• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: covid 19 India Stimulus package

దేశంలో ఏం జరుగుతోంది, మనం దేన్నయినా పట్టించుకుంటున్నామా !

10 Sunday May 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

coronavirus narendra modi, covid 19 India Stimulus package, Covid-19 lockdown

Coronavirus: PM Modi to address nation on Thursday - INDIA ...

ఎం కోటేశ్వరరావు
దేశంలో ఏమి జరుగుతోంది ? బుద్ధి జీవులు(మేథావులు) ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఏ దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ తరగతులు ఏమి ఆలోచిస్తున్నాయి,ఏం చేయాలనుకుంటున్నాయి? మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి పట్టించుకుంటున్నామా? మనమేం చేస్తున్నామో మనకు తెలుస్తోందా ? ఇది ఒక ఆలోచన మాత్రమే, ఆసక్తి ఉన్నవారు మాత్రమే ముందుకు పోండి, ఆల్‌ ఈస్‌ వెల్‌ (అంతా బాగుంది ) అనుకుంటున్నవారు చదివి ఇబ్బంది పడకండి. ఆలోచనా పరులైతై మీ భావాలను బయట పెట్టండి. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం కాస్త బతికే ఉంది. జరుగుతున్నవి నాకు సంబంధం లేనివి కదా నేనెందుకు మాట్లాడాలి అనుకోకండి. మీవరకు వచ్చే సరికి మీకోసం మాట్లాడేవారు మిగలరని తెలుసుకోండి.
గృహబందీ శాశ్వతం కాదని,పరిమితకాలమైనా తప్పదని తెలుసు. గతంలో నరేంద్రమోడీ అనాలోచితంగా పెద్ద నోట్లను రద్దు చేసినపుడు జనం నీరాజనాలు పట్టారు. ఇప్పుడు గృహబందీ ప్రకటించినా అనేక మంది కోటీశ్వరులు, మధ్యతరగతి, చీకట్లో ఉన్న వారు అదే చేస్తున్నారు. నోట్ల రద్దు జనం, ఆర్ధిక వ్యవస్ధ ప్రాణాలు తీసింది. రెండవది జాగ్రత్తలు పాటించిన వారి ప్రాణాలు కాపాడుతుంది. మొదటి చర్య మోడీ స్వమస్తిష్కం నుంచి పుడితే, రెండవది చైనా నుంచి అరువు తెచ్చుకున్నది.(చైనా వస్తువులను, దాని కమ్యూనిస్టు ఆలోచనలను బహిష్కరించాలని చెప్పేవారు దీని గురించి మౌనం దాల్చారు ఎందుకో మరి )
ప్రపంచంలో జిడిపిలో ఐదో స్ధానంలో ఉన్న మన దేశం జనధన్‌ ఖాతాలకు 1500(డాలర్లలో 20) రూపాయలు నేరుగా నగదు మూడు దఫాలుగా పంపిణీ చేస్తోంది.(ఒకేసారి ఇస్తే దుర్వినియోగం చేస్తారని కాబోలు) అదే 42వ స్ధానంలో ఉన్న పాకిస్ధాన్‌ దాని కరెన్సీలో ఒకేసారి పన్నెండువేల రూపాయలు(డాలర్లలో 75) ఇస్తోంది. అయినా తాము చేసింది పెద్ద గొప్పని మన బిజెపి నేతలు చెప్పుకుంటారు. పాక్‌ పధకాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. మరోవైపు మన దేశానికి ఆరోగ్య సంరక్షణ చర్యలకు గాను ప్రపంచబ్యాంకు ఒక బిలియన్‌ డాలర్ల పాకేజ్‌ ప్రకటించింది. పాకిస్దాన్‌ కూడా తీసుకొని ఉండవచ్చు. కానీ ప్రపంచంలో కరోనా విపత్తు సహాయ చర్యలకు గాను మన దేశం జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం ఖర్చు చేసేందుకు ఆలోంచాలని ప్రకటించింది. కానీ మోడీ ప్రకటించింది 0.7శాతమే అని తెలిసినా కొందరు ఆహా ఓహౌ అంటూ విరగబడిపోతున్నారు. మన వివేకం ఏమైనట్లు ?
జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తీసుకుపోయామని బిజెపి వారు చెప్పుకుంటుంటే ఆ విషయాన్ని మనం లొట్టలు వేసుకుంటూ ఆహా మోడీ గారి ఘనత కదా అనుకుంటున్నాం. తలసరి జిడిపిలో ఎక్కడున్నాం, ఎవరితో పోల్చుకోవాలి, సంబరాలు చేసుకొనేంతగా పరిస్ధితి మెరుగుపడిందా అన్నది ప్రశ్న. 2017లో చైనా 75, పాకిస్ధాన్‌ 1501వ స్ధానాల్లో ఉంటే మనది 145. అదే 2019 అంచనాలకు వచ్చేసరికి చైనా 65, పాకిస్ధాన్‌ 151 మనం 139వ స్ధానంలో ఉన్నాం. ఇది కూడా ఘనతేనా, దీనికి బాధ్యత ఎవరిది ? మన కంటే నరేంద్రమోడీ ఉన్నారు కనుక చక్రం తిప్పి రాంకు పెంచారనుకుందాం కాసేపు. బంగ్లాదేశ్‌ ఈ కాలంలోనే 153 నుంచి 150, 143వ స్ధానానికి మెరుగు పరచుకుంది. అక్కడ మోడీ లేకపోయినా పది స్ధానాలు పైకి ఎగబాకితే మోడీ మంత్రదండం ఉన్నా కేవలం ఆరు రాంకులే పెరిగింది. దీని గురించి వ్యాఖ్యానం అవసరం ఏముంది ?
ప్రపంచంలో అనేక దేశాలు కరోనా కారణంగా వందలాది సంక్షేమ చర్యలను చేపట్టాయి. వీటన్నింటిలో ఇప్పటివరకు నరేంద్రమోడీ సర్కార్‌ చేపట్టింది అన్నింటి కంటే మెరుగ్గా ఉందని గానీ లేదా మెరుగైన చర్యలు చేపట్టిన వాటిలో ఒకటిగా ఉందని గానీ ఏ అంతర్జాతీయ సంస్ధా చెప్పలేదు, అయినా స్వంత డబ్బా మోగుతూనే ఉంది. ఒక బిలియన్‌ డాలర్లను మన ఆరోగ్య రంగానికి ఇస్తామని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇది అప్పా, దానమా అన్నది పక్కన పెడదాం. అప్పయినా దానమైనా మోడీ గారికి ఘనత తెచ్చే అంశం కాదు. ఈ సందర్భంగా బ్యాంకు మన దేశ డైరెక్టర్‌గా ఉన్నó జునైద్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ భారత్‌ కరోనా ఉద్దీపనకు భారత్‌ జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం వరకు ఖర్చు చేసేందుకు ఆలోచించాలని చెప్పాడు. ఆయన బంగ్లాదేశ్‌ ఆర్ధికవేత్త అయిపోయాడు కనుక సరిపోయింది గానీ అదే పాక్‌ జాతీయుడు అయి ఉంటే మా మోడీని ఇరకాటంలో పెట్టేందుకు అలా మాట్లాడి ఉండే వారని ఈ పాటికి బిజెపి మరుగుజ్జులు సామాజిక మాధమాల్లో గంతులు వేసి ఉండేవారు. ఒకటికి రెండు సార్లు ధృడ సంకల్పాన్ని యావత్‌ జాతి ప్రకటించాలని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మూడవసారి గృహబందీ పొడిగించినపుడు దేశ ప్రజలను ఉద్దేశించి మాటా పలుకు లేదు. సంకల్పాన్ని మరో ప్రదర్శించమని జనాన్ని కోరలేదు. ఎందుకనో ఎవరైనా ఆలోచించారా ?
సుభాషితాల వల్లింపు ఎక్కువైతే ఏమి జరుగుతుందో రాజకీయాల్లో జనాన్ని ఏమార్చటంలో తలపండిన నరేంద్రమోడీకి తెలియంది కాదు. తమ ఆర్ధిక ఇబ్బందుల గురించి రాష్ట్రాలు మెల్లగా గొణుగుతున్నాయి. కేంద్రం ఎలాంటి పాకేజ్‌లు ప్రకటించే సూచనలు లేవు. అందువలన మరోసారి చప్పట్లు కొట్టాలనో, విద్యుత్‌ దీపాలు ఆర్పి వేరే దిపాలు వెలిగించాలనో మరొకటో చెబితే ఈ కబుర్లు ఇంక చాల్లే అనే స్ధితి వచ్చేసింది కనుక జనంలో పలుచనౌతారు. అందుచేత మరో మాట లేకుండా ఆర్మీతో పూలు చల్లించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గృహబందీ తొలిసారి ప్రకటించినపుడు పెద్ద నోట్ల రద్దు మాదిరి ఆకస్మికంగా ప్రకటించేశారు. ఇంత పెద్ద దేశంలో కోట్లాది మంది ప్రతి రోజూ ప్రయాణిస్తారని, వారంతా ఎక్కడిక్కడ చిక్కుకుపోతే ఇబ్బందులు పడతారని సామాన్యుల గుండె చప్పుడు తనకంటే మరొకరికి తెలియదని చెప్పుకొనే ప్రధానికి తట్టలేదా ఎవరూ చెప్పలేదా ? మొత్తానికి ఏమి జరిగిందో ఇంతవరకు తెలియలేదు. పోనీ వలస కార్మికులను స్వస్ధలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించారు. అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలనేది కూడా ముందుకు చర్చించకుండా ఎంత నగుబాట్ల వ్యవహారం చేశారో చూశాము. ఎవరికీ బుర్రలేదా లేక మరేదైనా జరిగిందా ? ఆ ఖర్చు మేము భరిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన తరువాత నష్టనివారణ చర్యలు తీసుకున్నారు. పిఎం కేర్‌కు చేరిన వేల కోట్ల రూపాయల్లో రైల్వేలు ఇచ్చిన 150 కోట్లు కూడా ఉన్నాయి. దానికి ఎంత వచ్చిందో దేనికి కేటాయిస్తున్నారో మనకు తెలుసా ? వలన కార్మికుల రవాణాకు అయ్యే ఖర్చును పిఎం కేర్‌ నిధి నుంచి ఇస్తామని చెబితే సొమ్మేం పోయేది? పరాయి రాష్ట్రంలో చిక్కుకుపోయిన గుజరాతీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాంతో మిగతా చోట్ల నుంచీ అదే డిమాండ్‌ వచ్చింది. విదేశాలలో చిక్కుకుపోయిన వారిని తీసుకురావటం గురించి ప్రతిదేశమూ ఏర్పాట్లు చేసింది గానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచార ఆర్భాటం ఎక్కడా కానరాదు. దానికి వందే భారత్‌ అని ఒక పేరు, పోనీ అదేమైనా కొత్తదా కాదే వందే మాతరానికి అనుకరణ కాదా ? విదేశాల్లో వున్న వారికోసం విమానాలు, మిలిటరీ నావలను పంపి తీసుకువస్తున్నారు, వారి దగ్గర ఖర్చు వసూలు చేస్తున్నారు. దాన్నొక విజయంగా ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వలస కార్మికులు మేము టిక్కెట్లు కొని ప్రయాణిస్తామని మొత్తుకుంటున్నా రైళ్లను ఏర్పాటు చేసేందుకు వారాల తరబడి ఎందుకు ముందుకు రాలేదు. అలాంటి ఏర్పాటే ఉంటే ఔరంగాబాద్‌ దగ్గర వలస కూలీలు రైలు పట్టాలపై పడుకొనే వారా, వారి మీదుగా రైలు వెళ్లి దుర్మరణం చెందేవారా? అనేక రాష్ట్రాలు వేరే చోట చిక్కుకుపోయిన తమ రాష్ట్ర కూలీలను తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు. ఏమిటిది? మనం ఎటు పోతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా మరొకటా ?
చరిత్రలో, కొన్ని సినిమాల్లో కార్మికులను బందీలుగా తీసుకుపోయి వారిని అక్కడి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా చచ్చేంత వరకు వెట్టి చాకిరీ చేయించుకోవటం చూశాము. కర్ణాటక నుంచి వలస కార్మికులు వెళ్లిపోవటానికి వీల్లేదు, మేము నష్టపోకూడదని భవన నిర్మాణ కంపెనీల లాబీ వత్తిడి తెస్తే ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప ప్రత్యేక రైళ్లను రద్దు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి ? బిజెపి ఒక జాతీయ పార్టీ, దానికి ఒక విధానమంటూ ఉండాల వద్దా? ముదిమది తప్పిన వ్యవహారమా, మరొకటా ? కేంద్రం ప్రకటించిన విధానాన్ని కూడా అమలు జరపరా ?చివాట్లు పడిన తరువాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. గృహబందీ నిబంధనల సడలింపు గురించి కేరళ ప్రభుత్వం ప్రకటించగానే కేంద్ర హౌంశాఖ బహిరంగ ప్రకటనల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. మరి ఎడ్డి యూరప్ప విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? రెండు నాలుకల ధోరణి, కరోనాలో కూడా రాజకీయం చేయటం కాదా ?

Coronavirus In India: How Indians are dealing with the onset of a ...
మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేదని బిజెపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పోనీ బిజెపి పాలిత రాష్ట్రాలతో సహా పలుచోట్ల సడలించారు, భౌతిక దూరం పాటించకుండా మందుబాబులు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు, ( మందు షాపులు ఎందుకు తెరిచారంటే కరోనా కారణంగా తలెత్తిన నిధుల కొరతను అధిగమించటానికనేకదా పాలకులు చెబుతోంది) విరగబడి మందు కొనేందుకు పోటీలు పడటం వారికి ఉన్న దేశభక్తి ప్రదర్శనకు నిదర్శనం అనుకుందాం. అనుమతి ఇవ్వకపోతే వరుసల్లో మందుకోసం బేటాలతో పాటు బేటీలు కూడా నిలబడటాన్ని చూసిన తరువాత అయినా రాష్ట్రాలను ఎందుకు హెచ్చరించలేదో ఆలోచిస్తున్నామా ? ఈ కారణంగా ఎక్కడైనా కరోనా ప్రబలితే బాధ్యత ఎవరిది ?
కరోనా వ్యాప్తి నిరోధానికి గృహబందీని జనవరి మూడవ వారం నుంచే చైనాలో అమలు జరుపుతున్నారని తెలుసు. తబ్లిగీ జమాత్‌ సంస్ధ మలేషియాలో నిర్వహించిన సామూహిక సమావేశాల కారణంగా ఫిబ్రవరినెలలో కరోనా వైరస్‌ వ్యాపించిందని ప్రపంచానికంతకూ తెలిసిందే. ఆ అనుభవంతో మార్చినెల రెండవ వారంలో మన దేశం కంటే ముందు పాకిస్ధాన్‌లో అదే సంస్ధ సమావేశాలను అక్కడి ప్రభుత్వం నిషేధిస్తే అర్ధంతరంగా సమావేశాలను ముగించారు. అక్కడా వైరస్‌ వీరి కారణంగానే వ్యాపించింది. ఇవన్నీ తెలిసి ఢిల్లీలో అలాంటి సమావేశాలను ఎందుకు అనుమతించారు, ఎవరు అనుమతించారన్నది ఎవరమైనా ఆలోచించామా ? తబ్లిగీ సంస్ధ బాధ్యతా రహితంగా వ్యహరించిందనటంలో మరోమాట లేదు. వారి సమావేశాలకు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాగారే కదా అనుమతులు ఇచ్చింది. మలేషియా నుంచి ఇతర దేశాల నుంచి వైరస్‌ను మోసుకువచ్చిన వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, పోనీ టూరిస్టులనో మరో పేరుతోనే వచ్చారు, వారికి ఎందుకు పరీక్షలు చేయలేదు, కరోనా ఉంటే క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు. ఈ ప్రశ్నలన్నీ వేయాలా వద్దా? లేక మోడీ పార్టీ పాకేజ్‌లకు అమ్ముడు పోయిన లేదా మతోన్మాదం తలకెక్కిన మీడియా కరోనా వ్యాప్తికి కారణమైన తబ్లిగీ జమాత్‌ పేరుతో యావత్‌ ముస్లిం సామాజిక తరగతి మీద దాడి చేస్తుంటే, ఇదేమి విపరీతం అని ఎందుకు ఆలోచించలేకపోయాము, అసలు తబ్లిగీ సమావేశాలకు అనుమతి ఇవ్వటం వెనుక కారణం ఆ సమావేశాల తరువాత ఆయోధ్యలో ఇతర చోట్లా తలపెట్టిన అంతకంటే పెద్ద శ్రీరామనవమి సమావేశాలే కారణమని(తరువాత రద్దు చేయటం వేరే) ఎందుకు ఆలోచించలేకపోయాము ?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాకేజ్‌ లక్షా 70వేల కోట్లు, ఈ పాకేజ్‌తో నిమిత్తం లేకుండా జూన్‌లో రైతాంగానికి రెండువేల రూపాయల చొప్పున ఇవ్వాల్సిన దాదాపు 20వేల కోట్లు ముందే ఇచ్చి దాన్ని కూడా పెద్ద సాయంగా చిత్రించారు. ఇంకా ఇలాంటివే దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఉన్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోతే మార్చినెలలో మూడు రూపాయలు, తాజాగా పెట్రోలియం ఉత్పత్తుల మీద పెంచిన పన్నుల ద్వారా మొత్తం ఏడాదికి రెండులక్షల కోట్ల రూపాయల వరకు కేంద్రానికి అదనపు ఆదాయం రానుంది. డీజిల్‌ లేదా పెట్రోలు మీద లీటర్‌కు ఒక రూపాయి పెంచితే కేంద్రానికి ఏడాదికి 14వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డిఏ, జూలై, వచ్చే ఏడాది జనవరిలో పెరగాల్సిన(ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది కనుక ఎక్కువా తక్కువ కావచ్చుగానీ డిఏ పెరుగుతుంది) డిఏను కూడా జూలై వరకు పెంచకుండా 17శాతాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీని వలన అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు లక్షా 20వేల కోట్ల రూపాయలు చెల్లింపు బాధ్యత ఏడాదిన్నరపాటు తగ్గుతుంది. ఎల్‌టిసి, వేతనంతో కూడిన సెలవుల వంటి వాటి మీద మరికొన్ని ఆంక్షలు విధించారు. ఇవిగాక పారిశ్రామిక సంస్ధలు ఇచ్చిన వేల కోట్ల రూపాయల పిఎం కేర్‌ నిధులున్నాయి. అంటే ఇప్పటి వరకు జనానికి ఇచ్చింది ఎక్కువా కరోనా పేరుతో జనం జేబుల నుంచి కొట్టివేస్తున్నది ఎక్కువా? దేశభక్తి కళ్లతో చూసినా వేద గణితం ప్రకారం చూసినా ఎక్కువే కదా !
గృహబందీ వ్యవధి పెరిగే కొద్దీ ప్రధాని నరేంద్రమోడీ తన ఎత్తుగడలు మారుస్తున్నారు. దానిలో భాగమే తాజా పరిణామాలు. కేంద్రం సుభాషితాలు వల్లిస్తూ, పెత్తనం చలాయిస్తున్నది, పైసా విదల్చటం లేదు, సమస్యలను రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సి వస్తోంది. పోనీ ప్రత్యేక చర్యగా భావించి పరిమితికి మించి కరోనా అప్పులు చేసేందుకు అనుమతి ఇస్తున్నారా లేదు. కేంద్రం మీద నిధుల వత్తిడి తగ్గాలంటే రాష్ట్రాలలో ఒక ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యం అమ్మకాలను అనుమతించారు తప్ప అదేమైనా కరోనా నియంత్రణ చర్య కాదే.దేశంలోని మధ్య తరగతి, ధనికుల మన్ననలను పొందే చర్యలను ప్రకటించి భజన చేసే మీడియాలోనూ, చెక్క భజన చేసే పాలకపార్టీ సామాజిక మాధ్యమ విభాగాలతో ప్రచారం చేయిస్తున్నారు.
అత్యవసర వస్తువుల సరఫరాను మెరుగుపరచే పేరుతో కార్మికుల పని గంటలను ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనేక రాష్ట్రాలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. తాజా ఆదేశాల ప్రకారం యజమానులు కోరితే పన్నెండు గంటల వరకు విధిగా కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. మాకు అదనపు వేతనం లేదా ఓవర్‌ టైమ్‌ వద్దు నిబంధనల ప్రకారం ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తామంటే కుదరదు. వాస్తవానికి ఇప్పటికే కార్మిక చట్టాలను గాలికి వదలిన కారణంగా అనేక చోట్ల పన్నెండు గంటల పని చేయిస్తున్నారు. ఓవర్‌టైమ్‌లేదు, కనీస వేతనాలు, పని పరిస్ధితుల నిబంధనల అమలు లేదు. కేంద్రం, రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకొనేందుకు తక్షణ కారణం తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు వెంటనే తిరిగి వచ్చే అవకాశాలు పరిమితం కావటమే. అందువలన కొత్తవారిని నియమించి వారికి శిక్షణ ఇవ్వటం, ఒకసారి పని ఇచ్చిన తరువాత తొలగింపు సమస్యలతో కూడుకున్నది కావటంతో యజమానులు అందుబాటులో ఉన్న వారిమీదే పని భారం పెంపుదలకు పూనుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించటం తప్ప మరొక కారణం లేదు.

Prime Minister Narendra Modi On Coronavirus: Total Lockdown From ...
గృహబందీ సమయంలో సరకు రవాణాలో ఇబ్బందులు తప్ప ఇంతవరకు నిత్యావసర సరకుల కొరత ఏర్పడలేదు. నిజానికి అనేక కారణాలతో వినిమయం పరిమితం అయింది. తగ్గిపోయింది కూడా. కరోనాతో నిమిత్తం లేకుండానే డిమాండ్‌ పడిపోయింది.2011-12తో పోల్చితే 2017జూలై 2018జూన్‌ మధ్య గ్రామీణ ప్రాంతాలలో వినియోగ గిరాకీ 8.8శాతం పడిపోయిందని జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) తెలిపింది. దేశ జనాభాలో మూడింట రెండువంతుల మంది గ్రామాలలోనే ఉంటున్నారు. దుస్తులు, ఆహారం,విద్యపై ఖర్చు పడిపోయింది, తృణ ధాన్యాల వంటి అత్యవసర వస్తువుల డిమాండ్‌ 20శాతం వరకు పడిపోయిందని అంచనా.1972-73 తరువాత తొలిసారిగా దేశంలో పట్టణ ప్రాంతాలలో రెండుశాతం డిమాండ్‌ పెరిగినా గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన కారణంగా మొత్తంగా 3.7శాతం తలసరి వినిమయ ఖర్చు పడిపోయింది. అయితే ప్రభుత్వం ఈ గణాంకాలను విశ్లేషించే పేరుతో ఖరారు చేయకుండా తొక్కి పెడుతోంది. కరోనా కారణంగా గ్రామాలకు తరలి పోతున్న కోట్లాది మంది వలస కార్మికులకు గ్రామాలలో పనులు ఉండవు. అందువలన గ్రామీణ వినియోగం రానున్న రోజుల్లో ఇంకా పడిపోయే అవకాశం ఉంది. అటువంటపుడు పన్నెండు గంటల పాటు పనిచేయించాల్సిన అవసరం ఏముంది ?
2016లో చేసిన బుర్ర తక్కువ పని పెద్ద నోట్ల రద్దు వలన మోడీగారు చెప్పినట్లు సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు కలిగాయి. మరుసటి ఏడాది ప్రవేశపెట్టిన జిఎస్‌టి మరికొంత దెబ్బతీసింది. ఆ దెబ్బలకు అలవాటు పడుతున్న స్ధితిలో పులిమీద పుట్రలా కరోనా ప్రభావం దేశ ఆర్ధిక స్ధితిని మరింత దిగజార్చనుంది. జిడిపి వృద్ధి రేటు సున్నా అవుతుందా ఇంకా దిగజారుతుందా అన్నది ఎవరూ చెప్పలేని స్ధితి. అయినా ఇంకా మంచిదినాలు రానున్నాయి(అచ్చేదిన్‌) అంటే మూతికి చిక్కెం బిగించి కంటికి కనపడేలా దూరంగా గడ్డి కట్ట చూపుతుంటే ఆశతో ముందుకు సాగే గుర్రాల మాదిరి పరుగెడుతూనే ఉన్నాం. మన మాదిరి మెదడు పెరగలేదు కనుక అవి పరుగెడతాయి, మన సంగతేమిటి.
ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే ఇక్కడ పెంచుతాము, తగ్గితే తగ్గిస్తాము అని కబుర్లు చెప్పారు. మార్చినెల 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పీపా ధర సగటున 60డాలర్లకు కొనుగోలు చేసిన మనం ఏప్రిల్‌లో ఇరవై డాలర్లకు లోపే కొన్నాం. జనవరి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు తగ్గుతున్నాయి, మార్చినెలలో మరింత తగ్గాయి. అయినా మార్చి 16 నుంచి నేటి వరకు అంతకు ముందు ఉన్న ధరనే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎందుకు ఆ పని చేస్తున్నారో వారు చెప్పరు, ఏమిటీ పట్టపగలు జేబు కొట్టుడు అని మనమూ అడగం. ధరలు తగ్గిన తరువాత వినియోగదారుల మీద రెండులక్షల కోట్ల రూపాయల వరకు పన్నుబాదితే ఇదేమని ప్రశ్నించలేని బలహీనత లేదా లొంగుబాటు ఏమిటి ?

Brick Tamland Anchorman - I have no idea What's going on! | Funny ...
తప్పులు అందరూ చేస్తారు. వాటిని అంగీకరించి సరిదిద్దుకోవటమే గొప్ప అని మన పెద్దలు చెప్పారే. కమ్యూనిస్టులు తాము అనుసరించిన విధానాలు, ఎత్తుగడల తప్పుల గురించి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభల్లో సమీక్షించుకుంటారు. వాటిని బహిరంగంగానే అంగీకరిస్తారు. కొందరు దెప్పుతున్నట్లు విదేశీ సిద్ధాంతాలను పాటించేవారిలోనే ఆ నిజాయితీ కనిపిస్తున్నప్పుడు పక్కా భారతీయం అమలు జరుపుతున్నామని చెప్పుకొనే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదం అని జాతికి ఎప్పుడైనా చెప్పారా ? ఎందుకు చెప్పలేదు ? ఆయన ఖర్మకు ఆయన్ను వదిలేద్దామా ? వ్యక్తులుగా అయితే అలాగే చేద్దుము, కానీ ప్రధాని, ముఖ్యమంత్రులు వ్యక్తులు కాదే, వ్యవస్ధకు ప్రతినిధులు. వారి ఖర్మలకు జనం అనుభవించాలా ? ఇదెక్కడి వేదాంతం ? ఇదెక్కడి భారతీయత ?
ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి వారు ఆలపించిన భజన గీతాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.ఏ విదేశీ దుండగీడు వచ్చినా చేవచచ్చినట్లు భరించి పాలన అప్పగించి ఎన్ని విధాలుగా నష్టపోయామో తెలిసిందే. అలాగే స్వదేశీయుడు ఏమి చేసినా అలాగే భరించాలా ? కొంత మంది మన వేదవిజ్ఞానం, పురాతన తర్కజ్ఞానం గురించి గొప్పగా చెబుతారు. అదే నిజమైతే మనం వాటిలో ఆవగింజలో అరవయ్యో వంతు వంటబట్టించుకున్నా ఎందుకు అనే ఒక చిన్న ప్రశ్న కూడా మనల్ని మనం, పాలకులను అడిగి ఉండేవారం కాదా ? ఎక్కడుందీ లోపం, ఎవరైనా ప్రశ్నిస్తే కమ్యూనిస్టు విదేశీ సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకున్నారని ఎదురుదాడికి దిగుతారు. ఏం జరిగినా నోరు సహా అన్నీ మూసుకొని కూర్చోమని మన స్వదేశీ వేదజ్ఞానం, తర్కం చెప్పిందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కనుచూపు మేరలో హెలికాప్టర్‌ మనీ కానరావటం లేదు కెసిఆర్‌ సార్‌ !

16 Thursday Apr 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, USA

≈ Leave a comment

Tags

covid 19 India Stimulus package, COVID-19, Helicopter money, KCR

KCR Explains About Helicopter Money | CM KCR Press Meet | 11/04 ...

ఎం కోటేశ్వరరావు
గృహబందీ 2.0(లాక్‌డౌన్‌) మే నెల మూడవ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసం దేశంలోని అన్ని తరగతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యమంత్రుల తరగతిలో తెలంగాణా వజీర్‌ ఆలా కె.చంద్రశేఖరరావు మరింత ఆశాభంగం చెంది ఉండాలి. మీడియా ముందుకు రావటానికి బిడియ పడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పైకి బయట పడకపోయినా పెద్దన్న చెప్పింది జరిగేట్లు చూడమని దేవుళ్లందరినీ గృహబందీ కారణంగా లోలోపల అయినా వేడుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్ధిక పరిస్ధితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేట్లు ఉంది మరి.
గృహబందీ పొడిగించటం అని వార్యం అని తేలిపోయి, లాంఛన ప్రకటన వెలువడటమే తరువాయి అన్న దశలో హెలికాప్టర్‌ మనీ అందచేయాలని కెసిఆర్‌ ప్రతిపాదించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే ఆ ”ఖ్యాతి”లో తన వాటా ఎక్కడ తగ్గుతుందో అన్న తొందరలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సలహా తనదే అని తన భుజాలను తానే చరుచుకున్న విషయం తెలిసిందే. సరే తరువాత ఏమైందో చెప్పుకుంటే అంత బాగోదు. మనోభావాలు దెబ్బతినవచ్చు.
మన కెసిఆర్‌ సార్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడక ముందే అమెరికా, జపాన్‌, ఇతర దేశాల పత్రికల్లో ఇతరంగా దీని గురించి చర్చ ప్రారంభమైంది. విలేకర్ల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నోరు మూయిస్తారు గనుక, ఏ విలేకరైనా ప్రశ్న అడిగితే కెసిఆర్‌ ముందు అవమానాల పాలుకావటంతో పాటు ఆఫీసుకు వెళ్లే సరికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని స్ధితి కనుక దాని మంచి చెడ్డలు కెసిఆర్‌ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉండదు.
ప్రస్తుత సంక్షుభిత స్దితిలో దీన్ని ప్రతిపాదిస్తే తాను ఖ్యాతి పొందవచ్చన్న ఆలోచనగానీ లేదా నరేంద్రమోడీ అలాంటి పని చేయవచ్చన్న అత్యాశగానీ కారణాలు ఏమైనా కెసిఆర్‌ ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రధాని ప్రసంగం లేదా కేంద్రం నుంచి రెండవ విడత వెలువడుతుందని భావిస్తున్న ఉద్దీపన 2.0గానీ అలాంటి ఆలోచన కలలో కూడా పెట్టుకోవద్దు అని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు ఉన్న ఉపాధి కోల్పోయి గోచిపాతలతో మిగిలారు. ప్రభుత్వాల సంక్షేమ పధకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో కూడా ముందస్తు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ మీద లీటరుకు కరోనా సమయంలోనే మూడేసి రూపాయల పన్ను పెంచి రాబోయే రోజుల్లో మరింతగా పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి సర్కార్‌ జనానికి పన్ను పోటు తగ్గిస్తుందని లేదా ధనికుల దగ్గర మూలుగుతున్న సంపదల్లో కొద్ది మొత్తం తీసుకొని కరోనా కష్టకాలాన్ని గట్టెక్కిస్తుందని ఎవరైనా ఊహించగలరా ? మునిగిపోతున్న పడవలో ప్రయాణించే వారికి గడ్డిపోచ కనిపించినా దాన్ని పట్టుకొని బయటపడదామని చూస్తారు. రాష్ట్రాల పరిస్ధితి ఇలాగే ఉంది కనుక చంద్రశేఖరరావు అలాంటి ఆశతో హెలికాప్టర్‌ మనీ కోసం చూస్తున్నారని అనుకోవాలి.
చాలా మంది తెలంగాణా ముఖ్య మంత్రికి ఇలాంటి మహత్తర ఆలోచన ఎలా తట్టిందబ్బా అనుకుంటున్నారు. రెండు విషయాలు జరిగి ఉండవచ్చు. ఒకటి ముఖ్యమంత్రి పత్రికలు లేదా ఇంటర్నెట్లో వార్తలు చదువుతూ ఉండి ఉండాలి.రెండవది ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలు నాకు నివేదించాలి అని అధికార యంత్రాంగానికి పని చెప్పి ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి ముందురోజు అంతర్జాతీయ మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. మరో రూపంలో అంతకు ముందే మన దేశంలో కూడా కొంత మంది ఇలాంటి సూచనలే చేశారు. ఇక జరిగిందేమిటో మీరే ఊహించుకోవచ్చు.
పూర్వం వైద్యులు చేయగలిగింది చేశాం చివరి ప్రయత్నంగా మీకు అంగీకారమైతే గరళ ప్రయోగం చేద్దాం అనేవారని చదువుకున్నాం. అంటే రోగి ఆటో ఇటో అన్నమాట. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర సంక్షోభానికి గురైనపుడు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై చేతులెత్తేసే స్దితిలో జనానికి చేతి నిండా డబ్బు ఇస్తే ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటుందనే ఒక దివాలాకోరు ఆలోచన ఇది. దీనికి హెలికాప్టర్‌ మనీ అని ఎందుకు పేరు పెట్టారు ? హెలికాప్టర్లు, మోటారు వాహనాలు, రైళ్లు లేని రోజుల్లో గనుక ఇలాంటి పరిస్ధితి మీద ఆలోచన వచ్చి ఉంటే దానికి గుర్రపు బండి లేదా గుర్రపు డబ్బు అనే వారేమో. ఎందుకంటే అప్పుడు అదే వేగంగా, కొండలు, గుట్టల మీద ప్రయాణించే సాధనం కనుక.
1969లో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారింది. ఆ సమయంలో వినిమయాన్ని పెంచటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించాలన్న ఆలోచనతో ఆర్ధికవేత్త మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ హెలికాప్టర్ల ద్వారా జన సమూహాలకు డబ్బును జారవిడిచి జనానికి డబ్బు అందించి కొనుగోలుశక్తిని పెంచవచ్చని తొలిసారిగా ఆ పద్దతి, పదప్రయోగం చేశాడు. హెలికాప్టర్లతో వేగంగా డబ్బు సంచులు మోసుకుపోవచ్చు, జనానికి అత్యంత సమీపానికి వాటిని దించవచ్చు.అలాంటిది మరొక సాధనం లేదు. నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించి జనానికి అందచేయటం ఇక్కడ కీలకం, దాన్ని తిరిగి జనం నుంచి వసూలు చేయాలా లేదా అంటే అది ఆయా ప్రభుత్వాల వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఉచితంగా ఇవ్వాలన్నదే హెలికాప్టర్‌ మనీ ఉద్ధేశ్యం. అనూహ్యంగా ఈ పని చేయాలని మిల్టన్‌ చెప్పాడు తప్ప చెయ్యలేదనుకోండి !

KCR Explains About Helicopter Money
ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు ? ప్రపంచంలో సంక్షోభం ఏర్పడినపుడు ఆర్ధిక వ్యవస్ధలను తిరిగి గాడిలో ఎలా పెట్టాలి అన్నది ఒక చర్చ. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అంటే ఆస్తుల కల్పన ద్వారా ఉపాధి కల్పించి జనం చేతుల్లో డబ్బు ఉండేట్లు చూడటం. దీన్ని కీన్స్‌ సిద్దాంతం అంటారు. గతంలో అమెరికాలో ఇదే చేశారు. పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు, వివిధ సేవలకు భవనాల(ఆసుపత్రులు, పాఠశాలల) వంటి మౌలిక సదుపాయాలు కలిగించటం దానిలో భాగమే. అవే తరువాత అమెరికా అభివృద్దికి ఎంతో తోడ్పడ్డాయి. మన దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం అలాంటిదే. కీన్స్‌కు విరుద్దమైనది మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ సిద్దాంతం. మౌలిక సదుపాయాల కల్పన అంటే వెంటనే జరిగేది కాదు. కొంత వ్యవధి పడుతుంది. కనుక ఎటిఎం మిషన్‌లో ఇలా కార్డు పెట్టగానే అలా డబ్బు వచ్చినట్లు జనానికి డబ్బు ఇచ్చి ఖర్చు చేయించటం ద్వారా వెంటనే వస్తువులకు డిమాండ్‌ పెంచవచ్చు అనే వినిమయదారీ సిద్ధాంతం మిల్టన్‌ది. హెలికాప్టర్‌ మనీ ప్రతిపాదనలు చేసే వారు దీన్ని నమ్ముతున్నారని అర్ధం.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.75వేల కోట్ల ఉద్దీపన పధకం ప్రకటించింది. ఇది ఏమూలకూ చాలదు. మన జిడిపి విలువ 2020అంచనా 203 నుంచి 245లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది. దీనిలో పైన చెప్పుకున్న మొత్తం0.86 నుంచి 0.7శాతమే. ఇది ఏమూలకూ చాలదు, కనీసం ఐదుశాతం ఉద్దీపనకు కేటాయించాలి అంటే పది నుంచి 12లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అనేక మంది చెబుతున్నారు. దీని కోసం నోట్ల ముద్రణ ఒక మార్గం అయితే, పరిమాణాత్మక సడలింపు అంటే మార్కెట్‌లో డబ్బు సరఫరాను పెంచటం మరొక పద్దతి. దీనిలో కూడా నోట్ల ముద్రణ కొంత మేరకు ఉంటుంది. 2008 సంక్షోభం తరువాత అమెరికాలో ఈ పద్దతిని కొంత మేరకు అమలు జరిపారు గానీ సంక్షోభం పరిష్కారం కాలేదు, త్వరలో మరొక సంక్షోభంలో కూరుకుపోతుందని కరోనాకు ముందే వార్తలు వచ్చాయి.
ముఖ్య మంత్రి కెసిఆర్‌ ప్రతిపాదించిన హెలికాప్టర్‌ మనీ పధకాన్ని కేంద్రం అమలు జరిపితే ఏం జరుగుతుంది ? కొంత సొమ్మును రాష్ట్రాలకు కేటాయిస్తారు. దాన్ని తిరిగి కేంద్రానికి ఇవ్వనవసరం లేదు.రాష్ట్రాలు తాము ఇవ్వదలచుకున్న వారికి ఆ సొమ్మును పంపిణీ చేస్తాయి, జనం సరకులు కొనుగోలు చేస్తే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. సరకులు అమ్ముడు పోతే తయారీ డిమాండ్‌ పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది, తద్వారా కార్మికుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది మరింత డిమాండ్‌ను పెంచుతుంది. ఇది ఒక అంచనా, అభిప్రాయం. అయితే పరిస్ధితులు బాగోలేనపుడు, రేపేం జరుగుతుందో తెలియనపుడు మనవంటి దేశాలలో సహజంగానే జనం తమ ఖర్చులను తగ్గించుకుంటారు, డబ్బును పొదుపు చేసి తమదగ్గరే ఉంచుకుంటారు. బ్యాంకుల్లో సొమ్మును ఏం చేస్తారో అనే అపనమ్మకం కారణంగా జనం ఇటీవల బ్యాంకుల్లో సొమ్ముదాచుకోవటం లేదనే వార్తల విషయం తెలిసిందే. ఒక వేళ అదే జరిగితే హెలికాప్టర్‌ మనీ పధక లక్ష్యం నీరుకారిపోతుందన్నది ఒక అభిప్రాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చాయి. ఆ సొమ్మంతా తిరిగి పెట్టుబడులుగా మార్కెట్లోకి రాలేదు. తమ రిజర్వుసొమ్ము, ఇతర ఖాతాల్లో వారు దాచుకున్నారు. జనానికి తగిన ఆదాయం లేకపోవటం, వస్తుకొనుగోలుకు చేసే వ్యయానికి తగిన డబ్బు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతాలలో వస్తు వినియోగం తగ్గింది. మరోమాటలో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇది పరిశ్రమల మీద పడి నిరుద్యోగం పెరిగింది, అనేక సంస్ధల మూతకు దారి తీసింది. ఈ పరిస్ధితి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది. అది మరింత నిరుద్యోగానికి కారణమైంది. స్వయం సహాయ సంస్ధల ఏర్పాటు లక్ష్యం స్వయం ఉపాధిని కల్పించటం, కానీ జరిగిందేమిటి ? వాటికి ఇచ్చే రుణాలను వేరే అవసరాలకు వినియోగించినందున అసలు లక్ష్యం వెనుకబడిపోయింది.
పశ్చిమ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో పరిస్ధితులు వేరు. ఈ రోజు ఎంత వస్తే అంత ఎలా ఖర్చు చేయాలి అనే వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే అప్పుచేసి పప్పుకూడు. నిరుద్యోగ భృతి వంటి హామీలున్నాయి గనుక అక్కడ జనం అలా తయారయ్యారు. మనకా సామాజిక రక్షణ లేదు. డబ్బు వస్తే ముందు పొదుపు ఎలా చేయాలా అని చూస్తాం. ఈ వైఖరి మన దేశాన్ని ఇప్పటి వరకు రక్షిస్తోంది. కానీ కార్పొరేట్‌ కంపెనీలు అమెరికా పద్దతికి నెట్టాలని చూస్తున్నాయి. దానిలో భాగమే ఎన్ని క్రెడిట్‌ కార్డులు కావాలంటే అన్ని కార్డులు ఇవ్వటం, వాయిదాల పద్దతిలో వస్తువుల అందచేత వంటివి.
మన నరేంద్రమోడీ గారు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత దగ్గరి స్నేహితుడో అందరికీ తెలిసిందే జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల చొప్పున మూడునెలలు ఇస్తామని ప్రకటించారు. డాలర్లలో ఏప్రిల్‌ 16 డాలరు మారకపు విలువ రూ.76.75లో 19.51 డాలర్లు. అదే ట్రంప్‌ నెలకు పెద్ద వారికి 1200 డాలర్లు, పిల్లలకు ఐదు వందల చొప్పున ప్రకటించారు, కానీ పెద్ద వారికి మూడువేలు, పిల్లలకు 1500చెల్లించాల్సిన అవసరం ఉందని గతంలో ట్రంప్‌ వద్ద కొంతకాలం సమాచార అధికారిగా పని చేసిన ఆంథోనీ కారముసి చెప్పాడు. వడ్డీ రేటు సున్నాకు దగ్గరలో ఉన్నందున, మరిన్ని అప్పులను కొనుగోలు చేస్తామని ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) చెప్పిన కారణంగా మరింత సొమ్ము చలామణిలోకి వస్తుందని, గత మూడు వారాల్లో ఒక లక్ష కోట్ల డాలర్లను చలామణిలోకి తెచ్చినట్లు(ఏప్రిల్‌ తొమ్మిది నాటికి మన రూపాయల్లో 76 లక్షల కోట్లు ) కారముసి చెప్పాడు.
హెలికాప్టర్‌ మనీ సరఫరా గురించి ఆలోచించే వారు రాగల ముప్పును కూడా గమనంలోకి తీసుకోవాలనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. జనం దగ్గరకు ఒక్కసారిగా డబ్బు చేరినపుడు డిమాండ్‌ మేరకు సరకులు లేకపోతే ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో గృహబందీ సమయంలో జరుగుతున్నది అదే. జనం దగ్గర పరిమితంగానే డబ్బులున్నాయి, అయినా సరకుల రవాణాపై ఆంక్షలున్న కారణంగా ధరలు పెరిగాయి. సరకులు ఉన్నా ఆయాచితంగా ఒక్కసారిగా డబ్బు జనం చేతుల్లోకి వస్తే ధరలు పెరుగుతాయి, దాని పర్యవసానం వేతన పెరుగుదల ఉంటుంది, ద్రవ్యోల్బణాన్ని రిజర్వు బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా అడ్డుకుంటాయో కూడా చూడాలని కూడా హెచ్చరిస్తున్నారు. అసలు అమెరికా మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ కూడా ఒకసారి అమలు జరపాలి తప్ప మరోసారి పునరావృతం కాకూడదని కూడా చెప్పాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజాకర్షక రాజకీయవేత్తలు ఇదేదో బాగుందని తాము చేయాల్సిన వాటిని కూడా చేయకుండా ప్రింటింగ్‌ ప్రెస్‌లవైపు పరుగులు తీస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇలా చేస్తే రిజర్వుబ్యాంకుల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని,ఆర్ధిక అరాచకం పెరుగుతుందని, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని, ఇప్పుడంత అవసరం లేదనే వారు మరికొందరు.

CM KCR about Helicopter Money| KCR Press meet| 4D NEWS #helicopter ...
సార్వత్రిక కనీస ఆదాయ పధకాన్ని ముందుకు తెచ్చిన వామపక్ష భావాలున్న ఆర్ధికవేత్తలు ఇటీవల హెలికాప్టర్‌ మనీని ముందుకు తెచ్చారని దీనివలన ప్రభుత్వాలు చేసే ఖర్చు పడిపోతుందన్నది ఒక విమర్శ. ఈ పధకాన్ని అమలు జరిపితే వనరుల కేటాయింపు, కష్టపడేవారికి ప్రోత్సాహకాలు కరవు అవుతాయన్నది మరొక వాదన. అయితే గతంలో పెదవి విరిచిన వారు కూడా మరొక మార్గం ఏమీ కనిపించక ఏదో ఒకసారికి అయితే సరే అన్నట్లుగా తలూపుతున్నారు. నేరుగా నగదు పంపిణీ చేయకపోతే ఆర్ధిక వ్యవస్ధ మరింత దిగజారుతుందన్నది కొందరి హెచ్చరిక.
చివరిగా చెప్పవచ్చేదేమంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదించినట్లుగా కేంద్రం హెలికాప్టర్‌ మనీ అంద చేసే అవకాశాలు దాదాపు లేవు. కరోనా కారణంగా అనేక మంది చెబుతున్నట్లు అభివృద్ధి రేటు తిరోగమనంలోకి దిగిపోయి తిరిగి పైకి లేచే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినపుడు గరళం పోయాల్సిన పరిస్ధితి వస్తే తప్ప ఇలాంటి పరిస్ధితి రాదు. అందువలన బంగారు తెలంగాణా ముఖ్యమంత్రిగా ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు బీద అరుపులు అరిస్తే, జనాన్ని విస్మరిస్తే అన్ని తరగతుల్లో విస్వసనీయత సమస్య తలెత్తుతుంది. అదే జరిగితే రాజకీయంగా, పార్టీ పరంగా అనూహ్యపరిణామాలకు నాంది అవుతుంది. అలాంటి పరిస్ధితిని కెసిఆర్‌ కొని తెచ్చుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: