• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: cow sciences

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందో లేదో చూడాలి !

14 Monday Aug 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, cow sciences, economic reforms, INDIA, india china comparison, India Independence Day

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన వాతావరణం రోజురోజుకూ విస్తరిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక మన గత చరిత్ర. గత ఘనతను చెత్తబుట్టలోకి నెట్టి మా శంఖంలోంచి వచ్చిందే పవిత్ర తీర్ధం, మేం చెప్పేదే అసలైన చరిత్ర,అదే వేదం, మేమే నిజమైన దేశభక్తులం, మాతో విబేధించేవారందరూ దేశ ద్రోహులే అనే అసహన, నిరంకుశ ధోరణులు వైరస్‌ మాదిరి వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక సమాజం పరిణితి చెందటానికి ఏమి చెయ్యాలి, ఎంత వ్యవధి పడుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతకాలంగా పాలకులు అనుసరించిన విధానాలు తీవ్ర అసంతృప్తి కలిగించాయి. దానిని అవకాశంగా తీసుకొని స్వాతంత్య్రం, హక్కులకోసం జరిగిన పోరులో భాగస్వాములు కాని భావజాల వారసులు వాటికే ఎసరు తెస్తున్నా జనం మౌనముద్రదాల్చటం నిజంగా ఆందోళనకరమే.

71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సందర్భంగా అసంతృప్తికి ఆజ్యం పోస్తున్న ప్రధానమైన వాటిలో ఒకటైన అభివృద్ధి సమస్య గురించి అవలోకించటం సముచితంగా వుంటుంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, జనంలో ప్రచారంలో వున్న సాహిత్య సారం ఏమిటి? వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు కదా? వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, ప్రతి నాగరిక సమాజం అలాంటి ఆకాంక్షలనేే వ్యక్తం చేసింది. అయినా ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం, బలవంతులు బలహీనులను దోపిడీ చేసేందుకు జరిపిన మారణహోమమే సమస్త మానవజాతి గత చరిత్ర. మంచిని కోరుకుంటే అమలు జరిగేది కాదు, దోపిడీని అరికట్టి కొత్త వ్యవస్దను నిర్మించటమే మార్గమని సోషలిజం, కమ్యూనిజం అనే ఒక నూతన భావనను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ ముందుకు తెచ్చారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు అనే మార్గంలో మన ప్రయాణం ఎంత వరకు సాగింది? గడ్డం, టోపీ పెట్టుకున్నావు, నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావ్‌,దేశద్రోహివి నిన్ను చంపేస్తా అన్న వున్మాదం వరకు అని న్యూఢిల్లీ రైలు వుదంతంలో చూశాం కదా ! గుప్తుల స్వర్ణయుగం అనో మరొకటో చెప్పి మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటే ప్రయోజనం వుంటుందా? మన పూర్వీకులు ప్రపంచానికి ఎంత ఇచ్చారో ప్రపంచం నుంచి కూడా అవసరమైంది పుచ్చుకున్నారని గ్రహించాలి.

అలెగ్జాండర్‌ మన దేశాన్ని ఆక్రమించుకొనేందుకు చేసిన ప్రయత్నం సఫలమై వుంటే, మన దేశంలో పుట్టిన బౌద్ధాన్ని మన పాలకులే నాశనం చేయకుండా వుంటే, మనువాదంతో మన చుట్టూమనం, ఇతరుల చుట్టూ గిరులు గీసి వుండకపోతే మన చరిత్ర మరోవిధంగా వుండేది. తురుష్కులు, ఆఫ్ఘన్‌్‌ దేశాల పాలకుల దండయాత్రలను ఎదుర్కోవటంలో జరిగిన వైఫల్యమే, తరువాత కాలంలో ఐరోపా దేశాల విషయంలో కూడా పునరావృతమై వాటిలో అగ్రశక్తిగా వున్న బ్రిటన్‌ ఆధీనంలోకి మన దేశం వెళ్లిపోయింది.

పొరుగునే వున్న చైనా పరిణామాలు మనకు భిన్నంగా జరిగాయి. హాంకాంగ్‌ను బ్రిటీష్‌వారికి అప్పగించినా అక్కడి క్వింగ్‌ రాజరికం ప్రధాన భూ భాగ ఆక్రమణకు బ్రిటీష్‌ వారికి అవకాశమివ్వలేదు. ఆ రాచరికానికి, బ్రిటీష్‌, ఇతర సామ్రాజ్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా జాతీయవాదులు పోరాడి రాజరికాన్ని అంతమొందించి 1912లో రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రాచరిక శక్తులు వాటితో కుమ్మక్కయిన యుద్ధ ప్రభువులు బీజింగ్‌లోని కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించి తిరుగుబాటు చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు సన్‌యెట్‌సేన్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ కమ్యూనిస్టులతో కలసి ఒక జాతీయ సైన్యాన్ని తయారు చేసి యుద్ద ప్రభువులను అణచివేసేందుకు దశాబ్దాల పాటు సాయుధ చర్యలను జరపాల్సి వచ్చింది.ఆ క్రమంలో అదే కొమింటాంగ్‌ పార్టీలోని మితవాదులు కమ్యూనిస్టులను అణచేందుకు పూనుకోవటంతో రెండు శక్తుల మధ్య జరిగిన అంతర్యుద్ధమే కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ప్రఖ్యాత లాంగ్‌ మార్చ్‌.ఆ క్రమంలోనే 90 ఏండ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ ప్రజావిముక్తి సైన్యాన్ని ఏర్పరచింది.

అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకున్నారు. దానికి వ్యతిరేకంగా మరోసారి కొమింటాంగ్‌-కమ్యూనిస్టులు చేతులు కలిపారు. ఒకవైపు జపాన్‌తో పోరాడుతూనే బలపడుతున్న కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసేందుకు కొమింటాంగ్‌ మితవాదులు మరోసారి కమ్యూనిస్టులను అణచేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జపాన్‌ ఓటమితో పాటు కొమింటాగ్‌ సేనలను కూడా కమ్యూనిస్టులు అదుపులోకి తెచ్చారు. 1949 నాటికి అది సంపూర్ణమైంది. అంటే నిజమైన స్వాతంత్య్రం, సమగ్ర చైనా అప్పటికికాని రూపొందలేదు.

మనకంటే రెండు సంవత్సరాలు వెనుక విముక్తమైన చైనాతో పోల్చుకుంటే స్వాతంత్య్రం నాటికి మన పరిస్థితి ఎంతో మెరుగు. తమ అవసరాలకోసమే అయినప్పటికీ బ్రిటీష్‌ వారు మన దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించారు, ఆనకట్టలను నిర్మించారు. చైనాకు నల్లమందును దిగుమతి చేసి అక్కడి జనాన్ని నల్లమందు భాయిలుగా మార్చారు. క్వింగ్‌ రాజరికశక్తులు, యుద్ద ప్రభువులు తమ అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు తప్ప దేశాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కమ్యూనిస్టుల విప్లవానికి ముందు మూడున్నర దశాబ్దాలు జరిగిన, తరువాత పదిహేను సంవత్సరాల పాటు అంటే మొత్తం ఐదు దశాబ్దాలకు పైగా చైనాలో పరిస్ధితులు తిరుగుబాట్లు, కుట్రలతోనే కూడి వున్నాయి, అసలు ఐక్యరాజ్యసమితిలో దానికి 1971వరకు సభ్యత్వం, గుర్తింపే లేదు. పెట్టుబడులు, ఆధునిక పరిజ్ఞానం అందకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకున్నారు. మనపరిస్ధితి అది కాదు. సోవియట్‌ సాయం పొంది అనేక పరిశ్రమలు, రక్షణ వుత్పత్తులను పొందాం. చివరకు ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలలో సాధిస్తున్న విజయాల వెనుక సోవియట్‌ సాయం ఎంతో వుంది.నాటి నుంచి నేటి వరకు ఒక్క జనాభాలో మాత్రమే మనం చైనాతో పోటీలో వున్నాం.మరో పది సంవత్సరాలలో చైనీయులు అమెరికానే అధిగమించనున్నారని కొందరు అంచనా వేస్తున్న సమయంలో సమవుజ్జీకాని దానితో మన దేశాన్ని పోల్చుకోవటం వృధా ప్రయాసే అవుతుంది.

వర్తమానానికి వస్తే అనేక ఆటంకాలను ఎదుర్కొని చైనా ఆర్ధికంగా బలపడి రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టి అమెరికా తరువాత పెద్ద శక్తిగా తయారైంది. కొందరు మన దేశం త్వరలో చైనాను అధిగమించే విధంగా పురోగమిస్తోంది అని చెబుతున్నారు. మనం చైనా, ఐరోపా, అమెరికాతోనే పోటీపడి ముందుకు పోతే అంతకంటే కావాల్సింది ఏముంది? పోటీపడాలనే అభ్యుదయవాదులు కోరుకుంటున్నారు.

విధానాలపై ప్రశ్నలు వేసుకొనే ముందు రెండు దేశాలలో వున్న తాజా పరిస్ధితులను ఒక్కసారి చూద్దాం. 1952లో ప్రపంచ జిడిపిలో రెండు దేశాల వాటా దాదాపు సమానం. ఈరోజు మనమెక్కడ, వారెక్కడ ? మనకు ఆరు దేశాలతో సరిహద్దులుంటే చైనాకు 14తో 22వేల కిలోమీటర్లకు పైబడిన భూ సరిహద్దులున్నాయి. ఇలాంటిది ప్రపంచంలో మరొక దేశం లేదు. సముద్రతీరం మనది ఏడువేల కిలోమీటర్లయితే వారికి 14,500 అందువలన దౌత్యపరంగా, సమస్యలతో పాటు మనకంటే రక్షణ ఖర్చూ, దౌత్య అనుభవమూ ఎక్కువే. వ్యవసాయ భూమి మన దేశంలో 64.5శాతం, దానిలో సాగుకు యోగ్యమైంది 52.8శాతం వుంటే చైనాలో అవి 54.7,11.3 శాతాలుగా మాత్రమే వున్నాయి. ప్రపంచ సాగు భూమి వాటా చైనాలో ఏడు శాతం వుంటే జనాభా 21శాతం వుంది. అయినా అక్కడ ఆహార ధాన్యాలకు కొరత లేదు.అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలు వందల సంవత్సరాలలో సాధించిన అభివృద్దిని చైనా కొన్ని పదుల సంవత్సరాలలోనే అందుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు సాధించిన చైనాను చూసి మన దేశం కూడా ఎలా ముందుకు పోవాలా అని చూడకుండా మనది ప్రజాస్వామ్యం, వారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని పోసుకోలు కబుర్లు చెబితే కుదరదు. వాస్తవాలేమిటని యువత ఆలోచించాల్సిన అవసరం లేదా ?

1987లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో చైనా వాటా 1.6శాతం కాగా అది 2012 నాటికి 11.47శాతానికి చేరింది. 1964లోనే 3.1శాతంగా వున్న మన వాటా 1992 నాటికి ఒకశాతానికి పడిపోయింది. ప్రపంచబ్యాంకు తాజా సమాచారం ప్రకారం అమెరికా జిడిపి వాటా 24.32, చైనా 14.84,జపాన్‌ 5.91 శాతాలతో వుండగా మన దేశం 2.83 శాతం దగ్గర వుంది. అంటే జపాన్‌, మన కంటే పెద్దవిగా జపాన్‌ తరువాత వున్న జర్మనీ,బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను కూడా దాటి త్వరలో చైనాను అధిగమించే దిశగా నరేంద్రమోడీ నాయకత్వంలో మనం పయనిస్తున్నామనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దానికి తందాన అంటే దేశభక్తులు, మోసపూరిత ప్రచారం, వాస్తవ విరుద్ధం అంటే దేశద్రోహులా ? అయితే మనదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదా ? అది కార్పొరేట్లను, బిలియనీర్లను పెంచుతున్నది తప్ప సామాన్యులకు మేలు చేయటం లేదనేదే విమర్శ. వుపాధి రహిత అభివృద్ది సంపదలు ధనికుల వద్ద పోగుపడటానికి దారితీస్తుంది తప్ప జనానికి మేలు చేయదు.

స్వాతంత్య్రం తరువాత మన దేశంభూస్వాములతో రాజీపడిన పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందే బాటను ఎంచుకుంది.దానితోనే సమసమాజాన్ని స్ధాపిస్తామని పాలకవర్గం నమ్మబలికింది. మరోవైపు చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధతో సమసమాజాన్ని ఏర్పాటు చేయాలనే బాటను ఎంచుకుంది. ఇక్కడే అనేక మంది గందరగోళపడుతున్నారు. వందల సంవత్సరాల పాటు, భూస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్ధలలో వున్న దేశాలు ఒక్క గంతువేసి తెల్లవారేసరికి సోషలిస్టు సమాజాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరూ చెప్పలేదు. చరిత్రను గమనిస్తే ఫ్యూడల్‌ వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ విధానం నేటి వున్నత స్ధితికి చేరుకోవటానికి వందల సంవత్సరాలు పట్టింది. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు నడుస్తున్న ప్రాధమిక సంధిదశ ఇది.

నిర్దేశిత నమూనాలేవీ లేవు కనుక తన అనుభవాల ఆధారంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తనదైన ప్రత్యేక తరహా( దానినే చైనా లక్షణాలతో కూడిన అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించింది. భిన్న దశలలో వున్న దేశాలలో ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం సాధ్యం కాదన్నది స్పష్టం. 1949 నుంచి 1978 వరకు తన బాటను సమీక్షించుకున్న చైనా కమ్యూనిస్టుపార్టీ దానికి భిన్నంగా కొన్ని సంస్కరణలు అవసరమని భావించింది. 1978లో చైనా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. అంతకు ముందు అక్కడ అభివృద్ధి లేదా? ఆరుశాతానికి అటూఇటూగా వుండేది. అంతమంది జనానికి పని కల్పించాలన్నా, వారి జీవితాలను మెరుగుపరచాలన్నా ఆ వృద్ధి రేటు, ఆదాయాలు చాలవని కమ్యూనిస్టుపార్టీ గుర్తించింది.ఆ సంస్కరణలు కొన్ని కొత్త సమస్యలను సృష్టించినప్పటికీ మొత్తం మీద జనజీవితాలను ఎంతగానో మెరుగుపరిచాయి. ఇదే సమయంలో కొత్త ధనిక తరగతిని కూడా సృష్టించాయి. మొత్తం మీద మొగ్గు ఎటుఅంటే జనజీవితాల మెరుగుదల, దారిద్య్రనిర్మూలన వైపే అన్నది స్పష్టం.మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను గడువు కంటే ముందుగా చైనా చేరుకుంది. ఆ విషయాన్ని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ ఆర్ధిక వేదిక వంటి సంస్ధలన్నీ తమ నివేదికలలో పుంఖాను పుంఖాలుగా పేర్కొన్నాయి.

1978 నుంచి చైనా సంస్కరణలు విఫలమౌతాయని అనేక మంది చెప్పిన జోశ్యాలన్నీ ఇప్పటివరకు విఫలమయ్యాయి. చైనా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అమలు జరుపుతున్నదని చెప్పటమే ఒక వక్రీకరణ. అసలు అక్కడ పెట్టుబడిదారీ విధానమే వుందని చెప్పేవారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మూలస్ధంభాల వంటి అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం చైనా వేగాన్ని కొంత మేరకు తగ్గించింది తప్ప సంక్షోభంలోకి ఎందుకు నెట్టలేదు? ఈ కాలంలోనే అది జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ దేశంగా ముందుకు రావటం ఎలా సాధ్యం? నిజాయితీగా ఆలోచించేవారికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకటం కష్టం కాదు.

తనకున్న అపార మానవవనరును ఆర్ధిక శక్తిగా మార్చేందుకు చైనా విదేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తన షరతుల మీద ఆమోదించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు ముగిసిన సందర్భంగా అక్కడి పెట్టుబడులు తరలి పోకుండా చూసేందుకు, అవి ప్రధాన చైనాలో కొనసాగేందుకు ఒకే దేశం- రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని 2050వరకు అమలు జరుపుతామని ప్రకటించింది. అంటే ప్రధాన భూభాగంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద, హాంకాంగ్‌, మకావుల్లో నెలకొన్న పెట్టుబడిదారీ వ్యవస్దలను కూడా కొనసాగనిస్తామని స్పష్టం చేసింది. హాంకాంగ్‌లో డాలర్లు, చైనాలో యువాన్‌ కరెన్సీ. ఇదొక ప్రయోగం. ఈ కారణంగా హాంకాంగ్‌ కేంద్రంగా వున్న అనేక కంపెనీలు ఎలాంటి భయం లేకుండా చైనాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దాని వలన చైనాతో పాటు ఆ కంపెనీలు కూడా లాభపడుతున్నాయి. సంస్కరణల ప్రారంభంలో వాటికి ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గాలికోసం కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు దోమలూ, ఈగలు కూడా వస్తాయి, వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు.

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న మాంద్యం కారణంగా చైనా వస్తువులకు కొంత డిమాండ్‌ తగ్గినమాట వాస్తవం. ఆ కారణంగా అక్కడ లేఆఫ్‌లు జరిగినట్లు వార్తలు లేవు. ఎందుకని ? విదేశీ ఎగుమతులు తగ్గినదానికంటే స్వదేశీ వినియోగం ఎక్కువగా పెరుగుతోంది. 2008లో చైనా కార్మికుడి వార్షిక సగటు వేతనం 29,229 యువాన్లు వుంటే 2016లో అది 67,596కు చేరిన కారణంగా అంతర్గత వినియోగం పెరిగింది. అందుకే చైనా ముందుకు పోతోంది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మన మాదిరి కార్పొరేట్‌ సంస్ధలకు రాయితీలు ఇవ్వటం గాక జనానికి మరలిస్తున్నకారణంగానే వారి వస్తువినియోగం పెరుగుతున్నది. చైనా విజయ రహస్యం అదే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక సమస్య వుందని చైనాయే స్వయంగా చెబుతోంది.

చైనాలో ఏటేటా వేతనాలు పెరుగుతున్నందున ఇంకేమాత్రం అక్కడ చౌకగా వుత్పత్తి చేయటం సాధ్యం కాదని అనేక కార్పొరేట్‌ సంస్ధలు అంతకంటే శ్రమశక్తి చౌకగా దొరికే చోట్లను వెతుకుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే మేకిన్‌ ఇండియా పేరుతో మన దేశంలోకి విదేశీ పెట్టుబడులను నరేంద్రమోడీ ఆహ్వానిస్తున్నారు. వాటికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించకుండా రక్షణ కల్పించేందుకు పూనుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ఇటువంటి విధానాలు అనుసరించటమంటే ఏమిటి ? గతంలో బ్రిటీష్‌ వాడు మన దేశంలోని రాజుల, రంగప్పల అనుమతి కోరి మన దేశంలో వ్యాపారం ప్రారంభించాడు. ఎర్రతివాచీ పరచి చక్కగా ఏర్పాట్లు చేస్తాము వచ్చి మా కార్మికుల శ్రమను దోచుకుపోండని విదేశీయులను మనమే ఆహ్వానిస్తున్నాము.

ఈ మధ్యకాలంలో కొందరు చైనా వ్యతిరేకులు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇస్తున్నారు. తద్వారా అందరూ దేశ భక్తిని నిరూపించుకోవాలని చెబుతున్నారు. మన దేశాన్ని ఆక్రమించి మన సంపదల మూల్గులు పీల్చుతున్న బ్రిటీష్‌ వారిని తరిమివేసేందుకు సాగిన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ అన్నది ఒక ఆయుధం. ఆ వుద్యమానికి దూరంగా వుండి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర హిందూత్వ సంస్ధలకు చెందిన వారే ఇప్పుడు చైనా వస్తువు బహిష్కరణకు విఫల పిలుపులు ఇస్తున్నారు. మన దేశంతో సహా ప్రపంచంలో తయారయ్యే కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, అవి పని చేసే వ్యవస్ధలలో చైనా వస్తువులు లేదా చైనాలో తయారైన విడిభాగాలు లేనిదెక్కడ? అందువలన ముందుగా వారు తమ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తగులబెట్టి మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీగారి ఫ్యాక్టరీలలో తయారైన నిఖార్సయిన స్వదేశీ వస్తువులను వాడి చూపమని అడగాలి.

చౌకబారు రాజకీయం కాకపోతే ఒక్క చైనాయేం ఖర్మ అన్ని రకాల విదేశీ వస్తువులను బహిష్కరించి వాటిని మన దేశంలోనే తయారు చేసుకోవటానికి ఎవరు అడ్డుపడుతున్నారు?. అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సమాచారం ప్రకారం 2016లో చైనా 2011 బిలియన్‌ డాలర్లు, హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేసింది. ఒకే చైనాగా లెక్కవేస్తే 2497 బిలియన్‌ డాలర్లు. దానిలో మనం దిగుమతి చేసుకొనేది కేవలం 58 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులనే. వాటి దిగుమతులను నిలిపివేస్తే చైనా దారికి వస్తుందని చెబితే అమాయకులు తప్ప ఎవరు నమ్ముతారు.

చివరిగా మన సంస్కరణల విజయవంతం గురించి ముచ్చటించుకోకపోతే అసంపూర్ణం అవుతుంది. కాంగ్రెస్‌ పాలనలో సంస్కరణలు విఫలమయ్యాయని, అభివృద్ధి ఏదైనా వుంటే అది వుపాధిరహితంగా జరిగి కార్పొరేట్లకే ప్రయోజనం జరిగిందన్నది స్పష్టం. నరేంద్రమోడీ సర్కార్‌ ఆ విఫల విధానాల కొనసాగింపు తప్ప కొత్తదనం ఏముంది? గతనెలలో ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సహకార కూటమి(ఆర్‌సిఇపి) సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.దానిలో చైనా భాగస్వామి. వాటిలోని కొన్ని అంశాలు మన దేశ పౌరుల ప్రయోజనాలకు హానికలిగిస్తాయని వామపక్ష, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారు వ్యతిరేకత, నిరసన తెలిపారు తప్ప కాషాయ దళాల జాడలేదెందుకని? ఏదేశమైనా పరిశోధన, అభివృద్ధికి తగిన మొత్తాలను ఖర్చు చేయకుండా అభివృద్ధి చెందజాలదు. మనం 2015 తలసరి 39.37, చైనా 298.56 డాలర్లు ఖర్చు చేశాయి. ఇంత తక్కువ ఖర్చు చేయమని ఏ ప్రజాస్వామిక వాది చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఒక ఎత్తయితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని కొత్త పుంతలు తొక్కించింది. ఆవు పేడలో ఏం దాగుంది, మూత్రంలో ఏమున్నాయో పరిశోధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలే కేటాయింపు తక్కువ, దాన్ని ఆవు సైన్సు మీదకు మళ్లింపా ! ఇలాంటి పరిశోధనలతో చైనాను అధిగమిస్తామా ! ప్రపంచం నవ్విపోతుంది. చైనా గాకపోతే మరొక మంచి విధానాన్ని అమలు జరపండి ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జిందా తిలిస్మాత్‌ స్ధానంలో ఆవు పేడ, మూత్రం !

22 Saturday Jul 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized

≈ Leave a comment

Tags

cow, cow dung, cow sciences, Gujarat model, Narendra Modi, narendra modi bhakts, Science, Vedic sciences

ఎం కోటేశ్వరరావు

ఎందరో యువత, మధ్యతరగతి మేథావులు బిజెపి అంటే ఇష్టం లేకపోయినా కాంగ్రెస్‌ మీద కోపంతో నరేంద్రమోడీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయనను చూసి చెప్పినవారికల్లా ఓటు వేశారు. ఆ బలహీన క్షణంలో అలా జరిగింది అన్నట్లుగా ఓటింగ్‌ రోజు జరిగిందేదో జరిగిపోయింది. తరువాత ఆ ప్రభుత్వం ఏమి చేస్తుందో, ఆ పార్టీ వారు, వారికి వెన్నుదన్నుగా వున్న సంస్ధలకు చెందిన వారు ఏమి చేస్తున్నారో అని ఒక్క క్షణమైనా వెనుదిరిగి చూశామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మూడు సంవత్సరాలు గడిచాయి. ఎన్నో విజయాలు సాధించామని ఇప్పటికే వూదరగొడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నికల ప్రణాళిక, ప్రచారంలో చెప్పినవి మినహా ఇతర అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే, సమాజాన్ని చీల్చే అంశాలను బిజెపి, దాని చుట్టూ వుండే శక్తులు ముందుకు తెస్తున్నాయి. ఆ గోమాత సాక్షిగా మూడు సంవత్సరాలకు ముందున్నదాని కంటే దేశం ఏ రంగంలో ముందుకు పోయిందో ఆధార సహితంగా ఎవరైనా చెబితే సంతోషం. అంతరిక్షంలోకి అత్యధిక వుపగ్రహాలను పంపి విజయం సాధించిన శాస్త్రవేత్తలు ఒకవైపు మరోవైపు ఆవు పేడ, మూత్రంలో ఏముందో తెలుసుకొనేందుకు కాలం వృధా చేసే శాస్త్రవేత్తలు. మొదటి వారిని చూసి గర్వపడాలా రెండో వారిని చూసి సిగ్గుతో తలవంచుకోవాలా? యధారాజా తధా శాస్త్రవేత్త !

వాట్సాప్‌ గ్రూపులలో ఆ మధ్య గుజరాత్‌లోని రాజ్‌కోటలో అంతర్జాతీయ విమానాశ్రయం స్ధాయిలో ఒక బస్టాండ్‌ నిర్మించారంటూ ఏప్రిల్‌ నెలలో ఫొటోలతో సహా సమాచారం తిరిగింది. బాబూలాల్‌ సుప్రియ అనే కేంద్ర మంత్రి ఆ బస్టాండ్‌ను ప్రారంభించారంటూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి ? ఇప్పటి వరకు ఆ బస్టాండ్‌ నిర్మాణమే జరగలేదు. ప్రతిపాదిత కట్టడటం గురించి తయారు చేసిన నమూనా ఫొటో అది. పోనీ అది దేశంలో పెద్ద బస్టాండా అంటే కానే కాదు. దానికంటే మూడు నాలుగు రెట్లు పెద్దవి మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరుల్లో ఇప్పటికే నిర్మితమై వున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వ అభివృద్ధి గురించి కూడా ఇలాంటివే అనేకం ప్రచారంలో వున్నాయని తెలుసుకోవాలి.

గోరక్షణ, గోమాంసం తింటున్నారనే పేరుతో మైనారిటీలు, దళితులను మూకుమ్మడిగా హత్యలు చేయటం వెనుక తమ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను పక్కదారి పట్టించే కుట్ర వుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మరత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ బుధవారం నాడు రాజ్యసభలో చెప్పారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ ఆయనను ఆవహించినట్లుగా కనిపిస్తోంది. గో రక్షకుల ముసుగులో సంఘవ్యతిరేకశక్తులు దుకాణాలు తెరిచారనో, వారి చర్యలను సహించరాదనో, కఠిన చర్యలు తీసుకుంటామనో కోహినూరు వజ్రం వంటి మాటలతో మౌనబాబా ప్రధాని నరేంద్రమోడీ వుత్తరాయణానికో దక్షిణాయానానికో సెలవిస్తుంటారు. ఆయన శిష్యులు మరోవైపు ఇలా నోరు పారవేసుకుంటారు. అసలు అభివృద్దే బూటకం అయితే దానిని అడ్డుకొనేందుకు గోరక్షకుల పేరుతో ఎవరో దాడులు చేస్తున్నారని చెప్పటం అంతకంటే దారుణం. ఆ దాడులు ఎక్కడైతే జరిగాయో, జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలన్నింటా అధికారంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. తమ ప్రభుత్వ అభివృద్దిని అడ్డుకొనే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. దాదాపు అన్ని వుదంతాలలో బాధితులు, వారి కుటుంబాలపైనే తప్పుడు కేసులు బనాయించిన ఘనుల ప్రతినిధి అయిన కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో అలా మాట్లాడారంటే గుండెలు తీసిన బంట్లకే సాధ్యం అని స్పష్టం కావటం లేదూ ?

ముఖ్యమంత్రిగా తాను అభివృద్ధి చేసిన గుజరాత్‌ నమూనాను దేశమంతటికీ విస్తరిస్తానని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు ఊరూ వాడా ప్రచారం చేశారు. తరువాత విలేకర్లు ప్రశ్నించటానికి వీలులేకుండా ఇంతవరకు ప్రధాని హోదాలో ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టి కూడా నిర్వహించకుండా ఒక రికార్డు సృష్టించారు. అసలా గుజరాత్‌ అభివృద్ధి అనేదే పెద్ద బూటకం. అందుకే చివరికి మన్‌కీ బాత్‌లో కూడా దాని ప్రస్తావన తేవటం లేదు.2003 నుంచి అంటే గుజరాత్‌లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి గుజరాత్‌ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అది కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల సంఖ్య 51,378, అమలు జరిగినవీ, అమలులో వున్న పధకాల పెట్టుబడుల విలువ రు. 84లక్షల కోట్లని చెప్పారు. ప్రస్తుతం మన దేశ మొత్తం స్ధూలాదాయం రు.170లక్షల కోట్లరూపాయలని అంచనా. అంటే ఒక్క గుజరాత్‌కు వచ్చిన పెట్టుబడులే 84లక్షల కోట్లంటే మొత్తం జిడిపిలో గుజరాత్‌ విలువ ఎంతో లెక్కవేసుకోవాల్సింది.ఇవన్నీ చెప్పింది మూడు సంవత్సరాల క్రితం వరకు నరేంద్రమోడీ, తరువాత ఆయన వారసులు అని తెలిసిందే. కానీ అసలు వాస్తవం ఏమంటే 1983 నుంచీ అంటే మోడీ కంటే రెండు దశాబ్దాల ముందునుంచీ 2016 సెప్టెంబరు వరకు గుజరాత్‌లో అమలయిన పధకాలు 6,251 వచ్చిన పెట్టుబడుల విలువ రు.2.76లక్షల కోట్లు, కల్పించిన వుపాధి 10.67లక్షల మందికి, ఇవిగాక మరో 4033 పధకాలు మధ్యలో వున్నాయి, వాటి మొత్తం పెట్టుబడి రు.9.52లక్షల కోట్లని, మరో 9.3లక్షల మందికి వుపాధి కల్పించబడుతుందని సాక్షాత్తూ గుజరాత్‌ అధికారిక సమాచారమే వెల్లడించింది. మోడీ భక్తులు నిజాలను తట్టుకొనే ధైర్యం వుంటే దిగువ లింక్‌లోని వివరాలు చదివి, వాస్తవం కాదని గోమాత సాక్షిగా నిరూపిస్తే సంతోషం.http://www.moneylife.in/article/the-gujarat-model-ndash-some-facts/51106.html ఈ వివరాలు సేకరించింది కమ్యూనిస్టులు కాదు, సీతారాం ఏచూరి అంతకంటే కాదు.

గోవాలో గొడ్డు మాంసానికి కొరత లేదని, అటువంటి పరిస్ధితే వస్తే పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి దిగుమతికి ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మనోహర్‌ పారికర్‌ ఏకంగా అసెంబ్లీలోనే చెప్పారు. ఇలా మాట్లాడిన ముఖ్యమంత్రి బిజెపి పరువు తీశారని, రాజీనామా చేయాలని, బిజెపి అంటే బీఫ్‌ జాయ్‌ పార్టీ అని విశ్వహిందూ పరిషత్‌ నేత డాక్టర్‌ సురేంద్ర జైన్‌ ఎద్దేవా చేశారు.

గోరక్షకులకు ఆయుధాలు, శిక్షణ ఇస్తామని విశ్వహిందూపరిషత్‌ నేతలు ప్రకటించారు. కాబోయే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రచారంలో వున్న ఆ సంస్ధ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా గోరక్షకులను సాయుధులను చేస్తామని అలీఘర్‌లో చెప్పారు. తాము ఇప్పటికే తమ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చామని, గుంపులతో ప్రతికూల పరిస్ధితులు ఎదురైతే ఎలా వ్యవహరించాలో కూడా దానిలో నేర్పించామని ఒక నేత చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక రాసింది.

ఆవుల దొంగ రవాణాను అరికట్టేందుకు, లవ్‌ జీహాద్‌ నిరోధానికి ఒక్క ఆలీఘర్‌ జిల్లాలోనే ఐదువేల మంది ‘మత సైనికుల’ ను తయారు చేయాలని అలీఘర్‌లో ఈనెల 14-16 తేదీలలో అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వహిందూ పరిషత్‌ ప్రకటించింది.భజరంగదళ్‌ కార్యకర్తలు మాత్రమే ఈ సైనికుల్లో చేరటానికి అర్హులట. ఈ సైనికులు ఆవుల దొంగరవాణాతో పాటు లవ్‌ జీహాద్‌ నిరోధం, హిందూ యువకులు, యువతులు, మఠాలు, దేవాలయాలు, సంత్‌ సమాజం, దేశాన్ని కూడా రక్షిస్తారట.

గత పది సంవత్సరాలలో 50 మందికి పైగా పోలీసులు, గోరక్షకులను గోహంతకులు చంపివేశారని విహెచ్‌పి అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్‌ చెప్పారు. గోరక్షకులు బాధితులు తప్ప ప్రజా పీడకులు కాదని, గో రక్షకులకు కూడా ఆత్మరక్షణ హక్కుందని కూడా అన్నారు.

వేదాల్లోనే అన్నీ వున్నాయని చెప్పే మనువాదులు, వాటిని సమర్ధించే వారు గాని వాటి నుంచి పెట్రోలు, పైలట్లతో పనిలేని, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమాన, కార్ల, ఎన్ని ప్రయోగించినా తరగతని అస్త్రాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర వాటిని గానీ ఇంతవరకు బయటకు తీయలేదంటే వారి దేశ భక్తిని అనుమానించాల్సి వస్తోంది. మనమే వాటిని తయారు చేసి ఎగుమతి చేసి ప్రపంచంలో మన దేశాన్ని మొదటి స్ధానంలో నిలబెట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకొనేందుకు బడా కార్పొరేట్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా అన్నది సందేహం. మరోవైపు కౌపతి లేదా గో వేదం. లాభాల వేటలోని కార్పొరేట్‌ సంస్ధలు ఇప్పటికే ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం చేస్తున్నాయి. వాటి మార్కెట్‌ను మరింత పెంచేందుకు మోడీ సర్కార్‌ చర్యలు తీసుకుంది. బహుశా అది మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగం కావచ్చు.

ప్రస్తుతం మన దేశ జిడిపిలో 0.8శాతం సైన్సు కోసం ఖర్చు చేస్తున్నారు. దానిని మూడుశాతానికి పెంచాలన్నది మన శాస్త్రవేత్తల చిరకాల డిమాండ్‌. సైన్సు పరిశోధనల మీద ఖర్చు పెట్టని, యువత నైపుణ్యాన్ని పెంచని ఏదేశమైనా పరాధీనంగా వుంటుంది తప్ప పురోగమించలేదు. సైన్సుకోసం భారత్‌ పురోగతి పేరుతో ఆగస్టు తొమ్మిదిన దేశ వ్యాప్తంగా నిరసన,డిమాండ్లతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఏ చేయబోతోంది.

పంచగవ్యం(ఆవు పేడ, మూత్రం, పాలు, పాలనుంచి వచ్చే పెరుగు, వెన్న లేదా నెయ్యి)లోని సుగుణాలను నిర్ధారించేందుకు అవసరమైన పరిశోధనలు చేయాలంటూ పందొమ్మిది మంది ప్రముఖులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఇప్పటికే అరకొరగా వున్న నిధులను వీటికోసం మళ్లించనుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు. సంస్కృత గ్రంధాలలో వున్న విజ్ఞానాన్ని దాన్ని వెలికి తీసేందుకు ఆ భాష తెలిసిన పండితులుండగా వాటిపై పరిశోధనలు చేసేందుకు మరొక కమిటీ, శాస్త్రవేత్తలు ఎందుకు ? ఇప్పటికే మార్కెట్లో సర్వరోగనివారిణి పేరుతో జిందాతిలిస్మాత్‌ను విక్రయిస్తున్నారు. దానికి పోటీ లేదా దాని స్ధానంలో కొత్తదానిని తయారు చేస్తే ఎలా వుంటుందన్నట్లుగా పంచగవ్యాలకు బెల్లం, అరటి పండ్లు, లేత కొబ్బరినీరు, చెరకు రసాలను తగు మోతాదులో కలిపి ఆరోగ్యం నుంచి పంటల సాగుకు అవసరమైన ఎరువుల వరకు ఒకే మాత్రలో వుండే విధంగా ఆ పరిశోధనలు చేస్తారట. ఇలాంటి చర్యలతో దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతుంటే చెవుల్లో పూలు పెట్టుకొని తలాడిస్తే అంతకంటే దేశద్రోహం, నగుబాట్ల వ్యవహారం మరొకటి వుండదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అశాస్త్రీయ ప్రచారాలు-ఆవు, పేడ రాజకీయాలు !

17 Saturday Jun 2017

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Others, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, bjp cow politics, cow, cow dung, cow politics, cow sciences, cow urine, subhash palekar

ఎం కోటేశ్వరరావు

శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటం ద్వారా ఎవరైనా విరుద్ధ భావాలను వ్యాపింపచేయగలరు అని ఇటాలియన్‌ శాస్త్రవేత గెలీలియో ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ప్రపంచంలో రెండే అనంతమైనవి. ఒకటి విశ్వం, రెండవది మానవుల బుద్దిహీనత, అయితే మొదటిదాని గురించి నేను అంత ఖాయంగా చెప్పలేను అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐనిస్టీన్‌ అన్నాడు.లోకం పోకడలను కాచి వడపోసిన వారే ఇలాంటి తిరుగులేని అంశాలను గతంలో చెప్పారు. ఇప్పుడు ఎలాంటి అనుభవం లేకుండానే ‘ఆణిముత్యాలను’ ప్రవచించటానికి అనంతమైన బుద్ధి హీనులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. మనకు కావాల్సింది కాస్త బుర్రకు పని పెట్టి వారి లోకాన్ని విమర్శనాత్మకంగా చూడటమే !

భూమి చుట్టూ సూర్యుడు తిరగటం కాదు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోందని తొలిసారిగా చెప్పింది గెలీలియో. అప్పటివరకు వేల సంవత్సరాలుగా వున్న విశ్వాసాలను పటాపంచలు చేశాడు. అయితే బైబిల్‌ చెప్పిందానికి భిన్నంగా తమ మనోభావాలను గాయపరిచాడంటూ నాటి క్రైస్తవ మతోన్మాదులు గెలీలియోను గృహనిర్బంధం కావించారు. చివరికి కళ్లు పోయిన స్ధితిలో కూడా ఆ కరుణామయులు ఆయనను విడుదల చేయలేదు. ఆయనను తరువాతి తరాల వారు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో శాస్త్రీయంగా రుజువైన వాటిని కూడా తిరస్కరించే వున్మాదం క్రమంగా వ్యాపిస్తోంది. అది ఆవు ఆక్సిజన్‌ గ్రహించి దాన్నే విడుదల చేస్తుందని చెప్పటం కావచ్చు, వేదాల్లోనే అన్నీ వున్నాయట అనే రుజువు కాని శాస్త్రీయ భావాలు, విమానాలు,టెస్టుట్యూబ్‌ బేబీలు, ప్లాస్టిక్‌ సర్జరీ వంటి ఆధునిక ఆవిష్కరణలన్నీ వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో వున్నాయని చెప్పటం కావచ్చు. ఈ అశాస్త్రీయ వాదనలను సవాలు చేసే, వ్యతిరేకించే వారు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వసుధైక కుటుంబం, సర్వేజనాసుఖినో భవంతు, నీవు ఎవరు నేను ఎవరు సర్వం నేనే అని సుభాషితాలు పలికే కొందరు దాడులు, హత్యలకు దిగుతున్నారు.

అలాంటి వారిని పాలకులు ప్రోత్సహిస్తున్నారు, రక్షణ కల్పిస్తున్నారు. గెలీలియో కొత్త విషయాన్ని చెప్పినందుకు అక్కడి మతవాదులు భగ్గుమంటే, రుజువులున్నా పాత విషయాన్నే ఆమోదించాలంటూ ఇక్కడి మతవాదులు దాడులు చేస్తున్నారు. మన సమాజం ముందుకు పోతోందా? తిరోగమనంలో వుందా? నూతన ఆవిష్కరణలను నిరుత్సాహపరిచే ఇలాంటి ధోరణులతో ఇప్పటికే మనం ఎంతో నష్టపోయిన విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా ? విషాదం ఏమంటే శాస్త్రీయ అంశాలను చదువుకొని వాటి ఆధారంగా పని చేస్తున్న పెద్దలు ఎక్కడో ఒకరో అరా తప్ప మనకెందుకులే అన్నట్లుగా ఇలాంటి శక్తుల పట్ల మౌనం దాలుస్తున్నారు. బుద్ది హీనత మనలో పెరుగుతోందా ? ఇవన్నీ వేదాల్లోనే వున్నాయా? పోతులూరి వీరబ్రహ్మంగారు దీని గురించి ఏం చెప్పారు ?

గతంలో పది సంవత్సరాలు అధికారంలో వున్న కాలంలో ఇజ్రాయెల్‌ టెక్నాలజీ – కుప్పం ప్రాజెక్టు అంటూ వ్యవసాయం గురించి వూదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఘోరంగా విఫలమైన ఆ పధకం, టెక్నాలజీ వూసే ఎత్తటం లేదు. సూక్ష్మంలో మోక్షం మాదిరి ఇప్పుడు ఆవు పేడ వ్యవసాయ టెక్నాలజీ గురించి రైతులకు చెప్పేందుకు కాబినెటు హోదా ఇచ్చి ఒక సలహాదారును నియమించేశారు. కేంద్రంలోని పాలకులు ఆవు రాజకీయం చేస్తున్నారు గనుక వారితో స్నేహం కారణంగా చంద్రబాబు సరికొత్త పల్లవి అందుకున్నారు. అదే మంటే ఆవు మూత్రం, ఆవు పేడతో ప్రకృతి వ్యవసాయం చేయిస్తానంటూ ముందుకు వచ్చిన సుభాష్‌ పాలేకర్‌ అనే పెద్ద మనిషికి వంద ఎకరాలు, వంద కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చిన రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను అవమానించటం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదు. తమకు డబ్బులిస్తే బంగారం తయారు చేసే చిట్కాలు చెబుతామని, లంకె బిందెలను చూపిస్తామంటూ మోసాలకు పాల్పడే దొంగబాబాలను చంద్రబాబు గుర్తుకు తెస్తున్నారు. చివరికి ఈ పిచ్చి ముదిరి వేదాల్లోనే అన్నీ వున్నాయి, విమానాలు, క్షిపణులు తయారు చేసే పరిజ్ఞానం మన దగ్గరే వుంది అని చెబుతున్నవారికి కూడా భూములు, డబ్బు ఇచ్చి అమరావతిలో తిష్ట వేయించినా ఆశ్చర్యం లేదు.

అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచారంలోకి పెట్టటంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారందరికీ పెద్ద దిక్కుగా వుంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రచురించిన ఒక ప్రచార కరపత్రం. జూన్‌ 21న యోగా దినం సందర్బంగా మాతాశిశు సంరక్షణ కోసమంటూ రాసిన దానిని మంత్రి శ్రీపాద నాయక్‌ విడుదల చేశారు. గర్భం దాల్చిన తరువాత మాంసం తినవద్దు, శృంగారానికి దూరంగా వుండాలి. దుష్టులను దూరంగా వుంచాలి, దైవపరమైన ఆలోచనలతో వుండాలి, గదులలో మంచి, అందమైన బొమ్మలను అలంకరిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అన్నది ఆ కరపత్ర సారాంశం. ఈ వార్తలను చదివిన వారు కొందరు నిషేధిత జాబితాకు ఖర్జూరాలను, మరికొన్నింటిని కూడా చేర్చి ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి విపరీతం ? అనేక పేద దేశాలతో పోల్చితే మన దేశంలో రక్తహీనత సమస్య అధికంగా వుంది. దానిని అధిగమించేందుకు అవసరమైన ప్రొటీన్లు, ఇనుము మాంసంలో లభిస్తాయి. అలాంటి మాంసాన్ని గర్భిణులు తినకూడదన్నది ఒక అశాస్త్రీయ సలహా. అనేక మూఢనమ్మకాలకు నిలయమైన మన దేశంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అలా చెబుతుంటే దానిని పాటిస్తే ప్రసూతి మరణాలు ఇంకా పెరగటం తప్ప తగ్గవు. ఆరోగ్యవంతులైన తల్లీ పిల్లల కోసం ప్రభుత్వాలు చేయాల్సిందెంతో వుంది. వాటిన్నింటినీ వదలి పెట్టి శాస్త్రీయంగా రుజువు కాని, అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం గర్హనీయం. ఆయుష్‌ మంత్రిత్వశాఖ ప్రచురించిన కరపత్రంలోని అంశాలపై తీవ్ర విమర్శలు రావటంతో తమ కరపత్రలో కామాన్ని(లస్ట్‌) అదుపు చేసుకోవాలని పేర్కొన్నామే తప్ప శృంగారం( సెక్స్‌) అనే పదం వాడలేదని సదరుశాఖ ఒక వివరణ ఇచ్చింది. ఇది చిల్లు కాదు తూటు అని సమర్ధించుకొనే అతి తెలివి తప్ప మరొకటి కాదు. సమస్యాత్మక కేసులలో గర్భిణులే కాదు సాధారణ మహిళలను కూడా కొన్ని సందర్భాలలో శృంగారానికి దూరంగా వుండాలని నిపుణులు చెప్పటం వేరు, కానీ కేంద్ర ప్రభుత్వ కరపత్రంలో దానిని సాధారణీకరించటమే విమర్శలకు గురైంది.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనికిరాని అంశాలను ప్రచారం చేయటం ఎక్కువైంది. సమాజంలో శాస్త్రీయ దృష్టి, ఆసక్తిని పెంచటంపై దాని పురోభివృద్ధి ఆధారపడి వుంటుంది. దానికి బదులు అన్నీ వేదాల్లోనే వున్నాయంటూ మెదళ్లను కలుషితం చేయటంలో తిరోగమన వాదం జయప్రదమైంది. మన దేశానికి అది చేసిన హాని అంతా ఇంతా కాదు. ఆధునిక ఆవిష్కరణలకు మన యువతను దూరం చేశారు.ఎందుకు అనే ప్రశ్నను వేయనివ్వకుండా నోళ్లను మూయించారు ఇప్పుడు మరోసారి అలాంటి శక్తులు చెలరేగిపోతున్నాయి. అధికారంలో వున్నవారే వాటికి సాధికారత చేకూర్చేందుకు పూనుకున్నారు.

గతంలో కాంగ్రెస్‌ ఒక తరహా ఓట్ల రాజకీయాలకు పాల్పడితే, ఇప్పుడు దాని స్ధానాన్ని ఆక్రమించిన బిజెపి హిందూత్వ, రామాలయం, గోమూత్రం, పేడ, గొడ్డు మాంస రాజకీయాలతో లబ్ది పొందాలని చూస్తోంది. దానిలో భాగంగానే బిజెపిని బలపరిచే సంస్ధలు,శక్తులు, వ్యక్తులు ఆవుకు లేని ప్రాధాన్యత, పవిత్రత, మహత్తులను ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారు. వారి చర్యలు, వాదనలను చూస్తే చీకటి యుగాల రోజులను గుర్తుకు తెస్తున్నారు. వారి ప్రచారాంశాల శాస్త్రీయత,అధారాలను ప్రశ్నించే, విబేధించేవారు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ అనేక రకాల దాడులకు తెగబడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీయే 2016 ఆగస్టులో గో సంరక్షకుల మంటూ తెగబడుతున్నవారి గురించి ఇలా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవటం అవసరం. ‘ గో సంరక్షణ పేరుతో జనాలు దుకాణాలు నడపటం నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొంత మంది పగలు గో రక్షకులుగా ముసుగు వేసుకొని రాత్రుళ్లు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.’ అన్నారు. చిత్రం ఏమంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా అలాంటి ఒక్క దుకాణదారును శిక్షించిన దాఖలాలు లేవు. దాంతో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవులను రవాణా చేస్తున్న లారీలపై కూడా గో గూండాలు దాడి చేస్తే వాటిని పోలీసు రక్షణతో రాజస్ధాన్‌ బిజెపి సర్కార్‌ రాష్ట్ర సరిహద్దులను దాటించాల్సిన తీవ్ర పరిస్ధితులు అక్కడ నెలకొన్నాయి. స్వయంగా ప్రధాని, ఆయన అనుచరగణం నిరూపితం కాని, శాస్త్రవిరుద్దమన, అతిశయోక్తులను ప్రచారం చేయటం వారి ద్వంద్వ ప్రవృత్తి, చతురతకు నిదర్శనం.

మన కేంద్రమంత్రి రాజనాధ్‌ సింగ్‌ గారు ఒక సందర్భంలో అమెరికా వ్యవసాయశాఖ నివేదికను వుటంకిస్తూ దాని ప్రకారం ఆవులో కనుగొన్న జీన్స్‌లో 80శాతం మానవులలో కూడా వున్నాయని అందువలన ఆవును రక్షించి పూజించాలని చెప్పారు. పొద్దున లేస్తే ముస్లిం, క్రైస్తవ మతాలను, వాటిని అవలంభించే వారికి వ్యతిరేకంగా ప్రచారం, దాడులు చేస్తున్నారు. వారిలో కూడా అదే మోతాదులో ఆవు జీన్సు వున్నాయని అందువలన వారికి వ్యతిరేకంగా వున్మాదాన్ని రెచ్చగొట్టం గోవును అవమానించటమే అని గుర్తించటం అవసరం. సరే వున్మాదాన్ని రెచ్చగొట్టటం కూడా ఓటు బ్యాంకు రాజకీయాలనుకోండి. ఇక్కడ మెదళ్లను వుపయోగించాల్సిన అవసరం వుంది. అందరికీ సుపరిచితమైన సైన్సు అనే పత్రికలో వెల్లడించినదాని ప్రకారం మానవులలో వుండే జీన్సును పోలినవి చింపాంజీలు, పిల్లులు, ఎలుకలు, కుక్కలలో వరుసగా 96,90,85,84 శాతాల చొప్పున వున్నాయట. అంటే అవు కంటే ఎక్కువ శాతం. అరటి వంటి అనేక పండ్లలో కూడా అలాంటి జీన్సు వున్నాయి, మరి వాటికి లేని పవిత్రత ఆవు కెందుకు అంటే సమాధానం వుండదు. ఆవు పేడ, మూత్రం, అది పీల్చే, విడిచే వాయువుల గురించి కూడా అతిశయోక్తులు, కట్టుకధలను ప్రచారం చేస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిదని పేరు పెట్టాలన్నట్లుగా ఓట్లు దండుకొనేందుకు ఆవుకు లేని పవిత్రతను ఆపాదించటం కూడా అలాంటిదే.

దాని కొనసాగింపులో భాగంగా రాజస్ధాన్‌ హైకోర్టు జడ్జి ఒకరు ఇటీవలనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దానిని చంపితే మరణశిక్ష విధించాలని చెప్పారు. న్యాయమూర్తులు చట్టంలో వున్నదానికి భాష్యం చెప్పటానికి తప్ప లేని దానిని, తమ స్వంత బుర్రలలో వున్నవాటిని న్యాయ పీఠాలపై కూర్చొని చెప్పటానికి వీలులేదు. దేశమంతా ఆవు రాజకీయం నడుస్తోంది, ఆ పేరుతో కొందరు చట్టవిరుద్దమైన గూండాయిజానికి పాల్పడుతున్నారు. సదరు న్యాయమూర్తి చర్య గూండాయిజం కాకపోవచ్చుగాని చట్టవిరుద్దమైనదే. ఇదే న్యాయమూర్తి మగనెమలి కంటి నీటిని తాగిన ఆడ నెమళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభమౌతుందని,మగ నెమళ్లు ఆజన్మ బ్రహ్మచారులని కూడా సెలవిచ్చారు. ఇలాంటి పోసుకోలు కబుర్లు చెప్పటానికి గెలీలియో చెప్పినట్లు శాస్త్రీయ సూత్రాలను నిరాకరించటమే అర్హత. వాటికి చదువులతో పని లేదు. ఇందుకు కొన్ని వుదాహరణలను చూద్దాం. మనం కొద్దిగా ఆలోచిస్తే కర్ణుడి జన్మను చూస్తే ఆరోజుల్లోనే మనకు జన్యుశాస్త్రం, వినాయకుడికి ఏనుగుతలను అతికించటాన్ని బట్టి ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసని అర్ధం అవుతుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బిజెపికి చెందిన వుత్తరాఖండ్‌ మాజీ ముఖ్య మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఎంపీగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ పదిలక్షల సంవత్సరాల నాడే రుషి కణాదుడు అణుపరీక్షలను నిర్వహించాడని చెప్పాడు.పైథాగరస్‌ కంటే మూడువందల సంవత్సరాల ముందే ఆ సూత్రాన్ని మన వారు కనుగొన్నారని ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహిలీకర్‌ సెలవిచ్చాడు. విమానాలు, మోటారు కార్లు, అంతరిక్ష ప్రయాణాల వంటి వన్నీ మన పూర్వీకులెప్పుడో ఆచరించి వదలివేసినవే అని చెప్పేవారికి కొదవ లేదు.

తినే తిండిని బట్టి కొంతమంది మానభంగాలకు పాల్పడుతున్నారని ఒకడు, చికెన్‌, చేపలు తిన్నవారే ఎక్కువగా రేపులు చేస్తున్నారని ఒక బీహార్‌ మంత్రి, దక్షిణాది స్త్రీలు అందంగా వుండటానికి కారణ వారికి డ్యాన్సు తెలిసి వుండటమే అని ఒక రాజకీయనేత, హిందువుల జనాభాను పెంచేందుకు ప్రతి మహిళ కనీసం నలుగుర్ని కనాలని బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌, రాసిఫలాలను బట్టి ఏ మహిళ అత్యాచారానికి గురవుతుందో తాను చెప్పగలనని ఒక జ్యోతిష్కుడు, ఒక లీటరు ఆవు మూత్రంలో మూడు నుంచి పది మిల్లీ గ్రాముల బంగారం లభించిందని చెప్పే విశ్వవిద్యాలయ పరిశోధకులు, తమ వుత్పత్తులు చక్కెర వ్యాధిని సహజంగానే నయం చేస్తాయని పతంజలి సంస్ధ ప్రచారం, యజ్ఞం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని, కొన్ని పరీక్షల ద్వారా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారిని తిరిగి బ్రతికించగలనని ఒక వైద్యుడు, ఐనిస్టీన్‌ సిద్ధాంతం పరీక్షకు నిలవదని చెప్పే మేథావులు మనకు ఎక్కడబడితే అక్కడ కలుపు మొక్కల్లా పెరిగిపోయారు.

గో లేదా పశు మాంసం తినటం విదేశీ ముఖ్యంగా ముస్లింలు మన దేశం మీద దండయాత్రలు చేసిన తరువాతే ప్రారంభమైందన్నది ఒక తప్పుడు ప్రచారం. దీనిని కూడా గుడ్డిగా నమ్ముతున్నవారు లేకపోలేదు. పండ్ల అమరిక తీరుతెన్నులను చూస్తే మాంసాహార జీవుల కోవకే మానవులు చెందుతారన్నది తిరుగులేని సాక్ష్యం. వివేకానందుడు హిందూమతావలంబకుడు అనటంలో సందేహం లేదు, అది తప్పు కూడా కాదు. కానీ నేడు కాషాయ వేషాలు వేసుకు తిరిగే అనేక మంది స్వామీజీలు, వారిలో కనిపించే పరమత ద్వేషం ఎక్కడా ఆయన వుపన్యాసాలలో కనపడదు. కాలిఫోర్నియాలోని షేక్స్పియర్‌ క్లబ్బులో 1900 ఫిబ్రవరి రెండున చేసిన ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు.’నేను దాని గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు, పురాతన క్రతువుల ప్రకారం గొడ్డు మాంసం(బీఫ్‌) తినకపోతే అతను మంచి హిందువు కాడు.కొన్ని సందర్భాలలో అతను విధిగా ఎద్దును బలిచ్చి తినాల్సిందే.’ అంతే కాదు వేదకాలం గురించి పరిశోధన చేసిన చరిత్రకారుడు సి.కున్హన్‌ రాజా ఇలా చెప్పారు.’బ్రాహ్మణులతో సహా వేదకాలపు ఆర్యన్లు చేపలు, మాంసం చివరికి గొడ్డు మాంసం కూడా తిన్నారు.ప్రముఖులు వచ్చినపుడు వారి గౌరవార్ధం గొడ్డు మాంసం వడ్డించేవారు. వేదకాలపు ఆర్యులు గొడ్డు మాంసం తిన్నప్పటికీ పాలిచ్చే ఆవులను తినేవారు కాదు. ఒక వేళ గొడ్డు మాంసం పెట్టాల్సి వస్తే ఎద్దులు, వట్టిపోయిన ఆవులు, దూడలను మాత్రమే వధించాలనే నిబంధనలు వుండేవి ‘ అని చెప్పారు.

నాజీ జర్మనీ కాలంలో జైలు పాలైన ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ మతాధికారి మార్టిన్‌ నియోమిల్లర్‌ హిట్లర్‌ చర్యలను వ్యతిరేకించినందుకు జైలు పాలు చేశారు. అక్కడ నాజీల ఎత్తుగడలు, నాటి జనం వాటిని వుపేక్షించి చివరికి ఎలాంటి దుస్ధితికి లోనయ్యిందీ వివరిస్తూ ఒక కవితను రాశాడు. ఆ కవిత ఇలా సాగుతుంది. ఆరోజుల్లో జర్మన్‌ కమ్యూనిస్టులను సోషలిస్టులని పిలిచారు.

తొలుత వారు సోషలిస్టుల కోసం వచ్చారు

నేను సోషలిస్టును కాదు కనుక మిన్నకుండి పోయాను

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు

తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం ఎవరూ మిగలలేదు

ముస్లింలు మాత్రమే ఆవు మాంసం తింటారని ప్రచారం చేసిన మతశక్తులు గోవధ నిషేధం గురించి చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. వారి వత్తిడికి లొంగి రాజ్యాంగంలో దానిని ప్రస్తావించినప్పటికీ నిషేధ అంశాన్ని రాష్ట్రాలకు వదలివేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మొదలైన ప్రచారం తరువాత అన్ని మతాలవారు తినే పశుమాంసానికి కూడా వర్తింప చేశారు. దేశమంతటా గోవధ, పశుమాంస నిషేధం గురించి చెప్పే బిజెపి గోవా, కేరళ, గిరిజనులు ఎక్కువగా వున్న ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఓట్ల కోసం భిన్న గళం వినిపిస్తోంది. పశు విక్రయాలపై కేంద్రం విధించిన ఆంక్షలు గొడ్డు మాంసం తినే అన్ని మతాల వారికే గాక మెజారిటీ హిందూమతం వారికి, జీవన భృతికోసం పశుపాలన చేసే పేదవారికి అందరికీ నష్టదాయకంగా మారాయి. అందువలన మతశక్తులకు కావాల్సింది సెంటిమెంట్ల ద్వారా కొల్లగొట్టే ఓట్ల కోసం ఎవరినీ వదలవు అని గుర్తించటం అవసరం. గతంలో రాజులు, రంగప్పలు యజ్ఞ, యాగాదుల పేరుతో ప్రజాధనాన్ని ఎంతగా తగలేసిందీ చదువుకున్నాం. ఇప్పుడు నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి పాలకులు కూడా మరో రూపంలో అదే చేస్తున్నారు. ఆశాస్త్రీయమైన వాటిని నిరూపించేందుకు పరిశోధనల పేరుతో జనం సొమ్మును వుదారంగా ఖర్చు చేస్తున్నారు.

రామాయణంలో చెప్పిన సంజీవని మొక్కలను కనుగొనేందుకు వుత్తరాఖండ్‌ సర్కార్‌ 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలాగే అనేక విశ్వవిద్యాలయాలలో సంస్కృతంలో నిక్షిప్తమైన పరిజ్ఞానాన్ని వెలికితీసే పేరుతో డబ్బు, మానవ శ్రమ, మేధస్సును కూడా దుర్వినియోగపరిచేందుకు పూనుకున్నారు. చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతున్న సుభాష్‌ పాలేకర్‌ చెబుతున్నట్లు ఎలాంటి ఎరవులు, పురుగుమందులు వేయకుండా ఆవు పేడ, మూత్రంతో సాగు చేస్తే ఎకరానికి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. నరేంద్రమోడీ వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయల నల్లధనం సొమ్ము బదిలీకోసం ఎవరూ ఎదురు చూడరు. చంద్రబాబు చెప్పే ఐటి వుద్యోగాల జోలికి యువత అసలే పోదు. ఆవు మూత్రాన్ని సేకరించి బంగారాన్ని, పేడను వాడి వ్యవసాయం చేస్తారు. చంద్రబాబు హెరిటేజ్‌ కంటే ఎక్కువ లాభాలు పొంది ఆయనకంటే ఎక్కువగానే సంపాదించగలరు.సుభాష్‌ పాలేకర్‌ మాటలను చూస్తుంటే నాకు లక్ష రూపాయలిస్తే మీకు కోట్ల రూపాయల బంగారాన్ని తెచ్చిపెట్టే ఫార్ములా చెబుతా అనే మాయగాళ్లను గుర్తుకు తెస్తున్నారు. వారికి ఆ ఫార్ములా తెలిస్తే ఆ బంగారమేదో వారే సంపాదించుకోవచ్చు. పశువుల పేడ, మూత్రంతో కూడిన ఎరువులను పొలాల్లో చల్లటం రైతాంగానికి కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. కేవలం దానితోనే పంటలు పండుతాయని చెప్పటమే అభ్యంతరకరం. అలాగే ప్రకృతి సాగు చేస్తున్నా అంటున్న పాలేకర్‌ చెప్పేది నిజమైతై ఆయన వ్యవసాయం చేశానంటున్న మహారాష్ట్రలో రైతులు అప్పులపాలై ఆత్మహత్య లెందుకు చేసుకుంటున్నట్లు ? ఆవు పేడ వ్యవసాయాన్ని వారెందుకు చేయటం లేదు, అసలు పాలేకర్‌ చెప్పేదానికి రుజువులేమున్నాయి అని అడగాల్సిన అవసరం లేదా ? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏ రూపంలో అయినా కనీసం ఒక రూపాయి అయినా చెల్లించే ప్రతి ఒక్కరికీ పాలేకర్‌కు చేసే ఖర్చు గురించి అతని చర్యల శాస్త్రీయత గురించి ప్రశ్నించే హక్కు వుందా లేదా ?

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆవు, ఎద్దుల వేద శాస్త్రాలు నవకల్పనలకు దారి చూపవు

06 Saturday Feb 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

cow, cow sciences, innovations, innovations index, Vedic sciences

ఎం కోటేశ్వరరావు

     ఏ దేశమైనా అభివృద్ధి చెందింది అనటానికి అనేక కొలమానాలు వుంటాయి.  ఎక్కడో ఒక దగ్గర చోటు దక్కితేనే మనం కూడా ఆ రేసులో వున్నట్లు లెక్క. మన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ చెబుతున్నదాని ప్రకారం చైనా కంటే కూడా అభివృద్ధి రేటులో ముందున్నాం. జైట్లీ గారి వేద గణితం ప్రకారం దేశం కంటే చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముందుంది. కావాలంటే పెట్టుబడులకు అనువైన వాతావరణం వున్న రాష్ట్రాలలో మన స్ధానం ఏమిటో ప్రపంచబ్యాంకు నివేదికలను చూడండి అంటారు. వారు చెప్పే మాటలనే తీసుకొనేట్లయితే మనం ఇంక పెద్దగా అభివృద్ధి చెందాల్సిన పని లేదు.

     మన దేశానికి చెందిన సిఐఐతో సహా ప్రపంచంలో అనేక సంస్ధల ప్రతినిధులు, నిపుణులతో కూడిన బృందం రూపొందించే గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌(ప్రపంచ నవకల్పన సూచీ)లో మనం ఎక్కడ అని చూసుకుంటే మన స్ధితి ఏమిటో తెలుస్తుంది. దీనికిగాను అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని భిెన్న సూచికలను తయారు చేస్తారు. ఏడాదికొకసారి ఈ నివేదికను విడుదల చేస్తారు. దీనిలో పైకి పోతున్నామా కిందికి దిగజారుతున్నామా అన్నది వ్యాఖ్యానం లేకుండానే మన స్ధితిని తెలుపుతుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అమెరికా మొదటి స్ధానంలో వుంది. తరువాత స్ధానంలో ఇప్పుడు చైనా చేరింది. త్వరంలోచైనాను మనం అధిగమించబోతున్నామని మన నేతలు చెబుతున్నారు. బహుశా ఇది కూడా వేదాల్లోనే చెప్పి వుంటారు.

      ఈ ఏడాది నవకల్పన సూచీలలో వంద మార్కులకు గాను 68.3తో స్విడ్జర్లాండ్‌ ప్రధమ స్ధానంలో,60.1తో అమెరికా ఐదవ, 47.47తో చైనా 29వ స్ధానంలో వుంది. 2013 జాబితాలో 36.17 మార్కులతో మన దేశం మొత్తం 71 దేశాలలో 66వ స్ధానంలో వుంది. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన తరువాత అసలు జాబితాలో పేరు లేకుండా పోయింది.మరో సూచిక ప్రకారం 2014లో 76వ స్ధానంలో వున్న మన దేశం 81కి దిగజారింది. 2011 నుంచి దిగజారుతూనే వుంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ అనే సంస్ధ అనేక అంశాలను తులనాత్మకంగా విశ్లేషించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 90శాతానికి ప్రాతినిధ్యం వహించే 56 దేశాలను అది పరిగణనలోకి తీసుకుంది. తలసరి ప్రాతిపదికన ప్రపంచ నవకల్పనకు తోడ్పడటంలో ఫిన్లాండ్‌, స్వీడన్‌, బ్రిటన్‌ ముందు స్ధానాలలో వున్నాయి. భారత్‌, ఇండోనేషియా, అర్జెంటీనా చివరి దేశాలలో వున్నాయి.ఈ తోడ్పడటం అంటే ఏమిటి అంటే వాటిని అంగీకరించవచ్చు, విబేధించవచ్చు. పన్నులు ఎక్కువగా వుంటే, మేథో హక్కుల పరిరక్షణ బలహీనంగా వుంటే, స్ధానిక రక్షణ విధానాలను అనుసరిస్తే ప్రతికూలంగానూ లేకుంటే అనుకూలంగానూ పరిగణిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్ధితులలో వాటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ తమ ఆర్ధిక వ్యవస్ధలకు దెబ్బతగుల కుండా చూసుకోవటం కత్తిమీద సామువంటిదే. చైనా, వియత్నాం, లావోస్‌, కంపూచియా, క్యూబా వంటి సోషలిస్టు దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను కాపాడు కుంటూ సంస్కరణలతో ముందుకు పోతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన సంక్షోభం లేదా అననుకూలతలను అవి వినియోగించుకొంటున్నాయి.ఈ క్రమంలో నవకల్పనలకు ప్రోత్సాహమిచ్చిన దేశాలు లబ్ది పొందుతాయని వేరే చెప్పనవసరం లేదు.అటువంటి చొరవ చూపటానికి బదులు వేద విద్య, ఆవు,ఎద్దుల రాజకీయాల చుట్టూ తిప్పుతూ తిరోగమనంవైపు దేశాన్ని నడిపిస్తున్నారనేదే ఇక్కడ విమర్శ.

    ప్రపంచ జనాభాలో ఒకశాతం కంటే తక్కువగా వున్న బ్రిటన్‌ ప్రచురితమైన పరిశోధనాంశాలలో 16శాతం కలిగి వున్నదని ఆ దేశ మంత్రి లూసీ నెవిలే చెప్పారు. ప్రపంచ నవకల్పన సూచీలో రెండవ స్ధానంలో కొనసాగటానికి ఇలాంటి పరిశోధనే ప్రధాన కారణం అని చెప్పనవసరం లేదు.మన దేశంలో పరిశోధనకు కేటాయిస్తున్న నిధులే చాలా తక్కువగా కాగా వాటికి కూడా కోత విధించటానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది.ఎంఫిల్‌ లేదా పిహెచ్‌డీలకు నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌లకు కోత విధించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా గతేడాది విద్యార్ధులు యుజిసి ఆక్రమణ వుద్యమం జరిపిన విషయం తెలిసినదే. అన్ని రంగాలలో ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పరిశోధక రంగం నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది. దాని పర్యవసానమే ఇది. సామాజిక శాస్త్రాల పరిశోధనను నిరుత్సాహపరిచేందుకు ఈ చర్య అన్నట్లు కనిపిస్తున్నప్పటికీ సైన్సు పరిశోధనల పరిస్ధితి కూడా ఇంతే. పరిశోధనా రంగంవైపు యువత మొగ్గు చూపకపోవటమే ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేదన్న విషయాన్ని వెల్లడిస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: