• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Hinduism

తాలిబాన్లు వద్దు – తాలిబానిజం ముద్దు ! మరోసారి ముందుకు వచ్చిన మనువాద చర్చ !!

22 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, BJP, Hindu Fundamentalism, Hinduism, Manu Statue, Manusmriti, RSS, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్‌ఎస్‌ఎస్‌ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్‌ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్‌ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.


మధ్య ప్రదేశ్‌లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్‌ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్‌ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్‌ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్‌ రహమాన్‌ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్‌ఏ అరుణ్‌ చంద్ర భౌమిక్‌ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్‌ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, ఇండోనేషియా, పాకిస్తాన్‌, ఈజిప్టు, ఎమెన్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్‌, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.


ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.


ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విస్‌ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్‌ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?


మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్‌ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.


కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్గనైజర్‌ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.

ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్‌ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్‌ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్‌ ముందుకు వచ్చినపుడు బెంగాల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్‌ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.


మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్‌, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్‌ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్‌ జుడీషియల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్‌ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్‌ బెంచ్‌ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొన్ని ఆలోచనలు-ఒక అవలోకన !

28 Friday Jul 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, Opinion, RELIGION, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

BR Ambedkar, caste discrimination, caste system, cristianity, Hinduism, Hinduthwa, Indian conistitution, manuvadam, RELIGION, Rule of reservations, scheduled castes

ఎం కోటేశ్వరరావు

2017 జూలై 28వ తేదీ ప్రజాశక్తిలో అరుణ గోగులమండ గారు ఆలోచనలు కలిగించటమే నా లక్ష్యం అని ముందే ప్రకటించుకొని కొన్ని ఆలోచనల పేరుతో కొన్ని అంశాలను పాఠకుల ముందుంచారు.http://www.prajasakti.com/Article/Prajagalam/1949493 అసలు బుర్రలకు పని పెట్టటమే మరచిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రయత్నం చేయటం అభినందనీయం. వాటిపై అవలోకన గురించి కూడా ఆలోచించాలని మనవి.

ప్రపంచంలో అనేక ఆలోచనా విధానాలున్నాయి. నూరు పువ్వులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న లోకోక్తి తెలిసిందే. దళితుల పట్ల సామాజిక వివక్షను అంతం చేసేందుకు, వారిని దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు అంబేద్కర్‌ ఆలోచనా విధానమొక్కటే చాలదు, అందువలన సకల పీడితుల విముక్తికి చెబుతున్న ఇతర ఆలోచనా విధానాలను కూడా ప్రజల్లోకి వీలైనంతగా చేరవెయ్యాలేమో ?

మన విధి(డెస్టినీ)ని మనమే నిర్ణయించుకోవాలి అని చెప్పారు. ఇది సాధారణ అర్ధంలో అయితే అభ్యంతరం, ఇబ్బంది లేదు. దళితుల విధిని దళితులే నిర్ణయించుకోవాలి అనే ఒక పరిధి అర్ధంలో అయితే ఆలోచనలకు అడ్డుకట్ట వేయటమే. సంపదలకు మూలమైన వారిలో దళితులు కూడా ఒక భాగమే తప్ప దళితులే సర్వస్వం కాదు. సామాజికంగా వివక్ష లేకపోవటం లేదా అంత తీవ్రంగా లేకపోవచ్చు గాని దళితేతర కులాల్లోని పేదలందరూ సంపదలకు మూలమైన వారిలో భాగమే. సంఖ్యాపరంగా చూస్తే దోపిడీకి గురవుతున్నవారిలో వారే అధికులు. మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న కులాల్లో కూడా దళితులతో కలసి గని,వని,ఖార్ఖానాలో పని చేసే వారు వున్నారు. వారికి వూరడింపు సామాజిక వివక్ష లేకపోవటం, వూరి మధ్యలో కూడా వుండనివ్వటం తప్ప మిగతా వన్నీ సేమ్‌ టు సేమ్‌. అరుణగారు చెప్పినట్లు ఆధిపత్య కులాల ఫ్యాక్టరీలు, గనులు, పొలాల్లో పని చేసే దళితులే కాదు, ఆధిపత్య కులాల్లోని పేదలు కూడా తమకూ హక్కులున్నాయన్న సంగతే తెలియక బలౌతూనే వున్నారా లేదా ? దళిత కులానికి చెందిన వారు కూడా పెట్టుబడిదారులుగా వున్నారు. వారి సంస్ధలలో దళితుల పరిస్ధితి ఏమైనా మెరుగ్గా వుందా? సామాజిక వివక్ష తప్ప దోపిడీ సేమ్‌ టు సేమ్‌ కాదా ?

ఆధిపత్య వాదులందరికీ కుల గోడలను కూల్చటం సుతరామూ ఇష్టం లేదన్నారు. కులాల హెచ్చు తగ్గుల వల్ల వచ్చే ఆడంబరాలను, ఐశ్వర్యాలను ఎప్పటికీ వారే అనుభవించాలనే దుర్బుద్ధి అందుకు కారణం అని అరుణగారు చెప్పారు. కులాన్ని బట్టి ఐశ్వర్యాలు వచ్చి వుంటే స్వాతంత్య్రానికి ముందు తెలంగాణా, ఆంధ్రా ప్రాంతంలో వేలు, లక్షల యకరాలపై ఆధిపత్యం కలిగిన భూస్వాములు, జాగీర్దార్లు, దేశ ముఖులు, జమిందార్లు కేవలం వేళ్లమీద లెక్కించదగిన వారు మాత్రమే ఎందుకున్నారు.ఆ కులాలో పుట్టిన వారందరికీ అదే మాదిరి సంపదలు ఎందుకు దక్కలేదు. దొరలు, జమిందార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారితో కలసి అదే ఆధిపత్య కులాలకు చెందిన వారు ఎందుకు పోరాడినట్లు ? అలా పోరాడిన వారిలో ఆధిపత్య కులాలని పిలిచే వాటిలో వారి ప్రమేయం లేకుండా పుట్టిన ఎందరో భూస్వామిక కుటుంబాలకు చెందిన వారు కూడా వున్నారు. అలాగే క్రైస్తవం, ఇస్లాం ఇతర మతాలు మెజారిటీగా వున్న దేశాలలో ఆ మతాలలోని కొద్ది మందే దేశాలను సైతం శాసించగలిగిన కార్పొరేట్‌ సంస్ధల అధిపతులుగా వుండగా మెజారిటీ పౌరులు వాటిలో పని చేసే కార్మికులు, లేదా వుద్యోగులుగా ఎందుకున్నారు. రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఆధిపత్యం వహించింది క్రైస్తవులు, వారిని కూల్చి వేసిందీ క్రైస్తవులే కదా ? అంతెందుకు క్రైస్తవుడైన హిట్లర్‌ ఫాసిస్టుగా మారితే వాడిని సమర్ధించింది ఎవరు, వాడిని, వాడి ముష్కర మూకలను హతమార్చింది ఎవరు ? క్రైస్తవులే కదా ? అందువలన అరుణ గారు, ఆమె మాదిరి అభిప్రాయం కలిగిన వారందరూ కుల, మత పరిధి దాటి ఆలోచించటం అవసరం.

సామాజిక వివక్షకు గురవుతున్న కులాల జాబితాల్లో వున్నవారికి రిజర్వేషన్లు ఇస్తూ వారు మతం మారితే రద్దు చేయటం అన్యాయం అనటంలో ఎలాంటి పేచీ లేదు. ఎందుకంటే మతం మారినా వారి సామాజిక స్ధితిలో మార్పుండటం లేదు. కానీ అరుణగారు క్రైస్తవం పుచ్చుకున్న ఆధిపత్య కులాల వారు కూడా తమ కులం కోల్పోయి దళితులుగా మారిపోవాలి కదా అంటున్నారు. మతం మారినా దళితుల రిజర్వేషన్లు కొనసాగాలి, కుల విభజన గోడలు కూలిపోవాలని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఇలాంటి వాదనలు చేయటం గందరగోళ ఆలోచనకు నిదర్శనం. ఇక్కడ క్రైస్తవం దళితుల మతం కాదని గ్రహించటం అవసరం. హిందూమతంలో శైవులు, వైష్ణవులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి వివిధ తాత్విక విభజనలు వున్నట్లే ఇస్లాం, క్రైస్తవంలో కూడా ప్రబోధకులను బట్టి కొన్ని రకాల విభజనలు వున్నాయి తప్ప కులాల ప్రస్తావన, విభజన లేదు.

దళితుల సాధికారత కోసం, రిజర్వేషన్ల కల్పనలో అంబేద్కర్‌ చేసిన కృషిని ఎవరైనా తక్కువ చేసే చూస్తే అది పాక్షిక దృష్టి తప్ప వేరు కాదు. అనేక మంది రిజర్వేషన్లు అనే భావన అంబేద్కర్‌తోనే ప్రారంభమైందనే అభిప్రాయంతో వున్నారు. ఇది కూడా పాక్షిక దృష్టే. అంబేద్కర్‌ కంటే ముందే కొల్లాపూర్‌ సంస్ధాన అధిపతి సాహు మహరాజ్‌ 1882,1891లోనే బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారు. తరువాత కాలంలో అంబేద్కర్‌ మరింత నిర్ధిష్టంగా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుతో సహా అనేక ప్రతిపాదనలపై కృషి చేశారు. దళితులు మతం మారితే వెనుకబడిన తరగతిగా పరిగణించబడటానికి కూడా ఆ అంబేద్కర్‌ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగమే వీలు కల్పించిందని గుర్తించటం అవసరం. ఇదొక సంక్లిష్ట సమస్య. అందువలన ఆరుణగారు చెబుతున్నట్లు అది కుట్రే అయితే అందుకు వీలు కల్పించిన అంశాలేమిటి ? రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దమే అయినప్పటికీ అవి శాశ్వతం కాదు, అంబేద్కర్‌ కూడా రిజర్వేషన్లును పది సంవత్సరాలు అమలు చేసిన సమీక్షించి మరో పదిసంవత్సరాలు పొడిగించమని చెప్పారు తప్ప శాశ్వతంగా వుంచాలని అభిప్రాయపడలేదు. అందువలనే ఎంతకాలమనే ప్రశ్న పదే పదే తలెత్తుతున్నది. సామాజిక వివక్ష అంతమయ్యే వరకు వాటిని కొనసాగించాలనటం న్యాయబద్దం. ఎంత త్వరగా దానిని అంతం చేస్తే అంత త్వరగా రిజర్వేషన్లను ముగించ వచ్చు.

ఇక మతం మారిన హిందూ దళితులకు రిజర్వేషన్లు వర్తించపోవటం సమస్య. దీన్ని కుట్రగా అభివర్ణించవచ్చునా ? రాజ్యాంగం అమలులోకి రాకముందే దీనిపై చర్చ జరిగింది. సిక్కు మతంలో కూడా దళితులు వున్నందున వారికి కూడా హిందూ దళితులకు వర్తించే సౌకర్యాలను వర్తింప చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. సిక్కు మతంలోకి మారేందుకు ఎవరూ ఎవనీ బలవంత పెట్టలేదని, సిక్కు మతం అంటరాని తనాన్ని గుర్తించలేదని, అందువలన సిక్కు మతాన్ని అవలంభించాలంటే రిజర్వేషన్లు వదులు కోవాలి, రిజర్వేషన్లు కావాలంటే సిక్కు మతాన్ని వదులుకోవాల్సి వుంటుందన్న వాదనలు వచ్చాయి. క్రైస్తవం, ఇస్లాం కూడా అలాంటివే. అవేవీ అంటరానితనాన్ని గుర్తించలేదు. అందువలన రిజర్వేషన్‌ అవసరం లేదనుకున్న వారు హిందూ మతం నుంచి మారవచ్చు లేదా కావాలనుకున్నవారు అదే మతంలో వుండాలన్నది లాజిక్కు. అయితే మతం మారినా వివక్ష కొనసాగుతున్నందున వారికి కూడా హిందూ దళిత రిజర్వేషన్లే అమలు జరపాలన్న వాదన ముందుకు వచ్చిందని గమనించాలి. అందువలన ఆలోచనకు చర్చ పెట్టే ముందు పూర్వపరాలను కూడా సమగ్రంగా వివరించకపోయినా ప్రస్తావించటం అవసరం? కాదంటారా ?

కుల వివక్ష, అంటరానితనం వంటి మాయని మచ్చలను సహించిందీ, అమలు జరిపిందీ హిందూమతం లేదా దాని పరిరక్షకులమని చెప్పుకొనే వారు. దానికి ప్రాతిపదిక మనువాదం. ఇప్పటికీ దానిలో ఎలాంటి సంస్కరణలు లేవు. అందువలన హిందూమతంలో వుండాలా లేదా అన్నది ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన అంశం. మతం అన్నది మత్తు మందు. అది ఏమతానికైనా వర్తించే సాధారణ సూత్రం. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని చూసేవారు, మత విభజనతో సమాజాన్ని వెనక్కు తిప్పాలని చూసే వారు అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా సమాజానికి వ్యతిరేకులే. ప్రతి మతం తన మత్తు మందును తీసుకొనే జనాలు తగ్గకుండా చూసుకోవాలని చూస్తుంది. రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని హిందూమత శక్తులు దళితుల మతమార్పిడికి ఎలా అడ్డంపడుతున్నాయో, మతం మారినా దళితులకు రిజర్వేషన్లు అమలు జరపాలని క్రైస్తవమత శక్తులు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవటానికి చూస్తున్నాయి.

చివరిగా ఒక్క మాట. దళితుల అభ్యున్నతికి అంబేద్కర్‌ కృషి అమోఘం. ఇదే సమయంలో ఆయన ఆధ్వర్యాన ఏర్పాటయిన రాజ్యాంగం దళితుల సమస్యలకు జిందా తిలిస్మాత్‌ కాదని ఇప్పటికే రుజువైంది. స్వాతంత్య్రవుద్యమ ఆకాంక్షలను ఇంతవరకు అమలు జరపలేదు, అనేకానికి తూట్లు పొడిచారు. అందువలన ఈ రాజ్యాంగం జనానికి, ప్రత్యేకించి దళితులకు కల్పించిన రక్షణలను కాపాడుకొంటూనే వారితో పాటు ఇతర కష్టజీవుల విముక్తికి అవసరమైన ఆలోచనలు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెజావర్‌ మఠం- ఇప్తార్‌ విందు-హిందూ మతవాదుల వంచన !

29 Thursday Jun 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

buddism, Hinduism, hindutva, iftar, Iftar At The Pejawar Mutt, Islam, Pejawar Mutt, sankaracharya

ఎం కోటేశ్వరరావు

ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుంది అన్న నాజీ గోబెల్స్‌ జర్మనీలో అదేపని చేశాడు. వాడి నాయకుడైన హిట్లర్‌ జర్మనీ ఔన్నత్యాన్ని పునరుద్ధరించే పేరుతో జర్మనీలో, ప్రపంచంలో ఎంతటి మారణకాండకు కారకుడయ్యాడో తెలిసిందే. ప్రపంచమంతా అసహ్యించుకోవటంతో జర్మన్లు హిట్లర్‌ పేరును వుచ్చరించటానికే ఇష్టపడరు. చెప్పాల్సి వస్తే ఆ కుక్క అన్నట్లుగా సంబోధిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి శక్తులు తామరతంపరగా పెరుగుతున్నాయి. వారిని ఎలా సంబోధించాలో వాటి దుష్ఫలితాన్ని అనుభవించబోయే తరాల నిర్ణయానికి వదలివేద్దాం.

ఏ మతాన్ని అవలంభించాలో, మత రహితంగా వుండాలో నిర్ణయించుకొనే హక్కు ఎవరికైనా వుంటుంది. ఇక్కడ పుట్టావుగనుక హిందువుగానే వుండాలనే నిరంకుశ భావం పెరుగుతోంది కనుకనే సమస్య వస్తోంది. సహజంగానే తాము నమ్మిన మతం గొప్పతనం గురించి చెప్పుకోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇబ్బంది లేదు. తమ మతానికి లేని గొప్పలను ఆపాదించి, ఇతర మతాలను ద్వేషించే వున్మాదానికి గురైతే మాత్రం సహించకూడదు. ప్రపంచంలో అనేక అభూతకల్పనలు, అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చారు. వాటంతటవే పుట్టవు. హిందూ మతం సహనశీలి, హిందువులకు సహనం పుట్టుకతో వస్తుంది అన్నది అలాంటి వాటిలో పెద్దది.

కర్ణాటక వుడిపిలోని పెజావర్‌ మఠాధిపతి శ్రీ విశ్వేష తీర్ధ స్వామీజీ రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు మఠ ప్రాంగణంలో ఇప్తార్‌ విందు ఏర్పాటు, వారి ప్రార్ధనలకు అనుమతివ్వటం మతోన్మాద శక్తులకు మింగుడుపడటం లేదు. అది హిందూమత గొప్పతనానికి చిహ్నం అంటూనే కొందరు ఇతర మతాలకు లేని సహనం మనకెందుకు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి కొందరు మింగలేక కక్క లేక తేలు కుట్టిన దొంగల మాదిరి వున్నారు. వుమ్మెత్త కాయలు తిన్నవారు ఆ చర్య హిందూమతానికి అవమానం అంటున్నారనుకోండి. ముస్లింలను మఠానికి ఆహ్వానించటం, వారికి భోజనం పెట్టటాన్ని ఒక సమస్యగా చేయవద్దని, ఇదేమీ కొత్తగా జరిగింది కాదని ఆ స్వామీజీ తన చర్యను సమర్ధించుకున్నారు. మఠంలో అందరికీ భోజనాలు పెడతారు, ఈసారి ప్రత్యేకతేమంటే నేనే ముస్లింలను ఆహ్వానించాను అని స్పష్టం చేశారు. అన్ని సందర్భాలలో తనకు వారు సహకరించారని, మఠానికి మద్దతుగా నిలిచారని చెప్పారు. భక్తల్‌,గంగావతి వంటి చోట్ల ముస్లింలు తమ ఇండ్లకు తనను ఆహ్వానించటంతో పాటు మసీదుల ప్రారంభానికి పిలిచారని కూడా చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ప్రార్ధనలను ఎలా అనుమతించారన్న ప్రశ్నకు ముస్లింలు తమ దేవుడిని ప్రార్ధించేందుకు నమాజ్‌ చేశారు, దానిలో హిందూమతాన్ని కించపరచలేదన్నారు. గొడ్డు మాంసం తినేవారిని ఎలా ఆహ్వానించారన్న ప్రశ్నకు ముస్లింలే కాదు అనేక మంది హిందువులు గొడ్డు మాంసం తినటం లేదా అని ఎదురు ప్రశ్నించి హిందువులైనా ముస్లింలనైనా గొడ్డు మాంసం తినవద్దని శాంతియుత పద్దతులలో ఒప్పించాలని అన్నారు.

ఇతర సందర్భాలలో ముఖ్యంగా దళితుల పట్ల, బ్రాహ్మణులకు ప్రత్యేక పంక్తులు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టటం వంటి విషయాలలో పెజావర్‌ మఠనిర్వాహకుల వైఖరిని సమర్ధించకూడదు కానీ ప్రస్తుతం దేశంలో వున్న పరిస్ధితులలో హిందూ మతోన్మాదులు రెచ్చిపోతారని తెలిసి కూడా ఇప్తార్‌ విందు ఇవ్వటం, ప్రాంగణంలో ప్రార్ధనలను అనుమతించటం అభినందనీయమే. ఇదే సమయంలో ఈ చర్యను సమర్ధిస్తున్నట్లు కనిపిస్తూ కొందరు చేస్తున్న వాదనలు, ప్రచారాన్ని ఎండగట్టక తప్పదు.

ముఖం మీదే పచ్చబొట్టు పొడిపించుకొని ప్రదర్శించుకున్నట్లు ఏ మాత్రం సిగ్గుపడకుండా తాము భారతీయ మితవాదులమని రాసుకొనే ‘స్వరాజ్య’ పత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ ఆర్‌ జగన్నాధన్‌ సదరు మఠ స్వామీజీ తానేమిటో, ఎటువైపో తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు ‘ కులంతో సహా హిందూయిజంలో అనేక బేధాలున్నాయి. దౌర్జన్యపూర్వక మతమార్పిడి అజెండాలతో వున్న చర్చి, మసీదులతో సహా అనేకం నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిపై కేంద్రీకరించి, హిందూయిజాన్ని అంతర్గతంగా పట్టిష్టపరచటమా లేక తన లౌకికవాదాన్ని ప్రదర్శించేందుకు మసీదులను ప్రారంభించటమో తేల్చుకోవాలి’ అంటూ ఎద్దేవా చేస్తూ తన వ్యాసాన్ని ప్రారంభించారు. ఇస్లాం, క్రైస్తవం ఇతర విశ్వాసాలలోని నిజాన్ని అంగీకరించవని, హిందూమతం దేవుళ్లను నమ్మటాన్ని నమ్మకపోవటాన్ని కూడా అంగీకరించే వుదారత్వం కలిగి వుందని, స్వామీజీ మసీదులకు వెళ్లి భగవద్గీత, వేదాలను చదవటాన్ని అంగీకరిస్తే అది ముస్లిం సమాజపు వుదారత్వానికి చిహ్నం అవుతుందని, ఒక్కరిని అయినా హిందూమతంలోకి మార్చగలిగితే స్వామీజి పెద్ద విజయం సాధించినట్లేనని ఎద్దేవా చేశారు. ఇంకా తన పాండిత్యాన్నంతటినీ ప్రదర్శించి స్వామీజీని హిందూమతావలంబకుల ముందు దోషిగా నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డారు.

హిందూ మత పునరుద్ధరణ, దాని పెత్తనాన్ని రుద్దాలనే శక్తులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. అందుకు సామాజిక మీడియాను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇతర అన్ని వనరులను వాడుకుంటున్నాయి. ఏ మతమైనా సామాన్యులకు దూరమైందంటే దానిలోని తిరోగామి లక్షణాలే కారణం. ఒకవైపు హిందూమత పెత్తన పునరుద్ధరణకు కొందరు పూనుకుంటే దానిలోని తిరోగామి ధోరణులను, కులాల కుంపట్లను సజీవంగా వుంచే ధోరణులు కూడా సమాజంలో పెరుగుతున్నాయి.మన దేశానికే పరిమితం కాకుండా ఏ దేశం వెళితే ఆ దేశానికి కూడా కుల గజ్జి, మతోన్మాదాన్ని తీసుకుపోతున్నారు. ఇంతకాలంగా ఇతర మతాలవారితో సంబంధాలను వ్యతిరేకించిన ఫ్యూడల్‌ శక్తులు ఇప్పుడు కుల, కుటుంబ మర్యాదలను కాపాడే పేరుతో హిందూ మతంలోని అంతర కుల వివాహాలను అంగీకరించటం లేదు. ఎవరైనా ముందడుగేస్తే అలాంటి యువతీ యువకులను అత్యంత కిరాతకంగా చంపివేస్తున్న దుర్మార్గ పరిస్ధితులు నేడున్నాయి. ఒక ముస్లిం, క్రైస్తవుడు మతం మారితే హిందూ మతంలో వారికి ఏ కులాన్ని కేటాయిస్తారు? అన్న చిన్న ప్రశ్నకు ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు. ఇంకా ఇలాంటివే ఎన్నో వున్నాయి.

పెజావర్‌ స్వామీజీ ముస్లింలను మఠానికి పిలిచి వుపవాస దీక్ష విరమణ తరువాత భోజనం లేదా పండ్లు పలహారాలు పెట్టారు. దాన్ని ముస్లింలు ఇప్తార్‌ అంటారు. గొడ్డు మాంసం పెట్టలేదు. హలీం రుచి చూపించలేదు. మఠ ప్రాంగణంలో అల్లా గురించి ప్రార్ధన చేసుకోమన్నారు తప్ప ఖురాన్‌ పఠనం చేయించలేదు. ఈ మాత్రం కూడా సహించని మతోన్మాదులు నిజంగా గొడ్డుమాంసం, ఖురాన్‌ పఠనాన్ని అనుమతిస్తే స్వామీజీని ఏం చేసి వుండేవారో ?

ఇతర మతాలకు లేదని, తమకు మాత్రమే వుదారత్వం వుందని చెప్పుకొనే హిందూత్వ వాదులు దాన్ని రుజువు చేసుకోవాలంటే దేవాలయాల్లో బైబిలు, ఖురాన్‌ పఠనాలను అనుమతించిన తరువాత భగవద్గీత గురించి ఆ మతాల వారికి, ఇతరులకు అడ్డు సవాళ్లు విసరాలి. ఒక మత ప్రార్ధనలు, ప్రవచనాలు మరొక మత కేంద్రం నుంచి చేయటం లేదనే చిన్న సాంకేతికాంశం తప్ప ఆచరణలో జరుగుతున్నదేమిటి ? పొద్దున లేస్తే రాత్రి పొద్దు పోయే వరకు, దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి చెవులు చిల్లులు పడేలా వినిపించే వాటిని, వీధుల్లో చేసే భజనలు, ఇతర హంగామాలను అన్ని మతాల వారు, మతాలను విశ్వసించని వారు కూడా సహించటం లేదా ? దేవాలయాల నుంచి వినిపించేవి మసీదులు, చర్చీలలో వుండేవారికి వినిపించటం లేదా, వారివి వీరికి వినిపించటం లేదా ? ఈ గోల భరించలేకపోతున్నామని మొత్తుకొనే అన్ని మతాలకు చెందిన రోగులు, చెప్పలేని పసి పిల్లలు, ఇతర సమస్యలున్న వారి గోడు ఏ ప్రార్ధనా స్ధలమైనా, మతమైనా పట్టించుకొంటోందా ? మైకుల సౌండ్‌ తగ్గిస్తోందా ? ఎందుకీ ఆత్మవంచన? ఓట్ల కోసం గతంలో ఒక రాజకీయం నడిస్తే ఇప్పుడు సులభంగా ఓటు బ్యాంకులు ఏర్పాటు చేసుకొనేందుకు మత రాజకీయాలను ముందుకు తెస్తున్నారు తప్ప ప్రస్తుతం జనానికి కావాల్సింది మతమా ? మానవత్వమా, గౌరవప్రదమైన జీవనమా ?

ఇక హిందూమత విశాల, వుదారత్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అనేక మంది మన దేశంలో మసీదులు, చర్చిల నిర్మాణాల గురించి చెబుతారు. వాటికి వెళ్లే జనాభా పదుల కోట్లలో వున్నారు. కొన్ని లక్షల మంది హిందువులు నివశించే లేదా పనులకోసం వలస వెళ్లే పశ్చిమాసియా , ఐరోపా, అమెరికాలలో హిందూ దేవాలయాల నిర్మాణాలను అక్కడ కూడా అనుమతిస్తూనే వున్నారుగా అది విశాల, వుదారత్వం కాదా ? http://www.catchnews.com/world-news/west-asia-temples-hindu-1439789867.html బౌద్దమతాన్ని అవలంభించే తూర్పు ఆసియా, ఇస్లాం దేశమైన ఇండోనేషియాలో పురాతన హిందూ దేవాలయాలు ఇప్పటికీ భద్రంగానే వున్నాయిగా ! అది ఆయా దేశాల మెజారిటీ మతాల విశాల వైఖరికి చిహ్నం కాదా ?

ఎంతో విశాలమైనది అని చెప్పుకొనే మన దేశ చరిత్రను చూస్తే అనేక జైన, బౌద్ధ ఆలయాలను శైవ, వైష్ణవ దేవాలయాలుగా మార్చిన విశాల వైఖరి మనకు కనిపిస్తూనే వుంది.మన కళ్ల ముందే బాబరీ మసీదును కూల్చిన వుదారత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు.http://bapumraut.blogspot.in/2013/02/how-adi-shankara-destroyed-buddhism-and.html ,
http://rupeenews.com/2010/10/how-adi-shankara-destroyed-buddhism-and-founded-hinduism-in-the-8th-century/  శంకరాచార్యుడు బౌద్దాన్ని నాశనం చేసి హిందూయిజాన్ని ముందుకు తెచ్చిన చరిత్రను విశాల హృదయులైన హిందువులకు వేరుగా చెప్పనవసరం లేదు. ఆ ‘ఘన ‘చరిత్రలను కమ్యూనిస్టులు రాయలేదు.

మానవ సమాజాలు ఎక్కడ వునికిలోకి వస్తే అక్కడ ఆయా కాలాల్లో ఏదో ఒక తత్వశాస్త్రం దానిని అనుసరించి ఏదో ఒక మతం వునికిలోకి వచ్చింది. సామాజిక అభివృద్ధి క్రమంలో ఆదిమ కమ్యూనిజం అంతరించిన తరువాత వునికిలోకి వచ్చిన ప్రతి దోపిడీ వ్యవస్ధ అంతకు ముందున్న వ్యవస్ధ కంటే పురోగామి లక్షణాలతోనే ప్రారంభమైంది. దానితో పాటు ఒక దశలో అది సమాజపురోగతికి ఆటంకమైనపుడు దానిని కూల్చివేసే శక్తులను కూడా అదే వ్యవస్ధ తయారు చేసిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. బానిసలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు ఆ కోవకు చెందినవారే. అక్రమంలోనే వునికిలోకి వచ్చిన మతాలు కూడా ఒక దశలో అవి సమాజ పురోగతికి అడ్డుపడినపుడు వాటిపై తిరుగుబాటుగా కొత్త తత్వశాస్త్రాలు వాటికి అనుగుణంగా చిన్నవో పెద్దవో కొత్త మతాలు వచ్చాయి. అనేక మతాలు ప్రారంభమైన చోట అంతరించి కొత్త చోట్ల మెజారిటీ మతాలుగా మారాయి. కొన్ని ప్రాంతాలలో అంతరించాయి, పరిమితంగా మారాయి. యూదు మతంపై తిరుగుబాటుగా క్రైస్తవం, క్రైస్తవంలోనే అంతర్గతంగా ప్రొటెస్టెంట్‌ వంటి కొన్ని అంశాలపై ఏకీభవించే శాఖలు, మొత్తంగా క్రైస్తవంపై తిరుగుబాటుగా ఇస్లాం వునికిలోకి వచ్చింది. కొత్త మతాలన్నీ పాతమతాలతో ఘర్షణ పడ్డాయి. ఒకదానినొకటి అంతం చేసుకొనేందుకు ప్రయత్నించాయి. అయితే ఇవి అన్ని చోట్లా ఒకే విధంగా జరగలేదు.

మన దేశంలో కూడా మత చరిత్ర అదే చెబుతోంది. క్రైస్తవానికి ఏసు క్రీస్తు-బైబిల్‌, ఇస్లాముకు మహమ్మద్‌ ప్రవక్త-ఖురాన్‌ మాదిరి హిందూ మతం అని పిలుస్తున్నదానికి ఆద్యుడునదగిన పేరు గాని, నిర్ధిష్ట గ్రంధంగానీ లేదు. వేదాలు, వుపనిషత్తులు, రామాయణ, మహాభాగవతాల వంటివెన్నింటినో హిందూ మత గ్రంధాలుగా చెబుతున్నారు. వేదాలను ప్రమాణంగా పరిగణించిన వేదమతం, తరువాత వునికిలోకి వచ్చిన జైన, బౌద్ధ మతాలు, వాటిలో శాఖోపశాఖలు, వాటి మధ్య జరిగిన ఘర్షణలు, రక్తపాత చరిత్రను చూస్తే ఈనాడు చెబుతున్న హిందూమతం పరమతాలను సహించిన వుదారవాది అన్నది వాస్తవం కాదన్నది స్పష్టం. క్రీస్తుశకం 788లో పుట్టి 820లో మరణించారని చరిత్ర చెబుతున్న శంకరాచార్య గురించి కంచి మఠ వెబ్‌ సైట్‌ పేజీలలో ఫ్రొఫెసర్‌ పి సూర్యనారాయణ తన వ్యాసంలో ఇలా రాశారు. ఆయనేమీ విదేశీయుడు కాదు, కమ్యూనిస్టు అంతకంటే కాదు. ‘వేద మతం మరియు తత్వశాస్త్రం,దేవుడు, ఆత్మలను వ్యతిరేకించిన తిరుగుబాటు బిడ్డే బుద్ధిజం. వేదాల ఆలోచన మూలాలకే అది గొడ్డలిపెట్టుగా తయారై దాని వునికికే పెద్ద ప్రమాదకారిగా మారింది. ఈ దాడిని వీలైనపుడల్లా ఎదుర్కొని కట్టడి చేయటం వల్లనేే బుద్ధిజం ఇతర ప్రాంతాలలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ ఖ్యాతి ప్రాధమికంగా మీమాంసక, కుమారిల భట్టులకు చెందాలి. దానికి కారణం శ్రీ శంకరాచార్య తార్కిక పద్దతి, తిరుగులేని వాదనలు, అవి వేద మత వారసుల మనస్సులను ఆకట్టుకొని వూగిసలాటలను పోగొట్టాయి.’ మన దేశంలో బౌద్దాన్ని నాశనం చేయటంలో శంకరాచార్య బోధనలను అనుసరించిన వారితో పాటు అదే సమయంలో మన దేశంపై దండయాత్రలు చేసిన ముస్లిం పాలకులు కూడా బౌద్ధంపై దాడి చేశారన్నది ఒక అభిప్రాయం. శైవుడైన బెంగాల్‌ రాజు శశాంకుడు బౌద్దాన్ని నాశనం చేయటంలో భాగంగా బుద్ద గయలోని బోధి చెట్టును కొట్టి వేయించాడని, అనేక బౌద్దారామాలను ధ్వంసం చేయించటంతో పాటు చివరి బౌద్ద రాజును హత్య చేయించాడని కూడా చరిత్రలో వుంది.

ముస్లిం దండయాత్రలకు ముందు మన దేశంలో శివ, వైష్ణవ మతాలను అవలంభించిన రాజులు, వారు రెచ్చగొట్టిన మతోన్మాదం, జరిగిన రక్తపాత చరిత్ర దాస్తే దాగని సత్యం. అశోకుడు బౌద్ద మతాన్ని అనుసరించాడు కనుక ఆయన కాలంలో బౌద్ద పరిఢవిల్లింది, విదేశాలకూ వ్యాపించింది. ఇప్పుడు ఇస్లామిక్‌ దేశంగా వున్న ఇండోనేషియాలో, బౌద్ధమతం అవలంభించే ధాయ్‌లాండ్‌ వంటి దేశాలలో ఇప్పటికీ హిందూ పురాణాలు, ఇతి హాసాలలో కనిపించే పేర్లను పెట్టుకోవటం చూస్తున్నాం. ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో(సుకర్ణుడు) ఆయన ఒక భార్య పేరు పట్మావతి(పద్మావతి) కుమార్తె పేరు మేఘావతి పుత్రి కూడా దేశాధ్యక్షురాలిగా పని చేశారు. ఇది విశాల దృక్పధమా, సంకుచితమా ?

మన దేశంపై ముస్లింలకు ముందు ఇతర దేశాల నుంచి వచ్చిన వారి దండయాత్రలు జరిగాయి. ఒక దేశంపై మరొక పెద్ద రాజ్యం దండయాత్రలు చేయటం రాజరిక లక్షణాలలో ఒకటిగా పరిగణించటమే కాదు, మహా సామ్రాజ్యాలను నెలకొల్పటం గొప్పగా భావించిన చరిత్ర ప్రపంచమంతటా కనిపిస్తుంది. ముస్లిం దండయాత్రలు, తరువాత వారి స్ధానాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుల పాలనలో వారి మతాలైన ఇస్లాం, క్రైస్తవాన్ని వ్యాపింప చేసేందుకు ప్రయత్నం జరిగింది. హిందూ మతాలను అవలంభించే రాజులు తమ రాజ్యాలను కాపాడుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చారు గనుక కాల క్రమంలో ఇస్లాం, క్రైస్తవ మతాల ధాటిని తట్టుకోవటానికి శైవులు, వైష్ణవులు అందరూ రాజీపడ్డారు. ఈ మతాలకు మూలమైన మనువాదం సమాజాన్ని కులాల వారీగా చీల్చటమే గాక గణనీయ సంఖ్యలో వున్న అణగారిన వర్గాలను అంటరాని వారిగా మార్చి గ్రామాలకు దూరంగా పంపింది. అలాంటి సామాజిక అణచివేత పీడితులు అనేక మంది ఇస్లాం, క్రైస్తవ మతాలను ఆశ్రయించి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు. ఇలాంటి పరిణామం ఎంతో విశాలమైదని చెప్పుకొనే హిందూ మతం వ్యాపించిన మన దేశంలో తప్ప మరెక్కడా కనపడదు.

ప్రలోభాలు పెట్టి క్రైస్తవం మతమార్పిడులు చేయించిందని అనేక మంది గుండెలు బాదుకొనే వారు అంటరానితనం గురించి మాట్లాడరు. ఇప్పటికీ దానిని పాటిస్తూనే వున్నారు. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో సామాన్య దళితులతో పాటు అగ్రవర్ణాలుగా పరిగణించబడే వారు కూడా క్రైస్తవ మతంలోకి మారారు. నిజానికి వారికి సామాజిక అణచివేత లేదా అంటరానితనం సమస్య లేదు. వారెందుకు మారినట్లు ? ఎలాంటి మార్పు లేకుండా, అన్నీ వేదాల్లోనే వున్నాయష అని చెప్పేవారి ప్రభావానికిలోనై నూతన ఆవిష్కరణలకు దూరమైన వారు ఆంగ్ల విద్య, పారిశ్రామిక విప్లవ ఫలాలను చూసి క్రైస్తవ మతం, అది ఏర్పాటు చేసిన ఆధునిక విద్యా సంస్ధలకు ఆకర్షితులయ్యారు. అనేక ప్రాంతాలలో క్రైస్తవ విద్యా సంస్ధల పేరుతో ప్రఖ్యాతి గాంచిన వన్నీ వారి వారసులు ఏర్పాటు చేసినవే. అంటే ఆ మార్పిడి ద్వారా కూడా ఆర్దికంగా లబ్దిపొందవచ్చని గ్రహించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవమతంలోని ప్రధాన అధికారులుగా అగ్రవర్ణాలనుంచి మతం మారిన వారే కనిపిస్తారు. వారి వివాహాలు కూడా అదే తరగతులకు చెందిన వారి మధ్య జరుగుతాయి.

హిందూమతం గత ఘనతను చూడండి, దాన్ని పునరుద్దరించండి అంటూ మతరాజకీయాలు చేయటంలో భాగంగానే పెజావర్‌ మఠ స్వామిని కొందరు విమర్శించుతున్నారు.హిందూమతానికి లేని విశాల దృక్పధాన్ని ఆపాదిస్తున్నారు.ఆత్మవంచన, పరవంచనకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అసలు ధర్మం అనేది వుంటే కదా రక్షించటానికి ?

20 Saturday Feb 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

budda, Dharma, Hinduism, Hinduthwa, vedas

కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని రక్షించటం అంటే ? అనే శీర్షికతో రిటైర్డ్‌ డిజిపి కె అరవిందరావు తన వ్యాసపరంపరలో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆయన ప్రస్తావించిన విషయాల మంచి చెడ్డలను పరిశీలించబోయే ముందు ధర్మాన్ని రక్షించటానికి ముగింపులో ఆయన చెప్పిన మార్గంతో ప్రారంభిద్దాం. దళిత, బలహీన వర్గాలను ప్రత్యేకంగా చూసి వారిని సమాజం నుంచి వేరు చేయటం కాకుండా వారితో అగ్రవర్ణాలు తమ సంస్కారాన్ని పంచుకోవాలని దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చెప్పారని, అందరికీ వుపనయనం చేయాలని, గాయత్రీ మంత్రం నేర్పాలని ఆయన చెప్పిన మాట హాస్యాస్పదంగా కనపడవచ్చు కానీ లోతుగా ఆలోచించాల్సిస విషయం.పైన చెప్పిన వర్గాల వారికి మేలు చేస్తున్నామనే భావంతో వారిని వుద్యమాల్లోకి దింపి మన దేశాన్నీ, సంస్కృతిని ద్వేషించేట్లు చేసేవారిని అడ్డుకోవటానికి ఇదొక మార్గం అని అరవిందరావు గారు సూక్ష్మంలో ధర్మాన్ని రక్షించే మోక్ష మార్గం చెప్పారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి మహానుభావులు ఆనాటికి తమకు తోచిన దానిని నిజాయితీగానే చెప్పారు. మన సమాజం ఎంతగా చీలిపోయి వుందంటే కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

      ఇక అరవిందరావుగారు ఆరోపించినట్లుగా మొదటి విషయం ఈ దేశంలో పుట్టిన వారెవరూ దేశాన్ని ద్వేషించటం లేదు. పుట్టుక అనేది ఒక ప్రమాదం వంటిది. ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు తెలియదు. యాదృచ్చికంగా ఒక కుటుంబంలో పుడితే అగ్రకులమని, మరొక కులంలో పుడితే అధమ కులమని వెంటనే ముద్రవేసే కుసంస్కృతిని, సామాజిక దుష్టత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి కులాల అంతరాలను తరతరాలుగా కాపాడుతూ, అనుమతిస్తున్న ‘మను’ సంస్కృతిని కాపాడాలి అని ఎవరైనా అంటే ఏడునిలువులలోతున పాతి వేయాలంటూ దానిని ద్వేషిస్తున్న వారు మెజారిటీగా వున్నారు. సంస్కృతి పేరుతో ఇక్ష్వాకుల కాలం నాటి అడ్డగోలు వ్యవహారాలను రుద్దాలంటే కుదరదు. పనికిరానిదానిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఆరోగ్యకరమైన దానిని ప్రోత్సహించటమే మానవ సంస్కృతి. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ప్రతిదాని మంచి చెడ్డలను విశ్లేషించినట్లే సంస్కృతిపై కూడా నిరంతరం చర్చ జరగాలి. నవీకరణ జరగాలి. కానీ అరవిందరావు గారు కొన్ని విశ్వవిద్యాలయాలూ, మీడియాలోనూ జరుగుతున్న చర్చను అసత్య ప్రచారంగా చిత్రిస్తున్నారు. విమర్శలకు రెండు కారణాలంటూ ఒకటి మన దేశాన్ని బలహీన పరచాలనే వ్యూహంలో భాగంగా వస్తున్న వుద్యమాలు, రెండోది నిజంగానే మన వ్యవస్ధలో రావాల్సిన మార్పు. మొదటి అంశాన్ని ఇక్కడ చర్చించటం లేదు, కొంత మంది వేదాలు చదవటానికి అనర్హులు అని గీత గీసినట్లు రెండవది మన పీఠాలు, ఆచార్యుల పరిధిలోది అని చెప్పేశారు.

      పోలీసు వ్యవస్ధలో దీర్ఘకాలం పనిచేసిన అరవిందరావు వంటి వారికి విశ్వవిద్యాలయాలూ, మీడియాలో జరుగుతున్న చర్చలు దేశాన్ని బలహీనపరచాలనే వుద్యమాలుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఒక ఆరోపణ చేసి వాటిని ఇక్కడ చర్చించటం లేదు అని తప్పుకుంటే కుదరదు. మీ ఆరోపణ కూడా ఒక మీడియా వేదికలో చేసిందే అని గమనించండి. మీ దగ్గర ఆ చర్చలకు సరైన సమాధానం లేదని అనుకోవాల్సి వస్తుంది. రెండోది మన వ్యవస్ధలో రావాల్సిన మార్పులు పీఠాలు, ఆచార్యుల పరిధిలోనివి అన్నారు. ప్రపంచ మతాల చరిత్రలో ఏ పీఠం లేదా ఆచార్యులు కూడా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మనకు ఎక్కడా కనపడదు. వారిపై తిరుగుబాటు చేసిన వారికి ప్రతి దేశం,ప్రతికాలంలోనూ సామాన్య జనం మద్దతు ఇచ్చారు. మన దేశంలో స్థూలంగా హిందూ మతం అని పిలిచేదానిపై తిరుగుబాటుగానే బౌద్దం,జైనం అవతరించాయి. ఆ హిందూ మతంలో భిన్న భావజాలంతో వున్న శైవ, వైష్ణవ శాఖలు ఎలా కొట్టుకున్నాయో, ఒకదానినొకటి అంతం చేసుకోవటానికి ఎంత రక్తపాతానికి పాల్పడ్డాయో, అవే రాజీపడి బౌద్ధ,జైనాలను, అసలు మతాలనే సవాలు చేసే చార్వాకులు, లోకాయతులను, వారి గ్రంధాలను ఎలా నాశనం చేశాయో చరిత్రలో నమోదయ్యే వుంది. అనేక బౌద్ధ,జైనాలయాలను శివాలయాలుగా మార్చిన చరిత్ర ఆంధ్రదేశంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందువలన ఇసు నుంచి తైలాన్ని తీయవచ్చుగానీ పీఠాధిపతుల నుంచి సంస్కరణలు ఆశించటమా? ఇంతకు ముందు జరగలేదు, ఇక ముందు జరగవు. మొత్తంగా చెప్పాలంటే సంస్కృతి మంచి చెడ్డల గురించి చర్చించటానికి, మార్చుకోవటానికి అరవిందరావు వంటి వారు సిద్ధం కాదు.

     ‘ప్రస్తుతం ఎలాంటి ఘటన జరిగినా దాన్ని మన సంస్కృతితో ముడిపెట్టటం, హిందూమతం అంటేనే బ్రాహ్మణిజం అనీ, బ్రాహ్మణిజం అంటే కులతత్వం అనీ, కులతత్వం అంటే అణచివేత అనే ప్రచారాన్ని చూస్తున్నాం. దీన్ని కేవలం మన దేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా చర్చించటం, అందుకు మన సమాజం మౌనం వహించటం ప్రమాదకరం.’ అని అరవిందరావుగారు వాపోయారు. పురాతన కాలంలో తక్షశిల, పాటలీ పుత్రవంటి మన విశ్వవిద్యాలయాలకు విదేశాల నుంచి విద్యార్ధులు వచ్చే వారని గర్వంగా చెప్పుకుంటాం. ప్రస్తుతం అంతకంటే విస్తృతమైన ప్రపంచీకరణ యుగంలో వున్నాము. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా విమర్శలు సరైనవా కావా అన్నది పాయింటు. అనేక తూర్పు ఆసియా దేశాలలో హిందూమతం, ఆచారాలు వ్యాపించాయి. వర్తమానంలో అనేక దేశాలలో మన దేశం నుంచి వలస వెళ్లిన వారు అక్కడ స్ధిరపడుతున్నారు, దేవాలయాలు నిర్మిస్తున్నారు, మతాచారాలను మరింతగా రెచ్చిపోయి పాటిస్తున్నారు. అందువలన ఎవరు ఎక్కడ చర్చించాలో చర్చించకూడదో గీతలు గీయటం సంకుచితం.

    ప్రతిదానికీ సంస్కృతితో ఎవరు ముడిపెడుతున్నారు? మతం వేరు సంస్కృతి వేరు. అన్ని మతాలు,అలవాట్లు, ఆచారాలను సహించటం మన సంస్కృతి. దాన్ని తిరస్కరించటం మత సంస్కృతి.దానిలో భాగంగానే అది ఏమతమైనా ఎవరేం తినాలో, దుస్తులు ఎలా ధరించాలో, ఎలా కూర్చోవాలో, ఎలా పరుగెత్తాలో కూడా నిర్దేశించేందుకు పూనుకున్నారు. మీరే చెప్పినట్లు భారతీయ మూల సిద్ధాంతంలోనే సహనశీలత, విశాల భావాలు వున్నాయనేది నిర్వివాదాంశం అయినపుడు చర్చలపై సమాజం మౌనం వహిస్తున్నదంటే వాటిని అంగీకరించినట్లే, మీ కెందుకు అంత దుగ్ద, లేదూ మీరు మౌనం వీడి చర్చలు, విమర్శలు ఎలా సరైనవికాదో విమర్శించండి. ఇస్లాం పుట్ట ముందే భారత దేశంలో బ్రాహ్మణులు లేత గోమాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తినటం గురించి రాసింది వాస్తవమా కాదా? గోవులు, కోడె దూడల మాంసం తినటం గురించి వేదాల్లో వుందా లేదా ? అలాంటపుడు గోవును హిందూ సంస్కృతికి ముడిపెట్టి గోవధ చేసిన వారిని చంపివేయాలని వేదాలు చెప్పాయని తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వారి గురించి అరవిందరావు ఏమంటారు ? భారత్‌లో పురాతన కాలంలోనే హిందూ మత భావజాలాన్ని అనేక మంది సవాలు చేశారు. దాన్ని మన సమాజం అంగీకరించింది. అరవిందరావుగారే చెప్పినట్లు వైదిక సంప్రదాయంలోనే శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు ఒకరి సిద్దాంతాన్ని ఒకరు విమర్శించుకున్నారు. అలాంటిది వీరందరి సిద్ధాంతాలను కమ్యూనిస్టులో మరొకరో ఎవరైనా విమర్శిస్తే ఎక్కడలేని అసహనం ఎందుకు వెల్లడి అవుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశం వివిధ మతాల, మతరహిత భావజాలాల కేంద్రంగా వుంది. అలాంటి దానిలో జాతీయత అంటే హిందూయిజమే, హిందూయిజమే జాతీయత అన్న తమ భావాన్ని రుద్దేందుకు కాషాయ తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.వాదనలో తమతో ఏకీభవించని వారిని అంతం చేసేందుకు కూడా వీరశైవులు వెనకాడలేదని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు అది మరో రూపంలో పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

    పురాణాలు, ఇతిహాసాలపై విశ్వాసం వున్న వారి ప్రకారం నాలుగు యుగాలున్నాయి. వాటిలో మొదటిదైన సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచిందట. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా సమాజం వున్నప్పటికీ ఎవరికి ఎవరూ తీసిపోయేవారు కాదని, ఎవరి వృత్తి వారికి గొప్పదని, అందరికీ దేవుడు ఒక్కడేనని, ఆయనను ,స్వర్గం చేరుకోవటానికి ప్రతి ఒక్కరికి తపస్సు చేసుకోవటానికి అవకాశం వుందని చెబుతారు.ఈ యుగాలు, సామాజిక తరగతుల గురించి ఎవరికి వారు తమవైన వ్యాఖ్యానాలు చేస్తున్నందున వాటిలో ఒకదానిని నేను ప్రస్తావించాను.త్రేతాయుగం నాటికి ధర్మం మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక పాదంతో నడుస్తుందని చెబుతారు. ఇది కలియుగ అంతం కనుక అసలు ఏకపాద ధర్మం అయినా వుందో లేదో తెలియటం లేదని బాధ పడేవారు కూడా లేకపోలేదు. అరవిందరావు వంటి వారు కలియుగ అంతంలో అసలు ధర్మం ఏమిటో అంత స్పష్టంగా తెలియని స్ధితిలో గడిచిపోయిన యుగాలలోని ధర్మాలను ఇప్పుడు అమలు జరపాలని చెబుతున్నారా అనిపిస్తోంది. ఎలా సాధ్యం ? మాతృగర్భం నుంచి ఒకసారి బిడ్డ బయటికి వచ్చిన తరువాత తిరిగి అమ్మకడుపులోకి వెళ్లటం ఎంత అసాధ్యమో గడచిపోయినట్లు చెబుతున్న యుగ ధర్మాలను ఇప్పుడు అమలు జరపటం అంత కష్టం.

     సత్యయుగంలో అందరూ సమానమే అని చెబుతూనే శూద్రులు మిగతా తరగతులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవలు చేయాలని కూడా చెప్పారు. ఇదొక వైరుధ్యం. సత్యయుగంలో శూద్రులు కూడా తపస్సు చేయవచ్చని చెప్పారు. కానీ త్రేతాయుగం వచ్చే నాటికి శూద్రులు తపస్సు చేయటం ధర్మవిరుద్ధంగా మారిపోయింది. వాల్మీకి రామాయణంలోని వుత్తరకాండలో రాసినదాని ప్రకారం ఒక రోజు ఒక బ్రాహ్మణుడు మరణించిన తన కుమారుడి శవాన్ని తీసుకొని శ్రీరాముడి వద్దకు వస్తాడు. నీవు కచ్చితంగా పాపం చేసిన కారణంగానే తన బిడ్డ మరణించాడని లేకుంటే బతికేవాడని ఆరోపిస్తాడు. ఆ సమయానికి ప్రత్యక్షమైన నారదుడు అసలు విషయం రాముడి పాపం కాదని ఒక శూద్రుడు తపస్సు చేస్తున్న కారణంగానే బ్రాహ్మణ బాలుడు మరణించాడని చెబుతాడు. వెంటనే రాముడు తనిఖీకి బయలు దేరి వెళ్లగా శంబుకుడు కనిపిస్తాడు. రామా నేను బొందితో కైలాసానికి వెళ్లటానికి ఈ తపస్సు చేస్తున్నానని చెబుతాడు.అది అధర్మం అంటూ శంబుకుడిని రాముడు వధిస్తాడు. తన కంటే ముందున్న సత్య యుగంలో శూద్రులు కూడా తపస్సు చేయటానికి అవకాశం వున్న విషయాన్ని రాముడెందుకు గ్రహించలేకపోయాడు. అప్పుడు కానిది తరువాత అధర్మం ఎందుకు అయింది అని ధర్మ చర్చకు ఎందుకు పెద్దలను సమావేశ పరచలేకపోయాడు? నియంతల పాలనలో మాదిరి అంతా రామరాజ్యంలో కూడా ఏకపక్షంగా నడిచినట్లు కనిపించటం లేదూ?అసలు శూద్రులు తపస్సు చేయటం ఎందుకు నిషిద్ధం ? అరవిందరావు వంటి వారు చెబుతున్నట్లుగా వేదాలలో చేసిన వృత్తులు బట్టి వర్ణాలు వచ్చాయంటున్నారే, రాముడి కాలంలో ఆ వేదాలలో చెప్పిన దాని ప్రకారం శూద్రులు తపస్సు చేయటం ఎలా అధర్మం అవుతుంది? అంటే వేదాల స్ఫూర్తిని రాముడి కాలంలోనే తోసిపుచ్చారా ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవచేయటానికి శూద్రులు కట్టుబడి వుండాలి తప్ప ఇతరత్రా పనులు చేస్తే ఇదే జరుగుతుందని శంబుక వధతో రాముడు మిగతా శూద్రులను హెచ్చరించాడా ? నేటి దృష్టితో నాడు జరిగిన వాటిని ప్రశ్నించటం సమంజసమా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. నిజమే ! అది ప్రశ్నించేవారికే కాదు, నాటి ఆదర్శాలను నేటికీ వల్లె వేస్తున్నవారికి అమలు జరపాలని చూస్తున్న వర్తించదా ?

     బ్రాహ్మలు కాని వారు పూజా పునస్కారాలు, పౌరోహిత్యం చేయటం వల్ల, కమ్యూనిస్టులు వేదమంత్రాలతో పనిలేకుండా వివాహాలు చేయటం వలన బ్రాహ్మలకు కష్టకాలం వచ్చిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నారద మునీంద్రుల వంటి వారు నిజమే అని చెబితే ఏ ముఖ్యమంత్రి అయినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారా ? తనపైన ప్రశ్నించే మరొకరు లేరనే కదా ఎవడో ఏదో అన్నాడని శ్రీరాముడు గర్భిణీ అని కూడా చూడకుండా సీతను అడవులలో వదలి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నేను రాముడిని అనుసరిస్తున్నాను, నా భార్య శీలం గురించి ఎవరో ఏదో అన్నారు కనుక నేను ఆమెను వదలి వేస్తున్నాను అంటే చెల్లుతుందా? లేదా నేను కృష్ణ భక్తుడిని ఆయన మాదిరి బహు వివాహాలు చేసుకుంటుంటే నిత్య పెళ్లి కొడుకు అని పోలీసులు జైల్లో పెట్టి నా మనోభావాలను గాయపరిచారు అని అంటే కుదురుతుందా ?

     ధర్మం నిర్వచనాన్ని ఎప్పుటి కప్పుడు పున:పరిశీలించాలి, మత పెద్దలు తప్ప మరెవరు చెప్పినా దీనికి ప్రామాణ్యం వుండదు అని అరవిందరావు అభిప్రాయపడ్డారు. అది జరిగేదేనా ? మత రాజ్యాలలోనే అలా జరగలేదు. అనేక మంది రాజులు మతాలు మారారు లేదా ఇతర మతాలను అనుమతించారు. ఇప్పుడు అది అసలు కుదిరేది కాదు.మత ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ మా విశ్వాసంలో న్యాయస్ధానాలు జోక్యం చేసుకోకూడదు, మా మనోభావాలు దెబ్బతినకూడదు అంటున్నారు.ఇటువంటి స్ధితిలో ధర్మాన్ని ఎవరు నిర్ణయించాలి శైవులా, వైష్ణవులా ఇతర శాఖల వారా ?పోనీ వీరంతా రాజీ పడినా, ఇతర మతాల వారి ధర్మాన్ని అంగీకరించే పరిస్ధితి వుందా ?

     చివరిగా అరవిందరావు గారి మరో ఆవేదన గురించి చూద్దాం. ‘ధర్మం గురించీ, మత సిద్ధాంతాల గురించీ ఎప్పుడు విమర్శలు వచ్చినా ఆ విమర్శలను ఎప్పటి కపుడు మన ఆచార్యులు ఎదుర్కొన్నారు…..ఎదుటి వాడి సిద్దాంతాన్ని సమీక్షించి తమ సిద్దాంతాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ సంప్రదాయం గత నాలుగైదు శతాబ్దాలుగా పూర్తిగా లోపించటం, విమర్శలు వచ్చినా మన పండితులు, మత పెద్దలు స్దబ్దంగా వుండటం చాలా ఆశ్చర్యకరం ‘ అని వాపోయారు. మన మతం గురించి విదేశీ విశ్వవిద్యాలయాలలో చర్చించటాన్ని తప్పుపట్టిన అరవిందరావు ఈ విషయంలో పాశ్చాత్యులు కూడా వేలెత్తి చూపారని తన వాదనకు సమర్ధనగా తీసుకున్నారు. ఇది అన్యాయం కదా ? షెల్డన్‌ పోలాక్‌ అనే రచయిత ‘పదహారవ శతాబ్దం వరకు వున్న వాడి, వేడి మన పండిత లోకంలో నశించిందని ఆయన అభిప్రాయం. ఆయన చేసిన మిగతా విమర్శలు ఎలా వున్నా ఈ వ్యాఖ్యలో మాత్రం సత్యముంది అని ముక్తాయింపు నిచ్చారు.

     ‘ఈ కాలమందు మత త్రయము వారు( అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మత శాఖల్ని ప్రచారం చేసిన శంకర-రామానుజ- మధ్వాచార్వుల గురించి ) తమ తమ మత వ్యాప్తికై పరస్పర హింసా దూషణములతో వివాదపడి హిందూ రాజ్యముల దుర్బలతకు, తుదకు వినాశనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సామ్రాజ్య పతనమునదేకు, తర్వాతి యరాజక స్ధితికి దేశము య్కె అత్యంత దయనీయ స్ధితికి ఈ మతత్రయము వారెంత బాధ్యులో, ఎంత గొప్ప భాగస్వాములో నిరూపించుటకు ప్రత్యేక గ్రంధమవసరమగును’ అని సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధంలో రాశారు. విజయనగరం, కాకతీయ సామ్రాజ్యపతనాలకు ఈ మతాల చిచ్చు ఒక కారణంగా చెబుతారు. అవి పతనమైన తరువాత వాటి స్దానాన్ని నవాబులు, ఆంగ్లేయులు ఆక్రమించిన చరిత్ర తెలిసిందే. ఈ కాలంలో మత కొట్లాటలలతో లాభం లేదని ఆదరించే వారు వుండరని గ్రహించి ఒకరు కొకరు రాజీపడి కొత్త పాలకులను కొలవటానికి, బోగలాలసతకు అలవాటు పడిన మత పెద్దలు, పండిత లోకం వాడి,వేడిగా తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హిందూయిజంపై విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి ?

18 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

criticism against Hinduism, Hinduism, RSS

ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు?

ఎం కోటేశ్వరరావు

      హిందూయిజాన్ని చులకనగా చూస్తున్నారని అనేక మంది వుద్రేకపడిపోతున్నారు. అంతకు ముందు లేని ఆసక్తిని కొందరు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇతర మైనారిటీ మతస్థులలో కూడా దానికి ప్రతి ధోరణి మొదలైంది. ఎవరికి వారు తమ మతచిహ్నాలను ప్రదర్శించుకోవటం ఎక్కువైంది. ఇతర విషయాలలో సమానత్వం, తోటి మనిషిగా చూడకపోయినా పేరు వరకు సమానత్వాన్ని పాటిస్తూ పేరు చివర కులాన్ని సూచించే తోకలను ఆడపిల్లలకూ తగిలించటం పెరిగి పోయింది (ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు పెరిగి పోతున్న కారణంగా ఇతర కులాల వారు ప్రేమించటం, తలిదండ్రులు అంగీకరించకపోవటం గొడవలు ఎందుకని ముందే ఆడపిల్లకు పేరు తగిలిస్తే ఇతర కులాల వారు వారివైపు చూడరని, ఎవరైనా చూసినా తోటి కులం లేదా తత్సమాన కులం వారే పూనుకుంటారనే వుద్ధేశ్యంతో ఇలా పెడుతున్నట్లు ఒక తల్లి వివరణ ఇచ్చింది). ఇది ప్రతి మారు మూల పల్లెలో కూడా కనిపిస్తోంది. ఏ తరానికి ఆ తరంలో తమ పబ్బం గడుపుకొనేందుకు ఆరోగ్యకర రాజకీయాలను వెనుకపట్టు పట్టించి కుల, మత రాజకీయాలను చొప్పించి తమ పబ్బం గడుపుకోవాలనే పాలకవర్గ శక్తుల ఎత్తుగడలు ఫలించిన పర్యవసానమే ఇది. సమాజంలో అస్థిత్వ ధోరణులు పెరగటం కూడా దీనికి తోడైంది.

      ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది? ఇతర మతాల మాదిరి హిందూ మతాన్ని ఏ ఒక్కరో స్ధాపించలేదు లేదా ప్రబోధించలేదు. బైబిల్‌,ఖురాన్‌ మాదిరి ఈ మతానికి ఒక ప్రామాణిక గ్రంధం లేదు. అందువలన వేల సంవత్సరాల కాలంలో ఎవరికి అవసరమైన మేరకు వారు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి నట్లు , ఎలాగంటే గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలకు వెళ్లేవారు తలా కాస్త మట్టి తీసుకువెళ్లి స్నానఘట్టాల దగ్గర వేయాలని ఒక పెద్దమనిషి ప్రబోధించినట్లుగా అనేక అంశాలను జొప్పించారు. చొప్పిస్తున్నారు. వేదాలలో కానరాని చాతుర్వర్ణ వ్యవస్ధ, మను ధర్మ శాస్త్రం, మహిళల పట్ల వివక్ష వంటి తిరోగమన అంశాలన్నీ మధ్యలో చొప్పించినవే అనే ఒక బలమైన అభిప్రాయం వుంది. ఒక జీవన విధానంగా హిందూయిజమంటే అందరూ కలసి మెలసి జీవించటం. కానీ జరుగుతోంది అందుకు విరుద్ధం. హిందూత్వ వాదులుగా, హిందూయిజాన్ని పరిరక్షించే వారిగా ఫోజు పెడుతూ ఇప్పుడు రంగంలో వున్న శక్తులు, వ్యక్తులు నిజానికి కుహనా హిందువులు, నిజమైన వారు కాదు. దాయిష్‌(ఐఎస్‌) వుగ్రవాదులు, తాలిబాన్లు నిజమైన ముస్లింలు ఎలా కాదో వీరు కూడా అదే కోవకు చెందినవారు.

     కొంత మంది చెబుతున్నట్లుగా హిందూయిజాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారనే వాదనలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు.కుహనా హిందుత్వ వాదులపై ఇంకా తగినంత లేదనేదే ఆందోళన కలిగించే అంశం.అసలు ఈ విమర్శ, ప్రతి విమర్శలకు కారణం ఏమిటి? ఎవరు దీనికి ఆద్యులు ? ఓటు బ్యాంకు రాజకీయాలు. స్ధిరమైన ఓటు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు కాంగ్రెస్‌, ఇతర కుహనా లౌకక పార్టీలు మైనారిటీలను బుజ్జగించేందుకు పూనుకున్నాయని పాడిందే పాడరా అన్నట్లు పాడుతోంది, ప్రచారం ప్రారంభించింది ఎవరు? ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం కింద పనిచేసే దాని అనుబంధ సంస్థలైన బిజెపి, ఏబివిపి, విశ్వహిందూపరిషత్‌ వంటివే కదా ! హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అన్న నినాదం కనిపించని గోడ,ఫ్లెక్సీ, బ్యానర్‌లు ఎక్కడైనా వున్నాయా ? రాజకీయంగా దిగజారటంతో పాటు దేశాన్ని జనాన్ని దివాలా తీయించే ఆర్ధిక విధానాలను అనుసరించిన కాంగ్రెస్‌ పోతున్న తన పట్టును నిలుపుకొనేందుకు అనుసరించని తప్పుడు పద్దతులు లేవు.వాటిలో మైనారిటీలను బుజ్జగించటం ఒకటి అనటం నిస్సందేహం. అంతేనా బింద్రన్‌వాలే వంటి వుగ్రవాదులను పెంచి పోషించిన దుష్ట చరిత్ర కూడా ఆ పార్టీకి వుంది. చివరికి ఆ బింద్రన్‌వాలా దయ్యం పట్టిన వారే ఇందిరా గాంధీని బలితీసుకొనేందుకు సాధనాలయ్యారు. కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తదితర వామపక్షాలు ఇలాంటి బుజ్జగింపు చర్యలకు వ్యతిరేకం అన్నది చరిత్ర చెప్పిన సత్యం. కాంగ్రెస్‌ మైనారిటీ మతాల వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే బిజెపి చేసిందేమిటి ? మొదట జనసంఘం అన్నారు, తరువాత దానిని జనతా పార్టీలో కలిపామన్నారు, దాన్నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని పెట్టామన్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ అధికారంలోకి రాకపోవటంతో హిందూమతానికి అన్యాయం జరుగుతోందని ఒకవైపు రెండోవైపు వివాదాస్పద బాబరీ మసీదు, రామజన్మభూమి వివాదాన్ని ముందుకు నెట్టింది. మెజారిటీ మతం వారిని బుట్టలో వేసుకొని అధికార అందలాలెక్కేందుకు ప్రయత్నించింది, అధికారానికి వచ్చిన తరువాత దానిని సుస్ధిరం చేసుకొనేందుకు గుజరాత్‌లో ఎలాంటి దారుణాలకు పాల్పడిందో, ఇప్పుడు దేశంలో ఏ విధంగా వ్యవహరిస్తోందో మనం చూస్తూనే వున్నాం. అందువలన ఆ విమర్శ చేయటానికి బిజెపి లేదా సంఘపరివార్‌కు, వారిని బలపరుస్తూ, కాంగ్రెస్‌ పద్దతులను మక్కీకి మక్కీ అనుసరించే తెలుగుదేశం, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నైతిక హక్కు లేదు.

అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ?

     ఈ దేశం హిందూ దేశమని, మతమార్పిడులు, పిల్లల్ని ఎక్కువ మందిని కనటం ద్వారా ఇతర మతాలు ముఖ్యంగా ముస్లింలు మెజారిటీగా మారేందుకు పెద్ద కుట్ర పన్నారని, హిందూయిజానికి ముప్పు వచ్చిందని ఆధారంలేని, ఊహాజనిత ప్రచారం ఎక్కువ చేసింది, చేస్తున్నదీ ఎవరు ? అది వాస్తవం కాదని చెప్పిన కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయశక్తులన్నింటినీ దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, విదేశీ సిద్ధాంతాలను పాటించేవారని తన యంత్రాంగం ద్వారా నిత్యం దాడులు చేస్తూ, జనాల బుర్రలను కలుషితం చేస్తున్నది ఎవరు ? సంఘపరివార్‌ కాషాయ కుహనా హిందుత్వ వాదులు కాదా ? ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు? బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ హిందూ మతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటాడా ?ఈ అంకెల ఆట అంతటితో ఆగలేదు. శ్యామల్‌ గోస్వామి అనే బిజెపి పెద్దమనిషి ఐదుగురు అంటే బదరికాశ్రమం శంకరాచార్య, శ్రీ వాసుదేవానంద సరస్వతి పదికి పెంచారు. మహిళంటే పిల్లల్ని కనే యంత్రాలనుకుంటున్నారా ? హిందూ మతాన్ని కాపాడి తరువాత ఏం చేస్తారు? వీరు పుట్టక ముందు నుంచి హిందూ మతాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు వీరు ? హిందూయిజానికి ప్రతినిధులమని స్వయంగా నిర్దేశించుకున్నవారే కదా ?చెప్పే వారికి బాధ్యత లేదా ? దేశం కంటే సన్యాసం ఎక్కువా ? లేదు అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ? యోగులు, సన్యాసుల గురించి వివేకానందుడు చెప్పిందేమిటి ? సన్యాసులకు ఒక మతం వుండకూడదు, అన్ని మతాల నుంచి మంచిని తీసుకోవాలి. ఇపుడు జరుగుతోందేమిటి ?

    నేడు ప్రతి మతంలోనూ తాలిబాన్లు తలెత్తుతున్నట్లు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం వుండే మన దేశాన్ని కూడా ఆ వైపు నడిపించటానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మతాలపై ముఖ్యంగా హిందూ మతంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. అది వికటిస్తే పర్యవసానాలు భిన్నంగా వుంటాయి. కొంత మంది ముందుకు తెస్తున్న కొన్ని వాదనలను పరిశీలిద్దాం.

ఇస్లాం వంటి వాటిని విమర్శించటానికి వారికి( హిందూమతాన్ని విమర్శించేవారికి) భయం, వణికిపోతారు.

      మతాలన్నీ ఛాందసత్వంతో కూడుకున్నవే అన్నది ముందు గ్రహించాలి. వాటిలో సంస్కర్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా మతాలు, ఆచారాలను వ్యాఖ్యానిస్తుంటే ఛాందసులు వాటిని అలాగే వుంచటం లేదా వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. కొన్ని దేశాలలో నూటికి 99శాతం ముస్లింలే వుంటారు. అయినా అక్కడ తాలిబాన్లు ఎందుకు పుట్టుకు వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడని ఛాందసులు షరియత్‌ పేరుతో మతోన్మాదులుగా మారుతున్నారు. మన సమాజంలో ఎప్పటి నుంచో వున్న ఆచారాల ప్రకారం ఇప్పటికీ దళితులు అంటరానివారే. రాజ్యాంగం దానిని నిషేధించింది. పాటిస్తే శిక్షార్హం అని చెప్పింది. ఆ హక్కును అమలు జరుపుకొనేందుకు ఎక్కడైనా దళితులు ప్రయత్నిస్తే అగ్రకులాలనబడేవారు దాడులకు తెగబడటాన్ని ఏమనాలి? హిందూ మతానికి చెందిన వారు హిందూమతాన్ని విమర్శిస్తే హిందూమతం వారే సహించటం లేదు. అటువంటుపుడు పూర్తిగా వివరాలు తెలియని అన్యమతాలను అన్యమతస్తులు విమర్శించటం సరైనది కాదు, సహేతుకంగా విమర్శించినా సహించే అవకాశం లేనపుడు ఏ మతానికి చెందిన వారు ఆ మతాన్ని విమర్శించటమే సరైనది. దాన్ని అంతవరకే పరిమితం చేయాలి.దీన్ని గురించి చౌకబారు అడ్డుసవాళ్లు విసిరే వారి వలలో పడాల్సిన అవసరం లేదు.దొంగబాబాలు, యోగినుల బండారాల గురించి అనేక సినిమాలలో ఎంతో చక్కగా చూపించారు, చూపుతున్నారు. కానీ ఎవరైనా ఒక బాబా లేదా యోగిని గురించి ప్రత్యక్షంగా విమర్శిస్తే వారిపైకి భౌతికదాడులకు జనాన్ని రెచ్చగొడుతున్న తీరు తెలిసిందే. నిజమైన విమర్శకులు శాంతి భద్రతల పరిస్ధితి తలెత్తాలని కోరుకోరు. మన దేశంలో నూటికి 80శాతం మంది హిందువులే గనక చర్చలలో కూడా ఆ వాటా అలాగే వుంటుంది. అందుకే మొత్తంగా దీనినే విమర్శించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు.అమెరికా,ఐరోపా వంటి దేశాలలో హేతువాదుల నుంచి 90శాతం విమర్శలు క్రైస్తవం మీద వుంటాయి తప్ప ఇతర మతాల మీద కాదు, ఇక్కడ కూడా అంతే.

తస్లీమా సస్రీన్‌, సాల్మన్‌ రష్డీలను వారు సహించటం లేదు అలాంటపుడు ఇక్కడ ఎందుకు సహించాలి?

    తస్లీమా, సాల్మన్‌ రష్డీ మొరటు పద్దతులలో మత ఛాందసులను విమర్శించారు కనుక వారు దాడులకు తెగబడుతున్నారు.ఇక్కడ కూడా అదేపని చేస్తామంటారా? అలాంటపుడు వారికీ వీరికి తేడా ఏముంటుంది? ఇతరులను విమర్శించటం లేదని అడిగే హక్కు వారికి వుండదు. అహింస, విమర్శ, సహనం భారతీయ సంప్రదాయం. దాన్ని ముందు మనం కాపాడు కుందాం. ముందు మెజారిటీ జనం వాటిని పాటిస్తే అందుకు భిన్నంగా వ్యవహరించేవారిపై కూడా వత్తిడి పెరుగుతుంది. వారు కూడా తమ వైఖరిని మార్చుకుంటారు. ఇతర మతాల దేవతలు దేవుళ్లపై సద్విమర్శలు చేయటం వేరు, కించపరచటం వేరు. కించపరిస్తే జరిగేది కొట్లాటలే అని అనేక అనుభవాలు తెలిపాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అడ్డు సవాళ్లు తరువాత, ముందు మతాలలోని వివక్ష, వైరుధ్యాలను అంగీకరిస్తారా లేదా ?

16 Saturday Jan 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Counter Challenges, Hinduism, Hinduthwa, Riddles in Reigions

ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి.

ఎం కోటేశ్వరరావు

      జల్లి కట్టు లేకపోతే ఎద్దులు అంతరిస్తాయా ? మహిళలను అనుమతిస్తే అయ్యప్ప బ్రహ్మ చర్యం పోతుందా అనే శీర్షికతో నేను రాసిన అంశాలపై పెద్ద సంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు నాకు మద్దతు పలికిన వారు కూడా వున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వారు అనేక ప్రశ్నలు సంధించారు. అందువలన వారికి మాయాబజార్‌ సినిమాలో చెప్పినట్లు వీరతాళ్లు వేద్దాం. అయితే వాణిజ్య ప్రకటనలలో చిన్న నక్షత్రం వేసి దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగానే గానే వీరూ ఆ షరతులకు లోబడే వీరతాళ్లు  వేసుకొనేందుకు అర్హులు. నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు చేసిన ఆరోపణ లేదా విమర్శలు ఏమిటి ? హిందూయిజాన్ని సులభంగా విమర్శిస్తారు, ఇతర మతాలు ముఖ్యంగా ఇస్లామును ఏమీ అనలేరు, వారిని విమర్శించటానికి లేదా వారి పేరు ఎత్తటానికి దమ్ము, ధైర్యాలు లేవు, హిందూయిజాన్ని విమర్శించటం ఒక ఫ్యాషన్‌గా మారింది. హిందువులు సహనశీలురు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయి, ఇస్లామిక్‌ దేశంలో ఇలా అని బతగ్గలరా ? ఇలా సాగాయి.విమర్శించిన వారందరూ సంఘపరివార్‌ తాలిబాన్‌ హిందూత్వ వాదులు కాదు, వారి వాదనల ప్రభావానికిలోనై ప్రశ్నించినంత మాత్రాన వారిని, కరడు గట్టిన వారినీ ఒకే గాటన కట్టటం లేదు.

       మన దేశంలో అభివృద్ధి చెందిన వాటిలో తర్కశాస్త్రం ఒకటి. ఇది శాస్త్రీయమైనది, దీనిలో గతి తార్కిక విధానం అంటే తర్కము, హేతువు వుండాలి. గతి తార్కిక విధానము అనగానే ఇదేదో కమ్యూనిస్టుల పదజాలం అని కొందరికి తేళ్లు జెర్రులు పాకినట్లు వుండవచ్చు. వారు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల నాడే భారత సమాజంలో వుంది. అసలు తర్కము, హేతువు నుంచే సమాజం ఇంతగా పురోగమించింది. అవేమీ లేకపోతే మనం ఇంకా ఆకులు చుట్టుకొనే దశలోనో అంతకు పూర్వ దశలోనో వుండే వాళ్లం. తర్కాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు లోకాయతులు. వేదాలను, వైదిక క్రతువులను రెండున్నర-మూడువేల సంవత్సరాల నాడే వ్యతిరేకించి వాటి ప్రామాణికతను సవాలు చేసిన హేతువాదులు వారు . వారిని చార్వాకులు అని కూడా పిలిచారు. వేదాలను సమర్ధించే శక్తులు వారిని భౌతికంగా అంతం చేసి వారి తర్కశాస్త్రాన్ని నాశనం చేసి తరువాతి తరాలకు అందకుండా చేశారు. వారిని తిడుతూ లేక విమర్శిస్తూ రాసిన అంశాలను బట్టి లోకాయతుల గురించి మనకు ఇప్పుడు తెలుస్తున్నది. అందువలన నేను రాసిన దానిని తప్పుపట్టిన వారు ముందు వుద్రేకాన్ని తగ్గించుకొని మన పురాతన గతి తార్కిక పద్దతిలో ఆలోచించాలి. తర్కశాస్త్రంలో ఒకరు ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తితే దాన్ని వుత్తర పక్షం అంటారు. రెండవవారు దానికి సమాధానం చెబితే దానిని పూర్వపక్షం అంటారు. రెండు వాదనలు విని ఏది సరైనదో తేలుస్తారు. అంటే సరైన వాదన చేసిన వారిని రెండోవారు అంగీకరించాలి. ఇటీవలి కాలంలో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తూ వాదనలకు దిగి ఓడిపోయి రెండోవారిని అంగీకరించకుండా మీరు ఎన్నయినా చెప్పండి ఇది నా విశ్వాసం, నమ్మకం , మనోభావం దీనిని నేను అంగీకరించను అని అడ్డం తిరుగుతున్నారు లేదా అసలు తర్కానికే సిద్ధం కారు .ఇలాంటి వారు వీరతాళ్లు వేసుకొనేందుకు అనర్హులు. అలాంటి వారితో తర్కించటం కంఠశోష తప్ప శుద్ద దండగ. గాంధీలు పుట్టినపుడు గాడ్సేలు లేకుండా ఎలా వుంటారు అన్నట్లుగా సమాజంలో హేతుబద్దంగా ఆలోచించే వారే మెజారిటీగా వున్నందున వారి కోసమైనా కొన్ని విషయాలను చర్చించుకోవటం అవసరం. వారు వున్నారు కాబట్టే సమాజం ముందుకు పోతోంది.

      ముంబై హైకోర్టు 2010 జనవరి మొదటివారంలో ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఇస్లాం, హిందూ, క్రిస్టియన్‌ ఏ మతాన్ని అయినా భావప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాధమిక హక్కు కింద విమర్శించటం భారత దేశంలో అనుమతించదగినదే అయితే అ విమర్శ చిత్తశుద్దితో లేదా సైద్ధాంతికమైనదిగా వుండాలి తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్ట కూదదు అని ఒక పుస్తకంపై తలెత్తిన వివాదం సందర్భంగా కోర్టు చెప్పింది. ఇస్లాం గురించి ముంబై న్యాయవాది ఒకరు రాసిన పుస్తకంలోని అంశాలు అభ్యంతరకరంగా వున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించింది. అది తన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతమంటూ రచయిత కోర్టులో సవాలు చేశారు. కోర్టు ఆ నిషేధం సరైనదే అని సమర్ధించింది. న్యాయమూర్తులు రంజనా దేశాయ్‌, డివై చంద్రచూడ్‌, ఆర్‌ఎస్‌ మోహిత్‌లతో కూడిన బెంచ్‌ దీనిని విచారించింది. ఆరోగ్యకరమైన విమర్శ ఆలోచనలను రేకెత్తించేదిగా వుండాలి, చర్చను ప్రోత్సహించాలి ఒక నిర్ధారణకు వచ్చేందుకు తోడ్పడాలి, కానీ విమర్శ నిందలు వేసేదిగా వివిధ సామాజిక తరగతుల మధ్య విద్వేషాన్ని సృష్టించేదిగా వుండకూడదు, అది వివేకవంతమైన సంప్రదింపులకు దారితీయాలి అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రచయిత తాను అనుకుంట్నుది సరైనదని చెప్పవచ్చు, ఒక వేళ అది తప్పయితే దానికి అతనిని శిక్షించకూడదు, కానీ చూడాల్సిందేమంటే ఇస్లాం ఏం చెప్పిందో తెలుసుకోవటానికి, దానిని బయటకు వెల్లడించటానికి రచయిత చిత్తశుద్దితో వ్యవహరించాడా లేదా అనేది చూడాలి. ఈ కేసులో ఇస్లాంపై విమర్శలు మరియు భారతీయ ముస్లింలపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు సైద్దాంతికమైనవి కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకరంగా వున్న భాగాలను తొలగించాలన్న సూచనలను రచయిత నిరాకరించారు. ఇంటర్నెట్‌ యుగంలో పుస్తకాన్ని నిషేధించటం కాలం చెల్లింది, అర్ధం లేనిది అని రచయిత వాదించటం పూర్తిగా అభ్యంతరకరమని కోర్టు పేర్కొన్నది. భారతీయ ముస్లింలు హిందువులందరినీ మతమార్పిడి చేయాలని చూస్తున్నారని, హిందూ దేవాలయాలు, మహిళలపై దాడులు చేస్తున్నారంటూ రచయిత చేసిన వ్యాఖ్యలు జనాన్ని హింసాకాండకు రెచ్చగొట్టవచ్చు లేదా హింస, శతృత్వాన్ని లేదా ద్వేషాన్ని పెంచవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.

       అందువలన ఎవరైనా ఏమతం గురించైనా చేసే వ్యాఖ్యల వెనుక వున్న వుద్ధేశ్యాలు, లక్ష్యాలు ఏమిటో తెలియనంతటి స్థితిలో సమాజం లేదు. అయితే కొందరు ఒక లక్ష్యంతో చేసే వ్యాఖ్యలను మరికొందరు పర్యవసానాల గురించి ఆలోచించకుండా వాటిని తమ అభిప్రాయాలుగా స్వంతం చేసుకొని మాట్లాడుతున్నారు. విమర్శ చేస్తే వారు సహించరు. అందువలన వారిని కూడా ఎదుటి వారు ఏదో ఒక పక్షంగా భావించాల్సిన పరిస్థితులు నేడు దాపురించాయి. ముందే చెప్పుకున్నట్లు ఇస్లాంను విమర్శించటానికి దమ్ము, ధైర్యం లేదని చేసే వ్యాఖ్యలు, సవాళ్లు ఈ కోవకు చెందినవే. వీరు ముందు ఒకటి స్పష్టం చేయాలి. రాజ్యాంగాన్ని అంగీకరించి దానికి అనుగుణుంగా నడుచుకుంటారా లేదా ? మనది మతరాజ్యం కాదని అంగీకరిస్తారా లేదా ? భిన్నాభి ప్రాయాన్ని సహిస్తారా కుదరదంటారా ? మతరాజ్యాలతో పోల్చుకోవటం అంటే మనం కూడా ఆ బాట పట్టాలని చెబుతున్నారా ? ఏమతానికి చెందిన వారైనా అసలు మతాలలోని చెడు లేదా అవాంఛనీయ పోకడల మీద చేసే విమర్శలను సహిస్తారా లేదా అంగీకరిస్తారా లేదా ? మతాలలోనే అంతర్గతంగా వైరుధ్యాలు, మారాల్సిన అంశాలు వున్నాయని ఒప్పుకుంటారా లేదా ?

      వుదాహరణకు హిందూ మతంలో మహిళల పట్ల వివక్ష వుంది అనే విమర్శ చేస్తే వెంటనే వస్తున్న ప్రతివాదన ఏమిటి ? హిందూ మతం గురించి చెప్పేవారు మహిళలకు మసీదులలో ప్రవేశంపై ఆంక్షల గురించి, క్రైస్తవంలోని అంశాలపై మాట్లాడరెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఆ మతాల గురించి విమర్శిస్తే మావి మైనారిటీ అసలు నూటికి 80 మందిగా , మా మతాల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి వునికిలో వున్న హిందూ మతం గురించి ఆలోచించండి అని వారు అంటారు. వీటన్నింటినీ చూసినపుడు ఏ ఒక్కమతావలంబలకులూ తమ మతంలో వివక్ష వుందని అంగీకరించటం లేదు, వున్న దానిని సమర్ధించటానికి పూనుకుంటున్నారు, తప్పించుకోవటానికి ఇతర మతాల గురించి అడ్డు సవాళ్లు విసురుతున్నారు. ఓట్లకు మతాలను వాడుకోవటం, అందుకోసం చివరికి కొట్లాటలను కూడా సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఒక మతానికి చెందిన వారు ఇతర మతాల మంచి చెడ్డల గురించి చెబితే వాటిని సహృదయంతో స్వీకరించే పరిస్థితులు లేవు. అవసరమైతే వివక్ష, మూఢనమ్మకాలు, సంస్కరణల వంటి విషయాల గురించి మనం వాదులాడు కోవద్దు, విమర్శించేవారిపై వుమ్మడిగా దాడి చేద్దాం అని జెఎసి గా ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మతం జనం పాలిట మత్తుమందు అని కమ్యూనిస్టులు చెబుతున్నారు. అలా అన్నందుకే కమ్యూనిజం క్రైస్తవానికి, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆ మతాలు జనం మెదళ్లలో నూరిపోస్తున్నాయి. మన దేశంలో కూడా మెజారిటీ మతశక్తులూ అదే చేస్తున్నాయి. అందువలన ఇప్పుడున్న స్థితిలో ముందు ఏ మతానికి చెందిన వారు ఆ మతంలోని అవాంఛనీయ పోకడలను ప్రశ్నించాలి. ఏ మతం వారైనా ఇతర మతాలకు చెందిన వారు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెచ్చిపోవద్దు. వాటిని కొన్ని శక్తులు దురుద్ధేశ్యాలు, జనం మధ్య సామరస్యతను చెడగొట్టేందుకు , రోజువారీ సమస్యలపై ఐక్యం కాకుండా అడ్డుకొనేందుకు విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా అనేక అంశాలను ముందుకు తెస్తున్నాయి. అనేక మంది వాటికి ప్రభావితులౌతున్నారు, సామాజిక మీడియాలో అవాంఛనీయ పోకడలు, వ్యాఖ్యలతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.

      ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి. అరిగిపోయిన గ్రామఫోను రికార్డు వంటిదే. దాన్ని గురించి తరువాత పరిశీలించుదాం ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వివేకానంద స్వామికీ తప్పని కుల వివక్ష !!

12 Tuesday Jan 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Hinduism, Swami Vivekananda, VHP

Swami Vivekananda, National Youth Day, Parliament of World's Religions

సత్య

రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమోదించిన తమ రాజ్యాంగం గురించి అమెరికన్లు ఏమనుకుంటున్నారు? పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో కేవలం 51శాతం మందే రాజ్యాంగానికి ఓటు వేస్తామని ప్రకటించారు. పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ అమెరికా అనే సంస్ధ జరిపిన సర్వేలో 22శాతం మంది తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పగా మరో 27శాతం ఎటూ చెప్పలేమని అన్నారు. అంతకు ముందు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా జరిగిన సమయంలో అనేక మంది తమ రాజ్యాంగంలోని అంశాలు కమ్యూనిస్టు మానిఫెస్టోలోని వని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తమ రాజ్యాంగం గురించి అమెరికన్లు ఇప్పుడే మనుకుంటున్నారు ?

హక్కుల బిల్‌ అంటే (బిల్‌ ఆఫ్‌ రైట్స్‌) స్వంత ఇల్లు కలిగి వుండే హక్కు అని ప్రతి ముగ్గురిలో ఒకరు, సమాన పనికి సమానవేతనాన్ని గ్యారంటీ చేసేదని నలుగురికి ఒకరు, ప్రభుత్వంలోని మూడు శాఖలు అని 31శాతం, ఏ ఒక్కశాఖనూ గుర్తించలేని వారు 32శాతం, 5-4గా వున్న సుప్రీం కోర్టు తీర్పులను పార్లమెంట్‌ లేదా దిగువ కోర్టుల పరిశీలనకు తిప్పిపంపటంగా 28శాతం అనుకుంటున్నారట. ఈ సర్వే గత ఆగస్టులో జరిగింది. అన్నింటి కంటే విచిత్రం ఏమంటే పదిమందిలో ఒకరు పెంపుడు జంతువును కలిగి వుండే హక్కుకు గ్యారంటీ అని భావించటం.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాసుకున్న రాజ్యాంగానికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు, ఆచరణలో అది అమలు జరగనపుడు జనంలో ఇలాంటి అభిప్రాయాలే ప్రబలుతాయి. ఈ రోజు అమెరికాలో వాడు గాకపోతే వీడు, వీడు గాకపోతే వాడు అన్నట్లు అటు డెమోక్రాట్లు లేదా ఇటు రిపబ్లికన్లుగానీ అమెరికా రాజ్యాంగ స్ఫూర్తిని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన ఘనులు. నైతికంగా ఏమాత్రం తగనివారు.

అలాగే ఈ రోజు మన దేశంలో వివేకానందుడు ఎవరు అంటే ఆయన కూడా సంఘపరివార్‌కు చెందిన తొగాడియా, యోగి ఆదిత్యనాధ్‌, సాధ్వి రితంబరి తదితర మతోన్మాద స్వాములు, సాధువులు, సాధ్వుల కోవకు చెందిన మరో స్వామీజీ అని చెప్పే ప్రమాదం లేకపోలేదు. ఒక్కశాతం కూడా నైతిక అర్హతలేని సంఘపరివార్‌ శక్తులు ఆయన బొమ్మలను వుపయోగించుకొని వూరూ వాడా ప్రచారం చేసిన కారణంగా ఆయన కూడా వారి భావజాలపు వ్యక్తి కానట్లయితే వారెందుకు అంతగా భుజానికెత్తుకుంటారు, కనుక ఆయన గురించి పెద్దగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని భావించేవారెందరో వున్నారంటే అతిశయోక్తికాదు. వివేకానందుడు ఒక విధంగా సంఘసంస్కర్తల పరంపరకు చెందిన వారని చెప్పవచ్చు.అందువలన ఇతర సంస్కర్తల మాదిరే ఆయనకూ పరిమితులు వుంటాయి.

వివేకానందుడు వివిధ అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే అసహనం అందునా పరమత అసహనం కొంత మందిలో నరనరానా జీర్ణించి వున్న స్ధితిలో ఒక వేళ ఆయనే తిరిగి వచ్చి మాట్లాడితే మైనారిటీ మతాలను సంతృప్తిపరచేందుకు చూస్తున్న కాషాయం ధరించిన కుహనా హిందువు అని ట్యాగ్‌ తగిలించినా ఆశ్చర్యం లేదు. ‘ పశ్చిమ దేశాల వారు భారత్‌ నుంచి ఒక విషయం తప్పక నేర్చుకోవాలి అదేమంటే సహనం. సారం ఒకటే అయినందున అన్ని మతాలూ మంచివే.’ అని అమెరికాలోని బ్రూక్లిన్‌ ఎథికల్‌ సొసైటీ సందర్శన సందర్బంగా వివేకానందుడు చెప్పారు. క్షుద్ర పూజలు హిందూమతంలో భాగం కాదని కూడా చెప్పారు. కానీ నేడు ఎక్కడ చూసినా క్షుద్రపూజలు చేయని, చేయించని స్వామీజీలు ఎవరో చెప్పండి. ఎవరైనా చివరికి ఆ వివేకానందుడే వచ్చి అభ్యంతరం చెప్పినా ముందు గూండాలతో గెంటేయిస్తారు, సాధ్యంగాకపోతే మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆందోళనలు చేయించి పోలీసుల చేత బయటకు నెట్టిస్తారు. భారత్‌లో మహిళలు అంతగా వున్నత స్ధాయిల్లోకి రాకపోవటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు వివిధ యుగాలలో దుర్మార్గులైన దురాక్రమణదారులు ఒక పెద్ద కారణమైతే భారతీయుల స్వయంకృతం కూడా పాక్షికంగా దానికి దోహదం చేసిందన్నారు.మహిళలను శబరిమల దేవాలయంలోకి అనుమతించకపోవటంపై సోమవారం నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా వివేకానందుడు హర్షించి వుండేవాడు.(మనం ఎక్కడున్నాం ! నికితా అజాద్‌కు జేజేలు !! https://vedikaa.com/2015/12/22/open-letter-to-devaswom-chief-sabrimala/) మనం స్వయం కృతంతో మహిళలపై విధించిన అర్ధంలేని ఆంక్షలలో అదొకటి. మతం ఆధారంగా తప్పించి రాజ్యాంగం ప్రకారం మహిళల ఆలయ ప్రవేశాన్ని నిషేధించజాలరని సుప్రీం కోర్టు పేర్కొన్నది. రుతుక్రమంలో వున్న మహిళలు దేవాలయ ప్రవేశం చేయకూడదని, అలా చేస్తే పవిత్రతకు భంగం అని హిందూమతం ఎక్కడ చెప్పిందన్నది ప్రశ్న.

హిందూ మత పవిత్రతను పరిరక్షించేందుకు పవిత్ర భారత భూమి నుంచి ఎవరూ బయటికి పోగూడదని, వెళ్లిన వారిపై శాస్త్రాలు ఆంక్షలు విధించినట్లు కొందరు టీకా తాత్పర్యం చెబుతున్నారు. వేల సంవత్సరాలనాడే భారత్‌ నుంచి హిందూమతం ప్రాచ్య రాజ్యాలుగా పిలిచే తూర్పు ఆసియా ప్రాంతానికి విస్తరించినట్లు మనకు తెలుసు.ఇదంతా దాదాపు రెండు వేల సంవత్సరాల పూర్వమే జరిగిందన్నది చరిత్ర. దాదాపు అన్ని దేశాలలో హిందూ దేవాలయాలు, పురాణ ఇతిహాసాలు ఏదో ఒక రూపంలో అక్కడ ఇప్పటికీ ప్రచారంలో వున్నాయి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో వుండే జనాభాలో 90శాతం మంది హిందువులే. అక్కడ రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన మతాలలో హిందూ ఒకటి. హిందూమతం పుట్టినప్పటి నుంచి నిజంగా ఈ ఆంక్షలు వుండి వుంటే సముద్రాలు దాటి అంతదూరం ఎలా వెళ్లి వుండేది?

హిందూ మతానికి సంబంధించి అనేక అంశాలు తిరోగమనంగా వున్నాయి. వాటిని వదిలించుకొని పురోగమించాలి. సాటి మనిషిని మనిషిగా గుర్తించని ఏ మతమైనా కాలగతిలో అదృశ్యం కావాల్సిందే. హిందూ మతం గొప్పతనం గురించి చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశాలలో గొప్పగా ప్రసంగించారని కీర్తించబడుతున్న వివేకానందుడు అక్కడ ఈ మతంలోని తిరోగమన అంశాలను చెప్పి వుండుంటే పరిస్ధితులు మరొక రకంగా వుండి వుండేవి? ఆ మత ఛాందసానికి తానే గురి అవుతానని అమెరికా వెళ్లటానికి ముందు వివేకానందుడు ఊహించి వుండడు. ఆశ్చర్యంగా వుంది కదూ !!

మత నిషేధాలను వుల్లంఘించి సముద్రయానం ద్వారా విదేశీ ప్రయాణం చేసినందుకు నాటి బెంగాలీ కులీనులు ఆయనను అంటరాని వాడిగా పరిగణించారు. 1897లో అమెరికా నుంచి కొల్‌కతా తిరిగి వచ్చినపుడు ఏం జరిగిందో శైలేంద్రనాధ్‌ ధార్‌ రాసిస వివేకానందుడి జీవిత చరిత్ర వివరించింది. 1897 మార్చి 21న స్వామి 40 సంవత్సరాల పాటు నివసించిన దక్షిణేశ్వర్‌లోని కాళీ మాత ఆలయ సందర్శనకు ఖేత్రి మహారాజుతో కలసిపెద్ద పరివారంతో వచ్చాడు. ఆ సందర్బంగా జరిగిన వుదంతంపై తరువాత పత్రికల్లో పెద్ద వివాదమైంది. మహారాజులు, స్వామి వంటి పెద్దలు వచ్చినపుడు ముందుగా తెలియచేయటం, ఆలయ యజమాని బాబు త్రిలోక్యనాధ్‌ బిస్వాస్‌ స్వయంగా వచ్చి ఆహ్వానించటం అక్కడి సంప్రదాయం. ఆలయ సందర్శన వివాదంపై ది వంగాభాషీ అనే పత్రిక స్వామి, ఆయన అనుచరులను ఆలయం నుంచి బయటకు పంపించారని రాసింది. దీనిపై త్రిలోక్యనాధ్‌ స్పందిస్తూ ‘స్వామి, రాజాను ఆహ్వానించాల్సిందిగా నేను ఎవరినీ ఆదేశించలేదు, స్వయంగా రాలేదు. ఒక విదేశానికి వెళ్లి ఇంకా తనను తాను హిందువును అని చెప్పుకొనే వారితో కలవాలని ఏమాత్రం భావించలేదు, వివేకానంద, ఆయన అనుచరులు ఆలయం వదలి వెళ్లేటపుడు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని అనుచరులతో చెప్పాను. మీరు పత్రికలో రాసినట్లుగా దేవతను సాయంత్రం పునరాభిషేకం (శుద్ధి) చేసిన మాట అక్షరాలా నిజం’ అని పేర్కొన్నారు.(దళితులు ఎక్కడైనా ఆలయ ప్రవేశం చేసినపుడు తరువాత ఆలయాన్ని శుద్ధి చేస్తున్న తీరు ఇప్పటికీ జరుగుతున్నది)

ఈ వుదంతంపై రాణి రాసమణీ కుటుంబ సభ్యులొకరు ఒక పత్రికకు లేఖ రాస్తూ త్రిలోక్యనాధ్‌ ఆలయయజమానిగా చెప్పుకొనటాన్ని అభ్యంతర పెట్టారు. తానే యజమానినని త్రిలోక్య తిరుగు జవాబు ఇచ్చారు. స్వామి వ్యతిరేక పత్రికలు ఈ వివాదాన్ని ఏదో రూపంలో కొనసాగించాయి. స్వామి పాత స్నేహితులుగా వున్నవారు కూడా తరువాత కాలంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. వారిలో ఒకరైన డాక్టర్‌ బర్రోస్‌ చికాగోలో స్వామిని సమర్ధించి కొల్‌కతా వచ్చిన తరువాత వివేకానందుడు నిజమైన హిందువు కాదని, అమెరికాలో హిందూయిజం గురించి మాట్లాడలేదని పేర్కొన్నాడు. వివేకానందుడి జీవిత చరిత్రలో ప్రస్తావించిన ఈ అంశం మంచి చెడ్డలను పక్కన పెడితే వివేకానందుడికి కూడా బహిష్కరణ తప్పలేదన్నది వాస్తవం. అయితే ఈ వివాదం, తనకు జరిగిన అవమానం, వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని వివేకానందుడు పెద్దగా పట్టించుకోలేదని జీవిత చరిత్ర రచయిత పేర్కొన్నారు. అందుకు దృష్టాంతంగా 1897 మే 30వ తేదీన రాసిన ఒక లేఖలోని అంశాలను పేర్కొన్నారు.’మత కర్మకాండలు శూద్రులకు వుద్దేశించినవి కావని మన శాస్త్రాలు చెప్పాయి. ఆహార విషయంలో వివక్ష, విదేశీ ప్రయాణంపై ఆంక్షలతో నాకు నిమిత్తం లేదు మరియు అవన్నీ నావరకు పనికిమాలినవి. నేను శూద్రుడిని మరియు మ్లేచ్ఛుడిని, ఈ సూత్రాల పాటింపు గురించి నేనెందుకు ఆందోళన చెందాలి? హిందూ సమాజంలోని అంటరానివారు మరియు మ్లేచ్ఛుల ఆహారం తీసుకోవటం నాకు సంబంధించిన విషయం.’ అని పేర్కొన్నారు.

వివేకానందుడిని స్వదేశంలో బహిష్కరించారంటూ డాక్టర్‌ బర్రోస్‌, మరికొందరు క్రైస్తవ మిషనరీలు విదేశాలలో కూడా చేస్తున్న ప్రచారం ఆయన దృష్టికి వచ్చింది. దాని గురించి మేరీ హేల్‌కు రాసిన లేఖలో ‘ ఒక సన్యాసిగా నాకు ఒక కులం అంటూ వుంటే కదా పోవటానికి అని ప్రశ్నిస్తూ నేను ఎలాంటి కులాన్ని పోగొట్టుకోలేదు కానీ సముద్రప్రయాణాన్ని వ్యతిరేకించేవారు నేను ఒక పశ్చిమ దేశానికి పోవటం గురించి కకావికలయ్యారు. మరోవైపు నేను సన్యాసిగా మారటానికి ముందు నా కులానికి చెందిన ఒక ప్రముఖ రాజు గారు నేను అమెరికా నుంచి వచ్చి ఆశ్రమంలో ప్రవేశించే ముందు నా గౌరవార్ధం పెద్ద విందు ఇచ్చారు. దానిలో ఆ కులానికి చెందిన పెద్ద వారందరూ వున్నారు. నేను బయట వీధులలోకి వెళ్లినపుడు శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు అవసరమై వుండి వుంటే అది నిజంగా బహిష్కరణ అయివుండేది అని పేర్కొన్నారు.

ఇంత జరిగాక కూడా హిందూ సమాజానికి నిజమైన ప్రతినిధులుగా చెప్పుకొనే వారిలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారణంగానే తరువాత అంబేద్కర్‌ వంటి వారు మనువాద హిందూ వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. అందువలన వివేకానందుడి జీవితంలోని అనేక అంశాలపై మరో కోణంలో విశ్లేషణ జరపాల్సి వుంది. సముద్ర ప్రయాణంపై వున్న ఆంక్షలను ఖాతరు చేయకపోవటం, దిగువతరగతి కులాలనే బడేవారితో కలసి భోజనం చేయటంలోనూ, మ్లేచ్ఛులుగా పక్కన పెట్టాలని ఆదేశించిన వారితో కలసి సభలు, సమావేశాల్లో పాల్గొనటం వంటి వాటిని ఆచరించిన వివేకానంద స్వామి సమాజంలో పురోగామి బాటలో తీసుకున్న నిర్ణయాలుగానే భావించాలి. తమను హిందువులుగా చెప్పుకున్నవారందరినీ హిందూ మతోన్మాదులుగా చూడాల్సిన అవసరం లేదు. ఆ పేరుతో వున్మాదాన్ని రెచ్చగొట్టేవారికి, ఇతరులకు వున్న తేడాను గమనించాలి. ఆ రీత్యా వివేకానంద స్వామిని మనం నిత్యం చూసే కరడు గట్టిన తిరోగమన, పరమత ద్వేషాన్ని నిత్యం నూరిపోసే విశ్వహిందూ స్వామీజీలు, సాధ్వుల సరసన పెట్టి చూడాల్సిన అవసరం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: