• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: dalits

మేడిన్‌ ఇండియా : అమెరికాకు ” అగ్రహారాలు ” ఎగుమతి !

08 Monday Nov 2021

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ Leave a comment

Tags

Agraharam Valley, caste discrimination, caste system, dalits, Equality Labs


ఎం కోటేశ్వరరావు


ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్‌ వివక్ష వ్యతిరేక చర్యల్లో భాగంగా కుల వివక్షను గుర్తించేందుకు పూనుకుంది. కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. ఇప్పటి వరకు దీని తెలియని వారు కూడా తెలుసుకొని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.ప్రస్తుతం నడుస్తున్న జైభీమ్‌ సినిమా దర్శకుడు జ్ఞానవేల్‌ తన సినిమాలో గిరిజనులపై పోలీసు కస్టడీలో చిత్ర హింసల గురించి చెబుతూ అవి పదే పదే జరగటం కంటే వాటి మీద సమాజం మౌనం పాటించటం తీవ్ర అంశమని చెప్పారు. కులవివక్ష కూడా అలాంటిదే. అనేక మంది తాము పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఏమనాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు. రెండు లక్షల మంది దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్దులు అమెరికాలో ఉన్నట్లు అంచనా.


గతేడాది జూన్‌లో అమెరికాలో వివక్ష కేసు ఒకటి దాఖలైంది. సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్నది ఫిర్యాదు. సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెలువడిన తరువాత అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది తప్ప కేవలం బ్రాహ్మణ సామాజిక తరగతిని లేదా అగ్రకులాలు అని భావిస్తున్న సామాజిక తరగతులందరినీ తప్పు పట్టటంగా భావించకూడదు)

తమిళనాడులోని ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్దులను బ్లడీ బాస్టర్డ్‌ అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం తెలిసిందే. అమెరికాలోని హిందూమతానికి చెందిన స్వామినారాయణ సంస్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్ధలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్ధ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పది మందిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


ఇటీవలి కాలంలో అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా అనేక మంది భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని కరాఖండితగా చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది కనుక ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆర్గనైజ్‌ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. ముందుగా వాటి గురించి మాట్లాడుకోవాలి, అర్ధం చేసుకోవాలని సెల్వి చెప్పారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్దులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన అంశం తెలిసినదే. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్ధి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్ధలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్ధలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మహిళా చట్టాన్ని నీరు గార్చినపుడే మేలుకొని వుంటే దళితుల వరకు వచ్చేదా ?

06 Friday Apr 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Acts Misuse, dalits, SC/ST Atrocities Act, Section 498-A, sexual harassment laws

చట్టాలను నీరు గార్చేందుకే దుర్వినియోగ ఆరోపణ

ఎం కోటేశ్వరరావు

చట్టాల వినియోగం, దుర్వినియోగం గురించి దేశంలో ఇప్పుడు సమాజంలోని కులీన, అట్టడుగు తరగతుల్లో ఒకే అంశంపై చర్చ మొదలైంది. చిత్రం ఏమిటంటే యావత్‌ దేశానికి చట్టాలు చేసే పార్లమెంట్‌ వుభయ సభలను గత ఇరవై ఐదు రోజులుగా దుర్వినియోగం చేయటాన్ని స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా యావత్‌ జాతి గమనించింది. పార్లమెంట్‌ సరిగా నడవని అన్ని రోజులకు ఎన్‌డిఏ ఎంపీలు తమ వేతనాలు, అలవెన్సులను వదులుకుంటారని బుధవారం రాత్రి పార్లమెంటరీ వ్యవహారాల కేేంద్ర మంత్రి అనంతకుమార్‌ ప్రకటించారు. సభను నడిపించాల్సిన అధికారపక్షం అవిశ్వాస తీర్మానాల ప్రహసనంలో అంటించుకున్న గబ్బును కాస్తయినా తగ్గించుకొనేందుకు తాము పెద్ద జవాబుదారీ అంశకు చెందిన వారమని ఫోజు పెట్టేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు వేసిన అతి తెలివి ఎత్తుగడ ఇది. సభను నడపాల్సిన వారు సరిగా నడపకపోతే నేనెందుకు వదులుకోవాలి అని బిజెపి సభ్యుడు సుబ్రమణ్యస్వామి గడ్డిపెట్టారనకోండి.

సమాజంలో ఏమాత్రం రక్షణ లేని దళితులు, గిరిజనులు తమ రక్షణ చట్టాన్ని దుర్వినియోగం చేశారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు నివేదించింది, దాని ఆదారంగానే అది ఆ చట్టంలో మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది.తాము అలవెన్సులు, వేతనా వదులుకుంటామని చెప్పటం అంటే పార్లమెంట్‌ను దుర్వినియోగం చేసినట్లు అంగీకరించటమే. దానికి పరిహారంగా ఆర్ధిక ప్రయోజనాన్ని వదులుకుంటామంటే సరిపోతుందా ? అదంత స్వల్ప దుర్వినియోగమా ? ఈ విషయాన్ని ప్రజాకోర్టు తప్ప మరే కోర్టూ విచారించే అవకాశం లేదు. అటువంటి అవకాశాలే వుంటే అవిశ్వాస తీర్మానంపై నాటకం ఇంత రంజుగా నడిచేది కాదు. అందువలన అన్ని రకాల దుర్వినియోగాలు, వాటికి బాధ్యుల గురించి దేశం తీవ్రంగా చర్చించాల్సిందే.

మహిళలకు రక్షణ కల్పించే శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్‌, ఎస్‌సి, ఎస్‌టిలపై దాడుల నిరోధక చట్టం రెండింటినీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నప్పటికీ రెండవ అంశం ప్రస్తుతం అనూహ్యంగా ముందుకు వచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్ధితులు అరుదుగా వస్తుంటాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఒక చట్టాన్ని వినియోగించకుండా నీరుగారుస్తున్నారని జనాభాలో ఒక పెద్ద సమూహం, దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆ సమూహంపై తరతరాలుగా దాడులు చేసేవారు లేదా చేయటాన్ని పరోక్షంగా అయినా సమర్ధించేవారు పరిమితంగానే అయినా వీధుల్లోకి సైతం వచ్చిన వుదంతం ఏప్రిల్‌ రెండవ తేదీన జరిగింది. అనేక అంశాలపై సమ్మెలు, బందులు జరగటం సర్వసాధారణం. తమ రక్షణకు తెచ్చిన చట్టాన్ని నీరు గార్చటానికి లేదా ఎత్తివేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రక్షణ కోసం దళితులు, గిరిజనులు దేశ వ్యాపిత బంద్‌కు పిలుపు ఇచ్చిన వుదంతం ఎన్నడూ జరగలేదు. అది జయప్రదమైందా, విఫలమా, పాక్షికమా అన్న విషయాన్ని పక్కనపెడదాం. మూడు రాష్ట్రాలలో హింసాత్మకంగా మారి పదకొండు మంది వరకు మరణించటాన్ని బట్టి దాని తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ బంద్‌ ఒక చైతన్యానికి, పోరాటపటిమకు నిదర్శనం.

Image result for SC/ST Atrocities Act, band

ఎప్పుడూ అనేక అంశాలపై చర్చ జరుగుతూనే వుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. దళితుల, గిరిజనుల రక్షణ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దేశంలో వివిధ చట్టాల వినియోగం, దుర్వినియోగం గురించిన చర్చ ముందు పీఠీకి వచ్చింది. తిరోగమన వాదులకు సంకటమైన ఈ చర్చను పురోగమనవాదులు మరింతగా ముందుకు తీసుకుపోవాల్సిన తరుణమిది. ఒక కుక్కను చంపాలనుకుంటే పిచ్చిదని ప్రచారం చేయాలన్నది పాత సామెత. ఒక అవాస్తవాన్ని నిజం చేయాలంటే వందసార్లు చెప్పాలని ఫాసిస్టు గోబెల్స్‌ పాలకవర్గాలకు సరికొత్త ఆయుధాన్ని అందించాడు. తమకు కంటగింపుగా వున్న చట్టాలను నీరుగార్చి, పసలేని వాటిగా చేయాలన్నా, తొలగించాలన్నా అవాస్తవాలతో పాటు వాటిని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలన్నది నేటి పాలకవర్గాల నీతి. కేంద్రంలో అధికారంలో వున్న పాలకపక్షం బహుశా మొదటిసారిగా తాను అమలు జరుపుతున్న ఒక చట్టాన్ని అందునా సమాజంలో సమాజంలో అట్టడుగున వున్నవారు దుర్వినియోగం చేస్తున్నారని దేశ అత్యున్నత న్యాయ స్ధానానికి నివేదించటం, దానిని ప్రాతిపదికగా తీసుకొని అవును నిజమే అని తీర్పు చెప్పటం నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి సాధించిన ‘ఒక ఘనత’.

భూస్వామ్య శక్తులతో రాజీపడి ఆ వ్యవస్ధను కొనసాగిస్తూనే తమ ప్రయోజనాలకు పెద్ద పీటవేసుకొనే బడా పెట్టుబడిదారుల నాయకత్వంలో నడుస్తున్నది మన దేశం. కాంగ్రెస్‌, ఇతర పార్టీలలో కూడా ఈశక్తులకు ప్రాతినిధ్యం వహించేవారు వున్నప్పటికీ అత్యధికంగా మాజీ రాజులు,రాణులు, జమిందార్లు,దేశముఖులు, భూస్వాములు అదే సమయంలో బడాపెట్టుబడిదారులను కుడి ఎడమల ఢాల్‌ కత్తుల మాదిరి కలిగి వున్న ఏకైక పెద్ద పార్టీ బిజెపి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలోని చట్టాలపై ద్విముఖ దాడి జరుగుతున్నది. అదిప్పుడు మరింతగా పెరిగింది. ఆ ఖ్యాతి తమదే అని బిజెపి ప్రపంచం ముందుకు వస్తోంది. పారిశ్రామిక సంబంధాలు, చట్టాల సంస్కరణల పేరుతో కార్మికులకు రక్షణ కల్పించే, సంక్షేమ చర్యలను చేపట్టాల్సిన అనేక చట్టాలను నీరుగారుస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. మరోవైపు మొత్తంగా మహిళలపై సాగించే వరకట్న తదితర వేధింపుల నిరోధక అంశాలు, సామాజికంగా బలహీన వర్గాలుగా వున్న ఎస్‌సి,ఎస్‌టిలపై దాడుల నిరోధక చట్టంపై బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, దాని వాదనలకు అనుగుణ్యంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, దాని పర్యవసానాలు వాటిని నీరుగార్చేందుకు దారితీసేవిగా వున్నాయి.

ఈ తీర్పుపై అనూహ్యరీతిలో దళితులు, గిరిజనుల్లో వెల్లడైన ఆగ్రహాన్ని వూహించని బిజెపి సర్కార్‌ కోర్టులో తీర్పు సమీక్ష పిటీషన్‌ దాఖలు చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు దళితులు, గిరిజనుల మీద బిజెపికి వున్న శ్రద్ధ ఎలాంటిదో, అంతరంగంలో వున్నదేమిటో కళ్లు తెరిపించేవిగా వున్నాయి. దళితులు, గిరిజనులపై దాడుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదని గణాంకాలు కూడా సమర్పించింది మీ ప్రభుత్వమే కదా అని జస్టిస్‌ ఏకె గోయల్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టుకు సాయపడేందుకు గాను అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన అమరేంద్ర షరాన్‌ ‘ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సమాచారం అందించి దుర్వినియోగం గురించి విన్నపాలు చేసింది, ఇప్పుడు అదే ప్రభుత్వ తీర్పును సవాలు చేస్తోంది’ అని అభ్యంతరం తెలిపారు.కోర్టుకు అందచేసిన సమాచారం, దాని మీద దుర్వినియోగ వ్యాఖ్యానాలతో వాదనలు చేయటం ఫ్యూడల్‌ వ్యవస్ధకు ప్రతినిధులైన భూస్వాములు, మాజీ జమిందార్లు, రాజాలు, ఆ భావజాలం వున్న ఇతరులను సంతృప్తి పరచేందుకు, ఆ చట్టాన్ని తొలగించేందుకు అన్నది స్పష్టం. దాని మీద ఈ తరగతుల్లో వ్యక్తమైన హర్షాతిరేకాల కంటే బాధితులుగా వుంటున్న దళితులు, గిరిజనుల్లో వెల్లడైన వ్యతిరేకతను చూసి బిజెపి ఎక్కువగా భయపడింది. దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో ఓట్ల గురించి తలెత్తిన బెంగ, దాని పర్యవసానమే కోర్టులో సమీక్ష పిటీషన్‌.

బ్రిటీష్‌ వారి విభజించు పాలించు అనే సూత్రాన్ని మన పాలకవర్గం మరింతగా నవీకరించి అమలు జరుపుతోంది. ఏ తరగతికి ఆ తరగతి వారు తమ దాకా వచ్చినపుడు చూసుకుందాంలే అనే వుపేక్షాభావంతో వున్నారు. దళితులు చూపిన చొరవను గతంలో వివిధ చట్టాల సందర్భంగా అందరూ చూపి వుంటే ఇప్పుడీ పరిస్ధితి తలెత్తి వుండేది కాదు. వుదాహరణకు మహిళా రక్షణ చట్టాల విషయమే చూద్దాం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక మహిళ చట్టాన్ని వుపయోగించుకుంటే దాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తారు, అదే మన దేశంలో అయితే దుర్వినియోగంతో పాటు సదరు మహిళ చెడునడత కలదని ముద్రవేయటం సర్వసాధారణం. ఏడాది క్రితం కట్న వేధింపుల వుదంతాలలో శిక్షాస్మృతి 498ఏ కింద ఫిర్యాదులు నమోదైనపుడు వాటిని నిర్ధారించుకోకుండా అరెస్టులు చేయరాదని సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. దాని ప్రకారం ప్రతి జిల్లాలో కట్నవేధింపుల కేసుల ఫిర్యాదులను పరిశీలించేందుకు కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాల్సి వుంది. ఇప్పటికే పోలీసు వ్యవస్ధలో కొంత నీరుకారుతుంటే మరొక దొంతర తోడు చేయటమే ఇది. సమాజంలో కట్నకానుకల దురాచారం లేదా దోపిడీ గురించి తెలియని వారు లేరు. వాటికోసం మహిళలను వేధించటం జగమెరిగిన సత్యం. ఎవరైనా తెగించి ఫిర్యాదు చేస్తే చట్టాన్ని దుర్వినియోగం చేశారనే నిందతో సమాజం, పోలీసులు,కోర్టులలో లాయర్ల ప్రశ్నలతో మరో వేధింపు పర్వం ప్రారంభం అవుతుంది. అంతదాకా నిలబడిన మహిళపై చివరకు చెడునడత నింద. సహించలేక ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే వేధింపులు ఆగేందుకు ప్రయత్నం కాకుండా కుటుంబపరువు పోతుందనే పేరుతో అసలు కేసునే వెనక్కు తీసుకొనే ప్రయత్నం అటు పోలీసుల నుంచి ఇటు ఇతరుల నుంచీ జరుగుతుంది. అందుకే వరకట్న వేధింపులు, దళితులు, గిరిజనులపై అత్యాచారాలు, దాడుల కేసులు అత్యధికం విచారణ వరకు రావు, వచ్చినా శిక్షలు పడేది చాలా తక్కువగా వుంటున్నాయి. కారణం విధిలేక రాజీపడేవి కొన్నయితే బలవంతపు రాజీ,ప్రలోభాలతో నీరుగారేవి ఎన్నో. ఈ గణాంకాలను చూపే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం దుర్వినియోగమవుతున్నదని వాదించగా ప్రభుత్వమే సాధికారికంగా దుర్వినియోగం గురించి చెబుతున్నపుడు కోర్టులు అందుకు అనుగుణ్యంగా తీర్పు చెప్పకుండా ఎలా వుంటాయి? కట్నవివాదాలలో అత్తమామలను చేర్చి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనేక సందర్భాలలో కోర్టులే వ్యాఖ్యానించిన వుదంతాలు వున్నాయి. తమ కుమారుడు కోడల్ని వేధిస్తున్నాడని అత్తమామలు ఫిర్యాదు చేసిన వుదంతం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవటానికి కారణం ఏమిటి? మనది పితృస్వామిక వ్యవస్ధ ఇలాంటి వాటిలో ఏం చేసినా ఆడది అణగిమణగి వుండాలన్నది తరతరాలుగా వస్తున్న ఆధిపత్య భావజాలమే. దీని అర్ధం చట్టాలు దుర్వినియోగం అవటం లేదని కాదు. తప్పుదారి పట్టేవారు సమాజంలోని ప్రతి తరగతిలో వుంటారు. అలాంటి అనేక వుదంతాలలో గ్రామ కక్షలలో, పట్టణాలలో వివాదాలలో పావులుగా మార్చుకొని ప్రత్యర్ధులపై తప్పుడు ఫిర్యాదులు చేయించేది పెత్తందారులు, అవాంఛనీయ శక్తులే. అలాంటి వారిపై తగు చర్య తీసుకొనేందుకు అవకాశం వున్నప్పటికీ మన వ్యవస్ధలు తమ అధికారం, బాధ్యతలను దుర్వినియోగపరుస్తున్నాయి. మహిళా చట్టాన్ని నీరుగార్చినపుడే తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత వ్యక్తమై వుంటే దళితులు తమ రక్షణకోసం చేసిన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిపైనే బిజెపి సర్కార్‌ నెపం మోపే సాహసం చేసి వుండేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తప్పుడు సంకేతాల గురించి మీరు కూడా చెప్పటమా చంద్రబాబూ ? హతవిధీ !

28 Wednesday Jun 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, chandababu, dalits

ఎం కోటేశ్వరరావు

తప్పుడు సంకేతాల గురించి చెప్పిన చంద్రబాబు షేక్స్పియర్‌ ప్రఖ్యాత నాటకం జూలియస్‌ సీజర్‌లో బ్రూటస్‌ పాత్రధారిని గుర్తుకు తెచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారుల వుపాధికి, అంతకు మించి అనేక గ్రామాలను కాలుష్యానికి గురి చేసే తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీని తరలిస్తే ‘తప్పుడు’ సంకేతాలు వెళతాయి గనుక తరలించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఈ ప్రకటన ద్వారా అలాంటి హానికరమైన పరిశ్రమలను చివరకు ప్రజల పడక గదుల్లో పెట్టినా తమకు మద్దతు ఇస్తారని పౌరుల ఆరోగ్యాలు, ప్రాణాల నుంచి కూడా లాభాలు పిండుకోవాలనే పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లయింది. అందువలన తేల్చుకోవాల్సింది జనమే. చంద్రబాబుకు, అలాంటి కాలుష్యకారక, ప్రమాదకర పరిశ్రమలకు మద్దతు తెలిపే వారికి ఎలాంటి సంకేతాలు పంపాలో తేల్చుకోవాలి. ఫ్యాక్టరీని తరలించేది లేదన్న ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతల, ప్రభుత్వ యంత్రాంగ మొండి వైఖరి సంకేతాలను గత మూడు సంవత్సరాలుగా జనం చూస్తూనే వున్నారు. అయినను పోయి రావలె అమరావతికి అన్నట్లుగా ఆ ప్రాంత జనం వెళ్లారు.ఐదూళ్లు కాదు సూది మోపినంత కూడా స్ధలం ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి చంద్రబాబు ఇచ్చిన సందేశం స్వయంగా విన్నారు. ఇప్పటివరకు సాగించిన పోరాటాన్ని మరో రూపంలో సాగించటమా ఆ కాలుష్యానికి తామే గాక తమ ముందు తరాల వారిని కూడా బలి చేయటానికి ఫ్యాక్టరీ యాజమాన్యం, వారికి మద్దతు పలుకుతున్న పాలకులు, పార్టీల ముందు సాగిల పడటమా అన్నది జనం ముందున్న ప్రశ్న. ఈ సమస్య పరిష్కారానికి దగ్గర దారులు లేవు అని గ్రహించటం అవసరం.

స్వాతంత్య్ర పోరాటం మనకు అనేక అనుభవాలు నేర్పింది. తెల్లవారికి తొత్తులుగా, జనానికి నష్టం చేకూర్చే శక్తులు, వ్యక్తులకు సహాయ నిరాకరణ ఒక మార్గం. ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ప్రజల వాంఛలకు వ్యతిరేకంగా దానిలో పని చేసేందుకు ఎవరైనా వెళితే వారి గురించి ఆలోచించాల్సి వుంటుంది. మనల్ని చంపటానికి ఎవరైనా పూనుకున్నపుడు ఆత్మరక్షణ కొరకు అలాంటివారి ప్రాణాలు తీసినా అది నేరం కాదు. తుందుర్రు ఫ్యాక్టరీ కూడా అలాంటిదే అని భావించుతున్నారు నుకనే మూడున్నర సంవత్సరాలుగా అనేక అక్రమ కేసులు, జైళ్లకు వెళ్లటానికి అలవాటు పడ్డారు. లొంగిపోయి అనారోగ్యాలతో ఆ ప్రాంతంలో ఈసురో మంటూ గడిపే కంటే దూరంగా వున్న జైళ్లే నయం కదా ! అంతకంటే పాలకులు ఏం చేస్తారు. లేదా పాలకుల మద్దతు వుంది కనుక యాజమానులు గూండాలను పంపి కొంత మందిని హత్య చేయిస్తారు. వుపాధిపోయి, రోగాలపాలై, నిత్యం బతుకు భయంతో చచ్చే కంటే అది నయం. ఇతర ప్రాంతాలలో అలాంటి ఫ్యాక్టరీలు రాకుండా జనం ముందే మేలుకొనేందుకు ధృవతారలుగా మారతారు.

చంద్రబాబు వైఖరిని అర్ధం చేసుకొని తుందుర్రు ప్రాంతం వారే కాదు, ఆ జిల్లా, యావత్‌ రాష్ట్ర ప్రజలు నిరసన తెలపాల్సిన అవసరం వుంది. నిరంకుశత్వానికి బలి అయిన సందర్భంగా జనం జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ చర్యలను పట్టించుకోని పర్యవసాల గురించి ఒక జర్మన్‌ కవి రాసిన కవితను గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికుడిని కాదు కనుక పట్టించుకోలేదు

ఆ తరువాత వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు కనుక మౌనంగా వున్నారు

తరువాత నా కోసం వచ్చారు

తీరా చూస్తే నా గురించి మాట్లాడేవారు ఎవరూ లేరు

అందువలన తుందుర్రు ఫ్యాక్టరీ వలన మనకేం నష్టం అని ఎవరైనా అనుకుంటే వారి చైతన్యస్ధాయి గురించి విచారపడటం తప్ప చేసేదేమీ లేదు. ప్రతి ప్రాంతంలోనూ ఆక్వా గాకపోతే మరో ఫ్యాక్టరీ తుందుర్రు రూపంలో వస్తుంది. అయ్యో పాపం అనేవారు మిగలరు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నీరు, చెట్టు, పేరుతో అధికారపక్షం, వారితో చేతులు కలిపిన శక్తులు దళితుల భూములను తవ్వి మట్టిని డబ్బుగా మార్చుకుంటున్న , భూములను ఆక్రమించుకుంటున్న వుదంతాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా దేవరాపల్లి, గుంటూరు జిల్లా వేలూరు, గొరిజవోలు ఇలా ప్రతిఘటించిన గ్రామాలే కాదు, వెలుగులోకి రానివి, పెత్తందార్లకు భయపడి చేతులు మూడుచుకొని చేతలుడిగి కూర్చున్నవి చాలా వున్నాయి. తుందుర్రు పక్కనే వున్న గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహం పెట్టటాన్ని వ్యతిరేకించటమే గాక, ఇదేమని ప్రశ్నించిన దళితులపై సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్య తీసుకొనేందుకు చంద్రబాబు సర్కార్‌ మీన మేషాలు లెక్కించటమే కాదు, అన్యాయం అన్నవారిని అరెస్టులు చేయిస్తోంది. ఈ వైఖరి ఎలాంటి ‘సంకేతాలు, సందేశాలను ‘ పంపుతోందో తెలుగుదేశం నేతకు తెలియదనుకుంటే పొరపాటు. ఓట్ల జాతర సమయంలో ఐదువేలయినా ఇవ్వగలమని స్వయంగా చంద్రబాబే నంద్యాలలో సెలవిచ్చిన సంగతి తెలిసిందే. నిద్రపోయేవారిని లేపగలం గాని నటించేవారిని లేపటం సాధ్యం కాదు. గరగపర్రు వుదంతం గురించి తాము ఇప్పుడే మేలుకున్నట్లు, మేలుకోగానే తెలిసినట్లు అధికార పార్టీకి చెందిన దళితనేతలు కొత్త పాట పాడుతున్నారు. ఇదే సమయంలో అనేక దళిత సంస్ధలు, వ్యక్తులు ఇంతకాలంగా దళితులను చైతన్య పరిచేందుకు చేసిన యత్నాలు మరోదారి తొక్కాల్సి వుంది. దళితుల సమస్యలను దళితులే పరిష్కరించుకోవాలని, మరొకరు జోక్యం చేసుకోకూడదని, రిజర్వేషన్ల సమస్యపై చీలిపోయి గిరిగీసుకుంటే నష్టపోయేది దళితులే. ఇలాంటి పరిస్ధితులు వున్నాయి గనుకనే గ్రామాలలో పెత్తందారీ శక్తులు చెలరేగుతున్నాయి.

ఇక చంద్రబాబు స్వంత రాష్ట్రం, పొరుగు తెలంగాణా, యావత్తు దేశానికి పంపిన ‘సంకేతాలు, సందేశాలు’ ఎలాంటివో తెలిసిందే. నోట్లతో ఓట్లు, అధికారాన్ని ఎరచూపి ఫిరాయింపులు, ఫిరాయింపు చట్టాన్ని ఎలా వుల్లంఘించవచ్చో మొదలైన ఎన్నో ‘ఆదర్శనీయ’ చర్యలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజి ప్రహసనం ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణ, మహాభారతాలు, పురాణాలు, వేదాలను మించిపోతాయి. నవ్వటానికి జనానికి నోళ్లు చాలవు. తన స్నేహితుల బృందంలో వున్న బ్రూటస్‌ తన హంతకులతో చేతులు కలిపిన వైనాన్ని తెలుసుకొని హతాశుడైన జూలియస్‌ సీజర్‌ యూ టూ బ్రూస్‌ (బ్రూటస్‌ చివరికి నువ్వుకూడా !) అంటాడు. ఇందులేడని అందుకలడని సందేహము వలదు ఎందెందు చూసినా అందందు కలడు చక్రి సర్వోపగతుడున్‌ అన్నట్లు తప్పుడు సంకేతాలు, సందేశాలను పంపటంలో, అన్ని రకాల అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటంలో దేన్నీ వదలలేదని విమర్శకులు చంద్రబాబు నాయుడు గురించి చెబుతారు. అలాంటి పెద్ద మనిషి ప్రాణాంతక తుందుర్రు ఫ్యాక్టరీని తరలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని సుభాషితం చెప్పటాన్ని చూస్తే కొందరి విశ్వాసం ప్రకారం పైన వున్నాయని చెబుతున్న స్వర్గంలోనో నరకంలోనో వున్న జూలియస్‌ సీజర్‌ చివరికి చంద్రబాబూ నువ్వు కూడా సుభాషితాలు పలుకుతున్నావా అని ఆశ్చర్యపోతాడు.దీని కంటే బ్రూటస్‌ చేసిన ద్రోహం పెద్దది కాదని క్షమించేసి వుంటాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

29 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION

≈ Leave a comment

Tags

ban oncow slaughter, beef, cow, cow slaughter, Cow Vigilante Groups, dalits, Gau Rakshaks, Muslims

Image result for Gau Rakshaks, and their apologists

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అక్రమ పశువధ శాలలను మూసివేయిస్తానంటూ ప్రకటించి మారోసారి బీఫ్‌ లేదా పశుమాంసం, గో సంరక్షణ సమస్యను ముందుకు తెచ్చారు. దీన్ని కావాలని తెచ్చారా లేక ఆయన సహజత్వానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నదాని గురించి చర్చించనవసరం లేదు. చర్చ ఎటు తిరిగి ఎటు ముగిసినా పర్యవసానం ఒకటే.ఈ పూర్వరంగంలో పర్హాన్‌ రహమాన్‌ ఆనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌ పేజీలో గో సంరక్షకులకు వారి సమర్ధకులకు ఒక బహిరంగ లేఖ రాశారు. దానిలో ఆసక్తి కలిగించే అంశాలు వున్నందున పాఠకుల కోసం అనువాదాన్ని దిగువ అందచేస్తున్నాం.ఈ లేఖలోని అంశాలలో అసంబద్ధత, వక్రీకరణలువుంటే ఎవరైనా వాటిని చర్చకు పెట్టవలసిందిగా కోరుతున్నాము.

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

మార్చి 28,2017

ప్రియమైన గోరక్షకులకు

2014లో పాలకులలో వచ్చిన మార్పుతో ధైర్య భావనతో వున్న మీరు ప్రస్తుతం అధికార అలలపె సవారి చేయటాన్ని నేను అర్ధం చేసుకోగలను.ఈ ఆకస్మిక పరిణామం తెల్లవారేసరికి తయారైన రాజకీయ వాక్సూరత్వ వుత్పాదనకాదని, దీర్ఘకాలంగా అణచిపెట్టిన భావోద్వేగాల ఫలితమని కూడా నేను అర్ధం చేసుకోగలను.అనేక దశాబ్దాలుగా మీ పవిత్రమైన గోవును అపవిత్రం గావించిన, దూషించిన, హింసపెట్టిన వారిపై ప్రతీకారం చేయాలని మీరు వాంఛిస్తారు. ఇప్పటి వరకు రాజ్య రక్షణ పొందినవారికి ఒక గుణపాఠం చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనే వైపుగా వున్న మీ చర్యను నేను అర్ధం చేసుకోగలను.

మీకు బోధ చేయాలని గానీ లేదా మీ చర్యలు తగినవి కాదని గానీ చెప్పటానికి నేనీ లేఖ రాయటం లేదు.లేదా కపటత్వంతో కూడిన మీ చర్యలను హేళన చేయటానికి గానీ కాదు.అదేమంటే గోవధ సమస్యపై ఒకవైపున మీరు ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు గొడ్డు మాంస ఎగుమతులలో ప్రపంచంలో విజయవంతంగా భారత్‌ను అగ్రస్ధానంలో నిలపాలని చూస్తున్న కొత్తగా వచ్చిన ప్రభుత్వం (దానికి మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధమై వున్నారు) గులాబి విప్లవాన్ని ప్రోత్సహిస్తున్నది. మీరు కూడా నా మాదిరి వినమ్రులైన వ్యక్తులే. వుద్రేకం హేతువుపై ఆధిపత్యం చెలాయించటం ప్రారంభించినపుడు భావోద్వేగాలకు లోనవుతాము.మన శక్తిని సరైనదారిలో వుపయోగించగలిగితే అది మీకు అదే విధంగా దేశానికి ఎంతో ప్రయోజనకారి అవుతుంది.శక్తి పనిచేస్తే వుద్రేకంపై హేతువుది పైచేయి కావాలి.

Image result for Gau Rakshaks, and their apologists

నాలేఖలో కొన్ని ప్రశ్నలు వున్నాయి. వాటికి మీరు నాకు సమాధానం చెప్పనవసరం లేదుకానీ మీకు మీరు చెప్పుకోవాలి. మీ చర్యలు సరైనదారిలో వున్నాయా లేక తమ భౌతిక ప్రయోజనాల కోసం రాజకీయ, ఆర్ధిక రంగాల పెద్దలు దుర్వినియోగం చేస్తున్నారా అని మీకు మీరు హేతుబద్దంగా అలోచించండి.

మీ రోజువారీ కార్యకలాపాలతో ప్రారంభించనివ్వండి.

1.వుదయం లేవగానే మీరు వుపయోగించే టూత్‌ పేస్టు పవిత్రమైన ఆవు కొవ్వు నుంచి తీసిన గ్లిజరీన్‌తో తయారు చేసింది కాకూడదని మీరు కోరుకుంటారు. అవును గ్లిజరీన్‌ కొవ్వు నుంచి తీస్తారు. కాల్గేట్‌, క్లోజ్‌అప్‌ మరియు పియర్స్‌( లేదా ఈ విషయానికి వస్తే ఏ బ్రాండ్‌ అయినా) కేవలం మీ విశ్వాసాన్ని గౌరవించేందుకు కూరగాయ వనరులైన సోయాబీన్‌ లేదా ఆయిల్‌పామ్‌ నుంచి గ్లిజరీన్‌ తయారు చేసినట్లు చెప్పుకుంటాయి. మాంస వనరునుంచి తయారు చేసే దాని కంటే శాఖాహార వనరుల నుంచి తయారు చేసే గ్లిజరీన్‌ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని మీరు నిజంగా నమ్ముతారా?

2.మీరు వుపయోగించే షేవింగ్‌ క్రీమ్‌, సబ్బు,హెయిర్‌ క్రీమ్‌, షాంపూలు, కండిషనర్లు, మాయిశ్చరైజర్‌ తదితరాలను పవిత్రమైన ఆవు నుంచి సేకరించినవి కాదని మీరెప్పుడైనా తనిఖీ చేశారా ?పాంథనోల్‌ అమినో యాసిడ్స్‌ లేదా విటమిన్‌ బిలను జంతు లేదా చెట్ల వనరుల నుంచి సేకరిస్తారు.వాటిని వుపయోగించబోయే ముందు దయచేసి తనిఖీ చేయండి. వస్త్రాలను సాపు చేసేందుకు వుపయోగించే వాటిలో డీహైడ్రోజనేట్‌ చేసిన కొవ్వు నుంచి తీసే డై మిథైల్‌ అమోనియం క్లోరైడ్‌ వుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది?

3.మీ దంతాలను తోముకుంటారా? ఒక కప్పు టీ తాగుతారా ? అయితే కాస్త ఆగండి, మీరు వుపయోగించే పంచదారను తెల్లగా చేయటానికి ఆవు ఎముకలను వుపయోగించలేదని నిర్ధారించుకోండి.

4.మనం పొద్దునే వుపాహారం తీసుకుంటాం, ఏం కావాలని మీరు కోరుకుంటారు ?చోలేతో పూరీ, చపాతీయేనా ? మీరు వుపయోగించే అదానీ తయారు చేసే ఖాద్య తైలాలలో గొడ్డు కొవ్వు కలవలేదని నిర్ధారించుకోండి. మీ సమాచారనిమిత్తం తెలియచేస్తున్నదేమంటే కూరగాయల నుంచి ఖాద్యతైలం వనస్పతిని తయారు చేస్తున్న కంపెనీలు గొడ్డు కొవ్వును వినియోగిస్తున్నట్లు బయటపడిన తరువాత 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గొడ్డు కొవ్వు వినియోగంపై విధించిన నిషేధాన్ని 32 సంవత్సరాల తరువాత మీరు ఎన్నుకున్న దేశభక్త ప్రభుత్వం మోసపూరితంగా తొలగించింది.

5. సరే దీన్నుంచి బయటకు వద్దాం. మీకు కారు, మోటార్‌ సైకిళ్లలో దేనిని ఎంచుకుంటారు ? దయచేసి టైర్లను తనిఖీ చేయండి. గాలి వత్తిడి ఎంతవుందో చూసేందుకు కాదు. వుపరితల రాపిడిని తట్టుకొని ఆకృతి మారకుండా వుండేందుకు రబ్బరుకు సహాయపడే జంతు సంబంధిత స్టెయరిక్‌ యాసిడ్‌ను టైర్ల తయారీదార్లు వుపయోగించారో లేదో చూడండి.

6. దేన్నయినా అంటించాలనుకుంటున్నారా ? జిగురును వుపయోగించండి. అయితే మరగపెట్టిన జంతు ఎముకలు, సంధాన కణజాలము, లేదా పశువుల చర్మాల నుంచి దానిని తయారు చేయలేదని దయచేసి నిర్ధారించుకోండి. ఫెవికాల్‌ అంత గట్టిగా వుంటుంది, తెగదు.

7.ఇప్పుడు షాపింగ్‌కు వెళదాం. అయితే ప్లాస్టిక్‌ సంచులను వినియోగానికి దూరంగా వుండండి. ఎందుకని? షాపింగ్‌ బ్యాగ్స్‌తో సహా అనేక ప్లాస్టిక్స్‌ పదార్ధాలలో వత్తిడిని తగ్గించే స్లిప్‌ ఏజంట్స్‌ వుంటాయి.వాటిని దేని నుంచి తయారు చేస్తారు ? జంతు కొవ్వు నుంచి అని చెప్పనవసరం లేదనుకోండి.చమురును వుపయోగించి పోలిమర్స్‌ను తయారు చేసినప్పటికీ పదార్ధ గుణాలు, ధర్మాలను మెరుగు పరిచేందుకు జంతుసంబంధితమైన వాటిని ప్లాస్టిక్స్‌ తయారీదారులు తరచూ వుపయోగిస్తారు మరియు ముడి పోలిమర్స్‌ను ప్రాసెస్‌ చేసేందుకు కూడా వుపయోగిస్తారు.

8.దళితులు, ఆవు వ్యాపారులైన ముస్లింలపై దాడి చేసే మీ ప్రాధమిక పని గురించి చూద్దాం.దయచేసి ఆ కొట్లాటలో మీరు గాయపడకుండా చూసుకోండి. ఒకవేళ జరిగితే దయచేసి కాప్సూల్స్‌ కాకుండా టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్‌ను అడగండి. ఎందుకంటే కాప్సూల్‌ కవర్‌ మళ్లీ జంతు ప్రొటీన్‌ నుంచే తయారు చేస్తారు. మీకు కుట్లు వేయాల్సి వస్తే అందుకు వుపయోగించే దారాలు దేనితో తయారు చేసినవో దయచేసి డాక్టర్‌ను అడగండి. సాధారణంగా వాటిని పవిత్రమైన ఆవు పేగుల నుంచి తయారు చేస్తారు.

9.ఆశాభంగం చెందారా ? ఒకే ఐపిఎల్‌ మాచ్‌ చూద్దాం. అయితే ఆగండి. పరుగెట్టిస్తూ మిమ్మల్ని కట్టిపడవేసే ఆ క్రీడలో ఆవు ప్రమేయం వుందని మీకు తెలుసా ? పవిత్రమైన ఆవు. క్రికెట్‌లో వినియోగించే బంతిని కప్పి వుంచే తోలు ఆవు దూడ చర్మం నుంచి తీసిందే.

10.సరే.చలిగా వుంది. ఒక దమ్ము కొడదాం. అయితే సిగిరెట్‌ కూడా నాన్‌ వెజిటేరియన్‌ అయిపోయిందే. సిగిరెట్‌ బడ్‌లో పంది రక్తం కలుస్తుంది. అయితే ముస్లింలకు పంది అంటే ఇష్టం వుండదని తెలుసు కదా ? మీకు దానితో ఎలాంటి సమస్య లేదు. గుట్కా సంగతేమిటి? పశు చర్మాల శుద్ది తరువాత మిగిలిపోయే వక్క నుంచి సేకరించేదే గుట్కాలోని వక్క అని మీకు తెలుసా ?రెండు రూపాయల ఖరీదు చేసే పాకెట్‌ నుంచి మీరేమి ఆశిస్తారు? తాజా వక్కలా ? స్వయంగా పరిశీలించుకోండి, తయారీదారు చిరునామా కాన్పూరు, తోళ్ల పరిశ్రమ కేంద్రం, గ్రహించారా? కావాలంటే గూగుల్‌లో స్వయంగా తెలుసుకోండి.

11.సరే, వాటిని వదిలేయండి,ఎందుకంటే అవి ఆరోగ్యానికి హానికరం. అయితే మీరు ఎప్పుడైనా ఒకసారి పిల్లలకోసం ఇంటికి తీసుకు వెళ్లే జెల్లీ బీన్స్‌, కాండీ కూడా మాంసాహారమే. వాటిని జంతు ఎముకల నుంచి తయారు చేస్తారు. ఆరుద్ర పురుగుల నుంచి తయారు చేసే అద్దకపు ఎరుపు రంగుతో పాటు మహిళలు వుపయోగించే లిప్‌స్టిక్‌ కూడా జంతు కొవ్వు నుంచి తయారు చేసిందే.యగ్‌హర్టు(పెరుగు వంటి పుల్లటి తినే పదార్ధం) ఐస్‌క్రీమ్‌, కనుపాపలను తీర్చిదిద్దే క్రీములో కూడా అది వుంటుంది.

ఇలాంటి వందల వుత్పత్తుల గురించి నేను వివరించగలను.(నిజాయితీగా చెప్పాలంటే వీటిపై పరిశోధన చేసేందుకు అవసరమైన వుత్సాహ హేతువును మీరు నాకు అందించారు) కానీ నేను ఒక అంశాన్ని స్పష్టం చేయకతప్పదు. అదేమంటే మీ విశ్వాసాలను నాశనం చేస్తున్నది దళితులు, ముస్లింలు కాదు. కార్పొరేట్‌ ప్రపంచం మీ విశ్వాస వ్యవస్ధలు విముక్తి పొందలేనంత గట్టిగా బిగించి వేసింది. అందువలన కొద్దిపాటి మొత్తాలు వచ్చే సొమ్ముతో సర్దుబాటు చేసుకొని జీవించేందుకు ఆ జంతువులతో వ్యాపారం చేస్తున్నవారి మీద మీరు దాడులు చేయటం ఎందుకు ? నిజమైన వ్యాపారం చేస్తున్నది కార్పొరేట్స్‌, వారి మీద దాడి చేయటానికి మీకు ధైర్యమున్నదా ?

సరే మీరు గొడ్డు మాంసం తినటానికి వ్యతిరేకం. మీ నిత్య జీవితంలో వుపయోగించే వస్తువుల తయారీకి వుపయోగించే జంతువుల ఎముకలు, కొవ్వు, చర్మాలు తదితరాలను మీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? కాబట్టి మీరు జీవించండి, ఇతరులను జీవించనివ్వండి. అందరికీ అవకాశం వుంది. మీ మతావేశంతో ఎప్పటి నుంచో వున్న బంధాలను నాశనం చేస్తున్నారు. దేనికోసమిది?

Image result for Gau Rakshaks, and their apologists

కలసిమెలసి జీవించండి. వాక్శూరనాయకుల చేతిలో బొమ్మలుగా మారకండి.మిమ్మల్ని సైనికులుగా వాడుకొనే వారు తమ రాజకీయలక్ష్యం తీరగానే చచ్చిన ఆవును పారవేసినట్లుగానే మిమ్మల్ని కూడా వదలివేస్తారు. ఎప్పటి నుంచో వున్న బంధాలను పున:జీవింపచేయండి.మీ ఇరుగుపొరుగు లేదా మీ స్నేహితులతో సంతోషంగా వుండండి, వారు మీ సామాజికతరగతికి చెందినవారే అయి వుండనవసరం లేదు. మీ దేశ ప్రజలను ప్రేమించండి. అయితే బాణసంచాపేల్చకండి.కాలుష్యం కావాలని ఎవరూ కోరుకోరు.బాణ సంచాలో అల్యూమినియం, ఇనుము వంటి లోహాల పౌడర్‌కు కోటింగ్‌ వేసేందుకు స్టియారిక్‌ ఆసిడ్‌ను ఎక్కువగా వాడతారు. అదిఆమ్లజనీకరణను నిరోధిస్తుంది.అందుకుదోహదం చేసేవాటిని దీర్ఘకాలం నిలువవుంచుతుంది.స్టియారిక్‌ యాసిడ్‌ను దేని నుంచి తయారు చేస్తారో ఎవరైనా వూహించారా?

పర్హాన్‌ రహమాన్‌

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆవులు-దళితులు-ఓట్లు మధ్యలో తొగాడియా

15 Monday Aug 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, cows, dalits, Narendra Modi, praveen togadia, RSS, VHP, votes

Massive Dalit rally in Una, Muslims also participate, Dalits vow not to pick dead cows

దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఆగస్టు 15న గుజరాత్‌లోని వునాలో నిర్వహించిన పెద్ద బహిరంగ సభలో ఒక భాగం

సత్య

   చచ్చిన ఆవుల చర్మాలు తీస్తున్న తమపై చేస్తున్న దాడులకు నిరసనగా ఆ వృత్తికి స్వస్తి చెబుతామంటూ కళేబరాలను వదలి వేస్తున్నారు ఒకవైపు దళితులు. మరోవైపు వట్టి పోయిన వాటినే గాక పాలిచ్చే అవులను కూడా అమ్ముకోకుండా చేస్తూ నష్టపరుస్తున్నందుకు నిరసనగా  వట్టిపోయిన ఆవులను అధికార కూటమి ఎంఎల్‌ఏల ఇండ్ల ముందు వదలి వేస్తామని పంజాబ్‌ రైతులు హెచ్చరికలు జారీ చేశారు. ఆవులతో పాటు గో సంరక్షకులకు గుర్తింపు కార్డులివ్వాలని హర్యానా ఆవుల కమిషన్‌ ప్రతిపాదించింది. గోనంరక్షుల ముసుగులో దుకాణాలు తెరిచారని, ఎనభై శాతం వరకు నకిలీలున్నారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్‌ అధినేత ప్రవీణ్‌ తొగాడియా రుసురుసలాడుతున్నారు. ప్రధాని చెప్పిన సమాచారం ఎవరిచ్చారో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. సంరక్షకులను నిరాశపరిచారు, అవమానపరిచారంటూ ధ్వజమెత్తారు. కావాలంటే నా మీద దాడులు చేయండి తప్ప నా దళిత సోదరుల మీద కాదంటూ కొద్ది రోజుల క్రితం గొప్పనటన ప్రదర్శించిన నరేంద్రమోడీ సోమవారం నాడు మరొక అడుగు ముందుకు వేశారు. వేలాది సంవత్సరాల మన నాగరిక చరిత్రలో మహాభారత భీముడి నుంచి భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ వరకు మన సమాజం ఎంతో సుదీర్ఘ ప్రయాణం సాగించిందని ప్రధాని నరేంద్రమోడీ తన ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు.

    సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే దళితుల ఓట్ల వేటలో భాగంగా భీ-భీ ప్రాసకోసం పడిన పాట్లు తప్ప మరొకటి కాదు. మహాభారతం కంటే ముందుదైన రామాయణ కాలంలో నాగరికత లేదా ? ప్రధాని ప్రసంగం రాసిన వారికి ఈ మాత్రం తెలియదా అని ఎవరైనా అనుకోవచ్చు. పోనీ ప్రాసకోసం ఆ పెద్దమనిషి రాస్తే ఇన్నేండ్లుగా రామ భజన చేస్తున్న నరేంద్రమోడీకి ఆమాత్రం తెలియదా, ముందుగానే చదువుకోరా ? సలహాదారులకు కూడా తట్టలేదా ? బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా భాషలో చెప్పాలంటే మేడంటే మేడా కాదూ, రెండంటే రెండూ కాదు అన్నట్లుగా అవసరార్దం చెప్పే అనేక మాటల్లో ఇదొకటి ( జుమ్లా ). మొత్తానికి వచ్చే ఏడాది జరిగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆవులు-దళితులు- ఓట్ల రాజకీయం మహా రంజుగా నడుస్తున్నది. మధ్యలో ప్రవీణ్‌ తొగాడియా తగులుకున్నాడు.

punjab, punjab cows, punjab cow vigilantes, punjab protests, punjab gau rakshaks, punjab protests, ludhiana protests, dairy farmers protest, india news, punjab news

   ఆవు కమిషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లోని లూధియానా జిల్లా జగ్రాన్‌లో ప్రదర్శన జరుపుతుననష్ట్ర& పాడి రైతులు

    పంజాబ్‌ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం గోసేవ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ పాడి రైతుల నాశనానికి వచ్చిందంటూ దానిని రద్దు చేయాలని ప్రోగ్రెస్‌ డెయిరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. పాలిచ్చే ఆవుల వ్యాపారాన్ని కూడా దెబ్బతీసేందుకు గో సంరక్షకులు కుమ్మక్కు కావటంపై కూడా దర్యాప్తు జరపాలని పాల రైతుల అసోసియేషన్‌ అధ్యక్షుడు దల్జిత్‌ సింగ్‌ తన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గోసేవ కమిషన్‌ రూపొందించిన నిబంధనలను చూస్తే ఆవుల అమ్మకం, రవాణా అసాధ్యం అవుతుందని, గోరక్షకుల పేరుతో వున్నవారు వ్యాపారులను భయకంపితులను చేస్తున్నారని తెలిపారు. కమిషన్‌ చర్యల పట్ల నిరసనగా పంజాబ్‌లో అతి పెద్ద మార్కెట్‌ వున్న జగ్రాన్‌ పట్టణంలో వందలాది మంది పాల రైతులు, వ్యాపారులు, రవాణా సిబ్బంది గురువారం నాడు ప్రదర్శన జరిపారు. వట్టిపోయిన ఆవులను స్ధానిక శాసన సభ్యుడు ఎస్‌ ఆర్‌ కెలెర్‌ ఇంటి ముందు కట్టి వేసి వాటిని ఆయనకు బహుమానంగా ఇస్తున్నామని ప్రభుత్వం వసూలు చేస్తున్న ఆవు పన్నుతో వాటి ఆలనా పాలనా చూడాలని కోరుతూ నినాదాలు చేశారు.

   గోసేవ కమిషన్‌ నిర్వాకంతో లక్షాపాతికవేల రూపాయలున్న పశువుల ధర 50-60వేలకు పడిపోయిందని, నిరభ్యంతర పత్రం వుంటే తప్ప పశువులను కొనుగోలు చేసే అవకాశం లేనందున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారెవరూ వుండరని దీంతో రాబోయే రోజుల్లో మరింతగా ధరలు పడిపోతాయని దల్జిత్‌ సింగ్‌ చెప్పారు. గోసేవ కమిషన్‌ అండ చూసుకొని శివసేన, భజరంగదళ్‌, గోరక్షదళాల పేరుతో వున్నవారు వేధింపులకు పాల్పడుతున్నందున అసలు కమిషన్నే ఎత్తివేయాలని కోరుతున్నట్లు చెప్పారు. వేధింపుల గురించి నిర్ధిష్ట ఫిర్యాదులు చేసినా ముఖ్యమంత్రితో సహా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. బయటకు వెళ్లే అవకాశం లేని కారణంగా వట్టిపోయిన ఆవుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. గోరక్షకుల పేరుతో వున్నవారు ఆవుకు రెండు వందలు లేదా లారీకి రెండువేల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి.

     ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చిన మాదిరిగా ఆవులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని హర్యానా బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది.ఆవులతో పాటు వాటి సంరక్షకులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. గోరక్షక దళానికి పోలీసు శాఖ గుర్తింపు కూడా ఇప్పించాలని తలపెట్టినట్లు హర్యానా ఆవుల కమిషన్‌ పేర్కొన్నది. ఇప్పటికే గోరక్షక దళం పేరుతో వున్నవారు తమకు తామే గుర్తింపు కార్డులు ఇచ్చుకున్నారు. వాటికి అధికారిక ముద్ర వేయనున్నారు. హర్యానాలో దళితుల రక్షణకు ప్రత్యేక అధికారి లేరు గానీ గోవుల రక్షణ విభాగానికి ఐజి స్ధాయి అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆవుల సంరక్షణకు 2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఒక కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.దానికి ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాం మంగ్లా అధ్యక్షుడిగా వున్నారు. గోవుల రక్షణ విభాగం ఐజి భారతీ అరోరా మాట్లాడుతూ కొందరు దున్నలు, బర్రెల రవాణాను కూడా అడ్డుకొని డబ్బు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. ఎక్కువ మంది అత్యుత్సాహంతో, ఆవేశంతో వున్నారని చెప్పారు. గుర్తింపు కార్డుల గురించి చెబుతూ కొన్ని గోరక్షక దళాలు నిజమైనవే అయినప్పటికీ ఎక్కువభాగం కాదని అందువలన గుర్తింపు కార్డులు ఇవ్వదలచుకుంటే పోలీసు తనిఖీ తరువాత జారీ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఎలాంటి గుర్తింపు లేకుండానే దాడులకు పాల్పడుతున్న ఈ శక్తులకు నిజంగానే అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వటం మంటే వారు చేస్తున్న బలవంతపు వసూళ్లకు చట్టబద్దత కల్పించటం తప్ప మరొకటి కాజాలదు.

    విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ప్రవీణ్‌ తొగాడియా-నరేంద్రమోడీ గుజరాత్‌లో సంఘపరివార్‌కు జంట నాయకులుగా పని చేసిన చరిత్ర వుంది. గో రక్షకులలో 80శాతం నకిలీలేనని ప్రధాని వ్యాఖ్యానించటం ద్వారా వారిని అవమానించారని, వేధింపులకు గురిచేయటమేనని తొగాడియా ధ్వజమెత్తారు. దళితుల ఓట్లకు దెబ్బతగుల కుండా చూసేందుకు ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి దిగిన నేపధ్యంలో గో రక్షకులందరూ నిజాయితీపరులేనని తొగాడియా కితాబు నివ్వటం గమనించాల్సిన అంశం. ఒకరు పిర్ర గిల్లితే మరొకరు జోల పాడటం అంటే ఇదే. ప్రధాని వ్యాఖ్యలతో సాధు, సంతులు విలపిస్తున్నందున తాను మాట్లాడక తప్పటం లేదని తొగాడియా చెప్పారు.దళితులపై దాడులకు గో సంరక్షణకు ముడి పెట్టటం హిందూ సమాజాన్ని చీల్చేందుకు ఒక కుట్ర అని ఆరోపించారు.

    ఇలా అయితే మన దేశంలో ఆవులు అంతరిస్తాయని బీహార్‌కు చెందిన 92 ఏండ్ల మహిళ అన్నారని, మీరు మౌనంగా ఎందుకున్నారని లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ప్రశ్నించారని తొగాడియా చెప్పారు. ‘మీకు(ప్రధాన మంత్రి) ఎనభైశాతం మంది గోరక్షకులు నేరగాళ్లు, మోసగాళ్లు మరియు పాపులు ఎందుకంటే వారంతా హిందువులు కనుక ‘ అని తొగాడియా వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ ‘ ప్రధాన మంత్రి గారూ మీరు గో సంరక్షకుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. దానికి ఆధారం ఎక్కడ ? మీ దగ్గర వుంటే దయచేసి బయట పెట్టండి, ఆవులు కటిక వారి చేతిలో వధ అవుతున్నాయి మీరు ఎక్కువ భాగం ప్లాస్టిక్‌ తిన్న కారణంగా మరణిస్తున్నట్లు చెప్పారు. కటిక వారి తీవ్రమైన నేరాన్ని మాఫీ చేశారు, ప్రధాన మంత్రి అబద్దాలు చెబుతున్నారని చెప్పాలని నేను కోరుకోవటం లేదు, ఎందుకంటే ఆయన నాకూ ప్రధానే, అయితే ఆయన ప్రసంగం తరువాత నేను అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాను, వారిలో ఏ ఒక్కరూ కూడా అలాంటి సమాచారం ఆయనకు ఇచ్చామని నాకు చెప్పలేదు. కాబట్టి ఆయనకున్న సమాచార వనరు ఏమిటో బయట పెట్టాల్సిన బాధ్యత ప్రధానిదే ‘అన్నారు. ప్రధాని ప్రకటనను ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించిన తరువాత మీరు ఇలా మాట్లాడటం ఏమిటి అన్న ప్రశ్నకు ‘నేను ఎంతో బాధ్యతా యుతంగా మాట్లాడానని ‘ అని మాత్రమే జవాబిచ్చిన తొగాడియా నరేంద్రమోడీ తన బాల్య స్నేహితుడు అని కూడా వెల్లడించారు. (అయితే ఇద్దరూ కలిసి టీ అమ్మారా అని అడగకండి, మోడీ కంటే ఆరు సంవత్సరాలు చిన్న అయిన తొగాడియా క్యాన్సర్‌ వైద్య నిపుణుడు) ఆవుల వధ, దొంగరవాణా నిరోధం, గొడ్డు మాంస ఎగుమతుల నిరోధం గురిచి ప్రధాని కార్యాలయంలో రోజంతా పనిచేసే సహాయ కేంద్రాన్ని ప్రారంభించినపుడు తాను చేసిన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్రమోడీ వుపసంహరించుకోవాలని కూడా తొగాడియా డిమాండ్‌ చేశారు.దేశమంతటా గోవధను నిషేధిస్తానని వాగ్దానం చేసిన ప్రధాని దానిని నిలుపుకోకుండా గోరక్షకులపై విరుచుకుపడి లక్షలాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచారు. బగోవధను ఆపమని ఒక సలహా ఇస్తారని అనుకున్నాం కానీ ప్రధానీ మీరు హృదయాలను గాయపరిచారు… మన గోవులను మనం రక్షించుకోలేకపోతే ఇంక ఆత్మహత్యలు చేసుకోవటం మంచిది, ఇంతటి అవమానం గతంలో ఎన్నడూ జరగలేదని గోరక్షకులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారికి మద్దతుగా గోరక్షకులు, వారి కుటుంబాలు నిలబడాలని తొగాడియా పిలుపునిచ్చారు.

     నిజానికి తొగాడియా విమర్శలు, నరేంద్రమోడీ హెచ్చరికలు రెండూ కూడా లాలూచీ కుస్తీ తప్ప వేరు కాదు. ఎందుకంటే అటు దళితులు ఓట్లతో పాటు వెర్రెక్కిన మతశక్తులు కూడా వారికి అవసరమే కదా ! ఈ కారణంగానే తొగాడియా వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. బిజెపి జాతీయ ప్రతినిధి సిద్ధార్ధ నాధ్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రధాని ఏం చెప్పారో దేశం దాన్నే అనుసరించాలి అని ముక్తసరిగా వ్యాఖ్యానించారు. సంఘపరివార్‌లో ప్రవీణ్‌ తొగాడియా సాదా సీదా కార్యకర్తేమీ కాదు, ఆయన చేసిన తీవ్ర విమర్శలకు నరేంద్రమోడీ లేదా ఆయన అంతరంగంగా పరిగణించబడే నాయకులైనా స్పందింకపోతే నరేంద్రమోడీ అబద్దాల కోరుగా మిగిలిపోతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: