• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: cotton farmers

చైనా రైతాంగానికి పత్తి ధర ఎక్కువ-పాకిస్ధాన్‌ కంటే మన దగ్గర తక్కువ !

11 Friday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, cotton farmers, Narendra Modi, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది పత్తికి మంచి ధర వచ్చిందని రైతులు సంతోషపడ్డారు. వివిధ కారణాలతో పంట దిగుబడి తగ్గింది, ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. కనుక ధర పెరిగినా రైతులకు సంతోషం లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గణనీయంగా ధరలు పెరిగాయి. ఇప్పుడున్న ధరలు వచ్చే ఏడాది ఉంటాయనే సూచనలు లేవు. తాజా మార్కెట్‌ సమాచారం ప్రకారం అమెరికా ముందస్తు మార్కెట్‌లో మార్చి నెలలో ఒక పౌండు(454 గ్రాములు) దూది ధర 125.66 సెంట్లు(ఒక డాలరుకు వందసెంట్లు)గా ఉంది. మే నెలలో 123.20, వచ్చే ఏడాది జూలైలో 120.51, అక్టోబరులో 109.75, డిసెంబరులో 105.27 సెంట్లుగా ఉంది. ఉత్పత్తి, గిరాకీ, వినియోగం తదితర అంశాల ఆధారంగా అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌ శక్తులు ధరలను నిర్ణయిస్తాయి.


న్యూయార్క్‌ ముందస్తు మార్కెట్లో మార్చినెల ధర 115 నుంచి 127 సెంట్ల వరకు పెరిగింది. చైనాలో 160-163 సెంట్ల మధ్యఉంది. మన దేశంలో నాణ్యమైన పొడవు పింజరకం శంకర్‌ – 6రకం ధర 126 నుంచి 133 సెంట్లకు పెరిగింది. పాకిస్ధాన్‌లో 127 నుంచి 140 డాలర్లకు పెరిగింది. పంజాబ్‌ ఒక మండ్‌ (37.324కిలోలు) ధర ఎనిమిదివేల రూపాయలకు అటూ ఇటూగా ఉంది. అదే పాకిస్థాన్‌లో రు.8,900 వరకు ఉంది. పత్తి పండించే ప్రధాన దేశాలన్నింటినీ పోల్చినపుడు మన దేశంలోనే ధరలు తక్కువగా ఉన్నాయి. మార్కెట్‌ ధరలను బట్టే రైతులకూ చెల్లింపు ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఎగుమతులకు డిమాండ్‌ ఉండటంతో నూలు మిల్లర్లు ఎగబడి కొనుగోలు చేశారు.


అమెరికా వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం ప్రపంచ పత్తి ఉత్పత్తి 8,03,000 బేళ్లు తగ్గి 120.2 మిలియన్‌ బేళ్ల వద్ద ఉంది. ఇదే సమయంలో మిల్లు వినియోగం 1,86,000 పెరిగి 124.4మి.బేళ్లని పేర్కొన్నది.2021-22 88.7మి.బేళ్ల నిల్వలతో ప్రారంభమై 84.3మి.బేళ్లతో ముగియనున్నట్లు అంచనా వేసింది. ఈ కారణంగానే ప్రపంచమంతటా పత్తి ధరలు పెరిగాయి. భారత్‌లో ఐదులక్షల బేళ్లు తగ్గి ఉత్పత్తి 27మి.బేళ్లుగా ఉందని అమెరికా పేర్కొన్నది.ప్రపంచంలో పత్తి దిగుమతులు 46.4 మి.బేళ్లని, చైనా దిగుమతులు రెండున్నర లక్షలు తగ్గి 9.5మి.బేళ్లు దిగుమతి ఉంటుందని పేర్కొన్నది. వివిధ దేశాల్లో పత్తి చేతికి వచ్చే తరుణం ఒకే విధంగా లేనందున అంతిమంగా లెక్కల ఖరారులో అంకెలు మారతాయి. మన దేశంలో ధరలు పెరుగుతున్న కారణంగా ధనిక రైతులు మరింతగా పెరుగుదలను ఆశించి మార్కెట్‌కు పూర్తిగా తీసుకురావటం లేదని వ్యాపారులు చెబుతున్నారు.చెనాలో కూడా ఇదే పరిస్ధితి ఉంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగి గిరాకి తగ్గినందున పత్తి ధరలు అదుపులో ఉన్నాయని లేనట్లయితే మరికొంత పెరిగేవన్నది ఒక అభిప్రాయం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ధరలు పెరిగినందున 2022-23లో ప్రపంచమంతటా సాగు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు.


స్ధానికంగా ఉత్పత్తి తగ్గటం, మిల్లు డిమాండ్‌ పెరగటంతో ఈ ఏడాది మన పత్తి ఎగుమతులు పెద్దగా లేవు. దాంతో సాంప్రదాయంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దేశాలు వేరే మార్కెట్లనుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం నుంచి పరిమితంగా బంగ్లాదేశ్‌కు ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక పౌను ధర 135 సెంట్ల వరకు ఉంది. గతేడాది మన దేశం 78లక్షల బేళ్లను ఎగుమతి చేయగా ఈ ఏడాది 40లక్షల వరకు ఉండవచ్చని అంచనా.గతేడాది పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పదిశాతం దిగుమతి పన్ను విధించింది. పన్ను ఎత్తివేస్తే పెద్ద మొత్తంలో దిగుమతులు పెరిగి స్ధానిక ధరలు పడిపోయి ఉండేవి. దిగుమతి పన్ను ఎత్తివేయాలని మిల్లర్లు వత్తిడి తెస్తున్నారు. ముడిసరకుల ధరలు పెరుగుతున్నందున పత్తిపై దిగుమతి పన్ను రద్దుతో పాటు దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను తొలగించాలని కోరుతున్నారు.


వ్యాపారుల అంచనా ప్రకారం సెప్టెంబరు 30తో ముగిసిన పత్తి సంవత్సరంలో గతేడాది కంటే పదిలక్షల బేళ్లు తగ్గింది. ఉత్పత్తి 350లక్షల బేళ్లకు అటూ ఇటూగా ఉంటుండగా ప్రతి ఏడాది 40-45లక్షల బేళ్లు వినియోగానికి పనికి రాదని, ఈ ఏడాది ఈ సమస్యతో పాటు దిగుబడి తగ్గిందని, గతేడాది అక్టోబరు ఒకటిన కాండీ ధర 43,300ఉంటే జనవరికి 57వేలకు తరువాత 80వేలకు చేరినట్లు దక్షిణాది మిల్లుల ప్రతినిధి రవిశామ్‌ చెప్పారు.పన్నులేని పత్తిని 30లక్షల బేళ్ల వరకు దిగుమతికి అనుమించాలని అన్నారు. ఈ ఏడాది ధరల కారణంగా వచ్చే సంవత్సరం పత్తి సాగు 20-25శాతం పెరగవచ్చని కాటన్‌ అసోసిఏషన్‌ పేర్కొన్నది. పొడవు పింజ రకాలకు కనీస మద్దతు ధర 25శాతం, ఇతర రకాలకు 3-5శాతం మాత్రమే పెంచాలని మిల్లుల వారు చెబుతున్నారు.2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మధ్యరకం పింజరకాల మద్దతు ధరను క్వింటాలుకు రు.5,726, పొడవు పింజకు రు.6,025గా నిర్ణయించింది. ఇవి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రు.211, 200 ఎక్కువ.


ఈ ఏడాది పత్తి మార్కెట్‌ ధరలతో పోల్చి చూస్తే కనీస మద్దతు ధరలు తక్కువే అన్నది స్పష్టం. అవి సాగు ఖర్చులను ప్రతిబింబించటం లేదు. ఈ ధరలను కూడా ప్రకటించటానికి వీల్లేదని మన సహజభాగస్వామిగా నరేంద్రమోడీ వర్ణించిన అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్దలో మన దేశం మీద కేసులు దాఖలు చేశాయి. వాటిని సంతుష్టీకరించేందుకు గాను కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు మోడీ సర్కార్‌ మొరాయిస్తున్నది. అసలు మొత్తంగా ఎంఎస్‌పిని నీరు గార్చేందుకు మూడు సాగు చట్టాలను తెచ్చి రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు పూనుకున్న అంశం తెలిసిందే. అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలతో మనతో పాటు చిన్న దేశాలైన ఆఫ్రికన్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది.2020 లెక్కల ప్రకారం ప్రపంచ పత్తి ఎగుమతుల్లో అమెరికా వాటా 35శాతం. అక్కడ జరిగే ఉత్పత్తిలో 85.6శాతం ఎగుమతులు చేస్తున్నది. అందువలన తనకు పోటీ వచ్చే మనవంటి దేశాలను దెబ్బతీసేందుకు అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో దాడి చేస్తున్నది. కనీస మద్దతు ధర నిర్ణయాన్ని సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నది. నిజానికి మార్కెట్లో అంతకంటే ఎక్కువ ధరలు ఉన్నపుడు ప్రభుత్వ సంస్ధ సిసిఐ కొనుగోళ్లు జరపటం లేదు. జరిపినా ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తున్నది తప్ప కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బోనస్‌ ఇవ్వటం లేదు.


అమెరికాలో ఒక్కొక్క పత్తి రైతుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ 1,17,494 డాలర్లు కాగా మన దేశంలో ఇస్తున్న పరోక్ష సబ్సిడీ కేవలం 27డాలర్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ఇవ్వకూడదని వత్తిడి తెస్తోంది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం మద్దతు ధర, మార్కెట్లో దాని కంటే రైతులకు తక్కువ వస్తే ఆ మేరకు ప్రభుత్వం లెక్క కట్టి నగదు చెల్లిస్తుంది. అదిగాక రైతులకు సబ్సిడీలతో కూడిన రుణాలు, బీమా సబ్సిడీ, నేరుగా ఇచ్చే రాయితీలు ఇలా ఉన్నాయి.1995-2020 సంవత్సరాలలో 40.10బిలియన్‌ డాలర్లు సబ్సిడీల రూపంలో చెల్లించారు. రైతులకు జిన్నింగ్‌ ఖర్చు తగ్గించే పేరుతో 3.16 బిలియన్‌ డాలర్లు ఇచ్చారు. ఈ సబ్సిడీల కారణంగా ప్రపంచంలో పత్తి ధరలు పతనమయ్యాయి.1995లో పౌను పత్తి ధర 98 సెంట్లు ఉండగా 2001లో 48 సెంట్లకు తగ్గి 2020లో 70 సెంట్లు ఉంది. అంటే పాతిక సంవత్సరాల్లో మొత్తంగా పత్తి ధరలు తగ్గాయి. ఎగుమతులపై ఆధారపడిన అమెరికాలో ఏ పత్తి రైతూ బలవన్మరణానికి పాల్పడిన ఉదంతాలు లేవు.


అమెరికా ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని 2003 నుంచి అనేక దేశాలు వత్తిడి చేస్తున్నా ఫలితం కనిపించటం లేదు.1986-88లో ఉన్న సబ్సిడీల ఆధారంగా ఇప్పటికీ సబ్సిడీలను లెక్కిస్తున్నారు. అమెరికా తన సబ్సిడీలను డాలర్లలో చెబుతుండగా మన సబ్సిడీలను రూపాయల్లో లెక్కించి చూశారా ఎంత ఎక్కువ ఇస్తున్నారో అని కేసులు దాఖలు చేశారు. నాడు మన దేశంలో కనీస మద్దతు ధర అంతర్జాతీయ ధరల కంటే తక్కువగా ఉంది.1986-88 మధ్య తమ పత్తి సబ్సిడీ 2,348 మి.డాలర్లని గాట్‌ చర్చల్లో అమెరికా చెప్పింది. కానీ 1986లో 1,702 మి.డాలర్లని దాన్నే ప్రమాణంగా తీసుకోవాలని తొండి చేస్తోంది. ఈ తప్పుడు లెక్కల కారణంగా 19బి.డాలర్లు అదనంగా ఇచ్చిన సొమ్మును దాచి పెడుతోంది. ఈ వివాదం ఇంకా తేలలేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధను, అమెరికా వంటి ధనిక దేశాలను సంతృప్తిపరచేందుకు మోడీ సర్కార్‌ చూపుతున్న శ్రద్ద మన రైతాంగం మీద కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

08 Friday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

CCI, Cotton Corporation of India, cotton farmers, Cotton MSP, cotton subsidies


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం ఉద్యమం సాగిస్తున్నది. రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ తీరును గమనించి ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శనకు రైతులు సన్నద్దం అవుతున్నారు.వారికి వ్యతిరేకంగా పాలకులు, కార్పొరేట్‌లు, వత్తాసుగా వాస్తవాలను మూసిపెట్టాలని గోడీ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.మూసిపెడితే పాచిపోతుందన్నది తెలిసిందే. వాస్తవాలను వక్రీకరిస్తున్నకొద్దీ ఏదో ఒక రూపంలో కొన్ని అంశాలైనా వెలుగు చూస్తున్నాయి. కేంద్రం ఎందుకు మొండిగా ఉందన్న చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది.


ఉపాధి కల్పిస్తున్నాయనే పేరుతో కార్పొరేట్లకు పాలకులు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు వాటికి రక్షణ కల్పించాలంటూ విదేశీ దిగుమతులపై పన్నులు, ఇతర ఆంక్షలతో కాపు కాస్తున్నారు. నిజంగా మేలు జరిగితే ఇవ్వండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాకులను కొట్టి గద్దలకు వేయవద్దని చెప్పటం తప్పు కాదు కదా ! చైనా నుంచి దిగుమతుల మన కొర్పొరేట్లు, పారిశ్రామికవేత్తల లాభాలకు గండిపెడుతున్నాయంటూ అనేక ఉత్పత్తులను నిలిపివేశారు. దానికి గాల్వాన్‌ లోయ ఉదంతాన్ని సాకుగా చూపి దేశభక్తి మేకప్‌ వేశారు. చైనా ఉత్పత్తులు నరేంద్రమోడీ హయాంలో ఇబ్బడి ముబ్బడి అయ్యాయన్నది వేరే విషయం. కరోనాకు ముందే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు దిగజారటం ప్రారంభమైంది. నిలకడగా ఉన్నది వ్యవసాయ రంగమే. దాన్నుంచి లాభాలు పిండుకోవాలన్న కార్పొరేట్ల కన్ను పడింది కనుకనే వ్యవసాయ చట్టాలను సవరించారు. రైతుల ఉత్పత్తులకు ఆంక్షలు లేని స్వేచ్చా మార్కెట్‌ కబుర్లు చెబుతున్నారు. అన్ని రక్షణలు ఉన్నకారణంగానే కార్పొరేట్‌లు ఎక్కడా రోడ్ల మీద కనిపించరు.నోరు మెదపరు. రైతులు మాత్రం వీధులకు ఎక్కాల్సి వస్తోంది. గళం విప్పక తప్పటం లేదు.


వరుసగా రైతులకు ఉన్న రక్షణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్లకు లేని ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు రైతుల విషయాలకు మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల పేరుతో 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 50శాతం ఉన్న పన్నును తగ్గించి కేవలం 15శాతంతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువకే గిట్టుబాటు అవుతున్న కారణంగా వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపున మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు మన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు బంగ్లాదేశ్‌కు మన వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 కాగా ఎగుమతి ద్వారా తాము 1500 నుంచి 1550వరకు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు వివిధ రాష్ట్రాలలో రైతుల నుంచి 12 నుంచి 1400 మధ్య కొనుగోలు చేస్తున్నారు(డిసెంబరు 25 మనీకంట్రోలు వార్త). దేశమంతటా ఇదే స్ధితి, ఏ ఒక్క ప్రయివేటు వ్యాపారీ వచ్చి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. ఏ రైతూ తన పంటను పరాయి రాష్ట్రాలకు తీసుకుపోయి తనకు గిట్టుబాటు ధరకు అమ్ముకొనే పరిస్దితీ లేదు. ఎగుమతి చేస్తున్నా ధరలు రావటం లేదన్నది చేదునిజం.


2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో 2019 ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం మొక్కజొన్నలు, గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు.చైనా నుంచి వస్తున్న పారిశ్రామిక వస్తువులకు అది వర్తించదా ? రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? పప్పుధాన్యాల రైతులను ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెబుతారు. మరోవైపు వాటి మీద ఉన్న దిగుమతి పన్నును 30 నుంచి 20శాతానికి తగ్గించారు.అది విదేశీ రైతులకు ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా విదేశీ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై పన్ను పదిశాతం తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఉనికిలోకి రాక ముందు ఉనికిలో ఉన్న పన్నులు, వాణిజ్యాలపై సాధారణ ఒప్పందం(గాట్‌) ఉరుగ్వే దఫా చర్చలకు ముందు వ్యవసాయం లేదు. ఆ దఫా చర్చలలోనే ముందుకు తెచ్చారు. దాని ప్రకారం ధనిక దేశాలు తమ రైతాంగానికి ఇచ్చే ఎగుమతి రాయితీలు, సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలి. ఇదే సమయంలో మిగిలిన దేశాలు దిగుమతులపై ఉన్న పన్నులు, ఇతర ఆంక్షలను ఎత్తివేయాలి, విదేశాలకు మార్కెట్లను తెరవాలి, రైతాంగానికి మద్దతు ధరల, ప్రజాపంపిణీ వ్యవస్దలను నిలిపివేయాలి. అయితే అమెరికా, ఐరోపా యూనియన్‌ ధనిక దేశాలు గ్రీన్‌ బాక్స్‌ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. మిగతా దేశాలు ఒప్పందాన్ని అమలు చేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ వివాదమే గత రెండు దశాబ్దాలుగా దోహా దఫా ఒప్పందం కుదరకపోవటానికి కారణం.


బిల్‌క్లింటన్‌ హయాంలో రైతాంగానికి 1530 కోట్ల డాలర్ల మొత్తాన్ని నేరుగా అందించారు. ఎలా అంటే టన్ను సోయా ధర మార్కెట్లో 155 డాలర్లు ఉంటే ప్రభుత్వం 193 డాలర్లు చెల్లించింది. వాటిని మన వంటి దేశాలకు ఎగుమతి చేయటంతో మన రైతాంగం నాశనమైంది. అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా వత్తిడికి లొంగిపోయి 2001లో 719 వస్తువులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు. గత ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా రైతులకు 4600 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇచ్చాడు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం బడా రైతులకు, కార్పొరేట్లకు చేరాయన్నది మరో అంశం. ఒక శాతం కంపెనీలు 26శాతం పొందితే, పదిశాతం పెద్ద బడా రైతులు, కంపెనీలకు 78శాతం దక్కాయి.


తాజాగా డిసెంబరు చివరి వారంలో ప్రపంచ పత్తి సలహా కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క పత్తికే 2018-19లో వివిధ దేశాలు ఇచ్చిన పలు రకాల రాయితీల మొత్తం 570 బిలియన్‌ డాలర్ల నుంచి 2019-20లో ఈమొత్తం 800కోట్ల డాలర్లకు పెరిగింది.గడచిన నాలుగు సంవత్సరాలలో పత్తి ధరలు తగ్గిన కారణంగా సబ్సిడీల మొత్తం 450 నుంచి 800 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలలో గరిష్టంగా 1,700 కోట్లు చెల్లించిన రికార్డు ఉంది.2010-11 సంవత్సరాలలో ప్రపంచ పత్తి మార్కెట్లో ధర పౌండుకు(454 గ్రాముల గింజలు తీసిన దూది) 165 సెంట్లు పలకగా 2019-20లో 72సెంట్లకు తగ్గింది. ప్రస్తుతం 80 సెంట్లకు అటూ ఇటూగా కదలాడుతోంది.2019-20లో వివిధ దేశాలు ఇచ్చిన రాయితీల మొత్తాలు ఇలా ఉన్నాయి. ఆయా దేశాల పత్తి ఉత్పత్తిని సబ్సిడీ మొత్తాలతో భాగిస్తే సెంట్ల వారీ చూస్తే కొన్ని దేశాల స్ధానాలు మారతాయి.
దేశం×× కోట్ల డాలర్లు ×× పౌనుకు సెంట్లలో
చైనా×××× 471.1 ××××× 37
అమెరికా×× 202.2 ××××× 21
భారత్‌×××× 59 ××××× 4.4
టర్కీ ×××× 23.2 ××××× 13
గ్రీస్‌ ××××× 20.7 ××××× 32
మాలి ×××× 8.2 ××××× 12
స్పెయిన్‌ ××× 6.7 ××××× 46
కోట్‌ డి ఐవరీ × 3.8 ××××× 13
బుర్కినాఫాసో×× 2.4 ××××× 6
మన దేశ సబ్సిడీ విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన పత్తికి చెల్లించిన మొత్తం- దాన్ని తిరిగి మిల్లర్లకు లేదా ఎగుమతులు చేయగా వచ్చిన మొత్తాలకు ఉన్న తేడాను సబ్సిడీగా పరిగణిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలలో సిసిఐ నామ మాత్రపు కొనుగోళ్లు జరిపింది. కొన్ని సంవత్సరాలలో దానికి ఎలాంటి నష్టాలు లేవు. అందువలన దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే సబ్సిడీ అసలు లేనట్లే అని చెప్పవచ్చు. ఉదాహరణకు 2017-18 పత్తి సంవత్సరంలో సిసిఐ 66,313 టన్నులు కొనుగోలు చేయగా 2018-19లో 1,81,970 టన్నులు, 2019-20లో (గడచిన ఐదేండ్లలో రికార్డు స్ధాయిలో) 17.9లక్షల టన్నులు సిసిఐ కొనుగోలు చేసింది. 2018-19లో సిసిఐకి వచ్చిన నష్టం 4.6 కోట్ల డాలర్లు, కాగా 2019-20లో 2020 నవంబరు నాటికి 12లక్షల టన్నులు విక్రయించగా మిగిలిన మొత్తం నిల్వ ఉంది. అయితే అమ్మినదాని మీద వచ్చిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తంగా నష్టం 59 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంస్ద తన నివేదికలో పేర్కొన్నది. దీన్ని సబ్సిడీగా పరిగణించింది.నిజానికి దీన్ని పత్తి రైతులకు ఇచ్చిన సబ్సిడీగా పరిగణించాలా లేక మిల్లర్లకు, ఎగుమతులకు ఇచ్చిన రాయితీలు మరియు సిసిఐ అవినీతి, అక్రమాల మొత్తంగా చూడాలా ?


పత్తితో పాటు ఇతర కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలను సబ్సిడీలుగా అమెరికా తదితర దేశాలు పరిగణిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసులు దాఖలు చేశాయి. ఆ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఓయిసిడి సంస్ధ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ ధనిక దేశాల రైతాంగ ఆదాయాల్లో 40 నుంచి 65శాతం మొత్తాలు ఆయా ప్రభుత్వాలు అందచేస్తున్న సబ్సిడీల ద్వారా సమకూరుతున్నవే.
ఈ ఏడాది పత్తి రైతాంగం కనీస మద్దతు ధరలను పొందటం లేదని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో క్వింటాలుకు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయవరకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా సిసిఐ కేంద్రాలకు పెద్ద మొత్తంలో పత్తి వస్తోంది. కొనుగోలును తగ్గించేందుకు అనేక నిబంధనలు పెట్టటంతో పాటు పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకు రావద్దని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు ( ప్రతి ఏటా అక్టోబరు ఒకటవ తేదీన పత్తి సంవత్సరం ప్రారంభమై మరుసటి ఏడాది సెప్టెంబరులో ముగుస్తుంది) కొనుగోళ్లు జరుపుతూనే ఉంటామని సిసిఐ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సాధ్యమేనా ? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా ? పంజాబ్‌లో ప్రతి రోజూ మండీలకు 50వేల క్వింటాళ్ల పత్తి వస్తుంటే తాము రోజుకు పన్నెండున్నరవేలకు మించి కొనుగోలు చేసేది లేదని సిసిఐ చెబుతున్నదని ప్రయివేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదలి వేస్తున్నదని అకాలీదళ్‌నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులు భయపడుతున్నది న్యాయమే అని ఈ పరిణామం వెల్లడిస్తున్నదన్నారు.

పత్తికి కనీస మద్దతు ధరలు ఉంటాయని తెలిసిన రైతాంగం 25శాతంలోపే అని, ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో వారు 12 నుంచి 27శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. తెలిసిన వారిలో కూడా 34.34 నుంచి 37.5 శాతం మాత్రమే సేకరణ సంస్ధలకు విక్రయిస్తున్నారని తేలింది. అందుకే కాస్త ఎక్కువ తెలిసిన ప్రాంతాల రైతులు ముందుగా మేలుకున్నారు, తెలియని వారు తెలుసుకొని రంగంలోకి దిగుతారు. వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఒరగబెడతామని చెబుతున్న పాలకులు, వారికి వంత పాడుతున్న మేధావులూ ఈ అంశాల గురించి ఏమంటారో !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విత్తన స్వాతంత్య్రం- అధిక దిగుబడుల ఆవశ్యకత !

08 Wednesday Jul 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Telangana

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, farmers seeds rights


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

రైతాంగం పూర్తి స్ధాయిలో వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగమయ్యారు. విత్తన స్వాతంత్య్రం కోల్పోయిన రైతాంగం విదేశీ కంపెనీల మీదనే ప్రధానంగా పత్తి విత్తనాల కోసం ఆధారపడక తప్పటం లేదు. బీటీ విత్తనాలు పురుగును రాకుండా చేస్తాయని మార్కెట్‌ లోకి 2002లో ప్రవేశించి ఇపుడు మార్కెట్‌ ను పూర్తిగా శాసిస్తున్నాయి. పత్తి రైతులు 95 శాతం బీటీ విత్తనాలనే వాడుతున్నారు. విదేశీ ఎంఎన్‌సీలతో కాంట్రాక్టు కుదుర్చుకున్న జాతీయ కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. 2019లో 354 లక్షల బేళ్ళ పత్తిని పండించారు.
ప్రపంచంలో హెక్టారుకు 109 కిలోలకు మించి దిగుబడులతో పత్తి పండించే దేశాలు 77 ఉన్నాయి. మరికొన్నింటిలో పండించినప్పటికీ దిగుబడి అతి తక్కువగా ఉన్నందున పరిగణనలోకి తీసుకోవటం లేదు. వాటిలో ఆస్ట్రేలియా 2,056 కిలోలతో దిగుబడిలో ప్రధమ, 1,905 కిలోలతో ఇజ్రాయెల్‌, 1,748 కిలోలతో చైనా ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నాయి. 623కిలోలతో పాకిస్ధాన్‌ 32వ, 496కిలోలతో మన దేశం 36వ స్ధానంలో ఉంది. ప్రపంచ సగటు 765 కిలోలు. దీని కంటే ఎక్కువ దిగుబడులు 17దేశాలలో వస్తున్నాయి.
అనేక దేశాల మాదిరి హై డెన్సిటీ ప్లాంటింగ్‌ చేసి సూటిరకాల విత్తనాలను వాడుతూవుంటే పత్తి సగటు ఉత్పత్తిలో ప్రపంచంలోనే ముందుండేవాళ్ళం. రైతుల ఆదాయం పెరిగేది. మన దేశ శాస్త్రజ్ఞులు, పాలకులు , రైతులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒక్క భారతదేశంలోనే హైబ్రిడ్‌ విత్తనాలతో వ్యవసాయం చేస్తున్నారు. అమెరికా , బ్రెజిల్‌, చైనా తో సహా ప్రపంచంలో పత్తి పండించే దేశాలన్నీ హైబ్రిడ్‌ విత్తనాలతో పత్తి పండించటంలేదు. జన్యుమార్పిడి బీటీ విత్తనాలతో సహా వెరైటీలను అంటే సూటి రకాల విత్తనాలను అంటే పంటనుండి తీసిన విత్తనాలనే కంపెనీలు పేటెంట్‌ చట్టం పేరున రైతులకు అమ్ముతున్నాయి.
మన దేశంలో హైబ్రిడ్‌ విత్తనాల తయారీని మోన్సాంటో, బేయర్స్‌ లాంటి కంపెనీలు ప్రోత్సహించాయి. అపార లాభాలను పొందాయి. ప్రతి సంవత్సరం తన విత్తనాలను అమ్ముకోవటానికి కంపెనీల దుష్ట ప్రణాలిక వలన రైతులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. 1.విత్తనాల ఖర్చు ఎక్కువ అవుతున్నది,2. పత్తి దిగుబడులు తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నారు.
తన పంటలో మంచి గింజలను గుర్తించి తరువాత విత్తనాలుగా వాడే అలవాటును మెల్లగా మాన్పించి హైబ్రిడ్‌ విత్తనాలను అలవాటు చేశారు. నాణ్యమైన హైబ్రిడ్‌ విత్తనాలను తయారుచేసిస్తామన్నారు. ఆ టెక్నాలజీ వేరన్నారు. 50 పత్తి గింజలను తెచ్చి మన దేశంలో మన చేతనే మల్టిప్లై చేయించి, మన మొక్కలతో సంకరం చేసి, అందమైన పాకింగ్‌ చేయించి, ప్రచారార్భాటాలతో రైతులచే కొనిపిస్తున్నారు. ఆడ మొగ మొక్కలను వేరుగా పెంచి , మొగచెట్ల పుప్పొడిని ఆడ మొక్కల పూవులపై అంటించి క్రాస్‌ (సంపర్కం) చేయాలి. మన దేశంలో చౌకగా వున్న బాల కార్మికులతో క్రాసింగ్‌ జరిపించి హైబ్రిడ్‌ విత్తనాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. విత్తన ఉత్పత్తికి కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల వాతావరణం అనుకూలంగా ఉండటంతో అక్కడనుండే హైబ్రిడ్‌ విత్తనాలు తయారీ అవుతున్నాయి.. అనుకూల వాతావరణం, చౌకగా అందుతున్న బాలకార్మికుల శ్రమ కంపెనీలకు అనూహ్యమైన లాభాలను తెచ్చిపెట్టాయి. దీనికి తోడుగా పేటెంట్‌ చట్టం పేరుచెప్పి తమ అనుమతి లేనిదే మరెవ్వరూ ఆ విత్తనాలను తయారు చేయరాదని కట్టడి చేశారు. పంటకు పురుగులు, చీడ పీడ విరగడౌతుందనీ దిగుబడి పెరుగుతుందనే ఆశతో రైతులు మోన్శాంటో బీటీ విత్తనాలను ఆశ్రయించారు. బీటీ జన్యవును మన పత్తి మొక్కలలోని దేశీయవిత్తనాలలో పెట్టవచ్చని తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్నవారు ధైర్యంచేయలేకపోయారు. మన దేశీయ విత్తనాలు పురుగులను బాగా తట్టుకుంటాయని గ్రహించలేకపోయారు. మోన్సాంటో కంపెనీ గుత్తాధిపత్యాన్నిపొందింది. ఇష్టమొచ్చిన రేటును వసూలు చేసింది. విత్తనాలు తయారుచేసే రైతుకి 250 రూ. ఇచ్చి 750 గ్రాములవిత్తనాలను మోన్శాంటో కంపెనీ తీసుకున్నది. పత్తి పండించే రైతుకి 450 గ్రాముల విత్తనాలను 1850 రూ. కి మించి అమ్మింది. ఇది దారుణమని నల్లమడ రైతుసంఘం ప్రచారం చేసింది. 2005 జూన్‌ నెల లో లామ్‌ ఫార్మ్‌ సభ లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి విత్తనాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఈ వ్యాస రచయిత, తేళ్ళ క్రిష్ణమూర్తి, దండా వీరాంజనేయులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆందోళన ప్రారంభించి సదస్సులు, సభలు. ధర్నాలు చేశారు. జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి, కొల్లా రాజమోహన్‌ ఊరూరు తిరిగి రైతులను చైతన్య పరిచారు. రైతునాయకులు కొల్లి నాగేశ్వరరావు, యలమంచిలి శివాజీ, జొన్నలగడ్డ రామారావు, తేళ్ళ క్రిష్ణమూర్తి , కొండా శివరామిరెడ్డి లాంటివారు కదిలారు. ఆ నాటి ముఖ్యమంత్రి శ్రీ వై యసే రాజశేఖరరెడ్డి గారు స్పందించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఎమ్‌ఆర్పీటీయస్‌ లో కేసు వేశారు. మోన్శాంటో కంపెనీ 1850 రూ. పత్తి విత్తనాల పాకెట్‌ ను 750 రూ.కి. తగ్గించకతప్పలేదు. మన దేశంలో బీటీ విత్తనాలపై పేటెంట్‌ లేకపోయినా పేటెంట్‌ వున్నదని దబాయించి రౌడీ మామూలుగా టెక్నాలజీ ఫీజు-రాయల్టీ పేరున వందల వేల కోట్ల రూపాయలను వసూలు చేసుకుంటున్నారు. బీటీ 1 అనీ, బీటీ 2 అనీ, బీటీ 3 అనీ రైతులకు ఆశలు కల్పంచి సొమ్ము చేసుకుంటున్నారు. సూటిరకాల విత్తనాలను సాంద్రతను పెంచి సాగుచేసి అధికదిగుబడులను సాధించటమే దీనికి పరిష్కారం ,
అనేకదేశాలలో, ప్రయోగాలు, పరిశోధనల తర్వాత హై డెన్సిటీ ప్లాంటింగ్‌ అంటే మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. ఎక్కువ మొక్కల వలన ఎక్కువ దిగుబడి వస్తుందనీ, దేశీయ సూటిరకాల విత్తనాలకు పురుగును తట్టుకునే శక్తి ఎక్కువనికూడా అధ్యయనాలు నిరూపించాయి. బలాలు కూడా సగంపెట్టినా దిగుబడి తగ్గదంటున్నారు. బ్రెజిల్‌ లాంటి దేశాలు లాభపడ్తూఉండగా మనం మోన్సంటో, బేయర్‌ కంపెనీల మాటలు విని వారికి లాభాలు చేకూర్చేవిధంగా హైబ్రిడ్‌ విత్తనాలనే ఎందుకు వాడుతున్నామో ఆలోచించాలి.
బ్రెజిల్‌, చైనా, అమెరికా, భారతదేశాలలో ప్రయోగాలు చేశారు. ఒక ప్రయోగంలో హెక్టరుకు 1500 నుండి 1,05,000 మొక్కల వరకూ 6 ప్లాట్లుగా పెంచారు. మెపిక్వాట్‌ క్లోరైడ్‌ అనే గ్రోత్‌ రెగ్యులేటర్‌ మందును ఉపయోగించి పెరుగుదలను నియంత్రించారు. తక్కువ మొక్కలున్న ప్లాటు తక్కువ దిగుబబడి నిచ్చింది. బాగా ఎక్కువ మొక్కలున్న ప్లాటు లోకి సూర్యరశ్మి, గాలి అందక మరీ ఎక్కువ పత్తినివ్వలేదు. మధ్యస్ధంగా 87,000 మొక్కలున్న ప్లాటు హెక్టారుకు 1682కేజీల లింటు కాటన్‌( 4546కేజీల సీడ్‌ కాటన్‌) వచ్చింది. నేలను బట్టి, భూసారాన్నిబట్టి, నీటి లభ్యతను బట్టి మొక్కల సంఖ్యను సైంటిస్టులు, అనుభవజ్నులైన రైతులు నిర్ణయించుకుని ఎక్కువ మొక్కలను పెంచి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు.
మన దేశ కాటన్‌ సైంటిస్టులు ఆ దేశాలకు వెళ్ళి హై డెన్సిటీ ప్లాంటేషన్‌ సాగు విధానాన్ని పరిశీలించారు. నాగపూర్‌ కాటన్‌ రీసర్చ్‌ సెంటర్‌ వారు సూరజ్‌ అనే సూటి రకాల వెరైటీని, నంద్యాల కాటన్‌ పరిశోధనా సంస్ధ, దేశీయ 1938 వెరైటీలను అభివధిచేసి రైతులకు ఇచ్చారు. హై డెన్సిటీ ప్లాంటేషన్‌ తో మొక్కల సాంద్రత ను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని ప్రభుత్వ సంస్ధలు ప్రదర్శనాక్షేత్రాలు ఏర్పాటుచేసారు. ప్రత్యమ్నాయంగా దేశీ విత్తనాల సాంద్రతను పెంచి ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని చూపారు. మన దేశరైతులు మోన్సాంటో, బేయర్స్‌ లాంటికంపెనీల మాటలువిని హైబ్రిడ్‌ విత్తనాలనే వాడుతున్నారు. మన పొలంలో మన పంట విత్తనాలను ఎక్కువగా నాటి ఎక్కువ మొక్కలను పెంచి పత్తి దిగుబడిని అంతర్జాతీయస్ధాయికి తేవచ్చని నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధవారు ప్రయోగాలు చేసి నిర్ధారించారు. ప్రదర్శనాక్షేత్రాలను ఏర్పాటు చేశారు. వారు సరఫరా చేసిన సూరజ్‌ వెరైటీని , నంద్యాల పత్తి పరిశోధనా సంస్ధ ఇచ్చిన వెరైటీలను రైతు రక్షణ వేదిక ప్రొఫెసర్‌ యన్‌ వేణుగోపారావు గారి నాయకత్వాన గుంటూరు జిల్లాలో ప్రచారం చేసింది. వెయ్యికన్నా ఎక్కువ సభ్యులతో సహకార సంస్ధగా ఏర్పడి సూటిరకాల అభివధికి దాదాపు 10 సం.కు పైగా కషిచేసింది. బీటీ వున్న సూటిరకాలుకూడా రైతు రక్షణ వేదిక రైతులు అభివద్దిóచేశారు. తక్కువ వనరులతో విషేషమయిన కషి జరిగింది. కార్పోరేట్‌ కంపెనీల హైబ్రిడ్‌ అనుకూల ప్రచారాల ముందు కొద్దిమంది కషి రైతులను ఉత్తేజపరచలేక పోయింది. నాగపూర్‌ లోని పత్తి పరిశోధనాసంస్ధ, నంద్యాల పరిశోధనాసంస్ధలకు తోడుగా వ్యవసాయశాఖ, వ్యవసాయ విద్యాలయం కదలలేదు. ప్రయోగాలను, పరిశోధనలను కొనసాగించలేదు. రైతు సమాజాన్ని ప్రభావితం చేయగల్గిన నాయకులు సూటి రకాలగురించి, హై డెన్సిటీ ప్లాంటేషన్‌ గురించి పట్టించుకోలేదు. ఫలితంగా మన రైతులు అదిక దిగుబడులద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవటమేకాదు. దేశప్రజల విత్తన స్వాతంత్య్రాన్ని మోన్సాంటో లాంటి కోర్పోరేట్‌ శక్తులకు ధారపోసి దేశసార్వభౌమాధికారానికే ప్రమాదం తెచ్చి పెట్టారు. అంతర్జాతీయ అనుభవాలను మన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. చిన్న రైతులను ఆర్ధికంగా నిలబెట్టినపుడే వ్యవసాయం రక్షించబడతుంది.
రైతు తన పొలంలోనుండి విత్తనాలను తీసుకొని కనీసం మూడు నాలుగు సంవత్సరాలు విత్తుకోవచ్చు. మొక్కల సాంద్రతను పెంచి అధిక దిగుబడిని పొంది , అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సగటు దిగుబడులలో అంతర్జాతీయ స్ధాయిని అందుకోవచ్చు. ఎమ్‌ యన్‌ సీ ల దోపిడీ ని ఎదుర్కొని విత్తన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవచ్చు.
ఈ వ్యాస రచయిత నల్లమడ రైతు సంఘం, రైతు రక్షణ వేదిక నేత, గుంటూరు, ఫోన్‌ 9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తప్పుడు లెక్కలతో పత్తి, చెరకు రైతులకు హాని తలపెట్టిన అమెరికా, ఆస్ట్రేలియా !

06 Thursday Dec 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, cotton subsidies, sugarcane, WTO

Image result for usa, australia stand against india farmers at wto

ఎం కోటేశ్వరరావు

అమెరికా, ఆస్ట్రేలియా వంటి ధనిక దేశాలు దౌత్యపరంగా మనకు మిత్ర దేశాలే. మన యువతీ యువకులు తెల్లారి లేస్తే ఏదో ఒక చోటికి వెళ్లాలని తహతహలాడుతుంటారు. మన పాలకులు అక్కడికి వెళ్లినపుడు, వారు ఇక్కడికి వచ్చినపుడు భారత దేశమా చుట్టుపక్కల 66 దేశాలకు పోతుగడ్డ అన్నట్లుగా మాట్లాడతారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లు, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా తమ దేశాల కార్పొరేట్ల ప్రయోజనాల విషయంలో మనకు ముఖ్యంగా రైతాంగానికి అవి శత్రుదేశాలే. ప్రపంచీకరణ పేరుతో మన పెట్టుబడిదారులు ఇతర దేశాలకు విస్తరించేందుకు, ఇప్పటికే విస్తరించిన బహుళజాతి కంపెనీలతో జత కట్టేందుకు మన పాలకవర్గం ప్రపంచీకరణ పేరుతో వాటికి ప్రాతినిధ్యం వహించే సంస్ధల సలహాలు, ఆదేశాలతో నడుస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే మన పాలకులు ఒక్కొక్క వలువ తీసివేసి చివరకు గోచి మీద నిలబెట్టినట్లు నామ మాత్ర రాయితీలు మిగిల్చాయి. ఇప్పుడు రైతాంగానికి మిగిలిన ఆ గోచిని కూడా తీసేయాల్సిందేనని ధనిక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు ఆ పంచాయతీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో నడుస్తోంది.

అమెరికాాచైనా మధ్య జూలైలో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం గురించి మాత్రమే మనకు తెలుసు. ఆ యుద్దంలో దెబ్బతినే తన రైతాంగానికి ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీలకు తోడు అదనంగా పత్తి, సోయా వంటి అనేక ఎగుమతి పంటలకు 12బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది అమెరికా. అలాంటి దేశం గతంలో వరి, గోధుమలపై ఇప్పుడు మన మీద పత్తి రాయితీలు పరిమితికి మించి ఇస్తున్నారంటూ కనీస మద్దతు ధరకు ఎసరు పెట్టింది. తప్పుడు లెక్కలతో ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)కు ఫిర్యాదు చేసింది. చెరకు రైతులకు, పంచదార ఎగుమతులకు ఇస్తున్న సబ్సిడీలు తమ రైతాంగాన్ని, మొత్తంగా ప్రపంచ పంచదార మార్కెట్‌ను దెబ్బతీశాయంటూ ఆస్ట్రేలియా కూడా అదే పని చేసింది. ఆ వాదన లేదా మనపై దాడికి ప్రాతిపదిక ఏమిటి? మన దేశంలో వున్న విభిన్న వాతావరణ పరిస్ధితుల కారణంగా అటు వుష్ణ మండల పంటలతో పాటు ఇటు శీతల మండల, సమశీతల మండల ప్రాంతాలలో సాగు చేసే పంటలలో కొన్ని మినహాదాదాపు అన్నింటినీ పండించే అవకాశం వుంది. అందుకే మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకు సరఫరా చేసే ప్రాంతంగా పారిశ్రామిక విప్లవం తరువాత ఐరోపా ధనిక దేశాలు గుర్తించాయి. అందుకే ఆక్రమణ పోటీలో బ్రిటన్‌ది పైచేయి అయింది.మారిన పరిస్ధితుల్లో తమ అన్ని రకాల వ్యాపారాలు, వస్తుమార్కెట్లకు మన దేశం అనువుగా వుంది కనుక, భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశం లేదు గనుక మన మార్కెట్‌ను ఆక్రమించుకొనేందుకు, తమకు అనుకూలంగా మన విధానాలను రూపుదిద్దేందుకు పూనుకున్నాయి. అందుకోసం ప్రపంచీకరణ, సరళీకరణ, సంస్కరణలు అంటూ ముద్దుపేర్లను ముందుకు తెచ్చాయి. ప్రస్తుతాంశం వ్యవసాయ సబ్సిడీలు కనుక వాటి గురించి చూద్దాం.

గత రెండు దశాబ్దాలలో మన వ్యవసాయ పెట్టుబడులు కనీసంగా నాలుగింతలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలో వచ్చి జనవరి ఒకటిన 24వ సంవత్సరంలో అడుగిడబోతోంది. ముఫ్పై సంవత్సరాల నాటి లెక్కల ఆధారంగా వర్ధమాన దేశాలకు నిర్ణయించిన పదిశాతం సబ్సిడీ పరిమితిని, వ్యవసాయ వుత్పత్తుల ధరలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు భారత్‌లో సబ్సిడీలు పరిమితికి మించి ఇస్తున్నారని అమెరికా, ఆస్ట్రేలియాలు ఫిర్యాదు చేశాయి. కనీస మద్దతు ధర ఆ నిబంధనను వుల్లంఘించేదిగా వుందని, తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సరే అసలు ఎత్తివేయాలని కూడా మరోవైపు వత్తిడి తెస్తున్నాయనుకోండి. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే మన దేశంలో వుత్పత్తి అయ్యే మొత్తం పత్తి విలువ వెయ్యికోట్ల రూపాయలు అనుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపాయూనియన్‌ వంటి ధనిక దేశాల వాదన ప్రకారం పత్తి మీద సబ్సిడీ మొత్తం విలువలో పదిశాతం అంటే వంద కోట్ల రూపాయలకు మించి ఇవ్వకూడదు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల వందకోట్ల రూపాయలకు మించకూడదు.(ప్రత్యక్షంగా ఇచ్చే సబ్సిడీ మొత్తాలకు, కనీస మద్దతు ధరల సబ్సిడీ అవగాహనకు వున్న తేడా తెలిసిందే) మిగతా పంటలకూ ఇదే సూత్రం. ప్రపంచ వాణిజ్య సంస్ధ వునికిలోకి రాక ముందు దాని విధి విధానాలను రూపొందించే కసరత్తులో భాగంగా 1986-88 సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్లో వున్న సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకొని ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయించారు.

అంకెలతో ఎన్నో గారడీలు చేయవచ్చు. స్వామినాధన్‌ కమిటి సిఫార్సుల ప్రకారం వుత్పాదక ఖర్చుకు అదనంగా సగం కలిపి అంటే 150 గా కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుత్పాదక ఖర్చులో కొన్నింటిని కలపలేదని మనం విమర్శిస్తున్నాం. అంతకంటే ముందే మన మద్దతు ధరలను వ్యతిరేకిస్తున్న అమెరికా ఏమి చెబుతోందో చూద్దాం. మన గోధుమలు, వరికి ప్రకటిస్తున్న మద్దతు ధర పదిశాతం పరిమితికి మించి 60,70 శాతం వుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేశాడు. గాజు కొంపలో కూర్చొని ఎదుటివారి మీద రాళ్లు వేస్తున్నది అమెరికా. మన దేశం వరికి 60శాతం అదనంగా ఇస్తున్నట్లు యాగీ చేస్తున్న ఆ దేశం తన రైతాంగానికి 82శాతం, ఐరోపా యూనియన్‌ 66శాతం ఇస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ సూత్రాల ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతం పరిమితికి సబ్సిడీలు మించకూడదు. అయితే దీన్ని వక్రీకరించి కొన్ని పంటలకు కొన్ని సంవత్సరాలలో విపరీతమైన సబ్సిడీలను ఇచ్చి మొత్తం పంటల విలువకు దాన్ని వర్తింప చేసి ధనిక దేశాలు తప్పించుకుంటున్నాయి. అందుబాటులో వున్న సమాచారం మేరకు కొన్ని సంవత్సరాలలో అమెరికాకు అర్హత వున్న సబ్సిడీ మొత్తం వంద రూపాయలు అనుకుంటే 90రూపాయలను పాలు, పంచదార రైతులకే ఇచ్చింది, అలాగే ఐరోపా యూనియన్‌ 64రూపాయలను గోధుమ, వెన్నకే ఇచ్చింది.

గత ఇరవై ఏండ్లలో ఏడు సంవత్సరాల సమాచారాన్ని చూసినపుడు అమెరికాలో కొన్ని వుత్పత్తులకు వూలు 215, మేక బచ్చుతో చేసే శాలువలకు 141, వరి 82, పత్తి 74, పంచదార 66, కనోలా 61, ఎండు బఠాణీలకు 57శాతం, ఐరోపా యూనియన్‌లో పట్టుపురుగులకు 167, పొగాకు 155, పంచదార 120, కీరా 86, పియర్స్‌ పండ్లకు 82, ఆలివ్‌ ఆయిల్‌ 76, వెన్న 71,ఆపిల్స్‌ 68,పాలపొడి 67,టమాటా 61శాతాల చొప్పున ఇచ్చారు. ఇలా ప్రత్యేకించి ఒక వుత్పత్తికి ఇచ్చిన రాయితీలు సబ్సిడీల పరిధిలో చూపటం లేదు.

మన దేశం 53ా81శాతం మధ్య పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేసిన కొనుగోళ్లను మాత్రమే సబ్సిడీలుగా భారత్‌ చూపుతున్నది.2015ా16లో 120 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రపంచ వాణిజ్య సంస్ధకు భారత్‌ తెలిపిందని అయితే 50,400 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అమెరికా ఆరోపించింది. అంటే మొత్తం పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్లు చిత్రించింది. పంచదారను ప్రభుత్వం సేకరించే విధానం లేనప్పటికీ మద్దతు ధర నిర్ణయించటమే సబ్సిడీ చెల్లించటంగా ఆస్ట్రేలియా ఆరోపించింది. తాము నిర్ణయిస్తున్న మద్దతు ధరలను డబ్ల్యుటిఓ ఏర్పాటుకు ముందు 1986ా88 నాటి ధరలతో పోల్చి ఎక్కువగా వుంటున్నట్లు అమెరికా తప్పుడు లెక్కలు వేస్తోందని మన దేశం గతంలోనే సమాధానమిచ్చినా ఖాతరు చేయకుండా ఫిర్యాదు చేశారు. భారత్‌ డాలర్లలో లెక్కలు వేస్తుంటే అమెరికన్లు భారతీయ కరెన్సీలో గుణిస్తున్నారని అందువలన ఇరు దేశాలు చెప్పేదానికి పొంతన వుండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1990లో ఒక డాలరుకు 18 రూపాయలుండగా ఇప్పుడు 72 తాకింది. అందువలన రూపాయల్లో లెక్కవేసినపుడు నాలుగు రెట్లు ఎక్కువగా కనిపించటం సహజం. భారత, చైనా వంటి దేశాల వ్యవసాయ సబ్సిడీల గురించి అభ్యంతర పెడుతున్న ధనిక దేశాలు తాము ఇస్తున్నవాటి గురించి దాస్తున్నాయి. పలు ఖాతాల ద్వారా అందచేస్తూ వాటిని సబ్సిడీలుగా పరిగణించకుండా జాగ్రత్త పడుతున్నాయి.

అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ 2018 నవంబరులో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్న అంశాలను గమనించటం అవసరం. కనీస మద్దతు ధరలు, ప్రత్యక్ష వుత్పాదక సబ్సిడీ, బీమా, తదితర రాయితీలన్నింటినీ కలిపి మొత్తంగా పత్తి సబ్సిడీలని పిలుస్తున్నారు.ప్రపంచ వ్యాపితంగా ఇవి 2016-17లో 4.4బిలియన్‌ డాలర్లుండగా 2017-18నాటికి 5.9బిలియన్లకు( ఒక బిలియన్‌ వంద కోట్ల డాలర్లు) 33శాతం పెరిగాయి. ఒక పౌను(453) దూదికి ఇచ్చిన సబ్సిడీ 17 నుంచి 18 సెంట్లకు(నవంబరు 27 విలువ ప్రకారం రు.12.03 నుంచి రు.12.74కు పెరిగాయి) 1997-98 నుంచి ఇప్పటి వరకు వున్న ధోరణుల ప్రకారం పత్తి ధరలు ఎక్కువగా వున్నపుడు సబ్సిడీలు తగ్గటం, తగ్గినపుడు పెరుగుదల వుంది.

పత్తి ధరల విషయానికి వస్తే 2013-14లో సగటున పౌనుకు 91సెంట్లు లభిస్తే 2014-16లో 70కి తగ్గి 2016-17లో 83కు, 2017-18లో 88 సెంట్లకు పెరిగింది.బ్రెజిల్‌,భారత్‌,పాకిస్ధాన్‌ వంటి అనేక దేశాలలో 2017-18లో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్లో ఎక్కువ ధరలు వున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఎరువులు, రవాణా, గ్రేడింగ్‌, నిల్వ, ఇతర మార్కెటింగ్‌ ఖర్చులను సబ్సిడీగా ఇచ్చాయి.కొన్ని చోట్ల పంటల బీమా సబ్సిడీ పెరిగింది.1998-2008 మధ్య ప్రత్యక్ష, ఇతర సబ్సిడీల మొత్తం సగటున 55శాతం పెరిగింది, మరుసటి ఏడాది 83శాతానికి చేరింది, 2010-14 మధ్య 48శాతానికి తగ్గింది, తదుపరి రెండు సంవత్సరాలలో సగటున 75శాతానికి పెరిగి తదుపరి రెండు సంవత్సరాలలో 47శాతానికి తగ్గాయి. ఈ పూర్వరంగంలో చూసినపుడు మన దేశం గురించి అమెరికా చేసిన ఫిర్యాదు దురుద్దేశపూరితం, కనీస మద్దతు ధర వంటి కనీస రక్షణ కూడా ఎత్తివేయాలని వత్తిడి చేయటం తప్ప మరొకటి కాదు. చైనా, అమెరికాలలో మాదిరి వివిధ పధకాల కింద ఇస్తున్న రాయితీలు మన పత్తి రైతాంగానికి లేవు. ఎరువులు, పురుగు మందుల ధరల మీద నియంత్రణ ఎత్తివేయటం, పెరిగిన ధరలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచకపోవటం వంటి చర్యల కారణంగా పత్తి రైతాంగానికి ఏటే వుత్పాదక ఖర్చు పెరిగిపోతోంది. కనీస మద్దతు ధరకంటే పడిపోయినపుడు రంగంలోకి వస్తున్న సిసిఐ పరిమితంగానే కొనుగోళ్లు చేస్తూ ప్రయివేటు వ్యాపారులకు ఎక్కువగా తోడ్పడుతోంది. అనేక సందర్భాలలో రైతుల పేరుతో వ్యాపారుల నుంచే కొనుగోలు చేసిన కుంభకోణాల గురించి పత్తి రైతాంగానికి తెలిసిందే.

అమెరికా అభ్యంతర పెడుతున్న కనీస మద్దతు ధరల ప్రహసనం ఏమిటో మనకు తెలియంది కాదు. అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ నివేదిక రహస్యమేమీ కాదు. దానిలో మన దేశం గురించి పేర్కొన్న అంశాలు ఇలా వున్నాయి.’ భారత్‌లో కనీస మద్దతు ధర పద్దతి వుంది. 2014-15 మరియు 2015-16 సంవత్సరాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్‌ ధరలు తక్కువగా వున్నందున కొద్ది కాలమైనా ప్రభుత్వం నేరుగా పత్తి కొనుగోలు చేసింది.2016-17,2017-18లో మార్కెట్‌ ధరలు ఎక్కువగా వున్నందున మద్దతు ధరల వ్యవస్ధ కొనుగోలు అవసరం లేకపోయింది. మధ్యరకం పింజ రకమైన జె34 రకానికి 2017-18లో మద్దతు ధరగా క్వింటాలుకు రు.4,020 నిర్ణయించారు. అది పౌను దూది ధర 83సెంట్లకు సమానం. భారత్‌లో పత్తి రైతులు ప్రభుత్వ రుణ మాఫీ మరియు ఎరువుల సబ్సిడీ వలన లబ్ది పొందారు. పంటల బీమా ద్వారా కూడా కొంత మేర మద్దతు ఇచ్చారు. అయితే దీని విలువ ఎంతో తెలియదు. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాల వుత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. టెక్నాలజీ మిషన్‌ ద్వారా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ యూనిట్ల నవీకరణకు, పత్తి మార్కెటింగ్‌కు ఇటీవల తోడ్పడింది. వీటి గురించి బహిరంగంగా తెలిపే సమాచారం లేదు. ఇవి గాకుండా జౌళి రంగానికి ప్రత్యక్ష మద్దతు, చౌక రుణాల ద్వారా కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.’ రుణాల రద్దును, నూలు, వస్త్ర మిల్లులకు ఇస్తున్న రాయితీలను కూడ పత్తి రైతులకు ఇస్తున్న రాయితీగా చిత్రించారు.

చైనా పత్తి రైతులకు ఇస్తున్న రాయితీల గురించి చూద్దాం. 2017-18లో అంతకు ముందు ఏడాది ఇచ్చిన 3.3బిలియన్‌ డాలర్ల సబ్సిడీని 4.3బిలియన్‌ డాలర్లకు పెంచారు(పౌనుకు 30సెంట్లు). ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం దిగుమతి చేసుకోవాల్సిన నిర్దేశిత వంతుకు మించి అదనంగా దిగుమతి చేసుకొనే పత్తి మీద 40శాతం పన్నుతో సహా రైతాంగానికి పలు రక్షణలు కల్పిస్తున్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ ధరకంటే రైతాంగానికి ఎక్కువ గిట్టుబాటు అవుతున్నది. దిగుమతి చేసుకున్న పత్తి ధర, చైనా మిల్లులకు చేరిన ధరకు మధ్య వున్న వ్యత్యాసం రైతులకు నష్టదాయకంగా వుండకుండా చూసేందుకు చెల్లించిన లబ్ది మొత్తం 201-17లో ఒక బిలియన్‌ డాలర్లు వుండగా మరుసటి ఏడాది అది 1.5బిలియన్లకు పెరిగింది. ఇంతేగాకుండా మన దగ్గర కనీస మద్దతు ధర మాదిరిగా ప్రతి ఏటా రైతాంగానికి ఒక లక్షిత ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ఏడాది మార్కెట్‌లో వచ్చిన సగటు ధరతో దానిని పోల్చి తక్కువ వస్తే ఆ మేరకు రైతులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుంది. ఆ మేరకు 2015,16,17 సంవత్సరాలలో చెల్లింపులు చేసింది. 2018 సంవత్సరానికి ఒక టన్నుకు 18,600 యువాన్లుగా నిర్ణయించింది. ఇది పౌనుకు 130 సెంట్లకు సమానం. దాని ప్రకారం అంతకు ముందు సంవత్సరం చెల్లించిన 1.6బిలియన్ల నుంచి 2.1బిలియన్లకు మొత్తాన్ని పెంచింది. అంతే కాదు ప్రతి ఏటా 15క్లో డాలర్ల మేర నాణ్యమైన విత్తన సబ్సిడీ, మరో 15కోట్ల డాలర్లను దూర ప్రాంత రవాణా ఖర్చుల కింద రైతాంగానికి చెల్లించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్యత్వం కోసం చైనా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక ఏడాదికి 8,94,000 టన్నుల పత్తి దిగుమతి చేసుకుంటే దాని మీద పన్ను ఒక శాతమే విధించాలి. అంతకు మించి దిగుమతులు వుంటే పరిమాణాన్ని బట్టి ఒక శాతం నుంచి 40శాతం వరకు పన్ను విధించవచ్చు. గత మూడు సంవత్సరాలుగా నిర్దేశిత మొత్తం మేరకే దిగుమతులు చేసుకుంటున్నది.

Image result for cotton picking in india

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిసిఐ) వార్షిక నివేదికలను ఆ సంస్ధ వెబ్‌ సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. వాటిలో పేర్కొన్నదాని ప్రకారం 2014-15 సంవత్సరానికి పత్తి కనీస మద్దతు ధర అంతకు ముందు సంవత్సరం కంటే పెంచింది రు.50, ఇది ఒక శాతానికి దగ్గరగా వుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పడిపోయిన కారణంగా ఆ ఏడాది దేశీయ మార్కెట్లో ముడిపత్తి ధరలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 19 నుంచి 30శాతం వరకు, అదే విధంగా దూది ధర 25 నుంచి 30శాతం వరకు పతనమైందని సిసిఐ నివేదిక తెలిపింది. ఇలాంటి సందర్భాలలో చైనా, అమెరికాలలో రైతాంగానికి ఆయా ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో నష్టం రాకుండా చూశాయి. మన దేశంలో అలాంటి విధానం లేదు. కనీస మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ వున్నపుడు ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా సిసిఐ కొనుగోళ్లు వుంటున్నాయి. అవి కూడా మద్దతు ధరకు మించటం లేదు. పైన చెప్పుకున్నట్లు ఒక ఏడాది ధరలు భారీగా పడిపోయినా రైతాంగం అప్పులపాలు కావాల్సిందే. ఈ ఏడాది ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధరల కంటే తక్కువ ధరలకే అధిక మొత్తాలను కొనుగోలు చేస్తున్నట్లు వివిధ మార్కెట్ల సమాచారం వెల్లడిస్తున్నది.

1966 నాటి చెరకు నియంత్రణ విధానం ప్రకారం మన ప్రభుత్వాలు చెరకు ధరను సూచిస్తున్నాయి. ఈ విధానం, పంచదార ఎగుమతులకు ఇస్తున్న రాయితీల కారణంగా ధరలు తగ్గి తమతో పాటు ప్రపంచ రైతాంగానికి, వ్యాపారులకు నష్టం జరుగుతోందంటూ ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్ధకు మన దేశం మీద చేసిన పరోక్ష ఫిర్యాదును ఇప్పుడు విచారిస్తున్నారు.’ చెరకు వుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచేందుకు భారతీయ రైతులకు అధిక మూల్యం చెల్లిస్తున్నారు.దీంతో పంచదార మిల్లులకు ప్రభుత్వం అదనంగా చెల్లించేందుకు వీలు కలుగుతోంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌ సబ్సిడీలను తగ్గించే జాబితాలో చెరకు లేదు ‘ అని ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. చెరకు సబ్సిడీలను తగ్గిస్తామని అంగీకరించిన దేశాలలో మన దేశం లేదు. ధనిక దేశాలు కోరుతున్న పద్దతిలో వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలనటాన్ని మనదేశం, చైనా వుమ్మడిగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో వ్యతిరేకించాయి, ఈ అంశం మీద చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. అయితే అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌, నార్వే, స్విడ్జర్లాండ్‌ తదితర దేశాలు చర్చను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2011-17 మధ్య అంగీకరించిన సబ్సిడీ మొత్తాలకు మించి చెరకు సబ్సిడీలను భారత్‌లో ఇచ్చారని ఆస్ట్రేలియా వాదించింది. భారత చెరకు, పంచదార గురించి అమెరికా తయారు చేసిన తప్పుడు లెక్కలను వుదహరించి ఆస్ట్రేలియా కేసు దాఖలు చేసింది. ఒక్క చెరకు పంట మీదే కాదు, పప్పుధాన్యాలకు కూడా భారత్‌ ఇస్తున్న సబ్సిడీ వలన కూడా ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతోందని ఆరోపిస్తోంది.ఈ వైఖరి ఒక విధంగా మన దేశ సార్వభౌమత్వాన్నే సవాలు చేయటంగా కూడా చెప్పవచ్చు.

ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా ఈ ఏడాది భారత్‌లో పంచదార వుత్పత్తి ఏకంగా 20 నుంచి 35 మిలియన్‌ టన్నులకు పెరిగిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. భారత్‌ 85కోట్ల డాలర్ల మేర సబ్సిడీ ఇచ్చి ఐదులక్షల టన్నుల పంచదారను ప్రపంచ మార్కెట్లో కుమ్మరిస్తున్నదని, తమ దేశంలో టన్ను పంచదార వుత్పత్తికి 440-450 డాలర్ల వరకు ఖర్చవుతుండగా మార్కెట్లో 500డాలర్లుగా వున్న ధర పడిపోయి 400కు మించి రావటం లేదని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ధరలు రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదని పెంచాలని కోరుతున్నారు. దీన్నే సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నారు.నిజానికి రాష్ట్రం లేదా కేంద్రంగానీ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహక ధరలు లేదా రాయితీలు చెరకు-దాని వుత్పత్తుల మీద వచ్చే ఆదాయం, పన్నులతో పోల్చుకుంటే తక్కువే. ఈ మాత్రపు రక్షణ కూడా లేకుండా మార్కెట్‌ శక్తులకు వదలి వేయాలని అంతర్జాతీయ బడా పంచదార వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు.

గత పదహారు సంవత్సరాలలో తొలిసారిగా భారత్‌ పంచదార వుత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి 35.9 మిలియన్‌ టన్నులతో ప్రధమ స్ధానంలోకి వచ్చింది. అయితే ఇది తాత్కాలికమే అని చెప్పవచ్చు. బ్రెజిల్‌లో ప్రతికూల వాతావరణం నెలకొనటం ఒక కారణమైతే, చమురు ధరలు 85డాలర్లకు పెరిగినందున పంచదార బదులు ఎథనాల్‌ తయారు చేయటం లాభసాటిగా వున్నందున పంచదార వుత్పత్తిని కావాలనే తగ్గించారు. చమురు ధరలు 60డాలర్లకు పడిపోయినందున ఎథనాల్‌ బదులు పంచదారకు మరలితే మన పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది. ప్రపంచ వ్యాపితంగా 188.3మిలియన్‌ టన్నుల పంచదార వుత్పత్తి అవుతుందని అంచనా.

మన మార్కెట్‌ను బహుళజాతి గుత్త సంస్ధలకు తెరిచిన కారణంగా ఇప్పటికే పత్తి, ఇతర విత్తన రంగం,పురుగు మందుల రంగం విదేశీ, స్వదేశీ గుత్త సంస్ధల ఆధిపత్యంలోకి పోయింది.వారు నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. కార్గిల్‌ వంటి బహుళజాతి గుత్త సంస్ధలు కనీస మద్దతు ధరలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా కొనుగోళ్లు జరుపుతూ మార్కెట్లను నిర్దేశిస్తున్నాయని 2017 జనవరిలో వార్తలు వచ్చాయి. లోపాలతో కూడినదే అయినప్పటికీ ఆ విధానం కూడా వుండకూడదని, అప్పుడే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చని అవి భావిస్తున్నాయి. దానిలో భాగంనే పారిశ్రామిక రంగానికి ఇచ్చే రాయితీలను కూడా రైతుల ఖాతాలో వేసి అమెరికా వంటి దేశాలు కనీస మద్దతు ధరల విధానం మీద దాడి చేస్తున్నాయన్నది స్పష్టం. దీని వెనుక అంతర్జాతీయ వ్యవసాయ కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ధనిక దేశాల లాబీ, వత్తిడికి లంగి వాటికి అనుకూలమైన విధానాలు అమలు జరుపుతున్న పాలకవర్గాల మీద, అదే విధంగా కార్పొరేట్‌ శక్తుల కుట్రల మీద రైతాంగం చైతన్యవంతులై ఆ విధానాలను తిప్పికొట్టకపోతే వున్న రాయితీలు కూడా వూడ్చిపెట్టుకుపోయే ప్రమాదం వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మూడేండ్ల పాలన-తగ్గుతున్న మోజు !

16 Tuesday May 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP-led NDA, cotton farmers, Modi’s 3 years rule, Narendra Modi, Narendra Modi’s 3 years performance, NDA

ఎం కోటేశ్వరరావు

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న ఆసక్తి జనాలలో కలగటంపై సామాజిక మీడియాలో కొందరు వ్యంగ్యంతో సహా తమకు నచ్చిన రూపాలలో స్పందించారు. ఈ రెండు అంశాలూ చైతన్య సూచికకు సంబంధించినవి. నిరాశా జీవికి గ్లాసులో నీళ్లు సగమే అనిపిస్తాయి. ఆశాజీవికి ఆ సగమే ధైర్యాన్నిస్తాయి. కట్టప్ప-బాహుబలికి సంబంధించి రాజమౌళి ఆసక్తి రేపి దాన్ని సొమ్ము చేసుకోవటంలో కొత్త రికార్డు సాధించాడు. మూడు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ అంతకంటే పెద్ద ప్రచార వ్యూహంతో, కట్టుకధలతో న్యూఢిల్లీ బాహుబలి బిగినింగు (ప్రారంభం) విజయం సాధించింది. మైనారిటీ ఓట్లా మెజారిటీ ఓట్లతోనా అన్న విషయాన్ని పక్కన పెడితే మైనారిటీ ఓట్లతోనే అయినప్పటికీ గత మూడు దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ స్వంతంగా లోక్‌సభలో మెజారిటీ సాధించింది బిజెపి, దానికి సారధిగా మోడీ అన్నది తెలిసిందే. రాజమౌళి రెండో భాగాన్ని కూడా విజయవంతం చేశారు. ఒక కల్పిత కథతో నిర్మించిన సినిమా గురించి ఇంత ఆసక్తి పెంచుకున్న జనాలు తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న వాస్తవ అంశాలపై ఎందుకు ఆసక్తి చూపటం లేదు అన్నది కాస్త బుర్రలో గుంజు వున్నవారికి కలగటం సహజం. వారికి ఒక దండవేస్తే అలాంటి ఆలోచనలను దరిదాపులలోకి రానివ్వని వారికి వంద దండలు వేద్దాం. తన సినిమా గురించి ఆసక్తి కలిగించటానికి రాజమౌళికి మీడియా ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయన కూడా తనవంతు చేయాల్సింది చేశారు. న్యూఢిల్లీ బాహుబలి ఏం చేస్తున్నారు అని జనాలు ఆలోచించకుండా ఆసక్తిని వేరే వైపు మళ్లించటానికి మీడియా చేయాల్సిందంతా చేస్తోంది. అందుకు ఎన్నో రెట్ల ప్రతిఫలం కూడా అందుకుంటోంది. అదే రాజమౌళి-నరేంద్రమోడీకి వున్న తేడా అనిపిస్తోంది. మోడీ బాహుబలి కంక్లూషన్‌( ముగింపు) ఎలా వుండబోతోంది అన్నది ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో పాలకులు మీడియాను నయానో భయానో తమ చేతుల్లోకి తీసుకున్నారు. స్త్రోత్ర పాఠాలు, విజయగానాలు తప్ప మరొకటి వినిపించటం లేదు.

మోడీ మూడు సంవత్సరాల పాలన గురించి సర్వేలు వెలువడుతున్నాయి.చరిత్రలో హిట్లర్‌ను ఇప్పటికీ అభిమానించే వారు, అసహ్యించుకొనే వారు ఎలా వుంటారో చరిత్రలో పేరుమోసిన ప్రతివారికీ అభిమానులు, వ్యతిరేకులు ఎప్పుడూ వుంటారు.తన తండ్రిని స్మగ్లర్‌గా, అధోజగత్తు నేతగా చిత్రిస్తూ సినిమా తీస్తే వూరుకోబోనని, అటువంటి కార్యకలాపాలకు ఏ కోర్టూ అతనిని శిక్షించలేదని గుర్తు చేస్తూ హాజీ మస్తాన్‌ అనే మస్తాన్‌ మీర్జా పెంపుడు కొడుకుగా చెప్పుకున్న ఒక వ్యక్తి రజనీకాంత్‌ను హెచ్చరిస్తూ లేఖ రాసిన వార్తలను చదివాం. గుజరాత్‌ మారణకాండకు నరేంద్రమోడీ కారకుడని వూరూ వాడా కోడై కూసిన విషయం, అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వని విషయం తెలిసిందే. హాజీ మస్తాన్‌ కొడుకు మాదిరే తాము మోడీ పెంపుడు కొడుకులం అని చెప్పుకోకపోయినా సరిగ్గా ఇదే మాదిరి నరేంద్రమోడీని ఏ కోర్టూ తప్పు పట్టలేదు కనుక గుజరాత్‌ మారణకాండకు బాధ్యుడు అంటే సహించబోమని సామాజిక మీడియాలో ఇప్పటికీ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. అంటే చట్టం-అభిమానుల దృష్టిలో ఇద్దరూ మచ్చ లేనివారే !

మూడు సంవత్సరాల క్రితం అటు కేంద్రంలో నరేంద్రమోడీ, ఇటు తెలుగురాష్ట్రాలలో ఇద్దరు చంద్రులు అల్లావుద్దీను కంటే ఎక్కువగా రాజకీయ రంగంలో అద్బుతాలు చూపుతామని వాగ్దానాలు చేశారు. అవేమయ్యాయి, వారు దీపాన్ని రుద్దినట్లు జనం ముందు చూపటం తప్ప అద్బుతాలు కనిపించటం లేదు. నిజం మాట్లాడాల్సి వస్తే అసలు అద్బుతాలు చూపమని వారిని ఎవరు అడిగారు. చెప్పారు పో, ఎందుకు చూపటం లేదని అడిగేందుకు ముందుకు రాలేనంతగా మన జనం ఎందుకు నీరసించి పోతున్నారు అన్నది ఒక ప్రశ్న. దానికి ఈ మధ్య కొందరు చెబుతున్న సమాధానం ఏమంటే మన దేశంలో ‘వుత్తమ సంతతి’ తగ్గిపోయింది, అందువలన అలాంటి వారిని పుట్టించేందుకు ‘గర్భ సంస్కారం’ చేయాలి అంటూ కొందరు తయారయ్యారు, మనల్నందరినీ పనికిరాని వారిగా చిత్రిస్తున్న వారి గురించి తరువాత చూద్దాం.

మోడీ హయాంలో జనాన్ని బాగా ఆకట్టుకున్నదీ, అతి పెద్ద సంస్కరణగా చిత్రించినదీ, చర్చ జరిగిన అంశం పెద్ద నోట్ల రద్దు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు ద్వారా దేశంలో అవినీతిని అరికడతామని, నల్లధనాన్ని బయట పెడతామని చెప్పారు. నల్లధనం రద్దుతో పాటు ధరలు తగ్గుతాయి, కార్డులను గీకటం ద్వారా పన్ను వసూలు పెరుగుతుంది, కాశ్మీరులో రాళ్లు వేయటం ఆగిపోయింది, నక్సలైట్లకు డబ్లు ఇచ్చే మార్గాలు బందు అయిపోయాయి. అన్ని రకాల వుగ్రదాడులు తగ్గుతాయి వంటి కబుర్లన్నీ విన్నత తరువాత పాఠశాల రోజుల్లో అశోకుడి చెట్లు, ఆవు-ప్రయోజనాలేమిటి అంటే టీచర్లను మెప్పించేందుకు ఠావుల కొద్దీ రాసిన వ్యాసాలు మరోసారి గుర్తుకు వచ్చాయి. ఇవేమీ జరగవు, నోట్ల రద్దు వలన జనానికి ఇబ్బందులు, కొత్త నోట్ల ముద్రణకు చేతి చమురు వదలటం తప్ప ఒరిగేదేమీ వుండదు అని చెప్పిన వారిని నల్ల ధన కుబేరులకు మద్దతు పలికేవారుగానూ, నల్లధనంతో లబ్ది పోతోందనే వుక్రోషంతో చెబుతున్న మాటలుగానో చెప్పటంతో పాటు నోట్ల రద్దుకు మద్దతు ఇవ్వటం దేశ భక్తి అని చెప్పారు.

ఇంకేముంది బ్యాంకుల ముందు క్యూలలో నిలబడుతూ పొరపాటున ఎవరైనా నోట్ల రద్దును తప్పుపడితే వారిపై జనం విరుచుకుపడ్డారు. ఏం కొద్ది రోజులు ఇబ్బంది పడలేరా, ఓపిక పట్టలేరా అంటూ మందలించారు. అయినా తప్పన్న వారిని ఎయిడ్స్‌ వ్యాధి వచ్చిన వారి మాదిరి చీదరించుకున్నారు. సినిమాలో మంచి వాడనుకున్న బాహుబలిని కట్టప్ప చంపాడు. నిజ జీవితంలో వెంకయ్య నాయుడి మాటల్లో చెప్పాలంటే భారతీయుల బతుకులు బాగు చేసేందుకు వచ్చిన దేవదూత నరేంద్రమోడీ అనే బాహుబలి పెద్ద నోట్లు అనే శత్రువును సంహరించి దేశానికి దీపావళిని తెచ్చాడు. మంచిదే !

పాత నోట్ల మార్పిడి గడువు వరకు వాటి ప్రయోజనాల గురించి మాట్లాడిన మోడీ తరువాత ఒక్క మాట చెబితే ఒట్టు ! ఎందుకు మాట్లాడటం లేదు? రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన పాత నోట్ల విలువ ఎంత? నల్లధనం ఎంత బయట పడింది? దానిని ఏ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు? కొత్త నోట్ల ముద్రణ ఎంతకాలం పడుతుంది? నోట్ల రద్దుకు ముందు మాదిరి ఎటిఎంలలో సరిపడా నోట్లు పెట్టటానికి ఎంతకాలం పడుతుంది? ఇవేవీ జాతీయ లేదా ప్రాంతీయ మీడియాకు పట్టలేదు.అసలేమీ జరగనట్లే, అంతా బాగున్నట్లే అన్నట్లుగా మోడీ భజనలో మునిగిపోయింది. నవంబరులో జరిగే నోట్ల రద్దు తొలి వార్షికోత్సవం నాటికి అవసరమైన నోట్లు అందుబాటులో వుంటాయని సం’ తృప్తి చెందుదాం. తెలివయ్య అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు అన్నట్లుగా ప్రధాని చర్యను చూద్దాం !

రైతే రాజు, దేశానికి వెన్నెముక అనే నినాదాలు పాత బడ్డాయి. ఎందుకంటే రైతుల వెన్నెముకలు విరిగాయని గత ఏడు దశాబ్దాలలో తేలిపోయింది. అందువలన 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ కొత్త పల్లవి అందుకున్నారు. గుడ్డి కంటే మెల్ల ఎన్నో రెట్లు అన్న వేదాంతులం మనం. గత సంవత్సరాల గుడ్డి కంటే ముగిసిన పత్తి సీజన్‌లో ధరలు కొంత మెరుగ్గా వున్నాయని రైతులు సంతోషం వెలిబుచ్చారు. అయితే ఆ మేరకు మిర్చి రైతులకు ఆత్మహత్యల దారి చూపారనుకోండి. పత్తి ధర విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 2010-11 జె 4 అనే పొట్టి పింజరకం వార్షిక సగటు క్వింటాలు రు.5,771 వుంటే తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే పొడవు పింజరకాలకు సమానమైన ఎస్‌ 6 రు.5,271 వుంది. అప్పటికీ ఇప్పటికీ పెరిగిన ఖర్చులు, రైతాంగ అవసరాలను చూసుకుంటే కనీసం ఏడెనిమిది వేల రూపాయలైనా రావాల్సి వుంది. అయితే సీజన్‌లో బాగా తగ్గి తరువాత ఐదున్నరవేలకు పెరిగి కొంత మంది రైతులను సంతోష పెట్టి తరువాత తగ్గిందనుకోండి. ఇంకాస్త పెరగటానికి వున్న అవకాశాలను నరేంద్రమోడీ సర్కార్‌ దెబ్బతీసింది అనే విషయం మన రైతు బిడ్డలు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు మనకు చెప్పటం లేదు. దేశంలో పత్తి ధరలు పెరుగుతున్నప్పడల్లా దిగుమతులకు అనుమతించి రైతులను ఏడిపించి, మిల్లర్లను సంతోషపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు నరేంద్రమోడీ సర్కార్‌ ఎంత గుండెలు తీసిన బంటు అంటే పత్తి దిగుమతులలో గత వాజ్‌పేయి సర్కార్‌ 2001-02లో 25లక్షల బేళ్లతో రికార్డు దిగుమతులు చేసుకుంది. ఇప్పుడు 30లక్షలతో నరేంద్రమోడీ తన గురువు రికార్డును బద్దలు కొట్టారు.ఎవరికైనా అనుమానం వుంటే దిగువ లింక్‌లోని వార్త చదవండి.http://www.yarnsandfibers.com/news/textile-news/cotton-imports-touch-all-time-high-30-lakh-bales-season#.WRpwfcYlE2w అందువలన రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అంటే నమ్మాలో లేదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

లోకల్‌ సర్కిల్స్‌ అనే ఒక వేదిక రెండు లక్షల మంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణ ఫలితాలంటూ ఒక నివేదికను నరేంద్రమోడీ మూడు సంవత్సరాల పాలనపై తాజాగా విడుదల చేసింది. దానికి ఎలాంటి దురుద్ధేశ్యాలను, సదుద్ధేశ్యాలను అంట కట్టటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నో రావచ్చు. దాని వివరాల ప్రకారం జనం ఎలా వున్నారో చూద్దాం. ద్రవ్యోల్బణం మూడుశాతానికి తగ్గినప్పటికీ ధరలు పెరుగుతున్నాయని 66శాతం మంది చెప్పారు, గతేడాది కంటే 11శాతం వీరి సంఖ్య పెరిగింది. వుపాధి కల్పన గురించి అసంతృప్తి చెందిన వారి సంఖ్య 43నుంచి 63శాతానికి పెరిగింది. అవునని చెప్పిన వారు 35 నుంచి కేవలం 21శాతానికి తగ్గారు. నోట్ల రద్దు వలన అవినీతి తగ్గిందని చెప్పిన వారు 39శాతం కాగా, సరైన చర్య అని చెప్పిన వారు 51శాతం మాత్రమే వున్నారు. మోడీ హయాంలో ప్రపంచంలో భారత ప్రతిష్ట పెరిగింది అని నమ్మిన వారు 90 నుంచి 81కి తగ్గగా లేదు, చెప్పలేము అన్నవారు 10 నుంచి 19శాతానికి పెరిగారు.పాకిస్ధాన్‌తో వ్యహరించిన తీరు బాగుంది అన్న వారు గతేడాది 34శాతం కాగా సర్జికల్‌ దాడుల తరువాత ప్రస్తుతం ఆ సంఖ్య 64శాతానికి పెరిగింది.దేశంలో అసహనం పెరుగుతోందా అన్న ప్రశ్నకు గతేడాది లేదని చెప్పిన 74శాతం తాజాగా 69కు పడిపోయింది. మొత్తం మీద 61శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశాభంగం చెందిన వారి సంఖ్య గతేడాదితో పోల్చితే 36 నుంచి 39కి పెరిగింది. వాగ్దానాలను నెరవేర్చగలరని నమ్ముతున్నవారు 59శాతం వున్నారు.

ఈ సర్వే వెల్లడించిన అంశాలను మొత్తంగా చూస్తే నరేంద్రమోడీ మీద ఇంకా విశ్వాసం వున్న వారు గణనీయంగా వున్నారు. ఇదే సమయంలో భ్రమలు కోల్పోతున్నవారు పెరుగుతున్నారు.అందుకు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో సీట్లు దండిగా వచ్చినప్పటికీ ఓట్లు 2014 కంటే తక్కువ రావటం, గోవా, పంజాబులలో వున్న అధికారాన్ని కోల్పోవటం ఒక రుజువు. పైన పేర్కొన్న సర్వే ప్రకారం పాకనతో వ్యవహరిస్తున్న తీరును జనం మెచ్చుకుంటున్నారని తేలింది.అందువలన మిగతా రంగాలలో వైఫల్యాలు లేదా ముందుకు పోలేని స్ధితిలో పాకిస్ధాన్‌, కాశ్మీరు పరిస్ధితులను ముందుకు తెచ్చి మధ్యంతర ఎన్నికలలో ఓట్లను కొల్లగొట్టే పధకం వేస్తున్నట్లు కొందరు పరిశీలకులు ఇలాంటి సర్వేల వివరాలు వెల్లడి కాక ముందే అంచనావేశారు. పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. పాక్‌ రెచ్చగొట్టే చర్యలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలనటం, తగిన బుద్ధి చెప్పాలనటంలో రెండో మాట లేదు.అదే సందర్భంలో వారి మాదిరి మన విశ్వహిందూ పరిషత్‌ తొగాడియా లాంటి వారు రెచ్చగొట్టే ప్రసంగాలు పరిస్థితిని మరింతగా దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచవు. ఏదేశంతో అయినా సరిహద్దులలో ప్రశాంతత నెల కొల్పటంలోనే అసలైన రాజనీతి వుంటుంది. తగాదాలు పెట్టుకోవటం ఎంతసేపో పట్టదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని చూపి ఓట్లను కొల్లగొట్టిన అనుభవంతో అలాంటి వాటినే పునరావృతం చేయాలనే తప్పుడు ఎత్తుగడలకు ఎవరైనా పాల్పడితే అది దేశ ద్రోహం అవుతుంది తప్ప దేశ భక్తి కాదు. సరిహద్దులలో వుద్రిక్తతలు కొనసాగితే నష్టపోయేది మన సైన్యం, పంజాబ్‌, కాశ్మీరు పౌరులు, అమెరికా నుంచి కొనే ఆయుధాలకు ఖజానా ఖాళీ తప్ప తొగాడియాలు, సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయే వారు కాదు. మన దగ్గర వున్న మాదిరే అణ్వాయుధాలు, క్షిపణులు వారి దగ్గరా పుష్కలంగా వున్నాయి. ఏ పొరుగుదేశాన్నీ ఆయుధాలను చూపి, ప్రయోగించి అదుపు చేయలేరన్నది మన కంటే ఎన్నో రెట్లు పెద్దదైన అమెరికా అనుభవం.

పెద్ద నోట్ల సందర్భంగా వుగ్రవాదులు అంటే కాశ్మీరులో, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు వాదులు, మిగతా చోట్ల నక్సల్‌ వుగ్రవాదుల చర్యలు తగ్గకపోగా అంతకు ముందు మాదిరిగానే జరుగుతున్నాయి. కాశ్మీరులో నోట్ల రద్దుకు ముందు కాలేజీ విద్యార్ధులే రాళ్లు విసిరితే ఇప్పుడు హైస్కూలు పిల్లలు కూడా అదే పని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు తమ జీపు మీద ఒక యువకుడిని కట్టివేసి అతనిని రక్షణగా చేసుకొని ప్రయాణించిన వీడియోను ప్రపంచం యావత్తూ చూసింది. బహుశా ఎక్కడా ఇలాంటివి జరిగి వుండవు. వుగ్రవాద చర్యలు తగ్గిన దాఖలాలేమీ లేవు. ఎక్కడ అణచివేత పెరుగుతుందో అక్కడి జనం అంతగా వేరు పడిపోతారు, స్వార్దపరశక్తుల చేతులలో పావులుగా మారతారు. ఆఫ్‌ఘనిస్తాన్‌ అనుభవం అదే చెబుతోంది.తాలిబాన్లను అణచే పేరుతో అమెరికా, పాక్‌ దళాలు సామాన్య జనంపై దాడులు చేసిన కారణంగా అక్కడ తాలిబాన్లు తగ్గకపోగా పెరిగారు. విదేశాలకు విస్తరిస్తున్నారు.

నోట్ల రద్దుకు-వుగ్రవాదులకు సంబంధం లేదు, మోడీ బుర్ర నుంచి పుట్టింది తప్ప ఏ దేశంలోనూ అలా చెప్పలేదు. మోడీ చెప్పినట్లు డబ్బు అందటం ఆగిపోతే వారి కార్యకలాపాలన్నీ ఎలా సాగుతున్నాయి, పరిస్థితి మరింతగా ఎందుకు దిగజారింది అనే ప్రశ్నలు అడగలా వద్దా ? మన్‌కీ బాతంటూ తాను చెప్పదలచుకున్నదేదో చెప్పటం తప్ప దమ్మున్న కొద్ది మంది విలేకరులు అయినా అడిగేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రధాని పత్రికా గోష్టులు ఎందుకు పెట్టటం లేదు? నిజానికి వుగ్రవాద కార్యకలపాలు జరగటానికి పాలకులు కల్పించిన అనువైన పరిస్థితులే సగం వూతమిస్తున్నాయి. వాటిని విదేశాలు, విచ్చిన్న శక్తులు వుపయోగించుకుంటున్నాయి. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటును కోరుతున్నవారందరినీ వుగ్రవాద శక్తుల కింద జమకట్టి బలప్రయోగం చేస్తే ఫలితం కంటే జరిగే నష్టమే ఎక్కువ.రాళ్లు వేసే ప్రతివారూ దేశ ద్రోహులు అనుకుంటే అంతకంటే పిచ్చిపని మరొకటి లేదు.చేతులారా వుగ్రవాదాన్ని, వుగ్రవాదాన్ని పెంచి పోషించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా వుగ్రవాద ప్రభావ ప్రాంతాలలో జనాన్ని విశ్వాసంలోకి తీసుకొని వుగ్రవాదుల నిజస్వరూపాన్ని ఎండగట్టాలి. త్రిపురలో వామపక్ష ప్రభుత్వం అక్కడి వేర్పాటు, వుగ్రవాదులను శాంతి భద్రతల సమస్యగా చూడకుండా రాజకీయ వైఖరితో తీసుకున్న చర్యలు వారిని అదుపులోకి తెచ్చాయన్నది తెలిసిందే. అటువంటి చర్యలు మిగతా ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, కాశ్మీరులో లేని కారణంగానే అవాంఛనీయ శక్తులు చెలరేగుతున్నాయి.అమాయక యువత బలౌతోంది.

పైన పేర్కొన్న సర్వే వెలుగులో చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో విజయాలు చెప్పుకొనేందుకేమీ కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతసేపూ నూతన రాజధాని నిర్మాణం, పోలవరం చుట్టూ, తెలంగాణాలో మిషన్‌ కాకతీయ, భగీరధో అంటూ ప్రాజక్టుల అంచనాలు పెంచటం తప్ప మరొకటి పట్టలేదు. ఇవన్నీ కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల మధ్య పంపకాలకు తెరతీసే మెగా ప్రాజక్టులు తప్ప వేరు కాదు. ఐటి రంగంలో దాదాపు అన్ని కంపెనీలు వయసుపై బడిన వుద్యోగులను వూడబెరికే పనిలో పడినట్లు, రానున్న రోజుల్లో అది మరింతగా పెరగనున్నదని వార్తలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల సృష్టి జరుగుతోందన్నట్లు , దానికి చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు లోకేష్‌ నడుం కట్టినట్లు చూపేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోంది. లక్షల కోట్ల మేరకు కుదుర్చుకున్నట్లు చెబుతున్న అవగాహనా ఒప్పందాలేమయ్యాయో, వుద్యోగాలెక్కడున్నాయో తెలియదు. వాటన్నింటి గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అమెరికా పర్యటనలో తెలుసుకున్న సరికొత్త సాంకేతిక అంశాల గురించి జనానికి చెబుతున్నారు. అవి ఆయన కొత్తగా తెలుసుకున్నారేమో తప్ప జనానికి పాతవే. అవన్నీ వుపాధి రహిత వుత్పిత్తికి తోడ్పడేవే.ఆ కారణంగానే అమెరికాలో ట్రంప్‌ కొత్త వుద్యోగాలు ఇవ్వలేక విదేశీయుల రాకపై ఆంక్షలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడికి మూడవ సంవత్సర కానుకగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జగన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీని బిజెపి ఇచ్చింది. నరేంద్రమోడీ ఎవరు ఎపుడు అడిగినా ఇంటర్వ్యూలు ఇస్తూ వున్నట్లయితే దానికి పెద్ద ప్రాధాన్యత వుండేది కాదు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఒక సంచలనం. అది ఎటువైపు పయనిస్తుందన్నది చూడాల్సి వుంది. పైకి ఏమి చెప్పినా ప్రధాన రాజకీయపార్టీలన్నీ రాజకీయ లాభ నష్టాల లెక్కలలో వున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే రాజకీయాలలో కిక్కు ఎక్కుతుంది.

తెలంగాణా విషయానికి వస్తే గత ప్రభుత్వాలు లేదా అనుకూల పరిస్ధితుల కారణంగా హైదరాబాదులో అభివృద్ధి చెందిన ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలు, సహజంగానే వున్న అభివృద్ధి చెందిన ఫార్మా, ఇతర పరిశ్రమల కారణంగా చంద్రశేఖరరావు సర్కారు గత మూడు సంవత్సరాలుగా నెట్టుకు వచ్చింది. చేసిన వాగ్దానాలు గాలికిపోయాయి. దళితులకు భూమి, రెండు పడకగదుల ఇళ్లు, ప్రాజక్టుల నిర్మాణం, నీళ్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వున్నాయి.వుద్యోగాల విషయానికి వస్తే మూడు నోటిఫికేషన్ల విడుదల ఆరునోటిఫికేషన్ల రద్దు మాదిరి వుంది. మిర్చి ధర పతనం గురించి ఆందోళనకు దిగిన రైతుల చేతికి బేడీలు వేసి నిరసన తెలిపిన వారికి ఇదే గతి అన్నట్లుగా అవమానకరంగా పోలీసులు వీధులలో తిప్పిన వుదంతం చంద్రశేఖరరావు సర్కార్‌ రైతులకు చేసిన వాగ్దానలన్నింటినీ తుడిచిపెట్టింది. ఇదేమని అన్యాయం అని అడగటానికి, నోరెత్తటానికి వీలు లేకుండా ఇందిరా పార్కువద్ద వున్న ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌ను ఎత్తివేసి నిరసన గళం విప్పటానికి వీలు లేకుండా చేసేందుకు ఆంక్షలు జారీ చేశారు. ధర్నా చౌకు తమకు ఆటంకంగా వుందంటూ కాలనీ వాసుల పేరుతో ఒక మహిళా సిఐ, కానిస్టేబుళ్లతో సాధారణ దుస్తులు వేయించి పోటీ ధర్నా చేయించటం గమనించాల్సిన అంశం. నగర పోలీసు అధికారులు అంత బుర్రతక్కువ పధకాలు ఎలా వేసినట్లు ? అసలు ధర్నాలకు అనుమతి ఇవ్వని పోలీసులు పోటీ ధర్నాను ఎందుకు అనుమతించినట్లు ? రాజకీయంగా టిఆర్‌ఎస్‌ నాయకత్వం సంతృప్తి చెందే అంశం ప్రతిపక్షాలలో చీలిక. తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పూనుకున్న బిజెపి పెద్దన్న పాత్ర వహించి అనుచర పార్టీగా తెలుగుదేశం పార్టీని తయారు చేసుకోవచ్చు.ఈ క్రమంలోనే కేంద్రంలో బిజెపికి దగ్గర కావాలని చూస్తున్న తెరాసను దరి చేరనివ్వటం లేదు. పోయిన ప్రాభవాన్ని తెచ్చుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించవచ్చు. కాన్ని ప్రాంతాలకు పరిమితమైన వామపక్షాలు తమ బలాన్ని కాపాడుకొనేందుకు పూనుకుంటే మైనారిటీ ఓట్లతో తిరిగి అధికారానికి రాగలమన్నది తెరాస ధీమా. అందుకే ఆ పార్టీ చుట్టూ రాజకీయ తూనీగలు చేరుతున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ ప్రజాందోళనలను అణచటం ఒకే విధంగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడ వామపక్షాలు, వైఎస్‌ఆర్‌సిపి నేతలను ముందుగానే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దానికి ఎలాంటి కారణాలు వుండటం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇతర మంత్రులను డమ్మీలుగా చేసి తమ కుమారులను యువరాజుల మాదిరి తిప్పుతున్నారు. ఒక పధకం ప్రకారం వారి ప్రతిష్టను పెంచేందుకు పూనుకున్నారు. కేంద్రంలోని బిజెపికి రాజకీయంగా లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

జిఎస్‌టితో ప్రారంభంలో రేట్లు పెరుగుతాయని ముందే చెబుతున్నారు. మేకిన్‌ ఇండియా, వుపాధి కల్పన, నోట్ల రద్దు బండారం వంటి అన్ని అంశాలు మరింత వేగంగా బహిర్గతం గాక తప్పదు. నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుల మూడు సంవత్సరాల పాలనను మొత్తంగా చూస్తే భ్రమలు కోల్పోయే రేటు వేగం అందుకునే స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే అంతటా మధ్యంతర ఎన్నికల ఎత్తులు, జిత్తులతో పాలకులు, పార్టీల నేతలూ వున్నారు.

గమనిక : ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాసిన వ్యాసమిది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పత్తి ధరపై చైనాకు తగ్గుతున్న ఎగుమతుల ప్రభావం వుంటుందా ?

26 Tuesday Jul 2016

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, cotton imports, indian farmers, yarn

ఎం కోటేశ్వరరావు

    ఎగువన వున్న తుంగభద్ర జలాశయమే పూర్తిగా నిండలేదు, అనూహ్యమైన వాతావరణ మార్పులు సంభవిస్తే తప్ప ఈ ఏడాది కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలు నిండటం అనుమానమే. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం పడిన కొద్ది పాటి వర్షాలకే మరో మార్గం కానరాక ఎన్నో ఆశలతో ఈ ఏడాది కూడా పత్తి సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే సీజన్‌కు క్వింటాలుకు పొడవు పింజ పత్తిరకాల మద్దతు ధర మరో అరవై రూపాయలు పెంచి రు.4,160గా ప్రకటించి ఎంతో మేలు చేసినట్లుగా చెప్పుకుంటోంది. ఏవి మోడీ 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మొన్న చేసిన చేసిన వాగ్దానాల అమలు ఎక్కడ అని ఎవరైనా అడిగితే దేశ భక్తులు కాదని ముద్ర వేసే ప్రమాదం లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను అడిగితే ఒకరు వైఎస్‌ఆర్‌సిపి మీద మరొకరు తెలుగుదేశం, కాంగ్రెస్‌ మీద విరుచుకుపడి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు. చంద్రబాబు నాయుడికి నరేంద్రమోడీతో రోజురోజుకూ మరింతగా బిగుస్తున్న స్నేహ ధర్మం అడ్డు వచ్చి, పత్తి వేసుకోవద్దని ముందే సలహా ఇచ్చాం కదా అని చంద్రశేఖరరావు కూడా దీని గురించి పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగా అన్నీ తానే అయినట్లు వ్యహరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న(ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం వాటిని ఖండించలేదు) లోకేష్‌, తెలంగాణాలో తానే ముఖ్యమంత్రిని అన్నట్లుగా హడావుడి చేస్తున్న మంత్రి కెటిఆర్‌కు గానీ తమ రాష్ట్రాలలో పత్తి ఒక ప్రధాన పంట అనిగానీ రైతాంగంపై దాని ధరలు, మార్కెటింగ్‌ తీవ్ర ప్రభావం చూపుతాయని గానీ అనుకుంటున్నారో లేదో తెలియదు.

   చైనా ప్రస్తావన తేవటం కొంత మందికి ఆగ్రహం తెప్పించవచ్చు. ఏం చేస్తాం, వాస్తవాల మీద ఆధారపడినపుడు ప్రపంచమే చైనాను విస్మరించజాలదు, మన మార్కెట్‌ను కూడా చైనా వస్తువులు ముంచేస్తున్నపుడు మనం దూరంగా ఎలా వుంటాం.నిత్యం చైనాను కట్టడి చేయాలని, దాని వస్తువులను నిషేధించాలని వీరంగం వేస్తున్నవారితో సహా మన పత్తి, నూలును చైనా కొనటం నిలిపివేస్తే ఎవరూ చేసేదేమీ లేదు,పరిస్ధితి మరింత దిగజారుతుంది. అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్‌ చివరి వారంలో జెంగ్‌జౌ వస్తు మార్కెట్‌లో ఒక్క రోజులోనే 4.1కోట్ల బేళ్ల పత్తి లావాదేవీలు జరిగాయి. ఒక బేలు పత్తితో 215 జతల జీన్స్‌ తయారు చేయవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఆ ఒక్క రోజు అమ్మిన పత్తితో భూమ్మీద ప్రతి ఒక్కరికీ కనీసం ఒక జీన్స్‌ పాంట్స్‌ తయారు చేయటానికి సరిపోతుందని అంచనా.

  వ్యవసాయం గురించి అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు పర్యవసానాలతో పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా వుండి, కంగుతిని తరువాత ఓట్ల కోసం సవరించుకున్నారు. ఆచరణలో ఏం చేస్తున్నారు? ప్రధాని నరేంద్రమోడీ, ఇద్దరు తెలుగు చంద్రులు, వారి వారసులు పోటీ పడి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెస్తున్నట్లు పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాటిలో పదిశాతం లేదా ప్రయాణ, ప్రచార ఖర్చులు ఏది ఎక్కువైతే ఆ మొత్తం వాస్తవ రూపం దాల్చినా మంచిదే. ఆ పెట్టుబడులు వందల కొలదీ చేసుకున్నామని చెబుతున్న ఒప్పందాలలో రైతాంగానికి పనికి వచ్చేవి ఎన్ని? పొగాకు అమ్ముడు పోక రైతాంగం దిక్కుతోచకుండా వుంటే కొనటానికి కేంద్రాన్ని ఒప్పించలేని పెద్దలు తల్లికి తిండి పెట్టని కొడుకులు పిన్నికి బంగారు తొడుగులు వేయిస్తామన్నట్లుగా వ్యవసాయం గురించి చెపితే రైతులు చెవులో పూలు పెట్టుకొని నమ్మాలా ? అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గిన కారణంగా దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు తగ్గితే వ్యాపారులు ఆమేరకు తగ్గించకుండా వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, వాటిపై నియంత్రణ వుందా ?

    మన పత్తికి ఇప్పుడున్నదాని కంటే మంచి ధర రావాలంటే చైనాకు మరిన్ని ఎగుమతులు జరిగితే తప్ప రాదన్నది స్పష్టం. 2015లో మన దేశం నుంచి చైనాకు ఎగుమతి చేసిన నూలు, దానికి వచ్చిన రేటు 12,17శాతం చొప్పున తక్కువగా వున్నాయని తాజా సమాచారం. ముందే చెప్పుకున్నట్లు తన దగ్గర వున్న అపార పత్తి నిల్వలను చైనా మార్కెట్‌కు విడుదల చేస్తోంది. ఈ స్ధితిలో మన పత్తి రైతులకు ధర గతం కంటే ఎలా మెరుగుపడుతుందో తెలియని స్ధితి. మిలియన్ల మంది పత్తి రైతులు, వారి పొలాల్లో పని చేసే వ్యవసాయ కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా పారిశ్రామిక, వ్యాపారాలలో పెట్టుబడుల ఎండమావులు వెంట తిరిగితే ప్రయోజనం వుంటుందా ?

    గతేడాది చైనాకు ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. అయితే వియత్నాం, బంగ్లాదేశ్‌ కొంత మేరకు దిగుమతులు పెంచటంతో పత్తి ధర సీజన్లో మద్దతు ధరకు అటూఇటూగా అయినా వుంది.ఈ ఏడాది వారు కూడా తమకు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన రైతాంగ పరిస్ధితి ఏమిటి ? రైతులు పచ్చగా లేకుండా లోకేష్‌ బాబుతో కలసి చంద్రబాబు అంతర్జాతీయ స్ధాయిలో రాజధాని అమరావతిని నిర్మించినా, చంద్రశేఖరరావు అండ్‌ ఫ్యామిలీ భాగ్యనగరాన్ని మరింతగా అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏమిటి ?

    తమకు నష్టాలు వస్తున్నాయనే పేరుతో నూలు మిల్లులు వారానికి కొన్ని గంటల పాటు వుత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌లో మన దేశం నుంచి పత్తి నూలు 8.2 కోట్ల కిలోలు 74 దేశాలకు ఎగుమతి అయింది. మేనెలతో పోల్చితే కిలోకు ఏడు సెంట్ల ధర పెరిగినా ఏడాది క్రితంతో పోల్చితే 24 సెంట్లు తక్కువ.ఈ స్ధితిలో ఈ ఏడాది నూలు ఎగమతిదారులు ఏ ధైర్యంతో పత్తిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు? గతం కంటే దిగుమతులు తగ్గినప్పటికీ మన పత్తి, నూలు ఎగుమతులు చైనాకే ఎక్కువగా జరుగుతున్నాయి.

     ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖకు కొత్తగా వచ్చిన కమిషనర్‌ తన ప్రత్యేకతను ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించుకొనేందుకు లేదా తాము ఎన్ని విజయాలు సాధించినా వాటి సమాచారం జనంలోకి వెళ్లటం లేదన్న ముఖ్యమంత్రి ఆగ్రహం వల్లగానీ సమాచార శాఖ కొత్తగా పరిశోధన అవలోకన( రిసర్చ్‌ రిఫరెన్సు) విభాగాన్ని ఏర్పాటు చేసి పుంఖాను పుంఖాలుగా పొత సమాచారాన్ని కొత్తగా మీడియాకు అందచేస్తున్నది. వాటిలో కొన్ని ఇలా వున్నాయి. 2050 నాటికి అంటే మరో 34 సంవత్సరాల నాటికి అమరావతి నగరంలో 12లక్షల వుద్యోగాలు సేవల రంగంలో మూడు లక్షల వుద్యోగాలు పరిశ్రమల రంగంలోనూ కల్పించేందుకు చంద్రబాబు కృషి. ఇందుకు గాను మౌలిక వసతుల కల్పనలా భాగంగా 3,746 కిలోమీటర్ల జాతీయ రహదారులకు(ఇవి ఇతర ప్రాంతాలలో కూడా వుంటాయనుకోండి) గాను రు.34,732 కోట్లు, అమరావతి రింగురోడ్డు, ఇతర 720 కిలోమీటర్ల రోడ్డకు రు.30వేల కోట్లు,రేవులను కలిపే 419 కిలోమీటర్ల ప్రధాన రహదారులకు రు.4,306 కోట్లు ఇంకా మరికొన్ని రోడ్ల గురించి సమాచార శాఖ తెలిపింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అశోక్‌గజపతి రాజు అర్ధికశాఖ మంత్రిగా వుండగా కూడా ఇలాగే రోడ్ల నిర్మాణం, వాటికి విదేశీ అప్పుల గురించి వాటి ద్వారా జరిగే అభివృద్ధి గురించి వూదరగొట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తిరిగి ఇప్పుడు అదే జరుగుతోంది. రోడ్లు వేస్తే కాంట్రాక్టర్లు వస్తారు, కాంట్రాక్టర్లు వస్తే కొంత మందికి జేబులు నిండుతాయి, జనానికి టోలు ఫీజు రూపంలో జేబులు ఖాళీ అవుతాయి. రోడ్లు వేయటానికి ముందు, తరువాత తమ వుత్పత్తులకు వస్తున్న రేట్లలో తేడా ఏముందో మదనపల్లి టమాటో రైతులు చెప్పాలి. వుల్లి ధరలు పెరిగి వినియోగదారులకు, తగ్గి రైతులకు కన్నీరు తెప్పించిన విషయం కర్నూలులో ఏ రైతును అడిగినా చెబుతారు.పత్తి, పొగాకు ధరల గురించి వేరే చెప్పనవసరం లేదు.

   కొన్ని రోడ్ల నిర్మాణానికే దాదాపు 70వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ రైతులకు ఏం చేస్తోంది? పదిహేడు లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల వుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న ఖర్చు 120 కోట్లు అని సమాచార శాఖ పేర్కొన్నది. పాతిక కిలోమీటర్ల రోడ్డు వేయటానికి అయ్యేఖర్చును కూడా వ్యవసాయంపై పెట్టటానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

U.S. Futures Daily Cotton Market – 4th February, 2016

05 Friday Feb 2016

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Prices, USA

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, cotton prices, us cotton futures, World Cotton

 

Contract Open * High Low Close * Settle Change
Mar ’16 61.89 61.89 59.99 60.28 60.23 -1.71
May ’16 62.34 62.37 60.42 60.77 60.70 -1.71
  Jul ’16 62.79 62.80 60.98 61.36 61.27 -1.50
Oct ’16 0 0 0 0 60.91 -1.41
Dec ’16 62.50 62.55 60.90 61.33 61.26 -1.36
� Open and Close prices reflect the first and last trade in the market and do not correlate to any opening or        closing period �
Cotlook ‘A’ Index 68.70 (-0.25)

 

**MARKET OUTLOOK**

India & International Market Highlights:

• Widespread whitefly damage to cotton crops in Pakistan could result in production levels falling to an 18-year low in 2015/16.

• Viscose prices have continued bottoming out in China after a small number of leading producers had previously agreed to lower their production.

North Zone:

Cotton traded steady tone across major spot markets of north India on Thursday. Prices were down Rs 05-10 per maund.  In Punjab, ready delivery cotton traded at Rs 3535-3540 a maund. In Haryana, it offered at Rs 3,510-3,520 while in Rajasthan, ready delivery new cotton quoted at Rs 3,470-3,530 a maund.

Central Zone:


Cotton spot prices steday tone across west India market on Thursday. Gujarat Sankar-6 cotton traded at  Rs 33700-34200 per candy. while B-Grade Cotton traded flat at Rs 33200-33500 per candy. V 797 cotton offered at Rs 22500-23500 a candy. While in Maharashtra, mech-1 good grade quoted at Rs 33700-34200 a candy.

South Zone:


Cotton spot price was steady tone across the major trading centers of south India.  

US Cotton Futures :

Cotton futures tumble: February 05, 2016 – Cotton futures fell on Wednesday despite a sharply weaker dollar and strength elsewhere in the commodity complex as investors hesitated to increase long positions ahead of the looming index fund roll, when large funds move positions forward from the front-month. “They don’t have a long time to build up a significant long,” said Louis Rose, independent cotton trader and consultant with Risk Analytics in Memphis, Tennessee. March cotton on ICE Futures US settled down 0.36 cent, or 0.58 percent, at 61.94 cents per lb. It traded within a range of 61.77 and 62.59 cents a lb. Total futures market volume fell by 4,576 to 43,027 lots. Data showed total open interest gained 2,126 to 197,632 contracts in the previous session. Certificated cotton stocks deliverable as of February 2 totalled 26,614 480-lb bales, down from 27,784 in the previous session. The dollar index was down 1.70 percent. The Thomson Reuters CoreCommodity CRB Index, which tracks 19 commodities, was up 2.50 percent. Copyright Reuters, 2016

Pakistan :

Cotton prices increase: February 05, 2016 — Karachi : Prices moved higher at the local cotton market on Thursday amid short supplies of high grade lint variety, brokers said.  The official spot rate held steady at Rs5,400 per maund. The Karachi Cotton Association (KCA) reported traders purchased 2,800 bales at Rs4,450 to Rs5,675 per maund as compared to Rs4,800 to Rs5,650/maund during previous trade. By and large, prices remained firm at the overnight level, but till the close of the trading session, some quality lint was quoted at higher prices.  “There is dearth of stocks lying with spinners and they see prices to remain on higher side in anticipation of shortfall in cotton production during the current season,” said a broker at Karachi Cotton Association. “The short supply prospects of cotton triggered buying at the market,” the broker said.  Many traders expect the cotton market to witness a steady trade on account of ease in demand for the cotton yarn by the spinners who are under capacity.

China :

Chinese industrial park in Ahmedabad to go functional by end of 2017: 2016-02-03 : The first Chinese general Industrial park with focus on textiles will be functional by the end of 2017 near Ahmedabad. The infrastructure for the park will be ready by 2017-end and some of the companies will begin setting up their units by the same time, said the country head of China Association of Small and Medium Enterprises (CASME) in India, Kamlesh Bhadani. An MoU for setting up this project was signed between China Development Bank and Gujarat government during the Vibrant Gujarat Summit 2015. The state government has set up a high-power committee under the chairmanship of the additional chief secretary of industries for this project. A group of senior officials of CASME and China Development Bank, including Bhadani and vice-managing director of China Development Bank Xiao Ming Zhen, had met the state chief minister last month. Zhen had said that work on the $1 billion industrial park will begin soon. The ground breaking of the project is likely to be held in the next few months. Bhadani said that they are looking at two land pockets — one in Sanand and other on Ahmedabad-Rajkot highway. It is going to be a general park and its developer will be CASME. Once the Chinese New Year celebrations are over, they will be conducting road shows and other campaigns to create awareness about this industrial park among the Chinese firms. The work on project will be expedited from March. Bhadani, speaking about the focus on textile sector in this park said that many of the Chinese textile firms will prefer to have a local partner as they will be coming from different environment. There is hardly any value addition in India to the raw material which is exported to China. The Chinese textile companies will do manufacturing here in Gujarat and export the finished product to China, as there is a huge market for this in China Some of companies interested in the project have already visited Ahmedabad and few more will be coming soon. These firms would like to do due diligence before investing here. Besides bringing in investment, this park will also provide employment on a large scale.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

U.S. Futures Daily Cotton Market – 2nd February, 2016

03 Wednesday Feb 2016

Posted by raomk in Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Prices, USA

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, cotton market, us cotton futures

Contract Open * High Low Close * Settle Change
Mar ’16 61.61 62.50 61.49 62.13 62.30 +0.51
May ’16 61.95 62.78 61.92 62.47 62.65 +0.45
  Jul ’16 62.17 62.95 62.14 62.75 62.88 +0.49
Oct ’16 0 0 0 0 62.34 +0.73
Dec ’16 61.61 62.45 61.61 62.34 62.41 +0.57
� Open and Close prices reflect the first and last trade in the market and do not correlate to any opening or        closing period �
Cotlook ‘A’ Index 68.45 (+0.50)

Required Carded CVC Ne 40/1 (80/20) & Ne 40/1 Cotton / Bamboo Melange (60/40) for Direct Exports

WE CAN PROVIDE COTTON LINTER FROM INDIA TO CHINA. Please Contact : rahul.mrtextiles@gmail.com

**MARKET OUTLOOK**

India & International Market Highlights:

• India`s Cotton exports are expected to rise by 21.27% to 70 lakh bales during the 2015-16 season, mostly due to rise in demand from Pakistan.

• The decline of the Chinese currency renminbi has raised import prices of yarn above domestic price levels.

North Zone:

Cotton traded steady tone across major spot markets of north India on Wednesday.  In Punjab, ready delivery cotton traded at Rs 3545-3550 a maund. In Haryana, it offered at Rs 3,530-3,540 while in Rajasthan, ready delivery new cotton quoted at Rs 3,490-3,550 a maund.

Central Zone:


Cotton spot prices steday tone across west India market on Wednesday. Gujarat Sankar-6 cotton traded at  Rs 33700-34200 per candy. while B-Grade Cotton traded flat at Rs 33200-33500 per candy. V 797 cotton offered at Rs 22500-23500 a candy. While in Maharashtra, mech-1 good grade quoted at Rs 33700-34200 a candy.

South Zone:


Cotton spot price was steady tone across the major trading centers of south India.  

US Cotton Futures :

Cotton futures post biggest gains in two weeks: February 03, 2016 – Cotton futures surged on Monday to their highest single-session gains in two weeks, lifted by a weaker dollar and end-user buying at low price levels and bucking a rout across most commodities. Still, prices remained within the same tight range they have been trading in for months. “They’re not chasing it higher,” said Chris Kramedjian, a risk management consultant with INTL FCStone in Nashville, Tennessee, noting that physical buying evaporated at the upper end of the day’s range. “We’re still in the middle of the range.” March cotton on ICE Futures US settled up 0.66 cent, or 1.1 percent, at 61.79 cents per lb. It traded within a range of 60.85 and 62.00 cents a lb. Total futures market volume rose by 1,696 to 38,571 lots. Data showed total open interest gained 2,648 to 198,357 contracts in the previous session. Certificated cotton stocks deliverable as of January 29 totalled 27,784 480-lb bales, down from 28,706 in the previous session. The dollar index was down 0.59 percent. The Thomson Reuters CoreCommodity CRB Index, which tracks 19 commodities, was down 1.96 percent. Speculators cut their net long position to 18,555 lots from 22,806 lots in the latest week. The Relative Strength Index in the most-active contract rose to 46.363. Copyright Reuters, 2016

Pakistan :

Slow off-take on cotton market: February 2nd, 2016 – KARACHI: Much of the trading activity remained around low quality cotton on Monday as the availability of quality lint is becoming difficult with each passing day. Floor brokers said that out of 1.1 million bales held by ginners, only 30 per cent of stocks are of quality lint. On an average 1.2m bales are consumed per month by the spinning industry under normal circumstances, but current depressed demand on the cotton yarn market is keeping cotton off-take slow, they added. With around seven months for the arrival of cotton next crop (2016-17) there should have been frenzied buying from spinners. The spinning industry continues to import cotton from Indian and only last week around one million bales were imported, brokers added. According to market sources, most deals finalised between spinners and ginners were in lower quality cotton priced at Rs5,550 to R5s,650 per maund. The Karachi Cotton Association (KCA) cut its spot rates by Rs50 per maund to Rs5,400. Major deals on ready counter were: 3,700 bales from Sanghar (Rs4,550 to Rs4,725 per maund), 400 bales from Shahdadpur (Rs4,750), 600 bales from Burewala (Rs4,850), 400 bales from Fort Abbas (Rs5,350), 400 bales from Multan (Rs5,400), 400 bales from Layyah (Rs5,500), 600 bales from Mianwali (Rs5,500 to Rs5,550), 600 bales from Yazman Mandi (Rs5,650), 1,000 bales from Rahimyar Khan (Rs5,650).

China :

China to lose, to Vietnam, top rank among cotton importers: 2nd Feb 2016 – China, which last season lost to India the title of the world’s top cotton producer, is to give up top rank in imports too, the International Cotton Advisory Committee said, citing the enhanced competitiveness of polyester. The committee deepened to 40%, from 34%, its forecast for the top in Chinese cotton imports in 2015-16, taking the estimate from 1.2m tonnes to 1.08m tonnes (5.0m bales). Imports at that level – besides coming in below expectations of commentators such as the US Department of Agriculture, which forecasts them at 5.5m bales — would be the lowest in 13 years. And they would, on ICAC projections, demote China to equal second, with Bangladesh, on cotton imports, behind Vietnam, which is expected to buy 1.1m tonnes this season. “Cotton imports by Vietnam in the first four months of 2015-16,” which began in August, “totalled 327,000 tonnes, while those by China totalled 247,000 tonnes,” the committee noted.
Cotton vs polyester:
The ICAC highlighted the role in Vietnam’s rise as a cotton importer, with volumes seen soaring 17% this season, its low labour costs. “Consumption in both Vietnam and Bangladesh is increasing steadily, due to lower production costs, but both produce very little cotton, and instead must rely on imports to meet demand,” the committee said. However, it also flagged the enhanced competitiveness of polyester, of which China produces 72% of global supplies, making this fibre a particularly acute rival to cotton for the country’s mills. Polyester’s discount to cotton has “continued to widen”, the ICAC said, reporting that values of the artificial fibre had averaged 48 cents a pound in the first half of 2015-16. Cotton prices, as measured by the Cotlook A index, averaged 70 cents a pound. “The ongoing drop in polyester prices cuts into cotton’s market share, particularly in China where polyester has been favoured over cotton in recent seasons,” the committee said, cutting by 200,000 tonnes to 7.1m tonnes its estimate for Chinese cotton consumption in 2015-16.
New season forecasts:
The comments came as the ICAC left little changed its forecast for world cotton inventories at the close of this season, pegging the figure at 20.5m tonnes, a drop of some 1.6m tonnes year on year. And, in its first estimates for 2016-17, it forecast a further drop in inventories, albeit at a far slower rate, of some 1m tonnes, against expectations of improved production and flat consumption. Inventories, at 19.5m tonnes, would at the close of 2016-17 fall below 20m tonnes for the first time in four years, but remain high by historical standards, equivalent to 80.7% of annual consumption. The ICAC gave no explanation for its forecasts, which saw world production improving to 23.1m tonnes, but remaining behind world consumption, at 24.1m tonnes. Courtesy – by Agrimoney.com

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అడకత్తెరలో పోక చెక్కలుగా పత్తి రైతులు

14 Thursday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, cotton market, cotton prices

ఎంకెఆర్‌

మీ వూర్లోనో, ప్రాంతంలోనో పత్తి ధరలలో స్ధానిక పరిస్థితులు, పత్తి నాణ్యత తదితర కారణాలతో స్వల్ప హెచ్చు తగ్గులు వుండవచ్చు. ప్రపంచ మార్కెట్లో మొత్తం మీద పత్తి ధరలు తగ్గుముఖంలో వున్నాయి. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు పత్తి రైతుల పరిస్ధితి వుంది.ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ పరిణామం ప్రతికూల పర్యవసానాలను ముందుకు తెస్తుందో తెలియటం లేదు.

ఇటీవల చైనా ఆర్ధిక వ్యవస్ధలో సంభవించిన పరిణామాలలో స్టాక్‌ మార్కెట్‌ కుదేలు కావటంతో పాటు కరెన్సీ యువాన్‌ విలువ కూడా పడిపోయింది.అది అలాగే కొనసాగితే అ ప్రభావం చైనాతో పాటు మనవంటి అనేక దేశాలపై పడుతోంది. మన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాలకూ అమెరికా, ఐరోపా దేశాల మార్కెట్లు వుమ్మడిగా వున్నాయి. కరెన్సీ విలువలు తగ్గిన దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటే వారికి లాభం. ఆ రీత్యా చైనా కరెన్సీ విలువ పడిపోతే అక్కడి నుంచి అంతకంటే మన కరెన్సీ విలువ పడిపోతే ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు తప్ప వ్యాపారులకు మరొక ప్రాతిపదిక వుండదు. మన దేశం నుంచి ఈ ఏడు 13-15శాతం పెరుగుదల రేటుతో దుస్తులు, వస్త్రాల ఎగుమతులు వుంటాయని ఆశించగా డిసెంబరు నాటికి 7-8శాతానికి మించలేదు. ధనిక దేశాలలో ఆర్ధిక పరిస్థితి మందగించటమే దీనికి కారణం. ఇప్పుడు చైనా యువాన్‌ విలువ పతనం కావటంతో గతం కంటే తక్కువ విలువకే (డాలర్లకే) చైనా సరకులను ధనిక దేశాలు దిగుమతి చేసుకోవచ్చు. గత దశాబ్ది కాలంలో సగటున మన వస్త్ర వుత్పత్తుల ఎగుమతుల పెరుగుదల రేటు 3-4శాతం మాత్రమే వుందని రేటింగ్‌ సంస్ధ మూడీస్‌ విభాగమైన ‘ఇక్రా’ తాజాగా తెలిపింది. ఈ స్థితిలో మన రూపాయి విలువను తగ్గించుకుంటే మన ఎగుమతులు పెరుగుతాయి. అదే చేస్తే మన దిగుమతులకు అయ్యేఖర్చు అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. ఇప్పటికే విదేశీ వాణిజ్యలోటుతో వున్న మన దేశం డాలర్ల కోసం మరిన్ని ప్రజావ్యతిరేక చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.మన వస్త్ర వుత్పత్తుల ఎగుమతులు తగినంతగా లేకపోతే అంతర్గతంగా డిమాండ్‌ తగ్గిపోయి పత్తి ధరలు మరింత పతనం లేదా ఇప్పుడున్న స్ధితిలో ఎదుగూ బొదుగూ లేకుండా వుంటాయి.

కాటన్‌ ఇన్‌కార్పొరేట్‌ సంస్ధ తాజా సమాచారం ప్రకారం డిసెంబరు 29నుంచి జనవరి పది వరకు అంతర్జాతీయ పత్తి ధరల సూచిక తగ్గుదల చూపింది. ప్రపంచంలో అగ్రస్ధానం కోసం పడుతూ ఒకటి రెండు స్ధానాలలో దేశాలలో సూచీలు ఇలా వున్నాయి.(లింట్‌ బేల్‌ ధర సెంట్లలో)

సూచీ జనవరి 12న డిసెంబరు ఏడాది క్రితం

న్యూయార్క్‌ 61.6 63.7 63.3

అమెరికా 68.5 70.4 70.4

చైనా 88.3 91.1 95.8

భారత్‌ 63.8 63.8 65.8

పాకిస్ధాన్‌ 62.1 60.8 59.9

డాలర్‌ విలువతో పోల్చితే చైనా యువాన్‌ ధర తాజాగా పడిపోయిన కారణంగా జనవరి 12న చైనాలో పత్తి ధర 92 నుంచి 88 సెంట్లకు పడిపోయినట్లు కనిపించినప్పటికీ చైనా మార్కెట్‌లో క్వింటాలు ధర 1280 వద్ద స్ధిరంగా వుంది. ఒక్క పాకిస్తాన్‌లో గత నెల రోజుల్లో ధరలు పెరిగాయి. మన దేశంలో పెద్ద మార్పులేదు. పాకిస్తాన్‌లో వుత్పత్తి 17 సంవత్సరాల కనిష్టం 7.2 మిలియన్‌ బేళ్లకు పడిపోవటం అక్కడి మార్కెట్‌లో కొద్ది పాటి పెరుగుదలకు కారణమైందని చెప్పవచ్చు. తెల్లదోమ, ఇతర తెగుళ్లే దీనికి కారణం.ఈ ఏడాది ప్రపంచంలో వుత్పత్తి తగ్గిన కారణంగా వచ్చే ఏడాది విస్తీర్ణం పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు అప్పుడే అంచనాలు వేస్తున్నాయి. 2011-14 మధ్య ఏటా 19.7 మిలియన్ల బేళ్ల చొప్పున దిగుమతి చేసుకున్న చైనా తన విధాన మార్పుల కారణంగా 2015-16లో కేవలం 5.5 మిలియన్‌ బేళ్లకే పరిమితం చేసుకుంది. అంతర్గతంగా తన రైతాంగానికి ధర పడిపోకుండా హామీ ఇచ్చి మద్దతు ధర పెంచుతోంది. ఈ కాలంలో చైనా వెలుపల మిల్లుల వినియోగం పెరిగినప్పటికీ అది చైనా దిగుముతు తగ్గిన స్ధాయిలో లేకపోవటంతో ప్రపంచ మార్కెట్‌ ధరలు స్ధబ్దుగా వుంటున్నాయి. దీనికి తోడు చమురు మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా దాని వుపవుత్పత్తులైన నైలాన్‌, ఇతర కృత్రిమ నూలు ధరలు తగ్గటం కూడా పత్తి డిమాండ్‌ను పరిమితం చేశాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: