• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Chandrbabu

చంద్రబాబుకు నోట్ల రద్దు ‘సంక్షోభ ‘ సెగ

24 Thursday Nov 2016

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Chandrbabu, Demonetisation

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలంటూ ముందుగానే ప్రధానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి ఆ చర్యతో తలెత్తిన సంక్షోభ సెగ తగిలింది.ఈనెల 20న సమాచార శాఖ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఇన్ని రోజులైనా నోట్ల రద్దుతో తలెత్తిన సమస్య పరిష్కారం కాకపోవటం పట్ల తనకే అసహనం కలుగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఒక సమస్య పరిష్కారం కాకపోవటం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటి సారని, తుపాన్ల తీవ్రత వలన తలెత్తిన నష్టాలను ఎనిమిది రోజుల్లోనే అధిగమించామని, గోదావరి పుష్కరాలలో మొదటి రోజు ఇబ్బంది వచ్చినా తరువాత 14 రోజులు సమర్ధవంతంగా నిర్వహించామని, అలాంటిది పన్నెండు రోజులైనా నోట్ల రద్దు సమస్య అపరిష్కృతంగా వుండటం బాధాకరమని, తనకే అసహనం కలుగుతోందని అలాంటిది ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్నారు. తన సహజ శైలిలో తన పరిధిలోని బ్యాంకర్లు ఎలా పనిచేయాలో కూడా చెప్పారనుకోండి.

    తాజాగా గురువారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్సు (24న) వుపన్యాసం గురించి సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటనలో ప్రతిరోజు తాను నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, ఎస్‌ఎల్‌బిసి, బ్యాంకర్లతో సమీక్ష జరుపుతున్నానని, దీనిని ఒక సంక్షోభంగా తీసుకుంటే అది అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గదని, సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందన్నారు. ప్రతి గ్రామం, వార్డుల్లోని కిరణాదుకాణాలలో కూడా పాస్‌ మిషన్‌ వుపయోగించి నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించాలని కోరారు. మొబైల్‌ కరెన్సీ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం ద్వారానే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని చంద్రబాబు వివరించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమరావతిపై కొండంత రాగం తీసిన చంద్రబాబు చివరికి ….

02 Saturday Jul 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Amaravathi capital, ANDHRA PRADESH, Chandrababu duplicity, Chandrbabu

.

ఎం కోటేశ్వరరావు

     కొండంత రాగం తీసి చివరికి కీచుగొంతుతో ఏదో గొణిగి సరిపెట్టటంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాతే ఎవరైనా అంటే ఆయన అభిమానులకు కోపం కలగవచ్చు. హైదరాబాదుకు ధీటుగా ఐదులక్షల కోట్ల రూపాయలు రాజధానికి కావాలని సీమాంధ్రప్రాంతంలో విభజనకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న సమయంలో ప్రకటించి ఆంధ్రప్రాంతంలో తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. కొండంత రాగం ఐదులక్షల కోట్లకు కనీసం ఐదు వేల కోట్లు కూడా కాదు కదా కేంద్రం విజయవాడ, గుంటూరు పట్టణాలకు ఇచ్చిన వెయ్యికోట్లతో సహా అమరావతి నూతన రాజధానికి మొత్తం మూడున్నర వేలకోట్లకు మించి ఇవ్వనంటున్నారని ఆయనే మెల్లగా ఇప్పుడు చెబుతున్నారు. ఆనాడు అసలు విభజనే వద్దంటుంటూ కొత్త రాజధానికి ఐదులక్షల కోట్లు ఆడగటం ఏమిటని ఎందరో మండి పడటంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గారు.(ఆనాడు మండి పడ్డవారు ఇప్పుడు ఇంత అన్యాయమా అని కూడా అనటం లేదన్నది వేరే విషయం) అయితే తరువాత కొంత కాలం మౌనం పాటించి, బిజెపి-కాంగ్రెస్‌ పార్టీలతో విభజన ఖరారు చేయించిన తరువాత తిరిగి అదే పల్లవి అందుకున్నారు. హిందూ పత్రిక 2013 ఆగస్టు ఒకటిన ప్రచురించిన ఆయన పత్రికా గోష్టి వివరాల ప్రకారంwww.thehindu.com/news/national/andhra…/rs-5-lakh…capital…/article4975144.ece  తన మాటలను వక్రీకరించిందని ఈ పత్రికను అనే అవకాశం లేదు.

    హైదరాబాదుతో సమంగా కొత్త రాజధాని నిర్మాణం జరగాలంటే 4-5లక్షల కోట్లు కావాలని అందుకు కేంద్రం వుదారంగా నిధులు ఇవ్వాలని చెప్పారు. అసలు హైదరాబాదుతో సమంగా అని పోల్చటమే జనాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ. మధ్యప్రదేశ్‌ను విభజించినపుడు భోపాల్‌తో సమంగా చత్తీస్‌ ఘర్‌కు, లక్నో మాదిరి వుత్తరాంచల్‌కు, పాట్నామాదిరి ఝార్కండ్‌కు రాజధానులు కావాలని ఎవరూ కోరలేదు. అది అసాధ్యం. కానీ అలాంటి కోరిక కోరకపోతే, దానిని జనంలో ప్రచారం చేసుకోకపోతే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు ? ఆ డిమాండ్‌ చేసిన సమయంలో తాను ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తన డిమాండ్లను చెబుతున్నాను తప్ప రాజకీయాలు మాట్లాడటం లేదని ఆ నాడు చెప్పారు. ఇక్కడొక విషయాన్ని గుర్తు చేస్తే తెలుగుదేశం పార్టీ వారికి ఎక్కడైనా మండవచ్చు. అంతా కాంగ్రెస్‌ వారే చేశారు, పార్లమెంట్‌ తలుపులు మూశారు, చీకట్లో చేశారు, అన్యాయం చేశారు అని విమర్శిస్తున్నారు. దానితో ఎవరూ విబేధించటం లేదు, ఆ కాంగ్రెస్‌ వారికే తరువాత తెలిసి వచ్చింది, రెండు రాష్ట్రాలలో అనుభవిస్తున్నారు అది వేరే విషయం. ఒక నిపుణుల కమిటీని వేసి హైదరాబాదుతో సమంగా మౌలిక సదుపాయాలు, నీటి పంపిణీ, ఆదాయం, విద్యుత్‌,వుద్యోగాల వంటి అన్నింటినీ విభజన బిల్లులో చేర్చాలని కూడా చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు 2008లోనే కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకొనేది లేదని కూడా చంద్రబాబు చెప్పారు. ఇంత స్పష్టంగా ,నిక్కచ్చిగా ఇచ్చిన మాటకు నిలబడిన తెలుగు దేశం పార్టీ పార్లమెంటులో బిల్లులో ఇవేవీ చేర్చలేదని తెలిసీ ఎందుకు జోక్యం చేసుకోలేదు, పోనీ నిరసన తెలిపే యావలో మరిచిపోయామంటారా? అన్యాయంగా విభజిస్తున్నారని అప్పటికే పల్లవి అందుకున్న వారు బిల్లులో జరిగే అన్యాయాన్ని ఎందుకు చూడలేకపోయారు. ఒక కన్ను పోతుంటే ఏం చేశారు? పోనీ తెలుగుదేశం వారు విభజనను అడ్డుకొనే యత్నంలో మునిగిపోయారు అనుకుందాం, అన్నీ తానే అయి వ్యవహరించిన వెంకయ్య నాయుడికి ఇవన్నీ తెలియదా ? ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నలకు ఈ జన్మలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, వెంకయ్య నాయుడు, బిజెపి నుంచి సంతృప్తికర సమాధానాలు రావు.ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు కేటాయించటం కేంద్రానికి పెద్ద సమస్యకాదని మూడు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు చెప్పారు.అలాంటపుడు మూడున్నర వేలకోట్లకు మించి ఇవ్వనుంటున్నారని ఇప్పుడు చెప్పటం ఏమిటి ?

    తాను అధికారానికి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం, నాలుగైదులక్షల కోట్ల రూపాయల పాట మానుకోలేదుwww.deccanchronicle.com/140610/nation…/andhra-pradesh-new-capital-near-guntur పది-పది హేను సంవత్సరాలలో నాలుగు-అయిదు లక్షల కోట్లతో నూతన రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. జనాన్ని వెర్రివాళ్లను చేయటాన్ని కొనసాగించారు. రాజధాని అంటే రాష్ట్ర అధికార కేంద్రమైన సచివాలయం, దాని అనుబంధ కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు, రాజధాని కేంద్రంగా పనిచేసే వారికి అవసరమైన వసతి తప్ప చంద్రబాబు చెప్పే మిగిలిన వాటిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి అయితే దాని కంటే పెద్దవైన న్యూయార్క్‌ ఇతర నగరాలు పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వుంది. చైనా రాజధాని బీజింగ్‌ అయితే అక్కడి అసలైన పారిశ్రామిక కేంద్రం దానికి ఎంతో దూరంలో వున్న షాంఘై అని అందరికీ తెలిసిందే. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. గుజరాత్‌ నూతన రాజధాని గాంధీ నగరం లేదా చత్తీస్‌ఘర్‌ నయా రాయపూర్‌ వంటి వన్నీ పరిపాలనా కేంద్రాలుగా నిర్మితమయ్యాయి, అవుతున్నాయి తప్ప చంద్రబాబు చెప్పే పద్దతుల్లో కాదు.ఆ పేరుతో వేలాది ఎకరాల భూములు తీసుకున్నారు కనుక ఇప్పుడు పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల ఏర్పాటు గురించి సహజంగానే జనం నుంచి డిమాండ్‌ వస్తుంది.

    తాజాగా చైనా పర్యటన జరిపిన చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. రాజధానికి ఎంతో దూరంగా వున్న దొనకొండ ప్రాంతంలో దేశంలోనే తొలిదైన అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుకు చైనాతో ఒప్పందం చేసుకున్నట్లు ముఖ్య మంత్రి కార్యాలయం ప్రకటించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు వున్న సాగర తీరం, పరిశ్రమల ఏర్పాటుకు వున్న అవకాశాల గురించి కూడా చైనా వారికి వివరించారు, ఇప్పటికే విశాఖ-చెన్నయ్‌ పారిశ్రామిక కారిడార్‌ గురించి వూరిస్తున్నారు. ఈ కారిడార్‌, దొనకొండ అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రం వంటి వన్నీ అమరావతి చుట్టూ ఏర్పాటు చేస్తామని చెప్పిన పారిశ్రా మిక పట్టణాలకు అదనంగా అనుకోవాలా ? ఒక అతిశయోక్తిని సమర్ధించుకోవటానికి మరొక అతిశయోకి.్త . ప్రపంచ వ్యాపితంగా వున్న పెట్టుబడిదారులు తెల్లవారిన తరువాత పెట్టుబడి పెట్టి సాయంత్రానికి వచ్చిన లాభాలతో మరోచోటికి పోయే రోజుల్లో విదేశీ కంపెనీలు, లేదా వ్యక్తులు ఫ్యాక్టరీలు, వ్యాపారాలను కొత్తగా పెట్టి ఆంధ్రప్రదేశ్‌ జనానికి వుపాధి కల్పిస్తారని నమ్మబలటానికి ఎంతో ధైర్యం కావాలి. అందుకు చంద్రబాబును అభినందించాల్సిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెలుగు నాట భక్తి రసం డేంజరుగా మారుతోంది

26 Thursday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Chandrbabu, KCR, sins, temple income, troubles

“పాపాలు, ఇబ్బందులే హుండీ ఆదాయాలు పెంచుతున్నాయి”

సత్య

     తన రెండేళ్ల పాలన పూర్తి కావస్తున్న సమయం, మహానాడుకు ముందుగా విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జనానికి వుపయోగపడే పనుల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో తెలియదుగానీ మద్యం గురించి చేసిన వ్యాఖ్యలతో కలెక్టర్ల సదస్సుకు కాస్త కిక్కు వచ్చింది. ప్రత్యేక రాష్రనఠ హోదారాదని తేలిపోవటం, చంద్రన్నే చెప్పినట్లు విభజన సమయంలో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు కాకపోవటంతో వడదెబ్బ తగిలినట్లు కలెక్టర్ల సదస్సు ప్రసంగం నిస్సారంగా సాగిందని చెప్పవచ్చు.తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో తాను చేసిన వుపన్యాసాన్ని ఒక వర్గపు మీడియా వక్రీకరించిందని దేవుడి గురించి తాను పాజిటివ్‌గానే మాట్లాడానని రెండోరోజు వివరణ ఇచ్చారు.

    చంద్రబాబుకు సానుకూల మరొక వర్గపు మీడియాగా గుర్తింపు వున్న ఒక పత్రికలో కష్టాల్లో వున్న వారు దేవుణ్ని నమ్ముకొంటున్నారు అనే శీర్షికతో ప్రధాన వార్తలో వుప భాగంగా రాశారు. దేవాదాయశాఖ కష్టపడకపోయినా 27శాతం ఆదాయం పెరిగిందనీ, ఇది ప్రజల్లో పెరిగిన భక్తిని తెలియ జేస్తుందని చంద్రబాబు అన్నారు. కష్టాల ో్ల వున్న వాళ్లు దేవుణ్ని నమ్ముకుంటున్నారు. వారితో పాటు తప్పులు చేసిన వాళ్లు హుండీల్లో డబ్బులు వేస్తున్నారు. కష్టాల్లో వున్నామని వ్యసనాల బారిన పడకుండా దేవుణ్ని విశ్వసిస్తున్నారు. గుళ్లు, చర్చిలు, మసీదుల్లాంటివి లేకపోతే పిచ్చి వాళ్లయ్యేవారేమో ! దీక్షల కాలంలో దుర్వ్యవసనాలకు దూరంగా వుంటున్నారు. అయ్యప్ప దీక్షల్లాంటివి చేస్తూ 40 రోజుల పాటు మద్యాన్ని ముట్టుకోవటం లేదని చెప్పారు. ఇదే తరగతికి చెందిన మరొక పత్రిక పాపపు సొమ్ము అనే వుప శీర్షికతో వార్త ఇచ్చింది. ఎక్కువ తప్పులు చేసిన వారు, ఆదాయం బాగా వచ్చేవారు హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు ‘ అని నవ్వుతూ అన్నారు. అని పేర్కొన్నది.చంద్రబాబు చెప్పిన ఓ వర్గానికి చెందిన మీడియాలో భాగమైన ఒక పత్రిక తన పాఠకులకు మరింత కిక్కు ఇచ్చేందుకు ఇదే అంశాన్ని మొదటి పేజీలో, తరువాత లోపలి పేజీలో పతాక శీర్షికతో వార్తను ఇచ్చింది. ‘తప్పులు చేసే వారే గుడికి వెళుతున్నారు ‘అని రాయటంతో సమస్య వచ్చింది.

    ఇదే వార్తను ఏ వర్గానికీ చెందని మీడియాలో భాగంగా పరిగణించబడే ఒక ఆంగ్ల పత్రిక తనకు మందీ మార్బలం వున్నప్పటికీ పిటిఐ వార్తా సంస్ధ ఇచ్చిన కధనాన్ని ప్రచురించటం విశేషం. ‘తప్పులు(పాపాలు), ఇబ్బందులు పెరగటమే దేవాలయాల ఆదాయ పెరుగుదల కారణం ‘ అని శీర్షిక పెట్టింది.’ జనం పాపాలు చేస్తున్నారు. కొంత మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వాటిని వదిలించుకొనేందుకు దేవాలయాలకు వెళుతున్నారు, ప్రార్ధనలు చేస్తున్నారు. వారు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటే, ఎక్కువ పాపాలు చేస్తే వారు దేవాలయాలకు వస్తున్నారు, డబ్బులు సమర్పించుకుంటున్నారు, ఇది వాస్తవం’ అని చెప్పినట్లు దానిలో పేర్కొన్నారు. అందువలన మొత్తం మీద దీనిలో వక్రీకరణగా చెప్పాల్సి వస్తే తప్పులు చేసేవారే గుడికి వెళుతున్నారు అన్న శీర్షిక తప్ప ఆయన చెప్పిన అంశాలలో వక్రీకరణ కనిపించటం లేదు. చంద్రబాబు నాయుడు రెండవ రోజు ప్రవచించిన అంశాలలో ఒకటి ఆధ్యాత్మిక టూరిజం. ఏడు ప్రధాన పుణ్య క్షేత్రాలలో దీనిని అభివృద్ధి చేయాలని కోరారు. పరిశ్రమలు, ఇతర రంగాల అభివృద్ధి ద్వారా ఆదాయం సమకూరే పరిస్ధితులు కనిపించటం లేదు కనుక అప్పనంగా వచ్చే ఆధ్యాత్మిక ఆదాయాన్ని మరింత పెంచేందుకు చంద్రబాబు పూనుకున్నారు.

   తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డేంజరుగా మారుతోంది అని ఎప్పుడో ఒక కవి చెప్పారు. ఇప్పుడు సునామీలా వుండబట్టే చంద్రబాబు నాయుడు అంత ఆనందంగా హుండీల ఆదాయం గురించి చెప్పారు. ఏ మతానికి చెందిన దేవుడు, దేవత లేక ప్రవక్తలు కూడా అవినీతిని సహించమనే చెప్పారు. కానీ వారి కళ్లెదుటే రోజు రోజుకూ దుర్మార్గాలు, పాపాలూ పెరిగి పోతున్నా వారెలాంటి చర్యలూ తీసుకోవటం లేదంటే వారు ఇస్తున్న డబ్బులు తక్కువనా లేక రూపాయి విలువ దిగజారిందని పట్టించుకోవటం లేదా? పోనీ బంగారం వేస్తున్న వారికి ఏదైనా ప్రత్యేక దారి వుందా అంటే అదీ లేదు. పాపులు వారి పాపాన వారే పోతారు అనుకుంటే మంచి వారికి ఎదురైన సమస్యలనైనా దేవతలు, దేవదూతలు, ప్రవక్తలు ఎందుకు పట్టించుకోవటం లేదు.

    మన దేశంలో ఇంకా ఫ్యూడల్‌ అవశేషాలు ఒకవైపు, ఆధునిక పెట్టుబడిదారీ తెంపరితనం మరొకవైపు కవలల మాదిరి కొనసాగుతున్నాయి. దాని పర్యవసానమే ఒక పక్కన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచే బిర్లా ప్లానెటోరియం వుంటే దాని పక్కనే మూఢ భక్తి, విశ్వాసాలను పెంచే బిర్లా మందిరం వుండటం. తమ విధానాలను ప్రశ్నించకుండా, జనాన్ని మతం మత్తులో ముంచేందుకు పూర్వకాలంలో రాజులు, రంగప్పలు గుడులు గోపురాలు కట్టించి జనం దృష్టిని మళ్లించేవారు లేదా మత బేధాలు పెంచేవారు. ఆధునిక పాలకులు కూడా అందుకు అతీతులు కాదు.గోదావరి పుష్కరాల గురించి ఎన్నడూ లేని విధంగా జనాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించి స్నానాలు చేయించటాన్ని చూశాము. ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు సిద్ధం అవుతున్నారు. పుష్కర ఘాట్లకు విదేశీ సాయం గురించి కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణాలో యాదాద్రి అభివృద్ధికి చూపుతున్న శ్రద్ధలో వెయ్యోవంతైనా దళితులకు భూమి పంపిణీ కార్యక్రమంపై చూపటం లేదంటే కారణం ఏమిటి?

   ప్రపంచ మంతా గత కొద్ది సంవత్సరాలుగా ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధల వంటి వన్నీ కార్పొరేట్‌ల లాభాలు తప్ప సామాన్యుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు. వాటి ఎజండాలోనే అది లేదు. ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి తప్ప వుల్లిపాయల వ్యాపారం చేయకూడదని, వాటిని ప్రయివేటు రంగానికి వదిలి వేయాలన్నది చంద్రబాబు స్కూలు సిద్ధాంతం. గ్రామాల్లో పాలు, కూరగాయలు అమ్ముకొనే వారు హెరిటేజ్‌ వంటి సంస్ధలు పెట్టక ముందు నుంచీ వున్నారు. వారు ఎంత మంది కోటీశ్వరులయ్యారు? లక్షల కోట్ల సంపదలున్న అంబానీలు పట్టణాలలో మూల మూలనా దుకాణాలు తెరిచి వుల్లిపాయలు, కూరగాయలు, పిన్నీసుల వంటివి అమ్ముతున్నారు. జడ పిన్నులు కావాలన్నా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్ధలలో బుక్‌ చేసుకొని ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. అందుకే అనేక మంది చిన్న వ్యాపారులు తమకు కలిసి రావటం లేదని ఎప్పుడూ వాపోతుంటారు. రానున్న రోజుల్లో ఇలాంటి వారు ఇంకా పెరిగి పోతారు. అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు దేవాదాయ శాఖ సిబ్బంది పని చేసినా చేయకపోయినా అభాగ్యుల సొమ్ముతో హుండీలు దండిగా నిండిపోతాయి. కాళ్లూ, చేతులు చూసి జాతకాలు చెప్పి సొమ్ము చేసుకొనే వారు ఇప్పటికే తామర తంపరగా పెరిగిపోయారు. కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు అనుసరిస్తున్న విధానాలు సమాజంలో మెజారిటీకి నష్టదాయకమైతే వాటి వలన లాభపడే వారు కూడా వుంటారు.అదిగో అలాంటి వారే ఆదాయాలు పెరిగి పోయి మరింత పెరగాలని కోరుకుంటూ హుండీలలో నల్లధనాన్ని గుట్టలుగా వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆంధ్రుల చెవిలో ‘ప్రత్యేక ‘పువ్వు – చంద్రన్న ముందున్న మార్గాలు

06 Friday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Chandrbabu, special status to Andhrapradesh, tdp

ఎం కోటేశ్వరరావు

    పేరు మోసిన అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు రోగి మరణించిన తరువాత కూడా సొమ్ము చేసుకొనేందుకు వెంటిలేటర్‌లు పెట్టి బంధువులను మోసం చేసిన మాదిరి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా పరిస్థితి వుంది. తేడా ఏమంటే అక్కడ డబ్బు రాబట్టుకోవటం కోసం అయితే, ఇక్కడ జనం మద్దతు పోగొట్టుకోకుండా వుండటం కోసం. ప్రత్యేక హోదా ఇవ్వటం నిబంధనల రీత్యా సాధ్యం కాదని తెలిసినా నాడు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఐదు కాదు పది అంటూ పెద్ద రాయితీని రాబట్టినట్లు బిజెపి పెద్ద నాటకం ఆడింది. తీరా బిల్లు విషయానికి వచ్చే సరికి అటు కాంగ్రెస్‌ దానిని దానిలో చేర్చలేదు, ఇటు బిజెపి, తెలుగుదేశం పార్టీ కూడా నోరు మెదపలేదు.ఇప్పుడు కాంగ్రెస్‌ మీద నెపం మోపి తప్పుకొనేందుకు చూస్తున్నాయి. మొత్తం మీద రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు, ప్రత్యేక హోదా రాయితీల నాటకంతో బిజెపి, అందరూ కోరుతున్నారు, కలిసి వస్తున్నారు కదా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు కాంగ్రెస్‌ వారు వారందరితో కుమ్మక్కయి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారు. నిబంధనలు అంగీకరించవని తెలియనంత అమాయకంగా ఈ పార్టీలలో తలలు పండిన పెద్దలు వున్నారా ?

     అటు కేంద్రం-ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న పార్టీలు రెండు సంవత్సరాల పాటు ఆశ పెట్టాయి. ఇంకెంత మాత్రమూ మోసం చేయలేవు.మరణించిన రోగిని వెంటిలేటర్‌పై పెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అసలు విషయం చెప్పదు, చేయాల్సిందంతా చేస్తున్నాం అని మాత్రమే చెబుతుంది. రోగి బతికి బట్ట కట్టే ఆశ చచ్చి, అంతకు మించి వెంటిలేటర్‌ ఖర్చు భరించలేక బంధువులకు ఏం చేయాలో తెలియదు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అలానే వుంది.

    పార్లమెంట్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ సీనియర్‌ లాయర్‌ కనుక కేసు గెలుస్తామని గానీ ఓడిపోతామని గాని చెప్పకుండా నర్మగర్బంగా అసలు కేసే లేదు అని చెప్పేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రులు, ఇతరులు అందరితో మాట్లాడుతున్నా అని చెబుతున్నారు. ఆయన మాట్లాడటం లేదని ఎవరూ అనటం లేదు. దేన్ని గురించి, ఏం మాట్లాడుతున్నారో జనానికి తెలియాలి కదా? కనీసం ఆయనను వెన్నంటి వుండే లేదా మేనేజిమెంట్‌లో వుండే మీడియా కూడా లీకుల కధనాలు కూడా ఇవ్వకపోవటంతో వాటికి అలవాటు పడిన వారు మత్తుకు బానిసలైన వారు గంజాయి దొరక్క పోతే ఎలా విలవిల్లాడి పోతారో అలా జుట్టు పీక్కుంటున్నారు.

    గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు పరిస్థితి వేరు. కారణాలేమైనా కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు అలా కాదే. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడి మాదిరి మీడియా సంస్ధలు అటు కేంద్రంలోని బిజెపి- ఇటు రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీ మధ్య వున్నాయి. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ నొప్పి లేదా రాజకీయంగా నష్టం జరగకుండా తమ ప్రావీణ్యాన్ని వుపయోగించి ఏం రాస్తాయో, ఎలా చూపుతాయో తెలియదు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల గడువు వుంది. చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పుల్లుగా వాగ్దానాలు చేసి, రంగుల కలలను జనం ముందుంచారు. ఏ రంగంలో చూసినా ఎదురుగాలి తప్ప మరొకటి కనపడటం లేదు. గత ఎన్నికల ఫలితాల గురించి చంద్రబాబు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. కేంద్రంలో తనపై ఆధారపడే ప్రభుత్వం వుంటుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్యసభలో తనకు తగినంత బలం లేదు కనుక బిజెపి కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలను కొనసాగిస్తున్నది. మరొక మార్గం లేదు కనుక తెలుగుదేశం కూడా అధికారాన్ని పంచుకొని, తాను కూడా పంచి ఇచ్చింది.

    గత రెండు సంవత్సరాల అనుభవం చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది పిడికెడు మట్టి, ముంతెడు నీళ్లు అని అమరావతి శంకుస్ధాపన సభలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తేల్చి చెప్పారు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో శాశ్వత రాజధానిని పక్కన పెట్టి తాత్కాలిక రాజధానిని తెరమీదకు తెచ్చారు. ప్రత్యేక తరగతి హోదా రాదని చంద్రబాబుకు ఎప్పుడో అవగతం అయినా దానిని అంగీకరిస్తే రాజకీయంగా నష్టం కనుక. సాధ్యమైన మేరకు దాని ప్రస్తావన, దానిపై ఘర్షణ రాకుండా చూసుకుంటున్నారు.అసలు ప్రస్తావించకపోతే అదీ నష్టమే కను తద్దినం మాదిరి స్మరించారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర పెద్దలు గత ఏడాది కాలంగా పరోక్షంగా చెబుతూ లీకులను వదులుతూనే వున్నారు. ఇక లాభం లేదని గత వారంలో చిన్న మంత్రుల ద్వారా పెద్ద విషయాన్ని చెప్పించారు.

    ఈ పూర్వరంగంలో గత వారం రోజులుగా చంద్రబాబుకు పాలుపోవటం లేదు. స్పందన ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు కింది స్థాయి నాయకులతో విమర్శలు చేయిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే రాజకీయంగా ఒంటరి పాటు కావటంతో పాటు కేంద్రం నుంచి ప్రతి రోజూ అధికారికంగా తలనొప్పులే. సఖ్యంగా వున్న ఇపుడే వుదయం సాయంత్రం ఢిల్లీ ప్రభువుల దర్శనం చేసుకున్నా ఫలితం వుండటం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో చూస్తే రాజకీయంగా కలసి వచ్చే స్నేహితులు కనిపించటం లేదు. గత ఎన్నికలలో తోడ్పడిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అదేదో సినిమాలో చెప్పినట్లు వీలైతే నాలుగు మాటలు, కాఫీ, ఆశకు పిసినారి తనం ఎందుకన్నట్లు వీలైతే ముఖ్యమంత్రి పదవి కోసం దారి వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడపుడే కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి మార్గం అగమ్యగోచరం. వైఎస్‌ కుటుంబంతో వున్న ఆర్ధిక లావాదేవీలు పరిష్కారం కాని వారు అవి తేలేంత వరకు అదే పార్టీలో కొనసాగవచ్చు.ఆ బాదర బందీ లేనివారు, తెలుగు దేశం పార్టీతో సర్దుబాటుకు వచ్చిన వారు ఇప్పటికే ఫిరాయించారు, రానున్న రోజుల్లో మరికొందరు రావచ్చు.

    తెలుగు దేశం పార్టీ పరిస్థితి కూడా అంత సజావుగా, వుత్సాహంతో, వుద్వేగంతో వురకలు వేసే పరిస్థితి వుండదు.కేంద్రంతో ముడిపడిన వ్యాపార లావాదేవీలు వున్నవారు దానితో వైరం తెచ్చుకొనేందుకు సుతరామూ అంగీకరించరు. రెండవది చంద్రబాబు నాయుడు అప్పుచేసి పప్పుకూడు అన్న పద్దతుల్లో రాజధాని అమరావతిని కూడా అప్పులతో నిర్మించేందుకు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. ఇంతవరకు ఏ రాష్ట్ర రాజధాని నిర్మాణం కూడా అలా జరగలేదు.ఒక వేళ ఆ ప్రాంత భూములన్నీ తాకట్టు పెట్టి లేక భారీ రాయితీలు ఇచ్చో విదేశీ సంస్దల నుంచి అప్పు తెచ్చుకోవాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. లక్షల వుద్యోగాలు సృష్టించలేకపోయినా కనీసం రాజధాని నిర్మాణం చేయకుండా వచ్చే ఎన్నికలలో ఓటర్ల ముందుకు పోలేరు. చంద్రబాబు మరొకసారి విశ్వసనీయత సమస్యను ఎదుర్కోవటం స్పష్టంగా కనిపిస్తోంది.

     ఈ పూర్వరంగంలో ఏదో ఒక దారి లేదా సాకు వెతుక్కొని బిజెపి, కేంద్రంతో సర్దుకు పోదాం లెండి అన్నట్లు ఎన్నికల ముందు వరకు లొంగి పోవటం ఒక మార్గం. చంద్రబాబును అపర చాణక్యుడు అంటారు కనుక అప్పటి పరిస్థితిని బట్టి ఏదారి పట్టాలో నిర్ణయించుకోవటం ఒకటి.లేదూ తెగేదాకా లాగితే తెలుగు దేశం పార్టీ సంగతి తేల్చటానికి బిజెపి వెనుకాడదు. కాంగ్రెస్‌ బాటలోనే అది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వెనుకాడదు అని ఇప్పటికే రుజువు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఫిరాయింపు జనాలతో నిండి వుంది. అలాంటి వారికి మరొక జంప్‌ చేయటం కష్టం కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చాం.అది సాధ్యం కాదని తేలిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి మద్దతు ఇస్తున్నాం అని చెప్పటానికి ఎలాంటి జంకూ గొంకూ వుండదు. తొలిసారి తప్పు చేసినపుడు సిగ్గు పడతారేమో గాని తరువాత అలవాటుగా మారిపోతుంది. అధికారానికి బానిసలుగా మారితే ఎంతకైనా తెగిస్తారు.

     చంద్రబాబు ముందున్న మరొక మార్గం జనానికి వాస్తవాలు చెప్పి విశ్వసనీయత కల్పించుకొని వారి మద్దతు పొందటానికి ప్రయత్నించటం. చంద్రబాబు చాణక్యంలో ఇంతవరకు అలాంటి అధ్యాయం లేదు. చిత్రం ఏమంటే ఏది జరిగినా చంద్రబాబు, తెలుగుదేశం బలహీనపడే పరిస్థితులను స్వయంగా సృష్టించుకున్నారు. రెండో మార్గాన్ని అనుసరించితే కనీసం కొంత మంది సానుభూతి అయినా పొందవచ్చు.

      రాష్ట్రంలో బిజెపి కూడా మునుపటి మాదిరి లేదు. కేంద్రంలో ఎవరి దయా దాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు తప్ప రాష్ట్రంలో బలపడటానికి దానికి మరొక మంచి అవకాశం లేదు, రాదు. ఇప్పటికే రెండు సంవత్సరాలు వృధా అయిందనే తొందర వారిలో కనిపిస్తోంది. ఆ పార్టీలో సాంప్రదాయ ఆర్‌ఎస్‌ఎస్‌ రక్త సంబంధీకులే కాకుండా, కొత్తగా కాంగ్రెస్‌ రక్తం కూడా కలిసింది. వుపయోగించుకోవటం, లాభం లేదనుకున్నపుడు వదలి వేసిన గత అనుభవాల రీత్యా చంద్రబాబు నాయుడు వారికి నమ్మదగిన స్నేహితుడు కాదు. అన్నింటికీ మించి మర్రి చెట్టు నీడన మరొక మొక్క ఎదగదు అన్నట్లు తెలుగు దేశం నీడలో బిజెపి పెరగటం అసాధ్యం అని రెండు సంవత్సరాల అనుభవం వారికి నేర్పింది. అందువలన తమకు లొంగిపోయి అధికారంలో మరింత వాటా పెడితే సరి లేకపోతే తెలుగుదేశం మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యం లేదు. అధికారం ఎంతపని అయినా చేయిస్తుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ప్రత్యేక రాజకీయ పరిస్థితులకు నాంది పలికింది. ఇది ఏ మలుపు తిరుగుతుందో, రాష్ట్ర రాజకీయాలను ఎటు మళ్లిస్తుందో , ఏ ప్రస్తానానికి దారితీస్తుందో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: