• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Indonesia

వాణిజ్య యుద్ధంతో ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు

10 Tuesday Jul 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

INDIA, Indonesia, TRADE WAR, Trade war India, Trade war puts Indonesia and India at risk

Image result for trade war

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ పౌరుల ఆకాంక్షలకు విరుద్దంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో అతిపెద్ద ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రారంభసూచికగా జూలై ఆరవతేదీ అర్ధరాత్రి చైనా మీద తొలి తూటా పేల్చాడు. గతంలో కూడా వాణిజ్య యుద్ధాలు జరిగినప్పటికీ తాజా పరిణామం పర్యవసానాలు తీవ్రంగా వుంటాయనే అభిప్రాయాలు, భయాలు వెలువడుతున్నాయి. చైనా, ఇతర దేశాల మీద ప్రారంభించిన యుద్ధంతోతాము ఎంతో కొంత లాభపడవచ్చనే ఆశ అమెరికన్‌ కార్పొరేట్లలో అంతర్గతంగా వుంది. అయితే అదే సమయంలో జరిగే నష్టాల గురించి కూడా అంతే భయపడుతున్నా. లాభాల గురించి బహిరంగంగా చెప్పుకోలేరు, ఇదే సమయంలో ప్రతికూలతల గురించి మీడియాలో ఎన్నో హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా దిగుమతులపై విధించిన పన్నుద్వారా వసూలయ్యే మొత్తాన్ని అమెరికా ఆంక్షలతో ప్రభావితమయ్యే చైనా కంపెనీలు, కార్మికుల కోసం వినియోగిస్తామని చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అమెరికా-చైనా రెండూ కూడా దీర్ఘకాల వాణిజ్య యుద్ధానికి సిద్దపడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా వుత్పత్తులపై అదనపు పన్ను వసూలు ప్రారంభించిన చైనా మరోవైపు గతంలో నిలిపివేసిన తమ కోడి మాంస దిగుతులకు అనుమతించినట్లు జర్మనీ మంత్రి ప్రకటించారు.

వాణిజ్య యుద్ధాలను, వాటిలో భాగంగా దిగుమతి పన్నులను విధించేందుకు అధ్యక్షుడికి వున్న అధికారాలను పరిమితం చేయాలని నేషనల్‌ టాక్స్‌ పేయర్స్‌ ఫౌండేషన్‌ విశ్లేషకుడు ఆండ్రూ విల్‌ఫోర్డ్‌ ‘యుఎస్‌ఏ టుడే’లో పేర్కొన్నాడు. దాని సారాంశం ఇలా వుంది. 1962లో చేసిన వ్యాపార విస్తరణ చట్టంలోని అవకాశాలను ట్రంప్‌ వినియోగిస్తున్నాడు. నిర్దిష్ట జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వాటికోసం చేసిన చట్టాలను దుర్వినియోగపరుస్తూ దేశ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందున, పార్లమెంట్‌ జోక్యం చేసుకొని అధ్య క్షుడిని నిలువరించాలి. అల్యూమినియం, వుక్కు దిగుమతుల ద్వారా దేశభద్రతకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే 2010-15 మధ్య దేశీయంగా వుత్పత్తి అయిన వుక్కులో కేవలం సగటున మూడుశాతం లోపే జాతీయ భద్రతకు వినియోగిస్తున్నట్లు తేలింది, అవసరానికి మించి దేశంలో వుత్పత్తి వుంది, అదే విధంగా దిగుమతి చేసుకున్న వుక్కులో జాతీయ భద్రతకు వినియోగిస్తున్నది సగటున 2.4నుంచి 2.8శాతం మధ్యనే వుంది, ఆ దిగుమతులలో కూడా అత్యధిక భాగం భాగస్వామ్య లేదా మిత్ర దేశాల నుంచే వున్నాయి. వుక్కు పరిశ్రమలో వుపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఐదు పెద్ద కంపెనీలు మార్కెట్‌ కాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వుత్పాదకత గణనీయంగా పెరిగింది.అల్యూమినియం, వుక్కు దిగుమతులపై పన్నుల విధింపు కారణంగా నిఖరంగా 4.7లక్షల వుద్యోగాలు పోతాయి. ఇవి అమెరికా వుక్కు పరిశ్రమలో పని చేస్తున్న లక్షా 40వేల మందికి మూడు రెట్లు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ లేకుండా బలమైన జాతీయ భద్రత సాధ్యం కాదని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ స్వయంగా చెప్పాడు. పన్నుల విధింపు తగదని వంద మంది రిపబ్లికన్‌ ఎంపీలు లేఖ రాశారు. ట్రంప్‌ వినియోగిస్తున్న చట్టంలోని నిబంధనను 1979,82 సంవత్సరాలలో ఇరాన్‌, లిబియా చమురు దిగుమతుల నిరోధానికి వినియోగించారు.

రక్షణాత్మక చర్యలను చేపట్టబోయే ముందు వస్తువుల నిజమైన జాతీయత ఏమిటో తెలుసుకోవాలని లాసానే విశ్వవిద్యాలయ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ స్టెఫానే గారెలీ హితవు చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ యుగంలో వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం అంత సులభం కాదు. కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా, లాస్‌ ఏంజల్స్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఒక ఐపాడ్‌లోని 431భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు.ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చిన ఆ భాగాలను చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఐపాడ్‌గా రూపొందిస్తారు. అంతిమ వుత్పత్తిపై చైనా జోడించే విలువ ఐదుశాతం మించటం లేదు. అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ వద్దకు వచ్చే సరికి అది చైనా తయారీ వుత్పత్తిగా పరిగణించబడుతోంది. అది నిజంగా చైనా వుత్పత్తా ? అమెరికా వాణిజ్యలోటు అది చేసుకొనే దిగుమతుల కారణంగా ఏర్పడుతోంది. మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే వాటిలో 40శాతం మెక్సికోలోని అమెరికన్‌ కంపెనీలు లేదా అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసే మెక్సికో స్ధానిక కంపెనీల నుంచి వుంటున్నాయి. చైనా నుంచి చేసుకొనే దిగుమతులు కూడా అలాంటివే. వాణిజ్య వ్యూహాలలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల తయారీకి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వుచితంగా సాప్ట్‌వేర్‌ను అందచేస్తున్నది. దానికి గనుక ధర నిర్ణయిస్తే ఏడాదికి రెండువందల బిలియన్‌ డాలర్లు వుంటుంది. ఆ మొత్తం అమెరికా వాణిజ్యలోటులో సగం.

వాణిజ్యం యుద్ధం విస్తరిస్తే అమెరికా అధ్య క్షుడు జర్మన్‌ ఆటో పరిశ్రమకు కూడా ముప్పు తెస్తున్నట్లే. బిఎండబ్ల్యు సౌత్‌ కరోలినా లోని స్పార్టన్‌బర్గ్‌, అలబామాలోని వాన్స్‌లో మెర్సిడెస్‌, టెనెసీలోని ఛాటూంగాలో ఓక్స్‌వాగన్‌ కార్లు తయారవుతాయి. ఇవి ఎగుమతుల కోసం కూడా తయారు చేస్తాయి. గతేడాది బిఎండబ్ల్యు తయారు చేసిన వాటిలో 70శాతం ఎగుమతి చేశారు. వీటిని అమెరికన్‌ కార్లు అనాలా జర్మనీవి అనాలా ? వాణిజ్య యుద్ధానికి ముందు అమెరికా తయారీ కార్లపై చైనా దిగుమతి పన్ను తగ్గించిన కారణంగా ఫోర్డ్‌, టెల్సా వంటి కంపెనీలు కొద్దివారాల ముందు చైనాలో పదిహేనుశాతం వరకు కార్లధరలను తగ్గించాయి. అమెరికా ప్రారంభించిన యుద్ధంతో చైనా విధించిన ప్రతికూల సుంకాల కారణంగా ఇప్పుడు 40శాతం పన్నుతో ధరలు పెరిగాయి. ఈ పన్నులను వినియోగదారుల నుంచి వసూలు చేయటం తప్ప తాము భరించలేమని బిఎండబ్ల్యు చైనా ప్రకటించింది.1974 నుంచి అమలులోకి వచ్చిన కొయొటో ఒప్పందం ప్రకారం ఒక వస్తువు తయారీలో కనీసంగా స్ధానిక అంశం ఎంత వుంది లేదా చివరి తయారీ క్రమం పాత్ర ఎంత అనేది నిర్ధారించవచ్చు. అయితే ప్రపంచీకరణ మరియు డిజిటలైజేషన్‌ సంక్లిష్టతను పెంచాయి. వివిధ విడిభాగాలతో తయారైన ఒక వస్తువులు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఆయాప్రాంతాల సామర్ధ్యం, ధరలను బట్టి మారిపోతుంటాయి.

ప్రపంచీకరణ కారణంగా ఒక ఆర్ధిక వ్యవస్ధను వేరు చేసి చూడటం కష్టం అనే విషయాన్ని బ్రెక్సిట్‌ మద్దతుదారుల మాదిరి అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇతర దేశాలలో అమెరికా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది, అలాగే ఇతర దేశాలు అమెరికాలో ఏడులక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం మీద ప్రపంచ జిడిపిలో ప్రత్యక్ష పెట్టుబడులు 35శాతం వరకు వుంటాయి. ఎనిమిది కోట్ల మందికి వుపాధి కల్పిస్తున్నాయి. ప్రయివేటు జీవితంలో వివాహం చేసుకోవటం కంటే విడిపోవటం ఎంతో సంక్లిష్టం, ఖరీదైనది. అంతర్జాతీయ వాణిజ్యం మీద చూపే ప్రభావాన్ని స్పష్టంగా చూడాలంటే కస్టమ్స్‌ లెక్కల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేదానికంటే ఒక వస్తువు వుత్పత్తిలో విలువ జోడింపు మీద కేంద్రీకరించాలి. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా నమోదయ్యే లావాదేవీల ద్వారా వికేంద్రీకరణ చెందిన మరియు నిరాకార ప్రపంచంలో ఎవరు దేనికి యజమానులో ఎలా చెప్పగలం? జాన్‌మైేునార్డ్‌ కీన్స్‌ చెప్పినట్లు సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవి అయితే పరిష్కారాలన్నీ రాజకీయ పరమైనవి అయినందున ట్రంప్‌తో మనం జీవించాల్సి వుంది.

వాణిజ్య యుద్ధం జరిగితే నష్టపోయేది అమెరికా అని గతంలో బిల్‌క్లింటన్‌ హయాంలో సహాయ విత్తమంత్రిగా చేసిన ప్రొఫెసర్‌ జె బ్రాడ్‌ఫోర్డ్‌ డెలాంగ్‌ స్పష్టం చేశారు. మోటార్‌ సైకిళ్ల తయారీలో పేరెన్నికగన్న హార్లే డేవిడ్స్‌న్‌పై ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడటం అమెరికా ప్రజాస్వామ్యం మీదే దాడి వంటిదని, నవంబరులో జరిగే ఎన్నికలలో వుభయ సభలలో ఒకదానిలో అయినా మెజారిటీ సంపాదించగలిగితే తప్ప ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టకు చేసిన నష్టాన్ని సరిచేయలేమని అన్నారు. బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో హార్లే డేవిడ్స్‌న్‌ అధికారులు, యూనియన్‌ నేతలతో ట్రంప్‌ ఒక సమావేశం జరిపారు. ఈ కంపెనీ అమెరికాలో వస్తువులను తయారు చేస్తున్నది, నేను చూస్తుండగానే దాన్ని విస్తరించాలని చెప్పాడు. ఏడాది తిరగ్గానే పరిస్ధితులు మారిపోయాయి. దిగుమతి చేసుకున్న అల్యూమినియం, వుక్కుపై పన్నులు విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన కారణంగా ఐరోపా యూనియన్‌ ప్రతికూల చర్యలకు గురికాని ప్రాంతాలకు కొన్ని కార్యకలాపాలను తరలిస్తామని మోటార్‌ సైకిల్‌ కంపెనీ ప్రకటించింది. దాన్ని చూడగానే ట్రంప్‌ ఆ కంపెనీ మీద దాడి చేశాడు. ఒకసారి బయటకు పోయిన తరువాత తిరిగి అమెరికాలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా అమ్ముతామంటే కుదరదు అని హెచ్చరించాడు. వారు మరొక దేశంలో ఫ్యాక్టరీ నిర్మించటానికి వీల్లేదంటే వీల్లేదు, వారు ఇక్కడి నుంచి తరలటం అంటే అంతానికి ఆరంభం అని ట్వీట్లలో వాగాడు.

వాణిజ్య యుద్ధం తధ్యమనే అభిప్రాయంతో చైనాలోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలించేందుకు ఆలోచన చేశాయి, ఇంకా చేస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న వేతనాలతో అనేక కంపెనీలు ఎప్పటి నుంచో తక్కువ వేతనాలకు శ్రమ దొరికే చోటికి తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్యంలో చైనాకు ఎంతో మిగులున్న కారణంగా చైనాను లంగదీసుకోవచ్చనే అభిప్రాయం కొంత మందిలో లేకపోలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల మీద పన్ను విధిస్తానంటున్నాడు ట్రంప్‌, దానికి పోటీగా చైనా ఎంతపన్ను విధించినా 130 బిలియన్‌ డాలర్ల మేరకే దాని దిగుమతులున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివి, విజయం సాధించటం సులభం అని ట్రంప్‌ చెప్పారు, వాస్తవం ఏమంటే వాటిలో పాల్గనేవారే కాదు వాణిజ్య యుద్ధాలు ప్రతి ఒక్కరినీ నష్టపరుస్తాయి, ఎవరూ గెలవజాలరని ఆస్ట్రేలియా సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రికలో ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక వేళ విజయం సాధించినా అది పరిమితం. ట్రంప్‌ తన కలలను నిజం చేసుకోవాలంటే చైనా లేదా ఐరోపా యూనియన్‌ అందచేసే వస్తువులను స్ధానికంగా తయారుచేసేందుకు మరిన్ని ఫ్యాక్టరీలను పెట్టాలి, వాటిద్వారా మరిన్ని వుద్యోగాలను కల్పించవచ్చు. అయితే అలా తయారు చేసే వస్తువులు ఎంతో ప్రియమైనవిగా పరిమితంగా వుంటాయి.

వాణిజ్యయుద్ధ తుపాకి గుండు పేల్చాలన్న నిర్ణయం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక్క చైనాకే పరిమితం చేయలేదు, కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద కూడా పన్నులు విధించాడు. అదే జరిగితే అమెరికా దిగుమతి చేసుకొనే 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై కూడా ఐరోపా యూనియన్‌ పన్నులు విధిస్తుంది. ప్రభావాలు, అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి. ఐరోపా యూనియన్‌, ఇతర అమెరికా మిత్రదేశాలకు చైనాతో స్వంత సమస్యలు వున్నాయి. ట్రంప్‌ గనుక వాణిజ్యదాడిని ఒక్క చైనాకే పరిమితం చేసి వుంటే వారంతా కలసి వచ్చేవారు. దానికి బదులుగా ఐరోపా యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, కెనడా, మెక్సికోలపై చర్యల ద్వారా అమెరికాను ఒంటరిపాటు చేశాడని ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్నది.

తొలి దఫా పన్నుల అర్ధం వాణిజ్య యుద్ధ పూర్తి స్ధాయి ప్రభావం ఎలా వుంటుందో అనుభవించటానికి అమెరికన్‌ వినియోగదారులు ఒక అడుగు దగ్గర కావటమే అని నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాథ్యూ సాహే అన్నారు. విధించే పన్నులు అమెరికా వుద్యోగాలనేమాత్రం కాపాడలేవు, కానీ అవి పన్నుల సంస్కరణద్వారా పొందిన లబ్దిని దెబ్బతీస్తాయి, అనేక వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి, తమ గదులకు అవసరమైన చిన్న ఫ్రిజ్‌లకు విద్యార్ధులు అధిక మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది, ఏకపక్షంగా పన్నులు విధించటం తప్పుడు పద్దతి, దానిని వెంటనే నిలిపివేయాలి అని కూడా సాహే చెప్పారు.

ఇరవై లక్షల కోట్ల పెద్ద అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే వాణిజ్య యుద్ధం, దానిలో 34బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించటం సముద్రంలో కాకిరెట్ట వంటిదని, దీని వలన కొంత మంది నష్టపోతారు, కొందరు లాభపడతారు అని ఓక్స్‌ డాట్‌కామ్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. చట్టపరంగా చెప్పాలంటే 34బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై 25శాతం పన్ను విధింపు అక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్న చైనాను శిక్షించటమే. ట్రంప్‌ వాక్పటిమలో 300బిలియన్‌ డాలర్లపై పన్ను విధిస్తామని చెప్పాడు. ఇరవైలక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికాకు గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న 478బిలియన్‌ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే 2017లో ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న పార్లమెంట్‌ తీర్మానంతో పోలిస్తే 25శాతం పన్ను విధింపుద్వారా ఏడాదికి వచ్చే 8.5బిలియన్‌ డాలర్లు ఏపాటి? వాషింగ్‌మెషిన్ల పరిశ్రమకు పన్నుల మొత్తం పెద్దగా వుండవచ్చుగాని ఒక మిషన్‌ కొనే పౌరుడికి పెద్ద భారం అనిపించదు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సమాచారం ప్రకారం 1977 తరువాత తొలిసారిగా జనవరిలో పన్నులు పెంచిన కారణంగా మార్చినెల నుంచి వాషింగ్‌ మెషిన్ల ధరలు 16శాతం పెరిగాయి. పౌరులు వాటిని రోజూ కొనరు కదా ! అయినప్పటికీ 2015లో వున్న ధరలకంటే ఇప్పుడు చౌకగానే వున్నాయి. అనేక పరికరాల ధరలు గత కొద్ది సంవత్సరాలుగా పడిపోతున్నాయి, ట్రంప్‌ వాటిని కొద్దిగా పెంచారు. దాని కధనం ఇలా సాగింది.

Image result for trade war

వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు పెరిగి, అభివృద్ధి దిగజారుతుందని ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో పేర్కొన్నది.తొలుత 34 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై విధించిన 25శాతం పన్నుతో అటు చైనా, ఇటు అమెరికాపై ఆర్ధికంగా పెద్దగా ప్రభావం చూపదు. నష్టం తరువాత పెరుగుతుంది. గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 506బిలియన్‌ డాలర్లు కాగా అవసరమైతే తాను 550 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొన్నాడు. పన్నులను విస్తరించే కొద్దీ వినియోగదారులకు ధరలు పెరుగుతాయి, దిగుమతి చేసుకొనే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీల ఖర్చు పెరుగుతుంది.ద్రవ్యమార్కెట్‌లు దడదడలాడతాయి.కొంత మందిని లేఆఫ్‌ చేయవచ్చు, చైనాతో ట్రంపేమైనా రాజీకి వస్తారా అని వాణిజ్యపెట్టుబడులపై నిర్ణయం తీసుకొనేందుకు వేచి చూస్తారు. గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా కల్పించిన అనేక ఆర్ధిక లబ్దులు ప్రమాదంలో పడతాయి. పూర్తి స్ధాయి వాణిజ్య యుద్దం జరిగితే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇతరులు హెచ్చరించినట్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయే ప్రమాదముంది. అమెరికా సోయాలో 60శాతం దిగుమతి చేసుకుంటున్న చైనా హెచ్చరిక కారణంగా గత నెలలో 17శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో చైనా కరెన్సీ విలువ డాలరు మారకంతో గతనెలలో 3.5శాతం పడిపోయింది. ఇది అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి చైనా కంపెనీలకు వూతమిస్తుంది. అమెరికా వినియోగదారుల మీద ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చైనా పారిశ్రామిక వస్తువుల మీదనే తొలుత కేంద్రీకరించింది. అయితే ఆ చర్య ద్వారా కంపెనీల యంత్రాల ధరలు పెరిగితే ఆ భారాన్ని అవి చివరికి తమఖాతాదారులు, వినియోగదారులమీదనే మోపుతాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది.

అమెరికా-చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు కలిగించవచ్చని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్ధికవేత్త పాల్‌ గ్రుయెన్‌వాల్‌ హెచ్చరించాడు. వర్ధమాన దేశాల మార్కెట్లనుంచి మంచి వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాకు మదుపుదార్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారని, మిగతా ఆసియా దేశాలతో పోల్చితే ఇండోనేషియా, భారత్‌లకు ఎక్కువ ముప్పు వుందన్నాడు.పతనమౌతున్న ఇండోనేషియా కరెన్సీ రుపయా విలువ నిలబెట్టేందుకు, స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడుల వుపసంహరణను నివారించేందుకు మే, జూన్‌ నెలల్లో వడ్డీ రేట్లను పెంచింది. పెట్టుబడులరాక మందగించటం, వున్న పెట్టుబడులు బయటకు పోతుండటంతో భారత్‌ కూడా నాలుగేండ్లలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. క్రమంగా పెరుగుతున్న వేతనాలు ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసాన్ని కలిగిస్తూ చైనా ఆర్ధిక పురోగతిని కొనసాగిస్తున్నాయి, అది బ్యాంకింగ్‌ వ్యవస్ధలో డబ్బును మదుపు చేయటానికి జనాన్ని ప్రోత్సహిస్తున్నది, ఆ సొమ్మును కంపెనీలకు రుణాలుగా ఇస్తున్నారని, ఈ వలయం తిరుగుతున్నంత వరకు బయటకు పోయే అవకాశం లేదు, తరువాత ఆ విధానం కొనసాగుతుంది, ఒక వేళ విశ్వాసం కోల్పోయినట్లయితే కరెన్సీ మారకపు విలువమీద, విదేశీమారపు నిల్వల మీద వత్తిడి పెరుగుతుందని గ్రుయెన్‌వాల్‌ పేర్కొన్నాడు.

వాణిజ్య యుద్ధం ప్రారంభమై ఇంకా వారం కూడా గడవ లేదు. దాని ప్రభావం గురించి ప్రారంభానికి ముందూ వెనుకూ ఎలా వున్నాయో చూశాము. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు, ప్రభావాలు వెల్లడవుతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా

20 Wednesday Jul 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

1965 anti-communist purge, Australia, civil tribunal, Indonesia, Indonesian Communist Party (PKI)., PKI, UK, US

A Chinese student (centre) is pummelled by Indonesian youths who stormed the dormitory of a communist Chinese University ...

ఎంకెఆర్‌

     ఇండోనేషియాలో 1965-66 సంవత్సరాలలో ఐదు లక్షల మంది కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికాతో పాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా హస్తం కూడా వున్నట్లు నాటి ఘటనలపై విచారణ జరిపిన ప్రజాకోర్టు బుధవారం నాడు (జూలై 20న) విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొన్నది.ఇరవయ్యవ శతాబ్దిలో పేరు మోసిన నియంతగా చరిత్ర కెక్కినఇందోనేషియా సుహార్తో 2008 మరణించిన తరువాత నాటి మారణ కాండ నుంచి తప్పించుకొని సజీవులుగా వున్నవారు, మానవహక్కుల కార్యకర్తలు, కవులు, కళాకారులు తమ గళం ఎత్తి నాటి వుదంతాలపై వాస్తవాలను వెల్లడించాలని, మారణకాండకు పాల్పడిన వారిని శిక్షించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చిన విఫయం తెలిసిందే.నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో 2015 నవంబరులో ప్రజాకోర్టు విచారణ జరిగింది. దాని ముందు హాజరైన వారు, వుదంతానికి సంబంధించి 40 మందికిపైగా పరిశోధకులు అందించిన సమాచారాన్ని విశ్లేషించి అంతిమ నివేదికను విడుదల చేశారు. దీనిలో ఆస్ట్రేలియ, బ్రిటన్‌, అమెరికాకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

    ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ నేతలు, సభ్యుల జాబితాలను అమెరికా అందించినట్లు, వాటి ఆధారంగా హత్య, జైళ్లపాలు చేసినట్లు ప్రజాకోర్టు ముందుకు వచ్చిన సమాచారం వెల్లడించింది.అమెరికా, ఇండోనేషియా మిలిటరీ సృష్టించిన కట్టుకధలను బ్రిటన్‌,ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరంతరం ప్రచారంలో పెట్టాయి. విచక్షణారహితంగా మారణకాండ జరిగినట్లు స్పష్టంగా తెలిసిన తరువాత కూడా ఈ ప్రచారాన్ని కొనసాగించినట్లు తేలింది.తమ విచారణకు హాజరై వాదనలను వినిపించాలని చేసిన విజ్ఞప్తిని ఇండోనేషియా, అస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం విచారకరమని ప్రజాకోర్టు వ్యాఖ్యానించింది. జనరల్‌ సుహార్తో కమ్యూనిస్టుల వూచకోతలో నాయకత్వ పాత్ర వహించినట్లు తెలుపుతూ మరణించినవారు, బతికి బయట పడ్డవారికి, వారి కుటుంబాలకు ఇండోనేషియా సర్కార్‌ క్షమాపణ చెప్పాలని, మానవత్వంపైనే జరిపిన నేరాలకు పాల్పడిన వారిపై విచారణ జరపాలని కోర్టు పేర్కొన్నది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన అత్యంత దుర్మార్గ వూచకోతలలో ఒకదానిగా దీనిని పరిగణించాలని చెప్పింది.

    న్యాయమూర్తులలో ఒకరైన ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ హెలెన్‌ జార్విస్‌ మాట్లాడుతూ తమ నివేదిక ఇప్పటికే ఇండోనేషియాలో న్యాయం చేయాలని నినదిస్తున్నవారికి అదనపు గళం అవుతుందని, ఇప్పటికే తమ స్వంత మానవహక్కుల సంస్ధలు చేసిన సిఫార్సులు కూడా వున్నందున ఇండోనేషియా ప్రభుత్వం వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని బతికి వున్న బాధితులకు పునరావాసం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు.ఈ నివేదిక గురించి ఇండోనేసియా న్యాయ, రాజకీయ, భద్రతా వ్యవహారాల సమస్వయ శాఖ మంత్రి లుహుత్‌ పాంజైటన్‌ మాట్లాడుతూ ఇండోనేసియాకు ఒక న్యాయ వ్యవస్ధ వుంది, ఏం చేయాలో ఈ దేశానికి మరొకరు నిర్దేశించాల్సిన అవసరం లేదు, విశ్వవ్యాప్త విలువలతో ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం, దీని గురించి మేము చాలా ధృఢంగా వున్నాం’ అని వ్యాఖ్యానించారు.అయితే నివేదిక తయారీలో ప్రముఖ పాత్ర వహించిన మానవహక్కుల న్యాయవాది టోడంగ్‌ మౌల్య లుబిస్‌ మాట్లాడుతూ తమ అంతిమ నివేదిక క్షమాపణలు, పునరావాసం, నష్టపూర్తి చర్యలకు తలుపులను తెరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది ప్రముఖులు ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ‘ కమ్యూనిస్టుల నుంచి ముప్పు వచ్చిందని, వారిని చంపటం లేదా వారి చేతిలో చావటమో తేల్చుకోవాలని చెప్పారని’ ముస్లిం సంస్ధ నహదల్‌తుల్‌ వులమా చరిత్రకారుడు ఇమాన్‌ అజీజ్‌ ఇటీవల అన్నారు.అయితే అణచివేయాల్సినంత భయానక పరిస్ధితులు లేవని ప్రజాకోర్టు నివేదిక వెల్లడించిందని మోనాష్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ పుర్దే చెప్పారు. ఇది పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఆధారంగా జరిగిందని స్పష్టమైందని ఆమె అన్నారు. కౌసెన్‌దార్‌ అనే 83 ఏండ్ల వృద్ధుడు మాట్లాడుతూ ఎలాంటి విచారణ లేకుండా తనను 14 సంవత్సరాల పాటు బారు దీవిలోని జైలులో పెట్టారు. ఆయన నేరమల్లా ఒక కార్మిక సంఘంలో వున్న స్నేహితులను కలిగి వుండటమే.తన వంటి వారికి జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలా లేదా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న మా ఆస్ధులు తిరిగి ఇవ్వాలి, రద్దు చేసిన మా పెన్షన్‌ హక్కులను పునరుద్దరించాలి, దేశం విడిచి పోయేట్లు చేసిన వారిని తిరిగి రప్పించాలి, మా డిమాండ్లేమే సంక్లిష్టమైనవి కాదు’ అన్నారు.

    ప్రజాకోర్టు నేపధ్యం విషయానికి వస్తే నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో నవంబరు 10-13 తేదీల మధ్య విచారణ జరిపింది. పలు వివరాలతో కూడిన ఆరువందల పేజీల నివేదికను తయారు చేసింది. బాధితులుగా వున్నవారు 20 మంది సాక్ష్యాలు చెప్పారు. హత్యలు,జైలు పాలు చేయటం, బానిసలుగా మార్చివేయటం, చిత్ర హింసలు, అత్యా చారాలు, మాయం చేయటం, విద్వేష ప్రచారం, ఇతర దేశాల జోక్యం వంటి అంశాలపై ఈ కోర్టు విచారించింది. నియంత సుహార్తో చచ్చేంత వరకు ఇండోనేషియాలో జరిగిన ఈ దురాగతం గురించి ప్రపంచానికి మిలిటరీ, దానికి మద్దతుగా వున్న అమెరికా తదితర దేశాలు ప్రచారంలో పెట్టిన కమ్యూనిస్టు వ్యతిరేక, ఏకపక్ష కధనాలు తప్ప వాస్తవాలను బయటకు రాకుండా తొక్కి పెట్టారు. ఎవరినీ నోరెత్తనివ్వలేదు, అయితే సుహార్తో చచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత ‘హత్యాకాండ’ పేరుతో 2012లో జాషువా ఓపెన్‌హెయిమర్‌ తీసిన డాక్యుమెంటరీ చిత్రం ఆ నిశ్శబ్దాన్ని తొలుత భగ్నం చేసింది. 2013లో హేగ్‌లో దానిని ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చలో 35 మంది ప్రవాస ఇండోనేషియన్లు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు, కొంత మంది సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు కూడా హాజరయ్యారు.2012లోనే ఇండోనేషియా మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదికను కూడా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.దీంతో ఒక అంతర్జాతీయ ప్రజాకోర్టును ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికి తీయాలని, వాటిపై ఒక నివేదికను రూపొందించాలన్న సూచన కార్యరూపం దాల్చింది. నూర్సియా బానీ కాట్‌జసంగ్‌కానా కన్వీనర్‌గా 2013 మార్చినెలలో తొలుత కొద్ది మందితో సమావేశం జరిపి విచారణ తీరుతెన్నులను చర్చించారు. జకర్తా, నెదర్లాండ్స్‌ (ఇండోనేషియా నెదర్లాండ్స్‌ వలస రాజ్యం అన్న విషయం తెలిసిందే) అంతర్జాతీయ ప్రజాకోర్టు( ఐపిటి) 1965 పేరుతో 2014 మార్చి 18న ఒక న్యాయ సంస్ధను రిజిస్టర్‌ చేసి 2015లో విచారణ జరిపేందుకు ముందుకు వచ్చే న్యాయమూర్తులను సంప్రదించారు.ఈ ప్రక్రియకు వందమందికి పైగా సహకరించారు. అనేక మంది ప్రవాస ఇండోనేషియా విద్యార్ధులు ముందుకు వచ్చారు. వారిని బెదిరింపులకు గురిచేసినప్పటికీ లొంగలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మేం మీతో వున్నాం ! ఫెబ్రియానా ఫిర్దౌస్‌ ముందుకు సాగిపో !!

15 Wednesday Jun 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 Symposium, Anti communist, Febriana Firdaus, Indonesia, Indonesian Communist Party (PKI)., victims of 1965

కమ్యూనిస్టు వ్యతిరేకుల వత్తిళ్లకు లొంగవద్దు,

ఎం కోటేశ్వరరావు

స్థలం ఇండోనేషియా రాజధాని జకర్తా నగరం !

సమయం 2016 జూన్‌ రెండవ తేదీ !!

      సందర్భం కమ్యూనిజం నుంచి దేశాన్ని కాపాడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేకుల సభ రెండవ రోజు కొనసాగింపు !!!

    ఆ సభ ప్రాంగణం దగ్గరకు వచ్చారు కొందరు క్రైస్తవ విద్యార్ధులు. కుక్క మనిషిని కరవటం సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే వార్త. ప్రపంచంలో కమ్యూనిస్టుల కార్యకలాపాలు, అందులో భాగంగా సభలు సమావేశాలు సాధారణం. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడండని సభ పెట్టటమే వార్త. ఆ సభకు వచ్చిన క్రైస్తవ యువకులు సభ వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌లో శిలువ గుర్తు కూడా వుంది. ఆ చిహ్నాన్ని వుపయోగించుకోవటం పట్ల తమకు అభ్యంతరం వుందంటూ తమ నిరసనను వారు నిర్వాహకుల ముందు వెల్లడించారు.

     ఇంకేముంది జర్నలిస్టులకు అదొక మిర్చి మసాలా ! మిరప చిన్నదా పెద్దదా అని కాదు అన్నయా అది కారంగా వుందా లేదా అన్నదే పాయింటు అన్నట్లుగా అది చాలా హాట్‌గా వుంటుంది కదా !! మూడుపదులు దాటిన ఒక మహిళా జర్నలిస్టు ఆ విద్యార్ధులను పక్కకు పిలిచి మీ అభ్యంతరం ఏమిటని వారితో మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు. మధ్యలో తెల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు. దుర్వాసుడికి దూరపు బంధువులా వుంది ముఖం. వస్తూనే ఈమె ఫెబ్రియానా ఫిర్దౌస్‌ , తప్పుడు వార్తలు రాస్తుంటుంది.ఆమెతో మాట్లాడకండి అంటూ వాదులాటకు దిగాడు.ఇంతలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా వున్న మరో తలపాగా వాలా వస్తూనే ఈ వార్త కనుక అచ్చయిందో, నీ ఫొటో, వివరాలన్నీ మా దగ్గర వున్నాయి, జైల్లో తోయిస్తాం జాగ్రత్త అంటూ బెదిరింపులకు దిగాడు. ఇస్లాం రక్షణ సంఘటన, దేశ రక్షణ వుద్యమం పేరుతో వున్న సంస్ధలకు చెందిన వారు ఈ వ్యక్తులు.

    అసలే కోతి, ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా రెండు తలపాగాలూ పెద్దగా రంకెలు వేస్తూ వుండటంతో అసలే ఎరుపు భయంతో వున్న సభికులు తాము మట్టుబెట్టిన లక్షలాది మంది కమ్యూనిస్టులలో ఎవరైనా భూతంగా ఆ సభకు వచ్చిందేమో అని భయపడ్డారో లేక భ్రమపడ్డారో గాని అనేక మంది అక్కడకు చేరుకున్నారు. ఇంకే ముంది . ఆ రెండు పత్రికల వార్తలను పట్టించుకోకూడదని వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆ పత్రిక, ఛానల్‌ వారు తమ వార్తలను కవర్‌ చేయవద్దని చంద్రబాబు నాయుడు ఆగ్రహించినట్లుగా ఫెబ్రియానా రాసే వార్తలు మాకు అవసరం లేదు, అసలు ఆమెను మేం పిలవలేదు, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కొందరు ఆమె మీదకు వెళ్లారు.జాగ్రత్త మన మహిళల్లో కొందరు నకిలీ ముస్లింలు బురఖాలు వేసుకొని వస్తారు, నిజానికి వారు కమ్యూనిస్టు తొత్తులు, బురఖాలతో మోసం చేయవద్దు అంటూ వీరంగం వేశారు. వున్మాదంతో వున్న జనం, విచక్షణ జ్ఞానం వుండదు వారికి వివరించినా ప్రయోజనం శూన్యం అని గ్రహించి ఆ ప్రాంగణం నుంచి ఆమె నిష్క్రమించారు. ఆ తరువాత ఆమె అంతం చూస్తామంటూ సామాజిక మీడియాలో మతశక్తులు బెదిరింపులు ప్రారంభించాయి.

AJI Condemns Intimidation against Journalist

     ఫెబ్రియానా ఫిర్దౌస్‌ గురించి ఇంక పరిచయం అవసరం లేదేమో ! ఇండోనేషియాలో వున్న తాజా పరిస్థితికి ఆ వుదంతం అద్దం పట్టింది. ఇంతకూ ఆమె చేసిన అపరాధం ఏమిటి ? నియంత సుహార్తో నాయకత్వంలో అమెరికా కుట్ర ప్రకారం మిలిటరీ, పారా మిలిటరీ, రజాకార్ల వంటి మతోన్మాద గూండాలను తయారు చేసి దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను హతమార్చిన దారుణ మారణం కాండ గురించి ఆ నియంత మరణించిన వచ్చిన కొద్దిపాటి వెసులు బాటును వుపయోగించుకొని బుద్ధి జీవులు ఆ దారుణాల గురించి మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు. అది క్రమంగా వూపందుకొని ఆ దారుణాలపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని, ప్రభుత్వం హత్యాకాండపట్ల క్షమాపణ చెప్పాలని తదితర డిమాండ్లు ముందుకు వచ్చాయి. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు తాము ప్రజాస్వామ్యయుతంగా వున్నామని జనం ముందు ప్రదర్శించుకోవాలి కదా ? కొంత మంది అభిప్రాయం ప్రకారం పాలకులకు ఇష్టం లేకపోయినా పెరుగుతున్న వత్తిడిని తట్టుకోలేక, ఏదో ఒక పేరుతో ఆ చర్చకు తెరదించాలనే లక్ష్యంతో కొద్ది వారాల క్రితం ఇండోనేషియా ప్రభుత్వం 1965నాటి వూచకోతపై ఒక సెమినార్‌ను ఏర్పాటు చేసింది. ఆచరణలో గతంలో మాదిరే ప్రస్తుత ప్రభుత్వం కూడా కమ్యూనిస్టు భావజాలం, పదజాలం వున్న కళారూపాలు, డాక్యుమెంటరీలు, పాటలను కూడా నిషేధించారు.కేసులను నమోదు చేశారు. అంతకు ముందున్న పరిస్ధితికి వర్తమానానికి తేడా లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

    అయినప్పటికీ దేశంలోని నిరంకుశ, మతశక్తులు గగ్గోలు ప్రారంభించాయి.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని తిరిగి ఇండోనేషియాలో వ్యాపింప చేయాలనే వారు ప్రభుత్వ సదస్సు వెనుక వున్నారని కొందరు, అసలు ప్రభుత్వంలోనే కమ్యూనిస్టులున్నారని మరి కొందరు, ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పునరుద్దరించబడిందని, వచ్చే ఏడాది లాంఛనంగా ప్రకటన చేయనున్నారని ఇలా రకరకాల ప్రచారాలు ప్రారంభించారు. వీటిలో వాస్తవాలు ఎంత వరకు అన్నది చెప్పలేము గాని 1965 మారణకాండ గురించి జనానికి నిజాలు చెప్పాలన్న ప్రజాతంత్ర డిమాండ్‌ మాత్రం నానాటికీ అక్కడ పెరుగుతోందన్నది స్పష్టం.

     ఈ పూర్వరంగంలోనే కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు, నాటి మారణకాండలో భాగస్వామ్యులైన మాజీ సైనికాధికారులు, వారితో చేతులు కలిపిన మతోన్మాద శక్తులు, సంస్ధలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు కలిసి ప్రభుత్వం పెట్టినదానికి పోటీ సదస్సును పెట్టి కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని, గతంలో జరిగినదానిపై ఎలాంటి క్షమాపణ చెప్పటం, విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ తీర్మానించారు. దాని గురించి విమర్శనాత్మకంగా వార్తలు,వ్యాఖ్యలు రాయటమే ఫెబ్రియానా చేసిన పని. అంతకు ముందు కూడా కమ్యూ నిస్టులు, సానుభూతిపరులు అన్న అనుమానం వున్న కళాకారులు, రచయితల సభలు,సమావేవాలపై కూడా ప్రస్తుత ప్రభుత్వ అధికార యంత్రాంగం తీసుకున్న నిషేధ చర్యలు మొదలైన వాటి గురించి కూడా ఆమె విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె పేరు ఎత్తితేనే కమ్యూ నిస్టు వ్యతిరేకులు, మతశక్తులు మండి పడుతున్నాయి. భౌతిక దాడులకు ప్రయత్నించటంతో ఆమె ప్రస్తుతం అజ్ఞాతవాసంలో వున్నట్లు వార్తలు వచ్చాయి.

     ఒక్క ఫెబ్రియానా గురించే కాదు, ఇండోనేషియాలో పత్రికా స్వాతంత్య్రం గురించి అనేక మంది తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు. ఫెబ్రియానాకు బెదిరింపుల గురించి జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.జర్నలిస్టుల విధి నిర్వహణను అడ్డుకొనే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా అక్కడి కరెన్సీలో 50 కోట్ల రుపయాల( 34,500 డాలర్లకు సమానం) జరిమానా విధించవచ్చు.తమ జర్నలిస్టును సభ నుంచి గెంటివేయటం అక్రమం అని ఫెబ్రియానా ఒక సంపాదకురాలిగా పనిచేస్తున్న రాప్లర్‌ డాట్‌ కాం యాజమాన్యం ఒక ప్రకటనలో ఖండించింది.ఆగ్నేయాసియా ప్రెస్‌ అలయన్స్‌ ఇండోనేషియా ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాసింది.ఇండోనేషియా ఇండిపెండెంట్‌ జర్నలిస్టు అలయన్స్‌ ఫెబ్రియానా రక్షణకు చర్యలు తీసుకుంది.ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టు వ్యతిరేకతను వదలని ఇండోనేషియా పోలీసు

30 Wednesday Mar 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Cold War, communism, Indonesia, Indonesian Communist Party (PKI)., PKI, Soeharto, Sukarno, Western Bloc

అదిస్టి సుకుమా సావిత్రి, జకర్తా పోస్టు కాలమిస్టు

   కమ్యూనిస్టు ఇతివృత్తం వున్న సాంస్కృతిక కార్యక్రమాలపై దేశంలో(ఇండోనేషియా) వరుసగా అనేక నిషేధాలు విధించటాన్ని చూస్తుంటే కొంత మందికి ప్రచ్చన్న యుద్ధం అంతమైనట్లుగా కనిపించటం లేదని మనకు గుర్తు చేస్తున్నవి. పశ్చిమ దేశాల కూటమికి చెందిన పాత వ్యక్తులు వుత్సాహవంతులైన తమ మద్దతుదార్లను చూస్తే ఆశ్చర్య పడవచ్చు. వారు ఇస్లాం డిఫెండర్స్‌ ఫ్రంట్‌(ఎఫ్‌పిఐ) తప్ప మరొకరు కాదు, అదే బృందం జకర్తాలోని ఇండోనేషియా హోటల్‌ ట్రాఫిక్‌ సర్కిల్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) బ్యానర్‌తో ఒకసారి ప్రదర్శన చేసింది. బహుత్వ వాదం పట్ల ఏమాత్రం గౌరవం లేకపోవటంలో పేరు మోసిన ఈ బృందపు నిరసనలను ‘కమ్యూనిజం, లెనినిజం, మరియు మార్క్సిజం’ లను నిషేధిస్తూ తమ చర్యలను సమర్ధించుకొనేందుకు ప్రజా సంప్రదింపుల కమిటీ జారీ చేసిన 1966 నాటి ఆదేశాలను ఇప్పటికీ వుపయోగిస్తున్న పోలీసులు సహించారు.

    ఒకవైపు ఐఎస్‌ ప్రపంచానికి ఒక ముప్పుగా పరిణమించటం కనిపిస్తుంటే వామపక్షంగా ఏది కనిపించినా దాని పట్ల శత్రువైఖరిని ప్రదర్శించే ప్రచ్చన్న యుద్ధ బెంగతోనే పోలీసులు వున్నట్లు కనిపిస్తోంది. 1965విషాద వుదంతం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఒకసాకుగా వుండేది. రెండవ ప్రపంచ యుద్ధానంతర యుగపు వారసత్వంగా వచ్చిన కమ్యూనిస్టు వ్యతిరేక భావనలను తొలగించుకొనేందుకు ప్రభుత్వం గతకొద్ది సంవత్సరాలుగా అనేక పురోగామి చర్యలు తీసుకున్న పూర్వరంగంలో పోలీసుల వైఖరి అసంగతంగా కనిపిస్తోంది.సుశిలో బాంబాంగ్‌ యుధ్యోనో ప్రభుత్వం కమ్యూనిజం పుస్తకాలపై నిషేధం తొలగించింది.1965నాటి మిలిటరీ కుట్ర మరియు ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీని అందుకు బాధ్యురాలని నెపం మోపేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఆధారాలను అందచేసిన జూలీ సౌత్‌ వుడ్‌ మరియు పాట్రిక్‌ ఫ్లాంగన్‌ పుస్తకాలైన ‘చట్టం,ప్రచారం, భయం ‘ వంటి వాటి ఇండోనేషియా అనువాదాలపై నిషేధం ఎత్తివేశారు. వామపక్ష భావజాల ఆలోచన మరియు దేశంలో కమ్యూనిస్టు గతం గురించి తెలియచేసే పుస్తక ప్రచురణలపై ఆసక్తి చూపే వారికి ఆన్‌లైన్‌లో (ఇంటర్నెట్‌లో) నేడు అందుబాటులో వున్నాయి. 1965లో సైనిక జనరల్స్‌ హత్యలతో నిషేధిత పార్టీ, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా తలెత్తిన భయం మరియు ఆగ్రహం, వాటిపై ప్రభుత్వం ఏమి చెబుతోందో తెలిపే ప్రచార సినిమాలైన పెంగ్‌ఖైనాతన్‌, ట్రెచరీ వంటి వాటిని సుహార్తో పతనమైన నాటి నుంచి విధిగా చూడనవసరం లేదు. కమ్యూనిజం ఓడించబడింది, మరియు దాని వునికి ఒకవైపున పెట్టుబడిదారీ చక్రాలపై ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్న చైనా రాజకీయ వ్యవస్ధకు మాత్రమే సంగతం కావచ్చు.

    సమాచార యుగానికి ప్రతి ఘటన వృధా ప్రయాస అని వేరేచెప్పనవసరం లేదు. అటువంటి కార్యకలాపాలను విఫలం చేయాల్సిన అవసరం పోలీసులకు వుందా, ఇంటర్నెట్‌ మరియు ప్రయివేటు చర్చలద్వారా జనం తమంతట తామే విద్యావంతులు కాగలరు. దేశ చరిత్రలో చీకటి మయమైన భాగాలలో ఒకటైన 1965నాటి సమస్యతో వ్యవహరించటం అంత సులభం కాకపోవచ్చు. తన రాజకీయ పలుకుబడి పడిపోతున్న సమయంలో ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీపై ఆధారపడిన జాతీయ వాది అయిన సుకర్నోను తొలగించాలని కోరుకున్న సుహార్తో ఆ సమయంలో పార్టీ నిషేధానికి ఒక సాకుకోసం సైనిక అధికారులను హత్య చేయించాడు. అధ్యక్షుడు జోకో ‘జోకోవి’ యంత్రాంగం నాటి సామూహిక హత్యాకాండ గురించి సరిదిద్దుకొనే చర్యలు తీసుకుంది, కానీ ఇంతవరకు క్షమాపణకు ముందుకు రాలేదు. జాతీయ మానవ హక్కుల సంస్ధకు ప్రభుత్వం అధికారిక పత్రాలను అందచేసినప్పటికీ సరిగా నమోదు చేయని కారణంగా 1965లో, ఆ తరువాత ఏం జరిగిందనేది సంక్లిష్టమైందని అధికారులు చెప్పారు.ఆ సమయంలో తరుణ ప్రాయంలో వున్న దేశానికి రాజధానిలో తలెత్తిన అల్లకల్లోలం భరింపరానిదిగా వుంది, విబేధాలు దిగువకు విస్తరించిన సమయంలో కమ్యూనిస్టులు అనుకున్నవారిని అంతం చేయటానికి సుహార్తో నాయకత్వంలోని మిలిటరీ మాత్రమే కాదు, పౌర బృందాలు కూడా భాగస్వాములయ్యాయి.

   ప్రముఖ మత పెద్ద, దేశంలో అతి పెద్ద ఇస్లామిక్‌ సంస్ధ అయిన నహదల్‌తుల్‌ వుల్మా సంస్ధ(ఎన్‌యు) మాజీ అధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడైన అబ్దుర్‌ రహమాన్‌ ‘గుస్‌ దుర్‌’ వాహెద్‌ కమ్యూనిస్టుల వూచకోతలో తమ సంస్ధ యువకులు పాల్గొన్నందుకు క్షమాపణలు చెప్పాడు. ఆ సమయంలో కొత్తగా వుద్బవించిన పాలకులైన న్యూ ఆర్డర్‌కు చెందిన ప్రభుత్వం ఐరోపాలో నాజీ జర్మనీ మాదిరి మారణకాండ జరిపేంత సామర్ధ్యం వున్న బలమైనది కాదు.లేదా రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలపై పూర్తి అదుపు కలిగి రెండవ ప్రపంచ యుద్ధ ఛాంపియన్ల వంటి అగ్రగామిశక్తీ కాదు. ప్రపంచ రాజకీయ పరిణామాల ప్రవాహంతో పాటు ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఒక చిన్న పడవ కెప్టెన్‌ వంటిది.

    అయినప్పటికీ అటు పశ్చిమ మరియు తూర్పు దేశాలకు ఒక ప్రధాన వర్ధమాన ఆర్ధిక వ్యవస్థ కేంద్రంగా వున్నందున పూర్తిగా అలసిపోయిన ఒక భావజాలానికి భయపడి లొంగిపోయే విధంగా చేయటం గాక తమ పరిజ్ఞానాన్ని పెంచుకొనేందుకు మరియు వివిధ సంస్కృతులను ఆకళింపు చేసుకొనేందుకు జనాన్ని ప్రోత్సహించటం ప్రభుత్వానికి మంచిది. 1965 నాటి పరిణామాలపై జనంలో వున్న కుతూహలాన్ని అడ్డుకోకుండా గత న్యూ ఆర్డర్‌ ప్రభుత్వ ఏకపక్ష వైఖరితో సమంగా వూచకోతకు సంబంధించి సమగ్రమైన చారిత్రక పరిశోధనకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దేశ గతం గురించి యువతరం తెలుసుకొనే అవకాశం కలిగించేందుకు యుక్తా యుక్త విచక్షణతో కూడిన చరిత్ర తోడ్పడుతుంది. నేరం చేసిన వారిపై తీసుకొనే చట్టబద్దమైన చర్య కంటే ఇది తక్కువ హాని కలిగిస్తుంది. చర్య వివాదాలను దీర్ఘకాలం కొనసాగించటమే గాక జాతి గాయపడటానికి, చిందరవందర కావటానికి కూడా దారితీయ వచ్చు. కమ్యూనిజంతో సహా ఏ భావజాలాన్ని అధ్యయన కేంద్రాలలో నిషేధించకూడదు, ఎందుకంటే నిషేధించటం ద్వారా భయ వారసత్వాన్ని కొనసాగించటమే గాక ప్రభుత్వం సమాజం ప్రగతిని, నిష్కాపట్యాన్ని అడ్డుకుంటున్నది అవుతుంది.పూర్తి గ్రహణశక్తి లేనట్లయితే ఏం జరుగుతుందో తెలియని సమాజం అంతగా తెలియని దానికి కూడా వూరికే భయపడుతుంది, నవప్రవర్తక ఆలోచనలతో ముందుకు పోకుండా ఎల్లవేళలా అనుచరిగా వుండిపోతుంది. అటువంటి సమాజం అది పశ్చిమ దేశాల లేదా అరబ్బుల లేదా చివరికి ఐఎస్‌ పాటలకు సైతం దేనికైనా నాట్యం చేస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

As long as communism is ‘threat’, democracy is flawed – Ririn Sefsani and Timo Duil

13 Sunday Dec 2015

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, communism, democracy, Human Rights, Indonesia, PKI, victims of 1965

13 December 2015

A spectre is haunting Indonesia, the spectre of communism. All the powers of the political establishment have entered into a holy alliance to exorcise this spectre: Muslim and Christian clerics, politicians and bureaucrats, the military and vigilante rackets.

Karl Marxs famous first sentences of the manifesto of the Communist Party, written in 1848, precisely depict Indonesia’s current situation. But, in sharp contrast to Europe in the mid-19th century, there is no leftist party worthy of mention in Indonesia. Communism in Indonesia is a mere spectre indeed.

Fifty years after the bloody extermination of the Communist Party, the very term of communism is still an effective tool to exclude from public debates those that are perceived as a threat by the ruling elite. This tool can be applied to virtually all leftist movements opposing the established political and economic order.

The political elite can count on various groups whom, despite not knowing what communism actually is, remain willing to oppose this ideology as it has been depicted as a threat not solely to the elite, but to the nation in general.
It is doubtful whether members of the Islam Defenders Front (FPI) or the Anticommunist Front are able to explain how Marxist economic thought explains economic exploitation, what surplus value is, what the concept of the working class is about.

Communism, to those people, is without any precise content and is merely something that should be feared. It is exactly this perception of communism which makes large parts of society mentally captivated by Cold War doctrines.

Approximately 32 years of indoctrination by an anticommunist regime continues to show its effect and it could be that this consciousness is one of the biggest obstacles for both reconciliation and democratization.

Before the International People’s Tribunal was held in The Hague recently, the School of Southeast Asian Studies at Bonn University, Germany, conducted a workshop on the 1965 incidents and on the question of how to deal with that bloody past. The event was attended a crowd of Indonesian citizens, by lawyers, journalists and survivors.

Participants were able to discuss sensitive topics with the Indonesian deputy ambassador in Germany. The deputy ambassador listened to what the victims had to say.

In contrast, the reactions coming from the administration of President Joko “Jokowi” Widodo and Vice President Jusuf Kalla leave much to be desired since they are not willing to pay any attention to those victims proving testimony to the cruelty they experienced.

The decision of Balinese authorities at the Ubud Writer’s Festival and even by universities to ban the screening of Joshua Oppenheimer’s films on the 1965-issue is also a clear sign that the fostered fear of communism is still a reason to restrict the freedom of expression.

It is this mixture of ignoring those stigmatised people who suffered painful experiences on behalf of a harmonious, conflict-free society and the ignorance of what communism actually is that makes it so hard for Indonesia to deal adequately with its past.

However, while these attitudes linger on, Indonesia will not succeed its transition towards democracy because of two reasons; firstly, because this attitude clearly highlights a gesture of suppressing points of view considered cumbersome for the elite and for those many citizens with minds still rooted in New Order ideology.

Furthermore, the attitude of fear toward the confused thread named communism prevents Indonesia’s political culture from becoming democratic as it hampers socialist or labor parties from the political stage.

As long as that is the case, voters in Indonesia will not have real alternatives in elections because the established parties do not differ fundamentally in their ideologies.

All parties are more or less bound to fuzzy nationalist and Islamic notions and are pragmatic and usually pro-capital in their political operations.

The fostered fear of communism is still a reason to restrict the freedom of expression.

However, democracy needs alternatives and the most urgently needed one continues to remain as a spectre of fear in Indonesia; a leftist alternative to pro-capitalist realpolitik with blurry nationalist notion.

For as long as Indonesia is unready to face the truth about the actual idea of communism, violation of human rights such as freedom of speech and the stigmatisation of the victims of 1965 will persist. In contrast to his opponent Prabowo Subianto, Jokowi highlighted his commitment to implement human rights during his campaign.

In alliance with parties supporting him, he also stressed in his Nawacita program that he would “create space for dialogue between citizens”. It is obvious that he will fail to do so if the government keeps on demonising communism and those victims of the anti-communist massacres.

The International People’s Tribunal was an excellent opportunity for the President to provide proof of the promises made during the election campaign.

But instead of “creating space for dialogue between citizens”, Kalla reduced the incidents of 1965 to the issue of the six murdered generals and did not even mention the hundreds of thousands of victims.

Also, Attorney General Muhammad Prasetyo called the tribunal “irrelevant” and said Indonesia doesn’t need intervention from other countries, indirectly blaming the Dutch government which had nothing to do with the tribunal.

The organisers, in contrast, stressed that they would have conducted the tribunal in Jakarta, but as many victims did not felt safe in Indonesia, they decided to perform it at The Hague, the city of international law.

Given that facts, the government effectively limited the space for dialogue between citizens because they are still not able to leave New Order narratives behind.

Until today, Marxist works are officially banned in Indonesia – works that represent the foundations of major political parties in many well-established democracies all over the world. Social democracy, socialism, labor parties and left-wing green parties are all based on Marxist political thoughts.

Through leftist parties, Marxist thoughts enrich democratic pluralism and provide political identities that are not solely based on religion and nationalism. Indonesia, with its immense workforce of labourers, peasants and urban poor, needs a political ideology that can represent and articulate these people’s economic demands.

Institutional reforms alone do not make a democracy work; for as long as conflicting ideological alternatives have yet to be established and socialism is excluded from Indonesian politics, Indonesia’s democracy is flawed. – December 13, 2015.

Courtesy: themalaysianinsider.com

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియా వుక్కుపాదాలను భయపెడుతున్న ‘నిశబ్ద వీక్షణం’

12 Saturday Dec 2015

Posted by raomk in Filims, History, INTERNATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

communist, Indonesia, PKI, Senyap, The Look of Silence

సత్య

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? తమకా శక్తి వుందనే అనుకుంటున్నాయి ఇండోనేషియా వుక్కుపాదాలు. యాభై సంవత్సరాల క్రితం అమెరికన్‌ సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రలో భాగంగా ఇండోనేషియాలో దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను అక్కడి సైనిక నియంతలు వూచకోత కోశారు. ఇన్నేళ్లుగా ఆ దారుణానికి సంబంధించిన వివరాలు బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికీ ఆ మారణకాండపై విచారణ జరిపేందుకు అక్కడి పాలకవర్గం మొరాయిస్తున్నది.

ఎంతగా అణచివేత వుంటే అంతగా ప్రతిఘటన పెరుగుతుందన్నట్లుగా ఇన్నేళ్ల తరువాత కూడా అది అక్కడి పాలకులను, నేరగాళ్లను భయపెడుతూనే వుంది. కమ్యూనిస్టుల వూచకోత ఇతివృత్తంగా జాషువా ఓప్పెన్‌హెయిర్‌ అనే అమెరికా చిత్ర దర్శకుడు ఒక డాక్యుమెంటరీని నిర్మించాడు. దానిని ఇండోనేషియా ప్రేక్షకులకు ప్రదర్శి ంచకుండా అడ్డుకుంటున్నారు. ఇండోనేషియా భాషలో ‘సెన్‌యాప్‌ ‘ ఆంగ్లంలో ‘ది లుక్‌ ఆఫ్‌ సైలెన్స్‌’ గా (తెలుగులో నిశబ్ద వీక్షణం )అనువదించిన ఆ చిత్రాన్ని ఇప్పుడు ఇంటరనెట్‌ ద్వారా చూసేందుకు దర్శకుడు, నిర్మాతలు ఏర్పాటు చేసి ఇప్పుడెలా అడ్డుకుంటారో చూడండని పాలకులకు ఒక సవాల్‌ విసిరారు. దీన్ని యూట్యూబ్‌లో వీక్షించవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ప్రస్తుతం ఇండోనేషియా ప్రేక్షకులకు వుచితంగా అందుబాటులో వుంచినట్లు నిర్మాత ఒక ప్రకటన ద్వారా తెలిపినట్లు జకర్తా పోస్టు పత్రిక వెల్లడించింది.అయితే ప్రస్తుతం యూ ట్యూబ్‌ దానిని తొలగించింది. ఇదే దర్శకుడు 2012లో ‘జగల్‌ ‘ పేరుతో (వూచకోత) ఇదే ఇతి వృత్తంతో ఒక డాక్యుమెంటరీని నిర్మించాడు.

ఇండోనేషియా సైనిక నియంతల మారణకాండకు బలైన కమ్యూనిస్టు యోధుడు రామిల్‌ సోదరుడైన ఆది రుకున్‌ నాటి హంతకులు, వారి కుటుంబాలతో ఘర్షణ పడిన దృశ్యంతో ప్రారంభమౌతుంది.ఈ చిత్రాన్ని 2014లో నిర్మించారు, 2016 ఆస్కార్‌ అవార్డుకు డాక్యుమెంటరీల విభాగంలో 124 పోటీకి రాగా ఎంపికైన 15 చిత్రాలలో ఇదొకటి. గతేడాది నవంబరులో ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో విడుదల చేసినపుడు తీవ్ర వివాదాన్ని సృష్టించారు. దాంతో డిసెంబరు నెలలో అక్కడి సెన్సార్‌ బోర్డు ఆ చిత్రాన్ని బహిరంగ ప్రదర్శనలను నిషేధించింది. జనం దాన్ని చూస్తే కమ్యూనిజం, ఇండోనేషియ కమ్యూనిస్టుపార్టీ పట్ల సానుభూతి పెరగటానికి దారితీస్తుందని నిషేధానికి కారణంగా చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియా మానవ హక్కుల సంఘం ఆ చిత్రానికి మద్దతుగా ఒక లేఖను జారీ చేసింది. బాధితుల దృక్పధంలో మానవ హక్కుల దుర్వినియోగాన్ని వెల్లడించిన అనేక చిత్రాలలో ఇదొకటని పేర్కొన్నది. గతేడాది డిసెంబరులో యోగ్యకర్తా పట్టణంలోని గజా మాడ విశ్వవిద్యాలయంలో ఆ చిత్రాన్ని ప్రదర్శించినపుడు అక్కడి మితవాదులు ఆ ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ ఏడాది ఇతర విశ్వవిద్యాలయాలు, బాలీలో రచయితలు, చదువరుల వుత్సవంలో ప్రదర్శించకుండా అధికారులు అడ్డుకున్నారు.

అయినప్పటికీ విద్యార్ధి సంఘాలు, పౌర సంఘాలు ఆ చిత్రాన్ని జనం ముందుకు తీసుకుపోయేందుకు పూనుకున్నాయి. అధికార యంత్రాంగ వత్తిళ్లను వమ్ము చేశాయి. ‘సెనయాప్‌ను ఇండోనేషియా వీక్షిస్తోంది’ అనే పేరుతో దేశమంతటా 118 నగరాలు, ప్రాంతాలలో ప్రదర్శించేందుకు 1,700 డివిడీ కాపీలను పంపిణీ చేశారు. కనీసం 70వేల మందికి చేరుతుందని అంచనా. గతంలో తాను తీసిన ‘జగల్‌ ‘ చిత్రం కంటే సెనయాప్‌ ను ఎక్కువగా జనం చూస్తారని దర్శ, నిర్మాత ఒప్పెన్‌హెయిమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడా సెప్టెంబరు నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో వుంచిన జగల్‌ చిత్రాన్ని పదిలక్షల సార్లు డౌన్‌లోడు చేసుకొన్నట్లు ఆయన తెలిపారు. సెనయప్‌ చిత్రంపై ఇండోనేషియాలో బహిరంగ చర్చ జరుగుతుందని, మారణకాండపై విచారణకు డిమాండ్‌ చేస్తారని పేర్కొన్నారు.

మానవ హక్కుల కమిషనర్‌ మహమ్మద్‌ నౌర్‌ఖోయిరాన్‌ ఈ చిత్రంపై వ్యాఖ్యానిస్తూ ఆన్‌లైన్‌లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చిందంటే దాన్ని చూడాలన్న ప్రేక్షకుల వాంఛను అధికారులు అడ్డుకోలేరని రుజువైందని అన్నారు. విధాన నిర్ణేతలు ముఖ్యంగా ప్రభుత్వం భయాన్ని కలిగిస్తోంది. వారు ఎంత ఎక్కువగా భయాన్ని వ్యాపింప చేస్తే , నిషేధాలు విధిస్తే అంతగా యువతలో ఆసక్తి పెరుగుతుంది, నాటి విషాదం గురించి తెలుసుకొనేందుకు వారు తమ సృజనాత్మకతను వినియోగించటం పెరుగుతుంది అన్నారు.

గురువారం నాడు జకర్తాలోని ఒక సాంస్కృతిక కేంద్రంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించి వుచితంగా డీవీడీలను అందచేశారు. ఆసక్తి కలిగిన వారందరినీ చిత్ర ప్రదర్శ నకు రమ్మని కాపీ చేసుకొమ్మని ఆహ్వానించాం, ఈ చిత్ర ప్రదర్శనకు అనుమతి కోసం ఏ అధికారి అనుమతీ తీసుకోలేదు, ఎందుకు జ్ఞానాన్ని విస్తరింపచేసేందుకు అనుమతులతో అవసరం ఏమిటని ఒక నిర్వాహకుడు వ్యాఖ్యానించారు. ఈనెల పదిన అంతర్జాతీయ మానహక్కుల దినం సందర్భంగా మానవ హక్కుల కమిషన్‌, జకర్తా ఆర్ట్స్‌ కౌన్సిల్‌ చొరవతో ఈ చిత్రం, 1965 నాటి మారణకాండపై చర్చ జరిగింది. గతనెల 30న ప్రారంభమైన ఈ చర్చను నిలిపివేయవలసిందిగా జకర్తా పోలీసులు జకర్తా ఆర్ట్స్‌ కౌన్సిల్‌పై వత్తిడి తెచ్చారు. ఈ చర్చను వ్యతిరేకించే వారితో నిరసన ప్రదర్శనలు చేయించారు. వారి వత్తిడికి లొంగిన పోలీసుల చర్యను కౌన్సిల్‌ ప్రతినిధి ఖండించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎరుపే కాదు, సుత్తీ కొడవలి అన్నా భయపడుతున్న పాలకులు

07 Saturday Nov 2015

Posted by raomk in Current Affairs, Left politics

≈ Leave a comment

Tags

Indonesia, Suharto’s Purge

అమ్మా ! అమ్మా !! ఈ బొమ్మ ఎంతో బాగుంది కదూ

ఏం బాబూ పెద్ద వాడివైనా నీ కింకా బొమ్మల పిచ్చి పోలేదా పద పద !

కాదమ్మా నా చిన్నపుడు ఇలాంటి బొమ్మలు రాలేదు , దీనిపై సుత్తీ కొడవలి బొమ్మలున్నాయి, ఎందుకలా వేశారు.
అవి చైనా మేడ్‌, అవి కమ్యూనిస్టు చిహ్నాలు అని చెబుతుండగానే తీసుకోండి సార్‌ పెద్ద ఖరీదేం కాదు అని షాపతను అంటూ వుండగానే బిలబిల మంటూ మిలిటరీ వచ్చి అక్కడున్న బొమ్మలను స్వాధీనం చేసుకొని షాపువాడిని బలవంతంగా జీవులో ఎక్కించుకు చక్కా పోయారు. వారికి ఏం జరిగిందో అర్ధం కాలేదు, ఆ బొమ్మలను ఎందుకు తీసుకుపోయారో, వాటిలో ఏమైనా వజ్రాలు, గట్రా పెట్టి స్మగ్లింగ్‌ చేస్తున్నారా అని పరిపరి విధాలా అనుకుంటుండగానే పోలీసులు మైకులో హెచ్చరికలు ప్రారంభించారు. సుత్తీ కొడవలి చిహ్నం వున్న బొమ్మలను అమ్మినా, వాటిని ఎవరైనా కొన్నా వారిని అరెస్టు చేస్తామన్నది వాటి సారాంశం.

ఇదేదో కథలా అనిపిస్తున్నా నిజం. ఇండోనేషియాలోని యోగ్యకర్తా అనే పట్టణంలో మిలిటరీ సుత్తీ, కొడవలి చిహ్నాలు వున్న చైనా తయారీ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు జకర్తా గ్లోబ్‌ అనే పత్రిక శుక్రవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. ఆ చిహ్నాలు చూసిన పిల్లలు కమ్యూనిస్టు ఆశయాల గురించి తెలుసుకుంటారని, వాటిని అమ్మటం, కొనటం ద్వారా పిల్లల్లో కమ్యూనిస్టు బీజాలు వేసినట్లు అవుతుందని అధికారులు భావించి అలాంటి బొమ్మలను నిషేధించినట్లు తెలిపింది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ కవలెరీ తుమాది దీని గురించి చెబుతూ ఈ బొమ్మలను అమ్ముతున్నవారిలో ఎక్కువ మందికి ఆ బొమ్మల వెనుక వున్న అర్ధం తెలియదని, అయితే కొంత కాలానికి మన పిల్లలు ఆ చిహ్నాలకు ఆకర్షితులు అవుతారని అదే జరిగితే తరువాత వారి మెదళ్లలో ఆ భావాలు కూడా ప్రవేశిస్తాయని ఆ మిలిటరీ అధికారి వ్యాఖ్యానించాడు. బొమ్మలకు ఆర్డర్లు ఇచ్చే వ్యాపారులు దీని గురించి ఎరిగి వుండాలని చెప్పాడు.

1965-66 సంవత్సరాలలో ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులు, అభిమానులను జనరల్‌ సుహార్తో నాయకత్వంలోని మిలిటరీ తిరుగుబాటుదారులు నిర్ధాక్షిణ్యంగా హత్యచేసిన విషయం తెలిసినదే. ఆ వుదంతం జరిగి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా దానిపై చర్చ, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిన పూర్వరంగంలో ఇండోనేషియా మిలిటరీ ఈ చర్య తీసుకోవటం ద్వారా అది ఎంత భయపడుతున్నదో అర్ధం అవుతోంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వుబుద్‌ రైటర్స్‌ మరియు రీడర్స్‌ ఫెస్టివల్‌(పుస్తక ప్రదర్శన) సందర్భంగా గతనెలలో 15 కార్యక్రమాలను జరగకుండా అధికారులు అడ్డుకున్నారు. నిఘా సిబ్బందిని దింపి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆరాతీశారు. కమ్యూనిస్టుల ఊచకోత గురించి సమాచారాన్ని ప్రచురించిన జావాలోని ఒక విశ్వవిద్యాలయ పత్రిక కాపీలను మొత్తం స్వాధీనం చేసుకొని వాటిని పాఠకులకు అందకుండా నాశనం చేశారు. సుహార్తో కాలం నాటి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా మిలిటరీ, పోలీసులు కమ్యూనిస్టుల ఊచకోత గురించి చర్చ జరగకుండా సమాచారాన్ని జనానికి అందకుండా అప్రకటిత నిషేధాన్ని అమలు జరుపుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: