయం.పరివర్తన వ్యవధిలో బ్రెక్సిట్‌ అనంతర సంబంధాలపై బ్రిటన్‌-ఇయు మధ్య ఒప్పందం కుదరకపోతే పరివర్తన కాలం పొడిగింపు వుంటుంది. అంటే యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా బ్యాంకింగ్‌, రవాణా, పౌరసేవల వంటి అంశాలలో బ్రిటన్‌కు కూడా ఇయు సభ్యదేశాలతో సమాన అవకాశాలు కల్పించాలన్నది బ్రిటన్‌ కార్పొరేట్ల డిమాండ్‌. పరివర్తన కాలం ముగిసిన తరువాత బ్రిటన్‌లో వున్న దాదాపు 30లక్షల మంది ఇయు వలస పౌరులు అక్కడే వుండేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐదేండ్లనుంచి వుంటున్నట్లు రుజువు చేసుకున్నవారు అక్కడే స్ధిరపడిన స్ధితిలో కొనసాగవచ్చు. ఇదే నిబంధన ఇయు దేశాలలో వున్న బ్రిటన్‌ వలస పౌరులకు కూడా వర్తిస్తుంది.ఐరోపా యూనియన్‌ విధానాలను బట్టి ఇతర దేశాల వాసులు స్ధిరపడిన స్ధితిని బ్రిటన్‌ సర్కార్‌ రద్దు కూడా చేయవచ్చు. ఆర్ధికంగా సంపాదన లేని వారు తమ కుటుంబసభ్యులకు భారంగా లేమని తమకు తగినన్ని ఆర్ధిక వనరులు, సమగ్ర ఆరోగ్యబీమా వుందని రుజువు చేసుకోవాల్సి వుంది. వలస వచ్చిన వారికి బీమా సౌకర్యాన్ని వర్తింప చేయకూడదనే వత్తిళ్లు ఇప్పటికే వున్నాయి.వివాహ బంధంలో విడిపోయినపుడు భరణం చెల్లించటం గురించి తెలిసిందే.అలాగే విడిపోవాలని బ్రిటనే కోరుకుంది గనుక పరిహారంగా ఇయుకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వుంటుంది.

పాలక టోరీ పార్టీలో బ్రెక్సిట్‌ ఒప్పందం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అది చివరకు ఇద్దరు మంత్రుల రాజీనామా, ప్రధానిపై అవిశ్వాసతీర్మానం పెట్టాలనేంతవరకు దారితీశాయి. ఇయు నుంచి వెళ్లిపోవాలని గట్టిగా పట్టుబడుతున్నవారు పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, వాణిజ్యం నుంచి వలసలు, వుత్పత్తుల క్రమబద్దీకరణ వరకు అన్నింటికీ బ్రిటీష్‌ చట్టాలు తప్ప ఇయు చట్టాలతో సంబంధం వుండకూడదని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నవారు బ్రిటన్‌-ఇయు మధ్య కొన్ని సంబంధాలను కానసాగించాలని, పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే దేశ ఆర్ధిక వ్యవస్ధకు, రాజకీయ స్ధిరత్వానికి విపత్కరమని వాదిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే ప్రతిపక్ష లేబర్‌ పార్టీలోనూ వున్నాయి.బ్రెక్సిట్‌ తరువాత కూడా ఇయు కస్టమ్స్‌ యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగేందుకు వీలైన అంశం థెరేసా మే ఒప్పందంలో వుంది. ఐర్లండ్‌ అంతర్యుద్ధంలో వుత్తర ఐర్లండ్‌ ప్రాంతంలో మెజారిటీగా వున్న ప్రొటెస్టెంట్‌లు తాను బ్రిటన్‌లో భాగంగా వుండాలని కోరుకున్నారు. కాథలిక్కులు మెజారిటీ ఐర్లండ్‌లో వుండిపోయారు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యలో భాగంగా 1999లో కుదిరిన గుడ్‌ ఫ్రైడే ఒప్పందం మేరకు ఐర్లండ్‌ – వుత్తర ఐర్లండ్‌ మధ్య సరిహద్దు నిబంధనలు సులభతరంగా వున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌ బయటకు పోయిన తరువాత ఐర్లండ్‌ గనుక ఇయు కఠిన నిబంధనలు అమలు జరిపితే అది 1999 ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. అందువలన సరిహద్దు నిబంధనలు సులభతరంగా వుండాలని బ్రిటన్‌ కోరుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటన్‌ తన వుత్పత్తులను ఐర్లండ్‌లోకి పంపితే ఎలా అన్నది ఇయు సమస్య.

Image result for brexit deal or no deal

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకోదలచిన ముసాయిదా పత్రంలోని అంశాలను వ్యతిరేకిస్తూ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, వారి బదులు మరొక ఇద్దరిని వెంటనే నియమించారు. ఒప్పందం తనకోసం కాదని జాతీయ ప్రయోజనాలకోసమే అని ప్రధాని చెబుతున్నారు. తన ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని థెరెసా మే సోమవారం నాడు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ(సిబిఐ)కివిజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం వలన తమకు చౌకగా దొరికే కార్మికుల కొరత ఏర్పడుతుందని, తద్వారా తాము నష్టపోతామని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి.ఒప్పందం కుదురుతుందన్న వార్తలు వెలువడగానే బ్రిటన్‌ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నాయని ఒక కంపెనీ తూర్పు ఐరోపాకు తరలాలని నిర్ణయించినట్లు సిబిఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒప్పందం లేకుండా బ్రిటన్‌ విడిపోతే 50 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం వుండదని కొందరు భాష్యం చెబుతుండగా ఒప్పందం వున్నా లేకపోయినా పరిహారం చెల్లించాలని మరికొందరు చెబుతున్నారు.ఈనెల 25న బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ నేతలతో ఆమె సమావేశం తరువాత బ్రిటన్‌లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నాయకత్వ మార్పు సమస్యను ముందుకు తెచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని, సంప్రదింపులు ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు మరింత పెరుగుతుందని ఆమె హెచ్చరించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రెక్సిట్‌ : మీడియా వైఖరి ఏ పక్షం ?

09 Saturday Jul 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

BBC, brexit, brexit media, Media, media bias

Image result for brexit media bias

ఎం కోటేశ్వరరావు

   ఇటీవలి కాలంలో మీడియా పాత్ర గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి చోటా ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతోంది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ ఘటన, అదే మనిషి కుక్కను కరిస్తే సంచలన వార్త. అదే మాదిరి సాధారణ అర్ధంలో మీడియాకు చెప్పిన నిర్వచనం ప్రకారం వ్యవహరిస్తే అది సాధారణం అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అది చర్చ నీయాంశం అవుతుంది. వర్తమానంలో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవాలనే అంశంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ, అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో అక్కడి ప్రధాన రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీల తరఫున ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే అంశంలో ఆ రెండు పార్టీలలో పోటీ బడిన వారు పార్టీ సభ్యుల మధ్య జరిపిన ఓటింగ్‌ సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు, లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారంలో వున్న చోట ఆ ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా మీడియా వ్యవహరించటం తీవ్ర చర్చ నీయాంశం అయింది. ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ పరిణామాల గురించి చూద్దాం.

   న్యూ (కొత్తది) అనే ఏక వచన ఆంగ్ల పదానికి బహువచన రూపమే న్యూస్‌(కొత్తవి). సులభంగా చెప్పాలంటే తాజా కూరల గంప. దానిలో రకరకాల కాయలు, ఆకు కూరలు, మసాలాకు వుపయోగించే కరిపేపాకు, కొత్తి మీర వంటి వన్నీ గంప లేక బండిలో ఒకే దగ్గర వుంచి విక్రయించినట్లుగానూ న్యూస్‌ పేపర్లు, పుస్తకాలు, అవే ఎలక్ట్రానిక్‌ రూపంలో రేడియో,టీవీలు మొదలైనవి. కొంత మంది న్యూస్‌లో నాలుగు ఆంగ్ల అక్షరాలు నాలుగు దిక్కులను సూచించే పదాలలోని మొదటి అక్షరాలని అంటే నలుదిక్కులకు సంబంధించి సమాచారమని కూడా కొందరు వ్యాఖ్యానాలు చెప్పి వుండవచ్చు. అలా తీసుకున్నా దాని అర్ధంలో పెద్ద మార్పు వుండదు.

  సమస్య ఎక్కడ వస్తుందంటే నాలుగు దిక్కులకు చెందిన నూతన సమాచారాన్ని ఎలా అందించాలన్న దగ్గర వస్తోంది. మన దేశంలో స్వాతంత్య్రానికి ముందు పత్రికలు ప్రభుత్వానికి చెందిన నిర్ణయాలు, అభిప్రాయాలను, వైఖరులను మాత్రమే అందచేసేవి. అంటే ఆంగ్లేయుల పాలన కొనసాగింపు, ఆంగ్లేయుల కంపెనీల ప్రయోజనాలు, ప్రపంచ పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వ, పాలకుల వైఖరిని సమర్ధిస్తూ వార్తలు ఇచ్చేవి. అందుకే రాణిగారి పక్షం అని పిలిచేవారు. ఏకపక్షంగా వార్తలు ఇస్తూ, పాలనలోని లోపాలను, హాని కర విధానాలను విస్మరించటం పాఠకులలో విమర్శలకు కారణం కావటంలో కొన్ని పత్రికలు సున్నితంగా విమర్శలు చేసేవి. రాణిగారి విధానాలు మంచివే గానీ వాటి అమలులో అధికారుల లోపాల కారణంగా సమస్యలు అనే పద్దతిలో వార్తలు ఇస్తే అటు రాణీగారికి ఇబ్బంది లేదు ఇటు పాఠకులను కొంత మేరకు సంతృప్తి పరచవచ్చు. అలా ఇచ్చిన పత్రికలను రాణీగారి ప్రతిపక్షం అని పిలిచారు. ఈ రెండు రకాల పత్రికల ధోరణులకు భిన్నంగా అసలు ఆంగ్ల పాలన, జాతీయ, అంతర్జాతీయంగా బ్రిటన్‌ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేక వైఖరితో స్వాతంత్ర పోరాటానికి అనుకూలంగా వార్తలు ఇచ్చిన పత్రికలు కూడా మన దేశంలో వునికిలోకి వచ్చాయి. ఇవి ఒక తరగతి, స్వాతంత్ర పోరాటంతో పాటు వచ్చే స్వాతంత్య్రం దేశంలోని 99 శాతం మంది ప్రయోజనాలకు అనుగుణంగా వుండాలనే వైఖరితో వార్తలు, వ్యాఖ్యానాలతో వెలువడే పత్రికలు కూడా వచ్చాయి. అందువలన మీడియా అనే సాధనాన్ని ఎవరికి అనుకూలంగా వుపయోగిస్తున్నారనే దానిని బట్టి స్థూలంగా చెప్పాలంటే రెండు రకాలు ప్రతి సందర్భంలోనూ వున్నట్లు మనం గమనించవచ్చు.ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ ప్రజాభిప్రాయం సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు తెన్నులను పరిశీలిద్దాం.

   ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. ఆ మేరకు జూన్‌ చివరి వారంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్‌లో 52శాతం బయటకు వెళ్లిపోవాలని, మిగిలిన వారు వుండిపోవాలని ఓటు చేశారు.ఈ ప్రక్రియను ఆంగ్లంలో పొట్టిగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. ఓటర్లు మొత్తం పాల్గొని వుండి వుంటే, మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే ఫలితం ఎలా వుండేదో చెప్పలేము. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి ఆలోచనల చేయకుండా మీడియా వార్తలను చూసి వ్యతిరేకంగా ఓటేశాము అని చెప్పిన వారు వున్నారు. తూచ్‌ మేము ఇలా అనుకోలేదు, తిరిగి ప్రజాభిప్రాయసేకరణ జరపండి అప్పుడు మేము సరైన నిర్ణయం తీసుకుంటామంటూ వ్యతిరేకంగా, అనుకూలంగా ఓటు చేసిన వారు, అసలు ఓటింగ్‌లో పాల్గొనని వారూ లక్షల మంది పార్లమెంట్‌కు నివేదించారు. బ్రిటన్‌ నిర్ణయం ప్రపంచాన్ని కుదిపివేసింది అంటే అతిశయోక్తి కాదు. అంతర్గతంగానే కాదు అంతర్జాతీయంగా కూడా లాభ నష్టాల పర్యవసానాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒక పెద్ద వుపద్రవం సంభవించినపుడు ఎవరికీ ఏమీ నిర్దిష్టంగా తెలియదు, ప్రతి ఒక్కరూ తోటి వారిని వూరడించేందుకో లేక తెలుసుకొనేందుకో, తనకు తెలిసినదానిని చెప్పేందుకో పడే మూక ఆతురత కనిపిస్తోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎవరైనా యువతీ యువకులు వెంటనే వివాహం చేసుకోవాలనుకుంటే ఏటిఎం ఏదైతేనేం తీసుకోవటానికి మిషన్‌లో డబ్బుందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు పక్కనే వున్న ఆంజనేయ స్వామి గుడి అయినా సరే అర్ధగంటలో ఆ తంతు పూర్తిచేస్తారు, అదే విడాకులు తీసుకోవాలంటే నిర్ణీత వ్యవధి అవసరం అలాగే నిబంధనావళిని పూర్తిగా పాటిస్తే ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది, ఇంకా సాగదీయాలనుకుంటే ఆ తరువాత ఎంత కాలం పడుతుందో తెలియదు. లేదూ ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి ఐరోపా యూనియన్‌లోనే కొనసాగాలని అనుకుంటే అదీ సంభవమే.

     బ్రిటన్‌లో ఎంత అవివేకులైన ఆధునికులు వున్నారో బ్రెక్సిట్‌ వెల్లడించిందని సత్యజిత్‌ దాస్‌ అనే ప్రవాస సంతతికి చెందిన బ్రిటీష్‌ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. మీడియా తమను తప్పుదారి పట్టించింది అని కొందరు మండి పడుతుంటే జనంలో వున్న వెధవాయత్వం గురించి కొందరు అదే మీడియాలో తప్పుడుతున్నారు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని చెప్పినట్లుగా మీడియా ఎలా అయినా సొమ్ము చేసుకుంటుందా ? ఒక వివాదం లేదా ఒక విధానం గురించి చర్చ, ఓటింగ్‌, నిర్ణయం జరిగే సందర్బాలలో మీడియా ఎలా వ్యవహరించాలి అన్నది మీడియా ప్రారంభం నుంచి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూనే వుంది.నిష్పక్షపాతంగా, మంచి చెడ్డలను తక్కెట్లో పెట్టి సమంగా తూచినట్లుగా వుండాలని ఎవరైనా కోరుకుంటారు. అలా జరుగుతోందా ?

    సాధారణంగా ఎన్నికలలో ఓడినవారు విచారపడితే గెలిచిన పక్షం విజయం జరుపుకుంటుంది. ఈ బ్రెక్సిట్‌లో అక్కడి టోరీ, లేబర్‌ పార్టీ రెండూ ఓడాయి, రెండూ గెలిచాయి. ఎందుకంటే ఓటింగ్‌ ఫలితం రెండు పార్టీల నాయకత్వాలలో అభిమానులలో చీలిక తెచ్చింది.ఐరోపా యూనియన్‌ శ్రామికుల, మధ్యతరగతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తోందన్న భావన నానాటికీ పెరుగుతోంది కనుక దానికి వ్యతిరేకంగా కొందరు, దీర్ఘకాలంగా దానిలో బ్రిటన్‌ సభ్యురాలిగా వుంది కనుక తమ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసిందని మరికొందరు, మిగతా దేశాలతో మనకు అనవసరం మన దేశం, మన పూర్వవైభం, మన పలుకుబడి, పెత్తనం అనే పెత్తందారీ జాతీయవాదం తలకెక్కించుకున్నవారు ఇలా వివిధ కారణాలతో ఓటు చేశారని చెబుతున్నారు. కొంతమంది చెప్పినట్లు ప్రపంచీకరణ, అక్కడి పాలకవర్గం అనుసరిస్తున్న పొదుపు చర్యలపై రెండు పార్టీల వెనుక వున్న సామాన్యుల ఆగ్రహం అందామా ? ఒక వేళ అదే సరైనది అనుకుంటే బ్రెక్సిట్‌ను మొత్తం మీద మీడియా అంతా బలపరిచింది అంటున్నారు కనుక మీడియా కూడా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మారిందా ? మీడియాను అదుపు చేస్తున్న కార్పొరేట్‌ శక్తులు మారుమనసు పుచ్చుకున్నాయా ? అన్న ప్రశ్నలకు సమాధానం కష్టం. ప్రపంచాధిపత్యంలో పోయిన బ్రిటన్‌ ప్రాభవాన్ని లేదా పెత్తనాన్ని పూర్తిగా పునరుద్దరించలేకపోయినా కనీసం తమ ప్రయోజనాలనైనా రక్షించుకోవాలనే బ్రిటన్‌ కార్పొరేట్‌ (ఆర్ధిక) జాతీయ వాదం వైపు మొగ్గేట్లు జనాన్ని మీడియా ఒకవైపుకు నెట్టిందా ? ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే వర్గ, ఆర్ధిక,విద్య, వయస్సు, నివాసం, జాతి మొదలైన అంశాలన్నీ పని చేసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆ లక్షణాలన్నీ దానిలో వున్నాయి. ఏది ఎక్కువ పని చేసింది ? ఇంకా లోతుగా అధ్యయనాలు వెలువడితే తప్ప నిర్ధారణకు రాలేము. సాంకేతికంగా ఈ ఓటింగ్‌కు ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగటానికి సంబంధం లేదు. ఓటు చేశారు కనుక వెంటనే వెళ్లి పోండి అని మిగతా సభ్య దేశాలు కోరాయి గనుక బ్రిటన్‌ వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. మేం విడిపోవాలనుకున్నాం అని చెప్పినంత మాత్రాన విడాకులు రావు, కోర్టులో తమ వినతిని దాఖలు చేయాలి. అలాగే ఐరోపా యూనియన్‌ నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 ప్రకారం తాము విడిపోయేందుకు క్రమాన్ని ప్రారంభించాలని బ్రిటన్‌ కోరినపుడే ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రధానిగా వున్న కామెరాన్‌ రాజీనామా ప్రకటించారు, కొత్త ప్రధాని ఎన్నికైన తరువాత ఆ క్రమాన్ని ప్రారంభంపై నిర్ణయంతీసుకుంటారని చెప్పారు. బ్రెక్సిట్‌లో మీడియా పాత్ర గురించి చూద్దాం.

   రెండు తెలుగు రాష్ట్రాలలోని పత్రికలు అసాధారణరీతిలో ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని పాఠకులకు అందించాయి.సామాన్య జనం కంటే మధ్యతరగతి, ధనికులు, కార్పొరేట్‌ శక్తులకు ఆసక్తికలిగించే అంశం నుక అంత ప్రాధాన్యత ఇచ్చాయని వేరే చెప్పనవసరం లేదు. బ్రిటన్‌ జాతీయ పత్రికలన్నీ దాదాపుగా బ్రెక్సిట్‌కు మద్దతు ఇచ్చాయి. అయితే కొన్ని పత్రికలు పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొలది తామూహించినట్లు జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత లేకపోవటాన్ని గమనించిగానీ లేదా తాము ప్రచారం చేసిన దానికి భిన్నంగా ఫలితం వస్తే తమ విస్వసనీయత దెబ్బతింటుందని భయపడి గానీ చివరి క్షణంలో వైఖరి మార్చుకున్నాయి. బ్రెక్సిట్‌కు అనుకూలంగా వ్యవహరించినవి కొన్ని అనుకూల రాగాలాపన చేశాయి. డేవిడ్‌ కామెరాన్‌, ఐరోపా అనుకూల శిబిరానికి దెబ్బ అంటూ తొలిపేజీలో ఒక పెద్ద వార్తను దాదాపు రెండు నెలల ముందుగానే ‘అబ్జర్వర్‌ ‘ ప్రచురించింది.నలభైమూడు శాతం విడిపోవటానికి, 39శాతం వుండిపోవటానికి అనుకూలంగా వున్నారని 18శాతం మంది నిర్ణయించుకోలేదని అది పేర్కొన్నది. నల్లడబ్బు అక్రమంగా దాచుకున్నవారి గురించి పనామా పత్రాలు వెల్లడి అయిన రోజు కూడా బ్రిటన్‌ పత్రికలు విడాకుల వార్తలకే ప్రాధాన్యత ఇచ్చాయి. జూన్‌ 23వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచీ ఐరోపాకు వస్తున్న వలస జనాభాకు, ఐరోపా యూనియన్‌కు లంకె పెట్టి వ్యాఖ్యాతలు, సంపాదకులు తమ రచనలను నింపివేశారు.త్వరలో వెల్లడి కానున్న బ్రిటన్‌కు వలస వచ్చిన వారి వివరాల సమాచారమంటూ నెల రోజుల ముందే డెయిలీ మెయిల్‌ తొలి పేజీలో డెయిలీ మెయిల్‌, సన్‌ పత్రికలు రెండవ పేజీలో వార్తలను ప్రచురించాయి. విడిపోవాలన్న వైఖరి తమకు ఒక పెద్ద విజయమని డెయిలీ మెయిల్‌ ముందే ప్రకటించుకుంది. బ్రెక్సిట్‌ తరువాత బ్రిటన్‌ వృద్ధి చెందుతుందని పేర్కొనటమే గాక, వేర్పాటుకు ఓటు వేయాలని కోరుతూ ఇంధనశాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్‌ రాసిన వ్యాసాన్ని కూడా అది ప్రచురించింది.అపరిమితంగా వస్తున్న వలసజనంతో ఇప్పటికే స్కూళ్లు, ఆసుపత్రులు, వుద్యోగాలు, ఇండ్లపై ఎంతో వత్తిడి పెరిగిందని ఆమె పేర్కొటాన్ని ఆ పత్రిక ప్రశంసించింది. పదమూడు లక్షల బ్రెక్సిట్‌ బాంబు పేలబోతున్నదని సన్‌ శీర్షిక పెట్టింది. తాను ప్రధానిగా వున్నానని, మనల్ని పరిపాలించాలనే విషయాన్ని కూడా మరచిపోయి డేవిడ్‌ కామెరాన్‌ మనల్ని ఐరోపా యూనియన్‌లో వుంచేందుకు పూర్తిగా నిమగ్నమయ్యారని సన్‌ సంపాదకీయం ఎత్తిపొడిచింది.

     అబ్జర్వర్‌ పత్రిక సర్వే ప్రకారం వేర్పాటు కోరుకొనేవారు నాలుగుశాతం మెజారిటీగా వున్నారని, పెద్ద వారి కంటే వారి కుటుంబాలలోని యువతరం ఐరోపా యూనియన్లో కొనసాగేందుకు ఎక్కువగా కట్టుబడి వుందని, వ్యతిరేకంగా ఎందుకు ఓటెయ్యాలో వారికి చెప్పండని డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ తన సంపాదకీయంలో పెద్దలకు సలహా ఇచ్చింది. ఈ వేసవిలో గ్రీసు నుంచి టర్కీకి వలస జనాన్ని తరలించే పధకం కనుక విఫలమైతే సంక్షోభం మరింత తీవ్ర అవుతుందని డెయిలీ టెలిగ్రాఫ్‌ పేర్కొన్నది. ఐరోపా యూనియన్‌ వ్యతిరేకి బోరిస్‌ జాన్సన్‌ రాసిన వ్యాసాలకు ఆ పత్రిక పెద్ద పీట వేసింది.’ ప్రతి సందర్భంలోనూ మనకు ఐరోపా యూనియన్‌ సమస్యగా మారుతోంది.మన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, ప్రభుత్వం చేసే సాయాలన్నింటికీ యూనియన్‌ అభ్యంతరం చెబుతోంది,చివరికి మన ఇంట్లో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవటాన్ని కూడా అది ప్రశ్నిస్తోంది, అర్ధమయ్యేట్లు చెప్పాలంటే మిగతా దేశాలతో సమంగా మన ఇంధన ఖర్చును తగ్గించుకోవటానికి కూడా అదే ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. వేలాది వుద్యోగాలకు ముప్పు వచ్చినప్పటికీ మనమేమీ చేయలేం, ప్రజాభిప్రాయ సేకరణ ప్రచారం ప్రారంభమైనపుడు కీలక సమస్య మన సార్వభౌమత్వం అని నేను చెప్పాను, జనం నా వైపు జాలి చూపులు చూడటం నాకు గుర్తు వస్తోంది, సార్వభౌమత్వం గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని వారు చెప్పారు.అని బోరిస్‌ జాన్సన్‌ రెచ్చగొట్టాడు. మీడియా మొఘల్‌గా పేరు తెచ్చుకున్న రూపర్ట్‌ మర్డోచ్‌ పత్రికలైన సన్‌, టైమ్స్‌ రెండు వైపుల నుంచి వెలువడిన వాదనలను ప్రముఖంగా ఇచ్చాయి, మొగ్గు మాత్రం విడిపోయేవైపే వుంది. గార్డియన్‌ పత్రిక మాత్రం బ్రెక్సిట్‌ను వ్యతిరేకించింది. పోలింగ్‌ దగ్గర పడుతున్న సమయంలో మెయిల్‌ పత్రిక ఆశ్చర్యకరంగా కొనసాగాలనే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది. బ్రిటన్‌ శాంతి, సంపదలను ఫణంగా పెట్టే సమయం కాదిది అని పేర్కొన్నది. ఏ లెక్కన చూసుకున్నప్పటికీ బ్రిటన్‌ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతే అధిక పన్నులు, ద్రవ్య మార్కెట్లలో గందరగోళం, అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ఐరోపా యూనియన్‌ వెలుపల బ్రిటన్‌ సిరిసంపదలను పొందుతుందని చెప్పేవారు ప్రమాదకరమైన భ్ర మను కలిగించేందుకు పూనుకున్నారని రెండు పేజీల పెద్ద సంపాదకీయం రాసింది. సండే టెలిగ్రాఫ్‌, సండే టైమ్స్‌ మాత్రం వ్యతిరేకంగా ముందుకు వచ్చాయి. తొలుత బ్రెక్సిట్‌కు అనుకూలంగా వున్న అబ్జర్వర్‌ పత్రిక కూడా చివరికి ‘ఎన్ని లోపాలు వున్నప్పటికీ ఐరోపా యూనియన్‌ మంచికే శక్తి నిస్తుందన్నదానిని ప్రశ్నించలేము’ అని పేర్కొన్నది. మొత్తం మీద మీడియా వ్యవహరించిన తీరు తొలి రోజుల్లో తటస్థంగా వున్నవారిని బ్రెక్సిట్‌ వైపు మొగ్గేట్లు చేసిన కారణంగానే ఫలితాలు అలా వెలువడ్డాయని చెప్పవచ్చు. ఒకసారి ఓటరు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత చివరి క్షణంలో మీడియా వైఖరిలో వచ్చిన మార్పు పెద్దగా ప్రభావితం చేయదని చెప్పవచ్చు.

    ప్రయివేటు మీడియా తీరుతెన్నులు ఒక ఎత్తయితే ప్రభుత్వ నిధులతో స్వతంత్రంగా నడుస్తుందని చెప్పబడే బిబిసి ఏ విధంగా వ్యవహరించిందనేది కూడా ఆసక్తి కలిగించే అంశమే. బ్రెక్సిట్‌ ప్రచారం, ఎన్నికల సందర్భంగా బిబిసి ‘పిరికిగా’ వ్యవహరించిందనే శీర్షికతో ఒక పత్రిక వ్యాఖ్యానించింది. మీడియా శైలిలో అతి పెద్ద సవాలును అది ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. రెండు వైపుల నుంచీ వినిపించే వాదనలకు సమ ప్రాధాన్యత ఇవ్వలేదని, మొత్తం మీద మొగ్గు ఐరోపాయూనియన్‌లోనే వుండి పోవాలనే వైఖరి వైపు వున్నదని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. బ్రిటన్‌ కార్పొరేట్‌ శక్తులలో వ్యతిరేక, అనుకూల వైఖరి వెల్లడైంది. విడిపోయి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తే ఎక్కువ లాభం అని భావించే వారు మెజారిటీగా వున్నప్పటికీ యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూసే వారు కూడా గణనీయంగా వున్నారు.ఈ శిబిరాలు చేసిన వాదనలతో జనం ఒక విధంగా గందరగోళపడ్డారంటే అతిశయోక్తి కాదు. ఐరోపా యూనియన్‌ ఏర్పాటు అన్నది అమెరికా, జపాన్‌ పోటీని ఐక్యంగా ఎదుర్కొనేందుకే అని చెప్పినప్పటికీ ఆక్రమంలో కార్పొరేట్ల లాభాలను కాపాడేందుకు పొదుపు చర్యల పేరుతో కార్మిక వ్యతిరేక వైఖరిని ఐరోపా యూనియన్‌ తీసుకున్నది. పర్యవసానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టటం, ఎత్తివేయటమో చేస్తున్నారు. దీంతో సహజంగానే ఆ విధానాలకు కార్మికవర్గంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ అసంతృప్తిని సొమ్ము చేసుకొని వారి పేరుతో తమ ప్రయోజనాలను సాధించుకొనేందుకు కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నించాయి. మీడియా వాటికి వంత పాడటం తప్ప కార్మికవర్గ ప్రయోజన కోణం నుంచి గతంలో ఆలోచించలేదు, బ్రెక్సిట్‌ సందర్భంగానూ అదే వైఖరిని అనుసరించింది.

గమనిక :ఈ వ్యాసం వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి జూలై నెల సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రిటన్‌పై ఐరోపా ధనిక దేశాల ఆగ్రహం

26 Sunday Jun 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

brexit, EU, European Union, Europeans angry

ఎం కోటేశ్వరరావు

    కొన్ని గంటల్లోనే ఎంత తేడా !’విడాకులివ్వాలని నిర్ణయించుకున్న తరువాత రోషం, పౌరుషం వున్నవాళ్లెవరైనా వెంటనే ఇల్లు వదలి వెళ్లి పోవాలి.ఇక్కడే వుండి మరో నాలుగు నెలల తరువాత నోటీసు పంపుతాను అనటం ఏమిటి? మనం ఏమైనా పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకుంటున్నామా లేక మన మధ్య సన్నిహితమైన ప్రేమ ఏడిచింది గనుకనా ? వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ‘ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకున్నట్లు ఓటింగ్‌ వివరాలు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు పెరీ మాస్కోవిసీ అన్న మాటల సారాంశమిది. విడిపోవాలనుకున్న తరువాత కొత్త పితలాటకాలు పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్లి పోతే మంచిది అని ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌ మార్క్‌ రాల్ట్‌ తో సహా అనేక మంది ఐరోపాయూనియన్‌ విదేశాంగ మంత్రులు బ్రిటన్‌కు సూచించారు. రాజీనామా ప్రకటించిన ప్రధాని కామెరాన్‌ వెంటనే వైదొలిగితే మంచిది, వైదొలగే ప్రక్రియను సాగదీయ కుండా నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 అమలును వెంటనే కోరాలని, మిగిలిన వారు పీఠముడి పడిన పరిస్థితిలో వుండకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి బ్రిటన్‌కు సలహా ఇచ్చారు. వెళ్లిపోతామని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎక్కువ కాలం కొనసాగటం బ్రిటన్‌కు మర్యాద కాదు అని కూడా ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించాడు. అక్టోబరులో తన వారసుడు వచ్చే వరకు వెళ్లి పోయే చర్చలను ప్రారంభించే అవకాశం లేదని కామెరాన్‌ ప్రకటించిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. నాలుగు నెలల పాటు ఎలుకా-పిల్లి మాదిరి వ్యవహరించటం మంచిది కాదని లక్సెంబర్గ్‌ మంత్రి, మేం తరువాత పేజీ తిప్పి ముందుకు పోవాలని నెదర్లాండ్స్‌ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రారంభం నుంచి ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ ధోరణి వేరుగానే వుంది. పీడా విరగడైంది, ఒక తలనొప్పి పోయిందనే భావం మంత్రుల వ్యాఖ్యలలో వెల్లడైంది.

    అయితే తిరిగి ఓటింగ్‌ జరిపి మరోసారి అభిప్రాయం తీసుకోవాలంటూ బ్రిటన్‌లో లక్షల మంది పార్లమెంట్‌కు వినతి పత్రంపై సంతకాలు చేశారు. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రులు కుర్రకారు మాదిరి బ్రిటన్‌లేని ఐరోపా యూనియన్‌ గురించి చర్చించాలంటూ విరుచుకుపడితే పెద్దమనిషి మాదిరి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కుర్రాళ్లూ తొందర పాటు వద్దంటూ బ్రిటన్‌తో సంబంధాలు తెగకుండా దౌత్యానికి తెరతీశారు. విడిపోయిన తరువాత కూడా బ్రిటన్‌ను సహ సభ్యురాలిగా పరిగణించాలనే ప్రతిపాదన జర్మనీ నుంచి వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. ఫ్రెంచి నేతలు బ్రిటన్‌పై కాలుదువ్వుతున్న నేపధ్యంలో తాము బ్రిటన్‌కు వ్యతిరేకం కాదన్న సందేశం ఈ రూపంలో జర్మనీ పంపిందా అంటే కాదని చెప్పలేము. మొత్తానికి ఐరోపా యూనియన్‌లోని సభ్య దేశాల మధ్య విబేధాల వెల్లడికి, బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల జనం అసంతృప్తికి ఈ పరిణామాలు అద్దం పట్టాయి. బ్రిటన్‌లో అధికార, ప్రతిపక్షాలు రెండింటిలో ఈ పరిణామం ప్రకంపనలు సృష్టిస్తే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఒక్కసారిగా వులిక్కిపడింది. మరో తీవ్ర సంక్షోభానికి ఈ పరిణామం నాంది పలికిందా అని భయపడుతున్నది. ఓటింగ్‌ ఫలితాలు వెల్లడి అయిన తరువాత బ్రిటన్‌ సాధారణ ప్రజానీకానికి అంతకు ముందు మాదిరే మరో రోజు గడిచిందన్న వార్తలు వచ్చాయి.

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికార వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు అగ్రదేశంగా వున్న బ్రిటన్‌ తన వలసలను, మార్కెట్లను, పూర్వ ప్రాభవాన్ని కోల్పోయింది.మాజీ రాజు,జమిందారుల మాదిరి పూర్వీకులు సమకూర్చిన అడ్డగోలు సంపాదన మిగిలింది కనుక బెట్టు చేసే మాదిరి దాని పరిస్థితి. రెండు ప్రపంచ యుద్ధాలలో ఏ మాత్రం దెబ్బతినపోగా అటూ ఇటూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా పెట్టుబడిదారీ దేశాలలో అగ్రగామిగా ముందుకు వచ్చి ద్విముఖ వ్యూహం అనుసరించింది. సోవియట్‌ నాయకత్వంలో ముందుకు వచ్చిన సోషలిస్టు కూటమి దేశాలను దెబ్బకొట్టటం, పెట్టుబడిదారీ కూటమిలోని ఐరోపాలోని సామ్రాజ్యవాద దేశాలు తిరిగి తనకు పోటీగా తయారు కాకుండా చూసుకొనేందుకు నాటో సైనిక కూటమిని రుద్ది వాటి జుట్టుపట్టుకు కూర్చోవటం. ఐరోపా పునరుద్దరణ పేరుతో మార్కెట్లను తనఅదుపులోకి తెచ్చుకోవటం, ఆసియాలో మరో సామ్రాజ్యవాద దేశమైన జపాన్‌ను తన రక్షణ ఒప్పందంతో కట్టిపడవేయటం వంటి ఎత్తుగడలకు తెరతీసింది. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుసు అన్నట్లుగా అమెరికా దురాలోచన పసిగట్టిన ఐరోపా దేశాలు యుద్ధం ముగిసిన వెంటనే తమలో తాము సహకరించుకొనేందుకు గల అవకాశాలను వెతకటం ప్రారంభించాయి. యుద్ధంలో ఓడిపోయిన కారణంగా మిలిటరీలు రద్దయిన జర్మనీ, జపాన్‌ మిలిటరీకి ఖర్చు లేదు కనుక ఆ సొమ్మును పరిశోధన, అభివృద్ధికి కేటాయించి అచిర కాలంలోనే తిరిగి పట్టాలెక్కాయి. మార్కెట్లు, వలసలను కోల్పోయిన ఐరోపా దేశాలు దెబ్బలు తగిలిన వారందరూ ఒక చోట చేరి ఒకరి గాయానికి మరొకరు మందు రాసినట్లుగా తమలో తాము సహకరించుకొనే ప్రక్రియ 1948లోనే ప్రారంభమైంది. ఆక్రమంలో అంటీ ముట్టనట్లుగా వుండి పాతిక సంవత్సరాల తరువాత 1973లో బ్రిటన్‌ ఐరోపా ఆర్ధిక యూనియన్‌లో చేరింది.

    1948లో హేగ్‌లో జరిగిన ఐరోపా సదస్సుకు ఆ ఖండం నుంచి ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడాల నుంచి పరిశీలకులు హాజరయ్యారు. ఐరోపాలో రాజకీయ, ఆర్ధిక సహకారానికి ల అవకాశాలను పరిశీలించేందుకు ఆ సదస్సు తీర్మానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిన, గెలిచిన దేశాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్న పూర్వరంగంలో ఈ ఆలోచన వచ్చింది. 1952లో ఐరోపా బొగ్గు, వుక్కు సమాజం ఏర్పాటుతో ప్రారంభమై నేటి ఐరోపా ఆర్ధిక యూనియన్‌గా పెరిగి పెద్దదై 1992లో మాస్ట్రిచ్‌ ఒప్పందంతో నేటి ఐరోపా యూనియన్‌ ప్రారంభమైంది.అది ఏర్పడిన మరో పాతిక సంవత్సరాలకు బ్రిటన్‌ దాని నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ప్రస్తుత యూనియన్‌కు జర్మనీ ఇంజను వంటిదైతే మిగతా సభ్యదేశాలు మోటారు వాహనంలోని ఇతర భాగాల వంటివి.తన పెత్తనం లేని యూనియన్‌లో బ్రిటన్‌ ప్రారంభం నుంచి ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే వ్యవహరించింది. బహుశా ఈ కారణంగానే ఫ్రెంచి మంత్రి అలాంటి వ్యాఖ్య చేసి వుండవచ్చు. జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్‌, ఇటలీ, లక్బెంబర్గ్‌ దేశాల మంత్రులతో సమావేశమైన తరువాత ద్రవ్య, రాజకీయ పరమైన పర్యవసానాలు సంభవించే అవకాశం వున్నందున సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోయే ప్రక్రియను ప్రారంభించాల్సి వుందన్నారు.

     వివాహం అంటే అనుకున్నతరువాత ఆగలేని వారు చివరికి ఆంజనేయ స్వామి గుడిలో అయినా 24 గంటల లోపే చేసుకోవచ్చు. కానీ విడాకులు అలా కాదు. చట్ట ప్రకారమే కనీస వ్యవధి, పెద్ద తతంగం వుంటుంది. అలాగే ఐరోపా యూనియన్‌ నుంచి ఏ సభ్య దేశమైనా విడిపోవాలన్నా అన్నీ సక్రమంగా జరిగితే అనే షరతుకు లోబడి లావాదేవీల పరిష్కారానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. అవసరమనుకుంటే ఆ వ్యవధిని ఇంకా పొడిగించుకోవచ్చు. లేదూ ఏదో తొందర పడి విడిపోవాలనుకున్నాం, ఇంకా నోటీసు ఇవ్వలేదు కనుక కొనసాగే అవకాశం ఇవ్వాలని అని బ్రిటన్‌ కోరుతుందా ? ఇంతవరకు ఏ దేశమూ అలా అడిగిన దాఖలా లేదు కనుక అటువంటి పరిస్థితే వస్తే ఏం చేస్తారో చూడాల్సి వుంది. విడిపోవాలి, కలసి వుండాలి అని ఓటు చేసిన వారి మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే.ఫలితాలు వెల్లడైన తరువాత అనేక మంది తాము ఆలోచించకుండానే ఓట్లు వేశామని గగ్గోలు పెడుతున్నారు. ఐదు ప్రాంతాలలో ఇంగ్లండ్‌, వేల్స్‌లో మెజారిటీ విడిపోవటానికి ఓటు వేయగా లండన్‌, స్కాట్లండ్‌, వుత్తర ఐర్లండ్‌ ప్రాంతాల వారు అత్యధికులు కలసి వుండటానికి మొగ్గు చూపారు.అయితే మొత్తం జనాభాలో ఇంగ్లండ్‌లోనే 53శాతం వున్నందున అక్కడి వారు స్వల్ప మెజారిటీతో విడిపోవటానికి మొగ్గు చూపినా మొత్తం ఫలితాన్ని వారే నిర్ణయించారు. విడిపోవాలనే నిర్ణయ పర్యవసానాల గురించి గగ్గోలు పెడుతున్న జనం తిరిగి ఓటింగ్‌ జరపాలని ప్రభుత్వానికి విన్న వించుకున్నారు. రాజ్యాంగం ప్రకారం లక్ష మంది ఏదైన ఒక పిటీషన్‌పై సంతకం చేస్తే దానిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. అలాంటిది పిటీషన్‌పై సంతకాలు ప్రారంభమైన కొన్ని గంటలలోనే పన్నెండు లక్షల మంది సంతకాలు చేయటానికి ఒకేసారి పూనుకోవటంతో అధికారిక వెబ్‌సైట్‌ కుప్పకూలింది.

   బ్రిటన్‌ సామాన్య జనం ఎటువైపు మొగ్గారు ?ప్రాధమిక విశ్లేషణలను బట్టి అక్కడి వెనుక బడిన ప్రాంతాల జనం ఎక్కువ మంది విడిపోవటానికి ఓటు వేశారు. పరిశ్రమలు మూతపడటం తప్ప తెరవని, కొత్త పెట్టుబడులను నోచుకోని ప్రాంతాలు, ఐరోపా యూనియన్‌ నిబంధనల పేరుతో అమలు జరుపుతున్న పొదుపు చర్యలకు ఎక్కువగా ప్రభావితులైన వారు, ఇక్కడ వున్నవారే దారిద్రరేఖకు దిగువకు దిగిపోతుంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేవారిని అనుమతిస్తారా అంటూ అసంతృప్తికి గురైన వారు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతికూల పర్యవసానాలకు ప్రభావితులైన వారందరూ విడిపోవటానికే మొగ్గు చూపారు. దీని పర్యవసానాల గురించి అనేక వ్యాఖ్యానాలు పరస్పర విరుద్దంగా వెలువడుతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరి అనిపించినప్పటికీ సంక్షిప్తంగా ఎలా వున్నాయో చూద్దాం.

   విడిపోయేందుకు మొగ్గు చూపారనగానే ప్రపంచ వ్యాపితంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. తరువాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ వెంటనే అనిశ్చితి తొలగలేదు. తక్షణమే అతిగా స్పందించినట్లు కొందరు భావించారు. ఐరోపా చీకట్లోకి పోనుంది, ఐరోపా నాయకులు అసలు సమస్యలపై దృష్టి సారించకపోతే 1933 నాటి ఆర్ధిక సంక్షోభానికి దారి తీయవచ్చు. ఐరోపా తిరిగి అభివృద్ధి బాట పడుతుంది. ఐదు సంవత్సరాలలో బ్రిటన్‌ సమాఖ్యగా వుండజాలదు. స్కాట్లండ్‌ స్వతంత్ర దేశంగా మారి ఐరోపా యూనియన్‌లో చేరుతుంది. ఐర్లండ్‌లో వుత్తర ఐర్లండ్‌ విలీనం అవుతుంది. బ్రిటన్‌ తిరిగి పూర్వ వైభవం పొందుతుంది. అనేక దేశాలు ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతాయి. అమెరికా-బ్రిటన్‌ మధ్య ప్రత్యేక అనుబంధం మరింత గట్టి పడవచ్చు, అమెరికా సాయంతో తన పలుకుబడి పెంచుకొనేందుకు బ్రిటన్‌ ప్రయత్నిస్తుంది. నాటోను సాధనంగా చేసుకుంటుంది. అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంటుంది. బ్రిటన్‌ రానున్న ఐదు నెలల కాలంలో మాంద్యంలోకి జారిపోతుంది. అనేక దేశాలను అది ప్రభావితం చేస్తుంది. ఐరోపా అంతటా ప్రజాకర్షక నినాదాల పార్టీలకు ఆదరణ పెరుగుతుంది. జర్మనీ మరింత పలుకుబడి కలిగిన దేశంగా మారుతుంది. మిగతా దేశాలు కూడా పలుకుబడి పెంచుకొనేందుకు ప్రయత్నిస్తాయి.ఐరోపా యూనియన్‌ పెత్తనాన్ని తగ్గించేందుకు పూనుకుంటాయి. ఐదు సంవత్సరాలలో ఐరోపా ప్రపంచ శక్తి స్ధానాన్ని కోల్పోతుంది. ఐరోపా ఐక్యత దెబ్బతిని రష్యా పలుకుబడి పెరగవచ్చు. పుతిన్‌ మరింత బలపడతారు .ఈ పరిణామం అమెరికా నాయకత్వంలోని నాటోను మరింత పటిష్ట పరచవచ్చు. ఐరోపా యూనియన్‌ మరిన్ని రక్షణ చర్యలను తీసుకోవచ్చు. జనం పొదుపు చర్యలను తగ్గించమని డిమాండ్‌ చేస్తారు. స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీ వామపక్షం వైపు వెళ్ల వచ్చు. డాలరు బలపడి, వాణిజ్యలోటు, జాతీయ వాదాలు పెరగవచ్చు.

    బ్రిటన్‌ నిర్ణయ ప్రభావం భారత్‌పై ఎలా పడుతుందనేది కూడా మిశ్రమ స్పందనగా వుంది. దీని గురించి రానున్న రోజుల్లో మరింత స్పష్టత రావచ్చు. సోమవారం నాడు జరిగే ఐరోపా యూనియన్‌ సమావేశం తరువాత అనేక అంశాలపై మరింత వివరణ, విశ్లేషణలు వెలువడతాయి. ఇప్పుడు చేసే వన్నీ కూడా అయితే గియితే అన్న అంచనాలపైనే వుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: