• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: call money

మెయ్యబోతే ఆవుల్లో దున్నబోతే దూడల్లో అంటే కుదురుతుందా ?

20 Sunday Dec 2015

Posted by raomk in AP NEWS, BJP, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, call money, CHANDRABABU, tdp

ఎంకెఆర్‌

కాంగ్రెస్‌ అంటే కుంభకోణాలకు మారుపేరు, సందేహించేవారే లేరు. వేల కోట్ల రూపాయలున్న (కొందరు ఐదువేలంటారు మరికొందరు రెండువేలంటారు) నేషనల్‌ హెరాల్డ్‌ అనే ఒక పత్రిక ఆస్ధులను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. దానిని అమలు జరిపారు. సుబ్రమణ్యస్వామి అనే ఒక నాయకుడో కార్యకర్తో స్థాయో అసలు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియని ఒక లిటిగెంట్‌ బిజెపిలో చేరక ముందు నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం అంటూ ఒక కేసు వేశాడు. దానిలో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు శనివారం నాడు న్యూఢిల్లీలో ఎలాంటి హంగామా చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా టీవీలలో చూశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది కనుక జైలుతో పనిలేకుండా బెయిల్‌ వచ్చింది. విచారణ వాయిదా పడింది. మనం కూడా దాన్ని కాసేపు పక్కన పెడదాం.

ఆసలు ఆ కేసుతో దానిని వేసిన సుబ్రమణ్యస్వామితో మాకు సంబంధం ఏమిటి అంటుందేమిటి బిజెపి? సదరు స్వామి బిజెపిలో లేనపుడు వేశారని ఇప్పుడు బిజెపిలో వున్నప్పటికీ అది స్వంత కేసు తప్పకేసు తప్ప పార్టీకి సంబంధం లేదని నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో వున్న బిజెపి మాజీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు, ఆ పార్టీ ఇతర నాయకులు బల్లచరిచి మరీవాదిస్తున్నారు. ఇక్కడ సమస్య స్వామి ఇప్పుడు ఏ గంగలో వున్నాడన్నది కాదు. ఆ కేసు విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? పార్టీలో చేర్చుకొనే ముందు బిజెపి లేదా స్వామి ఆ కేసుల గురించి చెప్పలేదు. స్వామి తప్ప కేసులతో తమకు సంబంధం లేదని అనటం వింతగా వుంది. పాత కేసులు వున్న అనేక మందిని బిజెపి తన కండువా కప్పి వారిని ఎన్నికలలో నిలబెడుతున్నది. అయినంత మాత్రాన వారు అఫిడవిట్లలో ఆ కేసులను ప్రస్తావించకుండా వుంటున్నారా? వుంటే కుదురుతుందా ? ఏదో ఒక వైఖరి చెప్పాలా లేదా ?

కాల్‌ మనీ మాఫియా వ్యవహారంలో అసెంబ్లీలో జరిగిన చర్చ తీరుతెన్నులను పరిశీలిస్తే అధికారపక్షం ఆబురదను పూసుకుందా ప్రతిపక్షం పైచేయి సాధించిందా అన్నది జనం బేరీజు వేసుకుంటున్నారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ తనకు తెలియకుండానే తానే మకిలి అంటించుకుంది అన్న అభిప్రాయం బలంగా వుంది. దీనిలో తెలుగు కాల్‌ మనీ మాఫియా వ్యవహారాలను పోలీసుల దృష్టికి తెచ్చిన తెలుగుదేశం ఎంపీ ఈ సమస్య అసెంబ్లీ సమావేశాల స్దంభనకు దారితీస్తుందని, అధికారపక్షాన్ని ఇంతగా ఇరుకున పెడుతుందని, పరిణామాలు ఈ విధంగా వుంటాయని ఊహించి వుండరు. దీన్ని గురించి బయట పెట్టిన నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెంటనే పది రోజులపాటు సెలవుపై వెళుతున్నారనే వార్తలు రావటంతో ప్రభుత్వం, పాలకపార్టీ ప్రతిష్ట దిగజారింది. కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వమే ఆ పని చేయించిందని వూరూ వాడా గుప్పు మంది. తెలుగుదేశం పార్టీని కాపాడటమే తమ కర్తవ్యంగా పెట్టుకున్న మీడియా కూడా ఈ విషయంలో ఆయన ప్రతిష్టకు మచ్చ రావటాన్ని నివారించలేకపోయింది. నష్ట నివారణ చర్యలు కూడా సరిగా చేపట్టలేదు. తన సెలవును తానే రద్దు చేసుకున్నట్లు సవాంగ్‌ మీడియాతో చెప్పగా ముఖ్యమంత్రి రద్దు చేయించారని తెలుగుదేశం నాయకులు ప్రకటించి అభాసుపాలయ్యారు.

కాల్‌ మాఫియా దురంతాలపై అసెంబ్లీలో చర్చ చేయకుండా పాలకపక్షాన్ని రచ్చకు ఈడ్వకుండా ప్రతిపక్షం ఎలా వుంటుంది. రాష్ట్రాన్ని కుదిపివేసిన కాల్‌ వ్యవహారంపై ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అంగీకరించి వుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నది కనుకే వెంటనే చర్చకు అంగీకరించినట్లు చెప్పుకోవటానికి ఒక మంచి సందేశం పంపటానికి అవకాశం వుండేది. నిజానికి దీని గురించి అధికారపార్టీ అంత ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ జరిగినన్ని రోజులూ ఈ అంశం తప్ప మరొకటి లేదు. ఈ అం శాన్ని రచ్చ చేయటం వలన రాజధానికి చెడ్డపేరు వచ్చిందని చంద్రబాబు నాయుడు వాపోవాల్సిన అవసరం వచ్చి వుండేది కాదు. చంద్రబాబు నాయుడి పాలనలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయా అని జపాన్‌, సింగపూర్‌ పాలకులకు తెలిసి వుండేది కాదు. ఈ మాఫియాలో వున్న తమ పార్టీ వారిపై తెలుగుదేశం పార్టీ వెంటనే చర్య తీసుకోకపోగా ఇతర పార్టీల వారూ వున్నారనే ప్రచారం కోసం రాష్ట్రంలో పలుచోట్ల దాడులు చేయించిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత జరిగిన తరువాత అసెంబ్లీలో వైసిపి సభ్యురాలు రోజా అనుచితంగా ప్రవర్తించిందని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు తప్ప కాల్‌మాఫియాలో వున్న వారిని తెలుగుదేశం లేదా వైసిపీ గానీ ఎవరూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. అలాంటి వారితో ఫొటోలు దిగటంలో తప్పులేదన్నట్లుగా మాట్లాడిన వైసిపి నేత జగన్‌ తమ పార్టీ వారూ ఫొటోల ప్రదర్శనకు దిగిన విషయాన్ని మరిచిపోతే ఎలా ?

తెలుగుదేశం పార్టీకి అంబేద్కర్‌పై ఎక్కడలేని ప్రేమ ఆకస్మికంగా వుట్టుకువచ్చినట్లు ప్రవర్తించింది. ఒకవైపు రిజర్వేషన్లు అమలు జరపాల్సిన ప్రభుత్వ రంగ సంస్దలను నిర్వీర్యం చేసి వుద్యోగ నియామకాలను నిలిపివేస్తున్నది. ప్రభుత్వ వుద్యోగాలలోనూ అదే పరిస్ధితి. ప్రయివేటు రంగంపై నియంత్రణల ఎత్తివేతలో భాగంగా కార్మిక చట్టాలను నీరు గార్చేందుకు మద్దతు ఇస్తున్నది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేయటమంటే అంబేద్కర్‌ సామాజిక న్యాయాన్ని కాదని చెప్పటమే. అంబేద్కర్‌పై అసెంబ్లీలో నిజంగా చర్చజరపాలనుకుంటే దానికోసం ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించి జరిపితే ఎవరూ గొడవ చేయరు. ఆ పని ఎందుకు చేయలేదు. రెగ్యులర్‌ సమావేశాలలో ఆ అజెండాను మిళితం చేయటం ఒక రాజకీయం. దాన్ని అడ్డుకున్నారని ప్రతిపక్షంపై నెపం వేసేందుకే దాన్ని ముందుకు తెచ్చారనిపిస్తోంది. నిజంగా అంబేద్కర్‌పై, ఆయన పోరాడి, సంఘటితపరచిన దళితులు, గిరిజనులపై ప్రేమ వంటే గత ఇరవైనెలలుగా ఎస్సీ కమిషన్‌ ఎందుకు నియామకం జరపలేదు?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాల్‌ మనీ కహానీలు

19 Saturday Dec 2015

Posted by raomk in AP NEWS, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, call money, telugudesam, Ycp

సత్య

శాసన సభలో కాల్‌ మనీ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు రెండూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆ దుమ్ములో జనానికి ఏం జరుగుతోందో, ఏ జరగనుందో తెలియటం లేదు. ఒక గీతను చిన్నదానిని చేయాలంటే దాని పక్కన పెద్ద గీతను గీయటం పాత విద్యే.కాల్‌మనీ, అప్పు ఇచ్చి అత్యాచారాలు చేశారన్న ఆరోపణ, దందాలో చిక్కుకున్న విజయవాడ తెలుగుదేశం పార్టీ పరివారాన్ని కాపాడుకొనేందుకు, ఈ సమస్యను దారి మళ్లించేందుకు ఇప్పటికే చేయాల్సింది చేశారు. దానిలో భాగంగానే అన్ని పార్టీలకు తలాకాస్త బురద పూసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల వారూ వున్నారని, వారిలో వైసిపి వారే ఎక్కువగా వున్నారని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తం 188 మందిలో తమ వారు 20 మంది మాత్రమే వున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంలో ఆంతర్యం ఏమిటి ? దీనిలో నిజం కూడా వుండవచ్చు.

తమ వారు అంత తక్కువగా వున్నపుడు ఇతర పార్టీల వారూ ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి వారు ఎక్కువ మంది వున్నట్లు ఇప్పుడు చెబుతున్న సర్కార్‌ తమ వారిపై ఫిర్యాదు వచ్చేంత వరకు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న అధికారం పక్షం ఇంత తీవ్ర విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు ? వడ్డీ వ్యాపారులందరూ విజయవాడలో వారి మాదిరి మాఫియా లేదా సెక్స్‌రాకెట్‌లో నిమగ్నమైనవారు కాకపోవచ్చు. వడ్డీ వ్యాపారం చేసేవిగా పేరుపడిన పట్టణాలు,గ్రామాలకు చెందిన వారందరినీ ఈ సందర్బంగా పోలీసులు రౌండప్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా సమస్యను పలచపడేట్లు చేయటానికి వేసిన ఎత్తుగడ మాత్రమే అని జనం భావిస్తున్నారు.

విజయవాడలో ఆరోపణలు వచ్చిన వారి వివరణలు చూస్తే ముఖ్య ంగా అధికార పార్టీ వారివి కహానీలుగా కనిపిస్తున్నాయి. పెనమలూరు ఎంఎల్‌ఏ బోడె ప్రసాద్‌ రాజకీయాలలోకి రాకముందు తనకు 23 ఎకరాల పొలం వుందని ఇప్పుడు రెండున్నర ఎకరాలకు తగ్గిపోయిందని స్వయంగా చెప్పారు కనుక మనం నమ్మాలి. ఎందుకంటే అనేక మంది అలా పోగొట్టుకున్నవారు వున్నారు. ఈ రోజుల్లోనా అని ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం కష్టం. అదే ఎంఎల్‌ఏ గారు మరొక మాట కూడా చెప్పారు బ్యాంకుల నుంచి పది కోట్ల రూపాయల అప్పు తీసుకొని వ్యాపారం చేస్తున్నానని అన్నారు. రెండున్నర ఎకరాల ఆసామికి పది కోట్ల రూపాయల అప్పు ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు ఎంతో వుదారంగా అప్పులిస్తున్నట్లు మనం నమ్మాలి. ఇంత తక్కువ ఆస్ధి వున్నవారికే బ్యాంకులు పదికోట్ల రూపాయల అప్పులిస్తుంటే అంతకంటే ఎక్కువ ఆస్థులున్నవారు కూడా కాల్‌మనీ మాఫియా చేతుల్లో ఎందుకు చిక్కుకున్నారో, మాన మర్యాదలు ఎందుకు పోగొట్టుకున్నారో ఎంఎల్‌ఏగారు చెపితే బాగుంటుంది. ఇంకొకటి కాల్‌మనీ కేసులో తప్పించుకుతిరుగుతున్న తన ఇంటి పక్క స్నేహితుడితో కలసి విదేశాలకు వెళితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అన్న లోకోక్తి ఒక్క వైసిపి నేతలకే కాదు అందరికీ వర్తిస్తుంది. ఫిర్యాదు చేసింది స్వంత పార్టీ ఎంపి కేశినేని నాని అని అసలు కాల్‌మాఫియా గురించి బయట పెట్టింది తామేనని చెప్పుకుంటున్న ఎంఎల్‌ఏ గారు అలాంటి మాఫియాలోని ఒకడైన తన స్నేహితుడిని గుర్తించలేకపోయారా ? స్నేహితులతో విదేశాలకు వెళ్లటమే తప్పా అని ఇప్పుడు అమాయకంగా అడిగితే ఎవరైనా నమ్ముతారా ?

మరో అధికార పార్టీ ఎంఎల్‌సి బుద్ధా వెంకన్న తాను ఇరవై సంవత్సరాలుగా తన తమ్ముడితో కలసి లేనని చెప్పారు. ఇది అంతగా అతుకుతుందా ? పోనీ లెండి తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పినట్లు కాల్‌ ముఠాలో లేడు అని చెప్పలేదు. తమ్ముడు తప్పుదారి పట్టినపుడు అన్నగా ఎందుకు మందలించలేదు, దాన్నుంచి ఎందుకు తప్పించలేదు అన్నదే సమాధానం రాని ప్రశ్న. కేశినేని నాని ఫిర్యాదు చేసేంత వరకు ఆపని మిగతావారు ఎందుకు చేయలేకపోయారు అన్నది అపూర్వ చింతామణి లేదా తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి ఒక్కలౌతుందన్న భేతాళుడి ప్రశ్న. తాను వైసిపి అరాచకాలను ఎదుర్కొంటున్న కారణంగానే జగన్‌ తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పటం కొంచెం ఎక్కువగా వుంది. మిగతా ఎంఎల్‌ఏలు వైసిపిని ఎదుర్కోవటం లేదా ? వైసిపి కాల్‌ మనీ మాఫియాను మీరు ఎందుకు వుపేక్షించినట్లు ?

కాల్‌ మనీ వార్తలు చదువుతుంటే రామాయణంలో పిడకల వేటలా ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ ఎన్‌ పటేల్‌ బ్యాంకర్లకు ఇది మంచి బేరాలు వచ్చే సమయం అని తిరుపతిలో వెంకన్న సన్నిధిలో చెప్పారు. మరిచి పోయా అసలు వెంకన్న పెద్ద వడ్డీ కాసులవాడు కదా ! జనానికి అప్పులు ఎలా తీసుకోవాలి అన్న విద్య తక్కువగా వున్న కారణంగా వారు కాల్‌ నాగుల వలలోచిక్కుకుంటున్నారని, దీన్ని చూస్తుంటే తమ బ్యాంకులకు మంచి బేరాలు తగిలే అవకాశాలున్నాయని చెప్పారు. జనానికి రుణ విద్య తెలియక కాదు, బ్యాంకర్లు పెట్టే నస, తిరగలేక లేక మాత్రమే వడ్డీ వ్యాపారుల వలలో పడుతున్నారు. ఆస్ది తనఖా పెట్టినా సామాన్యులకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లు కావూరి సాంబశివరావు వంటి వారికి వేల కోట్ల రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇస్తారు. సామాన్యులు గడువులోగా కట్టకపోతే సామాన్లు బయటపడవేసి చుట్టుపక్కల వారి ముందు అవమానాల పాలు చేసే బ్యాంకర్లు సాంబశివరావు వంటి వారిని బాబ్బాబు అని బతిమిలాడుకుంటారు. ఏమైనా మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో జనం ఎదుర్కొంటున్న ఒక ముఖ్య సమస్యపై అసెంబ్లీలో గొడవల రూపంలో అయినా చర్చ జరుగుతోంది. కనీసం ఒక్కరినైనా శిక్షించి పుణ్యం కట్టుకుంటే అదే పదివేలు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

త్వశుంఠ ! త్వశుంఠ !!

18 Friday Dec 2015

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, call money, Vijayawada

సత్య

కాల్‌ మనీ అత్యాచారాల గురించి రోజు రోజుకూ కొత్త వుదంతాలు వెలువడుతున్నాయి. దీనికి బలైంది పేద, మధ్యతరగతి వారే కాదు, ధనికులు కూడా వున్నట్లు స్పష్టమౌతోంది. దీనిలో వడ్డీ మాఫియా, వాటికి బలైన అనేక కుటుంబాల మానవతుల మర్యాదలు మంట గలవటం గురించి బయటకు చెప్పుకోలేని వారెందరో వున్నారు. ఆ బలహీనతను ఆసరా చేసుకొని మాఫియాలు తమ పంజా విసురుతున్నాయన్నది స్పష్టం. ఈ దారుణాల గురించి అసెంబ్లీలో తొలి రోజే ప్రతిపక్షం, అధికారపక్షం బాహా బాహీ తలపడ్డాయి. ఇదెలా వుందంటే త్వశుంఠ అంటే త్వశుంఠ అన్నట్లుగా తయారైంది. బాధితులను రక్షించటం ఎలా, నేరగాళ్లపై చర్యలు తీసుకోవటం, ఇలాంటి దారుణాలను రాబోయే రోజుల్లో ఆపటం ఎలా అనే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మీ పార్టీ వారు, మీ అనుచరులే ఎక్కువ మంది వున్నారంటూ పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. అంటే అసలు సమస్యను రెండు పక్షాలూ పక్కదారి పట్టిస్తున్నాయి. వారి అనుచరులు కోరుకుంటున్నది ఇదే. ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఏ పార్టీ వారు ఎందరున్నా వారంతా గతంలోనో, ఇప్పుడో అధికార ప్రాపకం వున్న వారు, లేదా సంఘవ్యతిరేక శక్తులు తప్ప మరొకరు కాదు. అలాంటి విభజన చేసేందుకు ప్రయత్నించటమంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలను ఏరే యత్నం తప్ప మరొకటి కాదు. రెండు పక్షాలకు మద్దతుదారులుగా పేరు పడిన మీడియా పత్రికలు లేదా టీవీ ఛానల్స్‌ తమ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఎదుటి పక్షానికి చెందిన నేరగాళ్లనే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. అంటే అందరి గురించి తెలుసుకోవాలంటే రెండు పక్షాల మీడియా వార్తలను చదువుకోవాల్సి వుంటుంది.

గతంలో మద్యం, ఇసుక మాఫియాలు, వాటి అక్రమాల గురించి సంచలన వార్తలు వచ్చిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. వాటిలో శిక్షలు పడిన వారెందరు? ఏ పార్టీ వారెందరో వున్నారో ప్రభుత్వం ప్రకటిస్తే తాజా కాల్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం బాధితుల్లో కలుగుతుంది, మరిన్ని దారుణాలను నివేదించటానికి, ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. అది చేయటానికి బదులు ఫలానా నిందితుడు ఫలానా నాయకుడితో ఫొటోలు దిగాడు, ఫలానా నిందితుడు ఫలానా నేత పర్యటనలకు ఏర్పాట్లు చేశాడు వంటి వాదనల ద్వారా సాధించేదేమీ వుండదు. ఇలాంటి నిందితులందరూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఫిరాయించటం జగమెరిగిన సత్యం. అలాంటి వారని తెలిసిన తరువాత కూడా పార్టీల కండువాలు కప్పుతున్నారా లేదా ? ఏదో సాకుతో సమర్ధిస్తున్నారా లేదా ?ఎక్కడ తిరిగినా సరే మా దొడ్లే ఈనితే చాలంటున్నారా లేదా ? అందువలన అసెంబ్లీలో,వెలుపలా పాలక, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం అంతా లాలూచీ కుస్తీ తప్ప మరొకటి కాదని జనం అనుకుంటే తప్పేముంది?

విజయవాడ, కృష్ణాజిల్లాలోని తెలుగు దేశం పార్టీలోని ముఠా గొడవల్లో భాగంగా ప్రత్యర్ధి వర్గాన్ని ఇరుకున పెట్టేందుకు కాల్‌ మనీ దందాను ఒక వర్గం వుపయోగించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిదే ! ప్రతిపక్షం చేయలేని పనిని ఎవరో ఒకరు చేశారు, వారు ఎందుకు చేసినా ‘అభినందిం’చాల్సిందే. ఇంకా అలాంటి విషయాలను బయటపెట్టేందుకు ప్రోత్స హించాల్సిందే. అప్పుడే అవతలి ముఠాలో ఏవైనా అక్రమాలుంటే ఇవతల ముఠా కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బయటపెడుతుంది. జనానికి వాస్తవాలు తెలుస్తాయి, మీడియాకు సంచలన వార్తలు దొరుకుతాయి. విజయవాడకు అలాంటి చరిత్ర గతంలో వున్నది. కాంగ్రెస్‌లో జిఎస్‌ రాజు, వంగవీటి రంగా వర్గాలు అలా అనేక విషయాలను బయటపెట్టాయి. ఆ మంచి సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగించినా అభినందించాల్సిందే.ఎందుకంటే అధికార యంత్రాంగం తానుగా అక్రమాలను వెలికితీసి, అక్రమార్కుల పని బట్టదు అని తేలిపోయింది. ఎందుకంటే వారికి ఎంతసేపూ పాలకపార్టీ సేవ తప్ప మరొకటి చేసే తీరిక వుండదు.

ఈ సందర్బంగా జనం బలహీనతలను చెప్పుకోకుండా సంపూర్ణం కాదు. విజయవాడ, రాష్ట్రం, దేశం ఎక్కడైనా ఇలాంటి మాఫియాలు, నేరగాళ్ల గురించి జనానికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అయినా సరే ఎన్నికలలో వారికి మద్దతు ఇస్తున్నారు. దీని వెనుక వున్న లాజిక్కు ఏమిటి ?ఏటిఎం మిషన్‌లో కార్డు అలా పెట్టి ఇలా డబ్బు తీసుకున్నంత సులభంగా తెల్లవారే సరికి డబ్బు సంపాదించాలి, నువ్వు ఎంత డబ్బు సంపాదించావన్నది ముఖ్యం తప్ప ఎలా సంపాదించావన్నది కాదు అన్నది నీతి నేడు సమాజాన్ని నడిపిస్తున్నది. అందువలన డబ్బు సంపాదించే వారే సమర్ధులు, జనం, సమస్యలు, పరిష్కారాలంటూ వీధుల్లో తిరిగే కమ్యూనిస్టుల వలన ప్రయోజనం లేదు. మనం కూడా ఎప్పుడైనా డబ్బు సంపాదించాలంటే మార్గం అధికార పార్టీని బలపరచటం, దాని నాయకుల చుట్టూ తిరగటం తప్ప మరొక మార్గం లేదు.

దీనికి తోడు వినియోగదారీ సంస్కృతి జన నరనరాల్లో ప్రవేశించింది. అత్యాశలకు పోవటం, ఆడంబరాలను పదర్శించటం, లేనిగొప్పలు చెప్పుకోవటం, పిల్లలకు వాస్తవాలు తెలియకుండా దాచటం, అందుకోసం అందినకాడికి అప్పులు చేయటం ఇలాంటి మాఫియాల చేతుల్లో చిక్కుకోవటం. దీన్నుంచి బయటపడనంత వరకు ఈ రోజు కాల్‌ మనీ రేపు మరొక మనీ, మరొక మాఫియా చేతుల్లో చిక్కుకోవటం. దీన్ని గురించి ఆలోచించకుండా, మంచి చెడ్డల వివేచన చేయకుండా రాజకీయాలలో నేరగాళ్లను, వారిని వెంటవేసుకు తిరిగే వారిని సమాజం అసహ్యించుకొని దూరంగా పెట్టనంత కాలం ఎండమావుల వెంట పరుగుపెడుతూనే వుంటారు, మోసపోతూనే వుంటారు. కాల్‌ మాఫియా చేతుల్లో అత్యాశకు పోయిన ఒక కుటుంబం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. అదే నిజమైతే జనం ఎంతటి ప్రమాదకర పోకడలలో వున్నారో ఆందోళన కలిగిస్తోంది.

షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టటానికి కోట్ల రూపాయల అప్పుతీసుకొని కాల్‌మనీ మాఫియా వలలో చిక్కుకున్న ఒక కుటుంబం గురించి మీడియాలో వచ్చింది. లక్షల రూపాయలు తీసుకుంటేనే తీర్చలేని స్ధితి వున్నపుడు కోట్ల రూపాయలు అప్పు చేసి కాంప్లెక్సులు కట్టాలనుకోవటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చట్టం తనపని తాను చేసుకుపోతుంది, అబ్బ చా !!

16 Wednesday Dec 2015

Posted by raomk in AP NEWS, Current Affairs, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, AP CM, call money, Law, YS jagan

 

ఎంకెఆర్‌

ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఇసుక మాఫియా వార్తలు, నిన్న విజయవాడలో కల్తీ మద్యంతో మరణాలు, అదే విజయవాడలో కాల్‌ మనీ మాఫియా చేతుల్లో ఎన్నో కుటుంబాలు, ఎందరో మహిళల బలి. ఎప్పుడూ ! ఇదంతా చట్టం తన పని తాను చేసుకుపోతుండగానే సుమా !! అలా తన పని తాను చేసుకుపోతున్నారనే కారణంతోనే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌పై సెలవు వేటుతో కాల్‌ మనీ కాటు పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఒక దారుణానికి అధికార పక్షం, మరో ఘోరానికి ఒక ప్రతిపక్ష మాజీ ఎంఎల్‌ఏ కారణం, అత్యంత నీచమైన మరో దుర్మార్గానికి పాలకపార్టీ ఎంఎల్‌ఏలు, నాయకులు వారితో చేతులు కలిపిన పెద్దలు కారణం ! చట్టం తన పని తాను చేసుకుపోతూనే వుంది.

ఏ పార్టీ వారైనా ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు ,చట్టం తనపని తాను చేసుకుపోతుందని అధికార పార్టీనేత వువాచ ! అధికార పార్టీలోని ఎంఎల్‌ఏలు, కార్యకర్తల పేర్లు బయట పెట్టాలని ప్రతిపక్ష నేత డిమాండ్‌ !! విజయవాడ కాల్‌మనీ గురించి ముందే నిఘా సంస్ధలు నివేదించవలసి వుండాల్సింది, వారిది వైఫల్యం. ముఖ్యమంత్రి ప్రకటన. ఇవన్నీ చట్టం తనపని తాను చేసుకుపోతుండగానే జరిగాయి.

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ వారు పరిపాలిస్తుంటే వారు తమకు అవసరమైన మేరకు చట్టాలు చేసుకున్నారు తప్ప జనం కోసం కాదని మన తాత ముత్తాలందరూ వారికి వ్యతి రేకంగా పోరాడిన వారే. అశేష త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. మన చట్టాలు మనం చేసుకున్నాం అని చెప్పారు పెద్దలు. తీరా చూస్తే అనేక పాత బ్రిటీష్‌ వాడి చట్టాలకు మన రంగు కండువాలు కప్పి కొద్దిగా మేకప్‌ చేసుకున్నాం, కొత్త సీసాలో పాతసారా పోసుకున్నాం తప్ప ప్రజోపయోగ చట్టాలుగా వాటిని చెప్పలేం. ఎందుకంటే చట్టం ఎప్పుడూ అధికారంలో వున్న వారికి చుట్టంగా పని చేయటం తప్ప మనకు మరొక విధంగా తెలియదు.

బాబరీ మసీదును కూల్చటం వాస్తవం, మనమందరం చూశాము. దానిని కూల్చినవారు ఆ పేరు చెప్పి గాక రామాలయ నిర్మాణానికి కరసేవ పేరుతో మరొక ప్రార్ధనా స్దలాన్ని కూల్చివేశారు.(ఆ శక్తులే నేడు మత సహనానికి తామే ప్రతీకలం తమను సహనం లేని వారని అనవద్దు అని బెదిరించటం వేరే సంగతి) మసీదు కూల్చివేసిన వారిని ఇంతవరకు శిక్షించలేదు. అయినా చట్టం తనపని తాను చేసుకుపోతోంది.

గుజరాత్‌లో గోద్రా రైలు బోగీ దురంతం( ఎవరు చేశారన్నది వివాదాస్పదం) ఆ పేరుతో ఆ రాష్ట్రంలో మైనారిటీలపై మారణకాండ, వేలాది మంది హత్య, ఆస్తుల విధ్వంసం. ఆ కేసులు ఏమయ్యాయి? ఎంత మందిని శిక్షించారు? ఎంత కాలమైంది. చట్టం తనపని తాను చేసుకుపోతూనే వుంది.

మధ్యప్రదేశ్‌లో పరీక్షలు, వుద్యోగాల కుంభకోణం, వాటిని బయట పెట్టిన వారిని కొంత మందిని గుర్తు తెలియకుండా చంపేస్తే మరికొందరు నిత్య ప్రాణ భయంతో బ్రతుకుతున్నారు. దానిని దర్యాప్తు చేస్తున్నవారు, దాని గురించి వార్తలు రాద్దామని వెళ్లిన విలేకరితో సహా దాదాపు 70 మంది అనుమానాస్పదంగా మరణించారు.చిత్రమేమిటంటే అక్కడా చట్టం తనపని తాను చేసుకుపోతుండగానే ఇవన్నీ జరిగాయి.

సల్మాన్‌ ఖాన్‌ నిర్దోషి, జయలలిత నిర్దోషి, ఇలాంటి పెద్దలు ఎందరో, ఎన్నో కేసులు ఇంకా సాగుతూనే వున్నాయి. ఇవన్నీ చట్టం తనపని తాను చేసుకుపోయిన ఫలితమే అని తెలుసుకోవాలి.

ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు ఎందుకు జరిగి వుండేవి. చట్టం తన పని తాను చేసుకుపోతే ఇంతకాలంగా ఇప్పుడు బయటికి వచ్చిన అక్రమాలు ఎందుకు వెల్లడి కాలేదు, చట్టం ఏం చేసిందో కాంగ్రెస్‌, వైసిపి తెలుగుదేశం నాయకులు చెబుతారా ?అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టం తనపని తాను ఎప్పుడైనా చేసుకుపోయిందా ? నిజంగా పని చేసి వుంటే ఇన్ని దారుణాల గురించి మనం ఎందుకు వినాల్సి వచ్చింది? అంటే చట్టాన్ని పని చేయనివ్వకుండా అయినా ఎవరో ఒకరు చేసి వుండాలి లేదా అది ముసలి ఎద్దయినా అయి వుండాలి. తమ వారే కాల్‌ మనీ రాకెట్‌లో వున్నారని తేలటంతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుకు వైరాగ్యం వచ్చి తెల్లవారిన తరువాత పొద్దుగూకక మానదు, బతికిన మనిషి చావకతప్పదు అన్నట్లుగా చట్టం గురించి చెబితే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనుకుంటున్నారా ? కాల్‌ మనీ దురాగతాలకు ఎవరు బాధ్యులైనా చర్యలు తీసుకుంటామని అధికార పక్ష పెద్దలు చెప్పటం పెద్ద జోకు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిఘా వ్యవస్ధ విఫలం అయిందని వ్యాఖ్యానించారంటే నేను బాగానే పని చేస్తున్నా, యంత్రాంగమే కదలటం లేదని తన బాధ్యతను తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న నేరాలు,ఘోరాల గురించి జనానికి కంతటికీ తెలిసిన విషయాలు నిఘా యంత్రాంగానికి తెలియవని చెప్పటం గడసరి తనం. విజయవాడలోనే మకాం వేస్తున్నా, అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నా అని చెప్పే ముఖ్యమంత్రి తీరు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. అధికార పార్టీ తమ నేతల పేర్లు రాగానే ముందు వారిని పార్టీ నుంచి పక్కన పెట్టాలి. ఆ పని చేయకుండా ఏ పార్టీవారైనా వదలం అని కబుర్లు చెబితే చాలదు. గద్దెపై ఎవరున్నా పాలకులకు మన రాష్ట్రంలో అటువంటి విశ్వసనీయత లేదు, ఒక వేళ వుందని ఎవరైనా చెప్పుకున్నా అది అనేక అతిశయోక్తులలో అదొకటి మాత్రమే. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పిన అధికార పార్టీ కాల్‌మనీ కేసు వివరాలు పూర్తిగా బయటకు రాక ముందే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను సెలవుపై ఆకస్మికంగా పంపటం, ఆయన స్ధానంలో మరొకరిని ఇంఛార్జిగా నియమించటం జనానికి ఎలాంటి సందేశం పంపుతున్నది ? ఆయన ఎప్పుడో సెలవు అడిగారని ఇప్పుడు మంజూరు చేశామని చెబుతున్నారు. అందులో నిజం వుందో లేదో తెలియదు. కాల్‌మనీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాపితంగా దాడులు జరుగుతున్న సమయంలో దానిని ముందుగా బయట పెట్టి అరెస్టులు చేయించిన అధికారిని ఆకస్మికంగా సెలవుపై పంపితే ఎలాంటి సందేశం జనంలోకి వెళుతుందో తెలియనంతటి అమాయకుడు చంద్రబాబు నాయుడని ఎవరూ అనుకోరు, పోనీ ఆయన సలహాదారులకు కూడా బుర్రపని చేయలేదా ?

బాబు మాఫియాను నడిపిస్తున్నారని వైసిపి నేత జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కాల్‌మనీ గురించి అది అధికారయుతంగా బయటకు రాకముందే ఎందుకు గవర్నర్‌కు ఫిర్యాదు చేయలేదు ? తన కుటుంబానికి ఒక పెద్ద పత్రిక, టీవీ ఛానల్‌ వున్నాయే అవైనా ఎందుకు బయట పెట్టలేదు? ఏదైనా ఒక ఘోరం జరిగినపుడు ఎవరు దానికి బాధ్యులో వెంటనే వెల్లడి చేసే పద్దతి, లేదా సాంప్రదాయం వుంటే మీ తండ్రి హయాంలో జరిగిన అక్రమాల వెనుక ఎవరున్నది ఎందుకు వెల్లడించలేదు జగన్‌ గారూ అని అడిగితే ఏం చెబుతారు? ముందు మీపై మోపిన కేసులకు సంబంధించి మీరు నిజాలు చెప్పి మిగతా కేసుల నిందితుల గురించి అడిగితే మీకు విస్వసనీయత వుంటుంది.

ఇక కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా వుండి ఎన్నికలకు ముందు, తరువాత తెలుగుదేశంలో చేరిన నాయకులు కాల్‌మనీ, కల్తీ మద్యం వంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

విజయవాడ కాల్‌మనీ మాఫియా గురించి బయటకు రాగానే రాష్ట్రమంతటా వడ్డీ వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయి. మంచిదే, కానీ విజయవాడలో పట్టుబడిన, లేదా దాని వెనుక వున్న అధికారపార్టీ నాయకులపై తీవ్రతను నీరు గార్చేందుకు, కేసులకు బలం లేకుండా చేసేందుకే ఈ దాడులని కొందరు చెబుతున్నారు. అసలే అప్పుపుట్టని ఈ రోజుల్లో ఇలా దాడులు చేస్తే ఎవరైనా అప్పిస్తారా ? అప్పులేకపోతే అవసరాలు వున్న వారు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? అప్పుతీసుకున్న వారు ఇచ్చిన వారి షరతులకు(అనుచిత సంబంధాలకు అంగీకరించటంతో సహా) లొంగటం ఇవాళ కొత్తగా ప్రారంభమైందా, కాల్‌ మనీ డబ్బు ఎగ్గొట్టమని నాయకులు చెబుతున్నారు అప్పుడు వడ్దీకి ఇచ్చిన కుటుంబాలు ఏమి కావాలి అని వాదించే వారు కూడా బలంగా వుండటం మన సమాజ దౌర్బాగ్యం.

స్వయం సహాయక సంఘాలు బాగా పని చేస్తున్నాయి, వారి అవసరాలకు డబ్బు బాగా సమకూరుతోంది, ఆ ఘనత మాదే అని చెప్పుకున్న ఏ పార్టీ వారైనా కాల్‌మనీ కాలనాగులకు జనం చిక్కటం, మహిళలు మానాలు పోగొట్టుకోవటం ఎవరి పుణ్యం? కొంపదీసి ఇది కూడా చట్టం తన పని తాను చేసుకుపోయిన ఫలితమే అంటారా ? అదే అయితే అలాంటి చట్టాలు అవసరమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: