• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: India-Pakistan

ప్రపంచీకరణకు అనుకూలమెవరు, వ్యతిరేకమెవరు ? ఎందుకు ?

01 Tuesday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Others, UK, USA

≈ Leave a comment

Tags

anti globalisation, anti globalization movement, anti-neoliberal, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ పర్యవసానాలు-2

     ప్రపంచీకరణ గురించి రెండు అభిప్రాయాలు వున్నాయి. అది ప్రపంచానికి మంచి చేస్తుందని కొందరంటే చెడు చేస్తుందని మరికొందరు చెబుతారు. చరిత్రలో వర్గాలు లేనటు వంటి ఆదిమ సమాజాన్ని( దాన్నే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని కూడా పిలుస్తారు) మినహాయిస్తే సమాజంలో వర్గ విభజన జరిగినప్పటి నుంచి ప్రతి కొత్త దశలోనూ దాని మంచి చెడ్డలపై రెండు అభిప్రాయాలు వెలువడుతూనే వున్నాయి. బానిస, అర్ధబానిస లేదా ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటా ఒక వర్గానికి మేలు జరుగుతూనే వుంది. అలాంటి వారంతా దానిని కాపాడుకొనేందుకు అవసరమైన సాహిత్యం, మూఢనమ్మకాలు, నమ్మకాలు, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేశారు. నష్టపోయిన వర్గం ఆ వ్యవస్ధలను కూల్చివేసేందుకు, జనాన్ని కూడగట్టేందుకు తనదైన సాహిత్యం, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా వున్న ప్రపంచీకరణ భావన, పద్దతుల గురించి కూడా ఇదే విధమైన రెండు రకాల సాహిత్యాలు వెలువడుతున్నాయి. ఒక గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పుకు దారితీయాలంటే అందుకు అనువైన పరిస్థితులు తయారు కావాలి. ఆవిరి రావాలంటే నీరు వంద డిగ్రీల వుష్ణోగ్రత వరకు మరగాల్సిందే. ఆలోగా కుండ లేదా పాత్ర లోని నీటిలో అనేక మార్పులు జరుగుతాయి తప్ప అవి మనకు కనిపించవు. అందరూ ఇష్టపడే అందమైన సీతాకోక చిలుక అవతరించటానికి ముందు అది అసహ్యించుకొనే గొంగళి పురుగు రూపంలో వుంటుంది. ప్రపంచీకరణ అన్నది పెట్టుబడిదారీ వర్గం రూపొందించిన తాజా అధునాతన దోపిడీ అస్త్రం.కార్మికవర్గం గుర్తించలేనంత సమ్మోహనంగా వుండి, వారి మద్దతు కూడా పొందేంత అంటే అతిశయోక్తికాదు. తెలిసో తెలియకో కార్మికవర్గం మద్దతు లేదా వుపేక్ష కారణంగానే అదింకా బతికి బట్టగలుగుతోంది. బానిస, ఫ్యూడల్‌ వ్యవస్ధలను అదుపు చేసిన వర్గాలు అవి కూలిపోయేంత వరకు శాశ్వతమనే భ్రమించాయి,భావించాయి. జనంలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఆ వ్యవస్ధలలో కూడా పాలకవర్గం సంస్కరణలు ప్రవేశపెట్టకపోలేదు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్ధ కూడా అదే భావంతో, అదే బాటలో వుంది. సహజం.

     ప్రపంచీకరణను వ్యతిరేకించే వారు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారా ? కానే కాదు, ముందటి సమాజాలు, తరతరాల అనుభవసారం నుంచి దానిని గ్రహించారు.ఒక విధానం మంచిదా కాదా అని నిర్ధారించటానికి ఎంత కాలం కావాలి? ప్రాతిపదికలేమిటి ? ప్రపంచీకరణ పేరుతో తీసుకున్న లేదా ఇంకా ప్రతిపాదిస్తున్న చర్యలన్నీ సామాన్య జనానికి తక్షణం హాని చేసేవి, అయితే శరీరంలో దెబ్బతిన్న భాగాన్ని తొలగించాలంటే శస్త్ర చికిత్స చేయాలి, తొలుత బాధగానే వున్నప్పటికీ తరువాత జీవితాంతం సుఖం అనుభవిస్తారు కనుక తాత్కాలిక బాధను భరించాలని ప్రపంచీకరణ వాదులు నమ్మబలుకుతారు.చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచీకరణ కోరుకున్న వారే భిన్న స్వరాలు వినిపిస్తున్నారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/world-faces-long-period-of-stagnation-ahead  సత్యజిత్‌ దాస్‌ అనే ఒక బ్యాంకరు ‘ నిండుకున్న ప్రపంచ అమ్ముల పొది’ అనే పేరుతో బ్లూమ్‌బెర్గ్‌ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు. ‘ పురోభివృద్ధిని పునరుద్దరించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తాము చేయగలిగినవి ఇంకా ఎన్నో వున్నాయని చెబుతూనే వున్న ప్రపంచ విధాన రూపకల్పనవేత్తలు ఎవరూ కూడా ఓటమిని అంగీకరించటానికి సిద్ధ పడటం లేదు. రెండు కాళ్లూ పొగొట్టుకొని దారిలో పడివున్న మల్లయ్య నేను లేస్తే మనిషిని కాను అని విజయం సాధించిన వారిని బెదిరించే మాదిరి వారి తీరు వుంది. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకుల దగ్గర ఇంక ఆయుధాలేమీ మిగల్లేదు.’ ఇలా ప్రారంభమైంది.

     ‘ ప్రపంచవ్యాపితంగా డిమాండ్‌ మందగించటం, అనేక పరిశ్రమలు సామర్ధానికి మించి వుండటం వంటి పర్యవసానాలతో పెట్టుబడి నలిగిపోతోంది. కొన్ని బ్యాంకుల దగ్గర కొండల మాదిరి కారుచౌకగా దొరికే డబ్బు పేరుకుపోతున్నప్పటికీ రుణాలు తీసుకొనే వారు ముందుకు రావటం లేదు. ధన చలన వేగం చాలా తక్కువగా వుంది. తక్కువ లేదా ప్రతికూల వడ్డీ రేట్ల కారణంగా నిధులు సమకూర్చటం, బ్యాంకుల లాభాలు దెబ్బతింటున్నాయి. తమ పొదుపును మరోచోటికి బదలాయించుకోవటం, నగదుగా మార్చుకోవటం వంటి చర్యలను ప్రభుత్వాలు నిషేధించటం వంటి చర్యలు చేపడితే తప్ప వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు వాటిని ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు. పెన్షన్‌ నిధులు, వుద్యోగ విరమణ తరువాత ఇచ్చే లబ్ది గురించి చేసుకున్న ఒప్పందాలు, బీమా కంపెనీల సామర్ధ్యాలను ఇప్పటికే ప్రతికూల వడ్డీ రేట్లు ప్రశ్నిస్తున్నాయి. అనేక ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు, చివరికి కంపెనీల వాటాలను కూడా కొనుగోలు చేయటం ద్వారా విత్త మార్కెట్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ జపాన్‌ రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఆ పని చేసింది.ఆర్ధిక వ్యవస్ధపై ప్రభుత్వ పట్టు పూర్తిగా వుండేందుకు లెనిన్‌ హయాంలో సోవియట్‌ యూనియన్లో జరిగిన మాదిరి రిజర్వుబ్యాంకులు తమ అధికార కత్తులను ఝళిపించటం పెరిగిందన్నది నిజం. ఇదే సమయంలో ఈ విధానాల పరిమితులన్నీ అయిపోతున్నట్లు అందరికీ కనిపిస్తోంది. జపాన్‌, ఐరోపా దేశాల రిజర్వు బ్యాంకులకు కొనుగోలు చేసేందుకు తగిన బాండ్లు కనిపించటం లేదు. అంతా అనివార్యమని చెప్పలేముగాని వడ్డీ రేట్ల మరింత తగ్గింపు, పరిమాణాత్మక ఆంక్షలు మరింత సడలింపు మార్కెట్‌ రేట్లు, ఆస్థుల ధరలు లేదా నగదు విలువలపై పెద్ద ప్రభావమే చూపుతాయి.

     ఈ పరిస్ధితి మాంద్యంగా వున్న వాటికి ప్రభుత్వాలు ఆర్ధిక వుద్దీపనలు కలిగించటం అనే ఒక నూతన ఏకాభిప్రాయాన్ని పురికొల్పింది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు లోటుతో నడుస్తున్నాయి.కొన్ని వ్యవస్ధాగతమైన లోపాలతో వున్నాయి. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు అదనంగా ఖర్చు చేస్తే తరువాత అది ప్రభావశీలంగా వుండాలంటే తరువాత కూడా కొనసాగించాల్సిందే. మౌలిక వసతుల వంటి వాటికి పెట్టుబడులు పెడితే తరువాత ప్రాజెక్టును బట్టి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు కృత్రిమంగా తక్కువ వడ్డీ రేటు లేదా ప్రతికూల వడ్డీ రేట్లతో డబ్బు తీసుకు వచ్చి ఖర్చు చేయటం అంటే దాని అర్ధం ప్రతిఫలం లభిస్తుందని కాదు. పెద్దగా ప్రయోజనం లేని ఆస్థులపై పెట్టిన పెట్టుబడిగా మారే ప్రమాదం వుంది.’

      ప్రపంచీకరణ వెనక్కు నడుస్తోంది అనే పేరుతో మరొక సమర్ధకుడు ఒక విశ్లేషణ చేశారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/globalization-goes-into-reverse ఇది కూడా ఆసక్తి కలిగించేదే. నోవా స్మిత్‌ అనే రచయిత తన విశ్లేషణను ఇలా ప్రారంభించాడు.’ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేక పశ్చిమ దేశాలలో ప్రతి క్రియ జరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం, వలసలకు సంబంధించి అమెరికన్లు ఇప్పటికీ సానుకూల అంశాల గురించి చెప్పవచ్చు, రాజకీయ అభ్యర్ధులైన ట్రంప్‌, బెర్నీ శాండర్స్‌ వంటివారు ఒక దశాబ్దం క్రితం వూహించటానికే అవకాశం లేని ఈ రెండింటిని వ్యతిరేకించే వారిని నుంచి ఒక పరిధి మేర ఎంతో మద్దతు పొందుతున్నారు. వాణిజ్య లావాదేవీలలో అంతగా తెలియని పసిఫిక్‌ సముద్ర రాజ్యాల భాగస్వామ్య (టిపిపి) ఒప్పందం ప్రమాదంలో పడింది. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులు తీసుకోవటాన్ని కూడా ప్రపంచీకరణకు తిరస్కరణే అన్నది ఏక కంఠంతో చెప్పిన భాష్యం. కానీ నేటి ప్రపంచీకరణ వ్యతిరేక యుద్ధ వీరులు నిన్నటి యుద్ధం గురించి పోరాడుతున్నారు. ఏ విధంగా చూసినప్పటికీ 2008 సంక్షోభం నాటి నుంచి ప్రపంచీకరణ పూర్తి తిరోగమనంలో వుంది. మొదటిది వాణిజ్య విషయానికి వస్తే 2008 వరకు ఆరోగ్యకరంగా పెరిగింది. సంక్షోభం, మాంద్యం తరువాత ఇంతవరకు పూర్వపు స్థాయికి చేరుకోలేదు. రెండవది వలసల విషయానికి వస్తే ప్రపంచవ్యాపితంగా నెమ్మదిగా వలసలు పెరుగుతున్నాయి. అమెరికాకు అనూహ్య పెరుగుదల ఆగిపోయింది. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు ఒక పెద్ద రాజకీయ వివాదంగా వుండేవి కాస్తా ఆ సమస్య ఇప్పుడు అటుదిటు అయింది. 2008 నుంచి 2014 వరకు అమెరికాలో నివశించే మెక్సికన్ల జనాభా పదిలక్షల మంది తగ్గిపోయారు.కారణం, అధికారికంగా నమోదు కానటువంటి మెక్సికన్‌ వలసదారులు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. తరువాత ఆర్ధికం గురించి, సంక్షోభానికి ముందు వున్న స్ధాయితో పోల్చితే అంతర సరిహద్దుల మధ్య జరిగే నగదు బదిలీలు తగ్గినట్లు యుబిఎస్‌ బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రపంచీకరణ అనూహ్య పెరుగుదల ఇరవయ్యవ శతాబ్ది చివరి నాటికే అంతమైంది. ఇరవై ఒకట శతాబ్ది ప్రారంభం ముగిసింది, ప్రపంచీకరణ చుట్ట విడిపోవటం ప్రారంభం కూడా కావచ్చు. పది సంవత్సరాల ఆలస్యంగా ప్రపంచీకరణ అపస్మారకం గురించి ఆందోళన పడుతున్నట్లుగా వుంది.’

   ఇంత త్వరగా ప్రపంచీకరణపై పెట్టుబడిదారీ మేథావులలో భ్రమలు వైదొలగటం ప్రారంభం అవుతుందని ఎవరూ వూహించలేదంటే అతిశయోక్తి కాదు.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభాలు, తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా అనేక దేశాలు తమ పరిశ్రమలు, వాణిజ్య రక్షణ చర్యలను తీవ్రతరం చేశాయి.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి చిన్నా, చితకా దేశాలు తప్ప వలసలు పూర్తిగా అంతరించటంతో యుద్ధ సమయంలోనే అమెరికా-బ్రిటన్‌లు యుద్ధం ముగిసిన తరువాత వాణిజ్య ఏర్పాటు ఎలా వుండాలో చర్చలు ప్రారంభించాయి. వాటి ఫలితమే 1947 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు జెనీవాలో 23 దేశాల చర్చలు ఫలించి ప్రపంచీకరణకు తెరతీసిన పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (గాట్‌) కుదిరింది. అక్కడే అత్యంత సానుకూల దేశ హోదా కూడా పురుడు పోసుకుంది. ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు సభ్య దేశాల వస్తువులకు పన్నులు, ఇతర ఆటంకాలను తగ్గించటం, ఎత్తివేయటమే గాట్‌లోని కీలకాంశం. తరువాత 2000 సంవత్సరం నుంచి దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్య సంస్ద రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

    ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన ధనిక దేశాల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలకు భిన్నంగా, వివిధ దేశాల మధ్య అసమాన ప్రయోజనాలు వస్తున్నాయని అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. చైనాను చూసి ప్రయివేటు పెట్టుబడులు అక్కడ పొందుతున్న లబ్దిని చూసి భారత్‌ సంస్కరణలు మొదలు పెట్టిందా లేక సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పెట్టుబడిదారీ ధనిక దేశాలతో అంటకాగితే ప్రయోజనం వుంటుందని పాలకవర్గం భావించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిందా అన్నది ఒక చర్చ నీయాంశం. సోవియట్‌ కూలిపోక ముందే 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన జరపటం ఒక కీలకాంశం. నూతన ఆర్ధిక విధానం పేరుతో రాజీవ్‌ గాంధీ మాట్లాడిన పూర్వరంగం సంస్కరణలలో భాగమే. తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా రాజ్యాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత పీవీ నరసింహారావు రూపంలో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను తెరిచేందుకు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలు ఏ దేశానికి ఎక్కువ ప్రయోజనం కలిగించాయో తెలిసిందే. జపాన్‌కు చెందిన ‘రీతి’ సంస్ధ పరిశోధన ప్ర కారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో మన వ్యవస్థను ముడివేసిన కారణంగా మన పరిశ్రమలు లబ్ది పొందటంతో పాటు వుపాధి అవకాశాలు కూడా పెరిగాయి. http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html అయితే అవి చైనాతో పోల్చుకుంటే చాలా పరిమితం. ఈ రెండింటితో పాటు మరికొన్ని దేశాలు లబ్ది పొందితే ఆ మేరకు ధనిక దేశాలు నష్టపోయాయి. 1995-2011 మధ్య కాలంలో ప్రపంచ విలువ గొలుసులో భారత పరిశ్రమలు చేసిన వుత్పత్తిలో తమ ఆదాయ వాటాను దాదాపు రెట్టింపు చేసుకున్నాయి. అందువలన మిగతా పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయని వేరే చెప్పనవసరం లేదు.ఈ విషయంలో మన పరిశ్రమలు రెండు నుంచి నాలుగుకు పెరిగితే చైనా నాలుగు నుంచి 16కు ఎదిగింది. ఇదే సమయంలో కేవలం విదేశాల కోసం చేసిన వుత్పత్తి విలువ మన దేశంలో 18 నుంచి 28కి పెరిగితే చైనాలో 35 నుంచి 42కు మాత్రమే పెరిగింది. అంటే చైనా కంటే విదేశాల కోసం తయారు చేసే సరకుల విషయంలో మన దేశం ఎంతో ముందుకు పోయింది. ఈ కారణంగానే మన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు మేకిన్‌ ఇండియా, మేకిన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో భారత్‌లో సరకులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోండి మంచి అవకాశాలు కల్పిస్తామని వెంపర్లాడుతున్నారు. రాయితీలు ప్రకటిస్తున్నారు. కేవలం ఎగుమతుల మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్థలను నిర్మించుకోవటం మంచిది కాదని లాటిన్‌ అమెరికా అనుభవం గ్రహించిన చైనా 2008 సంక్షోభం తరువాత తన అంతర్గత డిమాండ్‌ను పెంచటంపై కేంద్రీకరించింది. ఈ కారణంగానే సంక్షోభ ప్రభావం దాని ఆర్ధిక వ్యవస్ధపై పరిమితంగా పడిందన్నది కొందరి విశ్లేషణ.

     వస్తూత్పత్తి రంగంలో నానాటికీ నిపుణులైన కార్మికుల అవసరం పెరుగుతోంది. ఈ విషయంలో కూడా మనం చైనాతో పోల్చుకోవటానికి లేదు. 1995-2011 మధ్య మన దేశంలో వున్నత నిపుణులైన కార్మికులు 106.8శాతం పెరిగితే చైనాలో 211.2 శాతం పెరిగారు, పరిమిత నిపుణులైన వారు చైనాలో 35.6, భారత్‌లో 49.4 శాతం పెరిగారు. నైపుణ్యం లేని కార్మికుల శాతాలు 6.3, 4.4 శాతం చొప్పున మాత్రమే పెరిగారు. మన దేశంలో మధ్య తరగతి, చివరికి కార్మికవర్గంలో కూడా ప్రపంచీకరణకు అనుకూలత వ్యక్తం చేయటానికి ఈ పరిణామం కూడా దోహదం చేసినట్లుగా కనిపిస్తున్నది. మిగతావారితో పోల్చితే నిపుణులైన కార్మికులకు వేతనాలు సహజంగానే ఎక్కువ వుంటాయి కనుక, అవి ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను ప్రపంచ వ్యవస్ధతో ముడిపెట్టిన కారణంగానే వచ్చాయి కనుక ఆ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారు. 1991-2014 మధ్య మన దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు పని చేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. నైపుణ్యం లేని కార్మికులు పని చేసే పరిశ్రమలు అంతకంటే ఎక్కువగా తగ్గిపోయాయి.

Image result for globalisation: why do people are opposing and supporting ?

    ఇదే సమయంలో ధనిక దేశాలలో పరిస్థితి ఏమిటి ? అమెరికాలో వున్నత నైపుణ్యం, పరిమిత నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికుల సంఖ్య స్ధిరంగా కూడా లేకపోగా 9.6,32.6,46.6 శాతాల చొప్పున, జపాన్‌లో 7.7, 29.8, 65.7 శాతాల చొప్పున తగ్గారు. ‘రీతి’ సర్వే చేసిన దేశాలలో ఒక్క చైనా, భారత్‌లో తప్ప మిగతా ప్రధాన దేశాలైన దక్షిణ కొరియాలో 66.5, తైవాన్‌లో 36.7, జర్మనీలో 17.7, ఇండోనేషియాలో 12.3 శాతం చొప్పున తగ్గారు. అందువలన సహజంగానే అక్కడి పౌరులలో ప్రపంచీకరణ వుత్పత్తి విధానం పట్ల తద్వారా ఆదాయాలు తగ్గటం వలన ప్రపంచీకరణ వ్యతిరేకత పెరుగుతోందన్నది స్పష్టం. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అక్కడ ఆర్ధిక అసమానతలు వున్నప్పటికీ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. అక్కడ పెరుగుతున్న వేతనాలను చూస్తే http://money.cnn.com/2016/03/17/news/economy/china-cheap-labor-productivity/ అనుకున్నంత చౌక కాదని అమెరికన్లే చెబుతున్నారు. అమెరికాతో పోల్చితే నాలుగు శాతమే తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవాల్సి వుంది. చైనాతో పోల్చితే మన దేశంలో అత్యంత నిపుణులైన కార్మికులకు కూడా వేతనాలు తక్కువే అన్నది తెలిసిందే. ఇది కూడా మోడీ వంటి వారిని మేకిన్‌ ఇండియా నినాదాలకు పురికొల్పింది. ఒకవైపు ఇది పారిశ్రామికవేత్తలను వుత్సాహపరుస్తుంటే మరోవైపు ప్రపంచీకరణ ఫలితాలు కొంత మంది చెప్పినట్లు ఊట మాదిరి దిగువకు దిగటంలేదు. అందుకే ఆర్ధిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి.నైపుణ్యం లేని, పరిమిత నైపుణ్యం గల కార్మికులందరూ కాంట్రాక్టు వుద్యోగులుగా, తక్కువ వేతనాలకు పని చేసే అసంఘటి పని వారిగా మారిపోతున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌ కొద్ది మంది కార్మికులతో నడిచేవి తప్ప ఎక్కువ మందితో అవసరం వుండదు. అందువలన అంకెలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ అది వుపాధి రహితంగా వుంటోంది. రానున్న రోజుల్లో ఈ ధోరణిని మరింతగా పెంచాలని, వున్న కార్మిక చట్టాలను కూడా క్రమంగా ఎత్తివేయాలన్నది పాలకుల లక్ష్యంగా వుంది.

    సరళీకరణ, ప్రపంచీకరణ వలన కలిగే లాభాలను ఎలా చూడాలి ? తాజ్‌ మహల్‌ కట్టించిందెవరు అని కాదు, దానికి రాళ్లెత్తిన కూలీల గురించి చూడాలని శ్రీశ్రీ చెప్పినట్లుగా మన దేశంలో ఏటేటా పెరుగుతున్న ధనికుల గురించి వార్తలను లొట్టలు వేసుకుంటూ చదువుతున్నాం, చూస్తున్నాం తప్ప అందుకు దోహదం చేసిన స్ధితి గురించి ఎందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఎంత లాభం, నష్టం వచ్చిందని చూడటం సాధ్యం కాని మాట నిజమే. ఈ విధానాలకు అనుగుణ్యంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అవి ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయలు దాటాయి. విద్య, వైద్యం వంటి సేవలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను చూస్తే మనకు పరిస్ధితి అర్ధం అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం విద్యార్ధినులకు కూడా అన్ని చోట్లా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిన దుస్ధితి ఈ సంస్కరణల కాలంలోనే జరిగింది.http://www.freshwateraction.net/content/all-govt-schools-must-have-toilet-november-end-supreme-court-india నిజానికి ఇతర సబ్సిడీలను కలుపు కుంటే అంతకంటే ఎక్కువే వుంటాయి.అన్నింటి కంటే దారుణం ఏమంటే కార్పొరేట్‌ కంపెనీలు సకల రాయితీలు పొందుతూనే చెల్లించాల్సిన పన్నులను కూడా ఏదో ఒక రూపంలో ఎగవేస్తున్నాయి.http://timesofindia.indiatimes.com/budget-2016/union-budget-2016/Budget-2016-Tax-forgone-gets-a-fancy-name-but-still-a-burden/articleshow/51202028.cms కార్పొరేట్‌ పన్ను 32.45 శాతం చెల్లించాల్సి వుండగా కేవలం 24.67 శాతమే చెల్లిస్తున్నాయని 2014-15 సంవత్సరం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అంటే దయామయులైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రాయితీలు పొంది, పన్నులు పూర్తిగా చెల్లించటం లేదన్నది స్పష్టం. ధనికులకు మరిన్ని రాయితీలిచ్చేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలకు లేకపోయిందంటే ప్రపంచీకరణ ఎవరికోసం ? ఎవరికి వుపయోగపడినట్లు ?  ధనిక దేశాలలో ప్రపంచీకరణ వ్యతిరేకత ఏ రూపాలలో వ్యక్తమౌతోంది ? వచ్చే భాగంలో చదవండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచబ్యాంకు ర్యాంకుల పోటీలో పాకిస్థాన్‌ కంటే వెనుకబడిన మోడీ !

30 Sunday Oct 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

anti globalization movement, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ – పర్యవసానాలు -1

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో నిత్యం అనేక అంశాల గురించి చర్చలు జరుగుతూనే వుంటాయి. చర్చ అంటేనే విరుద్ధ అంశాల మధనం. పురాణాలలో చెప్పిన దాని గురించి నమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే నమ్మే వారు చెప్పిన క్షీర సాగర మధనం అమృతం కోసమే జరిపినప్పటికీ ఆ క్రమంలో అనేకం బయట పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన మధనం ప్రపంచీకరణ లేదా దాని మరోపేరు సరళీకరణ ఫలితాలు, పర్యవసానాల గురించే అన్నది తెలిసిందే. నేతి బీరకాయలో నెయ్యి మాదిరి దానికి పెట్టిన పేరు వుదారవాదం. పెట్టుబడిదారీ విధానం దుష్టమైందన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి రావటంతో ఎంతో తెలివిగా దాని పేరు మార్చారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ప్రపంచవాణిజ్య సంస్ధ ఇలా అనేకం ఏ పేరుతో పని చేసినా కార్పొరేట్ల లాభాలను, ఆ వ్యవస్ధను కాపాడే రూపాలు, ఆయుధాలే. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలేత్తినా దుష్ట సంహారం కోసమే అని చెప్పినట్లుగా పెట్టుబడిదారులు కూడా కార్మికవర్గాన్ని దోచుకొనేందుకు వర్తమానంలో ఎత్తిన అవతారమే ప్రపంచీకరణ. దానిపై జరుగుతున్న మధనంలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

   ప్రపంచబ్యాంకు 2017వ సంవత్సరానికి మనకు ప్రధానం లేదా దానం చేసిన వ్యాపార ర్యాంకు 131, అంతకు ముందు సంవత్సరం 130 వుంది.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు బాధ పడి నట్లుగా మన ప్రధాని, కేంద్ర మంత్రుల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ఎలాగంటే మన దేశం ఒక ర్యాంకును మెరుగుపరచుకుంటే పొరుగుదేశం పాకిస్థాన్‌ 148 నుంచి 144కు పెరిగి నాలుగు స్ధానాల ఎగువకు వెళ్లింది. చైనా 80 నుంచి 78 కి పెంచుకొని తన స్ధానాన్ని మెరుగు పరుచుకుంది. దాంతో మన కంటే ఇతర దేశాలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించినట్లే అనే కొందరు చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లయింది. తాను అనేక సంస్కరణలను చేపట్టినా ప్రపంచబ్యాంకు వాటిని ఎందుకు పట్టించుకోలేదు, గతేడాది కంటే మన ర్యాంకును గణనీయంగా ఎందుకు పెంచలేదు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక రాత్రంతా తనలో తాను తెగ మధన పడిపోయారు. తన మంత్రులు, అధికారులతో కూడా మధించి నెలరోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ర్యాంకు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను మరింత కుంగదీసింది. రానున్న కొద్ది సంవత్సరాలలో మన ర్యాంకు 50కి చేర నుందని ఈ ఏడాది మే నెలలోనే ఆమె ఆనందంగా ఆశాభావం వెలిబుచ్చారు. తీరా దరిదాపుల్లో లేకపోవటంతో తీసుకున్న చర్యలన్నీ ప్రపంచబ్యాంకు విధించిన గడువులోగా అమలులోకి రానందున వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది ర్యాంకులో ఫలితం కనిపిస్తుందని ట్వీట్‌ చేశారు.

మోడీ బృందం ఎందుకు భంగపాటుకు గురైంది ? నిజానికి ఈ ర్యాంకులు అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. మన విద్యావిధానాల మాదిరి ఒకేడాది నిర్ణయించిన ప్రమాణాలు మరొక ఏడాది వుండవు. వాటికి ఇచ్చే మార్కులు కూడా అంతే. కొన్ని ర్యాంకుల తీరుతెన్నులను గమనించండి. నా చిన్న తనంలో గ్రామాలలో బుర్ర కథలు, హరికథల వంటి కళారూపాలను ప్రదర్శించే వారు తమకు మంచి భోజనాలు, భారీ ఎత్తున ధన ధాన్యాలతో సత్కారాలు పొందేందుకు ఏ వూరు వెళితే ఆ వూరి వారిని వుబ్చించేవారు. చుట్టుపక్కల 66 వూళ్లకు మీ వూరు పోతుగడ్డ అని చెప్పగానే నిజమే కావాలనుకొని ప్రతి వూరి వారూ నరేంద్రమోడీ చెప్పినట్లు రొమ్ములు చరుచుకొనే వారు. తమ వ్యాపారాలకు రాయితీలు పొందేందుకు, సులభంగా అనుమతులు సంపాదించుకొనేందుకు కాస్త రూపం మార్చి ‘పోతుగడ్డ’ టెక్నిక్‌ను వాడుతున్నారు.

ఆ క్రమంలో గత రెండున్నర సంవత్సరాలలో అనేక సంస్ధలు నరేంద్రమోడీ సర్కార్‌ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ ఒక్కసారిగా 16 దేశాలను దాటి 39వ ర్యాంకుకు చేరినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక( డబ్ల్యుఇఎఫ్‌ ) ప్రకటించింది. చంద్రబాబు నాయుడు వంటి వారికి ఇదొక పవిత్ర స్ధలం. ప్రతి ఏటా వెళ్లి వచ్చి ఆర్భాటం చేస్తుంటారు. వెళ్లి రావటం ఒక ఘనతగా ప్రచారం చేసుకుంటారు. అవినీతి విషయంలో అవినీతి విషయంలో ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్ధ సూచికలో ఏకంగా భారత్‌ తొమ్మిది పాయింట్లను మెరుగుపరచుకుందని వార్తలు వచ్చాయి. http://timesofindia.indiatimes.com/india/Indias-ranking-on-global-corruption-index-improves/articleshow/45358144.cms  చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరునెలలు పూర్తి అవుతున్న సమయంలో ఈ ర్యాంకుల ప్రకటన జరిగింది. దాని ప్రకారం మన్మోహన్‌ సింగ్‌ అధికార చివరి సంవత్సరం 2013లో 94వ ర్యాంకులో వుండగా 2014లో 85వ స్ధానానికి మెరుగుపరచుకుంది. దీనికి మోడీ ప్రభుత్వం తీసుకున్న అవినీతి రహిత చర్యలే కారణమంటూ ఆయన భక్తులు బాపు సినిమా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ఏర్పాట్లను గుర్తు చేశారు. మరుసటి ఏడాదికి ఆ ర్యాంకు 76కు చేరింది. మరో తొమ్మిది ర్యాంకులను పెంచారు.http://www.transparency.org/cpi2015#results-table  ఇది ఆ సంస్ధ అధికారిక వెబ్‌సైట్‌ చిరునామా. దీని ప్రకారం 2012,13 మనకు వచ్చిన మార్కులు నూటికి 36, మోడీ హయాం 2014,15లో వచ్చినవి 38. ఇదే సమయంలో పాకిస్థాన్‌ 27 నుంచి 30కి పెంచుకుంది. మిగిలిన దేశాలలో అవినీతి పెరిగి మన ర్యాంకు మెరుగుపడింది తప్ప మన మార్కులు పెరిగి కాదన్నది స్పష్టం అవుతోంది.

ఇక కొత్త కల్పనల సూచిక వరుసగా ఐదు సంవత్సరాలు పడిపోతూ వున్నది కాస్తా 81నుంచి 2015లో 66కు పెరగటం కూడా నరేంద్రమోడీ ఘనతే అని చెప్పారు.http://www.dnaindia.com/money/report-india-s-rank-on-global-innovation-index-improves-to-66-2247413 కొత్త కల్పనలు రహస్యంగా వుండేవేమీ కాదు. దేశ ప్రజలకు తెలియకుండా అల్లా వుద్దీన్‌ అద్బుత దీపం ఏమైనా మోడీ సర్కార్‌కు దొరికిందా అన్న అనుమానం వచ్చింది. మంత్రులు చెప్పేది, మీడియాలో వచ్చే వార్తలు ఎలా వుంటాయో తెలుసు కనుక సంస్ధ అధికారిక వెబ్‌ సైట్‌ను ఆశ్రయిస్తే http://www.wipo.int/edocs/pubdocs/en/economics/gii/gii_2013.pdf ప్రకారం 2013లో మనకు వచ్చిన మార్కులు 36.17 శాతంగానూ ర్యాంకు 66గానూ దర్శన మిచ్చింది. దీంతో మరింత ఆసక్తి పెరిగి 2016 ర్యాంకింగ్‌ల కోసం చూస్తే దానిలో మన మార్కులు 33.61శాతానికి తగ్గినా ర్యాంకు మాత్రం 66గానే వుంది. ఇదే సమయంలో మన ఇరుగు పొరుగుదేశాల స్ధితి ఎలా వుంది అన్న సందేహం కలగటం సహజం కదా ! పాకిస్తాన్‌ 23.33 మార్కులు, 137 ర్యాంకు నుంచి 22.63 మార్కులు 119వ ర్యాంకుకు మెరుగు పడింది. ఇదే సమయంలో చైనా విషయానికి వస్తే తన మార్కులు 44.66, ర్యాంకు 35 నుంచి 50.57 ర్యాంకు 25 తెచ్చుకుంది.

వివిధ వసతుల కల్పనాంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచబ్యాంకు లాజిస్టిక్స్‌ సామర్ధ్య సూచికలను ప్రకటిస్తుంది.http://www.dnaindia.com/money/report-india-moves-up-to-35th-rank-on-world-bank-s-logistics-performance-index-2230168 దీని ప్రకారం 2014లో 54వ స్ధానంలో వున్నది కాస్తా 2016 నాటికి 35వ ర్యాంకుకు చేరిందని ప్రశంసలు కురిపించారు. ప్రపంచబ్యాంకు రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే వివరాల ప్రకారం 2007లో మన ర్యాంకు 39, మనకు వచ్చిన మార్కులు 3.07, 2012లో 46 -3.08, 2014లో 54 – 3.08, 2016లో 35 -3.42 వచ్చాయి. మార్కులలో పెద్ద తేడాలు లేకపోయినప్పటికి 2007-14 మధ్య ర్యాంకు 39 నుంచి 54కు పడిపోయింది. అందువలన ఈ ర్యాంకుల గురించి సంబరపడి, అది తమ సామర్ధ్యమే అని చెప్పుకుంటే అంతకు మించి జనాన్ని మోసం చేయటం మరొకటి వుండదు.

ఇక సులభతర వాణిజ్య ర్యాంకుల విషయానికి వస్తే 2007లో మనకు వచ్చిన ర్యాంకు 116 అక్షరాలా నూట పదహారు. అది 2014 నాటికి 142కు పడిపోయింది. ర్యాంకులు కేటాయించిన పద్దతిని ప్రపంచబ్యాంకు సవరించటంతో అది 134గా నిర్ధారణ అయింది. 2015 జూన్‌ నాటికి మన ర్యాంకు 130కి మెరుగు పడింది, తరువాత దానిని 131కి సవరించారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ర్యాంకు 130 అంటే ఎదుగూ బొదుగూ లేకుండా వుండి పోయింది. ఇది జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలలో నరేంద్రమోడీ పలుకుబడిని తగ్గించేది లేదా అనుమానాలను రేకెత్తించేది కనుకనే నరేంద్రమోడీ, ఆయన మంత్రులు అంతగా కంగారు పడుతున్నారు.

    ప్రపంచీకరణ అంటే విదేశీ సంస్ధలు మన దేశంలో సులభంగా వ్యాపారం చేసుకొనే అవకాశాలను కల్పించటం, దానికి ప్రశంసగా ప్రపంచబ్యాంకు ఇచ్చే ర్యాంకుల పిచ్చి ముదిరి వాటి కోసం మన ప్రధాని, దానికి అనుకరణగా కేంద్రం ప్రవేశ పెట్టిన ర్యాంకు కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అదింతటితో ఆగదు, మరిన్ని పర్యవసానాలకు దారితీస్తుందని గుర్తించాలి. ప్రపంచ పెట్టుబడిదారులకు మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా తెరిచేందుకు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు.

    ప్రస్తుతం ప్రపంచీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే కొంత మంది విశ్లేషణ ప్రకారం ధనిక దేశాలలోని కార్మికవర్గం, దానితో పాటు అక్కడి పెట్టుబడిదారీ వర్గం అంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్ధమాన, తృతీయ ప్రపంచ దేశాలలో ప్రపంచీకరణకు వ్యతిరేక గళాలు బలంగా వినిపించాయి, ఇప్పటికీ అడపాతడపా వినిపిస్తూనే వున్నాయి. అయితే గతం మాదిరి పెద్ద ఎత్తున లేవన్నది వాస్తవం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గతంలో మాదిరి సామాజిక వేదికల (సోషల్‌ ఫోరాలు) సదస్సులు ఇప్పుడు జరగటం లేదు, వెనుక పట్టు పట్టాయి. అవి సాధించిన విజయాలేమిటి ? వాటికి వున్న పరిమితులు ఎంతవరకు అన్న విషయాలను ఇక్కడ విశ్లేషించటం లేదు. మొత్తం మీద ప్రపంచీకరణ కోరుకున్న పెట్టుబడిదారులు, వారి సమర్ధకులదే పైచేయిగా వుంది, దానితో లాభాలు పొందవచ్చని కార్పొరేట్లు భావిస్తున్న కారణంగానే మరింతగా సంస్కరణల పేరుతో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకు నరేంద్రమోడీ సమర్ధకుడు అని భావించిన కారణంగానే గద్దెనెక్కించటమే గాక, తమ చేతులలో వున్న ప్రచార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున వూదరగొడుతున్నారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన వుద్యమాలు సాధించిన ఫలితాలు, కార్మికులు కోల్పోయిన వాటి గురించి, పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. కండ్లు లేనివారు ఏనుగును వర్ణించినట్లుగా ఎవరికి వారు తమ అనుభవంలోకి వచ్చిన అంశాల గురించి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వాటన్నింటినీ కొట్టి వేయలేము, అలాగని వాటినే అంతిమ నిర్ధారణలుగా అంగీకరించలేము. అందువలన ఆ పరిమితులకు లోబడి ఈ సందర్భంగా కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తెస్తున్నాను.

     కొద్ది నెలల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలా వద్దా అనే విషయమై బ్రిటన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. దానిలో ఎక్కువ మంది వైదొలగటానికే మొగ్గు చూపారు. సభ్య దేశాలపై పొదుపు చర్యల పేరుతో కార్పొరేట్ల లాభాలలో కోత పడకుండా చూసేందుకు ఐరోపా యూనియన్‌ రుద్దిన పొదుపు చర్యలకు జనంలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో పాటు, ఒక యూనియన్‌లో వుండి దాని తరఫున ఒక సభ్య దేశంగా ప్రపంచ మార్కెట్‌ వాటాను పరిమితంగా పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ వాటాను తెచ్చుకోవచ్చన్న బ్రిటన్‌ కార్పొరేట్ల వత్తిడికూడా ఈ నిర్ణయాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముగిసిన ప్రచారంలో కూడా వాణిజ్యంపై చర్చకు పెద్ద పీట వేయటం, ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా బయటకు రావాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించటం, కెనడా-ఐరోపా యూనియన్‌ మధ్య చర్చలలో వున్న సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) పట్ల వెల్లడౌతున్న వ్యతిరేకత ధనిక దేశాలలో ప్రపంచీకరణకు కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గంలోనే పెరుగుతున్న వ్యతిరేకతను సూచిస్తోంది. ఇది ఆయా దేశాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధల రక్షణాత్మక చర్యలకు దారితీస్తోంది. ధనిక దేశాల నుంచి ప్రారంభమైన ఈ క్రమం అన్ని దేశాలకు తరతమ తేడాలతో విస్తరించటం అనివార్యం.

    ఒక తత్వం ప్రకారం ఎప్పుడూ ప్రపంచీకరణ అనుకూలత, ప్రపంచీకరణ వ్యతిరేకత వ్యక్తమౌతూనే వుంటాయి. రుతువుల మాదిరి పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాంద్యాలు రావటం, దాని నుంచి ఏదో విధంగా బయట పడటం సైకిలు చక్రం మాదిరి ఒకదాని వెంట ఒకటి సంభవిస్తుంటాయి. దాని పర్యవసానాలు ప్రపంచీకరణ మీద పడతాయి. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పర్యవసానంగా ధనిక దేశాలలో నష్టపోయిన సాంప్రదాయ మధ్యతరగతి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో వుంది.లబ్ది పొందిన వారిలో ప్రస్తుతం ప్రపంచీకరణ విధానానికి వున్న పరిమితులు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా ప్రదర్శించటానికి వీలు కల్పించటం లేదనే తరగతి కూడా అదే ధనిక దేశాలలో ప్రపంచీకరణను మరొక వైపు నుంచి విమర్శిస్తుంది. ప్రపంచీకరణ విధానాన్ని కనిపెట్టిన వారు దాని పర్యవసానాలను వూహించలేకపోయారు. ప్రపంచీకరణ ఆర్ధిక అసమానతలను జెట్‌ వేగంతో పెంచింది. ఫలితంగా వలసలు పెరిగిపోయాయి. వలసలకు ఇతర అనేక కారణాలు వున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ప్రపంచీకరణే. ఇది కొన్ని దేశాల నుంచి వలసలను పెంచితే మరికొన్నింటి నుంచి తగ్గించిందని కూడా వెల్లడైంది. శ్రమను కారుచౌకగా ఆమ్ముకొనే వలస కూలీలను ప్రోత్సహించటం కూడా ప్రపంచీకరణలో భాగమే అన్నది ఇక్కడ మరిచి పోరాదు. ధనిక దేశాలలో ప్రపపంచీకరణ తెచ్చిన అసంతృప్తికి, పేద దేశాల నుంచి సామూహికంగా వస్తున్న వలస కార్మికుల సమస్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.2008లో ప్రారంభమైన ధనిక దేశాల ఆర్ధిక మాంద్యం సమస్యను మరింత సంక్లిష్టం గావించింది. అనేక చోట్ల నిరుద్యోగం, దారిద్య్రం, వేతనాలలో కోతలు పెరిగిపోయాయి. పర్మనెంటు వుద్యోగాలు తగ్గి తక్కువ వేతనాలు లభించే తాత్కాలిక వుపాధిలో చేరే పరిస్థితికి కార్మికవర్గం చేరింది. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితమే అని భావించటంతో ధనిక దేశాలలో వ్యతిరేక గళం వినిపించటం ప్రారంభమైంది. ఇది ఒక కోణం. మరోవైపు నుంచి పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కూడా పర్యవసానాలు ప్రతికూలంగా తయారయ్యాయి. అదెలా వుందో తాజాగా వెల్లడైంది.

    ఇటీవల రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండస్ట్రీ అనే సంస్ధ ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది.http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html దానిలో వున్న వివరాల ప్రకారం ప్రపంచీకరణ వివిధ దేశాల మధ్య అసమాన లబ్దికి దారితీసింది. అలా లబ్ది పొందిన వాటిలో భారత్‌ ఒకటి, అయితే చైనాతో పోల్చితే చాలా తక్కువ ప్రయోజనం కలిగింది. ఈ లబ్ది పారిశ్రామికవేత్తలతో పాటు కార్మికవర్గానికి కూడా దక్కింది. ఎవరు ఎక్కువ అంటే ఈ కాలంలో దేశంలో పెరిగిన ఆదాయ, ఆర్ధిక అసమానతలు, పెరిగిన బిలియనీర్లను చూస్తే కార్మికుల కంటే పారిశ్రామిక, వాణిజ్యవర్గాలే ఎక్కువ లబ్ది పొందాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే నరేంద్రమోడీ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ సంస్కరణలు కొత్త సమస్యలను తీసుకువస్తాయని తెలిసినప్పటికీ తక్షణం లాభదాయకంగా వుంది కనుక రాబోయే పర్యవసానాల గురించి వారు అంతగా ఆలోచించటం లేదు.అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా తిరుగులేని శక్తిగా అవతరించింది. జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. తనకున్న ఆర్ధిక శక్తి కారణంగా స్వేచ్చా వాణిజ్య నిబంధనలు, విధానాన్ని మరింత గట్టిగా అమలు జరపాలని అది కోరుతోంది. దాని దెబ్బకు గిలగిలలాడుతున్న ధనిక దేశాలు తాము ముందుకు తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యవిధానాన్ని పక్కన పెట్టాలని కోరుతున్నాయనటానికి ముందే చెప్పినట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి వైదొలుగుతానని బెదిరించటం పక్కా నిదర్శనం. పైన పేర్కొన్న పరిశోధనా పత్రంలో ప్రపంచీకరణ పర్యవసానాల గురించి ఏం చెప్పారు ? వచ్చే భాగంలో చూడండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కుదేలైన బాంబే స్టాక్‌ మార్కెట్‌ – యధావిధిగా కరాచీ స్టాక్‌

29 Thursday Sep 2016

Posted by raomk in Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BSE sensex, India-Pakistan, Indian army, KSE, pakistan, surgical strike

పాక్‌ వుగ్రవాద శిబిరాలపై భారత సర్జికల్‌ దాడి పర్యవసానం

ఎంకెఆర్‌

    సరిహద్దు దాటేందుకు ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలో తిష్ట వేసిన వుగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు భారత సైన్యం గత అర్ధరాత్రి దాటిన తరువాత దాడులు చేసిందని వారి గుడారాలను కొన్నింటిని ధ్వంసం చేసి అనేక మందిని మట్టు పెట్టి తెల్లవారే సరికి మన సైన్యం పక్కాగా తిరిగివచ్చిందని సైనిక అధికారులు ప్రకటించారు. అయితే పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఒక ప్రకటన చేస్తూ అలాంటి దాడులేమీ జరగలేదని, సరిహద్దులలో ఎప్పుడూ జరిపే మాదిరి భారత సైన్యం కాల్పులు జరిపిందని ఇద్దరు తమ సైనికులు మరణించారు, ఇతరులు తొమ్మిది మంది గాయపడ్డారు తప్ప వేరే ఏమీ జరగలేదని, భారత్‌వి కట్టుకథలని ప్రకటించారు. మన సైన్యం జరిపిన చర్యను సర్జికల్‌ దాడి అని పేర్కొన్నారు.ఈ దాడిలో ఎంత మంది మరణించారు, ఎన్ని శిబిరాలను ధ్వంసం చేశారన్నది అధికారికంగా ఎవరూ చెప్పటం లేదు. నిర్దిష్ట సమాచారం వుంది కనుక ఈ దాడులు చేశాం పని అయిపోయింది కనుక వెనక్కు తిరిగి వచ్చాం అంతే తప్ప నిరంతరం కొనసాగించే పధకాలేవీ లేవని కూడా మన సైనిక ప్రతినిధులు ప్రకటించారు.

    ఈ దాడితో స్టాక్‌ మార్కెట్లలో కంపెనీల వాటాల ధరలు పతనమై మదుపర్లు నష్టపోయారు. మన సైన్యం చేసిన ప్రకటనను పక్కాగా నమ్మి బెంబేలెత్తిన వాటాల విక్రయదారులు అమ్మకాలకు పూనుకోవటంతో బుధవారం నాటితో పోల్చితే గురువారం నాడు బొంబాయి స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచిక 465 పాయింట్లు లేదా 1.64 శాతం పతనమైంది. అదే విధంగా భారత సైన్యం దాడులేమీ జరపలేదు, ఎప్పటి మాదిరే సరిహద్దుల్లో కాల్పులు జరపటం తప్ప మరొకటేమీ జరగలేదన్న పాక్‌ ప్రభుత్వ ప్రకటనను అక్కడి విక్రయదారులు కూడా గట్టిగా విశ్వసించటంతో కరాచీ స్టాక్‌ సూచిలో కేవలం 59.5 పాయింట్లు లేదా 0.15 శాతమే పతనమైంది. అంటే అక్కడి విక్రయదారులు, మదుపర్లు తాపీగా వున్నారన్నది స్పష్టం.దాడులు జరిపినప్పటికీ వాస్తవాధీన రేఖ వెంబడి జరిగే వ్యాపార లావాదేవీలు యురి వద్ద (మన సైనికులను చంపిన సైనిక కేంద్రం వున్న ప్రాంతం) గురువారం నాడు యధావిధిగా జరిగాయి. మన దేశం నుంచి 26 ట్రక్కులు అవతలకు వెళితే అవతల నుంచి పది ట్రక్కులు మన వైపు వచ్చాయి.

   మన సైన్యం జరిపిన దాడిలో ఏం జరిగింది అన్నది చూద్దాం . సైనికాధికారులు చేసిన బహిరంగ ప్రకటనలో గణనీయంగా వుగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారు మరణించి వుంటారు అన్నారు తప్ప సంఖ్యను పేర్కొనలేదు.సర్జికల్‌ దాడులు, సైనిక వర్గాల కథనాలను బట్టి వచ్చిన వార్తల ప్రకారం పాక్‌ ఆక్రమిత ప్రాంతంలోకి 500 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు చొరబడి కాల్బలం, హెలికాప్టర్ల కమాండోలు వుమ్మడిగా దాడి చేసి తెల్లవారక ముందే తిరిగి వచ్చారు.కాల్బలం భూమి మీద వెళితే వారికి రక్షణగా ఎంఐ 17 హెలికాప్టర్లు కాపలా కాశాయి. దాడులు చేయటాన్ని డ్రోన్ల ద్వారా వీడియోలు కూడా తీశారు. వాటిని తగు సమయంలో బయట పెడతామని అధికారులు చెప్పారు.గత రెండు నెలల కాలంలో 19 సార్లు వుగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు.

    సర్జికల్‌ దాడులలో నిర్ధిష్ట లక్ష్యాలు మాత్రమే నాశనం అవుతాయి. వాటి పరిసరాలలో నష్టం జరిగినా అది పెద్దగా వుండదు. పాకిస్థాన్‌ను పూర్తి స్థాయిలో ఆశ్చర్య పరచటంలో సఫలీ కృతమయ్యామని, మన వైపు నుంచి ఎవరూ మరణించలేదని సైనిక వర్గాలు తెలిపాయి.దాడులు జరిపిన ప్రాంతంలో కొండలు, అడవులు, పర్వతాలు వున్నాయి. దాడులు జరిపిన ప్రాంతంలో ఏడు వుగ్రవాద శిబిరాలు లేదా గుడారాలు వున్నాయి. ప్రతి శిబిరంలో 30లేదా 40 మంది , మరొక 20 మంది వుగ్రవాదులు పరిసరాలలో వుంటారు. ప్రతి చోట దారి చూపే వారు, మద్దతుదారులు వుంటారు. వాటిపై గత వారం రోజులుగా మన సైన్యం కన్నువేసి వుంచింది. మన కమాండోలను హెలికాప్టర్ల ద్వారా రాత్రి 12.30 – తెల్లవారు ఝామున 4.30 వుగ్రవాద శిబిరాలు వున్న ప్రాంతాలలో దాడులు చేయించి సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చారు. అయితే అధికారులు చెప్పిన వివరాలను సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ తోసిపుచ్చారు.అసలు హెలికాప్టర్లు సరిహద్దు రేఖను దాటలేదని, దాడిలో పాల్గొనలేదని చెప్పారు.(హిందూ పత్రిక ప్రతినిధి)

    దాడులు చేసిన మన సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. పాక్‌ ప్రకటనలో కూడా తమ సైనికులు ఇద్దరు మరణించారని తప్ప ఇతరంగా చెప్పలేదు. అడవులు, కొండలు,ఎత్తయిన పర్వత ప్రాంతాలలో వున్న గుడారాలపై దాడులు జరపటం తప్ప వాటిలో వున్న ఎందరు మరణించారన్నది లెక్కలు తేల్చటం అందునా చీకటిలో లెక్కించటం సాధ్యం కాదు, అంచనాలను మాత్రమే అనధికారికంగా చెప్పిన అంశాలు మీడియాలో వస్తున్నాయి.

    యురి సైనిక శిబిరంపై పాక్‌ వుగ్రవాదులు దాడులు చేసినపుడు మన సైన్యం నిద్రపోతున్నదని, డ్యూటీలు మారటాన్ని అవకాశంగా తీసుకొని శిబిరం పరిసరాలలో పెరిగిపోయిన గడ్డిలో దాక్కొని వచ్చారని చెప్పిన విషయం తెలిసినదే. బుధవారం రాత్రి జరిపిన దాడి సమయాన్ని బట్టి, మన కేమీ నష్టం జరగలేదనటాన్ని చూస్తే ఆ సమయంలో సరిహద్దులలో వున్న పాక్‌ సైన్యం, వుగ్రవాదులు కూడా గాఢ నిద్రలో వుండి వుంటారా ? ఏ క్షణంలో అయినా దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామన్న భారత ప్రకటనలను తేలికగా తీసుకున్నారా అన్న సందేహాలు కలగటం సహజం. సర్జికల్‌ దాడులు జరపటం భారత సైన్యానికి కొత్త కాదు, గతేడాది మయన్మార్‌ సరిహద్దులలోని వుగ్రవాద శిబిరాలపై కూడా ఇలాంటి దాడులే జరిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. వుగ్రవాద నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలకు సైన్యం ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చ స్చేఛ్చను ప్రభుత్వం ఇచ్చిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

CPI(M) and CPI On the Current Events in the Kashmir Valley

04 Sunday Sep 2016

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Article 370, CPI, CPI(M), India-Pakistan, Kashmir, Kashmir problem, Kashmir Valley, Left parties

The CPI(M)  General Secretary Sitaram Yechury  and the CPI General Secretary S.Sudhakar Reddy have issued the following statement On the Current Events in the Kashmir Valley

The state of Jammu & Kashmir has been a part of India ever since the
accession of the state to the Indian Union in October 1947. Throughout the
chequered history of the past six decades, Kashmir has been not just a
territorial dispute for India but a test of the secular, democratic and
federal nature of the Indian Republic.

For the past nearly two months Kashmir has been in turmoil.  Since the
killing of Burhan Wani, a Hizbul Commander, the people in the Valley have
been out on the streets in mass protests. More than 70 people have died in
the firing by the security forces and a few thousand have been injured. Two
security personnel have also lost their lives. Pellet guns used by the
security forces have blinded and maimed many.  Instead of quelling the
protesters, it only intensified with each death and injury in police firing.
The main force driving these protests are the youth. These mass protests
that have spread into rural Kashmir, graphically illustrate the deep sense
of alienation of the people from the Indian State. At no time has the gulf
between India and the Kashmiri people been so wide. This serious situation
calls for an examination of the entire Kashmir problem.

The consistent stand the Left parties have been taking is that Jammu &
Kashmir has a special status which was reflected in the adoption of Article
370 of the Indian Constitution. At the heart of the matter lies how in
letter and spirit its autonomy and special status, eroded over the years,
can be restored. A political agreement must be reached, which should be
acceptable to the people whereby the state of Jammu & Kashmir would remain
as part of the Indian Union but by fulfilling the commitment, made to the
state and the people in 1948.

The entire geo-political situation has changed in the post-independence
decades. A solution to the Kashmir problem has also the dimension of India
and Pakistan discussing to settle long standing disputes.

These immediate steps must begin by taking certain confidence building
measures:

*       The first of these must be the immediate cessation of the use of
pellet guns.
*       Secondly, withdraw the AFSPA and the army from the civilian areas.
*       Thirdly, order a judicial enquiry into all instances of excesses
committed by the armed forces against civilians.
*       Fourthly, adequate compensation to all families who have suffered
loss of lives and rehabilitation of the injured by ensuring their means of
livelihood must be undertaken immediately.
*       Fifthly, time bound projects for economic development and employment
generation, including transfer of Dulhasti and Uri power projects; opening
of an IIM and IIT in Srinagar.

Further, the initiation of the political dialogue must not be based on any
preconditions.  The earlier recommendations of the various working groups
and the report of the team of interlocutors appointed after the visit of the
all party delegation in 2010 following the then disturbances must be kept in
consideration.

The Left parties suggest the following necessary steps at for arriving
towards a political solution in the current concrete circumstances:

a.    The internal dialogue with all stakeholders in Jammu & Kashmir should
proceed on the basis reversing the erosion of Article 370. The three regions
of the state, Jammu, the valley and Ladakh, should have autonomous
structures within the State of Jammu & Kashmir. This will entail changes in
the constitutional and legal scheme which can begin by revising the existing
orders and laws. Ultimately, a fresh political framework should emerge.

b.    The second dimension is the India-Pakistan factor. Since 2014 India
has been adopting a blow hot-blow cold policy towards a comprehensive
dialogue with Pakistan. This Government of India had announced that this
dialogue will also deal with the question of Kashmir, the government must
carry forward this process safeguarding India’s interests and ensure that
Pakistan is brought to the discussion table.

The people in the rest of the country are being fed various stereotypes
about the Kashmiri people. Kashmiris are being depicted as secessionists,
terrorists and pro-Pakistan. This must be put to an end. Reports of attacks
on Kashmiri youth in other parts of the country must be immediately
investigated and culprits punished.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !
  • కొలంబియా పీఠంపై వామపక్ష గుస్తావ్‌ పెట్రో-సవాళ్లు !
  • బీహార్‌లో వికటించిన బిజెపి కుట్ర : ఆరుగంటల్లో బీహార్‌లో అధికార మార్పిడి ,ఆర్‌జెడితో నితిష్‌ కుమార్‌ జట్టు !
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 1 : స్పీకర్‌ పెలోసీ పర్యటన అమెరికా బలమా ? చైనా బలహీనతా ?

Recent Comments

pscknr on తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వి…
pscknr on మీడియా కట్టుకథలు, పిట్టకతలను న…
Ashok Gaddam on అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక…
GSRK Govinda on శ్రీలంక సంక్షోభం : అధ్యక్షుడు…
K n raju on అమెరికా, ఐఎంఎఫ్‌ కౌగిట్లోకి శ్…

Archives

  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !
  • కొలంబియా పీఠంపై వామపక్ష గుస్తావ్‌ పెట్రో-సవాళ్లు !
  • బీహార్‌లో వికటించిన బిజెపి కుట్ర : ఆరుగంటల్లో బీహార్‌లో అధికార మార్పిడి ,ఆర్‌జెడితో నితిష్‌ కుమార్‌ జట్టు !
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 1 : స్పీకర్‌ పెలోసీ పర్యటన అమెరికా బలమా ? చైనా బలహీనతా ?

Recent Comments

pscknr on తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వి…
pscknr on మీడియా కట్టుకథలు, పిట్టకతలను న…
Ashok Gaddam on అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక…
GSRK Govinda on శ్రీలంక సంక్షోభం : అధ్యక్షుడు…
K n raju on అమెరికా, ఐఎంఎఫ్‌ కౌగిట్లోకి శ్…

Archives

  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !
  • కొలంబియా పీఠంపై వామపక్ష గుస్తావ్‌ పెట్రో-సవాళ్లు !
  • బీహార్‌లో వికటించిన బిజెపి కుట్ర : ఆరుగంటల్లో బీహార్‌లో అధికార మార్పిడి ,ఆర్‌జెడితో నితిష్‌ కుమార్‌ జట్టు !
  • తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 1 : స్పీకర్‌ పెలోసీ పర్యటన అమెరికా బలమా ? చైనా బలహీనతా ?

Recent Comments

pscknr on తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వి…
pscknr on మీడియా కట్టుకథలు, పిట్టకతలను న…
Ashok Gaddam on అమెరికా- పశ్చిమ దేశాలకు మానవహక…
GSRK Govinda on శ్రీలంక సంక్షోభం : అధ్యక్షుడు…
K n raju on అమెరికా, ఐఎంఎఫ్‌ కౌగిట్లోకి శ్…

Archives

  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 928 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: