• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: #Indian Economy

మీ భక్తుడు మోడీ పాలనలో అచ్చేదిన్‌ కాదు తిప్పలు, అప్పులే రామచంద్రా !

17 Saturday Jul 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Indian Economy, BJP’s trolling army, indian household debt, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోందో, పాలన ఎలా సాగుతోందో మనం(జనం) పట్టించుకుంటున్నామా ? చాలా మందికి ఇది అంతుచిక్కని ప్రశ్న. కమ్యూనిస్టులు ఏదైనా చెబితే దాన్లో కొత్తేముంది, వారు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు, అందుకే పుట్టారు అనే వారు ఎందరో. పోనీ అలా వ్యాఖ్యానించేవారు దేశం గురించి పట్టించుకుంటున్నారా అని అడిగితే మనోభావాలు దెబ్బతింటాయి. ఎలా చావాలి ? కరోనాతో మరణించిన వారు అటు స్వర్గంలోనో, నరకంలోనో, అటూ ఇటూ కాకుండానో ఎందుకంటే ఆ రెండు చోట్ల కూడా కరోనా వారిని అనుమతించరు గనుక ఏదో వారి తిప్పలు వారు పడుతూ ఉండి ఉంటారు. బతికి ఉన్నవారు చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారు. ఉద్యోగాలు పోయాయి, ఆదాయాలు లేవు, సంపాదించే వారి ఆకస్మిక మరణాలు, ఎప్పుడు పరిస్ధితి బాగుపడుతుందో తెలియని అయోమయం. ఆస్తులు అమ్మి, లక్షలు ఖర్చు చేసి కరోనా నుంచి బతికి బయటపడ్డా ప్రాణం మిగిలిందనే తృప్తి తప్ప చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న పెద్ద బాధ వారిని వెన్నాడుతోంది. అంతచేసినా ప్రాణాలు దక్కని వారి కుటుంబాల పరిస్ధితి చెప్పనలవి కావటం లేదంటే అతిశయోక్తి కాదు. ఎటు చూసినా అప్పులు అప్పులు తిప్పలు తిప్పలు !


గతంలో యుపిఏ హయాంలో చేసిన అప్పులన్నింటినీ నరేంద్రమోడీ గారు తీర్చారని ప్రచారం చేశారు.ముందుగా కేంద్రం చేసిన అప్పుల గురించి చూద్దాం.ఏడు సంవత్సరాల కాలంలో 55లక్షల కోట్ల దేశీయ అప్పును 117లక్షల కోట్లకు పెంచారు, దీనికి విదేశీ అప్పును కూడా కలిపితే 2021 మార్చి ఆఖరుకు 121లక్షల కోట్లు. వచ్చే ఏడాది అది 136లక్షల కోట్లు అవుతుందని అంచనా.ఏం చేశారని అడగొద్దు. అత్మనిర్భరలో జనానికి ఏం చేశారని అసలే అడగొద్దు. ఈ అప్పుకు ఏటా ఏడు లేదా ఎనిమిది శాతం వడ్డీ చెల్లించాలి అనుకుంటే పది లక్షల కోట్ల వడ్డీయే అవుతుంది. ఈ భారాన్ని జనమే భరించాలి. ఇవి గాక కుటుంబాల అప్పులు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.2019-20లో ప్రతి వ్యక్తికి సగటున రు.34,304 అప్పు ఉండగా 2020-21లో రు.52,273కు పెరిగింది.2017-18లో మన జిడిపిలో గృహరుణాలు 30.1శాతం ఉండగా 2020-21లో 37.3శాతానికి పెరిగాయి.కేంద్ర బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2020-21లో జిడిపి విలువ రు.194.81లక్షల కోట్లు. దీనిలో 37.3శాతం అంటే 72.66లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లు.దాన్ని జనాభాతో భాగిస్తే సగటు అప్పు తెలుస్తుంది. అయితే జిడిపిలో ఎగుడుదిగుడులు ఉన్నపుడు సంఖ్యలు మారుతుంటాయి. 2017-18లో తలసరి గృహరుణం రు.29,385 ఉంది. ఇప్పుడు ఉన్నదానితో పోల్చితే గత నాలుగు సంవత్సరాలలో 78శాతం భారం పెరిగింది.


హౌమ్‌ క్రెడిట్‌ ఇండియా అనే సంస్ధ ఏడు నగరాల్లో ఒక సర్వే నిర్వహించింది. 2019లో అప్పు చేసేందుకు వంద కారణాల్లో 33 వినిమయ వస్తువుల కొనుగోలుకు, వ్యక్తిగత అవసరాలకు 23, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 20 ఉండేవి. అదే మరుసటి ఏడాది కరోనా కాలంలో 46 ఇంటి నిర్వహణకు, 27 వాయిదాల చెల్లింపు, ఉపాది లేదా వ్యాపార నష్టాలు తీర్చేందుకు 14 చేస్తున్నట్లు తేలింది. అంటే ఏడాది కాలంలో జీవన విధానంలో ఎంత తేడా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. బ్యాంకులు పదిశాతం రుణాలను బలహీనవర్గాలకు ఇవ్వాలన్నది విధానపరమైన నిర్ణయం. అయితే ప్రయివేటు బ్యాంకుల్లో 52.4శాతం బ్యాంకులు అంతమేరకు ఇవ్వలేదని ఒక సర్వేలో వెల్లడైంది. అంటే ఆ మేరకు అధికవడ్డీలకు వారు ప్రయివేటు రుణాలను తీసుకోవాల్సి వచ్చినట్లే.


గత నాలుగు సంవత్సరాల్లో గృహరుణాలు ఎందుకు పెరిగాయి ? ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు దిగజారి జనాలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి రావటం రుణ భార కారణాల్లో ఒక ప్రధానమైనదిగా మారింది. అదే విధంగా విద్యారంగం కూడా తయారైంది. మతిమాలిన చర్య పెద్ద నోట్ల రద్దు, తరువాత తగినంత కసరత్తు చేయకుండా అమల్లోకి తెచ్చిన జిఎస్‌టి పర్యవసానాలు కూడా రుణభారాన్ని పెంచిన అంశాల్లో చేరాయి. ఇవిగాక ఇతర కారణాలను చూద్దాం.2017లో నిరుద్యోగులశాతం 3.4, అది 2020 మార్చినాటికి 8.8, 2021జూన్‌కు 9.17శాతానికి చేరింది. ఇదే విధంగా ద్రవ్యోల్బణం రేటు 2.41నుంచి 2021 జూన్‌ నాటికి 7.39శాతానికి చేరింది. అంటే నిరుద్యోగం వలన ఆదాయం తగ్గటం, ఖర్చులు పెరగటం, ద్రవ్యోల్బణం వలన ధరల పెరుగుదల కుటుంబాలను అప్పుల పాలు చేస్తున్న కారణాలలో చేరాయి.

అయితే కొంత మంది గృహరుణాలు పెరగటం మన దేశం ఒక్కదానిలోనే కాదు. అనేక దేశాల్లో ఉందని చెబుతారు. దక్షిణ కొరియాలో 103.8, హాంకాంగ్‌లో 91.2, బ్రిటన్‌లో 90, అమెరికాలో 79.5, చైనాలో 61.7శాతం ఉంది. అయితే ఈ దేశాలతో మనం దేనితోనూ పోల్చులేము.మిగతా దేశాలు ఈ సమస్యను ఎలా అధిగమిస్తాయో తెలియదు గానీ సమీప భవిష్యత్‌లో మన కుటుంబాలు తీవ్ర పరిస్ధితిని ఎదుర్కోనున్నాయని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ మూడవ తరంగం కూడా వచ్చేట్లయితే ఇప్పటి వరకు గోచిపాతలతో మిగిలిన జనాలు వాటిని కూడా కోల్పోయినా ఆశ్చర్యం లేదు.


ప్రపంచ రేటింగ్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి మన దేశాన్ని కనిష్ట పెట్టుబడి బిబిబిమైనస్‌ గ్రేడ్‌లో పెట్టింది. వృద్ది రేటు అంచనాలను అందుకోలేకపోయినా, ద్రవ్యలోటు మరియు రుణభారం జోశ్యాలకు మించి పెరిగినా భారత రేటింగ్స్‌ను తగ్గించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దెబ్బతిన్న భారత ఆర్ధిక వ్యవస్ద స్వస్ధత అసంపూర్తిగా ఉందని ఇక్రా రేటింగ్‌ సంస్ధ పేర్కొన్నది. వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో రెండంకెల వృద్ధి నమోదైనా అది 2019 తొలి త్రైమాసికంతో పోలిస్తే తక్కువే అని చెప్పింది. కరోనాకు ముందే కుదేలైన ఆర్ధిక వ్యవస్ధ తరువాత మరింత దిగజారింది.ఇది తిరిగి పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు చేరుతుందో తెలియని అయోమయంలో ఉన్నాం.కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని జోశ్యం చెబుతున్నారు. ముఖ్యంగా యువత ఉపాధి గురించి కనుచూపు మేరలో దారి కనిపించటం లేదు. ఇరవై-ఇరవైనాలగు సంవత్సరాల మధ్య ఉన్నవారిలో 37.9శాతం మంది పని లేకుండా ఉన్నారని సిఎంఐయి తాజా విశ్లేషణ వెల్లడించింది. ముఖ్యంగా యువతులు తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు. డిగ్రీ చదివిన నలుగురిలో ఒకరు, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివిన వారిలో ఐదుగురిలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో రెండు కోట్ల మంది డిగ్రీ చదివే వారిలో కాలేజీ, విశ్వవిద్యాలయాల్లో 85శాతం మంది ఉంటే ఇంజనీరింగ్‌, వైద్య సంస్దల్లో 15శాతం ఉన్నారు.ఐఐటి, ఐఐఎంలలో చదివిన వారికి కూడా వెంటనే ఉద్యోగాలు రావటం లేదు. ఏ సర్వే వివరాలు చూసినా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవటం కష్టం, దీర్ఘకాలం పడుతుందనే చెబుతున్నాయి. ఉద్యోగ మార్కెట్లో ఏటా చేరుతున్న కోటి మంది ఉద్యోగాల కోసం చూస్తుంటారు. నైపుణ్యం లేని వారి పరిస్ధితి చెప్పనలవి కాదు. గత ఏడు సంవత్సరాలుగా నైపుణ్య అభివృద్ది పేరుతో తీసుకున్న చర్యలు, చేసిన ఖర్చు ఏమైందో అర్ధం కావటం లేదు.


సంస్కరణలు అంటే కరడు గట్టిన పెట్టుబడిదారీ సంస్కరణలు అమలు జరపాలని కోరుకొనే వారు కార్మికులనే కాదు యజమానులను కూడా విమర్శిస్తారు. వేగంగా దూసుకుపోయి, వృద్ధిచెందిన అమెరికా, ఐరోపా దేశాల కార్పొరేట్లతో పోటీ పడలేరని దెప్పుతారు. ఎలాంటి మార్పూ లేకుండా ఎంతసేపూ ప్రభుత్వ సాయం, సబ్సిడీలు పొందేందుకు వెనక్కి తిరిగి చూస్తుంటారని ఈసడించుకుంటారు. అలాంటివారిని వదిలించుకున్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం కూడా కొత్తగా రంగంలోకి వచ్చిన వారికి, సాయం కోసం వెనక్కి చూసే వారికి, పోటీ పడలేని దేశీయ మార్కెట్‌ కోసం ఉత్పత్తి చేసే కంపెనీలకు నిధులిస్తోందనే వాదనను కొందరు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక ఉత్పత్తి చేస్తేనే ప్రతినెలా పెరుగుతున్న పది లక్షల మంది యువతీ యువకులకు పని కల్పించటం సాధ్యమని ఎందరో చెప్పారు. గతంలో అతల్‌ బిహారీ వాజపాయి నాయకత్వంలోని ఎన్‌డిఏ, తరువాత పదేండ్లు అధికారంలో ఉన్న మన్మోహన్‌ సింగూ ఆపని చేయలేకపోయారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ కూడా అదే బాటలో నడుస్తోంది. ప్రధానిగా తొలి ప్రసంగంలోనే ఆయన ” ప్రపంచ వ్యాపితంగా ఉన్న వారికి నేనొక విజ్ఞప్తి చేయదలచాను. మీరు రండి భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఎక్కడైనా అమ్ముకోండి కానీ తయారీ ఇక్కడ మాత్రం చేయండి ” అన్నారు. ఆహ్వానం పలకటమే తరువాయి గుంపులు గుంపులుగా వస్తారని నిజంగానే మోడీతో సహా అనేక మంది భావించారు. సులభతర వాణిజ్య వాతావరణం సృష్టించాలన్నారు, విదేశీ పెట్టుబడుల వరద పారనుంది గేట్లు ఎత్తివేయాలన్నారు. ఇంకా ఎన్నో ఊసులు చెప్పారు.ఐదు సంవత్సరాల తరువాత చూస్తే పరిస్దితి ఏమిటి ? ప్రపంచ జిడిపిలో మన దేశ తయారీ రంగం వాటా 2019లో ఇరవై ఏండ్ల కనిష్టానికి పడిపోయింది. వచ్చిన విదేశీ పెట్టుబడులు స్టాక్‌మార్కెట్లో వాటాలు కొనుగోలు చేయటానికి, టెలికాం, చిల్లర వాణిజ్యం వంటి సేవా రంగంలోకి వెళ్లాయి. ఇంతవరకు ఎప్పుడైనా మేక్‌ ఇండియా లేదా మేకిన్‌ ఇండియా పిలుపులు విఫలమైనట్లు అంగీకరించారా ? దాని బదులు స్ధానిక వస్తువులను కొనండి వంటి కొత్త నినాదాలు ఇచ్చారు.


దేశంలో నూతన ఆర్ధిక విధానాలు ప్రారంభమై మూడు దశాబ్దాలు గడిచాయి.ఈ కాలంలో పాలకుల మొగ్గు ఎటు ఉంది ? ప్రభుత్వ రంగ అభివృద్ది నిలిపివేత, అప్పటికే ఏర్పాటు చేసిన వాటిని విక్రయించటం, మొత్తం ప్రయివేటు రంగంపై ఆధారపడటం, మోడీ గారి రాకతో అంతకు ముందు ఉన్న ప్రణాళికల రద్దు. నిజానికి ప్రభుత్వ రంగం లేకపోయిన తరువాత లేదా అన్ని రంగాల నుంచి ప్రభుత్వం వైదొలుగుతున్న క్రమంలో ప్రణాళికల వలన ప్రయోజనం కూడా ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల ప్రకారం ప్రయివేటు రంగం పని చేయదు, అసలు ప్రయివేటు వారి మీద ఆంక్షలే ఉండకూడదు అన్న తరువాత వారికి లక్ష్యనిర్దేశం ఎలా చేస్తారు. ప్రణాళికల వైఫల్యం, నరేంద్రమోడీ మీద ఉన్న మోజు కారణంగా వాటిని ఎత్తివేసినా జనానికి పట్టలేదు. అవి ఉన్నపుడు తమకు ఒరగబెట్టిందేమిటన్న వారి ప్రశ్నకు జవాబు లేదు.


తమ పిలుపులు విఫలమైన తరువాత కేంద్ర పాలకులు కొత్త దారి తొక్కారు. జట్కా గుర్రం కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లు ఉత్పాదకత, ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల విధానాన్ని ముందుకు తెచ్చారు. కరోనా వచ్చి జనం నానా యాతనలు పడుతున్నా అరకొర సాయం తప్ప పరిశ్రమలకు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు సబ్సిడీలు ఇచ్చినట్లు కొందరి అంచనా. అందుకే ఆర్ధిక వ్యవస్ధ దిగజారినా కంపెనీల వాటాలను కొనుగోలు చేసి డివిడెండ్లు, ఇతరంగా లాభాలను తరలించుకుపోయేందుకు విదేశీ సంస్దలు ముందుకు వచ్చాయి. ఈ సబ్సిడీలు, ఉత్పాదకత, ఎగుమతులతో ముడిపడిన ప్రోత్సాహక రాయితీలు ఎక్కువ భాగం ఉపాధి కల్పించే రంగాలు, పరిశ్రమలకు ఇవ్వలేదు. ఉపాధి పడిపోవటానికి ఇదొక కారణం.

చైనాకు పోటీగా మన దేశాన్ని తయారు చేయాలనటంలో తప్పు లేదు. దాని అర్ధం జనానికి ఉపాధి కల్పించటం. మన విధానాలు ఆ దిశలో లేవు. నీకిది నాకది అన్నట్లుగా కొన్ని రంగాలు, కొన్ని గ్రూపుల కార్పొరేట్‌ సంస్దల మీదనే మన పాలకులు, యంత్రాంగ దృష్టి ఉందనే విమర్శ ఉంది. ఉత్పత్తి, ఎగుమతి ఆధారిత ప్రోత్సాహకాలకు విధించిన నిబంధనలను సడలించి గడువు పొడిగించటం దానిలో భాగమే. చైనాలో స్ధానిక పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చారు, మనం కూడా సబ్సిడీలు ఇవ్వకుండా ఎలా అనేవారు కొందరు. చైనా సబ్సిడీలు ఇచ్చింది-ప్రపంచానికి ఎగుమతులు చేస్తోంది, తన జనానికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయాలు, జీవన ప్రమాణాలను పెంచుతోంది. మన దేశంలో సబ్సిడీలు ఇస్తున్నా మిగతావి ఎందుకు జరగటం లేదు ? పన్ను చెల్లించే జనానికి చమురు వదలటం తప్ప మేకిన్‌ ఇండియా ఎందుకు విఫలమైంది ? నిత్యం రాముడిని స్మరించే బిజెపి వారు వస్తే నిజంగా రామరాజ్యం వస్తుందని నమ్మిన వారెందరో ఉన్నారు. ఏడేండ్లలో జరిగింది, జనానికి మిగిలింది ఏమిటి ? తిప్పలు – అప్పులు, కాదంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ నిజం చెప్పినా నమ్మని రోజులు వస్తున్నాయా !

26 Sunday Jul 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Indian Economy, India economy slowdown, Indian economy, Indian GDP paradox, Narendra Modi government credibility


ఎం కోటేశ్వరరావు


” రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో ” అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు మరీ అంత పచ్చిగా నిజం మాట్లాడతావా, అవి మా నేతను ఉద్దేశించే కదా అంటూ దాడులకు దిగేవారు ఒక వైపు. మరోవైపు రెండు రెళ్లు ఎంతో తెలుసుకొనేందుకు కాలుక్యులేటర్‌ను ఆశ్రయించే వారు పెరిగిపోతున్న తరుణమిది.
ఇలాంటి స్ధితిలో దేశ ఆర్ధిక విషయాల గురించి నిజాలు మాట్లాడితే మోడీ అభిమానులు లేదా భక్తులు భరిస్తారా ? మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దెబ్బలాటలకు రారా ? మరోవైపు ఏమి జరుగుతోందో తెలియక జనం అర్ధం చేసుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. కాలుక్యులేటర్లు రెండు రెళ్లు నాలుగు, మూడు మూళ్లు తొమ్మిది అని చూపగలవు తప్ప వివరణ ఇవ్వలేవు. రాజకీయ నాయకులు మసి పూసి మారేడు కాయలను చేయగలరు తప్ప వాస్తవాలను కనపడనివ్వరు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నట్లు ప్రకటించారు. శంకుస్ధాపనకు ఎంచుకున్న సమయం అశుభ గడియ అని, సరైన సమయం కాదని శంకరాచార్య స్వరూపానంద అభ్యంతరం చెప్పారు.చాలా చోట్ల అమావాస్య రోజును అశుభంగా పరిగణిస్తే తమిళియన్లు ఆరోజును పరమ పవిత్రమైనదిగా చూస్తారు. ఇవి విశ్వాసాలకు సంబంధించిన సమస్యలు గనుక అవునని, కాదని చెప్పేవారు ఉంటారు.
కానీ దేశ ఆర్ధిక విషయాలకు సంబంధించి చెప్పాల్సిన వారు నోరు విప్పరు. అంకెలు ఒకటే అయినా కొందరు భిన్నమైన టీకా తాత్పర్యాలు, భాష్యాలతో మన మెదళ్లను తినేస్తున్నార్రా బాబూ అని అనేక మంది భావిస్తున్నారు. తమ సిబ్బంది సేకరించిన గణాంకాలు తప్పని ఏకంగా పాలకులే నిరుద్యోగంపై నివేదిక గురించి చెప్పిన విషయం తెలిసిందే. పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధికిందకే వస్తుంది, అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోవటం లేదని సాక్షాత్తూ మోడీ మహాశయుడే చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కరోనా వైరస్‌ పుణ్యమా అని ఎవరైనా పకోడి బండి పెట్టినా డబ్బుల్లేక ఆ వైపు వెళ్లేందుకు కొందరు విముఖత చూపుతుంటే, కరోనాను కావిలించుకోవటం ఎందుకురా బాబూ అని మరికొందరు వెళ్లటం లేదు. అంతిమంగా పకోడి బండ్లు చాలా మూతపడ్డాయి. ఎప్పుడు పూర్వపు స్ధాయికి వస్తాయో తెలియదు.
దేశ ఆర్ధిక స్ధితి గురించి జనానికి నిజం తెలియటం లేదు. కరోనా కారణంగా వివరాలను సేకరించే సిబ్బందే ఆ ఛాయలకు పోలేదని తెలిసిందే. బయటకు వస్తున్న సమాచారం మాత్రం ఆల్జీబ్రా మాదిరి గుండెను గాబరా పెడుతోంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గినా, వినియోగదారులను వీర బాదుడు బాది వసూలు చేస్తున్న మొత్తం మంగళగిరి పానకాల స్వామికి పోసే పానకం మాదిరి ఎటుపోతోందో తెలియటం లేదు.

ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యలోటు !
ఉగాది పంచాంగ శ్రవణంలో ఆదాయాలు, వ్యయాల గురించి ఏమి చెప్పారో తెలియదు గానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్నదాని కంటే లోటు రెట్టింపుకు పైగా పెరిగి 7.6శాతం ఉంటుందని అంచనా. ఇది తొలి రెండు నెలల తీరుతెన్నులను చూసి చెప్పిన జోశ్యం కనుక వాస్తవంగా ఎంత ఉంటుందో తెలియదు. కేంద్ర బడ్జెట్‌లోటు 7.6శాతం అయితే దానికి రాష్ట్రాలు 4.5శాతం జోడిస్తే వెరసి 12.1శాతం అవుతుందని అంచనా. ఈ లోటును పూడ్చుకొనేందుకు జనం కోసమే కదా అర్ధం చేసుకోరూ అంటూ కేంద్రం, రాష్ట్రాలూ పెట్రోలు, డీజిలు వంటి వాటి ధరలను మరింతగా పెంచినా ఆశ్చర్యం లేదు.
లోటు పెరగటం అంటే ప్రభుత్వాలకు ఆదాయం తగ్గటం, దానికి కారణం జనం వస్తువులు, సేవలను కొనుగోలు తగ్గించటం, అందుకు వారికి తగిన ఉపాధి, ఆదాయం లేకపోవటం, దాని పర్యవసానం వస్తువినియోగం తగ్గించటం, దాంతో పరిశ్రమలు, వ్యాపారాల మూత, ఫలితంగా నిరుద్యోగం పెరుగుదల ఇలా ఒకదానికి ఒకటి తోడై ఏం జరగనుందో తెలియని స్ధితి.
కరోనాకు ముందే పరిస్దితి దిగజారింది, తరువాత పరిస్ధితి మరింత ఘోరంగా తయారైంది. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ గారు చప్పట్లు, దీపాలతో జనాల చేత సంకల్పం చెప్పించారు. ఇరవై ఒక్క లక్షల కోట్ల ఉద్దీపన పధకం అంటూ ఆర్భాటంగా ప్రకటింపచేశారు. అదేమిటో జనానికి తెలియని బ్రహ్మపదార్ధంగా మారింది. ఎవరూ దాని గురించి పెద్దగా చర్చించటం లేదంటే అది మూసినా-తెరిచినా ప్రయోజనం లేని గుడ్డికన్ను వంటిది అని అర్ధం అయినట్లుగా భావించాలి.
ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యే అన్నట్లుగా ప్రభుత్వాల ద్రవ్యలోటు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా లబ్ది పొందేది కార్పొరేట్లు, ధనికులే అన్నది సామాన్యులకు అర్ధంగాని అంశం.లోటు తక్కువగా ఉంటే ఏదో ఒక పేరుతో ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీలు పొందేది వారే. లోటు ఎక్కువగా ఉంటే ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా లేనపుడు పెట్టుబడిదారులు ఎవరూ కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రారు. తమ వద్ద ఉన్న డబ్బును ప్రభుత్వానికి బాండ్ల పేరుతో వడ్డీకి ఇచ్చి లబ్ది పొందుతారు.లోటు పూడ్చే పేరుతో విలువైన భూములు, ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు లేదా ఆస్ధులను కారుచౌకగా అమ్మినపుడు వాటిని కొనుగోలు చేసి లబ్ది పొందేదీ వారే.

వినియోగదారుల ధరలు మరింతగా పెరుగుతాయా ?
ఉత్పత్తిలో స్థబ్దత ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ను సడలించినా ఫ్యాక్టరీలు పూర్తి స్ధాయిలో పని చేయటం లేదు. దీని వలన గిరాకీ మేరకు వస్తువుల సరఫరా లేకపోతే ధరలు పెంచుతారు. మామూలుగానే వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గింది, కరోనాతో అది పెరిగింది. అయినా జూన్‌ నెలలో వినియోగదారుల ధరల సూచి పాక్షిక సమాచారం మేరకే 6.09శాతం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంచనాల కంటే వాస్తవంలో ఎక్కువ ఉంటుందన్నది తెలిసిందే. టోకు ధరల ద్రవ్యోల్బణ సూచి మే నెలలో మైనస్‌ 3.21శాతం అయితే అది జూన్‌ నాటికి 1.81కి చేరింది. అయితే రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 7 నుంచి 7.5శాతానికి పెరగవచ్చని ఆర్ధికవేత్త డాక్టర్‌ ఎన్‌ఆర్‌ భానుమూర్తి అంచనా వేశారు. ప్రభుత్వం తీసుకున్న ఆర్ధిక మద్దతు చర్యల వలన గిరాకీ పెరగవచ్చని, దానికి అనుగుణ్యంగా ఉత్పత్తి పెరగకపోతే ద్రవ్యోల్బణం-ధరలు- పెరగవచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్బోల్బణం ఎనిమిదిశాతానికి చేరవచ్చని భానుమూర్తి అన్నారు.
ద్రవ్యోల్బణం ఏడుశాతానికంటే తగ్గే అవకాశాలు లేవని అనిల్‌ కుమార్‌ సూద్‌ అనే మరో ఆర్ధికవేత్త చెబుతున్నారు.చమురు ధరలను పెంచారు, పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులు పెరుగుతున్నాయి, రూపాయి విలువ తక్కువగా ఉంది. రవాణా, టెలికాం ఖర్చులు పెరిగాయి, సరఫరా గొలుసు పూర్తిగా వెనుకటి స్ధితికి రాలేదు అన్నారు. వ్యవసాయ రంగం వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ ఫ్యాక్టరీలు సామర్ధ్యంలో 50 నుంచి 55శాతమే పని చేస్తున్నాయని ఎస్‌పి శర్మ అనే మరో ఆర్ధికవేత్త చెప్పారు.

జిడిపి ఎంత మేరకు తగ్గవచ్చు ?
మన దేశంలోని రేటింగ్‌ సంస్ధ ‘ ఇక్రా ‘ అంచనా ప్రకారం వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో జిడిపి 9.5శాతం తిరోగమనంలో ఉండవచ్చు. తొలి త్రైమాస కాలంలో 25శాతం, రెండు, మూడులలో 12, 2.5శాతం వరకు లోటు ఉండవచ్చని, దాని అర్ధం సాధారణ కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయని, ఈ కారణంగా ద్రవ్యోల్బణం ఆరుశాతం అని జోశ్యం చెబుతున్నారు.

భారత్‌లో పెట్టుబడులకు ఇదే తరుణమా ?
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల చేసిన ప్రసంగ భావం అదే. ఒక వైపు చైనా సంస్ధల పెట్టుబడులకు దారులు మూసిన సమయంలో అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి సమావేశంలో ప్రసంగించిన మోడీ అమెరికన్‌ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణం అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు భారత్‌ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు 30శాతం లబ్ది పొందినట్లు ఒక అంచనా. విదేశీ ద్రవ్య పెట్టుబడిదారులు మన స్టాక్‌మార్కెట్‌ మంచి లాభాలను తెచ్చిపెట్టేదిగా భావిస్తున్నారు. ఆ మేరకు వారి పెట్టుబడులు పెరుగుతాయి, మన దగ్గర డాలర్ల నిల్వలు గణనీయంగా ఉండవచ్చుగానీ, మన దేశంలో ఉపాధి పెరిగే అవకాశాలు లేవు. మన సంపద లాభాల రూపంలో విదేశాలకు తరలిపోతుంది. మన స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు రావటానికి ఒక ప్రధాన కారణం కార్పొరేట్‌ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించటమే. కంపెనీల దివాళా నిబంధనలను సరళంగా ఉంచాలని ప్రభుత్వం వత్తిడి తేవటాన్ని అంగీకరించని తాను బాధ్యతల నుంచి వైదొలిగినట్లు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు.
అంటే కంపెనీలు నిధులను, తీసుకున్న రుణాలను పక్కదారి పట్టించి దివాలా పేరుతో బిచాణా ఎత్తివేసేందుకు, సులభంగా తప్పించుకొనేందుకు అవకాశం ఇవ్వటం తప్ప మరొకటి కాదు. ఇది కూడా విదేశీ మదుపుదార్లను ఆకర్షిస్తున్నదని చెప్పవచ్చు. గూగుల్‌తో సహా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెడతామని ముందుకు రావటానికి కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఒక ప్రధాన కారణం. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఇప్పటికే తమిళనాడులో సెల్‌ఫోన్ల తయారీ యూనిట్‌ను నడుపుతున్నది. కొత్తగా పెట్టే సంస్ధలకు 15శాతమే పన్ను అన్న రాయితీని ఉపయోగించుకొనేందుకు అది మరో కొత్త పేరుతో విస్తరణకు పూనుకుంది. గూగుల్‌ వంటి కంపెనీలూ అందుకే ముందుకు వస్తున్నాయి. వీటి వలన మనకు కలిగే ప్రయోజనం కంటే వాటికి వచ్చే లాభం ఎక్కువ కనుకనే పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నాయి.

నిరర్ధక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి !
ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎన్‌పిఏ పాలకులు దివాలా తీయించారని బిజెపి చేసిన ప్రచారం గురించి తెలిసినదే. రాజకీయనేతలు బ్యాంకులకు ఫోన్లు చేసి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇప్పించి కమిషన్లు దండుకున్నారని చెప్పింది. దాన్లో అతిశయోక్తి ఉన్నా వాస్తవ పాలు కూడా ఉంది. కానీ ఆరేండ్ల బిజెపి ఏలుబడి తరువాత బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రికార్డు స్థాయిలో పెరగనున్నట్లు ఆర్‌బిఐ స్వయంగా హెచ్చరించింది. దీనికి కరోనా కారణం అంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. కరోనా కొన్ని సంస్దలను ఇబ్బందుల పాలు చేసిన మాట వాస్తవం. ఈ మాత్రానికే గణనీయంగా, ఆకస్మికంగా ఎలా పెరుగుతాయి ? మొత్తంగా చూసినపుడు స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల ఆగలేదు. కంపెనీల లాభాల శాతం పెద్దగా పడిపోయిన దాఖలాలు లేవు. మోడీ సర్కార్‌ రుణ నిబంధనలను కఠినతరం గావించినట్లు చెప్పింది. ఇన్ని చేసినా నిరర్దక ఆస్తులు ఎందుకు పెరుగుతున్నట్లు ? కాంగ్రెస్‌ నేతల మాదిరే బిజెపి పెద్దలు కూడా దందా ప్రారంభించారా ? 2020 మార్చినాటికి 8.5శాతంగా ఉన్న నిరర్దక ఆస్తులు 2021 మార్చినాటికి 12.5 లేదూ పరిస్ధితి మరింత దిగజారి వత్తిడి పెరిగితే 14.7శాతానికి పెరగవచ్చని స్వయంగా రిజర్వుబ్యాంకు హెచ్చరించింది.

కావలసింది నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీయా ? బలమైన దేశమా !
చరిత్రలో ఎందరో రాజుల ఏలుబడిలోని సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. వారి బలం వాటిని కాపాడలేకపోయింది. వర్తమాన చరిత్రలో నరేంద్రమోడీ నాయకత్వంలో గత ఆరు సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వం ఉంది. దాన్ని ఎవరూ కదిలించలేరన్నది అందరికీ తెలిసిందే. కానీ ఐదేండ్లు తిరిగే సరికి దేశం ఆర్ధికంగా దిగజారిపోయింది. నరేంద్రమోడీ 56 అంగుళాల ఛాతీ లేదా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం, ఆయన మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో లాఠీలు పట్టుకొని వీధుల్లోకి వచ్చే ప్రచారకులు, స్వదేశీ జాగరణ మంచ్‌ వారు గానీ ఆర్ధిక దిగజారుడును ఆపలేకపోయారన్నది తిరుగులేని నిజం.
అనేక అంశాలు పరస్పర విరుద్దంగా కనిపిస్తున్నాయి.అది భాష్యం చెప్పేవారి చాతుర్యమా లేక వాస్తవ పరిస్ధితుల నిజాలను ధైర్యంగా నివేదించే సలహాదారులు మోడీ గడీలో లేరా ? దేశ ఆర్ధిక వ్యవస్దలోని అనేక సూచీలు తిరోగమనాన్ని సూచిస్తున్నాయి, వాటి మీద ఆధారపడే జిడిపి మాత్రం పురోగమనం చూపుతున్నది. దేశంలో నేడున్న అసహన పరిస్ధితుల నేపధ్యంలో అనేక మంది ఆర్ధికవేత్తలు బహిరంగంగా, సూటిగా పాలకుల వైఖరిని ప్రస్తుతానికి ప్రశ్నించలేకపోవచ్చు. అయినా కొందరు ధైర్యం చేసి వేస్తున్న ప్రశ్నలు, లేవనెత్తుతున్న సందేహాలను తీర్చేవారు లేరు.

గణాంకాల తిరకాసేమిటో సంతృప్తికరంగా తేల్చేయాలి: సి. రంగరాజన్‌
ఇటీవలి కాలంలో దేశ గణంకాలు, సమాచారానికి సంబంధించిన వివాదాలకు సంతృప్తికరంగా ముగింపు పలకాల్సి ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ సి. రంగరాజన్‌ జాతీయ గణాంకాల దినోత్సవం సందర్భంగా జూన్‌ 30వ తేదీన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటించిన జీవన సాఫల్య అవార్డును అందుకుంటూ ఈ సూచన చేశారు. జాతీయ గణాంకాల కమిషన్‌కు గుర్తింపు ఇవ్వాలని, అలా చేస్తే దాని విధులు, బాధ్యతలేమిటో స్పష్టం అవుతాయని కూడా ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో ఈశాఖ విడుదల చేసిన గణాంకాలు, వాటికి అనుసరిస్తున్న పద్దతి వివాదాస్పదమై అనేక మందిలో అనుమానాలు తలెత్తాయి. జిడిపి సజావుగా ఉంటే దేశం ఎందుకు దిగజారుతోందనే ప్రశ్నలు వచ్చాయి. మన పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే మన సమాచార, గణాంకాల నాణ్యతను మెరుగుపరుచుకొనేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిన స్ధితిలో ఉన్నాము. అలాంటి రుణం ఒకటి మంజూరైందని ప్రధాన గణకుడు ప్రవీణ్‌ శ్రీవాత్సవ చెప్పారు.

అడుగడుగునా అంకెల గారడీ !
2012-18కాలంలో మన జిడిపి సగటున ఏడుశాతం అభివృద్ధి చెందినట్లు లెక్కలు చూపుతున్నాయి.2011 నుంచి 2018వరకు ప్రతి ఏటా జిడిపి వృద్ధి రేటును వాస్తవమైన దాని కంటే 2.5శాతం అదనంగా చూపుతున్నారని 2014 అక్టోబరు నుంచి 2018 జూన్‌వరకు ప్రధాన మంత్రి ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల పేరుతో సలహాదారు పదవి నుంచి తప్పుకున్న ఏడాది తరువాత సుబ్రమణ్యం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విమర్శను ప్రభుత్వ 2020-21ఆర్ధిక సర్వే తిరస్కరించింది. అయితే గత ఆర్ధిక సంవత్సరంలో దిగజారిన ఆర్ధిక స్దితి ప్రభుత్వం వెల్లడిస్తున్న అంకెల గారడీని నిర్ధారించింది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికీ నిజాలు చెప్పటం లేదు, ఇదే తీరు కొనసాగితే రేపు నిజం చెప్పినా నమ్మని స్ధితి కనిపిస్తోంది. మన ప్రభుత్వం జిడిపిని లెక్కిస్తున్న తీరు గురించి ఐఎంఎఫ్‌ ఆర్ధికవేత్తలు కూడా సందేహాలను వెలిబుచ్చారు.


నాడూ నేడూ ఒకటే ప్రచారం అదే దేశం వెలిగిపోతోంది !
2004వరకు అధికారంలో ఉన్న వాజ్‌పేయి హయాంలో దేశం వెలిగిపోయిందనే ప్రచారంతో బిజెపి ఆ ఏడాది ఎన్నికలకు పోయి బొక్కబోర్లా పడిన విషయం తెలిసినదే.2005-11 సంవత్సరాల మధ్యలో బ్యాంకుల రుణాల జారీ రేటు ఏటా 15శాతం చొప్పున అభివృద్ధి చెందిందని, తరువాత కాలంలో అది నాలుగుశాతానికి పడిపోయిందని సిఎంఐయి అధ్యయనం తెలిపింది. అంటే పెట్టుబడి ప్రాజెక్టులు మందగించాయనేందుకు అదొక సూచిక. పారిశ్రామిక ఉత్పత్తి 2011కు ముందు సగటున తొమ్మిదిశాతం వృద్ధి చెందినట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడిస్తే తరువాత కాలంలో రెండుశాతానికి పడిపోయింది.ఇదే కాలంలో పెట్టుబడుల వార్షిక వృద్ధి రేటు 23.9 నుంచి మైనస్‌ 1.8శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో వినియోగం వృద్ధి రేటు వేగం మూడు నుంచి మైనస్‌ 1.5శాతానికి తగ్గింది, పట్టణ రేటు 3.4 నుంచి 0.3కు తగ్గింది ఇలా అనేక సూచికలు పడిపోగా జిడిపి వృద్ధి రేటును మాత్రం 7.2-7.1శాతంగా చూపారు. వేతనాల బిల్లుల శాతాలు కూడా ఇదే కాలంలో గణనీయంగా పడిపోయాయి, దేశం మొత్తంగా వినియోగం తగ్గటానికి ఇదొక కారణం. వీటన్నింటిని చూసిన తరువాత అంకెలు పొంతన కుదరటం లేదని జిడిపి రేటు గురించి అనేక మంది సందేహాలు లేవనెత్తారు. ఈ నేపధ్యంలోనే పకోడీలు తయారు చేయటం కూడా ఉపాధి కల్పన కిందికే వస్తుందని, అలాంటి వాటిని గణాంకాలు పరిగణనలోకి తీసుకోకుండా నిరుద్యోగం పెరిగినట్లు చూపారని నరేంద్రమోడీ రుసురుసలాడారు. ఒక వేళ అదే నిజమైతే మోడీ ఏలుబడికి ముందు కూడా పకోడీల తయారీని లెక్కలోకి తీసుకోలేదు.

కరోనా తరువాత పరిస్దితి బాగుపడుతుందా ?
అనేక మంది కరోనా వచ్చింది కనుక తాత్కాలిక ఇబ్బందులు తప్పవని మోడీ దేశాన్ని ముందుకు తీసుకుపోతారనటంలో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికీ భావిస్తున్నారు. అదే ప్రచారం చేస్తున్నారు. అంతా బాగుంది, మరోసారి దేశం వెలిగిపోతోంది, 2024 తరువాత కూడా మోడీయే ప్రధాని అని విపరీత ప్రచారం చేస్తున్నారు. అలాంటి గుడ్డి విశ్వాసం ఉన్న వారి బుర్రలకు ఇప్పటివరకు ఎక్కించింది ఒక పట్టాన దిగదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు రేపు తప్పనిసరై నరేంద్రమోడీ నిజాలు చెప్పినా జనాలు నమ్మని పరిస్ధితి వస్తుంది. అందుకే ఇప్పటికైనా జరుగుతోందేమిటో చెబుతారా ? బలమైన ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఫలితం లేదని తేలిపోయింది. వీటన్నింటినీ చూసినపుడు ఇప్పుడు కావలసింది దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి అన్న మహాకవి గురజాడ చెప్పిన అలాంటి జనంతో కూడిన బలమైన దేశమా లేక శ్రీశ్రీ చెప్పినట్లుగా చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉన్న ప్రభుత్వమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !
  • మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!
  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !

Recent Comments

sdsd on మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్…
raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: