• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: challenges before ys jagan

జగన్‌ నెల రోజుల పాలన -అభినందనలు -అనుమానాలు !

28 Friday Jun 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion

≈ Leave a comment

Tags

challenges before ys jagan, praja vedika, praja vedika Undavalli, YS jagan, YS Jagan 30 days rule, ys jagan vs chandrababu

Image result for YS Jagan 30 days rule

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పదిహేడవ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నెల రోజుల పాలన గురించి చెప్పాలంటే కొన్ని చర్యల మీద తెలుగుదేశం పార్టీ, ఇతర రాజకీయ వ్యతిరేకుల విమర్శలను పక్కన పెడితే అభిమానులనుంచి అభినందనలు అందుకున్నారు. అనేక మంది తటస్ధుల ప్రశంసలు కూడా పొందారు. వీటితో పాటు నూతన ప్రభుత్వ లేదా నా మాటే శాసనం అన్న బాహుబలి పాత్ర మాదిరి ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రకటనలు, చర్యలు కొన్ని అభిమానించే వైసిపి వారితో సహా మొత్తం జనాల్లో అనుమానాలు రేకెత్తించేవిగా వున్నాయి. అసాధారణ విజయం సాధించిన పాలక పార్టీకి, ప్రభుత్వానికి తొలి నెలలోనే ఇలాంటి పరిస్ధితి ఏర్పడటం ఒక విశేషంగానే చెప్పాలి.

Image result for praja vedika undavalli

నాటకీయ పరిణామాల మధ్య కృష్ణా కరకట్టలోపల వున్న ప్రజావేదికను కూల్చివేయించిన తీరు ఒక సంచలనం అనటంలో ఎలాంటి సందేహాలు లేవు. ఆదిలోనే అనేక అంశాలలో తరువాత ఏంటి అన్న సహస్ర శిరఛ్చేద అపూర్వచింతామణి ప్రశ్నలతో పాలన ప్రారంభమైంది దానికి తగిన జవాబు చెప్పగలిగితే జగన్‌ సర్కార్‌ బతికిపోతుంది లేకపోతే బలి అవుతుంది. అదే విధంగా మరోసారి ప్రతిపక్ష నేతగా మారిన చంద్రబాబు కూడా నెల రోజులుగా కొత్త పాత్రను పోషిస్తున్నారు. అనుభవం రీత్యా జగన్‌తో పోల్చుకోవటానికే లేదు. పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, పది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు చట్టరీత్యా గాకపోయినా నైతికంగా అయినా రాష్ట్ర జనాల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వుంటుంది.

Image result for praja vedika undavalli

అన్ని అంశాలను ఇక్కడ చర్చించటం సాధ్యం కాదు కనుక ఒక్కో అంశాన్ని చూద్దాం. ప్రజావేదిక అక్రమ కట్టడం కనుక దాన్ని కూల్చివేయాలని అనుకున్నారు, అన్నంత పనీ చేశారు, హైకోర్టు కూడా అడ్డుపడలేదు. ఇంతవరకు ఇబ్బంది లేదు.దాని కొనసాగింపుగా చంద్రబాబు నివాసం వుంటున్న మరొక అక్రమ కట్టడం గురించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక్కడే బంతి ప్రభుత్వం చేతి నుంచి ప్రతిపక్షానికి చేరింది. అక్రమ కట్టడాలు రాష్ట్రంలో అనేక వున్నాయి. వీటిలో రెండు రకాలు. సముద్రతీరం, నదీ తీరాల్లో నిబంధనలకు విరుద్దంగా నిర్మించినవి ఒక రకం, మరో తరగతి అలాంటి నిషేధాలు లేని ప్రాంతాలలో అనుమతులు పొందీ వుల్లంఘించి జరిపిన నిర్మాణాలు కొన్ని, అసలు అనుమతులు లేకుండానే నిర్మించినవి కొన్ని. రెండవ తరగతి వాటిని ప్రభుత్వం తలచుకుంటే అక్రమ నిర్మాణాలుగా ప్రకటించి కూల్చివేయవచ్చు, లేదూ స్వల్ప వుల్లంఘనలు వుంటే, అవి జనానికి, రాకపోకలకు, ఇతరత్రా ఇబ్బంది కరం కాదు అనుకుంటే జరిమానాలు విధించి ఆమోద ముద్ర వేయటం ఒకటి. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం నిషేధిత ప్రాంతాల్లో చేసిన నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ఎలాంటి అవకాశాలూ లేవు. వాటిని గత పాలకులు ఎందుకు కూల్చివేయలేదు,యజమానుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎలా అనుమతించారు అంటే అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమ వ్యవహారం తప్ప మరొకటి కాదు.

కేరళలోని కొచ్చిన్‌ శివార్లలోని మరాదు అనే మున్సిపాలిటీలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన 400 ఫ్లాట్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన కేసు ప్రస్తుతం నడుస్తోంది. దాన్ని నిర్మించిన సంస్ధ, కొనుగోలు చేసిన వారు చేసే వాదన ఏమంటే మరాదు గ్రామ పంచాయతీ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. అవి అక్రమం అంటూ హైకోర్టుకు వెళ్లినపుడు నిర్మాణాలను నిలుపుదల చేయకుండా కోర్టు అనుమతించింది. నిర్మాణాలు జరిగే సమయంలో కోస్తా పరిరక్షణ సంస్ధ వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీరా పూర్తిగా నిర్మించిన తరువాత ఇప్పుడు కూల్చివేయాలని కోరటం ఏమిటి? మా వాదన వినకుండా కోర్టు తీర్పు ఇచ్చింది కనుక మా వాదనలు విని అంతిమంగా నిర్ణయించాలి, తీర్పును తిరిగి విచారించాలి అని యజమానులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తీర్పు ఇచ్చింది మరొక బెంచి కనుక తాము దానిని విచారించబోము, ఆరువారాలు కూల్చివేతల నిలిపివేతకు వుత్తరువు ఇస్తాము అంటూ తాజాగా మరొక బెంచి వారు ప్రకటించారు.కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా సమస్యను సంక్లిష్టం చేసే విధంగా తీర్పులు చెబుతున్నందున ఇదొక పెద్ద సమస్య. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకువచ్చి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అజెండాను ముందుకు తెస్తున్నది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అంశాల గురించి ముందుగా చూద్దాం. కృష్ణానది తీరంలో జరిగిన అక్రమ కట్టడాల గురించి ప్రతిపక్షంగా వున్నపుడు వైసిపి ఈ అక్రమాలను ప్రశ్నించింది. అది అధికారానికి వచ్చిన తరువాత ఆ సమస్యను చేపట్టబోయే ముందు తగినంత కసరత్తు చేసినట్లు కనిపించటం లేదు. లేదూ నాటకీయంగా ఒక ప్రభుత్వ నిర్మాణాన్ని కూల్చివేసిన తరువాత ప్రయివేటు నిర్మాణాల విషయంలో ప్రభుత్వ విధానమేమిటో స్పష్టం చేయలేదు. ముందే చెప్పినట్లు నా మాటే శాసనం మాదిరి నిర్ణయాలు చేస్తే కుదరదు.ప్రభుత్వ భవనం మాదిరి ప్రయివేటు వాటి జోలికి పోవటం అంత సులభం కాదు. అనేక భవనాలు వుండగా ఒకే భవనానికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం ప్రతిపక్షాలకు, మీడియా, సామాజిక మాధ్యమానికి వ్యాఖ్యానించే అవకాశం ఇచ్చింది. ‘గౌరవ ముఖ్యమంత్రి గారు, నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై – డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా?లేకపోతే మన రాష్ట్రంలో క ష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమకట్టడాలను రివర్‌ కన్సర్వేటివ్‌ యాక్ట్‌ ప్రకారం తొలగిస్తారా! కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు…’అంటూ తెలుగుదేశా పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.

అక్రమ నిర్మాణాల చర్చ పక్కదారి పట్టకుండా వుండాలంటే ఇప్పటికైనా ఆ సమస్య మీద సమగ్రవిధానం ప్రకటించాలి. దాన్ని మంత్రి వర్గ నిర్ణయంగానో మరొకటిగానో చట్టబద్దమైనదిగా వుండాలి. లేదూ గత ప్రభుత్వాలు తీసుకున్న విధానాల కొనసాగింపే అయితే ఆ విధానాలు ఏమిటి? నూతన ప్రభుత్వం దానినే కొనసాగిస్తున్నదా అన్న విషయమైనా చెప్పాలి. లేదా అసలు ఎలాంటి విధానం లేకుండా గత పాలకులు అడ్డగోలుగా వ్యవహరిస్తే అదైనా చెప్పాలి. విద్యుత్‌ కొనుగోళ్ల మీద సమీక్ష జరిపి వాటిలో వేలాది కోట్ల రూపాయల ధనం దుర్వినియోగమైందని చెబుతున్న జగన్‌, అక్రమ నిర్మాణాల మీద ఎందుకు సమీక్ష జరపరు? వాస్తవాలు, తన కార్యాచరణ ఏమిటో జనానికి ఎందుకు చెప్పరు? సంబంధిత మంత్రులతో వుపసంఘాన్నివేసి ఒక నివేదిక తెప్పించుకోవటం, మంత్రివర్గ ఆమోదం వంటి పద్దతులను ఎందుకు పాటించరు? తొందరపడ్డారు, కక్ష తీర్చుకుంటున్నారు అనే ఆరోపణలకు గురికావటం ఎందుకు?

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ చర్యల మీద ధ్వజమెత్తుతున్నారు. వారికి ఆ హక్కు వుంది. అయితే ప్రతి పార్టీ అధికారంతో నిమిత్తం లేకుండా సమస్యల మీద ఒక వైఖరిని తీసుకోవాలి. అక్రమ కట్టడాల మీద తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటి అన్నది ప్రశ్న. అధికారపక్షానికి 50శాతం వరకు ఓట్లు వస్తే ప్రతిపక్షానికి కూడా 40శాతం వరకు వచ్చాయి. అందులోనూ గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో వుంది కనుక ఎలాబడితే అలా మాట్లాడితే కుదరదు.తాజాగా నోటీసు ఇచ్చిన ప్రయివేటు భవనానికి గతంలో గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చిందని, తరువాత రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఇచ్చారని, అది అక్రమ కట్టడం అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సర్కార్‌ దాన్ని ఎందుకు కూల్చలేదని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పటానికి ఆ రాజశేఖరరెడ్డి లేరు కనుక ఆయనెందుకు కూల్పించలేదు అన్నది పక్కన పెడదాం. నిన్నటి వరకు అధికారంలో వున్న చంద్రబాబు ఏమి చెబుతారు అన్నది ప్రశ్న. ఆ కట్టడం అక్రమం అని దానిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నివాసం వుండటం ఏమిటని ప్రారంభంలోనే విమర్శలు వచ్చాయి కదా ? దాని మీద లేదా అలాంటి కట్టడాల మీద గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వ అనుసరించిన వైఖరి ఏమిటి అన్న ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలి. అసలది అక్రమమా, సక్రమమా అన్నది చెప్పకుండా తండ్రి అనుమతించిన వాటికి కొడుకు నోటీసులు పంపటమా, ఒకవేళ అక్రమం అయితే దానికి జగన్‌మోహన్‌ రెడ్డే బాధ్యత వహించాలని అని సీనియర్‌ నేత ఎనమల రామకృష్ణుడు వాదిస్తున్నారు. జగనే బాధ్యత వహించాలి అంటున్నవారు ఆ జగనే బాధ్యతగా భావించి చర్యతీసుకొనేందుకు నోటీసు పంపించారు కనుక మాట్లాడకుండా కూర్చోవాలి తప్ప ప్రశ్నించటం ఏమిటి అన్నది జనం నుంచి వస్తున్న స్పందన. సదరు భవన యజమాని తేల్చుకోవాల్సిన అంశం అది. లేదా శాశ్వతంగా చంద్రబాబు లేదా ఆయన కుటుంబ సభ్యులు వుండటానికి హక్కులు లేదా అమ్మకం లాంటివి ఏవైనా జరిగితే చంద్రబాబు కుటుంబం స్వంత వ్యవహారంగా తేల్చుకోవాలి తప్ప రాజకీయ రంగు పూయాల్సిన అవసరం ఏముంది?

ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత కుటుంబంతో కలసి ఐరోపా విహార యాత్రకు వెళ్లిన చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చారు. వెళ్లే సమయంలో ఏమి ఆలోచించుకుంటూ వెళ్లారో తెలియదుగానీ వచ్చిన తరువాత ఏం మాట్లాడాలో అర్ధం అవుతున్నట్లు లేదు. కంటి చూపే తప్ప జరుగుతున్న పరిణామాల మీద నోటి మాటలేదు. అనుమతుల్లేకుండా, అక్రమంగా కట్టిన ప్రజావేదికను కూల్చివేయదలచుకున్న జగన్‌ సర్కార్‌ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాలను కూడా కూల్చుతారా అని అనుచరులతో అన్నట్లు లీకుల వార్తలు వచ్చాయి. తరువాత తెలుగుదేశం నేతలు కూడా అదే వాదనలు చేస్తున్నారు కనుక నిజమే అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ అవసరాల కోసమంటూ నిబంధనలకు విరుద్దంగా జనం సొమ్ముతో ప్రజావేదికను నిర్మించటమే ఒక అక్రమం అయితే, అధికారాన్ని కోల్పోయిన తరువాత దాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన అవసరం కోసం కేటాయించమని కోరటం- అదీ ప్రతిపక్ష నాయకుడి హోదా వుంటుందో లేదో కూడా తెలియని స్ధితిలో- గొంతెమ్మ కోరిక తప్ప మరొకటి కాదు, అన్నింటికి మించి ు ఈ సమస్యమీద తెలుగుదేశం నేతలు ముందేమి చెబుతున్నారో, తరువాతేమి మాట్లాడుతున్నారో తెలిసే స్ధితిలో లేరు.

Image result for praja vedika undavalli

ప్రభుత్వ సమీక్షా సమావేశాలకు సరైన సమావేశ మందిరం లేదు, హోటళ్లు, ఇతర ప్రయివేటు భవనాల్లో చేసే ఖర్చును పొదుపు చేసేందుకు, సచివాలయానికి వచ్చే జనానికి అందుబాటులో వుండేందుకు ప్రజావేదికనిర్మాణం జరిగిందని తెలుగుదేశం వారు వాదిస్తున్నారు. నిజమే అనుకుందాం. మే 23వ తేదీకి ముందు రోజుకు తరువాత రోజుకు జరిగిన మార్పుల్లో అధికార మార్పిడి తప్ప పైన చెప్పిన అవసరాలు తీర్చే ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడలేదు కదా ? అలాంటపుడు ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించామని చెప్పినదానిని తన అవసరాలకు కేటాయించమని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కోరటం ఏమిటి? అంటే కొత్త ప్రభుత్వం సమీక్షలు ఎక్కడ చేయాలి? జనాన్ని ఎక్కడ కలుసుకోవాలి? అవన్నీ వేరే చోట్ల పెట్టి, సదరు భవనాన్ని తనకు అప్పగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని నాలుగుదశాబ్దాల రాజకీయ అనుభవం వున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి సూచించటమే కదా !

ప్రభుత్వ సమీక్షల కోసం ఒక భవనం వుండాల్సిందే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ కట్టేదేదో కృష్ణానది కరకట్టకు ఇవతల రాజధానికి సేకరించిన భూములుండగా అక్కడ కట్టకుండా నిబంధనలకు విరుద్దంగా ఎందుకు నిర్మాణం చేయించినట్లు ! 2020, 2050 స్వాప్నికుడిగా చెప్పుకున్న చంద్రబాబుకు ప్రపంచంలో పర్యావరణ హానికి ఎదురవుతున్న ముప్పు, పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియవా ? తాను నివసిస్తున్న ఒక అక్రమ ప్రయివేటు భవనం పక్కనే ప్రజావేదికను నిర్మింపచేయటంలో ఆయన విజ్ఞత ఏమైనట్లు ? తానున్నది రాష్ట్ర ముఖ్య మంత్రుల లేదా ప్రతిపక్ష నేతల అధికారిక శాశ్వత నివాసం ఏమి కాదే ! ఈ వుదంతంలో తలెత్తుతున్న ప్రశ్నలకు తెలుగుదేశం నేతల వద్ద వున్న సమాధానాలు ఏమిటి అనటంతో పాటు ప్రభుత్వ తీరు తెన్నులు ఏమిటి అని కూడా ప్రశ్నించక తప్పదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సంక్షేమపధకాల పరిమితులు – జగన్‌ ముందున్న సవాళ్లు !

04 Tuesday Jun 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH CM, challenges before ys jagan, CM YS Jagan, Limits of Welfare schemes, ysrcp

Image result for ys jagan images

ఎం కోటేశ్వరరావు

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరుకున్న పదవి సాధించారు. అదీ అఖండ మెజారిటీతో పొందారు. మరికొద్ది రోజుల పాటు అభినందనలు-ఆకాంక్షలను అందుకుంటూనే వుంటారు. ఇంకా మంత్రులను తీసుకోలేదు, తరువాత కూడా కొంతకాలం కాస్త కుదురుకునే వరకు ఏమి చేస్తారు, చేయరు అనే అంశాల మీద కాస్త ఓపిక పట్టక తప్పదు. అయితే తన పాలన ఎలా వుండబోతోందో జగన్‌ ప్రమాణ స్వీకారం రోజే వెల్లడించారు, సమీక్షల సందర్భంగా మరికొన్ని అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ పూర్వరంగంలో పాచిపొయ్యే వరకు మూసి పెట్టటం కంటే ఎదురయ్యే సవాళ్లు ఏమిటి, ఎలా పని చేయాలో కోరుకోవటం లేదా సూచించే చర్చ తప్పు కాదు. వింటారా, పరిశీలిస్తారా లేదా అనేది కొత్త ముఖ్యమంత్రికి, ఆయన పరివారానికి వదలి వేద్దాం. ఆ పార్టీ అభిమానులు, సామాన్యులు అయినా బుర్రలకు ఎక్కించుకోవటం అవసరం.

ఏ పార్టీ ఎన్నికల ప్రణాళిక చూసినా ఏమున్నది వాటిలో అంటే అన్నింటా ప్రజాకర్షక సంక్షేమ పధకాలే. పార్టీల నేతలను బట్టి పేర్లు మారుతుంటాయి. జగన్‌ అదేబాటలో నడుస్తున్నట్లు పేర్ల మార్పు ప్రక్రియ వెల్లడించింది. రాజకీయ లబ్ది కోసం, ప్రచారంలో భాగంగా ఫలానా వారు మా పధకాలను కాపీ కొట్టారంటే ఫలానా వారు మమ్మల్ని అనుకరిస్తున్నారని అనటం తప్ప వస్త్రం ఒక్కటే రంగులు, పన్నాలే తేడా. మనకంటే ముందే వివిధ దేశాలలో అమలు జరిపిన వాటిని అనుకరిస్తూ అందరూ ఇక్కడ తమ బుర్రలోంచి పుట్టినవి అన్నట్లుగా ఫోజు పెడుతున్నారు. సంక్షేమ పధకాలను వ్యతిరేకించే వారు, సమర్ధించేవారూ వుంటారు. అయితే అవే సర్వస్వం, బొందితో కైలాసానికి తీసుకుపోతాయని ఎవరైనా చెబితే అక్కడే తేడా వస్తుంది. సమర్ధించేవారు సైతం మింగలేరు. ఇంతవరకు ఎవరూ సంక్షేమ పధకాలతో జనాన్ని కైలాసానికి తీసుకుపోలేదు, ఇక ముందు కూడా తీసుకుపోలేరు అన్నది ఇప్పటికే అమలు జరిపిన దేశాల అనుభవం చెప్పిన సత్యం. ఎవరైనా తూర్పున వుదయించే సూర్యుడిని పడమరకు మారుస్తామని చెపితే, నిజమే వారికి అంత సామర్ధ్యం వుందని భక్తులు భజన చేస్తే చేసుకోనివ్వండి. బాబాలు ఎందరో భక్తులు కూడా అన్ని తరగతులుంటారు కదా ! ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి జగన్‌ ఎదుర్కొనే సమస్యల గురించి కొన్ని అంశాలను చూద్దాం.

అంత్య కంటే ఆదినిష్టూరమే మంచిది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలోనూ కేవలం సంక్షేమ పధకాలతో ప్రజల మన్ననలను చూరగొన్న వారు లేరు. ఎక్కడైనా వున్నా అది గరిష్టంగా రెండు ఎన్నికల వరకు మాత్రమే వుంటుందని అమెరికాలోని అట్లాంటిక్‌ పత్రిక 1991 నుంచి 2018వరకు 33 దేశాలలోని 46 మంది ప్రజాకర్షక నేతల పాలన, వారు పదవి నుంచి దిగిపోయిన తీరు తెన్నులు, ఇతర అంశాల గురించి ఒక విశ్లేషణలో పేర్కొన్నది. జగన్‌కు వాటన్నింటినీ అధ్యయనం చేసే తీరిక వుంటుందో లేదో తెలియదు కనుక ఆయన మంచి కోరుకొనే సలహాదారులైనా ఆపని చేసి నివేదించాలి. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తామని పదేపదే చెబుతున్నారు. కానీ ఫీజుల రాయితీ, ఆరోగ్యశ్రీ, ఇంకా ఇతర సంక్షేమ పధకాలను అమలు జరిపిన ఐదేండ్ల తరువాత ఆ రాజన్నకు 2009 ఎన్నికలలో వచ్చిన ఓట్లు 36.56శాతమే. ప్రజారాజ్యం చిరంజీవి తెచ్చుకున్న 17శాతం ఓట్ల పుణ్యమా అని కాంగ్రెస్‌కు అధికారం పొంది, తరువాత ప్రజారాజ్యాన్ని మింగివేయటం వేరే విషయం. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ పుణ్యమా అని జగన్‌ తొలిసారి అఖండ మెజారిటీ తెచ్చుకున్నారు.

కుందేటి కొమ్ము సాధించవచ్చు,తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు గానీ ఈ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి చేసిన కొన్ని వాగ్దానాలను అమలు జరపటం అసాధ్యం. వాటిలో ఒకటి ర్రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన.పదిహేడవ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏకు పూర్తి మెజారిటీ రాదు, అందుకు అవసరమైన సీట్లను తాము సాధిస్తే వాటిని వుపయోగించుకొని ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు అన్న అంచనాతో ఈ నినాదాన్ని ముందుకు తీసుకు వచ్చారన్నది స్పష్టం. ఎన్నికల ఫలితాలు ఆ అంచనాను దెబ్బతీశాయి. ప్రత్యేక హోదా గురించి మరచి పొమ్మని బిజెపి నేతలు తెగేసి చెప్పారు, దానికి తోడు ఇతర అంశాలు వున్నాయి కను బిజెపితో వైఎస్‌ఆర్‌సిపికి దానికి జతకలవలేదు. నరేంద్రమోడీ 2.0కు గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, ఇప్పటికే ఎదురవుతున్న అనేక సమస్యలకు తోడు ఏపికి ప్రత్యేక హోదాను తలకెత్తుకుంటారంటారని ఎవరైనా అనుకుంటే రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారనే చెప్పాలి.

ఇక మద్యపాన నిషేధం, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోలేదన్నది స్పష్టం. ఆచరణ సాధ్యం కాని వాటి గురించి చెప్పటం ప్రజాకర్షక నేతల స్వభావం. ఈ వాగ్దానం చేసిన ఆ పార్టీ నేతలు లేదా కార్యకర్తలు ఎన్నికల సందర్భంగా మద్యం జోలికి పోకుండా వున్నట్లయితే వారి చిత్తశుద్ది, ఆచరణను ప్రశ్నించాల్సి వచ్చి వుండేది కాదు. రైతుల రుణాల రద్దు సాధ్యం కాదని గతంలో ఒక వ్యూహాత్మక తప్పిదం చేసిన ఫలితం ఐదేండ్లపాటు అధికారానికి దూరంగా వుండటం అని జగన్‌కు అర్ధం అయింది కనుక ఈ సారి ఎక్కడా ఏ విషయంలోనూ అసాధ్యం అనే మాటే లేదు. మద్యపాన నిషేధం వలన ఆర్ధికంగా రెండు నష్టాలు. ఒకటి మద్యవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతుంది. జనం అలవాటును మానుకోలేరు గనుక నాటుసారా బట్టీలు తిరిగి మొదలవుతాయి, అవిగాకపోతే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అయ్యే మద్యాన్ని కొనుగోలు చేయటం ద్వారా రాష్ట్రంలోని జనం దగ్గర వున్న సొమ్ము బయటకు పోతుంది. ఆ రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ వాగ్దాన సలహా ఇచ్చిన వారు మత్తులో వుండి ఆపని చేశారో మరొక విధంగా చేశారో తెలియదు గానీ జగన్‌కు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అవినీతిని పెంచుతుంది, మద్యం మాఫియాలను సృష్టిస్తుంది. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం గురించి ముందుగానే జనానికి చెప్పి అజెండానుంచి వాటిని ఎత్తివేస్తే అదొకదారి అలాగాక ఇతర సాకులు చెబితే ప్రతిపక్షానికి పని కల్పించినట్లే !

Image result for cm ys jagan

ప్రస్తుతం రెండు వేల రూపాయలుగా వున్న వృద్దాప్య పెన్షన్లను ఏటా 250 రూపాయల చొప్పున పెంచుతూ నాలుగు సంవత్సరాలలో మూడువేలు చేస్తామని జగన్‌ ఫైలు మీద సంతకం చేశారు. గత పన్నెండు సంవత్సరాలుగా పెంపుదల లేని జాతీయ సామాజిక సహాయ పధకం(ఎన్‌ఎస్‌ఏపి) పెన్షన్‌ మొత్తాలను పెంచాలని ఈ ఏడాది జనవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం రూ.200గా వున్న వృద్ధులు, వికలాంగుల, వితంతు పెన్షన్లను రూ.800కు, 80సంవత్సరాలు దాటిన వారికి ఇస్తున్న రూ 500లను 1200 పెంచాలన్నది దాని సారాంశం. కేంద్రం ఇస్తున్న ఈ నిధులకు రాష్ట్రాలు తమ వాటాను తోడు చేయాలని గతంలో కేంద్రం కోరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మరికొన్ని రాష్ట్రాలలో అంతకంటే ఎక్కువే జమచేసి అమలు జరుపుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించిన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టుబోయే బడ్జెట్‌లో చేర్చితే కేంద్రం నుంచి వచ్చే మొత్తం రెండు నుంచి ఎనిమిది వందలంటే నెలకు ఆరువందల పెరుగుతుంది.ఈ లెక్కన ఒకరికి ఏడాదికి రూ 7,200 పెరుగుతుంది. జగన్‌ మోహన రెడ్డి పెంచుతానన్నది నెలకు రూ 250, అంటే ఏడాదికి మూడువేల రూపాయలు. కేంద్రం ఎనిమిది వందలకు పెంచితే నాలుగు సంవత్సరాలకు రాష్ట్రానికి ఒక్కొక్కరికి 28,800 జమ అవుతుంది. జగన్‌ సర్కార్‌ పెంపుదల ప్రకారం ఏడాదికి మూడువేల చొప్పున నాలుగు సంవత్సరాలకు పడే అదనపు భారం పన్నెండువేలు మాత్రమే. ఒక వేళ కేంద్రం ఎనిమిది బదులు ఆరువందలు చేసినా 19,200 కేంద్రం నుంచి వస్తే రాష్ట్ర సర్కార్‌ మీద భారం తగ్గుతుంది తప్ప పెరగదు. గతేడాది చివరిలో జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ ఘర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎదురులేని బిజెపి పదిహేనేండ్ల పాలనకు ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. దానికి వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం, పెరిగిన నిరుద్యోగం వంటి అంశాలు కారణం. జనంలో తలెత్తిన అసంతృప్తిని చల్లార్చేందుకు లేదా పక్కదారి పట్టించేందుకు కేంద్రం తాత్కాలిక బడ్జెట్‌ అయినా కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో పాత తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఏటా ఆరువేల రూపాయల వ్యవసాయ పెట్టుబడి పధకాన్ని ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. సామాజిక సహాయ పెన్షన్ల పెంపు ప్రతిపాదన ఆలోచన కూడా దాన్నుంచే వచ్చింది.

దేశంలో ఇప్పటికీ ఈ నామమాత్ర సాయం కూడా అందుకోని వారు దాదాపు ఆరుకోట్ల మంది వున్నారని ఏడాది క్రితం పెన్షన్‌ పరిషత్‌ అనే పౌరసమాజ సంస్ధ జరిపిన సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఇందిరా గాంధీ జాతీయ సామాజిక సహాయ పధకం కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్నది. సమాజంలోని తొంభైశాతం మంది వృద్ధులు, ఇతరులకు ఇస్తున్న పెన్షన్లకు జడిపిలో 0.04శాతం మాత్రమే ఖర్చవుతున్నదని, నెలకు రెండున్నరవేల రూపాయల వంతున చెల్లిస్తే జిడిపిలో 1.6శాతం అవుతుందని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ పెన్షన్‌ పరిషత్‌ సర్వే తీరు తెన్నుల మీద వ్యాఖ్యానించారు. దేశంలో మూడు కోట్ల మంది వృద్ధులు ఇతరులకు పెన్షన్లు పెంచితే మొత్తం బడ్జెట్‌ 30వేల కోట్ల రూపాయలని, ఇప్పటికే వున్నది గాక ఏటా అదనంగా అయ్యే ఖర్చు 18వేల కోట్ల రూపాయలు మాత్రమే అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర పెన్షన్‌ పధకాలను కూడా విలీనం చేసే అంశం గురించి చర్చలు జరుగుతున్నాయి. అది జరిగితే కొన్ని చోట్ల పెన్షన్‌లు గణనీయంగా పెరిగితే ఇప్పటికే ఎక్కువగా వున్న చోట్ల ఏమౌతాయన్నది ఒక పెద్ద ప్రశ్న. సార్వత్రిక పెన్షన్‌ పధకాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజన వాజ్యంపై విచారించిన న్యాయమూర్తులు అన్ని పధకాలను విలీనం చేసి ఒక సమగ్ర పధకాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ కారణంగానే విలీన అంశం తెరమీదికి వచ్చింది. జూన్‌ నాటికి ఒక రూపం తీసుకోవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. దీనిలో అనేక అంశాలు వున్నాయి. కొన్ని రాష్ట్రాలలో కేంద్రం ఇస్తున్న మొత్తాలు రెండువందలే అమల్లో వుండగా ఏపిలో తాజాగా పెంచినదానితో 2,250 రూపాయలు వుంది. అందువలన కేంద్రం, రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు, ఇతర అంశాలు ముందుకు వస్తాయి.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ద్వారా ప్రపంచంలో నయా వుదారవాద విధానాలను ముందుకు తెచ్చి ప్రపంచ మార్కెట్లను ఆక్రమించుకోవటం, ప్రత్యక్ష దోపిడీ స్ధానంలో పరోక్ష దోపిడీకి తెరతీశారు. రెండవ ప్రపంచ యుద్ధ పర్యవసానాలు సోషలిస్టు దేశాల సంఖ్యను పెంచటంతో పాటు అనేక దేశాలలో కమ్యూనిస్టులు బలం పుంజుకోవటం గమనించిన సామ్రాజ్యవాదులు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన అనేక అంశాలలో భాగంగా సంక్షేమ రాజ్య భావన పేరుతో జనానికి తాయిలాలు అందించేందుకు తెరలేపారు. ఇదే సమయంలో ద్రవ్య పెట్టుబడిదారులకు అనుకూలమైన నయా వుదారవాద విధానాలు అమలు జరిగిన చోట జనంలో అసంతృప్తి పెరగటాన్ని గమనించిన తరువాత దాన్ని దారి మళ్లించేందుకు సామాజిక సహాయ పధకాలను అమలు జరపాలని దాని నిపుణులు సూచించారు. ఇదే సమయంలో నూతన శతాబ్ది లక్ష్యాల పేరుతో వాటికి పంచదారపూత పూశారు. మన దేశంలో 1991లో నూతన ఆర్ధిక విధానాల అమలు ప్రారంభమైంది. అప్పటికే పలు దేశాలలో సామాజిక అసమానతలు తీవ్రం కావటం, అశాంతికి దారి తీస్తున్న నేపధ్యంలో మన దేశంలో అలాంటిది పునరావృతం కాకుండా చూసేందుకు 1995లో సామాజిక సహాయ పధకాలను ప్రారంభించారు. ఇదేదో మన పాలకులు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పట్ల చూపుతున్న ఔదార్యమనో మరొకటో అనుకుంటే పొరపాటు ఎవరు వచ్చినా అమలు జరిపేవే అన్నది ఇప్పటికే స్ఫష్టమైంది. ఈ కారణంగానే ఎన్నికల ముందు ఎన్ని ఆకర్షణీయ పధకాలను ప్రకటించినా తెలుగుదేశం పాలనపట్ల తలెత్తిన అసంతృప్తి ముందు అవి నిలువలేకపోయాయి. ఎవరొచ్చినా అమలు జరుపుతారు, అవినీతి,అక్రమార్కులను వదిలించుకుందామనే కసితోనే ఓటర్లు రాత్రి వరకు వేచి వుండి మరీ తెలుగుదేశాన్ని ఓడించారు.దారిద్య్ర నిర్మూలన, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా మన కంటే దరిద్రంలో వున్న దేశాలు కూడా సామాజిక సంక్షేమ పెన్షన్లు ఎక్కువ మొత్తాలు చెల్లిస్తున్నాయి.

అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో సంక్షేమ పధకాలను అమలు జరిపిన ప్రభుత్వాలు ప్రజల అసంతృప్తిని చల్లార్చలేకపోయాయి. వాటి మూలాలను తొలగించలేవు.అందువలన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి యాభై కుటుంబాలకు ఒక వలంటీర్‌ పేరుతో గ్రామాలలో లక్షలాది మందిని నియమించటం, ఆచరణలో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలకు పునరావాసం కింద మారనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే రాజన్య రాజ్యంలో రైతు వలంటీర్ల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలనే నియమించటాన్ని చూశాము. అందువలన నెలకు ఐదు వేల రూపాయలు పొందే వలంటీర్లుగా అధికార పార్టీ కార్యకర్తలు మాత్రమే వుంటారు లేకపోతే పార్టీలోనే అసంతృప్తి మొదలవుతుంది. మిగతా పధకాల అమలు గురించి సందర్భోచితంగా చర్చించుదాం.

Image result for cm ys jagan

ప్రభుత్వ వుద్యోగులకు కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్దరిస్తామని జగన్‌ వాగ్దానం చేశారు.కాంట్రాక్టు వుద్యోగుల క్రమబద్దీకరణ వంటి వాగ్దానాలు చేశారు. గతంలో పాత పెన్షన్‌ వర్తించే సిబ్బంది ఎక్కువగా, కొత్త పధకపు సిబ్బంది తక్కువ. ఇప్పుడు ప్రతి నెలా, ప్రతి ఏటా పాతవారు తగ్గిపోయి కొత్తవారు పెరుగుతున్నారు. అంటే అసంతృప్తి చెందేవారు పెరుగుతున్నట్లే. ఈ ముఖ్యమైన సమస్య గురించి ఏమి చెబుతారా అని వుద్యోగులు, వుపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇలాంటివే చాలా వున్నాయి.

చివరిగా రాజకీయంగా బిజెపి మరుగుజ్జు సేనలు వైఎస్‌ జగన్‌ మతం గురించి అప్పుడే ప్రచారం మొదలు పెట్టాయి. జగన్‌ హిందూ మతంలోకి మారినట్లు నకిలీ వీడియోలను ఇప్పటికే పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు అదంతా ఒట్టిదే క్రైస్తవమతానికి పెద్ద పీటవేశారంటూ ప్రమాణస్వీకారం సందర్భంగా ముందుగా క్రైస్తవ మతపెద్దల ఆశీర్వాదాన్ని పొందటాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ దేశంలో ఎవరు ఏమతంలో వుండాలన్నది వారి వ్యక్తిగత అభీష్టమే. నిజానికి రాజశేఖరరెడ్డి గురించి ఇలాంటి ప్రచారం వున్నా పరిమితం. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. మరోవైపున జగన్‌ ప్రతి సందర్భంలోనూ హిందూ పీఠాధిపతుల సేవలో తరిస్తున్నారు. తన మీద ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ మార్గం ఎంచుకున్నారా లేక నిజంగానే నమ్మకాలు వున్నాయా? ఒక లౌకిక దేశంలో ఇలా చేయటం అభ్యంతరకరం. అందునా దేశంలో నేడు హిందూత్వ శక్తులు రెచ్చిపోతున్న స్ధితిలో తగని పని. ఒక ప్రధానిగా తన భార్యను గురించి చెప్పలేదని నరేంద్రమోడీపై ఇప్పటికే ఒక విమర్శ వుంది. జగన్‌ హిందూ మతంలోకి మారారని, మారలేదని సామాజిక మాధ్యమంలో నడుస్తున్న చర్చకు ఆదిలోనే ముగింపు పలకాల్సింది ఆయనే. అదే విధంగా దేశంలో వున్న మతతత్వం, తదితర అంశాలపై కూడా ఒక పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీ వైఖరి ఏమిటన్నది తెలుసుకోవాలని సహజంగానే కోరుకుంటారు. అదే విధంగా హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేసిన ప్రయత్నంపై వెంటనే స్పందించి వుండాల్సింది. అవకాశవాదాన్ని ప్రదర్శిస్తే కుదరదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • కేరళ ఎన్నికలు : చర్చ్‌ల చుట్టూ బిజెపి ప్రదక్షిణలు – ముస్లిం లీగ్‌కూ లవ్‌ జీహాద్‌ !
  • చారిత్రక రైతు ఉద్యమం నూతన దశ, దిశ ఏమిటి !
  • కేరళ రాజకీయ చిత్రం : మెట్రోమాన్‌ జోక్‌ – కాంగ్రెస్‌ స్వంత డబ్బా !
  • మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?
  • నరేంద్రమోడీ పగటి కల : కేరళలో ఒకటి నుంచి డెబ్బయి ఒకటి !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: