• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: India economy

దేవుడి మీద ఒట్టు – నిజంగానే యావత్‌ ప్రపంచం నరేంద్రమోడీ వైపు చూస్తోంది !

12 Saturday Sep 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India economy, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్‌ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్దానంతో 66లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ రోజులు పట్టదు. ఇతర దేశాల జనాభాతో పోలిస్తే మన కేసుల సంఖ్య తక్కువే అని ప్రాధమిక గణితం తెలిసిన వారు కూడా చెబుతారు. సంతోషించాల్సిన అంశమే. దీన్ని నరేంద్రమోడీ గారి విజయ ఖాతాలోనే వేద్దాం. కేసులు తక్కువగా ఉన్నపుడు లాక్‌డౌన్‌ ప్రకటించి విపరీతంగా పెరుగుతున్నపుడు ఎత్తివేసిన ఘనతను కూడా ఆయనకే ఆపాదిద్దాం.


జనవరిలోనే వైరస్‌ గురించి తెలిసినా, అధికారులు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో లాక్‌డౌన్‌ ప్రకటించకుండా, ప్రకటించినా అరకొర చర్యలతో అమెరికన్లకు ముప్పు తెచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఆ పెద్దమనిషి జిగినీ దోస్తు, కౌగిలింతల ఫేం నరేంద్రమోడీ మే 16వ తేదీ నాటికి కరోనా కేసులు పూర్తిగా ఆగిపోతాయని చెప్పిన నీతి ఆయోగ్‌ అధికారుల మాటలు నమ్మినట్లు కనిపిస్తోంది. నిజంగా తగ్గిపోతే ఆ ఖ్యాతి తనఖాతాలో ఎక్కడ పడదోనని పెద్ద నోట్లను రద్దు చేసిన మాదిరి ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో చర్చలు లేకుండా ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు నరేంద్రమోడీ. అయితే అంచనాలు తప్పి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ దశలవారీ ఎత్తివేసి మరింత పెరిగేందుకు కారకులయ్యారు, అయినా దాన్ని కూడా విజయంగానే చిత్రించేందుకు ప్రయత్నించారన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట. అధికారులదేముంది ! రాజుగారికి ఏది ప్రియమో అదే కదా చెప్పేది. తప్పుడు సలహాలు, జోశ్యాలు చెప్పిన వారి మీద చర్య తీసుకున్నారా ? అదేమీ లేదు.


అన్నీ బాగానే ఉన్నాయి. అసలు విషయం ఆర్ధికం సంగతేమిటి ? దీన్ని ఎవరి ఖాతాలో వేయాలి, ఎవరిని బాధ్యులుగా చేయాలి ? నాకు సంబంధం అంటకట్టేందుకు చూస్తున్నారు, నాకేం బాధ్యత లేదు అని జిఎస్‌టి విషయంలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గారికి పగలూ, రేయీ దేవతలతో సహా కలలోకి వచ్చిన దేవుడు ఒకటికి పదిసార్లు స్పష్టం చేశారని తెలిసింది.


పెద్ద వాటిలో ఒక్క చైనా తప్ప అనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కరోనా భాషలో చెప్పాలంటే ఆక్సిజన్‌ సిలిండర్ల మీద ఉన్నాయి. మనది వెంటిలేటర్‌ మీద ఉంది అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్న తెలుగు లోకోక్తి తెలిసిందే.జనాభాతో పోల్చుకుంటే మన కరోనా కేసులు తక్కువ అని చెబుతున్నవారు ఆర్ధిక రంగంలో అన్ని దేశాల కంటే దిగజారుడులో అగ్రస్ధానంలోకి ఎందుకు నెట్టారో మాట్లాడరేమి ? ఏమిటీ మన దేశ ప్రత్యేకత ? అదైనా చెప్పాలి కదా !
వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో అంటే ఏప్రిల్‌-జూన్‌ మధ్య జిడిపి వృద్ది రేటు 24శాతం తిరోగమనంలో ఉందని, ఇంకా లెక్కలు పూర్తిగానందున నవంబరు 28న సరైన లెక్కలు చెబుతామని కేంద్రం ప్రకటించింది. కొందరు ఆర్ధికవేత్తలు దిగజారుడు 35శాతం వరకు వుండవచ్చని చెప్పారు. నిండా మునిగిన వారికి లోతు ఎంత ఉంటేనేం ! మొదటి మూడు నెలలే కాదు మిగిలిన తొమ్మిదినెలలూ ఎంత తిరోగమనంలో ఉంటామన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం తప్ప మిగిలిన అందరూ కుస్తీపడుతున్నారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి(2021 మార్చి 31) మన ఆర్ధిక వ్యవస్ధ 14.8శాతం తిరోగమనంలో ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌, 10.5శాతమని ఫిచ్‌ రేటింగ్‌ సంస్ధలు జోశ్యం చెప్పగా మన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్ధికవేత్తలు 16.5శాతంగా పేర్కొన్నారు. వరుసగా రెండు త్రైమాసాలు(ఆరునెలలు) ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటే మాంద్యం అంటారు. స్వతంత్ర భారత చరిత్రలో 1958లో 1.2శాతం 1966లో 3.66, 1973లో 0.32, 1980లో 5.2శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. తొలి త్రైమాసిక తాత్కాలిక ఫలితాలను ప్రకటించిన తరువాత ప్రతి సంస్ధ అంతకు ముందు వేసిన అంచనాలను సవరించి లోటును మరింత పెంచింది. ఉదాహరణకు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసర్చ్‌ సంస్ద 5.3శాతంగా పేర్కొన్న లోటును 11.8శాతానికి పెంచింది.ఎస్‌బిఐ మాత్రం 20 నుంచి 16.5శాతానికి తగ్గించింది. అయితే వచ్చే జూన్‌ నాటికి ఆర్ధిక వ్యవస్ద పురోగమించవచ్చని కూడా ఈ సంస్దలు జోశ్యం చెబుతున్నాయి. రెండవ త్రైమాసంలో 12శాతం విలోమ అభివృద్ధి ఉంటుందని, రానున్న మూడు సంవత్సరాలలో సగటున పదమూడు శాతం చొప్పున అభివృద్ధి నమోదు చేస్తేనే కరోనాకు ముందున్న స్ధాయికి జిడిపి చేరుకుంటుందని క్రిసిల్‌ సంస్ధ చెప్పింది.
వాస్తవ జిడిపిలో పదమూడు శాతం అంటే 30లక్షల కోట్ల రూపాయలు శరీరం మీద మిగిలిపోయే మచ్చ మాదిరి శాశ్వత నష్టం సంభవిస్తుందని, ఆసియా-పసిఫిక్‌ ప్రాంత దేశాలలో ఈ నష్టం మూడు శాతానికి మించి ఉండదని క్రిసిల్‌ పేర్కొన్నది. జి20 దేశాలలో మన జిడిపి పతనం గరిష్టంగా ఉందని మూడీస్‌ పేర్కొన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది కూడా జిడిపిలోటులోనే ఉంటుందని అంచనా వేసింది.ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా మరింత స్పష్టంగా సచిత్రంగా చూపింది. భారత్‌లో మరో ఉద్దీపన పధకాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అభిప్రాయపడింది. ఆరోగ్యం, ఆహారం, అవసరమైన వారికి ఆదాయ మద్దతు, వాణిజ్యానికి రాయితీలు ఇవ్వాలని ఐఎంఎఫ్‌ సమాచార శాఖ అధికారి గెరీ రైస్‌ చెప్పారు. వర్తమాన సంవత్సరంలో 4.5శాతం, వచ్చే ఏడాది ఆరుశాతం తిరోగమన వృద్ధి ఉంటుందని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది.


కరోనా వైరస్‌ సమయంలో ప్రభుత్వ ఖర్చు తగ్గినకారణంగా అదిశాశ్వత నష్టాన్ని కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం తన డబ్బు సంచి ముడి విప్పకపోతే కోలుకోవటం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్రకటించాలనే సూచనలు అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి. ఇది కూడా 21లక్షల కోట్ల రూపాయల పధకం వంటిదే అయితే ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత నగుబాట్ల పాలు కావటం ఖాయం.
ఏప్రిల్‌ జూలై మాసాల్లో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 9.4లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆ వ్యవధిలో 10.5లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కంటే తక్కువ.2020-21 బడ్జెట్‌లో అంతకు ముందు సంవత్సరం కంటే మొత్తంగా 12.7శాతం అదనపు ఖర్చు ఉంటుందని ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు పెరిగింది 11.3శాతం మాత్రమే. కరోనా బాధితులను ఆదుకొనేందుకు మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పుకొనే చర్యలకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చినట్లు ? బడ్జెట్‌లో కొన్నింటికి తగ్గించి మరికొన్నింటికీ ఖర్చు చేస్తున్నారను కోవాలి. ఇది కూడా రెవెన్యూ ఖర్చు తప్ప దాని మీద వచ్చే రాబడి నామమాత్రం. దాని వలన ఆస్తుల కల్పన జరగదు, ఉపాధి పరిమితం తప్ప పెరగదు. మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వం ఖర్చు చేస్తే వాటిని వినియోగించుకొనేందుకు ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. తద్వారా కొంత ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడు అది చాలా పరిమితంగానే చేస్తున్నారు. ఇది ఆర్ధిక వ్యవస్ధ దిగజారటానికి లేదా పక్షవాత రోగి మాదిరి తయారు కావటానికి దారితీస్తుంది.


సిఎంఐయి సంస్ధ సమాచారం ప్రకారం గత రెండు సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు 1.5లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చేసిన ఖర్చు రూ.19,200 కోట్లు మాత్రమే. 2018-19 మరియు 2019-20సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు సగటున మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం లేదా ప్రయివేటు రంగం కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. అంత మొత్తం ఉన్నపుడే ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు ప్రారంభం అయింది. ఇప్పుడు జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో ప్రకటించిన నూతన ప్రాజెక్టుల విలువ ఐదోవంతు కేవలం రూ.70,600 కోట్లు మాత్రమే. గతంలో ప్రకటించిన పధకాల పూర్తి కూడా చాలా తక్కువగా ఉంది. ప్రయివేటు వినియోగం 2014 సెప్టెంబరు తరువాత కనిష్టంగా నమోదైంది.
కేంద్రం, రాష్ట్రాలు కరోనా ఉద్దీపనల పేరుతో చేసిన ఖర్చు ఏప్రిల్‌-జూన్‌ మధ్య 16శాతం పెరిగింది. ఇది పెట్టుబడులను ఆకర్షించటానికి లేదా ప్రయివేటు వినిమయం పెరగటానికి గానీ తోడ్పడదని ఆర్ధిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధి పోగొట్టుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉంటే పని చేస్తున్న వారికి కూడా వేతనాల కోత గురించి తెలిసిందే. ఇది పారిశ్రామిక, సేవా రంగాలలో మాంద్యానికి దోహదం చేసింది. ఎగుమతులు 19శాతం పడిపోయాయి. ఇది ఒక నష్టం. ఇదే సమయంలో దిగుమతులు 40శాతం తగ్గిపోయాయి. దీని అర్ధం ఏమిటి ? కొనుగోలు డిమాండ్‌ తగ్గిపోవటమే, అది కేంద్రానికి, రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి కూడా గండికొడుతుంది.
కరోనాను ఎదుర్కొనేందుకు లేదా దాని కారణంగా దిగజారిన ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు అదనపు ఖర్చు చేసినందువలన గాక ఆదాయం తగ్గిన కారణంగానే లోటు ఏర్పడుతున్నది. దానిని పూడ్చుకొనేందుకు కేంద్రం అప్పులు చేయటానికి లేదా రిజర్వుబ్యాంకును ఆదేశించి అదనంగా నోట్లను ముద్రించి కేంద్రం కొంత మేరకు బయటపడవచ్చు. రాష్ట్రాలు అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతాయి. రిజర్వుబ్యాంకు నోట్లను ముద్రిస్తే అది ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. గతంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన బిజెపికి దాని పర్యవసానాలు తెలుసు కనుక నోట్ల ముద్రణ గురించి గుంజాటన పడుతోంది. అవసరమైన సాకులు వెతుకుతోందని చెప్పవచ్చు. ఏ పేరుతో చేసినా అది సామాన్యుల నెత్తిమీద మోదటమే అవుతుంది. ద్రవ్యలోటు పన్నెండు శాతానికి పెరుగుతుందని, అప్పులు జిడిపిలో 90శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధను పునరుజ్జీవింప చేసేందుకు పెద్ద ఉద్దీపన పధకాన్ని ప్రకటించాలని ఫిక్కి అధ్యక్షురాలు సంగీతా రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. లాక్‌డౌన్‌ సడలించిన కారణంగా తమ ఆర్డర్లు పెరిగాయని 25శాతం కంపెనీలే జూన్‌లో పేర్కొనగా ఆగస్టునాటికి 44శాతానికి చేరాయని ఆమె పేర్కొన్నారు.


1933లో అమెరికా ఎదుర్కొన్న మాదిరి సవాలును ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటోందని ప్రధాని ఆర్ధిక సలహాదారుల బృంద సభ్యుడైన నీలేష్‌ షా సుప్రసిద్ద జర్నలిస్టు కరన్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బలంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను ఆదుకొని బలహీనమైన వాటిని అంతరించి పోయేందుకు అనుమతించాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రం తరువాత తొలిసారిగా దేశం ఒకేసారి వైద్య, ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, దీన్నొక అవకాశంగా మార్చుకోవాలన్నారు. ప్రపంచ పుత్తడి మండలి అంచనా ప్రకారం భారత్‌లో రెండులక్షల కోట్ల డాలర్ల విలువగల 25వేల టన్నుల బంగారం గృహస్తుల వద్ద ఉంది. దీనిలో ఎక్కువ భాగం లెక్కల్లో లేదు. అందువలన అలాంటి బంగారం కలిగిన వారందరికీ క్షమాభిక్ష పెట్టి చట్టబద్దం గావిస్తే బిలియన్ల డాలర్లను సమీకరించుకోవచ్చు అన్నారు నీలేష్‌ షా. దేశం ఇప్పటికి 500 బిలియన్‌ డాలర్ల విలువగల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే దానిలో 376 బిలియన్ల మేరకు అధికారికంగా జరగ్గా 140 బిలియన్‌ డాలర్ల విలువగలది దొంగబంగారం అన్నారు. 1933లో అమెరికా ఆర్ధిక మాంద్యం నుంచి తప్పించుకొనేందుకు బంగారాన్ని జాతీయం చేసిందని, మన దేశంలో గతంలో మొరార్జీదేశారు జాతీయానికి బదులు నియంత్రణ చట్టాన్ని తెచ్చారన్నారు. మన ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనేందుకు జనం త్యాగాలు చేయాలన్నారు. కోటక్‌ మహీంద్రా కంపెనీలో పని చేస్తున్న నీలేష్‌ షా వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పినప్పటికీ నరేంద్రమోడీకి సలహాలు ఇచ్చే సమయంలో అవి ప్రభావితం చూపకుండా ఉంటాయా, లేక వాటిని పక్కన పెట్టి మోడీగారికి ఇష్టమైన సలహాలు చెబుతారా ?


నరేంద్రమోడీ ప్రపంచ నాయకుడు, ఆయన కోసం ప్రపంచ మంతా ఎదురు చూస్తోందని బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మరొక విధంగా అది నిజమే అనిపిస్తున్నది. ప్రపంచ నేతగాకపోతే 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీ ఎందుకు పొందారు ? ఇప్పటి వరకు 14 మంది ఈ బహుమతిని పొందగా మోడీ తొలి భారతీయుడని మోడీ అభిమానులు పొంగిపోయారు. మోడినోమిక్స్‌, యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి గాను నరేంద్రమోడీకి సియోల్‌ శాంతి బహుమతి ప్రదానం ‘ అంటూ శీర్షికలు పెట్టిన పత్రికలున్నాయి. మోడినోమిక్స్‌(మోడీ తరహా ఆర్ధిక విధానం) ద్వారా భారత్‌లో మరియు ప్రపంచంలో వున్నతమైన ఆర్ధిక అభివద్ధికి అందించిన తోడ్పాటుకుగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు మన విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నది. ‘ అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివద్ధికి కషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచవ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించిన మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది అని కూడా ప్రకటన పేర్కొన్నది.


ఇంతగొప్ప నరేంద్రమోడీ ప్రధానిగా ఉండగా అమెరికాను అధిగమించే వేగంతో పెరుగుతున్న కరోనా కేసులేమిటి ? 2008 ఆర్ధిక సంక్షోభంలో దెబ్బతిన్న తాము కూడా భారత స్ధాయిలో జిడిపిలో దిగజారలేదు, అక్కడ ఇలా ఎందుకు జరుగుతోంది, ఆర్భాట ప్రకటనలేనా అసలేమీ లేదా అనే సందేహాలతో యావత్‌ ప్రపంచం భారత్‌ను, దానికి ప్రతినిధిగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగానే మోరెత్తి చూస్తోంది. లేకపోతే ఇప్పుడు మన దేశం నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకొనేది ఏమి ఉంది కనుక ? ఆస్తికులు నమ్మే, నాస్తికులు తిరస్కరించే దేవుడి మీద ఒట్టు. ఇది నిజమని అందరూ నమ్మాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రేటింగ్స్‌ కోసం మోడీ సర్కార్‌ పైరవీలు జరిపిందా ?

18 Saturday Nov 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, BJP’s trolling army, India economy, india ratings, moody’s india ratings, Narendra Modi, narendra modi bhakts

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి నేతలు జరిపిన విదేశీయాత్రలు, అందుకు అయిన విమానఖర్చుల మేరకు కూడా వారు విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులను సమీకరించలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మోడీ విదేశీ పర్యటనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో విమర్శకుల నోరు మూయించేందుకు వారికి ఒక అస్త్రం దొరికింది. గత పదమూడు సంవత్సరాలుగా మన స్ధానాన్ని చెత్త రేటింగ్‌ ఎగువన, పెట్టుబడి రేటింగ్‌కు దిగువున వుంచిన మూడీస్‌ అనే అమెరికా సంస్ధ దేశ ఆర్ధిక రేటింగ్‌ను ఒక మెట్టు పైకి పెంచింది. కొద్ది రోజుల క్రితం అదే అమెరికాకు చెందిన ప్యూ అనే సంస్ధ విడుదల చేసిన సర్వేలో కాస్త పలుకుబడి తగ్గినప్పటికీ ఇప్పటికీ నరేంద్రమోడీయే తిరుగులేని నాయకుడిగా వున్నాడని తేలిందని పేర్కొన్నారు.(ఆ సర్వే తొమ్మిదినెలల క్రితం చేసింది, ఇప్పుడు ఎందుకు విడుదల చేశారన్నది ఒక ప్రశ్న) వాణిజ్య సులభతర సూచికలో గతేడాది కంటే ఏకంగా 30పాయింట్లు తగ్గి ఎగువకు చేరింది. ఇప్పుడు మూడీస్‌ బూస్ట్‌ ఈజ్‌ద సీక్రెట్‌ ఆఫ్‌ అవర్‌ ఎనర్జీ అన్నట్లు దేశవ్యాపితంగా బిజెపి శ్రేణులు,నేతలు గంతులు వేస్తున్నాయి. దానికి వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ ఎన్నికలలో ప్రచారానికి వీటిని వుపయోగించుకొని బయటపడగలమనే సంతోషమే కారణం. అయితే వీటి ప్రభావం ఎంత మేరకు వుంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఒక వేళ మోడీ-అమిత్‌ షా రేటింగ్‌ను ఓట్ల కోసం వాడితే మిగతా రెండు సంస్ధల మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా వూరుకుంటాయా? తెనాలి రామకృష్ణ సినిమాలో ఒక చక్కటి డైలాగ్‌ వుంది. నేను నియోగిని ఎలా కావాలంటే అలా వినియోగపడతాను అంటాడు రామకృష్ణ(నిజానికి ఆ కవి అలాంటి వాడో కాదో తెలియదు) భజన మీడియా మాత్రం అలాంటిదే. కనుక దాని చిత్రణ చూసి గంతులేస్తే గోతిలో పడతారు. ఇప్పటికీ కాస్త విమర్శనాత్మకంగా చూసే విశ్లేషకులు ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండా గంతులేయాల్సినంతగా తాజా రేటింగ్‌లో ఏముందంటున్నారు.

మూడీస్‌ సంస్ధ రేటింగ్‌ చరిత్రలోకి వెళితే బిజెపి భజన బృందాలకు కాస్త ఇబ్బందేమరి. ఎందుకంటే తమ నేత వాజ్‌పేయి కాలంలో దేశం వెలిగిపోయిందని చెప్పుకున్న కాలంలో కూడా మన రేటింగ్‌ అధ్వాన్నంగానే వుంది మరి. పెట్టుబడిదారులు, భూస్వాములకు లబ్ది చేకూర్చేందుకు మన పాలకులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ వళ్లు వంచి ఎంతో కష్టపడుతున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధలతో బంధం ముడిపడిన తరువాత చేపట్టిన చర్యలకు సంస్కరణలు అని పేరు పెట్టారు. ప్రధానులుగా పని చేసిన వారిలో నూతన ఆర్ధిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఖ్యాతి తెచ్చుకున్న రాజీవ్‌ గాంధీ పాలనలో మూడీస్‌ సంస్ధ మన దేశానికి పెట్టుబడిలో ఆరవ ర్యాంకు(1988) ఇచ్చింది. విపిసింగ్‌ ఎనిమిది(1990) చంద్రశేఖర్‌ పది(1991) పివి నరసింహారావు పాలనలో పెట్టుబడేతర చెత్త రాంకులు పదకొండులో రెండోది(1991), ఆయన పాలనలోనే 1994లో పెట్టుబడిలో పదవరాంకు తరువాత దేవెగౌడ పాలనలో 1998లో కూడా దాన్నే కొనసాగించింది. అదే ఏడాది వాజ్‌పేయి అధికారానికి వచ్చిన తరువాత తిరిగి రెండవ చెత్త రాంకులోకి దిగజారింది. తరువాత ఒకటవ చెత్త రాంకులోకి, తరువాత 2004లో పెట్టుబడిపదవ రాంకులోకి పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో అదే కొనసాగి ఇప్పుడు నరేంద్రమోడీ మూడున్నర ఏండ్ల తరువాత పదినుంచి తొమ్మిదవ రాంకులోకి పెంచింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వాజ్‌పేయి హయాంలో చెత్తకు అటూ ఇటూగా వున్నందుకే తమ పాలనలో దేశం వెలిగిపోయిందంటూ బిజెపి వారు పెద్ద ఎత్తున వందల కోట్లతో ప్రచారానికి తెరతీసి జనం ముందుకు వచ్చి బక్కబోర్లా పడిన విషయాన్ని మరచి పోకూడదు. అందువలన ఈ మాత్రానికే మోడీ పరివారం పండగ చేసుకోవాలా అని కొందరు అంటున్నారు.

పిల్లి ఏ రంగుదని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా సంస్కరణలు ఏ ప్రధాని ఎలా అమలు జరిపారన్నది కాదు, దాని వలన జనానికి ఒరిగిందేమిటి అన్నదే గీటురాయి. రేటింగ్‌లో మార్పు కోసం నరేంద్రమోడీ సర్కార్‌ తెగతాపత్రయ పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా చివరకు పైరవీలకు ప్రయత్నించి విఫలమైందని రాయిటర్స్‌ సంస్ధhttps://in.reuters.com/article/india-ratings-moody-s/exclusive-how-india-lobbied-moodys-for-ratings-upgrade-but-failed-idINKBN14E09A   గతేడాది డిసెంబరు 25న ఒక వార్తను ప్రచురించింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ కూడా అదే పని చేసి భంగపడిందని వార్తలు వెలువడ్డాయి.

రాయిటర్స్‌ కథన సారాంశం ఇలా వుంది. మూడీస్‌ రేటింగ్‌ పద్దతులను భారత్‌ విమర్శించింది. రేటింగ్‌ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని సంబంధిత పత్రాలలో రాయిటర్స్‌ గమనించింది, అయితే దుర్బలంగా వున్న బ్యాంకుల తీరుతెన్నులను ఎత్తి చూపుతూ వత్తిడికి లంగేందుకు అమెరికా సంస్ధ తిరస్కరించింది. అధికారానికి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులను పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు, ద్రవ్య,కరెంట్‌ ఖాతాలోటు తేడాను తగ్గించేందుకు నరేంద్రమోడీ చర్యలు తీసుకున్నారు.అయితే ఇంకా చర్యలు తీసుకోవాలని మూడు రేటింగ్‌ సంస్దలు కోరాయి. ఆర్ధిక మంత్రిత్వశాఖ-మూడీస్‌ మధ్య నడిచిన వుత్తర ప్రత్యుత్తరాలలో రుణభారం,136బిలియన్‌ డాలర్ల విలువగల బ్యాంకుల పారుబాకీల గురించి రేటింగ్‌ సంస్ధలకు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు వెల్లడైంది. అక్టోబరులో రాసిన లేఖలు, ఇమెయిల్స్‌లో మూడీస్‌ సంస్ధ లెక్కలు కట్టే విధానాన్ని ప్రభుత్వం ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్నంతా ఆశావహంగా రుణభార సమస్య లేదని, బ్యాంకుల తీరు ఆందోళన కలిగిస్తోందని మూడీస్‌ అ వాదనలను తిరస్కరించింది. రేటింగ్‌ సంస్ధలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసాధారణంగా వుందని, రేటింగ్‌ ఏజన్సీలపై వత్తిడి చేయలేమని ఆర్ధికశాఖ మాజీ అధికారి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు. బిఏఏ రేటింగ్‌ వున్న దేశాల జీడిపిలో ఆదాయం 21.7శాతం మీడియన్‌(మధ్యరేఖ) కాగా భారత్‌లో 21శాతమే వుందని అందువలన మూడీస్‌ సంస్ధ పెట్టుబడులలో కనిష్ట రేటింగ్‌ ఇచ్చింది. రేటింగ్‌ ఎక్కువ వున్న దేశంలో రుణాలు పొందటానికి అయ్యే వ్యయం తక్కువగా వుంటుంది కనుక పెట్టుబడులు పెట్టేవారు ముందుకు వస్తారు. దేశంలో వచ్చే ఆదాయంలో ఐదోవంతుకు పైగా అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోంది.

అక్టోబరు నెలలో మూడీస్‌ ప్రతినిధికి పంపిన ఇమెయిల్‌లో సంస్ధ రేటింగ్‌ పద్దతిని మోడీ ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జపాన్‌, పోర్చుగల్‌ వంటి దేశాలు వాటి ఆర్ధిక వ్యవస్ధల కంటే రెట్టింపు రుణభారం కలిగి వున్నప్పటికీ మెరుగైన రేటింగ్‌ ఇచ్చారని పేర్కొన్నది.2004 తరువాత భారత రుణభారం గణనీయంగా తగ్గినప్పటికీ రేటింగ్స్‌లో అది ప్రతిబింబించలేదని, విదేశీమారక ద్రవ్య నిల్వలు మెరుగ్గా వుండటం, ఆర్ధిక పురోగతిని కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని అభ్యంతరం తెలిపింది. దానికి మూడీస్‌ ప్రతినిధి వెంటనే సమాధానమిస్తూ భారత్‌తో సమాన రేటింగ్‌ వున్న దేశాలతో పోల్చితే రుణభారం ఎక్కువగా వుందని, అదే సమయంలో రుణాన్ని భరించగల స్ధితి కూడా తక్కువగా వుందని పేర్కొన్నారు.బ్యాంకుల పారుబాకీల సమస్య సమీప భవిష్యత్‌లో పరిష్కారమయ్యే అవకాశాలు కూడా కనిపించటం లేదని పేర్కొన్నారు. సానుకూల వైఖరి కనిపిస్తున్నప్పటికీ గతంలో ఇచ్చిన బిఏఏఏ3 రేటింగ్‌ను మార్చే అవకాశం లేదని గ్రేడ్‌ పెంచే పరిస్ధితులు లేవని నవంబరు 16న మూడీస్‌ తెలిపింది.’

1980దశకం నాటి స్ధాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రేటింగ్‌ పెంచిన కారణంగా తక్కువ వ్యయ్యంతో విదేశాలలో భారత్‌ నిధులు తెచ్చుకొనే అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే మిగతా రెండు ప్రధాన రేటింగ్‌ సంస్ధలైన్‌ ఎస్‌అండ్‌పి, ఫిచ్‌కూడా రేటింగ్‌ పెంచితేనే అది సాధ్యం అవుతుంది. అవి కూడా వెంటనే ఆ పని చేయకపోతే మూడీస్‌ చర్యను అంతర్జాతీయ పెట్టుబడిదారులు అనుమానించే అవకాశం వుంది. అదే జరిగితే రేటింగ్‌ను తగ్గించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రెండవది ఈ రేటింగ్‌ను నిలుపుకొనే విధంగా ప్రభుత్వ చర్యల్లేకపోయినా తిరిగి తగ్గించే అవకాశాలు లేకపోలేదు. రేటింగ్‌ మెరుగ్గా లేకపోయినప్పటికీ దానితో నిమిత్తం లేకుండానే గత పద మూడు సంవత్సరాలుగా విదేశాల నుంచి నిధులు, పెట్టుబడులు కొంత మేరకు పెరిగాయి. దానికి తమ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే అని మన్మోహన్‌సింగ్‌, నరేంద్రమోడీ ఎవరికి వారు చెప్పుకోవటం సహజం. అయితే ఇప్పుడు ఈ రేటింగ్‌తో అదనంగా వచ్చేదేమిటి అన్నది ఒక ప్రశ్న. రేటింగ్‌ మెరుగైన కారణంగా ఇంకా విదేశీ నిధులు వచ్చిపడితే జరిగేదేమిటి? ఒకటి నిధులు, రుణాల వ్యయం తగ్గటం ఒక సానుకూల అంశం. ధనిక దేశాల బ్యాంకులలో మన కంటే వడ్డీరేట్లు మరీ తక్కువగా వున్నాయి. వాటితోపోల్చితే మన దగ్గర ఎక్కువ. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన హామీ వుంటే విదేశీ సంస్ధలు ముందుకు వస్తాయి.

అదే సమయంలో విదేశీ నిధుల ప్రవాహం మన రూపాయి విలువపై ప్రభావం చూపటం అనివార్యం. ఇప్పటికే రూపాయి విలువ పెరిగిన కారణంగా ఎగుమతిదార్లు పోటీని ఎదుర్కోలేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రూపాయి విలువ ఇంకా పెరిగితే ఎగుమతులు మరింతగా పడిపోతాయి. వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆ ప్రభావం మన కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రేటింగ్‌ వార్త వెలువడిన శుక్రవారం నాడు 30పైసల మేరకు విలువ పెరిగింది. అయితే రూపాయి విలువ ఎంత పెరిగితే ఆ మేరకు చమురు ధరలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలు, ప్రభావాల గురించి అనేక అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ రేటింగ్‌తో నిమిత్తం లేకుండానే విదేశీ నిధులు ఇప్పటికే వచ్చినందున రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం వుంటుందో చూడాల్సి వుంది.

ఒకటి మాత్రం స్పష్టం. ఏదో ఒక పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై పూర్తిగా సబ్సిడి ఎత్తివేశారు. గ్యాస్‌, కిరోసిన్‌పై ఎత్తివేత క్రమంగా అమలు జరుగుతోంది. ఇలాంటి చర్యలు ద్రవ్యలోటును ఎంత మేరకు పూడ్చగలవనేది చూడాల్సి వుంది. నోట్ల రద్దు ద్వారా మూడు లక్షల కోట్ల మేరకు లబ్ది చేకూరుతుందన్న అంచనాలు పోయి నష్టాలు మిగిలాయి. దీనికి తోడు బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చేందుకు ప్రభుత్వం 2.11లక్షల కోట్లను కేటాయించాల్సి వుంది. అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వాన్ని పాలక ఎన్‌డిఏ కూటమి, దానితో జతకట్టాలని వుబలాటపడుతున్నవారికి ఆందోళన కలిగించే అంశం పెరుగుతున్న చమురు ధరలు. ఇప్పటికే 60డాలర్లున్న పీపా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుందనే జోస్యాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రేటింగ్‌ ప్రయోజనాలన్నీ ఒక్క దెబ్బతో ఎగిరిపోతాయి. చమురు ధరల పెరుగుదల పర్యవసానాలను మోడీ సర్కార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్న. భారం మొత్తాన్ని జనంపై మోపితే ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానితో సంబంధం వున్న వేతనాలు,భత్యాల వంటివి పెరగాల్సి వుంది.

దేశాల రేటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలలో ఆ దేశాల రుణభారం ఒకటి. మన పొరుగునే వున్న చైనా జిడిపి వంద రూపాయలనుకుంటే దాని అప్పులు 43, అదే మన దేశానికి వస్తే 68 రూపాయలుగా వుంది. మన వంటి రేటింగ్‌ వున్న దేశాల మీడియన్‌ 44 మాత్రమే. అమెరికా, బ్రిటన్‌లకు 70శాతం వుంది. ఆ దేశాలకు అంత అప్పు వున్నప్పటికీ వాటికి తీర్చే సత్తా కూడా వుంది. మన పరిస్ధితి అది కాదు.ఎస్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ధ మన దేశ అప్పు దామాషా 60లోపుగా వుండాలని షరతు లాంటి వత్తిడి చేస్తోంది. రేటింగ్‌ పెంపుదల కోసం మూడీస్‌ సంస్ధతో మోడీ సర్కార్‌ లాబీయింగ్‌(పైరవీ) చేసిందని చెప్పిన రాయిటర్స్‌ మరో అమెరికన్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి, బ్రిటన్‌ కంపెనీ ఫిచ్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు మూడీస్‌ చేసిన సవరణను మిగతా రెండు సంస్ధలు కూడా అనుసరిస్తాయా? అది తేలేంత వరకు మోడీ భక్తులకు బిపి పెరగటం ఖాయం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ నోరు మూస్తే ఏమిటి ? తెరిస్తే ఏమిటి ?

29 Friday Sep 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Arun jaitly, BJP, BJP-led NDA, economic mess, India economy, Narendra Modi, rupee value

ఎం కోటేశ్వరరావు

మిన్ను విరిగి మీద పడ్డా తన అంతరాత్మ అయిన అమిత్‌ షాతో మనకు లాభమో నష్టమో చెప్పు, అవసరమైతే నోరు విప్పుతా అంటారు ప్రధాని నరేంద్రమోడీ. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు దాన్నే నిర్ధారిస్తున్నాయి. ప్రయోజనం లేని మొగుడు తోటలో వుంటేనేం కోటలో వుంటే ఏమిటి ప్రయోజనం అన్న సామెత మాదిరి మోడీ వచ్చి మూడు సంవత్సరాల నాలుగు నెలలైంది ఆయన నోరు తెరిస్తే ఏమిటి మూస్తే ఏమిటి అని జనం అనుకోవటం ప్రారంభించారు. ఆ పెద్ద మనిషి మూసుకున్నా దేశం కోసం మేం నోరు తెరవక తప్పదంటున్నారు బిజెపి నేతలు. మోడీ పోయినా పార్టీని దక్కించుకోవాలి కదా మరి ! ఇంతకాలం చెప్పిన వాటికి భిన్నంగా ఇప్పుడు వాస్తవాలను చెప్పినా జనం నమ్ముతారా ? అన్నది అసలు సమస్య !

డాలరుతో మారకంలో రూపాయి బలపడినట్లే కనిపించి తిరిగి పతనం అవుతోంది. ఆ క్రమంలో అది పడుతూ లేస్తూ వుంది. సెప్టెంబరు ఎనిమిదిన గరిష్ట స్ధాయిలో రు.63.78 వున్నది కాస్తా ఆ తరువాత 194పైసల విలువ కోల్పోయింది. బుధవారం నాడు 65.72కి చేరింది. శుక్రవారం నాడు 65.31గా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా వేల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప. బ్యాంకులు చేశాయా, పాలకులు చేయించారా అన్నది జనానికి అనవసరం మనవి ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక పాలకులే మనకు బాధ్యులు. 2016 మార్చి వరకు అంతకు ముందు ఐదు సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం బకాయి 2,25,180 కోట్ల రూపాయలు. అంతకు ముందు ఆరు సంవత్సరాలవి కూడా కలుపుకుంటే రెండున్నరలక్షల కోట్ల రూపాయలు. రుణగ్రస్తులైన సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది తప్ప పెద్దలకు లేదు.విజయమాల్య వంటి వాడైతే అమ్మాయిలను వెంటేసుకొని మరీ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. గత ఆరునెలలుగా రూపాయి బలపడితే కొంత మంది వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు కొంత మంది వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అని పిస్తోంది. రూపాయి విలువ పెరిగినపుడే పెట్రోలు ధరలను మండిస్తుంటే ఇదేంట్రా బాబూ అనుకుంటున్న జనానికి రూపాయి విలువ పడిపోయిందంటే మరింతగా బాదుడు తప్పదు. అయినా సరే నరేంద్రమోడీ నోరు విప్పరు, ఇలాంటి మేళాన్నా మనం తలకెక్కించుకున్నాం !

కొత్తల్లుడు నోరు విప్పకపోతే మాఅల్లుడి పలుకే బంగారం అని అత్తామామలు మురిసి పోతారు, ఏదైనా వుంటే గదిలోకి తీసుకు వెళ్లి అమ్మాయికే చెబుతాడు అని అత్తింటి వారు సిగ్గుపడుతూ తొలి రోజుల్లో గొప్పగా చెప్పుకుంటారు. కానీ పాతపడిన తరువాత సమయం వచ్చినపుడు కూడా నోరు తెరవకపోతే మీ ఆయనకదేం జబ్బే అని అడిగితే నేనూ మోసపోయా, ఆయనకు నత్తి, మాట్లాడటం సరిగా రాదు అని కూతురు అసలు విషయం చెప్పక తప్పదు. మా మోడీ ఎలాగూ మాట్లాడరు కనుక మేం మాట్లాడక తప్పదు అంటున్నారు బిజెపి అగ్రనేతలలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా . ఆర్ధిక రంగాన్ని చిందరవందర చేసిన మంత్రి అరుణ్‌జైట్లీ గురించి ఇప్పటికీ నేను నోరు విప్పక పోతే నా బాధ్యతలను విస్మరించిన వాడిని అవుతాను. పార్టీలో పెద్ద సంఖ్యలో వున్నటువంటి, బయట మాట్లాడటానికి భయపడే వారి తరఫున నేను మాట్లాడుతున్నాను అన్నారాయన. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇలా ప్రతి చర్యనూ మోడీకి ఆపాదించిన పూర్వరంగంలో ఆయన పూలనే కాదు రాళ్లను కూడా భరించాల్సి వుంటుంది. అయితే ‘ అంత సహనం’ ప్రస్తుతం బిజెపిలో లేదు. అందుకే లోతు తెలుసుకొనేందుకు ఆంచులను తాకి చూస్తున్నట్లుగా యశ్వంత సిన్హా ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీని ఎంచుకున్నారు. ఆయనేమీ తక్కువ తినలేదు, అసలు విషయాలు చెప్పకుండా 80 ఏండ్ల వయస్సులో వుద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని సిన్హాను ఎత్తిపొడిచారు. అంతే కాదు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా వున్న సిన్హా కుమారుడు జయంత సిన్హా చేత పోటీగా తండ్రి వ్యాసానికి ఖండనగా మరో పత్రికలో వ్యాసం రాయించారు.మంత్రిత్వశాఖకు సంబంధం లేని తమ కుమారుడి చేత వ్యాసం రాయించిన పెద్దలు మరి అతనిని సహాయ ఆర్ధిక మంత్రిగా ఎందుకు తొలగించారో అని యశ్వంత సిన్హా ఎత్తి పొడిచారు. కొడుకు వ్యాసంలో పెద్ద పసేమీ లేదనుకోండి.

ఇంతకీ సీనియర్‌ సిన్హా చెబుతున్నదేమిటి? ప్రయివేటు పెట్టుబడులు గత రెండు దశాబ్దాల కనిష్టానికి తగ్గిపోయాయి. పారిశ్రామిక వుత్పత్తి మొత్తంగా కుప్పకూలిపోయింది. వ్యవసాయం సంక్షోభంలో వుంది. పెద్ద సంఖ్యలో వుపాధి కల్పించే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో వుంది. ప్రతి త్రైమాసికానికి అభివృద్ధి రేటు పడిపోతూ 5.7శాతానికి చేరింది. ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు నోట్ల రద్దు ఆజ్యం పోసింది. ప్రస్తుత ప్రభుత్వం 2015లో జిడిపి లెక్కింపు పద్దతిని మార్చింది. ఫలితంగా రెండువందల ప్రాతిపదిక పాయింట్లు పెరిగి అభివృద్ధి రేట్లు రికార్డయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.7, అదే పాత లెక్కల ప్రకారం అయితే 3.7 లేదా అంతకంటే తక్కువ. నరేంద్రమోడీ నోరు మూసుకొని గానీ ఇతర మంత్రులు, బిజెపి నేతలు తెరిచిగానీ ఈ అంకెలను సవాలు చేసే స్ధితిలో లేరు.

దేశ ఆర్ధిక వ్యవస్ధకు వుద్దీపన కలిగించనున్నారనే వార్తలు రావటంతోనే వరుసగా వారం రోజుల పాటు స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఇంటి పెద్ద సామర్ధ్యం మీద ఒకసారి అపనమ్మకం కలిగిన తరువాత బయటి వారే కాదు జాగ్రత్తగా గమనిస్తే ఇంట్లో వారే ఎవరికి వారు జాగ్రత్త పడటం వుమ్మడి కుటుంబాల్లో తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ పరిస్ధితి అలాగే వుందంటే అతిశయోక్తి కాదు. యశ్వంత సిన్హా చెప్పినట్లు గణాంక విధానం మార్చిన కారణంగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఒక ఏడాది తరువాత అభివృద్ధి ఎంతో పెరిగినట్లు కనిపించింది. అది వాపు తప్ప బలుపు కాదని అప్పుడే ఎందరో చెప్పారు. ఇప్పుడు రుజువైంది. ఇంకా వాపుగానే కనిపిస్తున్నప్పటికీ మూడు సంవత్సరాల కనిష్టానికి మన అభివృద్దిరేటు పడిపోయింది. నిజానికి ఈ పరిస్ధితిని అధికారంలో వున్న పెద్దలు వూహించలేదా అంటే నమ్మటం కష్టం. మార్కెట్లో చెలామణి అవుతున్న నల్లధనాన్ని వెలికి తీయటానికి పెద్దనోట్ల రద్దు అనే తప్పుడు ఇచ్చిందెవరో మోడీ పదవీచ్యుతుడై ఎన్‌డిఏలో ముసలం పుట్టిన తరువాత గానీ బయటకు రాదు. దానితో నాలుగు లక్షల కోట్లరూపాయల రాబడి అప్పనంగా ప్రభుత్వానికి వస్తుందని ఆ మొత్తంతో కొన్ని మెరుపులు మెరిపించి మంచి రోజులొచ్చయనే ప్రచార హోరులో మధ్యంతర ఎన్నికలతో మరో ఐదు సంవత్సరాలకు ఓట్లు కొల్లగొడదామని వేసిన అంచనాలు నీరు గారిపోయాయి. మోడీ ప్రతిష్టనిర్మాణంలో భాగంగానే నోట్ల రద్దు ఆయన తీసుకున్న నిర్ణయమే అని ఆపాదించిన వారు అదిప్పుడు శాపంగా మారిందని అర్ధమైన తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి వున్నారు.ముఖ్యమంత్రిగా వుండగా తీవ్రంగా వ్యతిరేకించిన జిఎస్‌టి అమలు మంచి చెడ్డలను పూర్తిగా ఆధ్యయనం చేయకుండానే ఆదరాబాదరా అమలులోకి తెచ్చారు. ఈ రెండు చర్యలూ తాత్కాలికంగా అయినా ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనానికి కారణమయ్యాయని మోడీ సర్కారు తప్ప అందరూ అంగీకరిస్తున్నారు. అంతా బాగుంది, ఏదైనా వుంటే అది తాత్కాలికమే అని సొల్లు కబుర్లు చెబుతున్న పెద్దలు వాటినే కొనసాగిస్తే ఒక దారి. కానీ ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పని చేయించేందుకు ఒక వుద్దీపన పధకం గురించి కసరత్తు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఆరుణ్‌జైట్లీ సెప్టెంబరు 20న చేసిన ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి.

మరో ఆరు రోజుల తరువాత గత మూడు సంవత్సరాలుగా మూలన పడవేసిన ప్రధాని ఆర్ధిక సలహా మండలి దుమ్ముదులిపారు. ఇది ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న భయాలను మరింత పెంచేదే తప్ప తగ్గించేది కాదు. ఇప్పటి వరకు ద్రవ్యలోటు 3.2శాతం కంటే పెరగరాదు అన్న ఆంక్షలను చూపి అన్ని రకాల పెట్టుబడులు, అభివృద్ధి పనులకు కోత పెట్టిన సర్కార్‌ ఇప్పుడు కట్టుకున్న ఆ మడిని పక్కన పెట్టి ఆర్ధిక వ్యవస్ధలోకి అదనంగా 50వేల కోట్లను కుమ్మరించి ఆర్ధిక మందగింపును ఆపగలమా అని సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న మంద్యానికి కారణంగా గత మూడు సంవత్సరాలుగా గ్రామీణ ఆర్ధిక వ్య వస్ధలో రైతాంగ వుత్పత్తులకు ధరలు పడిపోవటం ఒక ప్రధాన కారణంగా అనేక మంది చెబుతున్నారు. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్ధలో నిరర్ధక ఆస్థులు 2013 మార్చి నాటికి 1.56లక్షల కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది మార్చినాటికి 6.41లక్షల కోట్లకు పెరిగాయి. రుణాలు ఇచ్చింది మన్మోహన్‌ సర్కారే అనుకుందాం వసూలు చేయకుండా మోడీ సర్కార్‌ను అడ్డుకున్నదెవరు? యుపిఏ హయాంలో విజయమాల్య వేల కోట్లు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతుంటే నరేంద్రమోడీ సర్కార్‌ వెళ్లిరండి సార్‌ అని విమానం ఎక్కించిందా లేదా ? ప్రతి వారూ పరిశ్ర మలు, వ్యాపారాలకు వడ్డీ రేటు తగ్గించమని కోరేవారే తప్ప అదే సూత్రం వ్యవసాయానికి ఎందుకు వర్తింపచేయరని అడుగుతున్నవారేరి?

నరేంద్రమోడీ సర్కార్‌ అప్పుచేసి పప్పుకూడు అన్నట్లుగా వ్యవహరిస్తోందంటే చాలా మంది నమ్మరు. మన ప్రభుత్వాలు ఏటా ఎంత మొత్తం అప్పు తెచ్చుకోవాలో, దాన్నెట్లా తీర్చుకోవాలో ముందే నిర్ణయించుకుంటాయి. ఆ మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పన్నెండు నెలల్లో వంద రూపాయల అప్పు తీసుకోవాల్సి వుంటే మొదటి నాలుగు నెలల్లోనే 92 తీసుకొని అనుభవజ్ఞుడైన నరేంద్రమోడీ ఖర్చు పెట్టేశారు. అందువలన ఏ మాత్రం అదనంగా ఖర్చు చేయాలన్నా అప్పులన్నా తేవాలి లేదా అదనంగా నోట్లన్నా అచ్చువేయాలి. మొదటి పని చేస్తే అభివృద్ధి పనులు ఆగిపోయి అప్పులు తీర్చుకోవాల్సి రెండోది జరిగితే జనానికి ధరలు పెరుగుతాయి. బలి ఇవ్వటానికి మంచి యువకుడి కోసం దుర్భిణీ వేసి వెతికిన పాతాళభైరవి మాంత్రికుడి మాదిరి నరేంద్రమోడీ ఏదైనా మంత్రదండం దొరక్క పోతుందా అని వెతుకుతున్నారు. ఏదైనా పిచ్చిపని చేసి జనం దృష్టిని మళ్లిస్తే తప్ప అల్లావుద్దీన్‌ అద్బుత దీపాలకు, మంత్రదండాలకు పరిష్కారమయ్యేవి కాదిప్పుడు ముసురుకున్న సమస్యలు. వచ్చేటపుడు మంచిదినాలను తెస్తున్నా అన్న మోడీ చెడ్డదినాలతో పోయాడు అని పించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

India’s Foreign Trade (Merchandise): December, 2015

19 Tuesday Jan 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

India economy, India Exports, India Imports, India TRADE BALANCE, India’s Foreign Trade

  1. EXPORTS (including re-exports)

Exports during December, 2015 were valued at US$ 22297.48 million (Rs. 148491.18 crore) which was 14.75 per cent lower in Dollar terms (9.53 per cent lower in Rupee terms) than the level of US$ 26154.46 million (Rs. 164127.08 crore) during December, 2014. Cumulative value of exports for the period April-December 2015-16 was US$ 196603.94 million (Rs. 1273322.99 crore) as against US$ 239928.91 million (Rs. 1458094.40 crore) registering a negative growth of 18.06 per cent in Dollar terms and 12.67 per cent in Rupee terms over the same period last year.

Non-petroleum exports in December 2015 are valued at US$ 19931.91 million against US$ 21631.89 million in December 2014, a reduction of 7.86%. Non-petroleum exports during April to December 2015 are valued at US$ 173291.60 million as compared to US$ 191359.32 million for the corresponding period in 2014, a reduction of 9.4%.

The trend of falling exports is in tandem with other major world economies (the growth in exports have fallen for USA, European Union, China  by 10.30, 10.83, 6.94 per cent respectively for October 2015 over the corresponding period previous year as per WTO statistics).

  1. IMPORTS

            Imports during December, 2015 were valued at US$ 33961.48 million (Rs. 226168.20 crore) which was 3.88 per cent lower in Dollar terms and 2.00 per cent higher in Rupee terms  over the level of imports valued at US$ 35333.27 million (Rs. 221726.88 crore) in December, 2014. Cumulative value of imports for the period April-December 2015-16  was US$ 295811.69 million (Rs. 1915849.40 crore) as against US$ 351613.95 million (Rs. 2136855.40 crore) registering a negative growth of 15.87 per cent in Dollar terms and 10.34 per cent in Rupee terms over the same period last year.

  1. CRUDE OIL AND NON-OIL IMPORTS:

Oil imports during December, 2015 were valued at US$ 6656.74 million which was 33.19 per cent lower than oil imports valued at US$ 9963.44 million in the corresponding period last year. Oil imports during April-December, 2015-16 were valued at US$ 68068.20 million which was 41.60 per cent lower than the oil imports of US$ 116559.48 million in the corresponding period last year.

Non-oil imports during December, 2015 were estimated at US$ 27304.74 million which was 7.63 per cent higher than non-oil imports of US$ 25369.83 million in December, 2014. Non-oil imports during April-December, 2015-16 were valued at US$ 227743.49 million which was 3.11 per cent lower than the level of such imports valued at US$ 235054.47 million in April-December, 2014-15.

  1. TRADE BALANCE

The trade deficit for April-December, 2015-16 was estimated at US$ 99207.75 million which was lower than the deficit of US$ 111685.04 million during April-December, 2014-15.

 

 

INDIA’S FOREIGN TRADE (SERVICES): November, 2015

(As per the RBI Press Release dated 15th January, 2016)

  1. EXPORTS (Receipts)

Exports during November, 2015 were valued at US$ 12019 Million (Rs. 79466.14 Crore).

  1. IMPORTS (Payments)

Imports during November, 2015 were valued at US$ 5686 Million (Rs. 37594.18 Crore).

  1. TRADE BALANCE

The trade balance in Services (i.e. net export of Services) for November, 2015 was estimated at US$ 6333 Million.

 

EXPORTS & IMPORTS (SERVICES) : (US $ Million)
 (PROVISIONAL) November 2015-16
EXPORTS (Receipts) 12019.00
IMPORTS (Payments) 5686.00
TRADE BALANCE 6333.00
   
EXPORTS & IMPORTS (SERVICES): (Rs. Crore)
(PROVISIONAL) November 2015-16
EXPORTS (Receipts) 79466.14
IMPORTS (Payments) 37594.18
TRADE BALANCE 41871.96
Source: RBI Press Release dated 15th January 2016

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ పెత్తనంలో కొత్తది రాలేదు, వున్నది పోయింది !

04 Monday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

India economy, India PMI, Narendra Modi

సత్య

మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి కానుంది. అందువలన ఎవరైనా ఇంకా హనీమూన్‌ కాలమనో మరొకటనో కారణాలు చెప్పటానికి లేదు. అసలు ఆయన తన స్వంత జీవితంలోనే కట్టుకున్న భార్యను వదలివేసి ఆర్‌ఎస్‌ఎస్‌ సేవకు అంకితమైన వ్యక్తి. సంసార లంపటానికి దూరంగా వున్న వ్యక్తి. అలాంటి వారు ఇంట్లో కాకుండా ఎక్కువ కాలం బయటే గడుపుతారు. అందువలన దేశాన్నే తన ఇల్లనుకున్నారు గనుక ఎక్కువగా విదేశాల్లో వున్నట్లు కనిపించినా అనిపించినా నిరంతరం తన గుజరాత్‌ మోడల్‌ను దేశం మొత్తం మీద అమలు జరిపేందుకే ఆలోచించారని ఆయన మద్దతుదారులు చెప్పినదాన్ని బట్టి ఇప్పటివరకూ దేశం నమ్ముతోంది. రాయిటర్‌ వార్తా సంస్ధ సోమవారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆయన ఇచ్చిన మేక్‌ ఇన్‌ ఇండియా పిలుపు మన పారిశ్రామిక రంగాన్ని వుత్తేజ పరిచినట్లు లేదు. కాగా పోగా వున్నదీ పోయిందీ……పోయిందీ అన్నట్లుగా గతరెండు సంవత్సరాలలో మొదటి సారిగా డిసెంబరులో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గినట్లు ఒక సర్వేలో తేలిందన్నది వార్త సారాంశం.

నవంబరులో నికీ పిఎంఐ(పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) సూచిక నవంబరులో 50.3 వుండగా డిసెంబరులో 28 నెలల కనిష్టం 49.1కి తగ్గినట్లు మార్కిట్‌ అనే ఒక సంస్ధ తయారు చేసిన సమాచారం వెల్లడించింది. మౌన ముని మన్మోహన్‌సింగ్‌ హయాంలో దీనికి పునాది పడిందని చెప్పుకున్నా వర్తమాన స్ధితికి ఎన్నికల ముందు మాటల ముని తరువాత మౌన మునిగా మారిన నరేంద్రమోడీ తప్ప మరొకరు సమాధానం చెప్పేందుకు లేదు.

భారత వస్తువుత్పత్తి రంగం ఏడాది చివరిలో అధోగతి వైపు మళ్లింది, ఇప్పటికే అంతర్గత డిమాండ్‌ అయోమయంలో వుంటే దేశ దక్షిణాదిన వచ్చిన వరదలు మరింతగా దెబ్బతీశాయని మార్కిట్‌ సంస్ధ ఆర్దికవేత్త పోలీయనా డె లిమా వ్యాఖ్యానించారు. వుత్పత్తి వుప సూచిక నవంబరు నెల 50.4తో పోల్చితే డిసెంబరులో 46.8 పాయింట్లకు తగ్గిపోయింది.ఇది 2009 ప్రారంభం తరువాత కనిష్టం. రెండు సంవత్సరాలలో తొలిసారిగా కొత్త ఆర్డర్లు తగ్గిపోయాయి.

ద్రవ్యోల్బణం అదుపులో వుంటే రుణ విధానాన్ని జూన్‌ నాటికి మరింత సరళతరం గావించాలన్న రిజర్వుబ్యాంకు ఆలోచనలను బలహీన అభివృద్ది మరింత కఠినతరం చేసేందుకు తోడ్పడుతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 6.75శాతం వుంది. తాజా సర్వే ప్రకారం పెట్టుబడుల ధరలు పెరిగిన కారణంగా వస్తు వుత్పత్తుల ధరలూ పెరుగుతున్నాయి. నరేంద్రమోడీ చేతిలో 130 కోట్ల సంసారమనే దేశాన్ని పెట్టాం, పారిశ్రామిక వుత్పత్తులే కాదు, ఎగుమతులు కూడా తగ్గిపోతున్నాయని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. కౌపీన సంరక్షణార్ధం సన్యాసి సంసార జంఝాటంలో ఇరుక్కున్న కధ మనకు తెలుసు. నరేంద్రమోడీ సన్యాసో సంసారో తెలియదు గానీ పారిశ్రామిక వుత్పత్తి తగ్గటం అంటే దాని ప్రభావం అన్ని రంగాలు దిగజారటానికి కారణం అవుతుంది.పచ్చని సంసారాలు ఆరిపోతాయి. గోచి కధకు ప్రతికూలంగా జరుగుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?
  • మీరు ఎటు వైపో తేల్చుకోండి

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: