• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: COVID-19

జాతీయవాద పులి మీద నరేంద్రమోడీ స్వారీ !

24 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Eurasia, India economy slowdown, Narendra Modi, Narendra Modi fifth biggest geopolitical risk, nationalism

ఎం కోటేశ్వరరావు
ప్రతి ఉగాదికి పంచాంగం చెప్పే పండితుల గురించి మనకు తెలిసిందే. వాటిలో సానుకూల అంశాలు తప్ప ప్రతి కూల అంశాలు సాధారణంగా చోటుచేసుకోవు. మహా అయితే కరవుల గురించి చెబుతారు. రాజకీయ పార్టీలకు పంచాంగం చెప్పే వారు ప్రతికూలంగా చెబితే వారు కార్యాలయాల గేటును ఎలా దాటుతారో వారికే తెలియదు. కనుక అది కూడా బి పాజిటివ్‌గానే ఉంటుంది.


ఉగాది పంచాంగానికి భిన్నంగా ప్రపంచానికి లేదా దేశాలకు ముప్పుగా పరిణమించే వారు లేదా పరిణామాల గురించి చెప్పేరాజకీయ జోశ్యులు కూడా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పని చేసే యూరేసియా గ్రూప్‌ వాటిలో ఒకటి. 2020లో ప్రపంచ రాజకీయ ముప్పుగురించి జనవరిలో ఒక విశ్లేషణను వెలువరించింది. తరువాత మార్చినెలలో దానిని నవీకరించింది. అయినా తొలి పది ముప్పు జాబితాలో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా అమెరికా గడ్డమీద పని చేస్తున్న సంస్ధ గనుక ప్రపంచానికి అమెరికా నుంచి తలెత్తే ప్రధాన ముప్పు జాబితాలో అక్కడి రాజకీయాలను చేర్చదు. కానీ ఈ ఏడాది దానికి భిన్నంగా తొలి ప్రపంచ రాజకీయ ముప్పుగా అమెరికా అంతర్గత రాజకీయాలని పేర్కొనటం విశేషం. రెండవదిగా సాంకేతిక రంగం, వాణిజ్యంలో చైనా-అమెరికా యుద్దం, మూడవదిగా అమెరికా-చైనా రాజకీయ వ్యవస్ధల మధ్య ముదురుతున్న వైరం, నాలుగవదిగా కార్పొరేట్‌ సంస్ధల పోరు, ఐదవదిగా నరేంద్రమోడీ వైఖరిని పేర్కొన్నది.


ఈ జోశ్యం లేదా రాజకీయ అంచనాలకు అనుగుణ్యంగానే తొలి ఎనిమిది నెలల్లో దాదాపు వాటి చుట్టూనే పరిణామాలు జరగటాన్ని గమనించవచ్చు. జనవరి నాటికి కరోనా వైరస్‌ అంశం యూరేసియా గ్రూప్‌ పరిగణనలో లేదు. మార్చినాటికి సవరించినా అప్పటికి అంతగా సమస్య తీవ్రతరం కాలేదు. ప్రపంచ రాజకీయ ముప్పుకు సంబంధించి తొలి ఐదు అంశాలలో పక్కాగా మొదటిది డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలో, రెండవది ఆ పెద్ద మనిషి జిగినీ దోస్త్‌ నరేంద్రమోడీకి చెందాయి.మరో రెండింటిలో ట్రంప్‌కు మద్దతుగా నరేంద్రమోడీ ఉండటం యాదృచ్చికమా ? పధకం ప్రకారం జరిగిందనుకోవాలా ? నాటకీయ పరిణామాల మధ్య తిరిగి ట్రంప్‌ ఎన్నికైతే పాత కౌగిలింతలు కొనసాగుతాయి, సర్వేలు చెబుతున్నట్లుగా జోబిడెన్‌ గెలిస్తే నరేంద్రమోడీ కొత్త ప్రియుడి ప్రసన్నం కోసం ప్రయత్నించాల్సిందే.
2020లో మోడీ తన రెండవ పదవీ కాలంలో ఆర్ధిక అజెండాను ఫణంగా పెట్టి వివాదాస్పద సామాజిక విధానాలను ముందుకు తెస్తారని, మతపరమైన, ఒంటెత్తువాదంతో అస్దిర పరిస్ధితి ఏర్పడుతుందని, విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురుదెబ్బలు తగులుతాయని కూడా యూరేసియా నివేదిక పేర్కొన్నది. ఆర్టికల్‌ 370రద్దు, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు, ఎన్‌ఆర్‌సి, సిఏఏ వంటి అంశాలను మరింత ముందుకు తీసుకుపోతారనే జోశ్యం దానిలో ఉంది. అయితే అనూహ్యంగా కరోనా సమస్య ముందుకు రావటంతో అవి తాత్కాలికంగా తెరవెనుకకు పోయాయి. విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తున్నదే.


రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి ఆర్ధిక అంశాలను విస్మరించి వివాదాస్పద సామాజిక అంశాలను ముందుకు తెచ్చారనేందుకు తార్కాణంగా గత ఏడాది తొలి మూడు నెలల కాలంలో 8శాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగవ త్రైమాస కాలానికి 4.2శాతానికి పడిపోవటం తెలిసిందే. యూరేసియానే కాదు అనేక మంది ఆర్ధిక వేత్తలు చెప్పినట్లు ఈ దిగజారుడుకు కరోనాకు ఎలాంటి సంబంధం లేదు. అనేక మంది ముందే హెచ్చరిస్తున్నా మందగమనం తప్ప మాంద్యం లేదని ప్రభుత్వం బుకాయించిందే తప్ప వాస్తవాన్ని అంగీకరించలేదు. వరుసగా ఆరునెలల పాటు ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో పయనిస్తే దాన్ని అధికారయుతంగా మాంద్యం అని పరిగణిస్తారు. ఇప్పుడు దేశం వర్తమాన ఆర్దిక సంవత్సరం తొలి మూడుమాసాల్లో ( ఏప్రిల్‌-జూన్‌) తిరోగమనం అన్నది స్పష్టం కాగా అది ఏ స్దాయిలో ఉందో ఇంకా వెల్లడించాల్సి ఉంది. దేవుడు నైవేద్యం తినడనే వాస్తవం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లుగా ఆర్ధిక దిగజారుడు ముందే తెలుసు గనుక కార్పొరేట్లకు రాయితీలతో వర్తమాన సంవత్సర బడ్జెట్‌ను రూపొందించారు. కరోనా రాకపోయినా దానితో ఫలితం ఉండేది కాదు. కరోనా రావటంతో ఇప్పుడు అసలు విషయాన్ని దాచి పెట్టి కరోనా పేరుతో విదేశాంగ విధానం, ఆర్ధిక రంగాలలో జాతీయ వాదానికి తెరతీసి దేశ పౌరుల దృష్టిని మళ్లించేందుకు పూనుకున్నారు.


ప్రపంచీకరణ నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతారు. లేనట్లయితే ఆ క్రమంలో దాని ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ మద్దతు దెబ్బతింటుంది అని ప్రముఖ అమెరికన్‌ ఆర్ధిక వేత్త పాల్‌ శామ్యూల్‌సన్‌ హెచ్చరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎలాంటిదో కరోనా వైరస్‌ నిరూపించింది.దాని కంటే ముందే ప్రపంచీకరణ సంగతి తరువాత ముందు మన సంగతి మనం చూసుకుందామని ప్రతి దేశం రక్షణాత్మక చర్యలకు, జాతీయవాదానికి పెద్దపీట వేస్తున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పీఠీన ఉంటే మన దేశం, నరేంద్రమోడీ కూడా అదే బాటలో ఉన్నారు.

ఓకల్‌ ఫర్‌ లోకల్‌ (స్ధానిక తయారీ వస్తువులనే అడగండి) అని మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు, సరిహద్దు సమస్యను సాకుగా చూపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు వంటివి వాటిలో భాగమే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొన్ని జాతీయవాద ధోరణులను చూద్దాం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ గత ఎన్నికల్లో ఆ నినాదంతోనే ప్రచారం చేశాడు. దానిలో భాగంగానే చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించింది. చైనా వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలపై, ఇతర దేశాలపై తాను ఆంక్షలను ప్రకటించటమే కాదు, తన ఆంక్షలను ఇతరులు కూడా పాటించాలని లేనట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటానని అమెరికా బెదిరిస్తున్నది. ఇరాన్‌ నుంచి మన దేశం చమురు కొనుగోలు నిలిపివేయటానికి ఈ బెదిరింపే కారణం.


గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అనుసరిస్తున్న వైఖరితో తలెత్తిన పర్యవసానాల కారణంగా ఇతర మార్కెట్లలో ప్రవేశించేందుకు బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పేరుతో చైనా తన పధకాలను ముందుకు తీసుకుపోతున్నది. కొందరు దీనిని విస్తరణవాదం అని చిత్రిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బ్రిటన్‌ వంటి దేశాలు విస్తరణవాదంలో భాగం మనవంటి అనేక దేశాలను వలసలుగా చేసుకున్నాయి. చైనా ఏ దేశాన్నీ ఆక్రమించలేదు. మిగతా దేశాల మాదిరి వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుంటోంది.


అమెరికా, జపాన్‌లను ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేని ఐరోపా దేశాలు సమిష్టిగా వ్యవహరించేందుకు ఐరోపా యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.అయినా సభ్యదేశాలన్నీ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. దానిలో భాగంగానే యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగింది. వస్తువుల కోసం చైనా, లేదా ఆసియా దేశాల మీద ఆధారపడకూడదనే ధోరణి ఐరోపాలో పెరుగుతోంది. ఐరోపా జాతీయవాదంతో ఐరోపా యూనియన్‌ ముందుకు పోతున్నది.
ఆర్ధిక జాతీయవాదానికి ముద్దు పేరు ఆర్ధిక దేశభక్తి. ఆర్ధిక జనాకర్షక నినాదాలు, చర్యలు ఆచరణలో భాగం. తొలి రోజుల్లో స్వేచ్చా మార్కెట్‌ ఛాంపియన్‌గా ముందున్న నరేంద్రమోడీ ఇప్పుడు దానికి వ్యతిరేకమైన వైఖరిని అనుసరిస్తున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రపంచీకరణలో భాగమైన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు తిరస్కరించటం వాటిలో ఒకటి.( దానిలో చేరితే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని దేశంలోని దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి) తాజాగా చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యల ఆంతర్యమిదే. ఈ రోజు చైనాతో ప్రారంభం కావచ్చుగానీ ఆర్ధిక జాతీయవాదం మరింత ముదిరితే అది మిగతా దేశాల పెట్టుబడులకు, వస్తువులకు సైతం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్ధానిక వస్తువులనే అడగండి, ఆత్మనిర్భరత పేరుతో స్ధానికంగా అవసరమైన వస్తువులను తయారు చేసుకోవాలనే నినాదాలతో మన దేశం కూడా రక్షణ చర్యలకు పూనుకుంది. దీన్నో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఇంతకు ముందు ఉన్న నిబంధనలను సడలించి 200 కోట్ల రూపాయల లోపు వస్తువులు, సేవలను విదేశాల నుంచి పొందకూడదని నిర్ణయించింది. చైనా నుంచి పెట్టుబడులను నిరోధించేందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీన్ని ఆర్దిక జాతీయవాదం అంటున్నారు.


జాతీయవాదానికి అనుగుణ్యంగా ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే అవసరాలను తీర్చుకొనేందుకు తీసుకొనే చర్యలను తప్పుపట్టనవసరం లేదు. కొన్ని సందర్భాలలో తప్పదు. ప్రపంచీకరణలో భాగంగా అమలు జరుపుతున్న ఉదారవాద విధానాలు అన్ని దేశాలకూ ఉపయోగపడటం లేదు. దానికి మన దేశమే చక్కటి ఉదాహరణ. ఇతర దేశాల వస్తువులన్నీ మన దేశంలో కుమ్మరిస్తున్నారు. ఫలితంగా స్ధానిక చేతివృత్తులు, పరిశ్రమలు, చివరికి వ్యవసాయం మీద కూడా ప్రతికూల ప్రభావాల పడ్డాయి.జాతీయ వాదాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు, కానీ జాతీయోన్మాదాన్ని ఎలా చూడాలి. పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడల్లో భాగంగా ఇలాంటి వాటిని ముందుకు తీసుకు వస్తారు.


జాతీయవాదంలో భాగంగా పోలీసు, మిలటరీ కాంటీన్లలో మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత వస్తువుల జాబితాలో పండ్లు తోముకొనే కోల్గేట్‌ పేస్ట్‌ వంటి బహుళజాతి సంస్దల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవేవీ చైనా ఉత్పత్తులు కాదు. నిజానికి కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్రమోడీ అధికారానికి రాగానే ఈ చర్యలెందుకు తీసుకోలేదు? టిక్‌టాక్‌ లేదా ఇతర చైనా యాప్‌లు మన భద్రతకు ముప్పు అని ఆకస్మికంగా గుర్తుకు రావటం ఏమిటి ? అదే నిజమైతే దానికి మోడీ అండ్‌కోను విచారించాలా లేదా ?


దేశంలో 1991నుంచి నూతన ఆర్ధిక విధానాలకు తెరతీశారు. అప్పటి వరకు లేని స్వదేశీ జాగరణ మంచ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి తెచ్చింది. నూతన ఆర్ధిక విధానాలను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు గనుక, తామూ దేశ ప్రయోజనాలకోసమే పని చేస్తామని చెప్పేందుకు ఆ సంస్ధను ఏర్పాటు చేశారు. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమిటి ?


చైనా వస్తువులను విధిగా కొనాలన్న నిబంధనలేవీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ విధించలేదు. ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీలేవీ చైనా వస్తువుల గురించి లాబీయింగ్‌ జరపలేదు, దిగుమతి చేసుకోవాలని అడగలేదు. చైనా పెట్టుబడుల విషయం కూడా అంతే. గత ఆరు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడి కావటానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన అవకాశాలు తప్ప తమ వస్తువులు కొనమని,పెట్టుబడులు తీసుకోవాలని చైనా వైపునుంచి వత్తిడేమీ లేదు. లేదా అమెరికా మాదిరి ప్రతీకార చర్యలు ఉన్నట్లు ఎవరూ ఇంతవరకు చెప్పలేదు.


అన్ని దేశాలూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో భాగస్వాములుగా ఉన్నపుడు దాని నిబంధనలను అమలు జరపటం వాటి విధి. లేకపోతే బయటకు వచ్చే స్వేచ్చ ఉంది. కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరుపుతోందని భావిస్తున్నారు కనుక ఆ పార్టీ విధానాల మంచి చెడ్డల గురించి సహజంగానే ఆసక్తి ఉంటుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా పెట్టుకుంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఏ బంధం ఉందని బిజెపి ప్రతినిధి బృందాలు చైనా పర్యటనకు వెళ్లినట్లు ? నోరు తెరిస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం అంటారు.


భారత్‌-చైనా మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అందువలన రెండు దేశాల ఆర్ధిక వ్యవస్ధలు,ఇతర అనేక అంశాల గురించి రెండు దేశాలను పోల్చటం నరేంద్రమోడీ అధికారంతో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో జరుగుతోంది.చైనాతో మన దేశాన్ని పోల్చటాన్ని కొందరు దేశ ద్రోహంగానూ, చైనా భక్తిగానూ వర్ణిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో ఆ దాడి ఎక్కువగా ఉంది. చైనాతో మన దేశాన్ని పోల్చి ఎక్కువగా మాట్లాడుతున్నదెవరు ? నరేంద్రమోడీ ప్రధాని అయిన ఆరునెలల్లోపే చైనాను సందర్శించిన బిజెపి బృందాలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే రాజకీయ పాఠశాలలను ఎందుకు సందర్శించాయి. మేము కూడా కమ్యూనిస్టు పార్టీ మాదిరే పార్టీని విస్తరిస్తామని, రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిందెవరు? చైనా కమ్యూనిస్టు పార్టీతో పోల్చుకున్నదెవరు?


చైనాను పక్కకు నెట్టి ప్రపంచానికి వస్తువులను అందిస్తామంటూ మేకిన్‌ ఇండియా, ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అని, త్వరలో జిడిపి రేటులో చైనాను అధిగమిస్తామని చెబుతున్నదెవరు ? ప్రతి ఏటా అనుకూలంగానో వ్యతిరేకంగానో చైనా వస్తువుల గురించి మాట్లాడుతున్నది వారే. అంతెందుకు 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సర్వేలో చైనా మాదిరి ఉపాధి, అభివృద్ది గురించి దాదాపు పదిపేజీలు కేటాయించి రాసినవారెవరు ? దీన్ని పోలిక అంటారా మరొకపేరుందా ?ఒక వేళ అదే దేశద్రోహం అయితే సంఘపరివార్‌ శక్తులే తొలి దేశద్రోహులు అవుతారు. చైనాను పక్కన పెట్టండి, అభివృద్ధి చెందిన దేశాల సరసకు దేశాన్ని తీసుకుపోతామని చెబుతారు. దాన్నేమంటారు ? పోలిక తప్పు కాదు. అయినా పోల్చిన వారిని దేశవ్యతిరేకులు అంటున్నారంటే జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప అది జాతీయవాదమా ? జాతీయోన్మాదమా ?


వలస పాలనను వ్యతిరేకించటం స్వాతంత్య్రానికి ముందు జాతీయవాదం. ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, డచ్‌, పోర్చుగీసు, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలలో జాతీయ వాదం ముందుకు వచ్చింది. తమ దేశం ప్రపంచంలో పై చేయి సాధించాలంటే ప్రపంచాన్ని ఆక్రమించాలనేది వాటి జాతీయ వాదం. చైనా,జర్మనీ, దక్షిణకొరియా, జపాన్‌ వంటి దేశాలతో పోటీపడుతూ వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలను కోవటంలో తప్పు లేదు. వాటిని పక్కకు నెట్టి ఆ స్ధానాన్ని మనమే ఆక్రమించాలనుకుంటే అది సమస్యలకు దారి తీస్తుంది. నాడు జాతీయవాదంతో ఐరోపా దేశాలు పోటీపడి తొలుత ప్రాంతీయ యుద్ధాలు తరువాత ప్రపంచ యుద్ధాలకే పాల్పడ్డాయి. వస్తు తయారీ జాతీయ వాదం ముదిరితే అది వాణిజ్య యుద్దాలకు దారి తీస్తుంది.


అమెరికాను మరోసారి అగ్రస్ధానంలో నిలబెడతానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెబితే మంచి రోజులు తెస్తానని మన నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఇద్దరూ విఫలమయ్యారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటంలోనూ అదే రికార్డు. వైరస్‌ నివారణ రాష్ట్రాల బాధ్యత అని తప్పించుకొనేందుకు పూనుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మహమ్మారులు చుట్టుముట్టినపుడు దేశపాలకులు తమ బాధ్యత లేదని తప్పించుకుంటే కుదరదు. జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోతానని నరేంద్రమోడీ చెప్పారు. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా సాధిస్తారా ? ఏ క్షణంలో అయినా కరోనా కేసుల్లో మన దేశాన్ని అమెరికా సరసన చేర్చే దిశలో ఉన్నారు. నరేంద్రమోడీ ఘోరవైఫల్యంగా ప్రపంచం కరోనా విస్తరణను చూస్తున్నది. అదే విధంగా కరోనా వైరస్‌ను తక్కువ చేసి మాట్లాడటం ట్రంప్‌ ఏలుబడిలోని అమెరికా చరిత్రలో అతి పెద్ద గూఢచర్య వైఫల్యంగా చరిత్రలో నమోదైంది. చరిత్రలో అమెరికా ఎంత ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదో అదే బాటలో భారత్‌ కూడా పయనిస్తున్నది. రెండింటికీ కరోనా ఒక్కటే కారణం కాదు. రాకెట్‌ మాదిరి అమెరికాలో ఆర్ధిక స్దితి తిరిగి దూసుకుపోనుందని ట్రంప్‌ కనీసం మాటలైనా చెబుతున్నారు. నరేంద్రమోడీ నుంచి ఒక్క మాటైనా విన్నామా ?


డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఒకే కంచం-ఒకే మంచం స్నేహితుల మాదిరి ఉన్నారు. ఇద్దరూ తమ వైఫల్యాలను లేదా ఆర్ధిక, కరోనా వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకు వచ్చారు. ఒక రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తున్నదనే పేరుతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. దేశ భద్రతకు ముప్పు అనే పేరుతో చైనా యాప్‌లను మోడీ నిషేధించారు. ఇలా ఇద్దరు స్నేహితులూ ప్రజాకర్షక జాతీయవాద పులి స్వారీ చేస్తున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేనట్లయితే దానికి బలికావాలి ! ఇద్దరు స్నేహితులకు ఆ సత్తా ఉందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనాపై ప్రపంచంలో మీడియాకు ముఖం చూపని ఒకే ఒక్క నేత నరేంద్రమోడీ !

05 Sunday Jul 2020

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

COVID-19, Narendra Modi


నందిని మార్వా
కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.ప్రపంచంలో భారత్‌ ఇప్పుడు నాలుగవ స్ధానంలో ఉంది.దిగువ నుంచి ప్రారంభమై ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. వాస్తవానికి ఎక్కడ తప్పు జరిగింది? చాలా తక్కువ కేసులు ఉన్న రోజు నుంచి భారత్‌ లాక్‌డౌన్‌లో ఉంది, అప్పుడు చాలా తక్కువ కేసులు ఉన్నాయి. ఇప్పుడు పరిస్ధితిని చూస్తే అందరం అలక్ష్యంలో ఉన్నాము. మొత్తం లాక్‌డౌన్‌ ఒక లక్ష్యం లేనిదిగా కనిపిస్తోంది. ఈ మహమ్మారి గురించిన అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం ఏమంటే అధికారంలో ఉన్నవారి అవినీతి, తప్పిదాల గురించి ప్రతి వారిని కళ్లు తెరిచేట్లు చేయటం.
ప్రతివారికీ అర్ధమైన, చాలా ముఖ్యమైన అంశం ఏమంటే: ప్రజల కోసం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇది అన్నది పెద్ద బూటకం.ఈ చేదు వాస్తవాన్ని పక్కన పెడితే మరొక పరిశీలనను చూద్దాం. ప్రాణాలు తీసే కరోనా వైరస్‌ రెండువందలకు పైగా దేశాలను ప్రభావితం చేస్తే దేశంలో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాని వారెవరైనా ఉన్నారా అంటే మన ప్రధాని నరేంద్రమోడీ ఒక్కరే. ఒక దేశాధినేత బహిరంగ చర్చలో దేశ ప్రజలను ఉద్దేశించి ఎందుకు మాట్లాడరు ? ఆత్మనిర్భర భారత్‌ గురించి ఉపన్యాసాలు చేశారు, ప్రజలు నిర్వహించాల్సిన వివిధ లక్ష్యాల గురించి చెప్పారు, సహాయ చర్యల గురించి చెప్పారు కానీ మీడియా ముందుకు రాని అసలైన కారణం ఏమిటో ఎన్నడూ చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడి కంటే మన ప్రధాని ఎంతో ముఖ్యమైన, విలువైన వారా ?
ప్రజాస్వామ్య భారత్‌లో పత్రికా గోష్టి నిర్వహించని తొలి ప్రధాని నరేంద్రమోడీ. డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ”మౌన మోహన్‌ సింగ్‌ ” అని మోడీ వెక్కిరించిన రోజులున్నాయి. ఇప్పుడు అది ఆయనకే వర్తించటం లేదూ ? ప్రధాని నరేంద్రమోడీ ఎన్ని పత్రికా గోష్టులు నిర్వహించారు, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో తెలియచేయాలని ప్రధాని కార్యాలయాన్ని కోరుతూ ఒక పౌరుడు సమాచార హక్కు కింద దరఖాస్తు చేశాడు. వీటికి సంబంధించి ప్రధాని కార్యాలయంలో ఎలాంటి పత్రాలు లేవు. నిజానికి మన దేశంలో జరుగుతున్నదేమిటి ? మన నేతలు వర్తమాన అంశాల మీద స్పందించకుండా ప్రతి అంశానికి సంబంధించిన వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ఎందుకు కేంద్రీకరిస్తున్నారు ?
ప్రముఖ పాత్రికేయులు ప్రధానితో కఠినంగా ప్రశ్నించటంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రధాని పని తీరు, ప్రయాణాలు, యోగా తదితర అంశాల గురించి ప్రశ్నిస్తే వాటి గురించి చెప్పేందుకు సిద్ధం సుమతీ అన్నట్లుగా ఉంటారు. కానీ ఇబ్బంది కరమైన ప్రశ్నలు అడిగితే ఇంటర్వ్యూల నుంచి వెళ్లిపోవటమో, ప్రస్తావన అంశానికి దూరంగా పోవటమో చేస్తారు. మీడియాతో మోడీకి సత్సంబంధాలు లేవని కూడా చెబుతారు. కరణ్‌ థాపర్‌ అనే సీనియర్‌ పాత్రికేయుడు ప్రధాని మోడీని గుజరాత్‌ హింసాకాండ గురించి అడిగినపుడు మన ప్రధాని మాట్లాడకుండా ఇంటర్వ్యూ నుంచి లేచి వెళ్లిపోయారు. బహుశా మన ప్రధాని గతం ఆయన్ను ఇప్పటికీ వెంటాడుతున్నదేమో !
భారత్‌లో విధించిన లాక్‌డౌన్‌ గురించి ప్రపంచమంతటా జనం మాట్లాడుకుంటున్నారు. మహమ్మారి నుంచి మనం బతికి బయటపడినా, ఆర్ధిక పతనం నుంచి కోలుకోలేమని ప్రముఖ ఆర్ధికవేత్తలు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి గిరాకి అంతం కావటానికి దోహదం చేశాయి, దాంతో మన ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కరోనా మహమ్మారి తోడైంది. ఏ మాత్రమూ ముందుగా చెప్పకుండానే దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించారు. దేశ ప్రజలు దానికి సిద్దం కాలేదు. ఎన్నో మినహాయింపులు ఇచ్చారు. కానీ దేశంలోని పోలీసులు వాటిని అర్ధం చేసుకోలేకపోయారు. జనాన్ని లాఠీలతో మోదారు. ఇదే సమయంలో అనేక మంది వలస కూలీలు రోడ్డున పడ్డారు. తమ స్వస్ధలాలకు తిరిగి పోతున్నారు. వారిలో కొందరు నిద్రిస్తుండగా హతులయ్యారు. పొలాల్లో ఉన్న పంటలను రైతులు ఎలా ఇంటికి తెచ్చుకుంటారో ఎవరూ ఆలోచించలేదు. వైద్య సరఫరాల గొలుసు తెగిపోయింది. న్యూఢిల్లీలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు(కొత్త పార్లమెంట్‌, నివాసాలు, ఇతర కార్యాలయాల నిర్మాణం)తో పాటు చాలా కాలం తరువాత ఆర్ధిక ఉద్దీపన పధకాన్ని ప్రకటించారు. అదింకా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తీరు, విధానాలను అన్నింటినీ చూస్తే భారతీయులు కరోనాతో కంటే ఆకలితో మరణించవచ్చు. అనేక మంది ప్రముఖులు చెప్పినట్లుగా అధ్వాన్నమైన పాలన, విధానాల అమలుకు ఏ మాత్రం లేని అనుభవం, ప్రభుత్వ నియంతృత్వ లక్షణం అతి పెద్ద విపత్తుకు దారి తీయవచ్చు.
ఇదిలా ఉండగా కోవిడ్‌-19 మహమ్మారి విషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని అమిత్‌ షా అంగీకరించారు, అయితే అదే సమయంలో ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఇదీ మన దేశ స్ధితి. నేతలు జనానికి, తమ కింది వారికీ సమాధానాలు చెప్పకపోగా ప్రతిపక్ష ప్రభుత్వాలతో తమను పోల్చుకుంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని లాక్‌డౌన్‌ వాయిదా వేసింది తప్ప జనానికి తప్పించలేదు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవటానికి, అత్యవసర సంరక్షణ సౌకర్యాలను పటిష్ట పరుచుకొనేందుకు వ్యవధిని ఇచ్చింది. మన దేశంలో సామాజిక వ్యాప్తి లేదని ప్రభుత్వం ఇప్పటికీ చెబుతూనే ఉంది. అయితే పెరుగుతున్న కేసులను చూస్తే సామాజిక వ్యాప్తి పరిమితం అన్నది కేవలం నిర్వచనానికి పరిమితం కావచ్చుగానీ వ్యవహారికానికి పనికి రాదు.
తొలి కేసు బయటపడి నాలుగు నెలలు, లాక్‌డౌన్‌ ప్రకటించి రెండు నెలలు గడిచినా పరీక్షలు చేయటంలో, అవసరానికి తగిన డిమాండ్‌కు అనుగుణంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో అత్యవసర పరిస్ధితికి తగిన విధంగా ఐసియు పడకలు లేవని తేలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తరచుగా దేశంలోని మహమ్మారి గురించి జనానికి చెబుతారు. కెనడా ప్రధాని దాదాపు ప్రతి రోజూ దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడతారు. ఇద్దరూ వర్తమాన అంశాల మీద మీడియాతో బహిరంగంగా మాట్లాడతారు. మనం న్యూజిలాండ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే కరోనా వ్యాప్తి నుంచి న్యూజిలాండ్‌ విముక్తి పొందింది. మహిళాశక్తి దాన్ని అలా ముందుకు నడిపించింది.మన దేశంలో మాదిరి ఏ దేశంలోనూ ఇప్పటి వరకు వారి జాతిని ఉద్దేశించి వర్తమాన సమస్యల మీద మాట్లాడని నేతలు లేరు.
దేశంలోని దీర్ఘకాలిక సమస్యల గురించి పట్టించుకోకుండా కేవలం సానుకూల అంశాల గురించే మాట్లాడుతుంటే అది దేశంలో ఇప్పుడున్న వాస్తవ పరిస్ధితిని చూపదు. సరైన సమయంలో సరైన జోశ్యం చెప్పగల సరైన వారిని మన దేశం ఎంచుకోవాలి.భారత్‌ రోజుకు రెండు లక్షల ఎన్‌-95 ముఖతొడుగులను ఉత్పత్తి చేస్తున్నదని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. వాస్తవం ఏమంటే ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే అది చాలా తక్కువ. ప్రతిదానికీ సమయం సందర్భం లేకండా మతోన్మాదం గురించి మాట్లాడటాన్ని మన దేశం ఎందుకు నిరోధించదు ? వర్తమాన అంశాల మీద మాట్లాడకుండా, కేంద్రీకరించకుండా కేవలం టీవీలలో ఉపన్యాసాలు దంచటమెందుకు ?
గమనిక : ఇన్వెంటివా డాట్‌కామ్‌ ఇన్‌ వెబ్‌ సైట్‌ సౌజన్యంతో( ఈ ఆంగ్ల వ్యాసాన్ని తొలుత జూన్‌ పన్నెండున ఇన్వెంటివా డాట్‌కామ్‌ ఇన్‌ ప్రచురించినది. పాఠకులకు అందించేందుకు అనువదించబడినది. ఎం కోటేశ్వరరావు )

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా అల్లిన 24 అబద్దాలు- చైనా చెప్పిన 24 నిజాలు !

12 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, USA

≈ 1 Comment

Tags

#US Lies, 24 American lies, 24 American lies- Chinese 24 truths, 24 ‘lies’ by US over Covid-19, Chinese 24 truths, COVID-19

Rob Rogers on Twitter: "Lies cartoon: https://t.co/SamLHmQDgA ...
ఎం కోటేశ్వరరావు
అగ్రరాజ్యం అమెరికా. దాని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా లేదా ప్రపంచ చరిత్రలో ఒక దేశాధిపతిగా ట్రంప్‌ మాట్లాడినన్ని అబద్దాలు మరొకరు మాట్లాడి ఉండరు. ఎన్ని అబద్దాలు చెబితే అంత బలం వస్తుందన్న నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇప్పటికే విశ్లేషకులు తేల్చివేశారు. నోరు తెరిచి నాలుగు అంశాలు చెబితే వాటిలో మూడు పాక్షిక లేదా పూర్తి అబద్దాలే. అలాంటి వ్యక్తి, ఆయన యంత్రాంగం కరోనా వైరస్‌ గురించి అనేక కట్టుకథలు సృష్టించటం, వాటిని మీడియా ద్వారా ప్రచారంలో పెట్టటం తెలిసిందే. అనేక మంది తాము తటస్ధులం అని చెప్పుకుంటారు. ట్రంప్‌ అబద్దాల కోరని అంగీకరిస్తారు, అదే సమయంలో ఆ నోటి నుంచి లేదా సిఐఏ ఇతర కట్టుకథల ఫ్యాక్టరీల నుంచి వెలువడే అబద్దాల ఉత్పత్తులను ఉపయోగించుకొని ఏక పక్షంగా మరో దేశం మీద దాడి చేస్తారు. వీరిలో ఒక రకం తమకు తెలియకుండానే ప్రచార సమ్మోహన అస్త్రానికి పడిపోయిన వారు, రెండవ తరగతి అన్నీ తెలిసి కూడా రాళ్లేసే రకం. గతంలో ప్రచ్చన్న యుద్దం పేరుతో సోవియట్‌ యూనియన్‌, తూర్పుఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం గురించి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్‌ సందర్భంగా అదే రకమైన ఏకపక్ష దాడి ప్రారంభమైంది. అమెరికా పాటపాడితే కొన్ని దేశాలు గొంతు కలుపుతున్నాయి, మరికొన్ని పక్కవాద్యాలు వాయిస్తున్నాయి.
తెలుగు మీడియా ఇచ్చే అంతర్జాతీయ వార్తలన్నీ అమెరికా, ఐరోపా దేశాల అదుపులో ఉండే వార్తా సంస్ధల నుంచి తీసుకుంటున్నవే. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి రాసేవారు, చూపే వారు పోటీపడుతున్నారు. ఎంత సంచలనాత్మకంగా ఉంటే అంతకిక్కు, అంత రేటింగ్‌ ఉంటుంది మరి. దిగువ అంశాలు చైనా వార్తా సంస్ధ గ్జిన్హువా విడుదల చేసిన సమాచారం ఆధారంగా రాస్తున్నవే. నిడివి పెద్దది కాకుండా చూడటం కోసం సంక్షిప్తీకరించి ఇస్తున్నాను. దీనిలో 24 అంశాలపై తమ మీద వేస్తున్న అభాండాలు, చేస్తున్న అబద్ద ప్రచారం ఏమిటో చెబుతూనే దానికి సమాధానాలు ఇచ్చారు. అయినా దీన్ని ఏకపక్ష ప్రచారం అని ఎవరైనా అనుకుంటే అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం. చైనా తాను చెప్పిన సమాధానాలకు, వివరణలకు, విమర్శలకు ఆధారాలతో సహా ఇచ్చింది. పాఠకుల సౌకర్యం, విశ్వసించని వారి నిర్ధారణ కోసం ఆ లింక్‌ను కూడా దిగువ ఇస్తున్నాను.
ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే ఉంటారని కమ్యూనిస్టు లెనిన్‌ చెప్పారు. ఆయన పుట్టక ముందే అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తూ హత్యకు గురైన అబ్రహాం లింకన్‌ మరో విధంగా చెప్పారు. ఎవరైనా జనం మొత్తాన్ని కొంతకాలం, కొంత మందిని కొంతకాలమే వెర్రి వెంగళప్పలను చేయగలరు గానీ అందరినీ, ఎల్లవేళలా చేయలేరు అన్నారు. వెలుగు వచ్చేకొద్దీ చీకటి పారిపోతుంది, అబద్దాలు కూడా కూడా నిజం రానంతవరకే అది పెత్తనం చేస్తాయని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇక ఆరోపణలు, వాటి మీద చైనా వార్తా సంస్ధ సమాధానాల సారాంశం చూద్దాం.
1.ఆరోపణ: కోవిడ్‌-19 అనేది చైనా లేదా ఊహాన్‌ వైరస్‌.
వాస్తవం : ఒక వ్యాధి పేరులో ప్రతికూల ప్రభావం చూపే అంటే అనవసరమైన భయాలు కలిగించే విధంగా ఒక ప్రాంతం, దేశం, ఆహారం, సంస్కృతి, జనాభా, పరిశ్రమ, వృత్తి లేదా జంతుజాతి పేరు ఉండకూడదని 2015 మే ఎనిమిదవ తేదీ ఐక్యరాజ్యసమితి సంస్ధలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. అంతకు ముందే కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ 2012లో తలెత్తిన ”మెర్స్‌” మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పేరు మీద తలెత్తిన పరిస్ధితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణ్యంగానే 2020 ఫిబ్రవరి 11న నోవెల్‌ కరోనా వైరస్‌ కారణంగా తలెత్తే న్యూమోనియా వ్యాధికి కరోనా వైరస్‌ డిసీజ్‌ 2019(కోవిడ్‌-19) అని పేరు పెట్టారు. అయితే బ్రిటీష్‌ సైన్స్‌ పత్రిక ఏప్రిల్‌ నెలలో ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించి రాసిన సంపాదకీయాలలో కోవిడ్‌-19ను చైనా మరియు ఊహాన్‌తో జతచేసి ప్రస్తావించి తదుపరి క్షమాపణ చెప్పింది. బిబిసి, న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఏబిసి) వంటివి ఆసియా వాసులతో సంబంధాన్ని అంటగట్టి వార్తలను ప్రచారం, ప్రసారం చేయటంతో పశ్చిమ దేశాలలో ఆసియా వ్యతిరేకత, జాత్యంహాకార ధోరణులతో ఆసియా ఖండ పౌరులను వేధించిన ఉదంతాలు జరిగాయి.
2. ఆరోపణ: వైరస్‌ ఊహాన్‌లోనే పుట్టింది.
వాస్తవం: వైరస్‌ తొలిసారి ఊహాన్‌లో బయటపడినంత మాత్రాన అది అక్కడే పుట్టిందని అర్ధం కాదు, శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకు ఎయిడ్స్‌ వ్యాధిని తొలుత అమెరికాలో గుర్తించారు. అది అక్కడ పుట్టింది కాకపోవచ్చు. అలాగే స్పానిష్‌ ఫ్లూ స్పెయిన్‌లో పుట్టలేదు అనేందుకు అనేక ఆధారాలు దొరికాయి. ఎక్కడ నుంచి తలెత్తిందన్నది శాస్త్ర అంశం. జనవరి 24న బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌లో ప్రచురితమైన విశ్లేషణలో డిసెంబరు 16 నుంచి జనవరి రెండవ తేదీ వరకు ఊహాన్‌ నగరంలో నిర్ధారణ అయిన 41కరోనా కేసులలో 27 మందికి ఊహాన్‌ సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో సోకినట్లు తేలింది, మిగిలిన వారికి వేరే ప్రాంతాలలో సోకింది. తొలి రోగిని డిసెంబరు ఒకటవ తేదీన గుర్తించారు. అతనికీ మార్కెట్‌కు ఎలాంటి సంబంధం లేదు, కుటుంబ సభ్యులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తలేదు. అతని నుంచి ఇతరులకు వ్యాపించిందనే ఆధారాలు దొరకలేదు. వైరస్‌ ఎక్కడ ఉద్బవించింది అనే అంశంలో అమెరికా నుంచి తమ సంస్ధకు ఎలాంటి సమాచారం లేదా నిర్ధిష్ట రుజువులు అందలేదని మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమాల డైరెక్టర్‌ డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని బెలెవిలే మేయర్‌ మైఖేల్‌ మెల్‌హామ్‌ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఇదే వైరస్‌తోనే తాను 2019నవంబరులో కూడా అస్వస్తతకు గురై ఉండవచ్చని చెప్పారు. అంటే అది అమెరికాలో బయటపడిన తొలి కేసు జనవరి 20కి రెండునెలల ముందునాటి సంగతి. మే ఆరవ తేదీన యుఎస్‌ఏ టుడే వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్లోరిడాలో జనవరి ప్రారంభంలోనే 171 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి, అయితే వారెవరూ చైనాకు ప్రయణించిన వారు కాదు.
మే మూడవ తేదీన యాంటీమైక్రోబియల్‌ ఏజంట్స్‌ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో 2019 డిసెంబరు చివరి నుంచే సారస్‌-కోవ్‌-2 వైరస్‌ ఫ్రాన్స్‌లో వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు. డిసెంబరు రెండు నుంచి జనవరి 16వరకు ఫ్లూ లక్షణాలతో ఐసియులో చికిత్స పొందిన 14 మందికి ఏప్రిల్‌ ఆరు-తొమ్మిదవ తేదీల మధ్య ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష చేశారు.వారిలో 42ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ బయటపడింది. అయితే అతనేమీ ఇటీవలి కాలంలో చైనా లేదా మరో విదేశీ ప్రయాణం చేయలేదు.

Political cartoons: Donald Trump blasts Google
3. ఆరోపణ: వైరస్‌ను ఊహాన్‌ వైరాలజీ సంస్ధలో తయారు చేశారు
వాస్తవం: అందుబాటులో ఉన్న రుజువులన్నీ సహజంగానే పుట్టినట్లు చూపుతున్నాయి. కృత్రిమంగా తయారు చేసింది కాదు. జనవరి 30వ తేదీ లాన్‌సెట్‌ వైద్య పత్రిక వ్యాసం ప్రకారం మిగతా వైరస్‌లతో పోల్చితే గుడ్లగూబల నుంచే వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఎనిమిది దేశాలకు చెందిన 27 మంది ప్రముఖ నిపుణులు చేసిన ప్రకటనలో కరోనా వైరస్‌ మిగతా వాటి మాదిరే వన్య ప్రాణుల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. మార్చి 17న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన ఐదుగురు ప్రముఖ నిపుణులు వైరస్‌ను ప్రయోగశాలలో తయారు చేయలేదని, పని గట్టుకొని వ్యాపింప చేయలేదని తెలిపారు. మార్చి 26న అమెరికా జాతీయ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ రాసిన వ్యాసంలో సహజంగానే కరోనా వైరస్‌ పుట్టిందని, ఎవరూ తయారు చేయలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రతినిధి ఫడేలా చాయిబ్‌ మాట్లాడుతూ వైరస్‌ జంతువుల నుంచే వచ్చిందని అయితేగబ్బిలాల నుంచి మానవులకు ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ అంతుబట్టలేదన్నారు. ఏప్రిల్‌ 30న అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన ప్రకారం కరోనా వైరస్‌ కృత్రిమంగా తయారు చేసింది లేదా జన్యుమార్పిడి చేసింది కాదనే శాస్త్రవేత్తల అభిప్రాయంతో గూఢచార సమాజం ఏకీభవిస్తున్నదని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ వైరస్‌ జన్యుక్రమం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం సహజంగా ఉద్భవించిందే అన్నారు. మే ఐదవ తేదీన అదే సంస్ధ ప్రతినిధి డాక్టర్‌ గువ్‌డెన్‌ గాలెయా కూడా అదే చెప్పారు. ఫ్రెంచి పత్రి వాలెర్‌ యాక్ట్యువల్‌ తమ దేశ గూఢచార వర్గాలను ఉటంకిస్తూ వైరస్‌ ఊహాన్‌లోని పి4లాబ్‌ నుంచి వెలువడలేదని పేర్కొన్నది.
4 ఆరోపణ : ఊహాన్‌ వైరాలజీ సంస్ధ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్‌ లీకైంది.
వాస్తవం: ఊహాన్‌ నేషనల్‌ బయోసేఫ్టీ లాబరేటరీ(పి4) చైనా-ఫ్రెంచి ప్రభుత్వాల సహకారం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైంది. దీనిలో పనిచేసే తొలి బృందం సిబ్బందికి ఫ్రాన్స్‌, అమెరికాలోనే శిక్షణ ఇచ్చారు. ఇక్కడి సౌకర్యాలు, పరికరాలను మూడవ పక్షం ప్రతిఏటా తనిఖీ చేస్తుంది. తనిఖీలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారితమైన తరువాతే పని చేయటాన్ని అనుమతిస్తారు. ఆ లాబ్‌కు కృత్రిమ వైరస్‌ తయారు చేసే సామర్ధ్యం లేదు, వైరస్‌ లీకై సిబ్బందికి సోకిన రుజువులేదు. ఈ లాబ్‌ కార్యకలాపాల గురించి, కరోనా వైరస్‌ గురించి తెలుసుకొనేందుకు యావత్‌ ప్రపంచం నుంచి ఆరులక్షల మంది వెబ్‌సైట్‌ను దర్శించగా 2.1కోట్ల డౌన్లోడ్‌లు నమోదయ్యాయి. ఎలర్జీ మరియు అంటువ్యాధుల అమెరికా జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫౌసీ మే4న మాట్లాడుతూ చైనా లాబ్‌లో వైరస్‌ తయారు కాలేదని, ప్రకృతిలోనే పుట్టి జంతువుల్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని అన్నారు. జంతువుల నుంచి సోకిన వైరస్‌ను లాబ్‌కు తెచ్చినపుడు ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి లీకైందన్న కథనాన్ని తాను నమ్మటం లేదన్నారు. వైరస్‌ కృత్రిమ సృష్టి అని ఎలాంటి రుజువులు లేవని బ్రిటీష్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హనాక్‌ అక్కడి పత్రిక ఇండిపెండెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.
5. ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ను అరికట్టిన చైనా తమ జాతీయులను మిలన్‌, న్యూయార్క్‌ ఇతర నగరాల్లో వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు పంపింది.
వాస్తవం: స్వల్ప వ్యవధిలోనే చైనా కఠిన చర్యలు తీసుకుంది. చైనా నుంచి బయటకు చాలా తక్కువగా వ్యాప్తి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 23 నుంచి ఏప్రిల్‌ ఎనిమిది వరకు ఊహాన్‌ నగరం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ సమయంలో నగర వాసులు బయటకు వెళ్లలేదు. జనవరి 23న అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఫిబ్రవరి రెండున అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. అంతకు ముందు కేవలం ఎనిమిది కేసులు మాత్రమే అమెరికాలో నమోదయ్యాయి. మార్చి 13న అమెరికా జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. ఆరోజుకు 1,896 కేసులు నిర్ధారణ అయ్యాయి. చైనాలో లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన ఏప్రిల్‌ 8వ తేదీనాటికి అమెరికాలో కేసులు నాలుగు లక్షలకు పెరిగాయి. ఒకటి నుంచి పది లక్షలకు పెరగటానికి అమెరికాలో వందరోజుల కంటే తక్కువే పట్టింది. తమ రాష్ట్రానికి చైనా నుంచి వైరస్‌ రాలేదని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిడీ పరిశోధన వెల్లడించినట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో చెప్పారు. న్యూయార్క్‌ కరోనా వైరస్‌ ఆసియా నుంచి వచ్చింది కాదని అమెరికా పరిశోధనను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తను ప్రచురించింది. తమ దేశానికి అమెరికా సందర్శకులు వైరస్‌ను తీసుకు వచ్చినట్లు కెనడా సమాచారం వెల్లడించింది. గుర్తు తెలియని వనరు నుంచి ఫ్రాన్స్‌లో స్ధానికంగానే వైరస్‌ వ్యాపించిందని, చైనా, రష్యాల నుంచి రాలేదని ఫ్రెంచి పరిశోధనా సంస్ధ పాస్టర్‌ వెల్లడించింది.
6.ఆరోపణ: చైనీయులు గబ్బిలాలను తింటూ వైరస్‌ను వ్యాపింప చేశారు.
వాస్తవం: చైనీయుల ఆహారంలో ఎన్నడూ గబ్బిలాలు లేవు. ఒక చైనా మహిళ గుడ్ల గూబ చారు తాగుతున్నట్లు చూపే వీడియో ఇంటర్నెట్‌లో తిరుగుతోంది. ఒక చిన్న పసిఫిక్‌ దీవిలో విహార యాత్రల ప్రచారంలో భాగంగా ఆమె బృందం తీసిన వీడియో అది, దాన్ని 2016లోనే ఆన్‌లైన్‌లోనే పోస్టు చేశారు. గబ్బిలాల చారు అక్కడి ప్రత్యేకత.
7.ఆరోపణ: చైనా వన్య ప్రాణుల మార్కెట్లను తెరిచింది.
వాస్తవం: చైనాలో వన్య ప్రాణుల మార్కెట్లనేవి లేవు. వాటిని వేటాడటం, అమ్మకాలను చైనా నిషేధించింది. కోళ్లు, చేపల వంటి సముద్ర ఉత్పత్తులను మాత్రమే ప్రాణాలతో విక్రయించే మార్కెట్లు ఉన్నాయి. ఇలాంటివి ఒక్క చైనాలోనే కాదు అనేక దేశాలలో ఉన్నాయి. అలాంటి అమ్మకాలను నిషేధించే అంతర్జాతీయ చట్టాలు లేవు. రైతు బజార్లనే ఊహాన్‌లో తెరిచారు. ఊహాన్‌, హుబెరు, హునాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్లు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయి.
8 ఆరోపణ: వైరస్‌ వ్యాప్తి గురించి తొలి రోజుల్లో దాచి పెట్టింది, వెల్లడించటం ఆలస్యం చేసింది. దాంతో వ్యాప్తి పెరిగింది.
వాస్తవం: ఆకస్మికంగా గుర్తు తెలియని వైరస్‌ దాడి జరిగినపుడు అవగాహన, అధ్యయనం చేసేందుకు సమయం పడుతుంది. డిసెంబరు 27న న్యూమోనియాతో రోగులు ఉన్నట్లు గుర్తించారు. అదే రోజు వెల్లడించారు. మూడు రోజుల తరువాత కారణం తెలియని న్యూమోనియా గురించి ప్రకటించారు.డిసెంబరు 31న దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలిపారు. జనవరి మూడు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు, అమెరికా ఇతర దేశాలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి మూడు వరకు 30సార్లు అమెరికాకు సమాచారం తెలియచేశారు. జనవరి ఏడవ తేదీ నాటికి జన్యుక్రమాన్ని గుర్తించారు. పదకొండవ తేదీన ఆ సమాచారాన్ని ఇతర దేశాలకు అందచేశారు. వెంటనే నివారణ కిట్ల తయారీకి ఉపక్రమించారు. ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. చైనాలో వైరస్‌ గురించి ప్రకటన చేసిన 70రోజుల తరువాత అమెరికా అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది

Sack cartoon: In Trump we trust? | Star Tribune
9.వైరస్‌ వ్యాప్తిని గోప్యంగా ఉంచిందని బయట పెట్టిన డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ను అరెస్టు చేశారు.
వాస్తవం: వెనలియాంగ్‌ స్వంత సంస్ధ అక్రమాలను బయట పెట్టే వ్యక్తి కాదు, అతన్ని అరెస్టు చేయలేదు. అంటు వ్యా ధులను నిర్ధారించటానికి కఠినమైన నిబంధనలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఇది సాధారణ అంశం. అంటువ్యాధుల నిర్ధారణ గురించి వెల్లడించటానికి ఒక చట్టం, పద్దతులు ఉన్నాయి. డాక్టర్‌ ఝాంగ్‌ జిక్సియాన్‌ ఒక శ్వాసనిపుణుడు, కోవిడ్‌-19 గురించి తొలిసారి నివేదించాడు, అతనికి అవార్డును ఇచ్చారు. జిక్సియాంగ్‌ నివేదించిన మూడు రోజుల తరువాత డిసెంబరు 30న, అధికారికంగా విడుదల చేయటానికి ఒక రోజు ముందు డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ అనే కంటి వైద్యుడు తన సహచరులకు ఉరు ఛాట్‌ గ్రూప్‌లో ఏడు నిర్ధారితమైన సారస్‌ కేసులు ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని ప్రచారం చేయవద్దని పోస్టు పెట్టాడు. అయితే అది ఇంటర్నెట్‌లో బయటకు వచ్చి భయాన్ని కలిగించింది. జనవరి మూడవ తేదీన ఊహాన్‌ పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపి నిర్ధారణ కాని సమాచారాన్ని వెల్లడించకూడదని, ప్రచారాన్ని ఆపాలని చెప్పి అధికారయుతంగా మందలిస్తూ ఒక లేఖను ఇచ్చి పంపారు. తరువాత అతనికి వైరస్‌ సోకింది, జనవరి 31న నిర్ధారణ అయింది. ఫిబ్రవరి ఏడవ తేదీన అతను మరణించాడు. అతనికి సంబంధించిన అంశాల మీద దర్యాప్తు జరపాలని ఒక బృందాన్ని నియమించారు. మార్చి 19న దర్యాప్తు నివేదికను వెల్లడించారు.అతని విషయంలో చట్టపరమైన అంశాలను తప్పుగా అన్వయించారని, మందలింపు లేఖను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. డాక్టర్‌ లీ మంచి వైద్యుడు, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు, ప్రభుత్వ వ్యతిరేకి కాదు, మార్చి ఐదున కరోనా వ్యతిరేక పోరులో మరణించిన ఆదర్శ జాతీయ ఆరోగ్య కార్యకర్తగా లీని ప్రకటించి ఒక అమర జీవిగా ఏప్రిల్‌ రెండున గౌరవించారు. ప్రభుత్వ వ్యతిరేకిగా లీని చిత్రించటం అతన్ని, అతని కుటుంబాన్ని అగౌరవ పరచటమే.
10.మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడించటంలో చైనా చాలా ఆలస్యం చేసింది. దాంతో తగిన సమాచారం లేక అమెరికా, ఇతర దేశాలు వెంటనే స్పందించటంలో విఫలమయ్యాయి.
వాస్తవం: చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వర్తమానాలు సకాలంలోనే గట్టిగానే వెళ్లాయి, అమెరికాకు తొలి నుంచీ అన్నీ తెలుసు. ఒక కొత్త వైరస్‌ ఒక మనిషి నుంచి మరొక మనిషికి సోకుతుందా లేదా అని తెలుసుకొనేందుకు కఠినమైన శాస్త్రీయ క్రమం ఉంటుంది. జనవరి తొమ్మిదిన నోవెల్‌ కరోనా వైరస్‌ అని చైనా నిపుణులు ప్రకటించారు. ఇరవయ్యవ తేదీన ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందని నిర్ధారించారు. అప్పటికి అమెరికాలో నిర్దారిత కేసులు లేవు. ఇరవై మూడవ తేదీన కోటీ 20లక్షల మంది జనాభా ఉన్న ఊహాన్‌ నగరాన్ని లాక్‌డౌన్‌ చేసి ప్రపంచానికి గట్టి హెచ్చరికను పంపింది. ఆరోజుకు అమెరికాలో ఒకే ఒక్క కేసు నమోదైంది.అంతకు ముందు రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానవుల్లో వ్యాప్తి గురించి వెల్లడించింది, 27వ తేదీ ప్రమాద తీవ్రతను పెంచింది, 30వ తేదీన మహమ్మారిగా మారినట్లు వెల్లడించింది. ఊహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు పిలిపించి, జనవరి 25వ తేదీ నుంచి కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన తొలి దేశం అమెరికా. ఫిబ్రవరి రెండున తన సరిహద్దులను మూసివేస్తూ చైనా పౌరులు అంతకు ముందు 14రోజులు చైనాలో ఉన్న ఇతర దేశీయులకు ప్రవేశం లేదని నిషేధించింది. ఆరోజున అమెరికాలో కేవలం ఎనిమిది కేసులే ఉన్నాయి. మార్చి తొలి వారం వరకు అమెరికా తీవ్ర సమస్యగా పరిగణించలేదు. అమెరికా సమస్యలకు చైనా కారణమని చెప్పటం పెద్ద అబద్దం అని అమెరికా ప్రముఖ ఆర్ధికవేత్త జెఫ్రీ సాచ్స్‌ పేర్కొన్నారు. తాము డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధను హెచ్చరించామని చైనా రాష్ట్రమైన తైవాన్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 31న తమకు తైవాన్‌ నుంచి వచ్చిన ఇమెయిల్‌లో ప్రత్యేక లక్షణాలు గల న్యూమోనియా కేసుల గురించి వచ్చిన వార్తలను ఉటంకిస్తూ తమకు దాని గురించి మరింత సమాచారం కావాలని అడిగారు తప్ప దానిలో హెచ్చరికలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ద వివరణ ఇచ్చింది.
11.ఆరోపణ: చైనాలో కేసులు, మరణాల గురించి వాస్తవాలు చెప్పటం లేదు, ప్రకటించిన దాని కంటే 50రెట్లు ఎక్కువ.
వాస్తవం: కరోనా సమాచారం విషయంలో చైనా పారదర్శకంగా ఉంది. జనవరి 21 నుంచి ప్రతి రోజూ అధికారికంగా సమాచారాన్ని వెల్లడించింది.జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో మూడువేలకు పైగా పత్రికా గోష్టులు నిర్వహించారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నకారణంగానే కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాధి గ్రస్తులను ఇతరుల నుంచి పూర్తిగా వేరుచేశారు. ఈ చర్యల కారణంగా ఏడు లక్షల కేసులను నివారించినట్లు సైన్సు పత్రిక అంచనా వేసింది.
12.ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ కేసుల సంఖ్యను తరువాత సవరించటం కేసులను తొక్కిపెట్టారన్నదానికి నిదర్శనం.
వాస్తవం: సమాచార సమీక్ష, సవరణ అంతర్జాతీయంగా సాధారణంగా జరిగేదే. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి. ఒక్కసారిగా ఆసుపత్రులు రోగులతో నిండిపోవటంతో అనేక మంది ఆసుపత్రులకు రాకుండానే ఇండ్ల దగ్గరే మరణించారు. ఆసుపత్రులన్నీ నిండిపోవటంతో ఆరోగ్య కార్యకర్తలు కేసులన్నీ నమోదు చేయలేని స్ధితి ఏర్పడింది లేదా ఆలస్యం అయింది. తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ప్రయివేటు ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు, కొన్ని సంస్ధలలో చికిత్స పొందిన వారు, మరణించిన వారిని జాబితాలకు అందచేయలేదు. కొన్ని కేసులు ఒకటికి రెండుసార్లు నమోదు కావటం, కొన్ని అసంపూర్ణంగా ఉండటం వంటి కారణాల వలన సమాచారాన్ని సరి చేసి సవరించారు. ఇది అంతర్జాతీయంగా జరుగున్నదే. ఉదాహరణకు బ్రిటన్‌లో ఆసుపత్రుల వెలుపల మరణించిన వారిని లెక్కించలేదు, తరువాత దాన్ని సరిచేశారు. స్పెయిన్‌ ప్రభుత్వం కూడా తమ సమాచారాన్ని సవరిస్తామని ప్రకటించింది.

trump lies
13. ఆరోపణ: కరోనా వైరస్‌ గురించి చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తోంది.
వాస్తవం: తప్పుడు సమాచార బాధితురాలు చైనా. అమెరికా రాజకీయవేత్తలు, పండితులు, మీడియా చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
14.ఆరోపణ:చైనా రాజకీయ వ్యవస్ధ సమస్యలకు మూలం.
వాస్తవం: సామాజిక వ్యవస్ధ లేదా భావజాలానికి వైరస్‌కు సంబంధం లేదు. వైరస్‌ను అరికట్టటంలో చైనా పౌరులు విజయం సాధించారు. నూటనలభై కోట్ల మందిని ఐక్యపరచటంలో రాజకీయ వ్యవస్ధ విజయం సాధించింది. ఒక అభివృద్ది చెందుతున్న దేశంగా చైనా సమస్యలను అధిగమించాల్సి ఉంది. వెయ్యి పడకల ఆసుపత్రిని పది రోజుల్లో, 1600 పడకల ఆసుపత్రిని 15 రోజుల్లో నిర్మించేందుకు చైనా రాజకీయ వ్యవస్ద పెద్ద ఎత్తున మానవ, వస్తుసామగ్రిని సమీకరించగలిగింది. రోజు లేదా ఒకటిన్నర రోజుల వ్యవధిలో 13వేల మంది రోగులను చేర్చేందుకు వీలుగా మరో 16 సంచార వైద్యశాలలను ఏర్పాటు చేసింది. వైరస్‌ నుంచి జనాన్ని రక్షించేందుకు గాను 13,800 గృహ సముదాయాలకు ఊహాన్‌ నగరంలో 44,500 మంది స్ధానిక పార్టీ కార్యకర్తలను సమీకరించి, భౌతిక దూరం పాటింపు, తదితర చర్యలను గట్టిగా అమలు జరిపింది. సింగపూర్‌లోని బ్లాక్‌బాక్స్‌ పరిశోధనా సంస్ద జరిపిన సర్వేలో 23దేశాల్లో తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించగా చైనాకు నూటికి 85మార్కులు వచ్చి అగ్రస్ధానంలో నిలిచింది. సంక్షోభం నుంచి దేశం బయటపడగలదని 85శాతం మంది చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదే అమెరికాలో 11, ఐరోపా యూనియన్‌లో 15,భారత్‌లో పదిశాతం మాత్రమే ఉన్నారు.
15. ఆరోపణ : నిజాలను బయట పెట్టకుండా అమెరికా విలేకర్లను చైనా నుంచి బహిష్కరించారు.
వాస్తవం: చాలా కాలంగా అమెరికా తీసుకుంటున్న చర్యలకు ప్రతిచర్య తప్ప మరొకటి కాదు. ఇటీవలి కాలంలో అమెరికా పరోక్ష చర్యల ద్వారా మీడియా సిబ్బందిని పరిమితం చేసి 60 మంది చైనా జర్నలిస్టులను బహిష్కరించింది. వీసాల విషయంలో కూడా అమెరికా అనుచితంగా వ్యవహరిస్తోంది.
16. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్దకు చైనా లంచాలు ఇచ్చి అదుపు చేస్తోంది.
వాస్తవం: చైనా ఎన్నడూ ఆ సంస్ధను అదుపు చేసేందుకు ప్రయత్నించలేదు.సంస్ధలో 194 దేశాలకు సభ్యత్వం ఉండగా ప్రధాన కార్యాలయంలో పని చేసే 21 మంది నాయకత్వ బృందంలో 11 మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌కు చెందిన వారే కాగా చైనా నుంచి ఒకే ఒక్కరు ఉన్నారు. వారందరూ నిపుణులే. 2018,19 సంవత్సరాలలో అమెరికా, జపాన్‌ తరువాతనే చైనా అతి పెద్ద దాతగా ఉంది. సభ్యత్వం, విరాళాన్ని పరిగణనలోకి తీసుకుంటే చైనా తొమ్మిదవ స్దానంలో ఉంది.చైనా వాణిజ్య సంస్ధలు, ప్రభుత్వేతర సంస్ధలు ఇచ్చిన మొత్తాలను మినహాయిస్తే చైనా స్ధానం ఇంకా దిగజారుతుంది.
17.ఆరోపణ: మనుషల నుంచి మనుషులకు సోకుతుందని డిసెంబరు 31వ తేదీనే తైవాన్‌ సమాచారమిచ్చినా ప్రపంచ ఆరోగ్య సంస్ద తీవ్రంగా పరిగణించలేదు.
వాస్తవం: తైవాన్‌ రాష్ట్రం ఆరోగ్య సంస్దకు ఎలాంటి హెచ్చరికను పంపలేదు.వ్యాధి గురించి ఊహాన్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించిన తరువాత అదనపు సమాచారం కావాలని ఆరోగ్య సంస్దను తైవాన్‌ కోరింది. అదే విధంగా చైనా జాతీయారోగ్య సంస్ధకూ లేఖ రాసింది.తైవాన్‌తో ఆరోగ్యం, వైద్యానికి సంబంధించి ఉన్న ఒప్పందం మేరకు వెంటనే సమచారాన్ని పంపారు. అదే రోజు తైవాన్‌ ఆరోగ్య సంస్ధకు ఇమెయిల్‌ పంపింది.
18. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్ధలో చేరేందుకు తైవాన్‌ ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంది. తద్వారా అక్కడి పౌరుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది.
వాస్తవం: చైనాలో అంతర్భాగమైన తైవాన్‌కు ఆరోగ్య సంస్దలో చేరేందుకు హక్కు లేదు. సర్వసత్తాక దేశాలకు మాత్రమే దానిలో చేరే హక్కు ఉంది. సాంకేతిక సహకారం వాటి మధ్య నిరాఘాటంగా కొనసాగుతోంది. తైవాన్‌ నిపుణులు అనేక సమావేశాలకు హాజరయ్యారు. తైవాన్‌ నుంచి ఊహాన్‌కు సైతం నిపుణులు వచ్చారు.
19. ఆరోపణ: ప్రపంచ వ్యాపితంగా వైరస్‌ వ్యాపించటానికి చైనాయే కారణం కనుక, ఆ విషయాలపై దర్యాప్తు జరపాలి, పరిహారం చెల్లించాలి.
వాస్తవం: చైనాయే బాధ్యురాలని, పరిహారం కోరేందుకు చట్టపరంగా ఎలాంటి అవకాశాలు లేవు. స్ధానిక రాజకీయ అజెండా కారణంగా అమెరికా రాజకీయవేత్తలు చైనా మీద నెపం వేస్తున్నారు. చైనా కూడా బాధిత దేశమే. ఒక చోట తొలుత వెల్లడైనంత మాత్రాన ఆ దేశం నష్టపరిహారం చెల్లించాలని ఎక్కడా లేదు.1980దశకంలో ఎయిడ్స్‌ తొలుత అమెరికాలో బయటపడింది, అప్పటి నుంచి పరిహారం చెల్లించాలని దాన్ని ఎవరూ అడగలేదు. ప్రజారోగ్యం గురించి అమెరికాతో చైనాకు ఎలాంటి ఒప్పందమూ లేదు.
20. ఆరోపణ: వైరస్‌ నుంచి లబ్దిపొందేందుకు వైద్య సరఫరాలను చైనా దాచిపెట్టింది. అమెరికాలో వెంటిలేటర్ల వంటి వాటికి కొరత ఏర్పడటానికి ఇదే కారణం.
వాస్తవం: దేశీయంగా వైరస్‌ను ఎదుర్కొంటూనే ఇతర దేశాలకు సాయపడేందుకు చైనా తన శక్తికొద్దీ ప్రయత్నించింది. ఇప్పటికి 150దేశాలకు వైద్య సరఫరాలు చేసింది. మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 30వరకు 71.2బిలియన్ల వైద్య పరికరాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేసింది. మార్చి ఒకటి మే అయిదవ తేదీల మధ్య అమెరికాకు చైనా నుంచి 6.6బిలియన్ల ముఖతొడుగులు,344 మిలియన్‌ జతల సర్జికల్‌ తొడుగులు, 44.09 మిలియన్ల రక్షణ సూట్లు, 6.75 మిలియన్ల కళ్లద్దాలు, ఏడున్నర వేల వెంటిలేటర్లను సరఫరా చేశారు. ఇవిగాక అమెరికాలోని 30 రాష్ట్రాలు, 55 నగరాలకు అనేక లక్షల కిట్లు, తొడుగులు మొదలైన వాటిని విరాళంగా పంపారు.
21. ఆరోపణ: ఇతర దేశాలకు మహమ్మారి వ్యతిరేక సాయంలో కూడా చైనా రాజకీయ, ప్రచార కండూతితో వ్యవహరించింది.
వాస్తవం: వైరస్‌ను ఎదుర్కోవటంలో ఇతర దేశాలు చైనాకు చేసిన సాయానికి ప్రతిగానే చైనా కూడా సాయం చేసింది. చైనా నిపుణులు 120 వీడియో కాన్ఫరెన్సుద్వారా 160దేశాల వారితో అనుభవాలను పంచుకున్నారు. పందొమ్మిది దేశాలకు 21 చైనా బృందాలు వెళ్లాయి.
22. ఆరోపణ: డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి ఎన్నిక అవకుండా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటోంది.
వాస్తవం: చైనా ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే సూత్రానికి కట్టుబడి ఉంది. అమెరికాలోని కొందరు రాజకీయవేత్తలే అక్కడి ఎన్నికల్లో చైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చైనా మీద దాడిని ఎక్కుపెట్టాలని రిపబ్లికన్‌ పార్టీ సెనెటోరియల్‌ కమిటీ 57పేజీల పత్రాన్ని ప్రచార విభాగానికి అందచేసినట్లు పొలిటికో పత్రిక వెల్లడించింది. కరోనా వైరస్‌కు చైనాయే కారణమని, దాన్ని దాచిపెట్టిందని, డెమోక్రాట్లు చైనా పట్ల సానుకూలంగా ఉన్నారని, తాము ఎన్నికైన తరువాత వైరస్‌ను వ్యాప్తి చేసినందుకు చైనా మీద ఆంక్షలు విధిస్తామని ప్రచారం చేయాలని దానిలో పేర్కొన్నారు.

Cartoon Movement - Trump Lies
23.ఆరోపణ : కిట్స్‌, మాస్కులు, వెంటిలేటర్ల ఎగుమతుల గురించి ఎగుమతిదారులు కస్టమ్స్‌ వివరాలు వెల్లడించాలని చైనా కోరింది, ఎగుమతులపై నిషేధం విధించేందుకు అలా చేశారు.
వాస్తవం: నాణ్యతా ప్రమాణాల మెరుగుదల కోసమే ఆ సమాచారాన్ని అడిగారు. ఈ చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. నాణ్యత లేని ఉత్పత్తులను నిరోధించటానికి, కనుగొనేందుకు తోడ్పడింది. త్వరగా కస్టమ్స్‌ అనుమతులు ఇవ్వటానికి వీలు కలిగించింది. ఎగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
24. ఆరోపణ: ఆఫ్రికన్ల విషయంలో గువాంగ్‌డోంగ్‌లో వివక్ష ప్రదర్శించారు.

వాస్తవం:చైనీయులు, విదేశీయులెవరైనా ఎలాంటి వివక్ష చూపలేదు. స్ధానికంగా ఎన్ని ఇబ్బందులు పడినా హుబెరు రాష్ట్రంలోని మూడువేల మంది ఆఫ్రికన్‌ విద్యార్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంది. ఒక విద్యార్ధికి వైరస్‌ సోకితే వెంటనే చికిత్స అందించారు. ఏప్రిల్‌13న గ్వాంగ్‌డోంగ్‌లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి వైరస్‌ ఉంది, వారిలో 19 మంది ఆఫ్రికన్లు ఉన్నారు.ఎవరినీ లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకోలేదు. ఊహాన్‌ వీధుల్లో కెనియన్‌ దంపతుల మీద దాడి జరిగినట్లు బిబిసి ఏప్రిల్‌ 17న బిబిసి ప్రసారం చేసింది. నిజానికి అది అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగింది.

http://www.xinhuanet.com/english/2020-05/10/c_139044103.htm

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కనుచూపు మేరలో హెలికాప్టర్‌ మనీ కానరావటం లేదు కెసిఆర్‌ సార్‌ !

16 Thursday Apr 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, USA

≈ Leave a comment

Tags

covid 19 India Stimulus package, COVID-19, Helicopter money, KCR

KCR Explains About Helicopter Money | CM KCR Press Meet | 11/04 ...

ఎం కోటేశ్వరరావు
గృహబందీ 2.0(లాక్‌డౌన్‌) మే నెల మూడవ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసం దేశంలోని అన్ని తరగతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యమంత్రుల తరగతిలో తెలంగాణా వజీర్‌ ఆలా కె.చంద్రశేఖరరావు మరింత ఆశాభంగం చెంది ఉండాలి. మీడియా ముందుకు రావటానికి బిడియ పడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పైకి బయట పడకపోయినా పెద్దన్న చెప్పింది జరిగేట్లు చూడమని దేవుళ్లందరినీ గృహబందీ కారణంగా లోలోపల అయినా వేడుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్ధిక పరిస్ధితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేట్లు ఉంది మరి.
గృహబందీ పొడిగించటం అని వార్యం అని తేలిపోయి, లాంఛన ప్రకటన వెలువడటమే తరువాయి అన్న దశలో హెలికాప్టర్‌ మనీ అందచేయాలని కెసిఆర్‌ ప్రతిపాదించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే ఆ ”ఖ్యాతి”లో తన వాటా ఎక్కడ తగ్గుతుందో అన్న తొందరలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సలహా తనదే అని తన భుజాలను తానే చరుచుకున్న విషయం తెలిసిందే. సరే తరువాత ఏమైందో చెప్పుకుంటే అంత బాగోదు. మనోభావాలు దెబ్బతినవచ్చు.
మన కెసిఆర్‌ సార్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడక ముందే అమెరికా, జపాన్‌, ఇతర దేశాల పత్రికల్లో ఇతరంగా దీని గురించి చర్చ ప్రారంభమైంది. విలేకర్ల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నోరు మూయిస్తారు గనుక, ఏ విలేకరైనా ప్రశ్న అడిగితే కెసిఆర్‌ ముందు అవమానాల పాలుకావటంతో పాటు ఆఫీసుకు వెళ్లే సరికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని స్ధితి కనుక దాని మంచి చెడ్డలు కెసిఆర్‌ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉండదు.
ప్రస్తుత సంక్షుభిత స్దితిలో దీన్ని ప్రతిపాదిస్తే తాను ఖ్యాతి పొందవచ్చన్న ఆలోచనగానీ లేదా నరేంద్రమోడీ అలాంటి పని చేయవచ్చన్న అత్యాశగానీ కారణాలు ఏమైనా కెసిఆర్‌ ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రధాని ప్రసంగం లేదా కేంద్రం నుంచి రెండవ విడత వెలువడుతుందని భావిస్తున్న ఉద్దీపన 2.0గానీ అలాంటి ఆలోచన కలలో కూడా పెట్టుకోవద్దు అని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు ఉన్న ఉపాధి కోల్పోయి గోచిపాతలతో మిగిలారు. ప్రభుత్వాల సంక్షేమ పధకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో కూడా ముందస్తు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ మీద లీటరుకు కరోనా సమయంలోనే మూడేసి రూపాయల పన్ను పెంచి రాబోయే రోజుల్లో మరింతగా పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి సర్కార్‌ జనానికి పన్ను పోటు తగ్గిస్తుందని లేదా ధనికుల దగ్గర మూలుగుతున్న సంపదల్లో కొద్ది మొత్తం తీసుకొని కరోనా కష్టకాలాన్ని గట్టెక్కిస్తుందని ఎవరైనా ఊహించగలరా ? మునిగిపోతున్న పడవలో ప్రయాణించే వారికి గడ్డిపోచ కనిపించినా దాన్ని పట్టుకొని బయటపడదామని చూస్తారు. రాష్ట్రాల పరిస్ధితి ఇలాగే ఉంది కనుక చంద్రశేఖరరావు అలాంటి ఆశతో హెలికాప్టర్‌ మనీ కోసం చూస్తున్నారని అనుకోవాలి.
చాలా మంది తెలంగాణా ముఖ్య మంత్రికి ఇలాంటి మహత్తర ఆలోచన ఎలా తట్టిందబ్బా అనుకుంటున్నారు. రెండు విషయాలు జరిగి ఉండవచ్చు. ఒకటి ముఖ్యమంత్రి పత్రికలు లేదా ఇంటర్నెట్లో వార్తలు చదువుతూ ఉండి ఉండాలి.రెండవది ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలు నాకు నివేదించాలి అని అధికార యంత్రాంగానికి పని చెప్పి ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి ముందురోజు అంతర్జాతీయ మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. మరో రూపంలో అంతకు ముందే మన దేశంలో కూడా కొంత మంది ఇలాంటి సూచనలే చేశారు. ఇక జరిగిందేమిటో మీరే ఊహించుకోవచ్చు.
పూర్వం వైద్యులు చేయగలిగింది చేశాం చివరి ప్రయత్నంగా మీకు అంగీకారమైతే గరళ ప్రయోగం చేద్దాం అనేవారని చదువుకున్నాం. అంటే రోగి ఆటో ఇటో అన్నమాట. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర సంక్షోభానికి గురైనపుడు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై చేతులెత్తేసే స్దితిలో జనానికి చేతి నిండా డబ్బు ఇస్తే ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటుందనే ఒక దివాలాకోరు ఆలోచన ఇది. దీనికి హెలికాప్టర్‌ మనీ అని ఎందుకు పేరు పెట్టారు ? హెలికాప్టర్లు, మోటారు వాహనాలు, రైళ్లు లేని రోజుల్లో గనుక ఇలాంటి పరిస్ధితి మీద ఆలోచన వచ్చి ఉంటే దానికి గుర్రపు బండి లేదా గుర్రపు డబ్బు అనే వారేమో. ఎందుకంటే అప్పుడు అదే వేగంగా, కొండలు, గుట్టల మీద ప్రయాణించే సాధనం కనుక.
1969లో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారింది. ఆ సమయంలో వినిమయాన్ని పెంచటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించాలన్న ఆలోచనతో ఆర్ధికవేత్త మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ హెలికాప్టర్ల ద్వారా జన సమూహాలకు డబ్బును జారవిడిచి జనానికి డబ్బు అందించి కొనుగోలుశక్తిని పెంచవచ్చని తొలిసారిగా ఆ పద్దతి, పదప్రయోగం చేశాడు. హెలికాప్టర్లతో వేగంగా డబ్బు సంచులు మోసుకుపోవచ్చు, జనానికి అత్యంత సమీపానికి వాటిని దించవచ్చు.అలాంటిది మరొక సాధనం లేదు. నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించి జనానికి అందచేయటం ఇక్కడ కీలకం, దాన్ని తిరిగి జనం నుంచి వసూలు చేయాలా లేదా అంటే అది ఆయా ప్రభుత్వాల వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఉచితంగా ఇవ్వాలన్నదే హెలికాప్టర్‌ మనీ ఉద్ధేశ్యం. అనూహ్యంగా ఈ పని చేయాలని మిల్టన్‌ చెప్పాడు తప్ప చెయ్యలేదనుకోండి !

KCR Explains About Helicopter Money
ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు ? ప్రపంచంలో సంక్షోభం ఏర్పడినపుడు ఆర్ధిక వ్యవస్ధలను తిరిగి గాడిలో ఎలా పెట్టాలి అన్నది ఒక చర్చ. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అంటే ఆస్తుల కల్పన ద్వారా ఉపాధి కల్పించి జనం చేతుల్లో డబ్బు ఉండేట్లు చూడటం. దీన్ని కీన్స్‌ సిద్దాంతం అంటారు. గతంలో అమెరికాలో ఇదే చేశారు. పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు, వివిధ సేవలకు భవనాల(ఆసుపత్రులు, పాఠశాలల) వంటి మౌలిక సదుపాయాలు కలిగించటం దానిలో భాగమే. అవే తరువాత అమెరికా అభివృద్దికి ఎంతో తోడ్పడ్డాయి. మన దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం అలాంటిదే. కీన్స్‌కు విరుద్దమైనది మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ సిద్దాంతం. మౌలిక సదుపాయాల కల్పన అంటే వెంటనే జరిగేది కాదు. కొంత వ్యవధి పడుతుంది. కనుక ఎటిఎం మిషన్‌లో ఇలా కార్డు పెట్టగానే అలా డబ్బు వచ్చినట్లు జనానికి డబ్బు ఇచ్చి ఖర్చు చేయించటం ద్వారా వెంటనే వస్తువులకు డిమాండ్‌ పెంచవచ్చు అనే వినిమయదారీ సిద్ధాంతం మిల్టన్‌ది. హెలికాప్టర్‌ మనీ ప్రతిపాదనలు చేసే వారు దీన్ని నమ్ముతున్నారని అర్ధం.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.75వేల కోట్ల ఉద్దీపన పధకం ప్రకటించింది. ఇది ఏమూలకూ చాలదు. మన జిడిపి విలువ 2020అంచనా 203 నుంచి 245లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది. దీనిలో పైన చెప్పుకున్న మొత్తం0.86 నుంచి 0.7శాతమే. ఇది ఏమూలకూ చాలదు, కనీసం ఐదుశాతం ఉద్దీపనకు కేటాయించాలి అంటే పది నుంచి 12లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అనేక మంది చెబుతున్నారు. దీని కోసం నోట్ల ముద్రణ ఒక మార్గం అయితే, పరిమాణాత్మక సడలింపు అంటే మార్కెట్‌లో డబ్బు సరఫరాను పెంచటం మరొక పద్దతి. దీనిలో కూడా నోట్ల ముద్రణ కొంత మేరకు ఉంటుంది. 2008 సంక్షోభం తరువాత అమెరికాలో ఈ పద్దతిని కొంత మేరకు అమలు జరిపారు గానీ సంక్షోభం పరిష్కారం కాలేదు, త్వరలో మరొక సంక్షోభంలో కూరుకుపోతుందని కరోనాకు ముందే వార్తలు వచ్చాయి.
ముఖ్య మంత్రి కెసిఆర్‌ ప్రతిపాదించిన హెలికాప్టర్‌ మనీ పధకాన్ని కేంద్రం అమలు జరిపితే ఏం జరుగుతుంది ? కొంత సొమ్మును రాష్ట్రాలకు కేటాయిస్తారు. దాన్ని తిరిగి కేంద్రానికి ఇవ్వనవసరం లేదు.రాష్ట్రాలు తాము ఇవ్వదలచుకున్న వారికి ఆ సొమ్మును పంపిణీ చేస్తాయి, జనం సరకులు కొనుగోలు చేస్తే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. సరకులు అమ్ముడు పోతే తయారీ డిమాండ్‌ పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది, తద్వారా కార్మికుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది మరింత డిమాండ్‌ను పెంచుతుంది. ఇది ఒక అంచనా, అభిప్రాయం. అయితే పరిస్ధితులు బాగోలేనపుడు, రేపేం జరుగుతుందో తెలియనపుడు మనవంటి దేశాలలో సహజంగానే జనం తమ ఖర్చులను తగ్గించుకుంటారు, డబ్బును పొదుపు చేసి తమదగ్గరే ఉంచుకుంటారు. బ్యాంకుల్లో సొమ్మును ఏం చేస్తారో అనే అపనమ్మకం కారణంగా జనం ఇటీవల బ్యాంకుల్లో సొమ్ముదాచుకోవటం లేదనే వార్తల విషయం తెలిసిందే. ఒక వేళ అదే జరిగితే హెలికాప్టర్‌ మనీ పధక లక్ష్యం నీరుకారిపోతుందన్నది ఒక అభిప్రాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చాయి. ఆ సొమ్మంతా తిరిగి పెట్టుబడులుగా మార్కెట్లోకి రాలేదు. తమ రిజర్వుసొమ్ము, ఇతర ఖాతాల్లో వారు దాచుకున్నారు. జనానికి తగిన ఆదాయం లేకపోవటం, వస్తుకొనుగోలుకు చేసే వ్యయానికి తగిన డబ్బు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతాలలో వస్తు వినియోగం తగ్గింది. మరోమాటలో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇది పరిశ్రమల మీద పడి నిరుద్యోగం పెరిగింది, అనేక సంస్ధల మూతకు దారి తీసింది. ఈ పరిస్ధితి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది. అది మరింత నిరుద్యోగానికి కారణమైంది. స్వయం సహాయ సంస్ధల ఏర్పాటు లక్ష్యం స్వయం ఉపాధిని కల్పించటం, కానీ జరిగిందేమిటి ? వాటికి ఇచ్చే రుణాలను వేరే అవసరాలకు వినియోగించినందున అసలు లక్ష్యం వెనుకబడిపోయింది.
పశ్చిమ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో పరిస్ధితులు వేరు. ఈ రోజు ఎంత వస్తే అంత ఎలా ఖర్చు చేయాలి అనే వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే అప్పుచేసి పప్పుకూడు. నిరుద్యోగ భృతి వంటి హామీలున్నాయి గనుక అక్కడ జనం అలా తయారయ్యారు. మనకా సామాజిక రక్షణ లేదు. డబ్బు వస్తే ముందు పొదుపు ఎలా చేయాలా అని చూస్తాం. ఈ వైఖరి మన దేశాన్ని ఇప్పటి వరకు రక్షిస్తోంది. కానీ కార్పొరేట్‌ కంపెనీలు అమెరికా పద్దతికి నెట్టాలని చూస్తున్నాయి. దానిలో భాగమే ఎన్ని క్రెడిట్‌ కార్డులు కావాలంటే అన్ని కార్డులు ఇవ్వటం, వాయిదాల పద్దతిలో వస్తువుల అందచేత వంటివి.
మన నరేంద్రమోడీ గారు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత దగ్గరి స్నేహితుడో అందరికీ తెలిసిందే జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల చొప్పున మూడునెలలు ఇస్తామని ప్రకటించారు. డాలర్లలో ఏప్రిల్‌ 16 డాలరు మారకపు విలువ రూ.76.75లో 19.51 డాలర్లు. అదే ట్రంప్‌ నెలకు పెద్ద వారికి 1200 డాలర్లు, పిల్లలకు ఐదు వందల చొప్పున ప్రకటించారు, కానీ పెద్ద వారికి మూడువేలు, పిల్లలకు 1500చెల్లించాల్సిన అవసరం ఉందని గతంలో ట్రంప్‌ వద్ద కొంతకాలం సమాచార అధికారిగా పని చేసిన ఆంథోనీ కారముసి చెప్పాడు. వడ్డీ రేటు సున్నాకు దగ్గరలో ఉన్నందున, మరిన్ని అప్పులను కొనుగోలు చేస్తామని ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) చెప్పిన కారణంగా మరింత సొమ్ము చలామణిలోకి వస్తుందని, గత మూడు వారాల్లో ఒక లక్ష కోట్ల డాలర్లను చలామణిలోకి తెచ్చినట్లు(ఏప్రిల్‌ తొమ్మిది నాటికి మన రూపాయల్లో 76 లక్షల కోట్లు ) కారముసి చెప్పాడు.
హెలికాప్టర్‌ మనీ సరఫరా గురించి ఆలోచించే వారు రాగల ముప్పును కూడా గమనంలోకి తీసుకోవాలనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. జనం దగ్గరకు ఒక్కసారిగా డబ్బు చేరినపుడు డిమాండ్‌ మేరకు సరకులు లేకపోతే ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో గృహబందీ సమయంలో జరుగుతున్నది అదే. జనం దగ్గర పరిమితంగానే డబ్బులున్నాయి, అయినా సరకుల రవాణాపై ఆంక్షలున్న కారణంగా ధరలు పెరిగాయి. సరకులు ఉన్నా ఆయాచితంగా ఒక్కసారిగా డబ్బు జనం చేతుల్లోకి వస్తే ధరలు పెరుగుతాయి, దాని పర్యవసానం వేతన పెరుగుదల ఉంటుంది, ద్రవ్యోల్బణాన్ని రిజర్వు బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా అడ్డుకుంటాయో కూడా చూడాలని కూడా హెచ్చరిస్తున్నారు. అసలు అమెరికా మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ కూడా ఒకసారి అమలు జరపాలి తప్ప మరోసారి పునరావృతం కాకూడదని కూడా చెప్పాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజాకర్షక రాజకీయవేత్తలు ఇదేదో బాగుందని తాము చేయాల్సిన వాటిని కూడా చేయకుండా ప్రింటింగ్‌ ప్రెస్‌లవైపు పరుగులు తీస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇలా చేస్తే రిజర్వుబ్యాంకుల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని,ఆర్ధిక అరాచకం పెరుగుతుందని, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని, ఇప్పుడంత అవసరం లేదనే వారు మరికొందరు.

CM KCR about Helicopter Money| KCR Press meet| 4D NEWS #helicopter ...
సార్వత్రిక కనీస ఆదాయ పధకాన్ని ముందుకు తెచ్చిన వామపక్ష భావాలున్న ఆర్ధికవేత్తలు ఇటీవల హెలికాప్టర్‌ మనీని ముందుకు తెచ్చారని దీనివలన ప్రభుత్వాలు చేసే ఖర్చు పడిపోతుందన్నది ఒక విమర్శ. ఈ పధకాన్ని అమలు జరిపితే వనరుల కేటాయింపు, కష్టపడేవారికి ప్రోత్సాహకాలు కరవు అవుతాయన్నది మరొక వాదన. అయితే గతంలో పెదవి విరిచిన వారు కూడా మరొక మార్గం ఏమీ కనిపించక ఏదో ఒకసారికి అయితే సరే అన్నట్లుగా తలూపుతున్నారు. నేరుగా నగదు పంపిణీ చేయకపోతే ఆర్ధిక వ్యవస్ధ మరింత దిగజారుతుందన్నది కొందరి హెచ్చరిక.
చివరిగా చెప్పవచ్చేదేమంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదించినట్లుగా కేంద్రం హెలికాప్టర్‌ మనీ అంద చేసే అవకాశాలు దాదాపు లేవు. కరోనా కారణంగా అనేక మంది చెబుతున్నట్లు అభివృద్ధి రేటు తిరోగమనంలోకి దిగిపోయి తిరిగి పైకి లేచే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినపుడు గరళం పోయాల్సిన పరిస్ధితి వస్తే తప్ప ఇలాంటి పరిస్ధితి రాదు. అందువలన బంగారు తెలంగాణా ముఖ్యమంత్రిగా ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు బీద అరుపులు అరిస్తే, జనాన్ని విస్మరిస్తే అన్ని తరగతుల్లో విస్వసనీయత సమస్య తలెత్తుతుంది. అదే జరిగితే రాజకీయంగా, పార్టీ పరంగా అనూహ్యపరిణామాలకు నాంది అవుతుంది. అలాంటి పరిస్ధితిని కెసిఆర్‌ కొని తెచ్చుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ పరువును మురికి గంగలో కలిపిన జిగినీ దోస్త్‌ ట్రంప్‌ !

09 Thursday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Donald trump Threat India, hydroxy chloroquine, Narendra Modi prestige

President Tump had supported the Narendra Modi government’s stand on hydroxychloroquine and praised India’s handling of the Covid-19 pandemic.

ఎం కోటేశ్వరరావు
నువ్వే నేను, నేనే నువ్వు, అన్ని విషయాల్లో ఒకే మాటగా ఒకే బాటలో నడుస్తామని చెప్పారు. మాది ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకొనే స్నేహం అన్నారు. కావాలంటే చూడండి అని కావిలించుకొని మరీ ప్రపంచానికి ప్రదర్శించారు. వారెవరో ఇంకా చెప్పాలా ! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, మన ప్రధాని నరేంద్రమోడీ. అలాంటి ట్రంప్‌ మరో దోస్తును మాక్కావలసిన మందు పంపకపోతే సంగతి చూస్తా బిడ్డా ! అని బెదిరించాడు. అంతకోపమెందుకు అన్నా నీక్కావలసినవి పంపుతున్నా అంటూ వెంటనే మోడీగారు జావగారి పోయారు. తన అవసరం తీరగానే భారత్‌కు, మోడీకి కృతజ్ఞలు అంటూ ఒక ట్వీట్‌ను ట్రంప్‌ మనకు పారేశాడు. మరి ఇదేమి స్నేహమో, ఇదేమి సమానభాగస్వామ్యమో జనం ఆలోచించాలి. ఈ విషయాల మంచి చెడ్డల గురించి మాట్లాడితే కరోనా కష్ట కాలంలో ఇలాంటివా అని మోడీ భక్తులు చెలరేగి పోతారు. మామూలు రోజుల్లోనే సహించరని ఇప్పటికే తేలిపోయింది కనుక ఇప్పుడు చెప్పనవసరం లేదు. అమెరికన్ల ప్రాణాల మీదకు తెచ్చింది ట్రంప్‌. సాయం కావాల్సింది వారికి, ఎవరైనా మర్యాద పూర్వకంగా అడుగుతారు. బెెదిరించేవాళ్లను-వారికి లొంగిపోయే వారిని ఏమనాలి ? ఇది వ్యక్తుల సమస్య కాదు, దేశం పరువు. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఇలా ప్రవర్తిస్తారా అని షాక్‌ అవుతున్నవారెందరో !
ప్రపంచ మీడియా అంతా అమెరికా బెదిరింపుకు భారత్‌ లొంగిపోయింది అని రాసింది. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు కోపం వచ్చింది అన్నట్లుగా మోడీ భక్తులకు ట్రంప్‌ అవమానించినందుకు, ప్రపంచ మీడియా అదే విషయాన్ని రాసినందుకు కోపం రాకపోవచ్చు గానీ మన దేశంలో ఎవరైనా దాని గురించి మాట్లాడితే, రాస్తే, విమర్శిస్తే ఎక్కడలేని ఆగ్రహం వస్తుంది. బానిస మనస్థత్వాన్ని ప్రదర్శించారని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరేమనుకుంటేనేం ట్రంప్‌ పొగడ్తల ముందు అన్నీ దిగదుడుపే ! నిన్నటిదాకా ప్రపంచ రాజకీయాల్లో సమాన భాగస్వామి అని ప్రకటించిన నరేంద్రమోడీని ట్రంప్‌ అవమానిస్తే అది మోడీకి కాదు, దేశానికే అవమానం. అలాంటిది దీన్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అనటాన్ని ఏమనాలి, సాధారణంగా అయితే సిగ్గు చేటు అంటాం. ఈ మాట దేశద్రోహం కిందకు రాదు. రాజకీయం చేసింది, మర్యాద లేకుండా వ్యవహరించింది ట్రంప్‌ !

COVID-19: More Hydroxychloroquine Data From France
కరోనాకు ఇంతవరకు మందు లేదు. ఉన్న మందులు కరోనా సోకిన రోగులకు తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్సకోసం తప్ప మరొకదానికి కాదు. మలేరియాకు బాగా పని చేసే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అనే ఔషధం కరోనా వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుందని ఇంతవరకు ఎవరూ నిర్దారణగా చెప్పలేదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఫలానా మందు వేస్తే ఏమైనా సుగుణం వస్తుందేమో చూద్దాం అన్ని అందుబాటులో ఉన్న మందులను వాడుతున్నట్లుగా కొన్ని చోట్ల దీన్ని కూడా వాడారు. కొందరికి సుగుణం కనిపించిందని వైద్యులు చెప్పారు, కొందరికి అదే ప్రాణాల మీదకు తెచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ మందును ప్రపంచంలో ఎవరైనా తయారు చేయవచ్చు, దీనికి లైసన్సు, పేటెంట్లతో పనిలేదు. అమెరికాలో కూడా ఇప్పటికే తయారు చేస్తూనే ఉన్నారు. అలాంటి దానికోసం ట్రంప్‌ ఇంత యాగీ ఎందుకు చేసినట్లు ? తన దోస్తు పరువు ఎందుకు తీసినట్లు ?
ట్రంప్‌ చర్య బెదరింపు, హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ ,ఇతర వైద్య పరమైన వాటిపై ఎగుమతి నిషేధాన్ని సడలించకపోతే ప్రతికూల చర్యలకు పాల్పడతాం అని చెప్పటం బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. నిర్దారణగాని సదరు ఔషధం కనుక ఎగుమతి చేసినా ఇబ్బంది లేదు, కరోనా పోరులో అవసరమైన మిగతావాటిని కూడా బెదిరింపులకు లొంగి సరఫరా చేస్తే మన జనం సంగతి ఏమిటి అన్నది సమస్య? ఈ విషయాన్ని చర్చించనవసరం లేదా ? ట్రంప్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఏకపక్షంగా చేయకపోతే ప్రతిపక్షాలను ఎందుకు సంప్రదించలేదు ?
సామాజిక మీడియాలో అతిశయోక్తులు ప్రచారం చేయటం, నరేంద్రమోడీకి లేని గొప్పతనాన్ని అంటగట్టటం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కూడా కాషాయ తాలిబాన్లు వెంటనే విజృంభించారు. సరైన పేరు లేదు గానీ కాషాయ రంగులో ఉండే వైరస్‌ సోకిన కారణంగా మీడియాలో పని చేసే వారందరూ కమ్యూనిస్టులుగానూ, మోడీకి సంబంధించి నిజాలను చూపని వారుగా కనిపిస్తారు. ఒక సారి ఆ వైరస్‌ సోకిన వారికి మెదడు పూర్తిగా చెడిపోతుంది, దాంతో జీవితాంతం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. అది వ్యాధి లక్షణం. అలాంటి ఒక వ్యాధిగ్రస్తుడు లేదా గ్రస్తురాలు సామాజిక మాధ్యమం కోసం తయారు చేసిన పోస్టు ఇలా తిరుగుతోంది. ” కమ్మి కమీనే మీడియా కుళ్ళుతో చెప్పని, ఇంటర్నేషనల్‌ న్యూస్‌ టాపిక్స్‌ లో హాట్‌ గా మారిన వార్త ఇవాళ్టికి ఇదే. మోడీ చాలా టఫ్‌ గురూ…సూపర్‌ పవర్‌ అమెరికాకి హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ అత్యవసరం, భారత్‌ కు ఎగుమతి చేసే శక్తి ఉంది.ముందుగా డిమాండ్‌ చేశారు.మోదీజీ ముందు మా అవసరాలు తీరాలని సమాధానం. రెండోసారి బెదిరింపు.మోదీజీ నవ్వుతూ కుదరదని స్పష్టం..మూడోసారి ‘ ఓకే మీకేం కావాలో అడగండి ‘ఇదీ అడిగేపద్దతి..
1.) అమెరికన్‌ మార్కెట్లలోకి ప్రవేశించడానికి భారత్‌ ఫార్మా కంపెనీలకు అడ్డొస్తున్న నియమాలను సవరించాలి.. డన్‌…2) భారత్‌ ఫార్మా కంపెనీల మీద సహేతుకంగా లేని అమెరికన్‌ ఎఫ్‌డిఏ విధించిన అన్ని లెవీస్‌ ఎత్తివేయాలి… డన్‌. 3.) ఎఫ్‌డిఐ ఇకపై భారత్‌ ఫార్మా కంపెనీల మీద అనవసర పేటెంట్‌ హరాస్మెంట్‌ చేయకూడదు.. డన్‌ . భారత్‌ ప్రతిపాదించిన 3 ప్రధాన డిమాండ్స్‌ నూ..డన్‌..డన్‌..డన్‌ 24 గంటల సమయంలో ఒప్పుకున్న అమెరికా…నిజంగానే మోడీ చాలా టఫ్‌… కొరకరాని కొయ్య..? ఓవరాల్‌గా మన ఫార్మా కంపెనీలు అమెరికా వెళ్ళడానికి కావలిసిన అన్ని అనుమతులు మోడీ గారు దగ్గర ఉండి ఇప్పించారు. అలాగే అమెరికా అడిగిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ కూడా పంపించారు.” ఇదీ మొత్తం పోస్టు.
పాఠకులు గ్రహించాల్సింది ఏమంటే ప్రయివేటు మీడియాలో ఇవన్నీ చూపలేదు సరే, దూరదర్శన్‌, రేడియోలలో పని చేసేది కూడా కమ్యూనిస్టులేనా ? దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలో ఏముంది ? అన్నింటికీ ఒప్పుకుంటున్నట్లు అమెరికా వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదే. మరి సామాజిక మాధ్యమానికి ఎలా అందినట్లు ? ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ ఉత్పత్తి ! ఇంతకీ అసలు జరిగిందేమిటి ?
అమెరికా మనలను అడిగేనాటికే మన కేంద్ర ప్రభుత్వం మన అవసరాలను గమనంలో ఉంచుకొని ఔషధాలు, వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించింది.ఈ మేరకు ఈనెల నాలుగవ తేదీ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెలువడింది. అది వెలువడిన కొద్ది గంటల్లోనే అమెరికా నుంచి ఔషధాలు కావాలని అడిగారు. ట్రంప్‌ స్వయంగా సంప్రదించాడు. నిషేధం కారణంగా కుదరదని చెప్పారు. అయితే నేను స్వయంగా ఫోనులో మోడీని అడిగినా ఔషధాలను పంపరా ? మీ సంగతి చూస్తా అంటూ ట్రంప్‌ సోమవారం నాడు బహిరంగంగానే బెదిరించాడు. ఒక రోజు కూడా గడవక ముందే మన సర్కార్‌ నిషేధాన్ని సడలించి పంపుతామని ప్రకటించింది. అంతే తప్ప మన కంపెనీలు నేరుగా అమెరికా మార్కెట్‌లోకి వెళ్లేందుకు దగ్గరుండి మరీ నరేంద్రమోడీ అనుమతులిప్పించారని చెప్పటం అతిశయోక్తి. కేంద్ర ప్రభుత్వ విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ విలేకర్లతో మాట్లాడుతూ మన మీద ఆధారపడుతున్న దేశాలకు ఔషధాలను పంపుతున్నామని, అమెరికాకు పంపటాన్ని రాజకీయం చేయవద్దని, ఊహాగానాలు వద్దని కోరాడు తప్ప అమెరికాతో పైన చెప్పినట్లుగా ఒప్పందం గురించి చెప్పలేదు, కాషాయ దళాలు ఆయన్ను కూడా కమ్యూనిస్టు అంటారేమో !
సామాజిక మాధ్యమంలో కాషాయ దళాలు చైనాయే మన సాయం కోరింది అని మరొక ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా తప్పుడు ప్రచారమే. ఇబ్బందులలో ఉన్నపుడు ఎంత గొప్పవారినైనా మీకేమైనా కావాలా అని అడుగుతాం. వారు కోరకుండానే మనకు తగిన సాయం చేస్తాం. అది మర్యాద, మన్నన. అలాంటి దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారంటే వారి స్దాయి ఏమిటో అర్దం చేసుకోవచ్చు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్‌ రాత పూర్వక సమాధానమిస్తూ చైనాకు మన దేశం 15టన్నుల వైద్య సరఫరాలను ఫిబ్రవరి 26న ఒక ప్రత్యేక విమానంలో తీసుకుపోయి ఊహాన్‌లోని హుబెయ రాష్ట్ర ఛారిటీ ఫెడరేషన్‌కు అందచేశామని, వాటి విలువ 2.11 కోట్ల రూపాయలని, అంతకు ముందు ఎనిమిదవ తేదీన ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు గ్జీకి ఒక లేఖ రాస్తూ తమ సౌహార్ద్రతను తెలియచేస్తున్నామని, అవసరమైన సాయం చేయగలమని పేర్కొన్నట్లు ఆ సమాధానంలో తెలిపారు. పంపిన వాటిలో ఒక లక్ష సర్జికల్‌ మాస్కులు, ఐదులక్షల సర్జికల్‌ గ్లోవ్స్‌, 75 ఇన్‌ప్యూజన్‌ పంప్స్‌, 30 ఎంటరల్‌ ఫీడింగ్‌ పంప్స్‌, 21డిఫిబ్రిలేటర్లు, నాలుగువేల ఎన్‌95 మాస్కులు ఉన్నట్లు పేర్కొన్నారు. చైనా అవసరాలతో పోల్చినపుడు ఇవి ఎంత అన్నది సమస్య కాదు, తోటి దేశంగా తోడ్పాటు. అది ఎవరైనా చేస్తారు. దాన్ని గొప్పగా చెప్పుకోవటాన్ని ఏమనాలి ?
చైనాకు చేసిన ఈ సాయం గురించి గొప్పలు చెప్పుకుంటున్న వారికి తెలిసినా తెలియనట్లు నటించే విషయాలను జనం తెలుసుకోవాలి.చైనా, ఇతర దేశాల్లో ఎక్కడ దొరికితే అక్కడ మనకు కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను కొనుగోలు చేసేందుకు మన దేశం నిర్ణయించిందని మార్చి 31న రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనాన్ని బిజినెస్‌ టుడే ప్రకటించింది.భారత్‌కు మూడు కోట్ల 80లక్షల ముఖతొడుగులు, 62లక్షల వ్యక్తిగత రక్షణ వైద్య పరికరాలు అవసరమని ఆ వార్తలో పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల వైద్యులకు ఇలాంటి పరికరాలు లేక రెయిన్‌కోట్లు వేసుకుంటున్నారని, గతిలేక హెల్మెట్లు పెట్టుకొని తమను తాము రక్షించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మనం చైనాకే ఎగుమతి చేసే స్దితిలో ఉన్నామని గొప్పలు చెప్పేవారు దీని గురించి ఏమి చెబుతారు ?
అమెరికన్ల పట్ల ట్రంప్‌ నిర్లక్ష్యం గురించి పదే పదే చెప్పుకోవటం నాగరికులకు సిగ్గు చేటు, వదిలేద్దాం. కరోనా చికిత్సకు హైడ్రోక్సి క్లోరోక్విన్‌ పని చేస్తుందని నిర్ధారణ కాలేదు, అయినా ఆ ఔషధం కోసం ట్రంప్‌ గత కొద్ది రోజులుగా ఇంటా బయటా ఎందుకు రచ్చ చేస్తున్నట్లు ? మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాకు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ మాదిరి వ్యవహారమేనా మరేదైనా ఉందా ? అమెరికా మీడియాలో భిన్న కథనాలు వెలువడ్డాయి. హైడ్రోక్సీ క్లోరోక్విన్‌తో కలిపి కొందరు వైద్యులు అజిత్రోమైసిన్‌ ఇస్తారు. దీన్ని జెడ్‌ పాక్‌ అంటారు. ఈ యాంటీబయోటిక్‌ బాక్టీరియాను తప్ప వైరస్‌ను నిర్మూలించదు. రెండు వారాల క్రితం ఫ్రెంచి వైద్యుల బృందం కొందరికి దీనితో చికిత్స చేశారు. ఆరు రోజుల తరువాత ఆరుగురికి పరీక్షలో నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ విషయం ఒక పత్రికలో ప్రచురితమైంది. అమెరికాలోని ఒక ప్రముఖ వైద్యుడు దీన్ని అందుకొని పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చాడు. దాన్నే సలహాగా ట్రంప్‌కు చెప్పాడు. అసలే నిర్లక్ష్యం చేసినట్లు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్‌ ఈ ఔషధంతో అమెరికాలో వైరస్‌ను నిర్మూలించవచ్చని నమ్మినట్లు కనిపిస్తోంది. కానీ అదే ఫ్రెంచి వైద్యుల పర్యవేక్షణలో అదే ఔషధం తీసుకున్న మరో ముగ్గురిని ఆరురోజుల తరువాత పరిస్ధితి విషమించి ఐసియులో చేర్చారు. మరొకరికి చెడు ప్రభావం కనిపించటంతో జెడ్‌ పాక్‌ ఇవ్వటం నిలిపివేశారు. మరొక పేషెంట్‌ ఆరవ రోజున మరణించాడు. ఈ విషయాలను ట్రంప్‌కు వివరించిన వైద్యుడు గానీ, ట్రంప్‌గానీ పట్టించుకోలేదు. కేవలం ఒక ఆరుగురికి వచ్చిన ఫలితాన్ని బట్టి ఒక ఔషధాన్ని వైరస్‌ అనుమానితులు లేదా వ్యాధి గ్రస్తులకు ఇవ్వటం వైద్య చరిత్రలో అరుదు, ఎవరూ అంగీకరించరు. అయినా ట్రంప్‌ హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ చరిత్రను మార్చివేస్తుందంటూ గానాలాపనకు పూనుకున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనది, ఎంతో అందమైనది, స్వర్గం నుంచి వచ్చిన బహుమతి అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలాడు. దాన్లో భాగంగానే మన దేశాన్ని బెదిరించాడు. తాను కూడా స్వయంగా తీసుకోబోతున్నట్లు చెప్పాడు. వైరస్‌ గురించి దాదాపు అన్నీ పచ్చి అబద్దాలు చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు క్లోరోక్విన్‌ గురించి ఎక్కువ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వలన ఫలితం ఉండదనే అంశాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పిన వారిని తీసుకొంటే మీకు పోయేదేమిటి అని నోరు మూయిస్తున్నాడు. ఎప్పుడైతే ట్రంప్‌ ఇలా మాట్లాడటం మొదలు పెట్టారో జనాలు తమకు ఉపయోగపడుతుందో లేదో తెలియకపోయినా అవసరం అయినపుడు ఉపయోగించుకోవచ్చని పెద్ద మొత్తంలో క్లోరోక్విన్‌ ఔషధాన్ని కొని నిల్వచేసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో అమెరికాలో కొరత ఏర్పడింది. అరిజోనా రాష్ట్రంలో చేపల తొట్లలో వేసే క్లోరోక్విన్‌ తీసుకొని భార్యాభర్తలు అస్వస్తతకు గురి కాగా భర్త మరణించాడు.
మరొక ఆసక్తికర విషయం ఏమంటే అమెరికాలో మలేరియాను ఎప్పుడో అరికట్టారు. పదమూడు రాష్ట్రాలలో మాత్రం అక్కడక్కడా చాలా సంవత్సరాల క్రితం కనిపించేది. అయితే ఇప్పటికీ మలేరియా కేసులు అమెరికా ఆసుపత్రుల్లో ఏటా రెండువేల మేరకు నమోదవుతున్నాయి. అవి కూడా విదేశాల నుంచి ముఖ్యంగా దక్షిణాసియా, సబ్‌ సహారా ఆఫ్రికా ప్రాంత దేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే క్లోరోక్విన్‌ మలేరియాతో పాటు లూపస్‌(ముఖచర్మరోగం)కు కూడా బాగా పని చేస్తుంది అందువలన దానికోసం అమెరికాలో కొన్ని కంపెనీలు తయారు చేస్తాయి. అమెరికాలో వ్యూహత్మక నిల్వల కోసం గతనెలలోనే నోవార్తిస్‌ సబ్సిడరీ శాండోజ్‌ కంపెని 2.9 కోట్ల డోసుల హైడ్రోక్సి క్లోరోక్విన్‌ సల్ఫేట్‌ను ప్రభుత్వానికి ఉచితంగా అందచేసింది. మరో కంపెనీ బేయర్‌ పదిలక్షల డోసులు ఉచితంగా అందచేసింది.
హైడ్రోక్సి క్లోరోక్విన్‌ గురించి ట్రంప్‌ హడావుడి చేయటం వెనుక స్వల్ప మొత్తాలలోనే అయినప్పటికీ ట్రంప్‌ కుటుంబ సభ్యులకు ఆర్ధిక ప్రయోజనాలున్నాయని ఆ కారణంగానే ట్రంప్‌, ఆయనకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికే వాటిని రాసింది. పాలక్వెనిల్‌ బ్రాండ్‌ పేరుతో హైడ్రోక్సి క్లోరోక్విన్‌ తయారు చేసే సనోఫి అనే కంపెనీ వాటాలలో ట్రంప్‌ కుటుంబ సభ్యుల మ్యుచ్యువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఉన్నాయని టైమ్స్‌ రాసింది. అయితే అవి వారి ఆస్తులతో పోల్చితే నామమాత్రమే అని వాటి వలన పెద్దగా వచ్చేదేమీ ఉండదని మరికొన్ని పత్రికలు రాశాయి.

Trump threatens payback for U.S. companies that move abroad | PBS ...
ఈ ఉదంతం మొత్తాన్ని చూస్తే ఒక అంశం స్పష్టం అవుతున్నది. ట్రంప్‌ అనుసరించిన నిర్లక్ష్యం కారణంగా నేడు అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది, ఎంత మందికి సోకుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితం వ్యాధి విస్తరణ తీరు తెన్నులను అరికట్టకపోతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది వరకు మరణించే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ విజయం అనుమానమే. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. జో బిడెన్‌ ఇప్పుడు ట్రంప్‌ ప్రత్యర్ధి అని తేలిపోయింది. అమెరికాలో ఔషధ తయారీ ఎంతో ఖర్చుతో కూడుకున్నది తప్ప అక్కడ తయారు చేయలేనిదేమీ కాదు. అంటే ట్రంప్‌ ఇక్కడ కూడా ఖర్చు – లాభం చూసుకున్నాడని అనుకోవాలి. ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడల్లో భాగంగా ఎంతకైనా తెగిస్తానని, అమెరికన్ల కోసం ఏమైనా చేస్తానని ప్రదర్శించుకొనేందుకు మన దేశాన్ని బెదిరించినట్లు స్పష్టం కనిపిస్తోంది.
నరేంద్రమోడీ సర్కార్‌ బెదిరింపుల గురించి కనీస నిరసన కూడా తెలియచేయకుండా నాలుగు రోజుల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేసి అమెరికాకు ఔషధాన్ని పంపేందుకు నిర్ణయించింది, మరి ఆ 56 అంగుళాల ఛాతికి ఏమైందో, సమాన భాగస్వామ్యం ఎక్కడకు పోయిందో తెలియదు, మరీ ఇంత లొంగుబాటా ? ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తామని చెప్పుకొనే తమ నేత పరువు ప్రపంచ మీడియా వార్తలతో వారణాసిలోని మురికి గంగలో కలసిందని, దానికి ఆయన జిగినీ దోస్త్‌ ట్రంపేనని ఆయన భక్తులు గ్రహిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డెబ్బై ఆరు రోజుల తరువాత ఊహాన్‌లో సాధారణ జన జీవనం !

07 Tuesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

COVID-19, Normalcy in Wuhan city, Wuhan city

Why Wuhan is so important to China's economy and the potential ...

ఎం కోటేశ్వరరావు
చైనా తన గురించి ప్రపంచానికి అనేక విషయాలు చెప్పింది. అది చెప్పేది నమ్మకూడదని పశ్చిమ దేశాలు గత ఏడు దశాబ్దాలుగా నూరిపోస్తున్నాయి. దాని వలన చైనాకు వచ్చిన నష్టమేమీ లేదు గానీ మిగిలిన దేశాలు ఎంతగా నష్టపోతున్నాయో కరోనా మహమ్మారి ఉదంతంలో యావత్‌ ప్రపంచం చూస్తోంది. ఎక్కడైతే కరోనా తొలిసారిగా కనిపించిందో ఆ ఊహాన్‌ నగరం దాన్ని అదుపులోకి తెచ్చుకుంది. కరోనా విలయతాండవం సాగిన 76 రోజుల తరువాత తిరిగి బుధవారం నుంచి ఆ నగరం సాధారణ కార్యకలాపాల్లో నిమగం కానుందని అధికారులు ప్రకటించారు. ఈ నిజాన్ని నమ్మని వారిని మానసిక చికిత్సాలయాలకు తరలించటం తప్ప మరొక మార్గం లేదు. ఆ విషయాల గురించి చెప్పుకోబోయే ముందు పశ్చిమ దేశాలు ఇప్పటికీ తమ జనం ప్రాణాలను ఫణంగా పెట్టి ఎలా ప్రయోగాలు చేస్తున్నాయో చూద్దాం.
ముఖాలకు తొడుగులు(మాస్క్‌లు) వేసుకొని కరోనా నుంచి తప్పించుకొనే జాగ్రత్తలలో ఒకటని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో వాటికి ఉన్న పరిమితులు, జాగ్రత్తలను కూడా తెలియ చేస్తున్నారు. కరోనాను జయప్రదంగా అరికట్టిన చైనాలో జనం ముఖ తొడుగులు వేసుకున్నారు. అది ఎన్నో ఫలితాల నిచ్చిందని ఇప్పటికే రుజువైంది. ఐరోపా దేశమైన డెన్మార్క్‌లో మంగళవారం నాటికి 187 మంది మరణించగా 4,681కేసులు నమోదయ్యాయి. ముఖ తొడుగుల వలన ప్రయోజనం ఉందా లేదా చైనా వారు చెప్పేది నిజమా కాదా అని తేల్చుకొనేందుకు బుధవారం నుంచి అక్కడ నెల రోజుల పాటు ఆరువేల మంది మీద ప్రయోగాన్ని తలపెట్టారు. మూడువేల మంది ముఖాలకు తొడుగులు వేస్తారు, మరో మూడువేల మందిని తొడుగులు లేకుండా ఈ నెల రోజుల్లో పరీక్షిస్తారట.
అమెరికన్లు తాము కనిపెట్టిన నూతన ఆయుధాలు ఎలా పని చేస్తాయో చూసేందుకు ఎక్కడో ఒక దగ్గర యుద్ధాన్ని రెచ్చగొట్టి ప్రయోగించి చూడటం మనకు తెలిసిందే. ఇరాక్‌లో అదే పని చేశారు. అన్నింటికీ మించి జపాన్‌పై అణుబాంబులు వేసి బహిరంగ పరీక్ష జరిపిన విషయం గురించి చెప్పనవసరం లేదు. డెన్మార్క్‌ ముఖతొడుగుల ప్రయోగం చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాను ముఖతొడుగును ధరించనని, అయితే తమ పౌరులు స్వచ్చందంగా ధరించవచ్చని ప్రకటించాడు. అనేక పశ్చిమ దేశాల్లో ముఖ తొడుగుల మీద వ్యతిరేక ప్రచారం ఉంది. ఈ దేశాల్లో ఉన్న ఆసియన్లు ఎవరైనా ముఖతొడుగులు ధరిస్తే వారిని కించపరచటం, కొన్ని చోట్ల దాడులు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ముఖతొడుగుల గురించి నమ్మకం లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలి గానీ జనాన్ని ఫణంగా పెట్టి ప్రయోగాలు చేయటం ఏమిటి ? ఇదేమీ రాజకీయ సిద్ధాంతం కాదు, పరీక్షలు జరిపి నిర్ధారించుకొనే తరుణమూ కాదు. తాము పాటించేదే ప్రజాస్వామ్యం, భావ ప్ర కటనా స్వేచ్చ, తాము కనుగొన్నదే సత్యం, ఇతరులను నమ్మం అనే ఒక దురహంకారం పశ్చిమ దేశాలలో ఉన్నది. ఇప్పుడు ముఖతొడుగుల విషయంలో కూడా దాన్నే వెల్లడించుకుంటున్నారు.

23 Eerie Pictures Of Wuhan, China, After Nearly Two Weeks In ...
ఇక ఊహాన్‌ నగరం ఉన్న హుబెరు రాష్ట్రం, పరిసరాలు సాధారణ స్థితికి వస్తున్నాయి. గడచిన 24 గంటల్లో సోమవారం నాడు హుబెరులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు. అయితే అంత మాత్రాన పరిస్ధితి గురించి ఉపేక్షించకూడదని, కరోనా మీద కన్నేసి ఉంచుతామని, ఇంకా ఆనంద, ఉత్సాహాలను ప్రకటించే తరుణం రాలేదని అధికారులు చెప్పారు. రోగ లక్షణాలున్న వారిని పరీక్షలకు పంపే యంత్రాంగం ఇంకా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి వారికి ఒక ఆరోగ్య కోడ్‌ ఇచ్చినందున ఎవరైనా హౌటళ్లు, దుకాణాలు, బస్‌, రైల్వే స్టేషన్లకు వచ్చినపుడు ఆ కోడ్‌ను స్కాన్‌ చేస్తారు. తిరిగి వ్యాధి అనుమానాలుంటే చికిత్సకు తరలిస్తారు. బుధవారం నుంచి రైళ్లు, విమానాశ్రయాలను కూడా పునరుద్దరిస్తున్నారు. వందలాది మెట్రో, బుల్లెట్‌ రైళ్లు సిద్ధం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఊహాన్‌ వాసులు వీధులలోకి వస్తున్నారు, తమకు ఇష్టమైన ఉదయపు ఉపాహారమైన నూడిల్స్‌ను తీసుకుంటూ దుకాణాల వద్ద కనిపిస్తున్నారు. తిరిగి ఫ్యాక్టరీలు, కార్యాలయాలకు పనులకు హాజరయ్యే వారు తాము ఆరోగ్యంగా ఉన్నామని సర్టిఫికెట్‌లను స్మార్ట్‌ ఫోన్ల మీద సమర్పించాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ ఎలా వస్తుందన్నది ఇంకా అంతుబట్టని కారణంగా జనం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు గత కొద్ది రోజులుగా నగర వాసులను హెచ్చరిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు బయట పడకుండా వైరస్‌ సోకే అవకాశాలు కూడా ఉన్నాయని, అందువలన బయటి నుంచి వచ్చిన వారిని ఫ్యాక్టరీలు,కార్యాలయాల్లో పరీక్షించి నిర్దారించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా లక్షణాలు బయట పడితే వారు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణించారు అనేది వివరాలు తెలుసుకొని వ్యాధి జాడను కనుగొంటారు. ఇలాంటి పరీక్షలు జరపగా సోమవారం నాడు 78 కొత్త అనుమానితుల కేసులు బయట పడ్డాయి, వాటిలో 40 విదేశాల నుంచి వచ్చిన వారు,ఐదు నిర్దారణ అయ్యాయి. చైనాలో వైరస్‌ కారణంగా సోమవారం నాటికి మరణించిన వారి సంఖ్య 3,335కు చేరింది, ఇంకా చికిత్సలో ఉన్నవారు 1,299 కాగా వారిలో 211 మంది పరిస్ధితి విషమంగా ఉంది.
శనివారం నాడు దేశవ్యాపితంగా మృతులకు శ్రద్దాంజలి ఘటించారు. అయితే మరణాల సంఖ్యను దాచి పెడుతున్న చైనా వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు శ్మశానవాటికల వద్ద పెద్ద సంఖ్యలో జనం చేరకుండా నిషేధించిందని అమెరికా పత్రికలు వక్రీకరణ వార్తలు రాశాయి. ఇంకా పెద్ద ఎత్తున జనం గుమి కూడటం ప్రమాదకరమే అని అందువలన జాగ్రత్తలో భాగంగా ఇండ్ల వద్దనే శ్రద్ధాంజలి ఘటించాలని కోరటాన్ని అలా చిత్రీకరించారు.
ఊహాన్‌ పరిసరాలలో ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్దలు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సబ్సిడీలు, పన్నుల తగ్గింపు వంటి చర్యలకు ప్రభుత్వం తొలి విడతగా ఇరవై బిలియన్‌ యువాన్ల(2.82 బిలియన్‌ డాలర్లు)ను కేటాయించింది. హుబెరు రాష్ట్రంలో మొత్తం 67,803 కరోనా కేసులు నమోదు కాగా రాజధాని ఊహాన్‌లోనే 50,008 ఉన్నాయి. దేశంలో సాధారణ పరిస్దితులు నెలకొంటున్న నేపధ్యంలో వైరస్‌ నుంచి రక్షణ కోసం పట్టణాలలో విద్యార్ధులు, తల్లిదండ్రులకు ప్రత్యేక రూట్లు, బస్‌లను ఏర్పాటు చేశారు. పాఠశాల సమయాల్లో ఇలాంటి బస్‌ రూట్లను కొన్ని చోట్ల గతేడాది అక్టోబరులోనే ప్రారంభించారు. కరోనా కారణంగా మూతపడిన స్కూళ్లు ప్రారంభం కావటంతో ముందస్తు జాగ్రత్త చర్యలతో కొత్తగా అనేక చోట్ల ఈ బస్సులను నడుపుతున్నారు. వీటిలో పిల్లలతో పాటు వారిని తీసుకు వెళ్లేందుకు వచ్చి వెళ్లే వారు కూడా ఎక్కేముందు శరీర ఉష్ణ్రోగ్రత ఎంత వుందో పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. బస్‌ డోర్లకే ఆటోమాటిక్‌ ధర్మోమీటర్‌, ముఖాన్ని గుర్తించే పరికరాలు ఉంటాయి. మొబైల్‌ ఫోన్ల ద్వారా విద్యార్దులు, తలిదండ్రులు ముందుగా నమోదు చేయించుకొన్నవారికే ప్రవేశం ఉంటుంది. వైరస్‌ నివారణ జరిగినా స్కూళ్లలో పిల్లలు మధ్యాహ్నభోజనం చేసేటపుడు గుంపులుగా ఒక దగ్గరకు చేరకుండా ఏ తరగతి వారు ఎక్కడ తినాలో నిర్ణయించి అమలు చేస్తున్నారు. తరగతి గదిలో కూడా ఒక బల్లకు ఒకరు మాత్రమే కూర్చొనే విధంగా కూడా చూస్తున్నారు. ఎక్కువ భాగం స్కూళ్లు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి.

COVID-19: Wuhan partially reopens from months-long isolation ...
చైనా ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి కరోనా మహమ్మారి తిరిగి తలెత్తకుండా చూడటం, అంటే ప్రజారోగ్యం. రెండవది దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం. కరోనా వైరస్‌ నిరోధానికి ఎంత ఖర్చు చేయాల్సి వచ్చిందో అంత కంటే ఎక్కువగా మరోమారు తలెత్తకుండా చూసేందుకు దేశవ్యాపితంగా ప్రజారోగ్య వ్యవస్దను మరింత పటిష్టపరచటం సామాన్య విషయం కాదు. వైరస్‌ను నిరోధించేందుకు మానవాళి చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా జనాన్ని ఇండ్లకే పరిమితం చేసినపుడు తలెత్తే సమస్యలు చైనా యంత్రాంగానికి, సమాజానికి కూడా కొత్తే. వైరస్‌ కారణాల గురించి తొలి రోజుల్లో ప్రపంచం ఎలా ఆలోచించిందో చైనా సమాజంలో కూడా అలాంటి భావాలు లేవని చెప్పలేము. అయితే రోజులు గడిచే కొద్దీ జరిగిన పరిణామాలు ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చినా, అంతర్గతంగా వెల్లడైన లోపాలు, వాటితో తలెత్తిన వత్తిడి నుంచి ముందు విముక్తి కావాల్సి ఉంది.

China is lifting travel restrictions and life is returning to normal

ఎవరు ఎలాంటి అంచనాలు వేస్తున్నా, జోశ్యాలు చెబుతున్నా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోవటం అనివార్యంగా కనిపిస్తోంది. అయితే అది ఏ రూపంలో ఎలా ఉంటుందన్నదే తప్ప మాంద్యం ఖాయం. ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా ఉన్నప్పటికీ మాంద్యం కారణంగా వస్తు వినియోగం పడిపోతే దాని ప్రభావం చైనా మీద తప్పక పడుతుంది. కరోనా కాటు చైనా కంటే అమెరికా, ఐరోపా దేశాలకే పెద్ద చేటు తేనుంది. వైరస్‌ వ్యాప్తికి చైనాయే కారణం అంటూ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రజాగ్రహాన్ని చైనా మీద మళ్లించేందుకు అమెరికా, ఐరోపా దేశాల నేతలు చేస్తున్న ఆరోపణలు తరువాత కాలంలో అంతర్జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం అమెరికా ఆర్ధికంగా అగ్రస్దానంలో ఉంది, అదే సమయంలో అప్పులలో కూడా అదే స్దితిలో ఉంది. ద్రవ్యమార్కెట్‌కు మద్దతు ఇచ్చేందుకు రానున్న రోజుల్లో అమెరికా తీసుకొనే చర్యలు ప్రపంచం మీద ప్రభావం చూపుతాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోకి డాలర్లను కుమ్మరించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం పూనుకుంది. వివిధ దేశాలు, విదేశీ సంస్దలకు అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 6.86లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పు పడింది. దీనిలో జపాన్‌కు 1.21లక్షల కోట్ల డాలర్లు, చైనాకు 1.08లక్షల కోట్ల డాలర్ల అప్పు పడింది.అమెరికా ప్రభుత్వ అప్పులను చైనా ఇప్పుడు స్వల్పకాలానికి కొనుగోలు చేయటం లేదా అమ్మటం గానీ చేయదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఐరోపా దేశాలతో పోల్చుకుంటే చైనా పరిస్ధితి ప్రస్తుతానికి స్ధిరంగా, సురక్షితంగానే ఉన్నప్పటికీ ప్రపంచ మాంద్యం తలెత్తితే పరిస్ధితి ఏమిటన్నది సమస్య. చైనా విదేశీ మారకద్రవ్య నిల్వల్లో మూడో వంతు అమెరికా ప్రభుత్వ అప్పురూపంలోనే ఉంది. ఒక వేళ డాలరు దివాళా తీస్తే, విలువ దిగజారితే అనేది ప్రస్తుతానికి ఊహాజనితమే అయినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనాను ఖాతరు చేయక ముప్పు తెచ్చిన అమెరికా,ఐరోపా పాలకులు !

21 Saturday Mar 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Health, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

combat the coronavirus, COVID 19 China, COVID- 19 pandemic, COVID-19, COVID-19 in US, COVID-19 Robots

The Chinese navy’s Daishandao is the country’s only hospital ship, but that could be about to change. Photo: Reuters
ఎం కోటేశ్వరరావు
జనవరిలోనే వైరస్‌ తీవ్రత గురించి గూఢచార సంస్ధలు హెచ్చరించినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టించుకోలేదని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సంచలన విషయాన్ని తాజాగా వెల్లడించింది. చైనా కటువుగా వ్యవహరించి ఫలితాలు సాధిస్తే, స్వేచ్చా సమాజాల పేరుతో వ్యవహరించిన తీరు కారణంగా ఐరోపా, అమెరికాల్లో దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు వాపోతున్నాయి. ఇల్లినాయిస్‌ రాష్ట్రం కూడా జనాలు బయటకు రావద్దని ప్రకటించటంతో అమెరికాలో ఏడున్నర కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసినట్లయింది. మరోవైపు తొలుత ఎక్కడైతే వైరస్‌ ప్రబలిందో చైనాలోని ఆ ఊహాన్‌ నగరం, పరిసరాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఎవరు మహమ్మారిని నిర్లక్ష్యం చేశారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరించారో ప్రపంచానికి వెల్లడైంది.
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే న్యూయార్క్‌ నగరం కరోనా కేంద్ర స్ధానంగా మారిపోయింది. న్యూయూర్క్‌ రాష్ట్రంలో 8,377 కేసులు నిర్దారణ కాగా ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే ఆరు రోజుల వ్యవధిలో 183 నుంచి 5,151కి పెరిగాయి. ఇవి మొత్తం అమెరికాలో మూడో వంతు అని నగర మేయర్‌ పరిస్ధితి తీవ్రతను వివరించారు.రెండు మూడు వారాలకు సరిపడా మాత్రమే వైద్య సరఫరాలు ఉంటాయని కూడా చెప్పారు.
చైనాలో కొత్తగా కేసులేమీ నమోదు కావటం లేదన్న వార్తలను యావత్‌ ప్రపంచం హర్షిస్తోంది. మహమ్మారిని అదుపు చేయటం సాధ్యమే అని రుజువైంది. తాము ఒక మహమ్మారితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తొలుత ప్రకటించారు, అదే విధంగా తొలిసారిగా ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సిపిఎం నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం తన ప్రత్యేకతను వెల్లడించింది. కేరళలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనపుడు చైనా కమ్యూనిస్టు దేశంలో ప్రారంభమైన వైరస్‌ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కనుక అక్కడకు వచ్చిందని ప్రచారం చేసిన ప్రబుద్దులు లేకపోలేదు. వైరస్‌ గురించి చైనా సర్కార్‌ దాచి పెట్టిందని జీవ ఆయుధాన్ని తయారు చేస్తూ తన గోతిలో తానే పడిందని దుమ్మెత్తి పోయటంతో పాటు జనాన్ని నిర్బంధించిందని ప్రచారం చేసిన వారికీ కొదవ లేదు. ఇప్పుడు అవే నోళ్లు చైనా, కేరళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. అవి నోళ్లా మరొకటా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

H/O: China Robots coronavirus CloudMinds robot in Wuhan with patients at field hospital
చైనా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో కరోనా వైరస్‌ అదుపు కూడా చేరింది. దాని గురించి కొన్ని అంశాలను చూద్దాం. మహమ్మారి దండయాత్ర ప్రారంభమైన ఉహాన్‌ నగరంలోని హాంగ్‌షాన్‌ క్రీడా కేంద్రాన్ని రోబోట్లతో నడిచే ఆసుపత్రిగా మార్చివేశారు. స్మార్ట్‌ ఫీల్డ్‌ హాస్పటల్‌గా పిలిచిన ఆ కేంద్రంలో ఇరవై వేల మందికి వ్యాధిగ్రస్తులకు చికిత్స ఏర్పాట్లు చేశారు. వైరస్‌ విస్తరణ తగ్గుముఖం పడుతున్న సమయంలో తీసుకున్న ఈ చర్య ఆరోగ్యకార్యకర్తల మీద వత్తిడిని తగ్గించేందుకు అన్నది స్పష్టం. జనవరిలో కరోనా వైరస్‌ డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే నౌకలో వ్యాపించి 712 మందికి సోకి ఏడుగురి ప్రాణాలు తీసింది. ఓడలోని ప్రయాణీకులకు ఆహారం సరఫరా చేసే పళ్లాల(ట్రే) ద్వారా వ్యాప్తి చెంది ఉండవచ్చని ఒక జపాన్‌ నిపుణుడు వ్యాఖ్యానించిన తరువాత రోబోల ప్రయోగం గురించి ఆలోచన వచ్చింది. చైనా, స్పెయిన్లలో డ్రోన్లను జనాన్ని కట్టడి చేసే ప్రచారానికి, ఔషధాల సరఫరాకు వినియోగించారు. దక్షిణ కొరియాలో వైరస్‌ ప్రబలిన ప్రాంతాలలో రోగ క్రిమి నిర్మూలన మందులు చల్లేందుకు వినియోగించారు. ఈ నేపధ్యంలోనే చైనాలోని క్రీడా కేంద్రాన్ని ఆసుపత్రిగా మార్చి అక్కడ పెద్ద ఎత్తున రోబోలను వినియోగించారు. రోగులు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తుండగానే రోబోలు, ఇంటర్నెట్‌తో అనుసంధానించిన ఇతర పరికరాలతో రోగులను స్కాన్‌ చేశారు. వారి స్ధితిని తెరల మీద నుంచి వైద్యులు పర్యవేక్షించారు. సిబ్బందికి సైతం కొన్ని పరికరాలను అందచేశారు. అంతేనా రోగులకు అవసరమైన ఆహారం, మంచినీరు, ఔషధాలకే కాదు, ఆసుపత్రిని శుభ్రం చేయటం, రోగులకు ఉల్లాసం కలిగించటం కోసం చివరికి రోబోలతో డ్యాన్సులు కూడా చేయించారు. ఇప్పుడు తీవ్రత తగ్గిపోయినా తిరిగి ప్రబలితే పని చేయించేందుకు వాటిని సిద్దంగా ఉంచినట్లు క్లౌడ్‌ మైండ్స్‌ అనే సంస్ధ తెలిపింది.

GP: Coronavirus China robot disinfectant
రోబోలతో ఆహారాన్ని అందించటం ఇప్పటికే అనేక చోట్ల పరిమితంగా జరుగుతోంది కనుక ఇదేమీ కొత్త కాదు. ఆసుపత్రులలో వినియోగించటమే విశేషం. వందల కిలోమీటర్ల దూరం నుంచి వాటిని విమానాల్లో తెప్పించి ఊహాన్‌ నగరంలోకి ప్రవేశించే అనేక చోట్ల వాటిని వినియోగించారు.వైరస్‌ నిరోధ అవసరాలకు అనుగుణ్యంగా రోబోలలో కొన్ని మార్పులు చేశారు.ఇవి తమకు ఎంతో సహాయకారిగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనేక దేశాల నుంచి వీటిని తెప్పించారు. చైనా అనుభవం చూసిన తరువాత కరోనా బారిన పడిన ఇటలీ, ఇతర అనేక దేశాలలో రోబోల వినియోగం పెరిగింది. తాము తయారు చేసిన రోబో ఒక్కొక్కటి విద్యుత్‌ చార్జి చేసిన తరువాత రెండున్నర గంటల పాటు పని చేస్తుందని తొమ్మిది- పది గదులలలో క్రిమి నిర్మూలన మందులను చల్లి శుభ్రం చేస్తుందని, పది నిమిషాల్లో బాక్టీరియా, కొన్ని రకాల వైరస్‌లను నిర్మూలిస్తుందని డెన్మార్క్‌ కంపెనీ ప్రతినిధి చెప్పారు. రోబోలను తయారు చేసే అమెరికా గ్జెనెక్స్‌ కంపెనీ ఉత్పత్తి గత ఏడాది మొత్తంగా చేసిన వాటి కంటే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 400శాతం పెరిగిందని వెల్లడించారు.

Image result for Covid 19 pandemic, trump cartoons
వైరస్‌ తీవ్రత గురించి చెప్పినప్పటికీ ట్రంప్‌ కొట్టిపారవేశారని, తీవ్రంగా పరిగణించలేదని, అమెరికాలో వ్యాపించే అవకాశం లేదని భావించినట్లు , చైనా అధ్యక్షుడు చెప్పినదానిని నమ్మాల్సిన పనిలేదని అన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. తొలి వారంలోనే నివేదించినప్పటికీ జనవరి 18వ తేదీ వరకు ఆరోగ్య, మానవ వనరుల శాఖల అధికారులు ట్రంప్‌కు నచ్చ చెప్పేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలిపింది. తరువాత ఉన్నతాధికారులను కలసి వారిని ఒప్పించిన తరువాత సమీక్షలు ప్రారంభమైనట్లు కూడా పేర్కొన్నది. చివరకు అమెరికాలో వ్యాపించినట్లు వెల్లడైన తరువాత కూడా దాన్నొక ముప్పుగా ట్రంప్‌ పరిగణించలేదని, వ్యాధి నిరోధక కేంద్రం అధికారిణి నాన్సీ ఫిబ్రవరి చివరిలో హెచ్చరికలను కూడా పట్టించుకోకపోగా ఆమె మదుపుదార్లను భయపెడుతున్నారని ట్రంప్‌ ఫిర్యాదు చేసినట్లు కూడా వాషింగ్టన్‌ పోస్టు వ్యాఖ్యానించింది.
ఉహాన్‌లో యుద్ద ఓడలకు రూపకల్పన చేసే ప్రభుత్వ ఓడల నిర్మాణ సంస్ధ అత్యవసర వైద్య సహాయ ఓడలకు రూపకల్పన పూర్తి చేసినట్లుగా తాజాగా వార్తలు వెలువడ్డాయి. ఇది కరోనా వైరస్‌లకే కాదు, ఇతర వైరస్‌ చికిత్సలకు సైతం అనువుగా ఉంటుందని పత్రికలు రాశాయి. ప్రస్తుతం చైనా మిలిటరీ ఆధ్వర్యంలో 14వేల టన్నుల బరువు గల ఒక ఆసుపత్రి ఓడ ఉంది. దానిని విదేశాలకు మానవతా పూర్వక సాయం చేసేందుకు శాంతి ఓడ పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో 20 ఇంటెన్సివ్‌ కేర్‌, పది క్వారంటైన్‌ పడకలతో సహా మూడు వందల మందికి ఒకేసారి చికిత్సలు చేయవచ్చు.చైనా కొత్తగా రూపకల్పన చేసిన ఓడ నిర్మాణం పూర్తయిన తరువాత మహమ్మారులు తలెత్తినపుడు బాధితులను తరలించేందుకు, చికిత్సలకు, సముద్రాల్లో రోగుల నుంచి వ్యా ధులు విస్తరించకుండా క్వారంటైన్‌ చేసేందుకు, ఇతర సందర్భాలలో ఇతర అవసరాలకు కూడా వినియోగించవచ్చు. ఈ ఓడ నమూనాతో ప్రయాణీకుల ఓడలను కూడా నిర్మిస్తే వాణిజ్య పరంగా కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయని భావిస్తున్నారు.
చైనా కంటే కరోనా వైరస్‌ ఐరోపాను గట్టిగా తాకింది. ఇది స్వేచ్చా సమాజాలు చెల్లిస్తున్న మూల్యమా అని ప్రశ్నిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక వ్యాఖ్యానం, విశ్లేషణను ప్రచురించింది. ఇది వంకర బుద్ది నుంచి వెలువడిన ఉత్పత్తి అన్నది స్పష్టం. స్వేచ్చా సమాజమా, మరొకటా అన్న విచక్షణ వైరస్‌లు, బాక్టీరియాలకు ఉండన్నది వేల సంవత్సరాల చరిత్ర. అంతెందుకు వర్తమానానికి వస్తే ఫ్లూ(జలుబు)కారణంగా ఏటా అమెరికాలో 27 నుంచి 77వేల మంది వరకు మరణిస్తున్నారని ఇది ఫ్లూ(ఇన్‌ఫ్లూయంజా) కంటే పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదన్నట్లుగా మార్చి నాలుగవ తేదీ డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా సిడిసి సమాచారం ప్రకారం 2010 నుంచి ఏటా అమెరికాలో 93లక్షల నుంచి 4.9 కోట్ల మంది వరకు ఫ్లూబారిన పడుతున్నారు, 37వేల నుంచి 2017-18వరకు 61వేల మధ్య మరణించారు. స్వేచ్చా సమాజానికి ప్రతీకగా ఉన్న అమెరికాలో ఉన్న పరిస్ధితి ఇది. దీనికి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఏమి చెబుతుంది ?

Image result for Covid 19 pandemic, trump cartoons
ఫిబ్రవరి 28వ తేదీన కరోనా గురించి ట్రంప్‌ పత్రికా గోష్టిలో మాట్లాడినదేమిటో చూద్దాం. ఒక అద్భుతం లేదా మాయ మాదిరి ఒక్క రోజులో కరోనా మాయం అవుతుంది. వేడి వాతావరణం వైరస్‌ను హరిస్తుంది, వ్యాప్తిని అరికడుతుంది అని చెప్పాడు.(బహుశా ఆ ప్రభావంతోనే బ్లీచింగ్‌ పౌడర్‌, పారాసిటమాల్‌తో కరోనాను అరికట్ట వచ్చని తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు చెప్పారా ?) అలాంటి పెద్ద మనిషి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోని కారణంగా నేడు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నది. స్వేచ్చా సమాజం కారణంగానా పాలకుల బాధ్యతా రాహిత్యం వలన ఇది జరిగిందా ? విశ్లేషకులకు ఈ మాత్రం కూడా తెలియదని అనుకోవాలా ? చైనా సకాలంలో స్పందించలేదని విమర్శిస్తున్న వారు అమెరికా, ఐరోపా పాలకుల, ప్రభుత్వాల నిర్లక్ష్య స్పందనను ఏ విధంగా వర్ణిస్తారు?
ఐరోపా సౌహాద్రత అనేది పుస్తకాలకే పరిమితమైన దేవతా కథల వంటివి. మీరు తప్ప మాకు సాయం చేసే వారు లేరు, డబ్బు మాకు సమస్య కాదు, ఐరోపా యూనియన్‌ నుంచి అవసరమైన పరికరాలు తెచ్చుకోవటం అసాధ్యమని దాని ప్రకటన వెల్లడించింది. ఈ స్ధితిలో మీరు తప్ప మాకు వేరే స్నేహితులు లేరు, మీరే ఆదుకోవాలి, మాకు డబ్బు అవసరం లేదు, మీరు ఏది పంపగలిగితే దాన్ని పంపండి, మేమేమీ దాచుకోవటం లేదు, మమ్మల్ని మేము రక్షించుకోలేని స్ధితిలో ఉన్నాం, చైనా సోదరుల సాయం కోసం ఎదురు చూస్తున్నాం అని ఐరోపా దేశమైన సెర్బియా అధ్య క్షుడు యుసినిక్‌ చైనా రాయబారికి చేసిన వినతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనా సమస్య తలెత్తక ముందు చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని, ఐరోపా నుంచి పెంచుకోవాలని ఐరోపా ధనిక దేశాలు సెర్బియా మీద వత్తిడి తెచ్చాయి. ఇప్పుడు అవే దేశాలు కరోనా కారణంగా తాము వస్తు సరఫరా చేయలేమని చేతులెత్తాశాయి. పరస్పరం సాయం చేసుకోవాల్సిన తరుణంలో తోటి దేశం పట్ల స్వేచ్చా సమాజాల నిజస్వరూపమిది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా కట్టడికి గోమూత్ర విందులు – రెచ్చి పోతున్న ఫేక్‌ న్యూస్‌ !

07 Saturday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak, COVID-19, fake news, Gaumutra party with cow-dung cakes

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

ఎం కోటేశ్వరరావు
వంచన, దగా, అబద్దం దేని నుంచి వచ్చినా సరే లాభం ఆమోదయోగ్యంగానే ఉంటుంది అని గ్రీకు తత్వవేత్త సోఫిక్లస్‌ క్రీస్తుపూర్వమే చెప్పాడు. వ్యాపారమంటే ఒక నాడు వస్తు ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు. తరువాత సేవలు కూడా వ్యాపార వస్తువులయ్యాయి. ఇప్పుడు వస్తూత్పత్తి ఉండదు, సేవలతో పని లేదు. జనం ముఖ్యంగా విద్యావంతుల మూఢనమ్మకాలు, విచక్షణారాహిత్యం వంటి వాటిని ఆధారంగా చేసుకొని కేవలం అబద్దాల అమ్మకాలతో కూడా అపరమిత లాభాలు సంపాదించవచ్చని ఆధునిక పెట్టుబడిదారీ విధానం రుజువు చేసింది. ఫేస్‌బుక్‌, దాని సోదరి వాట్సాప్‌, గూగుల్‌ ఇతర సామాజిక మాధ్యమ యజమానులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన మందరం వారికోసం జీతం, భత్యం లేకుండా నిరంతరం నైపుణ్యాన్ని పెంచుకుంటూ పని చేస్తున్న శ్రమజీవులం. ముఖ్యంగా వాట్సాప్‌ ద్వారా అబద్దాల అమ్మకాలను మనమే పెంచుతున్నాం. ఈ దోపిడీ గురించి బహుశా ఏ ఆర్ధికవేత్తా ఊహించి ఉండరు. తాజాగా కరోనా వైరస్‌ను అలాగే సొమ్ము చేసుకుంటున్నారు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో మూఢవిశ్వాసాలు, మనోభావాల వ్యాప్తికి కరోనా వైరస్‌ను వినియోగించుకొనే మతోన్మాద, తిరోగామి శక్తులు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో బహిరంగంగా వేదికలపై మంత్రులు, ఇతర ప్రముఖులు కోడి మాంసం తిన్న తరువాతే కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చిందని హిందూ మహాసభ నేతలు ప్రచారం చేస్తున్నారు. మాంసాహారాన్ని తినే వారిని శిక్షించేందుకు దేవుడు కరోనా వైరస్‌ అవతారం ఎత్తాడని, తెలంగాణా మంత్రులు కరోనాకు క్షమాపణ చెప్పాలని అన్నారు. శాఖాహారులకు దానితో ఎలాంటి ముప్పు లేదని అయితే ముందు జాగ్రత్త చర్యగా నివారణకు గోమూత్ర, ఆవు పేడ పిడకల పార్టీలు నిర్వహిస్తామని హిందూమహాసభ నేత చక్రపాణి మహరాజ్‌ ప్రకటించారు. ఆయనొక హిందూ మత ఉద్దారక స్వామీజీ. ఆవు మూత్రాన్ని తాగటం, ఒంటి మీద చల్లుకోవటం,పిడకలతో రాసుకోవటం, అగర్‌బత్తీల మాదిరి వెలిగించటం ద్వారా వైరస్‌ను నివారించవచ్చని చెబుతున్నారు. ఇక రామ్‌దేవ్‌ బాబా సర్వరోగ నివారిణి యోగా అని ప్రకటించారనుకోండి.
కరోనా వైరస్‌ గురించి ప్రపంచ వ్యాపితంగా అనేక మూఢనమ్మకాలను వ్యాపింప చేశారు, చేస్తున్నారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. అలాంటి వాటితో ఇతర దేశాల్లో దేనిని ఆశిస్తున్నారో ఇక్కడ కూడా దాన్నే ఆశిస్తున్నారు. జనాన్ని చీకట్లో ఉంచటం. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ డాలర్‌ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తే అమెరికాకు వీసా వస్తుందని ఎందరో నమ్మి ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కోత పెట్టారు, బాలాజీ ఏమి చేస్తున్నట్లు ? అమెరికా సర్కార్‌ అనుమతిస్తున్న కారణంగా వీసాలు వస్తున్నాయి తప్ప బాలాజీ మహిమ వల్ల కాదని అక్కడి పూజారులు ఎప్పుడూ చెప్పలేదు, ప్రోత్సహించారు. తాజాగా చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి వార్తలు రాగానే సదరు వైరస్‌ను భారత్‌కు రాకుండా అడ్డుకొమ్మని బాలాజీని కోరుతూ అదే దేవాలయంలో పూజలు చేశారు. తీరా మన దేశంలో కేసులు బయట పడిన తరువాత వస్తే రానిచ్చారు గానీ ఇప్పుడు వ్యాప్తి చెందకుండా చూడు సామీ అని పూజలు చేస్తున్నారు. రెండు పూజల్లోనూ మూఢనమ్మకాలకు పెద్ద పీట వేశారు. సమాజంలో అలాంటి వాటిని వ్యాప్తి చెందించటమే వారు కోరు కుంటున్న లాభం, కానట్లయితే ఎందుకు చేస్తున్నట్లు ? వైరస్‌ వ్యాప్తి నిరోధంలో బాలాజీ విఫలమయ్యారు కదా అని ఎవరైనా అంటే అదిగో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ దెబ్బలాటలకు వస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు పోయి దాని వలన అక్కడి పూజారులేమీ లబ్ది పొందటం లేదు కదా అని ఎదురు దాడులు, వితండవాదనలు చేస్తున్నారు. ఆ పూజలను నమ్మి తగుజాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగి వైరస్‌ను కొని తెచ్చుకొంటే బాధ్యత ఎవరిది ? పూజారిదా బాలాజీదా ? మూఢనమ్మకాలను వ్యాపింప చేయటం వలన వేలు లక్షలు తగలేసి దోష నివారణలు చేయిస్తున్నారు. ఇప్పుడు కరోనా దోష నివారణ పూజలకు తెరలేపరనే గ్యారంటీ ఏముంది? తమకేమీ లాభం లేదని చెప్పేవారు ఈ పూజల దోపిడీ గురించి ఏమి చెబుతారు? వారికేమీ సామాజిక బాధ్యత లేదా ? మూఢనమ్మకాల వ్యాప్తి విషయంలో హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఏ మతమైనా ఒక్కటే !
కరోనా వైరస్‌ మూఢనమ్మకాలను, తిరోగామి భావాలనే కాదు, జాత్యహంకారశక్తులనూ ముందుకు తెచ్చింది. శుద్దీ బద్దం ఉండని చైనా జాతీయులు, యూదుల కారణంగానే కరోనా వైరస్‌ వ్యాపిస్తోందని, వారినే హతమారుస్తోందని శ్వేత జాతి జాత్యహంకారులు ఆరోపిస్తున్నారు. నయా నాజీలు యూదుల మీద విష ప్రచారం చేస్తున్నారు. టెలిగ్రామ్‌,4చాన్‌ వంటి వేదికలు వీటికి ఆలంబనగా ఉన్నాయి.శ్వేత జాతేతర దేశాల్లోనే కరోనా వ్యాపిస్తోందనే పోస్టులు, పోస్టర్లు వీటిలో విచ్చల విడిగా దర్శనమిస్తున్నాయి. కరోనా రోగులను ఇజ్రాయెల్‌కు పంపండి, మీరు మరణశయ్యమీద ఉంటే మీతో పాటు వీలైనంత మంది యూదులను తీసుకుపోండి, మీకు గనుక వ్యాధి సోకితే మన శత్రువులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా తిరగండి వంటి పోస్టులు దర్శనమిస్తున్నాయి.
వాక్సిన్‌ వ్యాపారంలో ఎంతో ముందున్న బిల్‌గేట్స్‌(చాలా మందికి మైక్రోసాప్ట్‌ అధినేతగానే తెలుసు), ఇతర ఔషధ కంపెనీలు వైరస్‌ను వ్యాపింప చేస్తున్నాయనే పోస్టులు కూడా వస్తున్నాయి. చైనా 5జి నెట్‌వర్క్‌ పరిజ్ఞానంలో ముందుంది. దాన్ని దెబ్బతీసేందుకు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రయత్నం జరుగుతోంది. చైనా 5జి వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ హుబెరు రాష్ట్రంలోని జనాల రోగనిరోధక శక్తిని బలహీన పరిచిందనే ప్రచారం వాటిలో ఒకటి. పైన పేర్కొన్నవన్నీ తప్పుడు ప్రచారాలే. గతంలో కొన్ని కంపెనీలు, కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన కారణంగానే కరోనా విషయంలో కూడా అదే జరిగి ఉంటుందనే అనుమానాల నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. వాటికి జాత్యహంకారం, విద్వేషం తోడైతే ఇక చెప్పాల్సిందేముంది !

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons
గోమూత్రం తాగితే, చల్లుకుంటే వైరస్‌ దూరం అవుతుందని హిందూ మత ఉద్దారకులుగా చెలామణి అవుతున్నవారు చెబుతున్నారు. అలాగే ఎన్నికల నాటికి వైరస్‌కు వాక్సిన్‌ కనుగొనండి అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఆతృత, తెలివి తక్కువ తనాన్ని బయట పెట్టుకున్నాడు. కరోనా వైస్‌ నివారణ అధికార యంత్రాంగం, ఔషధరంగ ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసి అభాసుపాలయ్యాడు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19కు వాక్సిన్‌ కనుగొనేందుకు కనీసం పద్దెనిమిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకటించిన తరువాత కూడా ట్రంప్‌ అలా మాట్లాడటాన్ని గమనించాలి. నవంబరులోగా తయారీ సాధ్యం కాదని ఒక అధికారి వివరించబోయినా తెలుసులేవయ్యా అంటూ ట్రంప్‌ వినిపించుకోలేదు.
ఫేక్‌ న్యూస్‌ లేదా కుహనా వార్తలు, వాటి ఉత్పత్తి వివిధ రూపాల్లో ఉంటాయి.కరోనా వైరస్‌ గురించి వందలాది తప్పుడు, వక్రీకరణ వార్తలను ప్రపంచ వ్యాపితంగా వ్యాపింప చేస్తున్నారు. కుహనా వార్త తయారీలో శ్రామికులు ఉండరా అంటే ఏ ఉత్పత్తి అయినా ఏదో ఒక శ్రమ లేకుండా తయారు కాదు. ఇవి కూడా అంతే. వాటికి సైతం యంత్రాల(కంప్యూటర్లు, తదితరాలు)తో కూడిన ఫ్యాక్టరీలుంటాయి, మేథో శ్రమను అమ్ముకొనే వారు ఉంటారు. ఆ ఉత్పత్తులతో అమెరికాలో ట్రంప్‌, రష్యాలో పుతిన్‌, మన దేశంలో నరేంద్రమోడీ ఎన్నికల్లో, ఇతర విధాలుగా లబ్ది పొందిన వారిలో కొందరైతే, వినియోగదారులుగా మోసపోయిన వారు కోట్లలో ఉన్నారు. ఒక వస్తువు నకిలీదని తేలితే కేసు పెట్టటానికి, పరిహారం పొందటానికి చట్టాలున్నాయి. ఒక నకిలీ వార్తను నమ్మి మోసపోతే అలాంటి రక్షణ లేకపోగా వాటిని గుడ్డిగా నమ్మటానికి నీ బుర్ర ఏమైందని ఎదురు తిట్లు తినాల్సి ఉంటుంది. ఏ కోర్టులూ వాటి తయారీదార్లను ఏమీ చేయలేవు. అసలు ఉత్పత్తి కేంద్రాలు ఆయా దేశాల్లోనే ఉండవు,ఎక్కడుంటాయో కూడా తెలియదు.

Image result for Parties With Cow Piss and Dung Cakes to Fight Coronavirus
మన దేశంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారేందుకు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభీష్టం అని నిస్సిగ్గుగా సమర్ధించుకున్నవారిని చూశాము. ఇప్పుడు అలాంటి వాటి సరసన జాతీయవాదం చేరింది. బిజెపిలో చేరాలనుకొనే వారు ఆ పార్టీ జాతీయవాదం, దేశ భక్తి నచ్చి చేరాలనుకున్నామని చెబుతున్నారు. తాము చెప్పే (కుహనా) జాతీయవాదం, దేశభక్తి వర్గీకరణలోకి రాని వారందరూ తుకడే తుకడే గ్యాంగ్స్‌, దేశ ద్రోహులే అని బిజెపి ముద్రవేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇథమిద్దంగా తెలియదు. కానీ దేశంలోని సాధారణ జనంలో(ఎంతశాతం అనేది వేరే సంగతి) అంతకంటే ప్రమాదకరమైన జాతీయవాద వైరస్‌ పెరగటానికి కారణం కుహనా వార్తల వ్యాప్తి చోదకశక్తిగా ఉందని కొంత కాలం క్రితం బిబిసి పరిశోధనలో వెల్లడైంది. భావోద్వేగ భరితమైన జాతీయవాదం పెరుగుదలలో వాస్తవాలకు ప్రాధాన్యత నామమాత్రమని తేల్చింది. ఎలాంటి సమాచారాన్ని జనం పొందుతున్నారు,ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారు వంటి ప్రశ్నలతో ఈ పరిశోధన సాగింది. దాని సారాంశం ఇలా ఉంది. కుహనా జాతీయవాద కథల వ్యాప్తిలో మితవాద(సంఘపరివార్‌) సంస్ధలు ఎంతో సంఘటితంగా పని చేస్తున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా చెబుతున్న అంశాలను విశ్వసించని కారణంగా ప్రత్యామ్నాయ వనరులవైపు జనం చూస్తున్నారు. నకిలీ వార్తా , కాదా అని నిర్ధారించుకొనే ప్రయత్నం చేయకుండానే తాము నిజమైన దానినే వ్యాపింప చేస్తున్నామని, ఏది నకిలీనో ఏది అసలైనదో తెలియనంత అమాయకులం కాదని తమ మీద తాము అతి నమ్మకంతో ఉంటారు. బిబిసి పరిశోధకులతో మాట్లాడిన వారు తామ వార్తల విశ్వసనీయతను నిర్ధారించుకొనేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయలేదని, ప్రత్యామ్నాయ సమాచారం నిజమని నమ్మామని నిజాయితిగానే అంగీకరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు పంపినవి గనుక వాస్తవమే అని గుడ్డిగా నమ్ముతున్నారు.వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మిన కారణంగా అది భారత్‌లో హింసాకాండ ప్రజ్వలనకు దోహదం చేసింది. పిల్లలను అపహరించేవారి గురించి, ఇతర సమాచారంతో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమ సామాజిక తరగతిని చైతన్యపరచాలనే భావనతోనే అలాంటి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు సమాచారం కారణంగా31 మంది హత్యకు గురైనట్లు బిబిసి గుర్తించింది. ఇలాంటి పరిణామం అనేక దేశాల్లో ఉంది.
2018లో రాండ్‌ కార్పొరేషన్‌ అన్ని రకాల కుహనా వార్తల మీద ఒక సర్వే చేసింది. వాటిలో ఆరోగ్యపరమైన వార్తలు మరీ దారుణంగా ఉన్నాయని తేల్చింది. అభిప్రాయాలకు-వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను కోవిడ్‌-19 చెరిపివేసినట్లు వెల్లడైంది.కుహనా వార్తల మీద ఫేస్‌బుక్‌ యుద్దం ప్రకటించింది. నిజానికి అదంతా ఒక ప్రచార ప్రహసనం మాత్రమే. తప్పుడు వార్తల తయారీ, వ్యాప్తిదార్లకు అవి సొమ్ములను కురిపిస్తాయి, వాటిని ఉపయోగించుకొనే వారికి తగినంత ప్రచారాన్ని కల్పిస్తాయి. అనేక మందిని భ్రమింపచేసి మద్దతుదారులుగా మార్చివేస్తాయి. నియంత్రణలు, పర్యవేక్షణలేని ప్రాంతాలను ఎంచుకొని అక్కడి నుంచి ప్రపంచ వ్యాపితంగా వీటిని వ్యాపింప చేస్తాయి. తప్పుడు వార్తలను సొమ్ము చేసుకొనేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటివి వారధులుగా ఉన్నాయి. అవి కూడా వాటిని సొమ్ము చేసుకుంటాయి గనుక ఎన్ని సుభాషితాలు పలికినా ఏదో ఒకదారిలో అనుమతిస్తూనే ఉంటాయి. అందుకు గాను అనేక వ్యాపార పద్దతులను అనుసరిస్తున్నాయి. మాసిడోనియా ప్రాంతం నుంచి అమెరికా ఎన్నికల మీద ఒక తప్పుడు వార్తను దిమిత్రి అనే యువకుడు ఇంటర్నెట్‌లో పెట్టాడు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్ధలు వాటిని జనం చూసే నడతను బట్టి వాణిజ్య ప్రకటనలను జోడిస్తాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ అభిమానులు ఆ వార్త మీద క్లిక్‌ చేసి చూసినందుకు గాను ఆరునెలల్లో 60వేల డాలర్లు తన వాటాగా పొందాడు. తప్పుడు వార్తలున్న పేజీలను గుర్తించి వాటి మీద వాణిజ్య ప్రకటనలు పెట్టటాన్ని అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటించాయి.కానీ తరువాత చూస్తే తప్పుడు వార్తల మీద వాణిజ్య ప్రకటనలను అనుమతించి ఆదాయాన్ని పొందుతున్నట్లు తేలింది. దీంతో కొన్ని కంపెనీలు తమ ప్రకటనలను తప్పుడు వెబ్‌సైట్లలో పెడితే తమ బ్రాండ్‌(పేరు)కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున డబ్బు చెల్లించేది లేదని చెప్పాల్సి వచ్చింది.

Image result for Cow Piss and Dung Cakes to Fight Coronavirus cartoons

విధానపరంగా నిషేధం విధించినప్పటికీ దొడ్డి దారిన గూగుల్‌ సంస్ద కరోనా వైరస్‌ నిరోధ ఉత్పత్తులు, పరిమితంగా అందుబాటులో ఉన్నాయనే సందేశాలతో ఎగబడి కొనే విధంగా కొన్ని ప్రకటనలను అనుమతించి సొమ్ము చేసుకుంటున్నది. విమర్శలు తలెత్తగానే తమ వేదికలను మూడవ పక్షాలు వుపయోగించుకుంటున్నాయని గూగుల్‌, అమెజాన్‌ వంటివి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ప్రకటించాయి. కరోనా వైరస్‌ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం తప్ప నివారణకు ఎలాంటి చిట్కాలు పని చేయవు, నోరు, ముక్కులకు వేసుకొనే ముసుగులు , శానిటైజర్స్‌ కూడా అలాంటివే అని నిపుణులు చెబుతున్నా జనం బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వైరస్‌ వ్యాపిస్తున్నా ఎన్నికల సభలు ఆపొద్దు : డోనాల్డ్‌ ట్రంప్‌ !

04 Wednesday Mar 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

coronavirus spreads, COVID-19, COVID-19 in US, Donald trump

Image result for Go ahead campaign rallies even as coronavirus spreads:Trump

ఎం కోటేశ్వరరావు
ఒక వైపు చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్నట్లు వార్తలు రాగా అమెరికాతో సహా అనేక దేశాల్లో అది విస్తరిస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. చైనా పౌరుల పట్ల తన బాధ్యతగా ఖర్చుకు వెనుకాడకుండా నివారణ, చికిత్స చర్యలు తీసుకుంటుండగా అమెరికాలో దానికి భిన్నంగా భారాన్ని జనం మీద మోపేందుకు పూనుకున్నట్లు ఇంతవరకు వచ్చిన వార్తలు సూచిస్తున్నాయి. ఇది వ్యాధికంటే జనాన్ని ఆర్ధికంగా దెబ్బతీసేదిగాను, ఆప్పుల పాలు చేసేదిగానూ ఉంది. సోమవారం నాటి వరకు ఆరుగురు మరణించగా 15 రాష్ట్రాలలో వందలాది మందికి సోకినట్లు వార్తలు వచ్చాయి. వ్యాధి నిర్దారణ పరీక్షలకు డబ్బు వసూలు చేయవద్దని న్యూయార్క్‌ గవర్నర్‌ బీమా కంపెనీలను కోరారు. వైరస్‌ విస్తరిస్తున్నా ప్రమాదం లేదని ఎన్నికల సభలను ఆపాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన అనుయాయులను కోరాడు. కావాలంటే డెమోక్రాట్లను చూడండి, వారు కొనసాగిస్తున్నారని కూడా సెలవిచ్చాడు.
ఊరంతటిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది ఒక దారి అన్నది ఒక సామెత. ప్రపంచ వ్యాపితంగా కోవిద్‌-19(కరోనా వైరస్‌)ను ఎలా అదుపులోకి తేవాలా అని చూస్తుంటే అమెరికాలో దాన్నుంచి లబ్ది పొందటం గురించి ఆలోచించే వారున్నట్లు కొన్ని ఔషధ కంపెనీల వాటాల ధరలు పెరగటం సూచిస్తున్నది. డిసెంబరు 31న చైనాలో తొలి వైరస్‌ కేసు బయటపడిన తరువాత అది ఎక్కడైనా కనిపించవచ్చు అన్న హెచ్చరికలు వెలువడ్డాయి. పాకిస్ధాన్‌ వంటి పేద దేశమంటే అర్ధం చేసుకోవచ్చు, అమెరికా వంటి ధనిక సమాజాలు ఎందుకు సిద్దం కాలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. అంచనా వేసిన దాని కంటే ఎక్కువగానే అక్కడ వ్యాపించవచ్చని ఆరోగ్య అధికారులు తాజాగా ప్రకటించారు. కోవిద్‌-19 కొత్తది కనుక చికిత్సకు వెంటనే సిద్ధపడలేదు అని చెప్పినా కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఏటా సంభవించే ఫ్లూ(ఇది వైరస్‌తో వచ్చే జలుబు) గురించి తెలిసినా ఈ ఏడాది డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు అమెరికాలో మూడులక్షల పదివేల మందికి సోకి ఆసుపత్రుల పాలుకాగా 18వేల మంది మరణించారని వ్యాధుల నియంత్రణ మరియు నిరోధ కేంద్రం(సిడిసి) పేర్కొన్నది. కరోనా వైరస్‌ కూడా దీనికి తోడైతే అతలాకుతలంగాక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానించిన వారి ఆసుపత్రుల బిల్లులు చూస్తే అమెరికా పేదల పరిస్ధితి ఏమిటన్న చర్చ మొదలైంది. సాధారణ సమయాల్లో అమెరికాలో ప్రజారోగ్య భద్రతకు కేటాయింపులు తక్కువ అనే విమర్శ ఇప్పటికే ఉంది. ఇలాంటి మహమ్మారి తలెత్తినపుడు అయ్యే ఖర్చు గురించి చెప్పనవసరం లేదు. చైనా నుంచి అమెరికా పౌరుడు ఫ్రాంక్‌ యుసినిస్కీ, అతని మూడు సంవత్సరాల కుమార్తెను శాండియాగోలోని ఒక ఆసుపత్రిలో ఉంచి పరీక్షలు చేసి పరిశీలించి వ్యాధి సోకలేదని ఇంటికి పంపారు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించిన సమాచారం మేరకు అతనికి 3,918 డాలర్ల బిల్లు వచ్చింది, దానిలో వారిని ఆసుపత్రికి తరలించి, తీసుకు వచ్చిన అంబులెన్స్‌ ఛార్జీ 2,600 డాలర్లు. అంత మొత్తం తాను చెల్లించే స్ధితిలో లేనని దాతలు తనకు సాయం చేయాలని గో ఫండ్‌ మీ అనే వెబ్‌సైట్‌లో అభ్యర్ధన పెట్టాడు. చైనా నుంచి రావటానికి అయ్యే ఛార్జీలను భరించాల్సి ఉంటుందని తనకు తనకు తెలుసునని, ఆసుపత్రికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భావించానని యుసినిస్కీ వాపోయాడు. చైనాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో యజమాని తనకు వైద్యబీమా చేయించారని, అమెరికాలో బీమా లేదని అతను పేర్కొన్నాడు. అనేక మంది పేదలు అమెరికాలో బీమా చేయించుకోలేకపోవటం లేదా ఉన్నా పాక్షికంగా మాత్రమే సౌకర్యాలను కలిగి ఉంటున్నారు. ఈ ఉదంతం మీడియాలో వచ్చిన తరువాత పొరపాటున బిల్లు పంపామని ఆసుపత్రి యాజమాన్యం విలేకర్లకు చెప్పింది. అంబులెన్స్‌ కంపెనీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. విధిగా ఆసుపత్రుల్లో చేరి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించినపుడు దానికయ్యే ఖర్చును ఎవరు భరించాలన్నది తెలియటం లేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రజారోగ్య భద్రతా చర్యల్లో భాగంగా పౌరులు తమంతట తాము సంసర్గ నిషేధం(క్వారంటైన్‌) విధించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించవచ్చు. అయితే ఇది అసాధారణంగా జరుగుతుంది కనుక అందుకయ్యే ఖర్చు గురించి ఎలాంటి విధి విధానాలను రూపొందించలేదు కనుక బీమా కంపెనీలు బిల్లులు పంపుతున్నాయి.
మియామీ పౌరుడు ఓస్మెల్‌ మార్టినెజ్‌ చైనా వెళ్లి వచ్చిన తరువాత ఫ్లూ(జలుబు) చేయటంతో ఒక స్ధానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయమని కోరాడు. సిటి స్కాన్‌ చేయాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పగా ఫ్లూ పరీక్ష మాత్రమే చేయించుకున్నాడు. దానికి గాను 3,270 డాలర్లకు గాను బీమా సొమ్ము పోను 1400 డాలర్లు చెల్లించాలని బిల్లు చేతిలో పెట్టటంతో దిమ్మ తిరిగి జలుబు ఎగిరిపోయింది. అనేక మంది ఇలాంటి బిల్లులను చూసి పరీక్షలు చేయించుకొనేందుకు భయపడుతున్నట్లు ప్రజారోగ్య నిపుణుడైన ఒక ప్రొఫెసర్‌ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఫ్లూ లేదా ఆ లక్షణాలు ఉండే కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకొంటే తాము అప్పుల పాలు కావలసిందే అని సామాన్య అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ పరీక్షలు ఉచితం అయినా బీమా వర్తించని ఆసుపత్రిల రూము అద్దెలు, అంబులెన్సులు ఇతర ఖర్చులు తడిచి మోపెడు కానున్నాయి. అసలు బీమా రక్షణ లేని అమెరికన్లు 2.7కోట్ల మంది ఉన్నారు. సాధారణ ఫ్లూ, ఎ, బి వైరస్‌ పరీక్షలు, సిఎంపి రక్త పరీక్షలకు 1295 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే బీమా ఉంటే 587 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది.
గడచిన 24 గంటలలో 125 కొత్త కేసుల నమోదు, హుబెరులో 31 మంది మరణించినట్లు మంగళవారం నాడు చైనా ప్రకటించింది. జనవరి 21వ తేదీ తరువాత ఇంత తక్కువగా నమోదు కావటం ఇదే ప్రధమం. అక్కడ మొత్తం 80,151 మందికి సోకగా 2,943 మంది మరణించారు. డెబ్బరు దేశాలలో 90వేల మందికి సోకగా 3,116 మంది మరణించారు. ప్రస్తుతం దక్షిణకొరియా, ఇరాన్‌, ఇటలీలో ఎక్కువగా వ్యాపిస్తోంది. దక్షిణ కొరియాలో 5,186 మందికి సోకింది. అక్కడి ప్రభుత్వం వైరస్‌పై యుద్దం ప్రకటించింది. ఆర్ధికంగా ఉద్దీపన చర్యలకు 25బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. దక్షిణ కొరియాలో స్ధానిక పౌరులు కానప్పటికీ ఆరోగ్య రక్షణ అక్కడ ఉచితంగా అందిస్తారు. ప్రపంచ వ్యాపితంగా ఉన్న తన సిబ్బంది ఇండ్ల నుంచే పని చేయాలని ట్విటర్‌ కోరింది. ఇటలీలో 2036 కేసులు నమోదయ్యాయి.

Image result for Go ahead campaign rallies even as coronavirus spreads:Trump
అమెరికాలో కరోనా వైరస్‌ వార్తలు రాగానే కొన్ని కంపెనీలు తాము పరీక్ష కిట్‌లను విక్రయించనున్నట్లు ప్రకటించాయి. అలాంటి వాటిలో ఒకటి కో డయాగస్టిక్స్‌, కిట్లను విక్రయించనున్నట్లు ప్రకటించగానే దాని వాటాల ధర 59శాతం పెరిగాయి. ఫైజర్‌ కంపెనీల వాటాల ధరలు ఒక్కరోజే పదమూడుశాతం ఎగబాకాయి. వాటాలను కొనేందుకు మదుపుదారులు ఎగబడటం తప్పా ఒప్పా అనే అంశాన్ని పక్కనపెడితే కార్పొరేట్‌ కంపెనీలు వ్యాధులతో జరిపే వ్యాపారాల్లో లాభాలు ఎలా ఉంటాయో కూడా ఇది వెల్లడిస్తున్నది.
2009లో స్వైన్‌ ఫ్లూ(హెచ్‌1ఎన్‌1) విస్తరించిన సమయంలో ఒక్క అమెరికాలోనే 5.9కోట్ల మందికి సోకగా పన్నెండువేల మంది మరణించారు, ప్రపంచ వ్యాపితంగా మూడులక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. కరోనా గురించి నిర్ధారణ కాగానే చైనా తీసుకున్న అసాధారణ నివారణ చర్యలను, స్వైన్‌ ఫ్లూ వచ్చినపుడు అమెరికా తీరును ఒక్కసారి పోల్చి చూడటం అవసరం. వెయ్యి , పదహారు వందల పడకల రెండు ఆసుపత్రులను పది రోజుల వ్యవధిలో చైనా నిర్మించిన తీరు, ఏడుకోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసిన నిర్ణయం కనీవినీ ఎరుగనివి. అమెరికన్‌ వైరస్‌గా అమెరికన్లే పిలుచుకున్న స్వైన్‌ ఫ్లూ విస్తరణ సందర్భంగా నివారణ చర్యలు తీసుకొనేందుకు ఆరునెలల సమయం తీసుకుంది. ఎలాంటి ప్రయాణ ఆంక్షలు, సంసర్గ నిషేధాలు, సరిహద్దుల్లో తనిఖీలు లేవు. అది మహమ్మారిగా మారి 214 ప్రాంతాలు, దేశాలకు విస్తరించింది. ఇప్పుడు చైనాను నిందిస్తున్న మాదిరి అప్పుడు స్వైన్‌ ఫ్లూ అమెరికాయే కారణమని ఎవరూ నిందించలేదు. సోషలిస్టు చైనా నాయకత్వానికి, లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఉన్న తేడా ఇది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా వైరస్‌ – ముందే ”గ్రహించిన” రచన బండారం బట్టబయలు ?

22 Saturday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID-19, Dean Koontz, dean koontz the eyes of darkness wuhan 400, dean koontz the eyes of darkness wuhan 400 truth, DeanKoontz the eyes of darkness

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ గురించి కంత్రీగాళ్లు జనాన్ని ఎంతగా బురిడీ కొట్టిస్తున్నారంటే కాస్త హేతుబద్దంగా ఆలోచిస్తారు అనుకొనే వారిని కూడా సందేహంలో పడవేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి అమెరికన్‌ నవలా రచయిత డీన్‌ కూన్జ్‌ నాలుగు దశాబ్దాల క్రితమే కోవిద్‌-19 (కరోనా వైరస్‌) గురించి ఊహాన్‌-400పేరుతో ఊహించినట్లు వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది.దీనిలో వాస్తవాలేమిటి అన్నది చూడబోయే ముందు మరికొన్ని అంశాల గురించి చూద్దాం.
కలరా, మసూచి, ప్లేగు మహామారి మాదిరి కరోనా వైరస్‌ పేరుతో సమాచార మహామారి (మహమ్మారి అని కూడా కొందరు పిలుస్తారు) వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ వ్యాఖ్యానించాల్సి వచ్చింది. దీనికి బలికాని వారు చాలా అరుదుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ మహామారిని ఎదుర్కొనేందుకు ఒక వాక్సిన్‌ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆరోగ్య అత్యవసర కార్యక్రమ అధిపతి డాక్టర్‌ మైక్‌ రియాన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పూర్వరంగంలో దాన్ని ఎదుర్కొనేచర్యల్లో భాగంగా వాస్తవాలను వెల్లడించేందుకు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక కార్యక్రమాన్నే చేపట్టాల్సి వచ్చింది. దానికి ‘ఎపివిన్‌’ అని పేరు పెట్టారు. దాన్ని తెలుగులో చెప్పుకోవాలంటే ‘మహామారుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమాచార వ్యవస్ధ’ అని అర్ధం.
కరోనా వైరస్‌ ప్రధానంగా చైనాలోని హుబెరు ప్రాంతంలో కొన్ని చోట్లనే ఎక్కువగా వ్యాప్తి చెందింది. కానీ తప్పుడు సమచార మహామారి చైనాతో పాటు ప్రపంచమంతటా వేగంగా వ్యాపిస్తోంది. వాస్తవం ఒక కిలోమీటరు ప్రయాణించే సమయానికి అవాస్తవం వందకిలోమీటర్ల ముందు ఉంటోంది.ప్రపంచంలో 380 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నట్లు అంచనా కాగా వారిలో 21శాతం చైనాలో ఉన్నారు. అందువలన వారికోసం కూడా వాస్తవాలను అందించాల్సి ఉంది. నువ్వుల నూనె రాసుకుంటే, మంట నుంచి వెలువడే పొగను పీల్చినా కరోనా వైరస్‌ అంటదు అనేది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ఇలా మరికొన్నింటి గురించి తెలిసిందే. ఆయా సంస్దలలో పని చేసే సిబ్బంది ఇతర వనరుల నుంచి వెలువడే దాని కంటే తమ యజమానులు చెప్పేదానిని ఎక్కువగా విశ్వసిస్తారన్నది ఒక తాజా అధ్యయనంలో తేలిన అంశం. అందువలన ప్రపంచ ఆరోగ్య సంస్ధ బడా కంపెనీల యజమానులతో సమావేశాలు జరిపి తమ సిబ్బందికి వాస్తవాలను వివరించాలని కోరుతోంది. కోవిద్‌-19కు సహజ లక్షణాలు లేవని, కృత్రిమంగా ఉహాన్‌ పరిశోధనాశాలలో తయారు చేశారనే కుట్ర సిద్ధాంతాలు, ప్రచారాన్ని తాము విశ్వసించటం లేదని 27 మంది ప్రముఖ ప్రజారోగ్య శాస్త్రవేత్తలు ఖండించినట్లు ఇటీవల లాన్‌సెట్‌ ప్రచురించింది.
ఇక అమెరికన్‌ రచయిత డీన్‌ కూన్జ్‌ జోశ్యం కథ చూద్దాం. అనేక మారు పేర్లతో రకరకాల ఇతివృత్తాలతో నవలలు రాసే డీన్‌ 1981లో రాసిన ది ఐస్‌ ఆఫ్‌ది డార్క్‌నెస్‌ అనే నవలలో పాత్రధారులతో ఊహాన్‌ -400 అనే జీవ ఆయుధం, అది పనిచేసే తీరు, జనాలను ఎలా హతమారుస్తుందో, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పించాడు చూడండి అంటూ ఆయన అభిమానులు లేదా ఆ నవలను విక్రయించే అమెజాన్‌ కంపెనీకి చెందిన వారు గానీ 2008నాటి నవలా సమీక్ష చిత్రాన్ని వారం రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక పేజీలో జీవ ఆయుధం గురించి మరొక పేజీలో నవల ముఖచిత్రం ఉంది. ఇంకేముంది పుస్తకం మన ముందు ఉంది కనుక వాస్తవమే అని చాలా మంది నమ్మారు. ఆ పేజీలో పేర్కొన్నదాని ప్రకారం సదరు జీవ ఆయుధం కరోనా వైరస్‌ అనో మరొకటనో చెప్పలేదు. దానికీ కరోనా వైరస్‌కు అసలు పోలికే లేదు. అనేక డిటెక్టివ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ కధలు, సినిమాల్లో ఇలాంటివి మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి.

Image result for dean koontz

ది ఐస్‌ ఆఫ్‌ ది డార్క్‌నెస్‌ నవలా రచయిత డీన్‌ కూన్జ్‌
ఈ నవల పేజీ ప్రచారంలోకి వచ్చిన తరువాత ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. గూగుల్‌లో వెతికిన కొందరికి కొత్త అంశం కనిపించింది. అదే నవలలో అదే పాత్ర ధారులు రష్యన్‌లు గోర్కీ పట్టణంలో తయారు చేసిన గోర్కీ-400 జీవ ఆయుధం గురించి చర్చిస్తారు. ఆ పేజీ నవల 1981నాటి ముద్రణలో ఉంది. కానీ తరువాత గోర్కీ కాస్తా 2008 నాటికి ఊహాన్‌గా మారిపోయింది. రెండు ముద్రణల్లోని రెండు రకాల పేజీలను దీనితో పాటు ఇచ్చిన చిత్రాలలో చూడవచ్చు. ఇదెలా జరిగింది? ఊహించటం కష్టమేమీ కాదు. అమెరికా, ఐరోపాలోని అనేక మంది రచయితలు, సినిమా దర్శకులు, కథకులు 1991 ముందు వరకు సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్దలను దుష్టమైనవిగా చిత్రించి సొమ్ము చేసుకోవటం పరిపాటి.అమెరికన్లు, సిఐఏ ఏజంట్లు అసాధారణ తెలివి తేటలు గలవారిగా, సోవియట్‌ ఏజంట్లను పిచ్చిపుల్లయ్యలుగా చిత్రించిన సినిమాలు అనేకం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సోవియట్‌, ఇతర సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అలాంటి వారు సొమ్ము చేసుకొనేందుకు కొత్త కథలను అల్లటం ప్రారంభించారు. అమెరికా ప్రధాన ప్రత్యర్ధిగా అనూహ్యంగా చైనా ముందుకు వచ్చింది.1991 తరువాత వచ్చిన సినిమాల్లో, రష్యన్ల బదులు చైనీయులు విలన్లుగా, అపహాస్యపు పాత్రధారులుగా మారిపోవటాన్ని చూడవచ్చు. దానిలో భాగంగానే కొత్త నవల రాయటం దండగ పేర్లు, స్ధలాలను మారిస్తే చాలని రచయిత, ప్రచురణకర్తలు భావించి ఆ మేరకు మార్చి ప్రచురించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వివాదం గురించి నవలా రచయిత డీన్‌ కూన్జ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన వెలువడలేదు. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ కనుక తాము ఏమి రాసినా, ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకొనే వారు ఆ జనాల్లో కూడా తెలివిగల వారు ఉంటారని తమ బండారాన్ని బయటపెడతారని గ్రహించటం మంచిది.

Image

1981నాటి ప్రచురణలో గోర్కీ -400 గురించి రాసిన పేజీ

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: