• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Intolerance

49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు : బిజెపి, మిత్ర పక్షాల వైఖరి ఏమిటి ?

07 Monday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Intolerance, Narendra Modi, Prime Minister Narendra Modi, sedition case against 49 celebrities

Image result for sedition case against 49 celebrities

ఎం కోటేశ్వరరావు

జై శ్రీరామ్‌, గోరక్షణ తదితర నినాదాల మాటున దేశంలో జరుగుతున్న అసహన, విద్వేషపూరిత, మూక దాడులను నివారించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకిి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బీహార్‌లోని ముజఫర్‌ పూర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (సిజెఎం) కేసు నమోదుకు జారీ చేసిన ఆదేశాలు మరోసారి ఆ లేఖపై మరో రూపంలో చర్చకు దారి తీశాయి. అసలు దేశ ద్రోహం ఏమిటి అన్న ప్రశ్నను ముందుకు తెచ్చాయి. కోర్టు తీరు తెన్నులపై సామాజిక, సాంప్రదాయ మాధ్యమంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. (మేథావులూ మీరెటు వైపో తేల్చుకోండి అనే శీర్షికతో 49 మంది మేథావులు, దానికి పోటీగా 62 మంది రాసిన లేఖ గురించిన విశ్లేషణలో చర్చించినందున చర్విత చరణం కాకుండా వుండేందుకు ఆసక్తి కలిగిన వారికోసం లింక్‌ను అందచేస్తున్నాను.https://vedikaa.com/2019/07/27/intellectuals-which-side-are-you-on/)

Image result for sedition case against 49 celebrities: what is the bjp and its allies view ?

కేసును ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి , కేసును దాఖలు చేసిన లాయరు ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు కలిగివున్నారన్నది ఒక అంశం. విధులలో వున్న న్యాయమూర్తి గనుక ఆయనకు వాటిని ఆపాదించలేము. ఫిర్యాదులోని అంశాలను బట్టి న్యాయవాది సుధీర్‌ కె ఓఝా బిజెపి మద్దతుదారుగా కనిపిస్తున్నది, కాకపోవచ్చు కూడా, ఎందుకంటే సదరు పెద్దమనిషి గత చరిత్రను చూస్తే మీడియాలోనూ, న్యాయవ్యవస్ధలో పేరు కోసం, తన వృత్తి, కక్షిదారులను పెంచుకొనేందుకు వందల కేసులు దాఖలు చేసి ఒక పెద్ద లిటిగెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ పార్టీ వారిని, ఏ రంగ ప్రముఖులను వదలిపెట్టలేదు. అది ఎప్పటి నుంచో సాగుతోంది. మానసిక సమస్య కూడా కావచ్చు.

ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి, కోర్టులలో ప్రజాప్రయోజన వాజ్యాల (పిల్స్‌) దాఖలుకు సంబంధించి కొన్ని సవరణలు లేదా సంస్కరణలు తీసుకురావాల్సి వుంది. న్యాయవాది సుధీర్‌ కె ఓఝా చేసిన ప్రధాన ఆరోపణ 49 మంది ప్రముఖులు రాసిన లేఖ కారణంగా ప్రపంచ వ్యాపితంగా దేశ పరువుకు నష్టం కలిగింది, ప్రభావం కలిగించే ప్రధాని పని తీరును గుర్తించలేదు, దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా వుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా వుంది.

నలభై తొమ్మిది మంది ప్రముఖుల లేఖ అంశాలలో ఎక్కడా పై లక్షణాలు లేవు. ప్రధానికి దేశంలో తలెత్తిన పరిస్ధితి గురించి వినతి మాత్రమే వుంది. ఒక వేళ వున్నాయి అనుకుంటే దానికి పోటీగా రాసిన 62 మంది ప్రముఖుల లేఖతో ఆ నష్టం పూడినట్లే, దేశ పరువు నిలబడినట్లే, ప్రధాని పని తీరు దేశానికి తెలిసింది, దేశద్రోహ ధోరణులకు అడ్డుకట్ట వేసింది కనుక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి కొట్టివేసి వుండాల్సింది. లేదూ మరొక కోణంలో చూస్తే దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా 49 మంది లేఖ వుందనుకుంటే 62 మంది లేఖకే మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చింది. తొలి లేఖ అంశాలను చూడని వారు అనేక మంది దీన్ని చూసి తెలుసుకున్నారు. అంటే పరోక్షంగా ‘దేశద్రోహాన్ని ప్రోత్సహించే ధోరణులకు ‘ 62 మంది ప్రచారం ఇచ్చి, వ్యాప్తికి దోహదం చేసినట్లే కదా ! కేసు దాఖలు చేసిన వారికి, అంగీకరించిన న్యాయమూర్తి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారా ? అలాంటి వారి మీద చర్య వుండాలా వద్దా ?

ఈ కేసులో నిర్దిష్టమైన నేరం లేదు. ఆవు వ్యాసం వంటిది. ఆవును పెంచితే అలా జరుగుతుంది, ఇలా లబ్ది కలుగుతుంది అని చెప్పినట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. అందువలన కేసు నమోదైంది బీహార్‌లో గనుక దీని పట్ల రాష్ట్ర జెడియు-బిజెపి సంకీర్ణ సర్కార్‌ వైఖరి ఏమిటి ? రాసిన లేఖ కేంద్రానికి కనుక కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తోందన్నది స్పష్టం కావాలి. లేఖ రాసిన ప్రముఖులను, లేఖలోని అంశాలను ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పరిగణిస్తున్నాయి. దేశ ద్రోహానికి పాల్పడినట్లు అవికూడా భావిస్తే తమ వైఖరి కూడా అదే అని, లేనట్లయితే వారికి వున్న భావప్రకటనా స్వేచ్చను వుపయోగించుకున్నారు, అది దేశద్రోహం కాదని అయినా కోర్టుకు చెప్పాలి. అలాగాక మేము కేసు పెట్టలేదు, దానితో మాకు సంబంధం లేదు, చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెబితే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి మద్దతు ఇస్తున్నట్లే లెక్క !

రాజ్యాంగంలో కోర్టుల పరిధులు స్పష్టంగా వున్నాయా ? వుంటే ఈ కేసులో నిందితులుగా వున్న వారు ముజఫర్‌ నగర్‌ జిల్లా వాసులు లేదా బీహార్‌, ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక వేళ కుట్రకేసు అయితే అది ఎక్కడ జరిగిందో దాని వివరాలను పోలీసులు దాఖలు చేయాలి. లేఖ రాసిన వారిలో ఒక రైన ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తమ మీద దాఖలైన దేశద్రోహ కేసు వార్త విని ‘ ఈ దేశంలో ఏమి జరుగుతోందో నాకు అర్ధం కావటం లేదు, అలాంటి పిటీషన్‌ను ఒక కోర్టు ఎలా స్వీకరిస్తుంది ? గాడ్సేను పొగిడిన వారు దేశ వ్యతిరేకులుగా కనిపించటం లేదు. గాంధీ చిత్రాలపై కాల్పులు జరిపిన వారు ఎంపీలుగా స్వేచ్చగా తిరుగుతున్నారు. వారిని ఏ కోర్టూ ప్రశ్నించలేదు.” ఈ మాటలు ఒక్క గోపాలకృష్ణన్‌వే కాదు, కాస్త బుర్రవున్న ప్రతివారి మదిలో తలెత్తినవి. అనేక అంశాలను సూమోటోగా తీసుకొని విచారిస్తున్న కోర్టులు ఈ మాటలను పరిగణనలోకి విచారణ తీసుకోవాలని ఎవరైనా కోరుకోవటం తప్పెలా అవుతుంది?

కోర్టులు ఒక నిర్ణయం తీసుకొనే ముందు, అదీ ఇలాంటి అంశాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంది. కోర్టు ఆదేశాల ప్రకారం దాఖలైన కేసు నిందితులలో ఒకరైన ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్‌ బంగ్లాదేశ్‌తో కలసి నిర్మించబోయే ఒక చిత్ర పధకానికి మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి తన మీద దేశద్రోహం కేసులా, ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు అని శ్యాం బెనెగల్‌ ఆశ్చర్యపోయారు. దేశద్రోహం నేరారోపణ ఎందుకు చేశారో నాకు చిన్నమెత్తు కూడా అర్ధం కాలేదు, అసంగతానికి పరాకాష్ట. దేశంలో భయంతో కూడిన వాతావరణం వుంది, దాన్ని మనం తొలగించాలి. ఆ పని ఎవరు చేయగలరు? ప్రధాన మంత్రి దేశాన్ని నడుపుతున్నారు. అందుకే మేము అయనకు విజ్ఞప్తి చేశాము. మా మీద దాఖలైన కేసుకు సంబంధించి నేను ఎలాంటి చర్య తీసుకోను. నేను ఇక్కడ ఒక సామాన్య పౌరుడిని. పెరుగుతున్న నేరాలను గమనంలోకి తీసుకోవాలని ప్రధాని ముందుకు ఒక సమస్యను తీసుకువచ్చాము. ఆ విధంగా ఆయనకు తెలుస్తుంది. జూలైలో ప్రముఖులు లేఖ రాస్తే అప్పటి నుంచి ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి స్పందన లేదు’ అన్నారు. బంగ బంధు ముజిబుర్‌ రహ్మాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన భాగస్వామి. మరి ఆయన వ్యాఖ్యలకు కోర్టు సమాధానం ఏమిటి ?

ఈ అంశం మీద ఇంకా అనేక స్పందనలు వెలువడ్డాయి. కేసును వెనక్కు తీసుకోవాలని వినతులు వచ్చాయి. స్ధలాభావం రీత్యా ప్రస్తావించటం లేదు. కోర్టుద్వారా కేసు నమోదు చేయటంతో మరోసారి దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల తీరు తెన్నులు మరోసారి మీడియా, జనం నోళ్లలో నానుతున్నాయి. అంతర్జాతీయ ప్రచారం వచ్చింది. అంటే మరోసారి దేశ ప్రతిష్టకు, ప్రధాని పనితీరుకు మచ్చ వచ్చింది కనుక స్పందించిన రాజకీయ పార్టీలు, ప్రముఖులతో పాటు ఇప్పుడు మీడియాను కూడా దేశద్రోహం కేసుల్లో ఇరికిస్తారా ?

న్యాయవాది సుధీర్‌ కె ఓఝా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు ఒక లిటిగెంట్‌గా కనిపిస్తోంది. అనేక మందిపై గతంలో కేసులు దాఖలు చేశాడు. ఢిల్లీలో దొరికే వుచిత వైద్య లబ్దికోసం జనాలు ఇక్కడికి వాలిపోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ అన్నారని, బీహార్‌ నుంచి వచ్చేవారిని వేరు చేసి మాట్లాడారంటూ తాను కేజరీవాల్‌పై కూడా కేసు దాఖలు చేస్తానంటూ ఓఝా తాజాగా ప్రకటించాడు. జాతీయ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న వైద్య సౌకర్యాల గురించి సెప్టెంబరు 30న కేజరీవాల్‌ ఒక ప్రకటన చేశారు. దానిలో ‘ ఒక వ్యక్తి బీహార్‌ నుంచి ఐదు వందల రూపాయల టికెట్‌ కొని ఢిల్లీ వస్తాడు. ఇక్కడ లభించే ఐదు లక్షల రూపాయల విలువైన వుచిత చికిత్స తీసుకొని తిరిగి వెళ్లిపోతాడు. పరిస్ధితి అలా వుంది. వారు మన దేశ పౌరులు గనుక అలా జరగటం సంతోషమే, అయితే ఢిల్లీ సామర్ధ్యం పరిమితమే కదా ‘ అని పేర్కొన్నారు. దీనిలో బీహార్‌ అని పేర్కొన్నారు కనుక కేసు వేస్తా అని ఓఝా చెప్పాడు. నిజానికి ఓఝా కేసు దాఖలు చేయాల్సింది బీహార్‌ పాలకుల మీద. వారి నిర్వాకం కారణంగానే అక్కడి జనం ఇతర చోట్లకు పోయి అవమానాల పాలు కావాల్సి వస్తోంది కనుక స్వంత జనానికి వుచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కేసులు దాఖలు చేస్తే అర్ధం వుంది.

1996లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించినప్పటి నుంచి 745 ప్రజాప్రయోజన వ్యాజ్య కేసులు దాఖలు చేసినట్లు చెప్పుకున్నాడు. వాటిలో ఒకటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీద కూడా స్ధానిక కోర్టులో వేసింది వుందట.భారత్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడటం పరోక్షంగా యుద్దానికి కాలుదువ్వటమే అన్నది అభియోగం.

ఏమిటంటే కాశ్మీరులో హింస, గుజరాత్‌లో కొట్లాటలు, ముంబై వుగ్రముట్టడికి గురైనపుడు నలభై తొమ్మిది మంది ప్రముఖులు ఎందుకు స్పందించలేదని ఓఝా ప్రశ్నించాడు. వారు స్పందించారా లేదా అన్నది పక్కన పెడదాం. ఆ వాదన ప్రకారం అయితే ఆయా సందర్భాలలో స్పందించని యావత్‌ రాతి గుండెల మీద కేసులెందుకు దాఖలు చేయలేదు, వాటిని నివారించటంలో విఫలమైన పాలకులను ఎందుకు బోనెక్కించ లేదు, అనేక అంశాల మీద స్వయంగా స్పందించే కోర్టులు, న్యాయమూర్తులు కూడా స్పందించలేదని కేసులు ఎందుకు వేయలేదు. స్పందించిన అంశం సరైనదా కాదా అన్నది వదలి పెట్టి మిగతా వాటి మీద ఎందుకు స్పందించలేదని ఎదురు దాడి చేయటం అంటే ప్రశ్నించే తత్వాన్ని సహించకపోవటం తప్ప వేరు కాదు. సచిన్‌ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వటం గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీద క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఇలా ఎందరి మీదనో కేసులు వేశాడు.

Related image

ఈ సందర్భంగా ఇలాంటి వారి వల్ల కోర్టుల సమయం వృధా అవుతోంది. కేసుల్లో వున్నవారికి చేతి చమురు వదులుతుంది. అందువలన న్యాయవ్యవస్ధలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం కూడా వుంది. తమ పరిధి వెలుపుల వున్న కేసులను కోర్టులు దాఖలు చేసిన సమయంలోనే తోసి పుచ్చి ఎక్కడ దాఖలు చేయాలో ఫిర్యాదుదారుకు దారి చూపాలి. ఏదీ వూరికే రాదు అన్నట్లు తమ సమయాన్ని వృధా చేసినందుకు తగిన ఫీజును అర్జీదారు నుంచి వసూలు చేయాలి. వుదాహరణకు 49 మంది ప్రముఖులు ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. అలాంటి వారి మీద కేసును ఒక జిల్లా కోర్టు చేపట్టటం అర్ధరహితం. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగిపోతోంది. పని గట్టుకొని ప్రశ్నించే, విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించే గొంతులను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోంది. జనాలకు న్యాయం మరీ దూరంగా వుండకూడదు, ప్రాధమిక సాక్ష్యాలు వున్నాయి అనుకుంటేే స్ధానిక కోర్టుల్లో దాఖలైన వాటిని పై కోర్టులకు నివేదించాలి. లేదూ అంత సీన్‌ లేదనుకుంటే అసలు స్వీకరణ దశలోనే తిరస్కరించాలి. రాజకీయ పరమైన, భావజాలాలకు, విమర్శలకు సంబంధించిన అంశాలను ఏ కోర్టులు విచారించాలో, కేసులను ఎక్కడ దాఖలు చేయాల్లో నిర్దిష్ట నిబంధనలను రూపొందించటం అవసరం. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నది అదే. తమ పరిధిలో లేని వాటిని వున్నతాధికారులకు పంపినట్లే, కోర్టులు కూడా అలాగే వ్యవహరించినపుడే వాటి పని తీరు మెరుగుపడుతుంది. దుర్వినియోగమూ తగ్గుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆరు పదాలపై ‘ ఆంక్షలు ‘ రవీంద్రుని మానవత్వంపై ‘అసహనం’

13 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Amarthya sen, attack on journalists, Attack on media, ‘Argumentative Indian’, cbfc, cow politics, History, Intolerance, NCERT, Ravindranath Tagore, RSS, six words censor

సత్య

దేశంలో వాక్సభా స్వాతంత్య్రాలకు ముప్పు వస్తోందా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అనేక మంది తమకు సంబంధించినవి కావన్నట్లుగా అసలు వాటి గురించి పట్టించుకోవటమే మానుకున్నారు. వీరిలో రెండు రకాలు అణచివేత, వివక్ష, విద్వేషానికి బలౌతున్నవారు ఒక తరగతి అయితే మేథావులం అనుకునే వారు రెండో తరగతి. మొదటి వారితో ఇబ్బంది లేదు, సమయం, సందర్భం వచ్చినపుడు తమ సత్తా ఏమిటో చూపుతారు. గడియారంలోని లోలకం మాదిరి అటో ఇటో వూగటం తప్ప నిలబడి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు రాని మేథావులతోనే అసలు సమస్య. వంది మాగధులు పొగడ్తలకు రాజులు, రంగప్పలు ఎలా పొంగిపోయేవారో, తమను విమర్శించేవారిని ఏం చేశారో చూశాము. ఆ రాజరికాలు, జమిందారీ వ్యవస్ధ పోయినా ఆ స్వభావం మాత్రం పాలకులలో ఇంకా సజీవంగానే కొనసాగుతోండటమే ప్రమాదకరం.

మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న చోట గుజరాత్‌, ఆవు, హిందు, హిందూత్వ,ఈ రోజుల్లో, ఇండియాలో అనే పదాలు వినిపించకూడదు, వాడకూడదు.పాఠ్య పుస్తకాలలో అరబ్బీ, ఆంగ్లం, వుర్దు పదాలను తీసివేయాలి. రవీంద్రనాధఠాగూరు ఆలోచనలు, ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఆత్మకధ వుండకూడదు, మొఘల్‌ చక్రవర్తుల దయాగుణం కలవారని, బిజెపి హిందూ పార్టీ అని, నేషనల్‌ కాన్ఫరెన్సు లౌకికవాద పార్టీ అన్న వర్ణలు వుండకూడదు.1984 దాడులపై మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన క్షమాపణ, గుజరాత్‌లో దాదాపు రెండువేల మంది ముస్లింలను చంపివేశారనే వ్యాక్యాలను పాఠ్యపుస్తకాలను తొలగించాలి. ఇలా రోజు రోజుకూ నిషేధిత పదాలు, భావనలు, ఆలోచనలు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయి. ఇలాంటివాటన్నింటినీ బయటకు తెలియనివ్వకుండా సంబంధిత సంస్ధలు తమంతట తామే చేసినట్లుగా బయటకు కనిపించాలని కోరుకొనే శక్తులు తమ బండారం బయట పెట్టిన మీడియా గురించి రెచ్చిపోతున్నారు.

సుమన్‌ ఘోష్‌,                                 అమర్త్యసేన్‌                       పహ్లజ్‌ నిహ్లానీ

ముందుగా ఆరు మాటలపై ఆంక్షల గురించి చూద్దాం. వీటిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ పదవీకాల గడువు ముగియక ముందే కేంద్ర ప్రభుత్వం తొలగించి ప్రసూన్‌ జోషి అనే రచయితను నియమించింది. తన పదవీ నియామకంతో పాటు తొలగింపు కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నానని నిహ్లానీ వ్యాఖ్యానించాడు. ఇక నేరుగా సాధారణ సినిమాల్లోనే అశ్లీల, అసభ్య దృశ్యాలను చూడవచ్చని వుక్రోషం వెలిబుచ్చారు. అసాంస్కృతిక లేదా మర్యాద తెలియని సేన చేతిలో కాలం చెల్లిన ఆయుధంగా వుపయోగపడిన వ్యక్తికి కేంద్రం ముగింపు పలికిందని ఒక పత్రిక వ్యాఖ్యాన శీర్షికలో పేర్కొన్నారు. చరిత్రను వెనక్కు నడపాలని చూస్తున్న, ఏది తినకూడదో, ఏ డ్రస్సు వేసుకోకూడదో, ఎప్పుడు బయట తిరగాలో ఇలా ప్రతి జీవన రంగంలో కాలం చెల్లిన ఆయుధాలతో ‘స్వయంసేవకులు’ మూలమూలనా రెచ్చిపోతున్న స్ధితిలో నూతన అధిపతి ఎలా పని చేయగలరో చూడాల్సి వుంది.

నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ గురించి సుమన్‌ ఘోష్‌ అనే ఒక దర్శకుడు ‘భారతీయ తార్కికుడు ‘ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. దానికి కేంద్ర ఫిలింసెన్సార్‌ బోర్డు తాము చెప్పిన ఆరు పదాల కోతలకు అంగీకరిస్తేనే ప్రదర్శనకు అనుమతి సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పింది.పైన పేర్కొన్న మొదటి ఆరుపదాలు, వాటితో కూడిన వ్యాక్యాలను ఆ డాక్యుమెంటరీలో వినిపించకుండా చేయాలని జూలై 11న కోరింది. ఒక్క కోతకు కూడా తాను అంగీకరించటం లేదని ఒక నెల రోజుల తరువాత దర్శకుడు తిరస్కారాన్ని తెలిపాడు. తరువాత ఆ చిత్రాన్ని పునర్విచారణ కమిటీకి పంపుతారు. అదొక తతంగం, ఇంత జరిగాక దానిని ఏమి చేస్తారో వూహించనవసరం లేదు. కుక్క మనిషిని కరవటం సాధారణ విషయం. కానీ మనిషే కుక్కను కరవటం సంచలన వార్త. దేశంలో నేడున్న స్ధితిలో ఆరు పదాలపై ఆంక్షలు పెట్టటం సాధారణం.ఇంత రాద్ధాంతం జరిగాక వాటిని అంగీకరించి అనుమతిస్తేనే అది అసలైన వార్త అవుతుంది. చివరికి అదేమైనా అసలు ఆ పదాలపై ఎందుకు అభ్యంతర పెడుతున్నారన్నదే తెలుసుకోవాల్సిన, తేలాల్సిన అంశం.

సెన్సార్‌ బోర్డు అభ్యంతరాలపై దేశమంతటి నుంచి అనేక మంది మేథావులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బోర్డు అధిపతి పహ్లజ్‌ నిహ్లానీ తమ చర్యను సమర్ధించుకున్నారు. ఆ పదాలకు కోత పెట్టినందువలన దర్శకుడి సృజనాత్మకతకు, అమర్త్యసేన్‌ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. ఆ పదాలు భారతీయ సంస్కృతి, ప్రజాస్వామ్యాన్ని విస్పష్టంగా తిరస్కరించేవిగా వున్నాయని, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఒక భారతీయుడిపై నిర్మించిన డాక్యుమెంటరీలో రాజకీయాలు, మతం గురించి మందబుద్దితో చేసిన వ్యాఖ్యలను అనుమతిస్తే శాంతి, సామరస్యాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భావించామని వాదించారు. ఒక సందర్భంలో భారతీయ ప్రజాస్వామ్యం గురించి చేసిన ప్రస్తావనలో గుజరాత్‌ నేరాల గురించి పేర్కొన్నారని, దానిలో గుజరాత్‌ అనే పదం తీసివేయమని కోరామన్నారు. మరొక సందర్భంలో ఇండియాలో శత్రువు మతనాయకత్వమని చేసిన ప్రస్తావనలో ఇండియా అనే పదం వాడవద్దన్నామని, ఇండియాను హిందు అని భాష్యం చెప్పినందున హిందూ అనే పదాన్ని తొలగించాలని కోరామన్నారు. ఆవు గురించి మతానికి ముడిపెడుతూ నిరర్ధకమైన ప్రస్తావన చేసినందున ఆవు పదాన్ని వాడవద్దని కోరామని, ఈ రోజుల్లో వేదాలను దురభిమాన పద్దతిలో వినియోగిస్తున్నారని చేసిన వ్యాఖ్యలో ఈ రోజుల్లో, వినియోగిస్తున్నారు అనే పదాలను తొలగించాలని కోరినట్లు నిహలానీ చెప్పారు. భారత హిందుత్వ వైఖరి నకిలీదని ఆగ్రహం కలిగించే విశేషణం వాడినందున దానిని కూడా తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఈ పదాలను తొలగించాలని ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వత్తిడి లేదని, అలా కోరటాన్ని ప్రభుత్వ అనుకూల చెంచాగిరి చేసినట్లుగా చూశారని వ్యాఖ్యానించారు. ఆవు, హిందూత్వ గురించి చేసిన వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తాయని, చిత్ర నిర్మాతలు భావ ప్రకటనా స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి స్వేచ్చ బాధ్యతతో కూడినదై వుండాలని కూడా వారు తెలుసుకోవాలని నిహ్లానీ అన్నారు. మీరు నోబెల్‌ బహుమతి గ్రహీత కావచ్చు జనం పవిత్రమైనవిగా భావిస్తున్న వాటిని తృణీకారంతో మాట్లాడితే మీపై దాడులు జరిగే అవకాశాలున్నాయని కూడా సెన్సార్‌ బోర్డు అధిపతి వ్యాఖ్యానించారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ లేకుండా పలు బహిరంగ స్ధలాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు, అది చట్టవిరుద్దం, భావ ప్రకటనా స్వేచ్చ మంచిదే చట్ట వుల్లంఘన మాటేమిటని నిహ్లానీ ప్రశ్నించారు.

సెన్సార్‌ బోర్డు అధిపతి ప్రస్తుతం దేశంలో మనువాద, సంఘపరివార్‌ శక్తులు చేస్తున్న వాదనలను అధికారికంగా వ్యక్తం చేయటం తప్ప మరొకటి కాదు. ఆ భావజాలంతో ఆయన ప్రభావితులయ్యారా లేక అధికారం ఆయనను ప్రభావితం చేసిందా అన్నది సమస్య. మొదటిదే వాస్తవమైతే అన్ని రంగాలలో తిరోగమనవాదులతో నింపే ప్రప్రకియలో భాగంగానే ఆయనను అక్కడ నియమించారని, లేకపోతే ఆయనపై వత్తిడి తెచ్చారని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. కొంత మంది పవిత్రంగా చూస్తున్నదానిని జనం మొత్తం చూస్తున్నారని చిత్రించటం, వాటితో విబేధించి వర్ణనలు చేస్తే దాడులు జరుగుతాయని చెప్పటమంటే పరోక్షంగా అదే చేయమన్న సందేశం తప్ప మరొకటి కనిపించటం లేదు. మతోన్మాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టుల తరగతికి చెందిన వారు చేస్తున్న దుర్మార్గాలన్నీ దేవుళ్లు, దేవదూతలు, దేవుని బిడ్డలో, ఆయా మతాల గ్రంధాలు చెప్పాయనో, శాశించాయనో, జనాభిప్రాయమనో, కోరారనో పేరుతో చేస్తున్నవే అని గమనించాలి.

ఆవు, వేదాలు, హిందూత్వల గురించి భిన్న అభిప్రాయాలు వెలువరించటం ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు, లేదూ కొత్తగా ప్రారంభించినా తప్పేమీ కాదు. తమ వ్యాఖ్యానాలకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదని కొన్ని శక్తులు తమ అభిప్రాయాన్ని దేశం మొత్తం మీద రుద్దటం గతంలో నడవ లేదు, ఇప్పుడూ కుదరదు, అది ఏ రీత్యా చూసినా ప్రజాస్వామ్య వైఖరి కాదు. చర్చోపచర్చలు చేయవచ్చు, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చు. ఏ వైఖరిని కలిగి వుండాలనేది లేదా ఏ వైఖరికీ బద్దులం కాకూడదనో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇవ్వాలితప్ప భిన్నాభిప్రాయం, భిన్న వ్యాఖ్యానం వినిపించకూడదని చెప్పటం ఏమిటి ? ఇక పహ్లజ్‌ నిహ్లానీ నియామకం, తొలగింపు ఏమి సూచిస్తున్నది. తన తిరోగమన భావాలను సమాజంపై రుద్ధితే వాటి ప్రభావం ఎలా వుంటుందో సంఘపరివార్‌ పరీక్షిస్తున్నది. రాజకీయంగా నష్టం జరుగుతుందనుకుంటే తమ మనసెరిగి నడుచుకున్నప్పటికీ నిహ్లానీని కొనసాగించటం నష్టదాయకం అని గ్రహించినట్లుగా కనిపిస్తున్నది. అన్ని రంగాలలో ఒకేసారి తమ అజెండాను రుద్దితే నష్టం కనుక బ్రిటీష్‌ వారి సేవలో నేర్చుకున్న విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా కాషాయ పరివారం కొంతకాలమైనా సినీరంగాన్ని సంతుష్టీకరించేందుకు పూనుకుందా అన్నది చూడాల్సి వుంది.

ఇక పాఠ్యపుస్తకాల నుంచి విశ్వకవి రవీంద్రనాధ్‌ ఠాగూరు అభిప్రాయాలు, కొన్ని భాషా పదాలు, ఇంకా ఏమేమి తొలగించాలో సూచిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ శిక్షా సంస్కృతి వుత్తన్‌ న్యాస్‌ రూపొందించిన డిమాండ్ల జాబితాను ఆ సంస్ధ నేత దీనా నాధ్‌ బాత్ర నాయకత్వంలో ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించారు. వాటిని ప్రముఖంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతర అనేక పత్రికలు ప్రచురించాయి. వాటిని చూసిన వారు ఇదేమి వైఖరని ఆగ్రహం, విమర్శలు వ్యక్తం చేయటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మీడియాపై చిందులు తొక్కుతున్నారు.

మీడియా సైద్ధాంతికంగా, వివక్షతో కూడినదే గాక దేశాన్ని విభజించేందుకు కుట్రపన్నుతోందని, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని పైన పేర్కొన్న సంస్ధ న్యాస్‌ జాతీయకార్యదర్శి అతుల్‌ కొథారీ ఆరోపిస్తే, మాజీ జర్నలిస్టయిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌కమ్యూనిసకేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన కెజి సురేష్‌ దాడి చేశారు. దొంగే దొంగని అరచినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల వ్యవహారం వుంది. రవీంద్రుని భావాలను తొలగిస్తున్నారా అని పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన దానికి ఒక స్వతంత్ర సంస్ధ అయిన ఎన్‌సిఇఆర్‌టి తరఫున తాను వకాల్తా పుచ్చుకున్నట్లుగా అలాంటిదేమీ జరగబోవటం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఆ సంస్ధ ప్రతినిధులెవరూ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రంలో రవీంద్రుని గురించిన ప్రస్తావన లేదని, కొన్ని పత్రికలు ముఖ్యంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవాస్తవ వార్తలు ప్రచురించాయని, ఎక్స్‌ప్రెస్‌కు లీగల్‌ నోటీసు పంపుతామని న్యాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

తమ పత్రంలో లేని అంశాలను మీడియా పేర్కొన్నదని ఆరోపిస్తున్న పెద్దలు అసలు తాము సమర్పించిన దానిని బహిరంగపరిచి మీడియా చేసిన వక్రీకరణలను లోకానికి తెలియచేయవచ్చు. కానీ వారా పని చేయలేదు. అదేమీ రహస్యం కాదు, అయినా ఇంతవరకు దానిని అధికారికంగా బహిరంగపరచలేదు.ఎన్‌సిఇఆర్‌టికి తాము సమర్పించిన పత్రాన్ని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు అందచేసినట్లు న్యాస్‌ ప్రతినిధులు అంగీకరించారు.దాని కాపీలను మిగతా వారికి అందచేస్తే ఏది వాస్తవమో తేలిపోతుంది. తాను రాసిన వార్తలపై ఎక్స్‌ప్రెస్‌ పత్రిక కట్టుబడి వుంది కనుకనే వారికి లీగల్‌ నోటీసు ఇస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. కనుక పత్రికా వార్తలు లేదా వ్యాఖ్యానాలతో విబేధిస్తున్న న్యాస్‌ తన పత్రంలో ఏం వుందో వెల్లడించాల్సిన బాధ్యత దాని మీదే వుంది.

తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ అని పేర్కొనటాన్ని కూడా న్యాస్‌ అభ్యంతర పెట్టింది. అసలు ఆర్‌ఎస్‌ఎస్సే నమోదిత సంస్ధ కాదు.జనాన్ని మభ్యపెట్టేందుకు లేదా వేరే ప్రయోజనంతో కావచ్చు, దానిలో పని చేసే ప్రముఖుల ఆధ్వర్యంలో అనేక సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. అవన్నీ వాస్తవానికి దాని కనుసన్నలలో పని చేసేవే అన్నది అందరికీ తెలిసిన సత్యం.ఆర్‌ఎస్‌ఎస్‌కు బిజెపి అనుబంధ సంస్ధ అని ఎక్కడా వుండదు. కానీ దాని నాయకులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. దానిలో సభ్యత్వాన్ని వదులుకోవాలని గతంలో జనతా పార్టీలో ఒక డిమాండ్‌ వచ్చినపుడు దానిలో విలీనమైన పూర్వపు జనసంఘనేతలెవరూ అంగీకరించలేదు. తరువాత వారంతా బిజెపిని ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. సాంకేతికంగా అనుబంధం వుంటుందా అంటే వుండదు.

కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె వంటి పార్టీలన్నీ తమ అనుబంధ సంస్ధలనాయకత్వాన్ని నియమిస్తూ బహిరంగంగానే ప్రకటిస్తాయి. కమ్యూనిస్టు పార్టీలలో నాయకులుగా వున్న వారు అనేక ప్రజా సంస్ధలలో కూడా పని చేస్తూ వాటికి నాయకులుగా కూడా వుంటారు. అవి నిజానికి పార్టీ అనుబంధ సంస్ధలు కావు, పార్టీ సభ్యులు కాని వారు కూడా వాటిల్లో నాయకులుగా వుంటారు వాటిని అనుబంధ సంస్ధలని నిరూపించే ఆధారాలను ఎవరూ చూపలేరు. అయినా సిపిఎం అనుబంధ రైతు సంఘమనో, సిపిఐ అనుబంధ కార్మిక సంఘమనో మీడియాలో ప్రస్తావించటం చూస్తున్నాము. అయితే తమ అనుబంధ సంస్ధలు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకొనే వాటికి ఆర్‌ఎస్‌ఎస్‌కు వున్న సంబంధాల గురించి అంజలీ మోడీ అనే జర్నలిస్టు స్క్రోల్‌ అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో ఆధారాలతో వివరించారు. అలాంటి వాటిలో ఒకటైన న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి సమర్పించిన ఐదు పేజీల పత్రంలో రవీంద్రుని పేరు ప్రస్తావించటాన్ని తాను చూశానని పేర్కొన్నారు. ఆ పత్రపు ఐదవ పేజీలో’ రవీంద్రనాధ్‌ ఆలోచనా ధోరణిలో జాతీయవాదం-మానవతా వాదం మధ్య వైరుధ్యం వున్నట్లు చూపేందుకు ఒక ప్రయత్నం జరిగిందని ‘ న్యాస్‌ పేర్కొన్నది.

” ఎక్కడ ఆత్మ భయరహితంగా వుంటుందో ‘ అనే రవీంద్రుని కవిత, ఇతర అంశాలు ‘ జాతీయ సమగ్రతకు సవాళ్లు ‘ అనే శీర్షిక కింద సిబిఎస్‌యి ప్రచురించిన పదవ తరగతి ఆరవ యూనిట్‌ వర్క్‌బుక్‌లో వున్నాయి తప్ప ఎన్‌సిఇఆర్‌టి పుస్తకంలో కాదు. అయితే ఆర్‌ఎసెస్‌ సంస్ధ న్యాస్‌ ఎన్‌సిఇఆర్‌టికి ఇచ్చిన పత్రంలో తొలగించాలని లేదా సవరించాలని చెప్పింది వీటి గురించే. ఆ పాఠంలో చెప్పిందేమిటి ? ‘ మానవత్వం అన్నింటికంటే వున్నతమైనదని రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయపడ్డారు. మతం ఒక ప్రమాదకర అంశంగా తయారైంది. అయితే స్ధిరత్వాన్ని సాధించాలంటే మత మౌఢ్యం,తీవ్రవాదాలను తొలగించాల్సి వుంది.’ అన్న వ్యాక్యం ఆ పాఠంలో వుంది.

పదకొండవ తరగతికి ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన ‘రాజకీయ సిద్ధాంతం ‘ అనే పాఠ్యపుస్తకంలో దేశ భక్తికి వున్న పరిమితుల గురించి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ అభిప్రాయాలను పొందుపరిచారు. ఎఎం బోస్‌కు ఠాగూరు రాసిన లేఖలోని అంశాలను దానిలో వుటంకించారు.’దేశభక్తి అంతిమ ఆశ్రయం దేవతలు(లేదా ఆధ్యాత్మికం) కారాదు, నేను మానవత్వాన్నే ఆశ్ర యిస్తాను.’ అని ఠాగూరు చెప్పారు. హిందీ అనువాదంలో దేశభక్తి అంటే జాతీయవాదం(రాష్ట్రవాద) అని, మానవత్వం అంటే మానవత అని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొనే ఠాగూరు ఆలోచనల్లో వైరుధ్యం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ భావించి వుండవచ్చన్నది ఒక అభిప్రాయం.

ఈ వుదంతంలో ఒకటి మాత్రం స్పష్టం. ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదానికి ఠాగూరు ఆలోచనా ధోరణి పొసగదు. తాము చేప్పిన దేశభక్తి, జాతీయవాదం ప్రశ్నించవీలులేనివి అన్నట్లుగా వాటితో విబేధించేవారిని దేశద్రోహులుగానూ, పాకిస్ధాన్‌ లేదా చైనా అనుకూలురుగానో ముద్రవేసి దాడులు చేస్తున్నారు. ఆ పదాలకు సంఘపరివార్‌ లేదా దాని సమర్ధకులు చెబుతున్న భాష్యాలు వివాదాస్పదం, అభ్యంతరకరమైనవి.హిట్లర్‌ దృష్టిలో లేదా అనేక మంది ఐరోపా మితవాదుల దృష్టిలో ఇతర దేశాలపై రాజకీయంగా, ఆర్ధికంగా, మిలిటరీ తదతర అన్ని రంగాలలో జర్మనీ లేదా తమ దేశాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు పూనుకోవటమే జాతీయవాదం, దేశభక్తి. అందుకే జర్మనీ ఔన్నత్యాన్ని కాపాడేందుకంటూ వున్మాదాన్ని రెచ్చగొట్టిన హిట్లర్‌ ప్రపంచానికి ఎలా ముప్పుగా తయారైందీ చూశాము. అదే సమయంలో మన దేశంలో దేశభక్తి, జాతీయవాదం అంటే బ్రిటీష్‌ వారి వ్యతిరేకత, సర్వసత్తాక స్వతంత్ర ప్రభుత్వస్ధాపన. ఈ అవగాహనతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకీభవించలేదు కనుకనే అది స్వాతంత్య్రానికి దూరంగా వుండిపోయింది. దాని నాయకులుగా వున్న సావర్కర్‌ వంటి వారు చివరికి బ్రిటీష్‌ వారికి లంగిపోయి, సేవలు అందించిన విషయం తెలిసిందే. అలాంటి శక్తుల ప్రతినిధులే నేడు దేశభక్తి, జాతీయవాదానికి భిన్న భాష్యాలు చెబుతూ వాటిని అంగీకరించని వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న ప్రమాదకర పరిస్ధితి దేశంలో నేడు పెరిగిపోతోంది. తాము చెబుతున్న జాతీయవాదమే మానవత్వమని అంగీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోంది.

దేశ చరిత్ర, వ్యక్తులు, భావజాలం వంటి సకల సామాజిక అంశాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ టీకా తాత్పర్యాలతో విబేధించే హక్కు ఇతరులకు ఎలా వుందో, ఇతరులు చెప్పిన వాటిపై భిన్నాభిప్రాయం వెలిబుచ్చే హక్కు వారికీ వుంది. వాటి గురించి బహిరంగ చర్చ జరపాలి భిన్న పక్షాలు తమ వాదనలకు అవసరమైన రుజువులను చూపాలి. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక అంశాలలో అది మానమ్మకం, మా మనోభావం, తరతరాల నుంచీ వస్తున్నదానిని ఎవరూ తిరస్కరించకూడదనే పేరుతో చర్చ నుంచి పారిపోతోంది. తన అజెండాను రహస్య పద్దతుల్లో అమలు జరిపేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే రాజ్యాంగ వ్యవస్ధలో తన భావజాలాన్ని ఏదో ఒక విధంగా అమలు జరిపే శక్తులతో నింపుతూ వారితో తన కార్యక్రమాన్ని అమలు చేయిస్తోంది.పైకి తాము జోక్యం చేసుకోవటం లేదని, తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తోంది.

ఎన్‌సిఇఆర్‌టికి సూచనలు, సిఫార్సులను సమర్పించిన న్యాస్‌ విషయమే చూద్దాం.దాని అధినేత తమ సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధం అని పేర్కొనటాన్ని విలేకర్ల సమావేశంలో తప్పు పట్టారు. పోనీ రెండు సంస్ధల మధ్య వున్న సంబంధం ఏమిటో సెలవివ్వండి అంటే ఆర్‌ఎస్‌ఎస్‌, తమదీ వేర్వేరు స్వతంత్ర సంస్ధలని మాత్రమే చెప్పారు. శిక్షా సంస్కృతి వుత్తాన్‌ న్యాస్‌ అనే సంస్ధ రిజిస్టర్డు ఆఫీసు చిరునామా ఢిల్లీలోని నారాయణ విహార్‌లోని సరస్వతీ బాల మందిర్‌. ఆ పాఠశాలను నడుపుతున్నది విద్యాభారతి అనే మరొక సంస్ద. దాని వెబ్‌సైట్‌లో జీవితంలో ఒక లక్ష్యం వుండాలనే భావనతో 1952లో కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పిల్లల విద్యను చేపట్టినట్లు స్పష్టంగా రాసుకున్నారు. అంతే కాదు హిందుత్వకు కట్టుబడి ూండే, దేశభక్తిని చొప్పించే ఒక జాతీయ విద్యా వ్యవస్ధను కూడా అభివృద్ధి చేయటం తమ లక్ష్యంగా కూడా దానిలో చెప్పుకున్నారు. విద్యా భారతి మాజీ అధిపతి దీనా నాధ్‌ బాత్రా న్యాస్‌ స్ధాపకులలో ఒకరు. వీరందరికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి ఆ సంస్ధ పత్రిక ఆర్గనైజర్‌లో 2008లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం బృందావన్‌లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశంలో కొంతమంది అధికారుల బాధ్యతలలో మార్పులు చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ సరకార్యవాహక్‌ శ్రీ మోహన్‌ భగవత్‌ దిగువ మార్పులను ప్రకటించినట్లు దానిలో వుంది. ఆ జాబితాలో శిక్షా బచావో ఆందోళన్‌ నూతన అధిపతిగా అతుల్‌ కొథారీని నియమిస్తున్నట్లు వుంది. ఆయనే తరువాత ప్రస్తుత న్యాస్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా నష్టం కలిగిస్తుందనుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఏమి చెప్పటానికైనా వెనుతీయరు. న్యాస్‌ పత్రంపై చర్చ జరిగితే ఆర్‌ఎస్‌ఎస్‌ నిజరూపం మరింతగా బహిర్గతం అవుతుంది, అది నష్టదాయకం కనుక ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు తొందరపడుతున్నారు, దానిలో భాగమే రవీంద్రుని భావజాలాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించబోవటం లేదని రాజ్యసభలో ప్రకాష్‌ జవదేకర్‌ చేత చెప్పించటం. ఎన్‌సిఇఆర్‌టి దాని గురించి అధికారికంగా చెప్పేంత వరకు ఎవరేమి చెప్పినా దానికి విలువ లేదు. తన పత్రాన్ని వుపసంహరించుకున్నట్లు లేదా సవరించుకున్నట్లు న్యాస్‌ చెప్పేంత వరకు దీని గురించి ఎవరైనా చర్చించవచ్చు, ఆ తరువాత కూడా జరిగిందానిని ప్రస్తావించవచ్చు. తమను ప్రశ్నించే మీడియాను బిజెపి మంత్రులు, అనుయాయులు ప్రెస్టిట్యూట్స్‌ అంటూ కించపరుస్తున్న విషయం తెలిసిందే.(వళ్లమ్ముకొనే వారిని ఆంగ్లంలో ప్రాస్టిట్యూట్స్‌ అంటున్నారు, తమను ప్రశ్నించే మీడియా వారు కూడా వారితో సమానం అంటూ ప్రెస్టిట్యూట్స్‌ అని దాడి చేస్తున్నారు)

ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ న్యాస్‌ విషయానికి వస్తే తమ భావజాలానికి వ్యతిరేకమైనవి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాటిని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలని నిరంతర కార్యక్రమంగా పెట్టుకున్నాయి. వుదాహరణకు ‘ మూడు వందల రామాయణాలు: ఐదు వుదాహరణలు, అనువాదంపై మూడు ఆలోచనలు ‘ అనే ఏకె రామానుజం వ్యాసాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయ సిలబస్‌ నుంచి తొలగించాలని, వెండీ డోనిగర్‌ రాసిన ది హిందూస్‌ అనే పుస్తకాన్ని వుపసంహరించాలని న్యాస్‌ ఆందోళన చేసింది, కోర్టులకు ఎక్కింది. రామానుజన్‌ వ్యాసాన్ని తొలగించారు, రెండో పుస్తకాన్ని తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేశారు.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించిన దాని ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ వారు పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాల్సిన అంశాలుగా పేర్కొన్న వాటి సారాంశం ఇలా వుంది.

పన్నెండవ తరగతి రాజకీయ శాస్త్రం

1984 ఘర్షణల గురించిన పేరా ఇలా అంతమౌతుంది.’ 2005లో పార్లమెంట్‌లో వుపన్యాసం సందర్భంగా సిక్కు వ్యతిరేక హింసాకాండలో రక్తపాతం జరగటం దానికి దేశం క్షమాపణలు చెప్పాలనటంపై ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.

రామాలయ ఆందోళనకు బిజెపి మరియు హిందుత్వ రాజకీయాల ఎదుగులకు సంబంధం వుందని ఒక పేరా చెబుతోంది. ఒక చోట బిజెపి ఒక హిందుత్వ పార్టీ అని మరొక చోట హిందుత్వ, హిందుపన్‌లు విడి సావర్కర్‌ కల్పితమని పేర్కొన్నారు. మరొక చోట బాబరీ మసీదును మీర్‌ బక్షి నిర్మించాడని….రాముడి జన్మస్ధలంలోని రామాలయాన్ని ధ్వంసం చేసి దానిని నిర్మించారని కొందరు హిందువులు విశ్వసిస్తారని వుంది. గోద్రాలో 2002లో జరిగిన వుదంతం గురించిన చోట ఒక రైలుకు నిప్పంటుకుందని…. దానికి ముస్లింలో కారణమనే అనుమానంతో’ అనే వ్యాక్యంలో నిప్పుంటుకుంది అనే పదాన్ని తగులబెట్టారు అని సవరించాలని, అనుమానం అనే పదాన్ని తొలగించాలని న్యాస్‌ కోరింది. మరొక చోట ‘ అటువంటి మారణకాండకు పధకాలు వేసిన వారికి కనీసం రాజకీయ పద్దతులలో(ఓటింగ్‌) ద్వారా ఒక పాఠం చెప్పేట్లు మనం చూడగలమా అని వుంది.

తొలగించాల్సిన భాషా పదాల జాబితాలో ఆంగ్లంలో వైస్‌ ఛాన్సలర్‌,వర్కర్‌, మార్జిన్‌, బిజినెస్‌,బాక్‌బోన్‌, స్టాంజా, రాయల్‌ అకాడమీ, వుర్దు లేదా అరబిక్‌ భాషలోని బేటార్‌టిబ్‌, పోషక్‌, తాకత్‌, ఇలాకా, అక్సర్‌, ఇమాన్‌, జోకిహిమ్‌,మెహమాన్‌-నవాజీ, చమర్‌, సారే ఆమ్‌, ఇవిగాక భ్రష్టపదాలుగా వుల్లు కహిన్‌కా, కాంబఖత్‌, బద్మాష్‌, లుచ్చే-లఫంగే, బహంగియోన్‌ వున్నాయి.

తొమ్మిదవ తరగతిలో రామధరీ సింగ్‌ దినకర్‌ ఒక ప్రేమికుని వాంఛలు అనే కవిత వలన పిల్లలు తప్పుదారి పడతారు,శీలాన్ని కోల్పోతారు కనుక, కేంద్ర ప్రభుత్వం చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ కార్యకలాపాలు దేశ ఐక్యతం, గణతంత్రానికి ముప్పు అని భావిస్తున్నందున పదకొండవ తరగతిలో ఆయన ఆత్మకథను తొలగించాలని కోరారు. కన్నడ కవయిత్రి అక్క మహా దేవి ఒక సంఘటనను పేర్కొంటూ దానికి నిరనగా తన దుస్తులను తొలగించినట్లు ఒక పాఠంలో వుంది. ఒక నగ్న మహిళను వర్ణించటం మహిళల స్వేచ్చ పేరుతో హిందూ సంస్కృతిని కించపరచటమే అని న్యాస్‌ వాదించింది.

చరిత్ర పాఠ్యాంశాలకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాల సారం ఇలా వుంది. వేదాల అనంతర కాలంలో సాధారణంగా మహిళలను సూద్రులతో సమంగా పరిగణించారు. దేవుడి ముందు అన్ని మతాల వారు సమానమే అనే సులహ్‌ ఏ కుల్‌ విధానాన్ని అక్బర్‌ ప్రవేశపెట్టారు. వితంతువుల దురదృష్టాలు, సామాజిక బహిష్కరణల గురించి 19వ శతాబ్ది మహిళా వుద్యమకారిణి తారాబాయ్‌ షిండే రాసిన పుస్తకంలో పితృస్వామ్య వ్యవస్ధపై తీవ్ర విమర్శ వుంది. దానిని కూడా తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ కోరింది. మరొక పుస్తకంలో వర్ణాశ్రమ వ్యవస్ధ గురించిన ప్రస్తావన ఇలా వుంది. ‘పుట్టుకతోనే హోదా నిర్ణయమౌతుంది. వారు(బ్రాహ్మలు) జనం ప్రతిష్ట పుట్టుక మీదే ఆధారపడి వుందని గుర్తించేందుకు ప్రయత్నించారు… అలాంటి అర్హతల గురించి మహాభారతం వంటి అనేక పుస్తకాలలోని కధలతో పటిష్టపరిచారు.’ ఆర్యుల యుద్ధ దేవుడు ఇంద్రుడిపై మొహంజదారో చివరి దశలో స్త్రీ పురుషులను వూచకోత కోశాడనే ఆరోపణలున్నాయి. ఒక చోట మొగల్‌ కాలంలో పాలకులు జనం పట్ల ఎంతో వుదారంగా వుండేవారు, మొగలాయీ పాలకులందరూ ప్రార్ధనా మందిరాల నిర్మాణం, నిర్వహణకు నిధులు ఇచ్చారు. యుద్ధాల సందర్భంగా దేవాలయాలు నాశనమైతే తరువాత వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేసేవారు.అని వుంది. ఇలాంటి వాటన్నింటినీ తొలగించాలి, సవరించాలి అని న్యాస్‌ పేర్కొన్నది.

ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటం, మనువాద వ్యవస్ధను పరిరక్షించటం, తమ భావజాలానికి తగిన విధంగా లేక వ్యతిరేకంగా వుంటే రవీంద్రుని వంటి వారి ఆలోచనలను కూడా నూతన తరాలకు అందకుండా చూడటం, తమ దుష్ట చరిత్రను మరుగుపరచటానికి విద్యారంగాన్ని వినియోగించుకోవాలని కాషాయ దళాలు చూస్తున్నాయన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

స్వరూపానంద ఆగ్రహానికి కారణం ఏమిటి ?

15 Friday Apr 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Intolerance, Sai Baba, Shani Shingnapur, Swami Swaroopanand, Women

ఎంకెఆర్‌

    ఆ పెద్దమనిషి వయసేమీ చిన్నది కాదు.తొమ్మిది పదులు దాటాయి. పైగా శంకరాచార్యులలో ఒకరిగా కొందరు పరిగణించే ద్వారకా పీఠాధిపతి.వయస్సువచ్చిన తరువాత పరిణితి పొందుతారని పెద్దలు చెబుతారు. కానీ ఆయన మాట్లాడిన దానిని చూస్తే ఇంకా తగిన వయస్సు రాలేదేమో అనిపిస్తోంది.మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌ శని దేవాలయంలోకి మహిళలు ప్రవేశిస్తే వారిపై మానభంగాలు పెరుగుతాయని శంకరాచార్య స్వరూపానంద సెలవిచ్చారు.’ ఈ అపవిత్రకరమైన చర్యకు పాల్పడిన వారిని శని సహించడు. వారిపై దాడులు, మానభంగాల వంటివి పెరుగుతాయి’ అని భోపాల్‌లో చెప్పారు. తన దేవాలయ గర్భగుడిలోకి మహిళలు ప్రవేశిస్తే శని సహనం నశించి ఆడవారిపై దాడులు, మానభంఘాలు చేసే విచ్చలవిడి ఆంబోతులను మరింతగా ఎగదోస్తాడని శంకరాచార్య చెబుతున్నారు. శనికి వేరే పనేమీ లేదా ? మహిళలమీద ఎందుకంత ఆగ్రహం? ఎంత అన్యాయమైన వ్యాఖ్యలు ! అంతేనా ! మహిళలు సాంప్రదాయాలను వుల్లంఘించిన కారణంగానే కేరళలోని పుట్టింగల్‌ దేవాలయంలో110 మంది మరణించారని కూడా ప్రకటించేశారు. మహిళలు సాంప్రదాయాలను వుల్లంఘించి దేవాలయాల ప్రవేశం చేయటం కంటే మద్యం తాగి మాన భంగం వంటి నేరాలకు పాల్పడుతున్న పురుషులను తాగకుండా మాన్పించేందుకు పూనుకోవాలని కూడా సలహా ఇచ్చారు.

    ఇంతే కాదు, అర్హతలేని షిరిడీ సాయిబాబాను పూజిస్తూ నిజమైన దేవుళ్లను విస్మరిస్తున్న కారణంగానే ప్రస్తుతం మహారాష్ట్రలో కరవు కాటకాలు సంభవించాయని కూడా సంపూర్ణానంద ఆరోపించారు.సాయిబాబా మాంసం తిన్నాడని, ముస్లిం అని పూజించటానికి అనర్హుడని, అతినికి విగ్రహాలు పెట్టటం, గళ్లు, గోపురాలు కట్టవద్దని, కట్టిన వాటిని కూల్చివేయాలని, ఇతర గుళ్లలోని విగ్రహాలను తొలగించాలని కూడా గతంలో మాట్లాడిన పెద్దమనిషి. నిజానికి ముదిమది తప్పిన స్ధితిలో ఆయనే కాదు, ఇంకా చాలా మంది బాబాలు, గురువులు, పీఠాధిపతులుగా చెప్పుకొనే, ఇలాంటి అభిప్రాయాలు లిగి వున్నవారు ఇటీవలి కాలంలో మనకు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తారు.వారికెందుకీ ఆగ్రహం ? ప్రపంచంలో ప్రతి మతం మహిళల పట్ల వివక్ష చూపుతున్నది. మతాల భాష్యకారులుగా చెప్పుకొనే వారు ఇలాంటి అభిప్రాయాలను మతాల పేరుతో వ్యక్తీకరిస్తున్న కారణంగా మతాలపైనే విమర్శలు చేయాల్సి వస్తున్నది.

     చిత్రం ఏమిటంటే హిందూ మతాన్ని, అది పేర్కొన దేవుడు, దేవతలను తిరస్కరించి నూతన మతాన్ని(తత్వశాస్త్రాన్ని) ముందుకు తెచ్చిన గౌతమ బుద్ధుడిని కూడా హిందూ దేవతల అవతారాలలో ఒకటిగా మార్చివేశారు.అదే కోవలో అసలు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేని ఒక ముస్లిం సూఫీ ఫకీరు సాయిబాబాను కూడా ఒక దేవుడిగా మార్చివేసి, ఆయనకు కూడా విగ్రహాలు పెట్టి పూజలు, పురస్కారాలు చేయటంలో జయప్రదమయ్యారు. ఈ రోజు తిరుమల వెంకటేశ్వరుడి తరువాత ఆదాయం పెద్ద మొత్తంలో తెచ్చే దేవుడిగా షిరిడీ సాయిబాబా మారిపోయారు.అనేక చోట్ల మిగతా దేవుళ్ల కంటే ఎక్కువగా మందిరాలు వెలుస్తున్నాయి.ఒకవైపు సంఘపరివార్‌ శక్తులు హిందూత్వ పునరుద్ధరణ పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న స్ధితిలో సమాంతరంగా ఇటువంటి పరిణామం చోటు చేసుకోవటం నిజంగా మన సమాజ ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. మతోన్మాదం ప్రత్యేక అజెండాగా వున్న శక్తుల మాదిరి సామాన్యజనానికి కూడా ఎక్కి వుంటే ఇలా జరిగి వుండేదా ?

    1830లో ఎక్కడి నుంచి వచ్చారో తెలియని సాయిబాబా 1918వరకు షిరిడీలో జీవించారు.కాలి నడకనే తిరిగి జనం పెట్టింది తిన్నారు.చివరికి మరణించేటపుడు ఒంటిమీది దుస్తులు తప్ప మరేమీ లేకుండా లేకుండా జీవించాడు.ఒక ఫకీరుగా మసీదులోనే కాలం గడిపాడు.

    సంపూర్ణానంద్‌ వంటి ఛాందసులు ఆగ్రహించటానికి షిరిడీ మందిరానికి కుల,మత,స్త్రీ, పురుష లింగబేధం లేకుండా అందరినీ అనుమతించటం కూడా కావచ్చు.షిరిడీ వెళ్లిన వారు పక్కనే వున్న శని శింగనాపూర్‌ వెళ్లి అక్కడ మహిళలకు ప్రవేశం లేదని తెలిసి చాలా మంది నిరాశపడుతుంటారు. షిరిడీ స్ఫూర్తి కూడా శని శింగనాపూర్‌లో తమకెందుకు ప్రవేశం కల్పించరనే ఆందోళనకు మహారాష్ట్ర మహిళలను పురికొల్పి వుండవచ్చు.

    మన దేశంలో సర్వాంగీకార లేదా చారిత్రక సమ్మేళన సంప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షిరిడీ సాయిబాబాకు ఇంతటి ఆదరణ కలగటానికి కారణం ఏమిటి? అతనేమీ ఒక ప్రత్యేక పూజా విధానం లేదా ప్రక్రియ, బోధనల వంటిమేమీ చెప్పలేదు. ఎవరినీ తన వారసుడిగా నియమించలేదు. ఒక సందర్భంలో తాను 15వ శతాబ్ది నాటి కబీర్‌ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. నిజానికి ాసాయిబాబా పుట్టుకతో హిందువో, ముస్లిమో తెలియదు. తన జీవిత కాలంలో భగవద్‌ గీత, ఖురాన్‌లోని అంశాలను చెబుతుండేవారు.అల్లా దేవుడు అంటూనే అందరికీ దేవుడు ఒక్కరే, విశ్వాసం మరియు సహనం గురించి బోధించాడు. తన జీవిత కాలంలో పడుకోవటానికి ఒక పాత దుప్పటి, వేసుకోవటానికి ముతక బట్టలు తప్ప మరొకటి లేని సాయిబాబా నేడు ఏటా వందల కోట్ల ఆదాయం రావటానికి కారకుడయ్యాడు.క్రమంగా ఒక హిందూ దేవుడిగా మార్చివేయ బడ్డాడు.నేడు అన్ని మతాలకు చెందిన వారు సాయిబాబా భక్తులుగా వున్నప్పటికీ అత్యధికులు హిందువులే.ఆయన జీవిత కాలంలోనే ఆయనను హిందూకరణ చేయటం ప్రారంభించారు. మరణానంతరం అది వేగం అందుకుంది. ఇప్పుడు మరింత వూపందుకుంది.

    సాయిబాబా మరణించినపుడు ఆయనకు అంత్య క్రియలు ఏ పద్దతిలో జరపాలన్న వివాదం తలెత్తింది. ముస్లింలు తమ పద్దతిలో అంటే హిందువులు కాదు తమ పద్దతి అని పట్టుబట్టారు. అంతగా హిందూ ముస్లిం బోధనలను సాయిబాబా జనంలో ప్రచారం చేశారు. చివరకు అంత్యక్రియల వివాదం కూడా అసాధారణ రీతిలో రాజీతో ముగిసింది. ఆయన మరణించే నాటికి ఆయన నివశించిన మసీదు సమీపంలోనే ఒక దేవాలయ నిర్మాణం జరిగింది. దానిని ఆయన చేతులతోనే ప్రారంభించాలని అంతకు ముందే నిర్ణయించారు. అది జరగక ముందే మరణించారు. రాజీ మార్గంగా ఆ దేవాలయంలో కృష్ణుడు విగ్రహం సమీపంలో సాయిబాబాను ఖననం చేయాలని ముస్లింలు అంగీకరించారు.ఆయన మరణించిన తరువాత ఆ మందిరాన్ని ఒక దశాబ్దం పాటు ముస్లిం అయిన అబ్దుల్‌ పర్యవేక్షించారు. తరువాత క్రమంగా సాయిబాబాకు పూజలు ప్రారంభమయ్యాయి.నిజానికి ఇదేదో ఒక పధకం ప్రకారమో లేక ప్రయోజనాలకోసమో ప్రారంభమైన ప్రక్రియ కాదు, ఒక ప్రత్యేకతగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. హిందూ, ముస్లిం సూఫీ సంప్రదాయాల మేలు కలయికగా వర్ధిల్లుతున్నది. ముందే చెప్పుకున్నట్లు ప్రతి మతంలోనూ ఛాందసవాదం, వాదులు పెరిగిపోతున్న సమయంలో షిరిడీ సాయిబాబాను పూజించే భక్తులు కూడా అంతకంటే ఎక్కువగా పెరిగారు,పెరుగుతున్నారు. అనేక మంది పుట్టపర్తి సాయిబాబాకు బదులు షిరిడీ సాయిబాబా భక్తులుగా చెప్పుకోవటానికి గర్వపడతారు.మహిళల శని దేవాలయ ప్రవేశం, సాయిబాబాను పూజించటమే మహారాష్ట్రలో కరవుకు కారణం అని నోరుపారవేసుకున్న సంపూర్ణానంద తన వ్యాఖ్యలు అసంపూర్ణంగా వున్నాయను కున్నారేమో, 2013 కేదార్‌నాధ్‌లో వరదలకు కారణం హనీమూన్‌, పిక్నిక్‌లకు జనం రావటమే అని మరోవ్యాఖ్య చేశాడు. ‘ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దేవ భూమి(వుత్తరా ఖండ్‌)లోని వివిధ పుణ్య స్ధలాలకు హనీమూన్‌, వి హార యాత్రలకు వచ్చి అపవిత్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగానే కేదార్‌ నాధ్‌ వరదలు వచ్చాయని, వాటిని ఆపకపోతే అలాంటి వుదంతాలు జరుగుతూనే వుంటాయ’న్నాడు.

    షిరిడీ సాయిబాబాను పూజించటం వల్లనే కరవు వచ్చిందన్న వ్యాఖ్య హాస్యాస్పదం అని షిరిడీ సంస్ధాన్‌ ట్రస్టు మాజీ సభ్యుడుకొరు ఖండించారు.తన దర్శనానికి జనం రాకపోవటంతో స్వరూపానంద అభద్రతా భావంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఏకనాధ్‌ గోండకర్‌ వ్యాఖ్యానించారు. సాయిబాబా తన జీవిత కాలంలో సామరస్యత గురించి ప్రచారం చేశారని, ప్రచారం కోసం స్వరూపానందలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని సాయిబాబా భక్తుడు అదిత్య దామ్లే చెప్పారు..సాయిబాబాను పూజించి నందువలన షిరిడీ ప్రాంతంలో కరువు వస్తే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఎందుకు వచ్చిందని దామ్లే ప్రశ్నించారు.

   రెండు సంవత్సరాల క్రితం సాయిబాబాకు వ్యతిరేకంగా సంపూర్ణానంద విమర్శలు చేయటంతో ఒక సాయిబాబా భక్తుడి ఫిర్యాదు మేరకు ఒక కేసు కూడా నమోదు చేశారు. అనేక చోట్ల సాయి భక్తులు సంపూర్ణానంద్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. కొన్ని చోట్ల వాటికి పోటీ ప్రదర్శనలు కూడా నిర్వహించారు.తన వ్యాఖ్యలను జనం అంగీకరించటం లేదని గ్రహించిన సంపూర్ణానంద తరువాత ఒక ప్రకటన చేస్తూ సాయిబాబా గొప్ప వ్యక్తి అని,ఆయన మానవుడు తప్ప దేవుడు కాదని, గోపురాలు కట్టటం, విగ్రహాలు పెట్టటం ద్వారా ఆయనను అవమానిస్తున్నారని అంటూనే ఎవరైనా ఆయనను పూజించుకోవచ్చు గాని అలాంటి వారు హిందూ దేవాలయాలకు వెళ్ల కూడదని ముక్తాయింపు ఇచ్చాడు.చిత్రం ఏమంటే గుజరాత్‌లోని ద్వారకలో పీఠాధిపతి అయిన సంపూర్ణానంద గత లోక్‌ సభ ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగిన ఒక విలేకరిని ప్రశ్న పూర్తి కాక ముందే చెంపదెబ్బ కొట్టి మాట్లాడవద్దని కోపగించుకున్నాడు.తాను ఒక మతపరమైన సమావేశానికి వచ్చినప్పటికీ పదే పదే నరేంద్రమోడీ గురించి ప్రస్తావించినందున తాను కొట్టానని తరువాత వివరణ ఇచ్చాడు. ప్రధానిగా నరేంద్రమోడీని వ్యతిరేకించటానికి సంపూర్ణానందకు కాంగ్రెస్‌వారితో సంబంధాలు వుండటమే కారణమని బిజెపి వారు చెబుతారు. మొత్తం మీద తమ మద్దతుదారు కాదనో ఏమో గాని శని శింగనాపూర్‌ ఆలయ ప్రవేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తాము సమర్ధించటం లేదని నరేంద్రమోడీ భక్తాగ్రేసరుడు వెంకయ్య నాయుడు ప్రకటించారు.అనేక మహిళా సంఘాలు, ప్రముఖులు ఖండించినప్పటికీ సంపూర్ణానందలో ఎలాంటి మార్పులేదు.

    ఇటీవలి కాలంలో మోడ్రన్‌ బాబాలు, కుర్ర యోగులు, యోగినులకు వున్న అనుచర గణం పీఠాధిపతులకు వుండటం లేదు. అన్నింటికీ మించి ఎవరికి వారే తామే సాధికార భాష్యకారులుగా చెప్పుకుంటున్న స్ధితి. శని సింగనాపూర్‌లో మహిళలకు ప్రవేశ నిషేధంపై బొంబే హైకోర్టు వ్యతిరేక తీర్పు నిచ్చింది. దాంతో అనేక దేవాలయాలు అలాంటి అర్ధం లేని నిషేధాలను ఎత్తివేస్తున్నాయి. రాన్ను రోజులలో ఈ పరిణామం ఇంకా వూపందుకుంటుంది. శబరి మల దేవాలయంలో ప్ర వేశ నిషేధం గురించి ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారిస్తున్నది. ఈ సందర్బంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఛాందస వాదులకు డడ పుడుతున్నది. అక్కడ కూడా నిషేధానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే అది దేశమొత్తం మీద ప్రభావం కలిగిస్తుంది. అలాంటి అన్ని చోట్లా ప్రవేశం కోసం మహిళలు వుద్యమిస్తారు. సంపూర్ణానంద్‌ వంటి శక్తులకు ఈ పరిణామం సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేన్ని సహించాలి? దేన్ని సహించకూడదు ?

28 Monday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

ANTI NATIONAL, BJP, Intolerance, NATIONAL, RSS, Tolerance, what is tolerable

 ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్‌ కూడా సంపాదించండి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు

ఎంకెఆర్‌

    తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ! మళ్లీ అదే, మళ్లీ మళ్లీ అదే !! నిర్మొహమాటంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచాన్ని వూపివేస్తున్న వినిమయదారీ తత్వం నేటి తరాలకు నేర్పుతున్నది అదే. మనకు తెలియకుండానే దీనిలో పడిపోతున్నాం. దీని ఒక లక్షణం ఏమంటే ప్రశ్నించేతత్వాన్ని మొదట అది నాశనం చేస్తుంది. ఇప్పుడు ప్రతి వారి చేతిలో కనిపించే సెల్‌ ఫోన్నే తీసుకుందాం. మనకు అంత వెల వున్న సెల్‌ఫోన్లు అవసరమా అని ఆలోచించేవారెందరు? ఫీచర్లు తక్కువ వున్న సెల్‌ ఫోన్‌ ఎవరి చేతుల్లో అన్నా చూస్తే వారిని పాతకాలం వారనుకుంటున్నామా లేదా ?

    ఇలాంటి స్థితిలో ఏ దేవుడు లేక దయ్యం వలన బుద్ధి పుట్టిందో గానీ కొంత మంది సైద్ధాంతిక యుద్ధానికి తెరలేపారు. యుద్ధం అంటే ముందు బలయ్యేది నిజం. వాస్తవాలు అడుగు దూరం ప్రయాణించేలోపు అవాస్తవాలు వంద అడుగులు వెళ్లి కొత్త రూపంలో మనదగ్గరకే తిరిగి వచ్చి మనలను కూడా అనుమానంలో పడేస్తాయి. మహాభారత, రామాయణాలు మనకు చెప్పినది అదే. అందువలన సైద్ధాంతిక యుద్ధంలోని ఒక పోరులో తాము విజయం సాధించామని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించేశారు. అలా వాదించకపోతే ఆయన ప్రముఖ లాయర్‌ ఎలా అవుతారు. హత్య చేసిన వ్యక్తి తరఫున వాదించటానికే పేరు మోసిన లాయర్లు అవసరం. మా కక్షిదారు ఎలాంటి వాడు అంటే అసలు కత్తి అనేదే తెలియని అమాయకుడు, అలాంటి వ్యక్తి ఆ రోజు అసలు అక్కడ లేడు, ఈ హత్య చేయలేదు అని బల్లచరిచి మరీ వాదిస్తాడు. సైద్దాంతిక పోరులో విజయం సాధించామని ఏకపక్షంగా ప్రకటించుకోవటంలో మతలబు అదే.

     చిత్రం ఏమంటే రెండు సంవత్సరాల క్రితం బిజెపి ప్రకటించిన ఎన్నికల ప్రణాళిక, చేసిన వాగ్దానాలు, ప్రసంగాలలో ఎక్కడా దేశంలో తాము సైద్దాంతిక యుద్ధాన్ని ప్రారంభిస్తామని చెప్పలేదు. నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు పంచుతామని, రైతాంగానికి రెట్టింపు ఆదాయాలు సమకూర్చుతామని, ధరలు తగ్గిస్తామని, అన్నింటికీ మించి మేకిండియా పేరుతో ప్రపంచం మొత్తానికి వస్తువులను ఇక్కడే తయారు చేసి ఇక్కడి నుంచే సరఫరా చేస్తామని, ఆ విధంగా వుద్యోగ కల్పన చేస్తామంటూ ఎన్నోఎన్నో వాగ్దానాలు చేశారు.జౌరంగజేబును ఆదర్శంగా తీసుకొని జనం మీద చెత్తపన్ను వేశారు. అదేం చిత్రమో గాని పన్ను వసూలు చేస్తున్నారు గానీ చెత్తను తీయటం లేదు. వాటి అమలుకు అసలు ప్రయత్నమే లేదు గానీ చెప్పని అంశంలో మాత్రం విజయం సాధించారట !

    మీ పిచ్చిగానీ ఇవన్నీ ఎవరికి పట్టాయి. ముందు మీరు దేశభక్తులో కాదో తేల్చుకోండి, వీలైతే ఒక సర్టిఫికెట్‌ కూడా సంపాదించండి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డున్నా లేకపోయినా దేశభక్తి కార్డు లేకపోతే రోజులు గడిచేట్లు లేవు. ఎందుకొచ్చిన తిప్పలు, రేపు పొద్దున్నే ఎవరైనా వచ్చి ఏ ఇంట్లో ఎంత మంది దేశభక్తులున్నారో వ్యతిరేకులున్నారో లెక్కలు తీసే రోజులు వచ్చాయని ఒక మిత్రుడు చలోక్తి విసిరాడు.

      మా పక్కింటి పెద్దాయన కూడా రోజులు బాగాలేవు సార్‌, సర్దుకు పోవాలి అన్నాడు. అదేంటి సార్‌ మరి ఆటు, పోట్లను ఎదుర్కొని నిలవటమే జీవితం అని కదా పెద్దలు చెప్పారు? ఆటు పోట్లను ఎదుర్కోవటం అంటే సాధారణ అర్ధంలో కష్ట సుఖాలు అని, అలాగాక నిజమైన అర్ధం ప్రకారం వాటికి ఎదురు నిలవమని కాదు. ఎవరైనా అలా నిలబడితే సముద్రం మింగేస్తుంది. ఆటు, పోట్లు వచ్చినపుడు వెనక్కి వంగి తప్పించుకోవాలి తప్ప ఎదురు నిలబడి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోమని కాదు అన్నారు.(పోటు అంటే సముద్రం మీద నుంచి లేచే అలలు తీరానికి రావటం, ఆటు అంటే తీరానికి వచ్చిన అలలు తిరిగి సముద్రంలోకి పోవటం, కొన్ని సందర్భాలలో అవి చాలా తీవ్రంగా వుంటాయి. వాటికి ఎదురు నిలబడితే ప్రాణాలకే ముప్పు)

     ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రంగాలలో ఎలాంటి సైద్ధాంతిక, మేథో,విద్యాపరమైన చర్చలు మృగ్యమైన కారణంగా ప్రతి ఒక్కరూ బి పాజిటివ్‌ అన్నట్లుగా వుంటున్నారు. ఏదైనా ఒక విషయంపై ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా, విమర్శనాత్మకంగా చెప్పినా, చెప్పేందుకు ప్రయత్నించినా మీ రెందుకు ప్రతిదానికీ బస్తీమే సవాల్‌ అంటారు, కావాలంటే మీ అభిప్రాయాలు మీరు వుంచుకోండి, మాకు చెప్పండి, భరించక తప్పదు కదా, ఇతరులు ఏది నమ్మితే మీకెందుకు, వారిష్టం వచ్చినట్లు వారుంటే మనకు నష్టమేమిటి ? అని కుటుంబ సభ్యులే వెనక్కు లాగుతారు. ఇంకా కొందరు మనకెందుకులే దుష్టుడికి దూరంగా వుండాలన్నట్లు వినీ వినట్లు తప్పించుకుంటారు.

      అంటే దీని అర్ధం ఏమిటీ ఎక్కడ ఏం జరిగినా, ఎవరేం చెప్పినా మనం ఆలోచించకూడదు, బుర్రకు పని పెట్ట కూడదు, దేనినీ పట్టించుకోకూడదు, మన అభిప్రాయాలు వెల్లడించకూడదు, మనం అసలు మాట్లాడ కూడదు, ఏదైనా వుంటే మనలోనే అణచివేసుకోవాలి. అప్పుడే అంతా మనతో బాగుంటారు, మనమూ బాగుంటాము. ప్రతిదానికీ ఇతరులతో దెబ్బలాటలకు దిగటం ఎందుకు ? కానీ గత చరిత్ర అంతా అలా లేదే. పోరాటాల మయం ! ముందుకే మున్ముందుకే !! కౌరవులు దుష్టులు మన కెందుకులే వారి పాపాన వారు పోతారులే అని కృష్ణుడు వూరుకుంటే బకుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, కంసుడు మొదలైన వారందరిదీ పై చేయి వుండేది. ప్రపంచంలో తనకు ఎదురు లేదు అని విర్రవీగిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు అడ్డగించకపోతే, ఫాసిస్టు హిట్లర్‌ను కమ్యూనిస్టు స్టాలిన్‌ అడ్డుకొని వుండకపోతే ప్రపంచ పరిణామాలు ఎలా వుండేవి? చచ్చిన చేప వరదలో కొట్టుకుపోతుంది. బతికి వున్న చేప ఎదురు ఈదుతుంది. మనం ఎవరిగా వుండాలి?

    మహాభారతంలో సహనం, సంయమనం గురించి ఎన్నో పాఠాలు వున్నాయి.కంసుడి వంద తప్పుల వరకు కృష్డుడు సహించి సంయమనం పాటించాడు. అందువలన దేన్ని సహించాలి,దేన్ని సహించకూడదు అని ఈ రోజు మనం కొత్తగా ఆలోచించనవసరం లేదు. చరిత్రే మనకు నేర్పింది. పులి మనుషులకు హాని చేయనంతవరకు దాని మానాన దాన్ని అరణ్యంలో తిరగనివ్వాలి. అది జనారణ్యంలోకి వస్తే బోనులో బంధించి తిరిగి అడవిలో వదలి వేయాలి. అదే అదుపు తప్పితే ఏం చేయాలో చెప్పనవసరం లేదు.

    మీరు ప్రజల నమ్మకాలను గౌరవించాలి అంటారు. నిజమే ! భక్తితో అగ్ని గుండం మీద నుంచి నడిస్తే ఏమి కాదు అన్నది ఒక నమ్మకం. అది హిందువులు, ముస్లింలలోనూ వున్న ఒక మూఢనమ్మకం అని చెప్పేందుకు హేతువాదులకు హక్కు వుందా లేదా? అలాగాక మా విశ్వాసాన్ని, మనో భావాలను దెబ్బతీస్తున్నారని ఎవరైనా దెబ్బలాటలకు వస్తే సహించాలా ? ఎదుటివారి అభిప్రాయాలను విను, సబబనిపిస్తే అంగీకరించు లేకుంటే అనుభవించు అని ముగించటం తప్ప చేసేదేముంది? హేతువాదుల మాటలను ఖాతరు చేయకుండా గతేడాది కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఒక కాళికాంబ ఆలయం దగ్గర బసవన నడక పేరుతో అగ్ని గుండంలో నడిచిన ఒక పూజారి గుండంలో పడిపోయి ఆరు రోజుల తరువాత దుర్మరణం చెందాడు. అందువలన మరొకరు అలాంటి పని చేస్తే వద్దని వారించకుండా వుండాలా, పోతే పోతాడు లెమ్మని చూస్తూ వూరుకోవాలా, పశువులకూ మనకూ తేడా ఏముంటుంది? అయితే వారికి ఎలా చెప్పాలి. చాలా మంది అలా నడుస్తున్నారు కదా వారికెందుకు ప్రాణాల మీదకు రాలేదు అనే వారిని ఒకరికైనా ఎందుకు వచ్చిందో, విశ్వాసం ఎందుకు కాపాడలేకపోయిందో చెప్పమనాలి.

    ఎవరైనా అలాంటి మూఢనమ్మకాలు కలిగి వుంటే బాబూ మంచిది కాదు అని చెప్పాలి. కాదు నా యిష్టం అంటే , నీ మనోభావాలను ఎందుకు దెబ్బ తీయాలి, ఎలాంటి అభిప్రాయాలు కలిగి వుండాలన్నది నీ హక్కు అంటూ దానిని గౌరవించటం తప్ప మరొక పద్దతి లేదు.వాటిని ఇతరులకు శాంతియుత పద్దతుల్లో వెల్లడించటాన్ని కూడా మనం గౌరవించాలి, సహించాలి.

    కానీ నీకు దేవుడి మీద నమ్మకం లేదు, మన కాలనీలో నువ్వుండటం వల్లనే ఈ ఏడాది వర్షాలు పడలేదు, నువ్వు మంచోడివి కాదు అనే ఎదుటి వారి నమ్మకాన్ని గౌరవించాలా ? వారి అభిప్రాయాన్ని వారిని వ్యక్తం చేయనివ్వండి, నష్టం లేదు, దానితో అంగీకరించాల్సిన అవసరం లేదు. సమాజంలో కొంత మంది చేత బడి చేస్తున్నారనే ఒక మూఢనమ్మకం వుంది. దానికి విరుగుడు పేరుతో లెక్కలేనన్ని పూజలు కూడా వున్నాయిగా నమ్మకం వున్న వారిని చేయించుకోనివ్వండి, డబ్బులు వదిలించుకోనివ్వండి. కానీ చేతబడి చేస్తున్నారనే పేరుతో ఎవరిమీదైనా దాడులు చేస్తే, చంపటానికి ప్రయత్నిస్తే సహించకూడదు. ఇలాంటి దాడులకు గురవుతున్నవారెరు. ఎక్కువ మంది దళితులు, ఇతర బలహీన వర్గాల వారే. నిజానికి వారికి అలాంటి శక్తులే గనుక వుంటే వారిపై దాడులు, అత్యాచారాలకు పాల్పతున్నవారిని ఎప్పుడో రిమోట్‌ కంట్రోలు మాదిరి తమ గుడిసెల్లో వుండే మట్టుబెట్టి వుండేవారు.

    కానీ వాస్తవానికి డబ్బున్నవారు, ధనికులు, డబ్బు లేక పోతే లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ బాబాలు, చేతులు, కాళ్లు చూసే జ్యోతిష్కుల వంటి రకరకాల వ్యక్తుల చేత క్షుద్రపూజలు, హోమాలు చేయిస్తున్నారా లేదా ? చేతబడికి, వాటికీ తేడా ఏమిటి? చేతబడి అంటే భయపడతారు, హోమం, పూజలు అంటే చేతులు కట్టుకు ప్రణమిల్లుతారు. మరి అలాంటి వాటిని గౌరవించాలా? అవసరం లేదు. అయితే అవి చేసే వారితో తగాదా తెచ్చుకోనవసరం లేదు.

    సహనం, అసహనం, దేశభక్తి, దేశ ద్రోహి, మాత, పిత వంటి అంశాలు సమాజంలో ఎప్పటి నుంచో వున్నాయి. అవి ఎప్పుడు వెలుగులోకి వస్తాయంటే ఏదైనా ఒక పరిణామం సంభవించినపుడు దాని స్వభావాన్ని బట్టి ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. వుదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ , అది 1925లోనే ఒక స్వచ్చంద సంస్ధగా ఏర్పడింది. అయితే దానిలో ఒకప్పుడు సభ్యుడిగా వున్న గాడ్సే 1948 జనవరి 30న మహాత్మా గాంధీని హత్య చేసినపుడే దాని భావజాలమేమిటో దేశానికి తెలిసింది. తరువాత సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం దానిపై విధించిన నిషేధాన్ని తొలగించారు. అప్పుడు సుప్రీంకోర్టు విధించిన షరతు ప్రకారం దేశ రాజ్యాంగానికి బద్దులమై వుంటామని, త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా గౌరవిస్తామని రాతపూర్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ విధేయత పత్రాన్ని అందచేయాలి.ఈ విషయాలను బహిరంగంగా ప్రకటించాలి.ఆ మేరకు 1949 ఏప్రిల్‌ 11న నాటి అధిపతిగా వున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ఒక ముసాయిదా ఆర్‌ఎస్‌ఎస్‌ నిబంధనావళిని కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు. దానిని పరిశీలించి అంగీకరిస్తూ అదే ఏడాది జూలై 11న నిషేధాన్ని ఎత్తివేశారు.అంటే స్వాతంత్య్రం వచ్చిన రెండు సంవత్సరాల వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్రం లేదు, రాజ్యాంగం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవం లేదు, ఇవేవీ లేకపోయిన తరువాత వారి దేశభక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. దేశంలో అనేక సాంస్కృతిక సంస్ధలున్నాయి. ఏది కూడా ఇలా రాజకీయాలు చేయలేదు. పోనీ స్వాతంత్య్రానికి ముందు తమది స్వచ్చంద సంస్ధ అని చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణ పతాకం బదులు కాషాయ పతాకాన్ని జాతీయ జండాగా ఆమోదించాలని తన పత్రిక ఆర్గనైజర్‌లో 1947 జూలై 17న రాసింది. అదే నెల 22న రాజ్యాంగ పరిషత్‌ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. తరువాత స్వాతంత్య్రానికి ఒక రోజు ముందు ఆగస్టు 14 ఆగస్టు సంచికలో ఆర్గనైజర్‌ జాతీయ జెండా గురించి విషం కక్కింది. కాషాయ పతాకం వెనుక రహస్యం అనేపేరుతో రాసిన వ్యాసంలో ‘ ప్రారబ్దం కొద్దీ అధికారానికి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టి వుండవచ్చు, కానీ దానిని హిందువులెవ్వరూ గౌరవించరు, స్వంతం చేసుకోరు. మూడు అంటేనే కీడు, మూడు రంగులు కలిగిన ఒక జెండా అనివార్యంగా దేశంపై మానసికంగా తీవ్రమైన చెడు ప్రభావాన్ని , వుపద్రవాన్ని కలిగిస్తుంది.’ అని పేర్కొన్నది. పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ రోజైన 1947 ఆగస్టు 14న, 1950 జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌లోని తన ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. తరువాత నిలిపివేసింది. 2001లో రాష్ట్రప్రేమీ యువదళ్‌ పేరుతో వున్న ఒక సంస్ధకు చెందిన బాబా మెంధే, రమేష్‌ కుమార్‌ కాలంబే, దిలీప్‌ చట్టానీ అనే వారు రిపబ్లిక్‌ దినోత్సవం రోజున నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద బలవంతంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు, పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన తరువాత 2013లో విడుదలయ్యారు.ఆ వుదంతం తరువాత 2002 నుంచి అంటే స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాల తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ తొలిసారి తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.రాజ్యాంగం, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని రాతపూర్వంగా రాసి ఇచ్చిన సంస్ధ దేశభక్తి ఇది.

     ఇలాంటి వారు ఇప్పుడు రాజ్యాంగంలో లేని భారత మాతాకు జై అంటేనే దేశ భక్తి అని అనని వారు వారు దేశద్రోహులు అని చిత్రిస్తున్నారు. దాన్నొక సైద్ధాంతిక యుద్ధంగా వర్ణించి దానిలో తాము తొలి విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. చరిత్ర పట్ల, జనం జ్ఞాపక శక్తి పట్ల ఎంత చిన్న చూపు.వుల్లికి మల్లికి తేడా తెలియనంత అమాయకంగా జనం వున్నారనుకుంటున్నారా ? మల్లె తోటలో నాటి నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేనికీ ‘అసహనం’, ఎందుకా ‘సహనం ‘ ఓ మహాత్మా ! ఓ మహర్షీ !!

13 Saturday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

Intolerance, Reservations, Tolerance

 

ఎం కోటేశ్వరరావు

     ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో రిజర్వేషన్లు,సామాజిక వివక్షపై జరుగుతున్న చర్చలలో రెండు రకాల ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. భాష, భావం తీరుతెన్నులు చూస్తే వుభయులూ తీవ్ర స్ధాయిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒకటి వేల సంవత్సరాల అణచివేత, అమానుష వివక్షపై ఎందుకీ సహనం అన్న ఆగ్రహంతో కూడిన జ్వాల. రెండవది దీనికి బాధ్యత తమది కానపుడు దాని పర్యవసానాలను తామెందుకు అనుభవించాలన్న ఆక్రోశం, దాని నుంచే దళితులు, గిరిజనులు, ఓబిసిలకు రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగిస్తారు అనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. పుట్టుక అన్నది యాదృచ్చికం. కానీ ఒక చోట పుట్టిన వారికి ఒక ముద్రవేసి ఒక విధంగానూ, మరొక చోట పుట్టిన వారికి మరో తోక తగిలించి వేరే విధంగా చూడటం అన్నది కాదనలేని వాస్తవం. రిజర్వేషన్ల వయస్సు ఏడు పదులు, మరి అమానుష వివక్ష, అణచివేత ఎంత కాలం నుంచి కొనసాగుతోంది, ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, చెప్పేవారెవరు ?

      రిజర్వేషన్ల గురించి రానున్న రోజుల్లో మరోసారి తీవ్ర చర్చకు తెరలేవ నుంది.ప్రయివేటు రంగంలో కూడా వుద్యోగాలలో రిజర్వేషన్‌ విధానాలను పాటించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సిబిసి) కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగంలో వున్న రిజర్వేషన్లనే తొలగించాలని తాము కోరుతుంటే ప్రయివేటు రంగంలో కూడా అమలు జరపాలని సిఫారసు చేయటం ఏమిటని రిజర్వేషన్‌ వ్యతిరేకులు మండిపడుతున్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల కారణంగా అప్పటి నుంచి క్రమంగా ప్రభుత్వరంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. అటు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ కొత్త పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. హెచ్‌ఎంటి, ఐడిపిఎల్‌ , భెల్‌ వంటి కొన్నింటిని ఒక పధకం ప్రకారం మూతపడేట్లు చేశారు. అవి పోగా వున్నవాటిలో యాంత్రీకరణ, పాక్షిక ప్రయివేటీకరణ వంటి చర్యల ద్వారా 2006 -12 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో 3.3శాతం వుద్యోగాలు తగ్గిపోగా, ఇదే సమయంలో ప్రయివేటు రంగంలో 35.7శాతం పెరిగాయి. ప్రయివేటు రంగం అందరికీ గౌరవ ప్రదమైన జీవనానికి వుపాధి కల్పించి వుంటే అసలు ఈ రిజర్వేషన్ల అనుకూలం లేదా వ్యతిరేకత సమస్య తలెత్తి వుండేది కాదు. ఈనేపధ్యంలోనే ఈ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే ఎన్‌సిబిసి సిఫారసు వెలువడింది. ఇప్పటికే ఈ డిమాండ్‌పై పలు చోట్ల ప్రచార ఆందోళన చేపట్టిన వామపక్షాలు, అవి పనిచేసే ప్రజాసంఘాలు సహజంగానే ఈ పరిణా న్ని హర్షిస్తాయి. తమ వుద్యమాలను మరో మెట్టు ముందుకు తీసుకుపోతాయి.

     ప్రస్తుతం అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారస్‌ను తిరస్కరిస్తుందా? ఆమోదిస్తుందా? ఆమోదిసే,్త అమలు జరుపుతుందా? ఎప్పటి నుంచి? ఎంత కాలం అమలు జరుపుతుంది వంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఇవన్నీ చర్చకు తెరలేపుతాయి. బిజెపి, కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నాడిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలన్నీ పాలకవర్గ పార్టీలే. అధికారంలో లేనపుడు సామాన్య జనం పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే వారిని మర్చిపోయి పెట్టుబడిదారులు, భూస్వాముల సేవలో తరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడే వారిని పాలకవర్గ పార్టీలు అంటారు.మిగతావాటిలో సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు కొన్ని సందర్బాలలో అక్కడక్కడా అధికారానికి వచ్చినప్పటికీ వాటిని పాలకవర్గ పార్టీలుగా పరిగణించటం లేదు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో డెమోక్రటిక్‌, లేబర్‌, సోషలిస్టు పార్టీల పేరుతో వున్నవి కూడా ప్రతిపక్షంలో వుండగా ఏమి చెప్పినా సామాజికాంశాలలో తరతమ తేడాలు తప్ప ఆర్ధిక విషయాలలో మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోవు కనుక వాటిని కూడా పాలకవర్గ పార్టీలే అంటున్నారు.

       ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎన్‌సిబిసి సిఫార్సును బిజెపి స్వాగతించింది. అయితే సాధ్వీ సావిత్రీ అదియును నీ పతిప్రాణంబు దక్క అని యముడు షరతు పెట్టినట్లు ఒక చిన్న మెలిక పెట్టింది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపటానికి అనువైన పరిస్ధితులు వచ్చినపుడు మాత్రమే అమలు జరపాలి తప్ప బలవంతంగా చేయకూడదు అని బిజెపి ప్రతినిధి విజయ్‌ సోంకార్‌ శాస్త్రి ముక్తాయింపు ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఏ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదని కూడా విమర్శించారు. అమలుకు అనుకూలమైన పరిస్ధితులంటే ఏమిటో, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేదు. ప్రతి పక్ష కాంగ్రెస్‌ కూడా స్పందించింది.’ ఎల్లవేళలా సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు తాము చర్యలు తీసుకున్నామని,అందుకోసం ఎస్‌సి,ఎస్‌టి మరియు ఓబిసిల రిజర్వేషన్లు అమలు జరిపేందుకు తాము చట్టాలు తెచ్చామని, ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల గురించి తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామని కాంగ్రెస్‌ గుర్తు చేసింది.

       ఈ సమస్యపై ప్రతిపక్షాలు దెబ్బలాటలకు కవ్వించే అవకాశం వున్నందున బిజెపి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ మేథావులు అప్పుడే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.ఈ సవాలును తేలికగా తీసుకోవద్దంటూ రిజర్వేషన్ల ఫలాలు దిగువకు సక్రమంగా అందాల్సిన వారికి అందనందున వాటిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగత్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లించించిందని వారు గుర్తుకు తెచ్చారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 16లో ప్రభుత్వరంగంలో రిజర్వేషన్ల గురించి మాత్రమే వుందని ప్రయివేటు రంగం గురించి ఏ కోశానా ప్రస్తావన లేదని, అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పని చేయవచ్చని, దీని వలన తాత్కాలికంగా బిజెపి రాజకీయ ప్రయోజనం పొందినప్పటికీ మండల్‌ తరహా ఘర్షణలు చోటు చేసుకోవచ్చని, ఓబిసిల తరువాత మతపరమైన మైనారిటీలు కూడా తమకూ అమలు జరపాలని కోరతారని, ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో నష్టం కలిగిస్తుందని కాషాయ మేథావులు హెచ్చరిస్తున్నారు. యుపిఏ-2 హయాంలో పారిశ్రామికవేత్తలు బయటి దేశాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇవ్వటంతో పెట్టుబడులు బయటకు పోయాయని, ఇప్పుడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే మేథావులు కూడా వలస పోతారని బెదిరిస్తున్నారు. సామాజికంగా వెనుక బడిన తరగతుల వారికి కావాలంటే వుచిత విద్య, విద్యా రుణాల సౌకర్యం వంటివి కలిగించాలని ఎంతో వుదారంగా సలహాలు ఇస్తున్నారు.

     ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వుద్రేకాలను తగ్గించుకొని ఆలోచించటం అవసరం. సమాజంలోని మెజారిటీ ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి సామాజిక తరగతుల శ్రమ స్వేదంతో సృష్టించబడేదే సంపద. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రమలో ఏ మాత్రం పాత్రలేని కొన్ని సామాజిక తరగతులు వునికిలో వుండటం మన సమాజ ప్రత్యేకత. దానికి కూడా తమకు అనుకూలమైన నియమనిబంధనలను రూపొందించారు. సామాజిక పరిణామ క్రమంలో వివిధ రూపాలలో అధికారిక వ్యవస్ధలు వునికిలోకి వచ్చాయి.అవి సమాజ పురోభివృకి ఆటంకంగా మారినపుడు వాటిని తొలగించి మెరుగైన కొత్త వ్యవస్ధలను ఏర్పాటు చేసుకుంది సమాజం. భూస్వామిక వ్యవస్ధ తమకు ఆటంకం అని భావించినపుడు ఐరోపా దేశాలలో పెట్టుబడిదారులు ఆ భూస్వామిక వ్యవస్ధను నామరూపాలు లేకుండా నాశనం చేశారు. ఫ్రెంచి విప్లవం అంటే అదే. అటువంటిది మన మన దేశంలో జరగలేదు. బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించి తమకు అవసరమైన కొన్ని పరిశ్ర మలను ప్రోత్సహించారు తప్ప మన దేశాన్ని తమకు అవసరమైన ముడిసరకులను అందచేసే దేశంగానే వుంచారు. అందుకే భూస్వాములతో రాజీపడి వారిని కూడా కొనసాగించారు. ఈ కారణంగానే ప్రస్తుతం మన దేశంలో పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వాములు కూడా అధికార వ్యవస్ధలో పెత్తనం సాగిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్ధితి ప్రపంచంలో మరోచోట కనపడదు.అందువలననే మన సమాజంలో కూడా భూస్వామిక, పెట్టుబడిదారీ లక్షణాలు రెండూ జంటగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రభావంతో కొన్ని అంశాలో పురోగామి వైఖరిని ప్రదర్శించేవారు మరికొన్ని విషయాలలో తిరోగామి భావజాలానికి లొంగిపోతున్నారు. సామాజిక వివక్ష చట్ట ప్రకారం నేరం అని అంగీకరిస్తూనే తమదాకా వచ్చేసరికి సాంప్రదాయం, ఎప్పటి నుంచో వుంది, ఆ మనోభావాలను కూడా మనం అంగీకరించాలి కదా అనే వాదనలతో చట్ట వ్యతిరేకమైన తాతగారి నాన్నగారి భావాలను ముందుకు పెడుతున్నారు. అది సమాజంలో ఘర్షణకు దారితీస్తోంది.

     ప్రయివేటు రంగ రిజర్వేషన్ల విషయంలో కూడా దీన్ని చూడవచ్చు. ప్రయివేటు రంగంలో ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలన్నా చేయాల్సింది ఎవరు ? ప్రభుత్వమే. పెట్టుబడి ఇవ్వాల్సింది ఎవరు ప్రభుత్వరంగంలోని బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలే. అంటే ప్రయివేటు రంగం గాలిపీల్చి మనుగడ సాగించాలంటే ప్రభుత్వం లేకుండా ఒక్క క్షణం నడవదు. ప్రభుత్వమంటే ప్రజలు తప్ప మరొకటి కాదు. అందువలన ప్రభుత్వ రంగం పాటిస్తున్న విధానాలను ప్రయివేటు రంగం అమలు జరపాలని కోరటం ప్రజల హక్కు తప్ప దయాదాక్షిణ్యం కాదు. ఎవరైనా తమకు అందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తమ స్వంత పెట్టుబడులు, విద్యుత్‌, నీరు, భూమి, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను స్వంతంగా సమకూర్చుకోమనండి. అది సాధ్యం కాదు కనుకనే 2004 నవంబరు 18న దేశంలోని 218 అగ్రశ్రేణి సంస్ధలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సాధికారత కలిగించేందుకు మనసా వాచా కర్మణా తాము చేయాల్సిందంతా చేస్తామని రాతపూర్వంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివేదించాయి. అంటే అర్ధం ఏమిటి స్వచ్చందంగా ఆ తరగతుల వారికి తగు స్ధానం కల్పిస్తామని చెప్పటమే కదా? ఆ వాగ్దానాన్ని ఎన్ని సంస్ధలు ఎంత మేరకు అమలు జరిపాయి? రాజ్యాంగంలో హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాల పేరుతో అనేక పురోగామి భావాలను అమలు జరపాలని చెప్పారు. కానీ వాటిని హక్కుగా అమలు జరిపే పరిస్ధితి ఇంకా మనకు రాలేదనే పేరుతో మన పాలకులు ఎగవేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటా ఐదారు లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తున్న ప్రభుత్వాలు స్కూళ్లలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు కట్టించాలంటే డబ్బు లేదంటూ ఇంతకాలం వాయిదా వేశాయా లేదా ? కనుకనే ప్రయివేటు రంగంలో వుద్యోగాల రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.

     రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు జరపాల్సింది పది సంవత్సరాలే కదా, అయినా డెబ్బయి సంవత్సరాలుగా అమలు జరుపుతున్నారు, ఇంకా ఎంతకాలం ఇలా అని అనేక మంది ‘అసహనం’ వ్యక్తం చేస్తున్నారు. నిజమే దానిని అర్ధం చేసుకోవాల్సిందే, మనది ప్రజాస్వామ్యం కనుక ఆ భావాల వ్యక్తీకరణను ‘సహించాల్సిందే’, ఎలాంటి మినహాయింపులు లేవు. ఎలాంటి చట్టాలు లేకుండానే వేల సంవత్సరాల పాటు కుల వివక్ష, అణచివేతను సమాజం అమలు జరిపింది. చట్టబద్దంగా రద్దు చేసిన తరువాత కూడా అమలు జరిపేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. దళితులు దేవాలయ ప్రవేశ ం చేస్తే అవి మలిన పడ్డాయనే పేరుతో శుద్ధి చేయటం నేరం. దానికి ఎవరినైనా ఇంతవరకు శిక్షించారా ? వివక్షను ఇంకా రూపు మాపలేదెందుకన్న ‘అసహనం’ ఎందుకు వ్యక్తం చేయరు? అసలు రిజర్వేషన్లకు మూలం ఆ సామాజిక వివక్షే కదా ? దాన్ని నిర్మూలించకుండా దాని పర్యవసానాలను వ్యతిరేకించటం, అసహనం వ్యక్తం చేస్తే ప్రయోజనం వుంటుందా ?

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఆరువందల సంవత్సరాల నాడే వేమనతో ప్రారంభించి అంబేద్కర్‌ వరకు ఎందరో సంస్కర్తలు తమ పరిధులు, పద్దతులలో వాటిని నిరసించి వ్యతిరేకించారే మరి సమాజం మొత్తంగా దానిని ఎందుకు నిరసించటంలేదు? ఎక్కడైనా వ్యతిరేకిస్తే సామూహిక దాడులకు పాల్పడటాన్ని ఏమనాలి? ఎక్కడో దక్షిణాఫ్రికాలో, అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్షను ఖండించే మనం మన చుట్టుపక్కల మానవత్వానికే మాయని మచ్చగా వున్న వివక్ష పట్ల ఎక్కడలేని ‘సహనం ‘ ఎందుకు వహిస్తున్నట్లు? ఆ వివక్షను ఎదుర్కొనే వారి ఆక్రోశానికి ఎవరు సమాధానం చెబుతారు ?

     ఏదేశంలోనూ లేని రిజర్వేషన్లు మన దేశంలోనే ఎందుకు అని ప్రశ్నించే వారు ఎక్కడా లేని వివక్ష, కుల వ్యవస్ధ ఇక్కడ ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదా ? అదంతా పూర్వజన్మ సుకృతం ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాలి అని చెబుతారా ? అయితే రిజర్వేషన్లు కూడా అలాంటివే అనుకోవాలి. వేదాలలోనే విజ్ఞానం అంతా నిక్షిప్తమై వుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తిరోగమన శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేయటంతో ఇటీవలి కాలంలో మరోసారి చెప్పటం ఎక్కువైంది. అదెంత నిజమో ? వాస్తవాలేమిటో కాసేపు పక్కన పెడదాం. ఆ వేదాలను బ్రహ్మ ముఖంలోంచి పుట్టుకు వచ్చారని చెప్పుకొనే బ్రాహ్మణులు మాత్రమే చదవాలని,చెప్పాలన్న రిజర్వేషన్లు అవి పుట్టినప్పటి నుంచి కొనసాగుతున్నాయి కదా ? బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వారు చదవకూడదన్న నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నదా లేదా ? వేదాలు, పురాణాలలో చెప్పినట్లు బ్రాహ్మణులు తిరిపెమొత్తుకుని తినాలి తప్ప వుద్యోగాలు చేయకూడదనే నిషేధాలు ఇప్పుడు లేవే ? రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికగా దామాషా పద్దతి ప్రకారం అమలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదే. వేద పఠనంపై కొనసాగిన రిజర్వేషన్లతో పోల్చితే నేటి వుద్యోగ, విద్యా రిజర్వేషన్ల వ్యవధి ఎంత ? అన్నింటినీ మన ఖర్మ అనుకొని సహిస్తున్నవారు రిజర్వేషన్ల విషయంలో కూడా అలా అనుకోకుండా వ్యతిరేకంగా వీధులకు ఎందుకు ఎక్కుతున్నట్లు ? హింసాకాండకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?

    సామాజిక అంశాలలో కొనసాగుతున్న వివక్ష గురించి ఎక్కడలేని ‘సహనం’ వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లపై వెల్లడిస్తున్న వ్యతిరేకత, ఇతర సామాజిక వివక్షపై వ్యక్తం చేయటం లేదంటే అర్ధం దాన్ని సహిస్తున్నట్లే. సమాజంలో ఈ వైఖరి కొనసాగినంత కాలం ఏదో ఒక రూపంలో దాని పర్యవసానాలు సంభవిస్తూనే వుంటాయి. రిజర్వేషన్లు కొనసాగుతూనే వుంటాయి. అయితే రిజర్వేషన్లే అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు ఆశించిన మేలు చేకూర్చలేవని కూడా ఈ కాలంలో రుజువైంది. అందువలన పరిమితంగా వున్న అవకాశాలను చేజిక్కించుకొనేందుకు కొట్లాడుకోవటం కాకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం లేదా ? ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నీకు తగిన చెప్పులు వేసుకో, నీ చెప్పులు వేసుకోమని నన్ను వత్తిడి చేయకు !

01 Tuesday Dec 2015

Posted by raomk in Current Affairs, NATIONAL NEWS, Opinion, Religious Intolarence

≈ Leave a comment

Tags

BLF, Intolerance, vikram sampath

ఎం కోటేశ్వరరావు

అసహన వివాదం సద్దుమణిగింది. కొత్తగా ఎక్కడా దాడులు జరగలేదు. జనం పిఆర్‌సి గురించి చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో సినీ హీరో అమీర్‌ఖాన్‌ అసహనం గురించి లేవనెత్తటం ఏమిటంటూ కొందరు ‘పెద్దలు’ తమ అసహనాన్ని వ్యక్త పరిచారు. ఇప్పుడు బెంగలూరు సాహిత్య పండగ సారధి విక్రమ్‌ సంపత్‌ తన అభిప్రాయాలను తాను చెప్పుకుంటే మతవాది, మరొకటి అంటూ ముద్రలు వేస్తూ తనపై అసహనం వ ్యక్తం చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు. విమర్శలను సహించాలంటూనే , వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకున్నారంటూ తనను విమర్శించిన వారిపై అసహనం వ్యక్తం చేస్తూ డిసెంబరు 5,6 తేదీలలో జరిగే సాహిత్య పండగ బాధ్యతల నుంచి వైదొలగి మరోసారి అసహనంపై చర్చకు తెరతీశాడు. అమీర్‌ఖాన్‌కు ఎందరో ప్రముఖులు బాసటగా నిలిచినట్లే సంపత్‌కు సైతం కొందరు మద్దతుగా ఆయన వెనుక నిలిచారు. అమీర్‌ఖాన్‌కు మద్దతుగా నిలిచిన వారిని కూడా విమర్శించిన వారు మరి ఇప్పుడేమంటారో ?

కొందరి దృష్టిలో వేలాది మందితో రాసక్రీడలు విశృంఖలత్వం, అదే మరికొందరి దృష్టిలో లొట్టలు వేసుకుంటూ ఆస్వాదించే భగవంతుడి లీల. ఒక నాడు ఒక భార్య, ఒక మాట, ఒక బాట నీతి, మరొక నాడు అష్టభార్యలు, వేలాది మందితో సరసాలు, ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తన మద్దతుదార్లను రక్షించుకోవటమే నీతి, రీతి. అసహనం లేదా సహనం అనేది కూడా అలాంటిదే. తాను మాత్రమే చెప్పేది వింటే ఎదుటి వాడికి సహనం వున్నట్లు, దానిలోని హేతువు, ఇతర అంశాలను ప్రశ్నిస్తే అసహన పరుడు. తన మనో భావాలను గాయపరిచాడంటూ దెబ్బలాటలకు దిగుతున్నారు. ఏకంగా చంపేస్తున్నారు. గతంలో వాద ప్రతివాదనలు,ఖండనలకు పరిమితమయ్యేవారు. వాటిలో విఫలమై ఇప్పుడు ఏకంగా హతమార్చేందుకు సంచార ముఠాలు తిరుగుతున్నాయి. వాటికి అధికారంలో వున్న వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇవ్వటమే కొత్త పరిణామం. నియంతల పాలనా కాలంలో లాటిన్‌ అమెరికాలోని దేశాలలో తమను వ్యతిరేకించిన వారిని, విమర్శించిన వారిని రహస్య హంతక దళాలు వేలాది మందిని మాయం చేశాయి. దశాబ్దాల తరబడి వారంతా అదృశ్యమైన వారి జాబితాలోనే వున్నారు తప్ప నిజానికి హత్యలకు గురయ్యారు. ఈ విషయాలను కమ్యూనిస్టులు చెప్పినపుడు అ వారలాగే చెబుతారులే అంటూ అనేక మంది పెద్దలు పెదవి విరిచారు. కనీసం విచారణకు డిమాండ్‌కూడా చేయలేదు. చిలీ నియంతలను వ్యతిరేకించిన కవి పాబ్లో నెరూడాను సైతం హత్య చేసినట్లు నాలుగు దశాబ్దాల తరువాత జరుగుతున్న విచారణలో వెల్లడవుతోంది. నరేంద్ర దబోల్కర్‌ను హత్య చేసినపుడు పెద్దగా అనుమానాలు రాలేదు, గోవింద పన్సారేను చంపినపుడు సందేహం వచ్చింది. కలుబర్గి హత్యతో నిర్ధారణ అయింది. అందుకే అంతటి ప్రతి స్పందన వచ్చింది. హత్యలతో బెదిరించి నోరు మూయించవచ్చని భావించిన వారు అది సాధ్యం కాదని తేలటంతో రెండవ రంగాన్నికూడా తెరిచారు. ఈ దాడి కత్తులతో కాదు కలాలతో జరుగుతోంది.ఇదింకా ప్రమాదకరం.

అనేక మంది రచయితలు, కళాకారులు, ఇతర మేధావుల తీవ్ర నిరసనల తరువాత అక్టోబరు 23న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సమావేశం జరిగింది. కలుబర్గి హత్యను ఖండించాలని, అసహన పరులను నిరసించాలని కోరుతున్న సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి తమ వాదనలను వినిపించారు. సాహిత్య అకాడమీ హత్యపై తన మౌనాన్ని కొనసాగించాలని, రాజకీయాలకు దూరంగా వుండాలని వాదించిన వారు భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ అసహనంతో తీర్మానాన్ని అడ్డుకొనే రాజకీయం చేశారు, వారూ సాహితీవేత్తలే, వీరూ సాహితీవేత్తలే అయినా ఎంత తేడా !

చరిత్రలో ఎందరో లబ్ద ప్రతిష్టులైన కవులు,కళాకారులు కాలం ధర్మం చేశారు. అంతటితో వారి అధ్యాయాలు ముగిశాయి. కాపీ రైట్‌ వున్న వారి వారసులు లాభసాటిగా వుంటే వారి పుస్తకాలను తిరిగి అచ్చేయిస్తారు, లేకపోతే లేదు. కానీ కన్నడ రచయిత కలుబుర్గి హత్య దేశంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆయన భావాలకు కాపీ లెఫ్ట్‌ తప్ప ఎవరికీ రైట్‌ లేదు. ప్రతి తరంలోనూ భావప్రకటనా స్వేచ్ఛ కావాలని కోరుకొనే ప్రతివారూ ఆయనకు వారసులుగా మారిపోతారు. అలాంటి వారికి ఒక కలుబుర్గి, ఒక గోవింద పన్సారే,ఒక నరేంద్ర దబోల్కర్‌ ధృవతారలుగా వెలుగునిస్తూనే వుంటారు.

ఒక విక్రమ సంపత్‌ , ఒక చేతన భగత్‌, ఒక కమల హసన్‌, ఒక విద్యాబాలన్‌ ఎవరైనా కానివ్వండి వారి దృష్టిలో సహనానికి, అసహనానికి అర్ధాలు వేరుగా వుండవచ్చు, ‘వేదాల్లోనే అన్నీ వున్నాయి’ కనుక అసలైన అర్ధాన్ని వెలికి తీయించుకొని చదువుకొంటారు అది వేరే విషయం. కలుబర్గి హత్యను ఖండించాలా లేదా అవార్డులను వాపసు ఇవ్వాలా లేదా అన్నది వారి చైతన్యానికి సంబంధించిన అంశం.అవార్డులు వెనక్కు ఇవ్వాలని పనిగట్టుకొని ఒక బృందంగా ఎవరైనా పిలుపు ఇచ్చారా ? లేదా పైన పేర్కొన్నవారు లేదా వారిమాదిరి ఆలోచిస్తున్న వారి ఇళ్లకు గానీ వెళ్లి బొట్టుపెట్టి అవార్డు వాపసు ఇమ్మని అడిగిన వారెవరు? సభ్య సమాజంలో వున్నారు గనుక సంచలనం కలిగించిన అంశాలపై ప్రముఖులను విలేకర్లు అడుగుతారు, లేదా ప్రత్యేకంగా వాకబు చేసి అభిప్రాయాలు తీసుకొని వెల్లడిస్తారు. కారణాలు ఏమైనా అనేక మంది పెద్దలు నోరు విప్పలేదు. అది వారి హక్కు. అవార్డులు వెనక్కు ఇచ్చిన వారిపై అసహనం వ్యక్తం చేయటం లేదా వారి చర్యను తప్పు పట్టే హక్కు కొందరికి ఎవరిచ్చారు.అయితే వారికి తమ అభిప్రాయాలు చెప్పే హక్కులేదా అంటే అది నైతిక పరమైంది తప్ప మరొకటి కాదు. కలుబుర్గిని హత్య చేసింది, అలాగే మరికొందరిని మట్టుబెడతామని ప్రకటించిన వారు ఎవరు? ఆ రచయితల భావాలు, వాటి వ్యాప్తిని సహించలేని వారు తప్ప మరొకరు కాదు. అలాంటి వారి దుశ్చర్యలను ముందు ఖండించి లేదా తాము సరైనదని అనుకొనే పద్దతులలో నిరసించి ఇతరులు అనుసరించిన అవాంఛనీయ పద్దతులపై తమ అభిప్రాయాలు చెప్పి వుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. వారావిధంగా చెయ్యలేదు. అందువలన అలాంటివారికి ఇతరులను నిందించే లేదా విమర్శించే నైతిక హక్కు ఎక్కడుంది? జార్జి కార్లిన్‌ అనే పెద్ద మనిషి సహసం గురించి ఇలా చెప్పాడు.’ మతం చెప్పుల జతవంటిది, నీకు తగిన వాటిని ఎంచుకో అంతేకాని నన్ను నీ చెప్పులు వేసుకోమనవద్దు’ అన్నాడు.

నిరసన ఫలానా పద్దతులలోనే వ్యక్తం చేయాలని ఏ వేదాలలో వుంది? ఎందరో పెద్దలు నాయనా ఇది తగదు అని నయానా భయానా చెప్పారు. కవి చౌడప్ప తనదైన పద్దతులలో బూతులతో నిరసించాడు, వేమన హేతువుతో ఎండగట్టాడు, ఎవరి పద్దతి వారిది. తమలపాకుతో నువ్వు ఒకటేస్తే తలుపు చెక్కతో నే రెండంటా. అసలు వెయ్యటం సరైనదా కాదా అన్నది సమస్య. సరైనదే అయితే నువ్వు కోరుకున్నట్లే నేనెందుకు వెయ్యాలి?

తాజాగా విక్రమ సంపత్‌ విషయాన్నే చూద్దాం. సాహిత్య అకాడమే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించదు, పద్మ అవార్డులను తిరిగి ఇవ్వటం మంచిది అంటాడా పెద్ద మనిషి. ఎందుకంటే ఆయనకా అవార్డు లేదు. మరి పద్ద అవార్డు వున్న కమల్‌ హసన్‌ ఏమన్నాడు. అవార్డులు తిరిగి ఇవ్వటం కాదు, ఇతర పద్దతుల్లో నిరసన తెలపాలి అన్నాడు. ప్రఖ్యాత శాస్త్రవేత్త పిఎం భార్గవ తన పద్మ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించగానే కాషాయ దళాలు అత్యవసర పరిస్ధితి కాలంలో మీరు ఎందుకు నిరసన తెలపలేదు అని దాడి చేశారు. అంటే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లు పైన చెప్పిన బాపతు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విక్రమ సంపత్‌ తన గోడు లేదా గోస చెప్పుకుంటే అభ్యంతరం ఏముంటుంది? ఎవరికేమీ పోదు. నిరసన తెలపటం సరైనదా కాదా అన్నది తేల్చుకోవాల్సి వచ్చినపుడు ముందు అటో ఇటో ఎటుండాలో తేల్చుకోవాలి. తరువాత ఎలా తెలపాలన్నది నిర్ణయించుకోవాలి. విక్రమ సంపత్‌ అలా తేల్చుకోలేదు. రెండవదాని గురించి మాట్లాడుతూ పద్మ అవార్డులు తిరిగి ఇచ్చి నిరసన తెలపవచ్చు అని ఒక వుచిత సలహా ఇచ్చాడు. అంతవరకు పరిమితమైనా ఇబ్బంది లేదు. అంతకు మించి నిరసన తెలిపిన వారిపై వ్యంగ్య బాణాలు వేసి తానెటు వున్నాడో తానేమిటో స్వయంగా బహిర్గతపరచుకున్నాడు. అవార్డులు పుచ్చుకున్నప్పటి కంటే తిరిగి ఇచ్చివేసినపుడు మీడియా వారికి పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చిందట. నిజమే గాంధీ మహాత్ముడిని చంపక ముందు గాడ్సే ఎవడు, వాడు పనిచేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఎవరికి తెలుసు. మీడియాకు వారి నిజస్వరూపాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఏముంటుంది ? జనం గాంధీని గుర్తుంచుకున్నంత కాలం గాడ్సేను, వాడిని ప్రేరేపించిన వారినీ కూడా గుర్తుంచుకోక తప్పదు. ఎందుకంటే గాడ్సేకు గుడి కట్టిస్తామని, ఏటేటా స్మారక దినాలు జరుపుతామని చెబుతున్నవారి గురించి కూడా అదే మీడియా రోజూ చెబుతున్నదా లేదా ? అవార్డు వాపసు తరహా నిరసనలతో అంగీకరించని, సామాజిక మీడియాలో అదే విషయాన్ని వ్యక్తం చేసిన తమ వంటి వారిని మతవాదులని, ఫాసిస్టులని, అసహనపరులని ఎన్నో విధాలుగా తమపై దాడి చేశారని వాపోయాడు. నిజమే ముందే చెప్పుకున్నట్లు మీ వంటి వారు నిరసన తెలిపి వుంటే ప్రజలు రాళ్లకు బదులు పూలు చల్లి వుండేవారు. ముందుకు తీసుకుపోవాల్సిస సమాజాన్ని వెనక్కు నడిపించాలని ఎవరైనా మూర్ఖులు ప్రయత్నిస్తే జనం ఏమైనా చేస్తారు. ఒక గుంపులో భయం తలెత్తితే ఎవడైనా ఒకడు తమ గుంపు వాడు కాదనుకుంటే వాడిని తిరునాళ్లలో కొట్టే జనం మాదిరి జంతు ప్రవత్తి తమపై విమర్శకులలో తనకు కనిపించిందని విక్రమ సంపత్‌ నోరు పారవేసుకున్నాడు. మరొక చోట గొర్రెల మందలా ఆలోచించకుండా ఒకదాని వెనుక ఒకటి పోయినట్లుగా అవార్డుల వాపసు ఇచ్చిన వారు ప్రవర్తించారని తూలనాడాడు. ఇలాంటి అసహనపరుడు, తోటి సాహితీవేత్తలను నిందించే వారితో ఆత్మగౌరవం కలవారు ఎవరైనా ఎలా కలసి పని చేస్తారు? తనలోని అసలు ‘సాహితీవేత్తను’ స్వయంగా బయట పెట్టక ముందు సంపత్‌ వైఖరి గురించి తెలిసినప్పటికీ సహించి అనేక మంది బెంగలూరు సాహిత్య పండగలో పాల్గొనేందుకు అంగీకరించారు. ఆ తరువాత ఒక ఆంగ్ల పత్రికలో సంపత్‌ అవార్డులు తిరిగి ఇచ్చినవారిని కించపరుస్తూ రాశాడు. ఆ తరువాత సాహిత్య అకాడమీ అంతర్గత కారణాలు ఏమైనప్పటికీ కలుబర్గి హత్యను ఖండించింది. విక్రమ సంపత్‌ వంటి వారు ఆ తరువాత కూడా తమ వైఖరిని మార్చుకోలేదు. ఇంత జరిగాక అలాంటి వారితో వేదిక పంచుకోవటంలో అర్ధం వుండదు. అది విక్రమ సంపత్‌ ఇంట్లో పెళ్లి కాదు. ఒక భావజాలానికి సంబంధించింది, ఎవరెటు వుండాలో తేల్చుకోమని నిరసన తెలిపిన వారి ముందు సవాళ్లు విసురుతున్నారు.

సాహిత్య అకాడమీ రాజకీయ సంస్ధ కాదు కనుక దాని సాహిత్య పరిధి దాటి రాకూడదని అన్నాడు.దేశంలో ప్రతిరోజూ ఎందరో రాజకీయ వేత్తల హత్యలు జరుగుతున్నాయి. ఎవరైనా ఎప్పుడైనా సాహిత్య అకాడమీ ఖండించలేదని అన్నారా, ఖండించమని అడిగారా? లేదే ! ఎందుకీ అర్ధం పర్ధం లేని అడ్డుసవాళ్లు ? తన అవార్డు పొందిన, రాజకీయాలతో సంబంధం లేని కలుబర్గి హత్యను కదా ఖండించమని అడిగింది ! సాహిత్య అకాడమీ రాజకీయ సంస్ధ కాదు, కలుబర్గి హత్యను ఖండించాల్సిన అవసరం లేదు, రాజకీయాలకు దూరంగా వుండాలంటూ ఇలాంటి పరివార్‌ ప్లీడర్లు చెట్ల కింద ఎంత వాదించినా అది తప్పుడు వాదన అని జనం అనుకోవటం ప్రారంభించిన తరువాతే సాహిత్య అకాడమే ఎట్టకేలకు హత్య జరిగిన 53 రోజుల తరువాత ఖండించింది. మరి ఈ ప్లీడర్లు ఇప్పుడు ఏం వాదిస్తారు. అందుకే ఇలాంటి వారి ఆధ్వర్యంలో జరిగే సాహిత్య వుత్సవానికి తాము హాజరు కావటం లేదని నలుగురు రచయితలు ప్రకటించిన తరువాత వుత్సవ డైరెక్టర్‌గా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ రచయితలు అసహన పరులని ఆరోపించాడు.తాను రాజీనామా చేసిన తరువాత తనకు ఎందరో మద్దతు తెలిపారని చెప్పుకున్నాడు. గాంధీని జాతిపితగా అంగీకరించని, గాడ్సేకు మద్దతు తెలుపుతున్నవారే సిగ్గుపడటం లేదు, ఆ పరంపరకు చెందిన వారు విక్రమ సంపత్‌ను సమర్దించటంలో ఆశ్చర్యం ఏముంది. హిట్లర్‌ పోయినా ఫాసిజం పోలేదు. వారసులు పుట్టుకువస్తూనే వున్నారు.

‘ కొన్ని సందర్బాలలో మీ ప్రభ కళ్లు జిగేల్‌ మనేట్లు వెలుగుతుంది. అది జనం నీ నిజ స్వరూపాన్ని చూడకుండా గుడ్డివారిని చేస్తుంది’ అని షానన్‌ ఎల్‌ ఆల్డర్‌ చెప్పారు. అసహనాన్ని సహించటం పిరికి తనం అన్న పెద్దల సూక్తిని సదా గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

LOK SABHA ADJOURNED REPEATEDLY OVER CPI-M MEMBER’S REMARKS

30 Monday Nov 2015

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Left politics, NATIONAL NEWS

≈ 1 Comment

Tags

CPI(M), Intolerance, LOK SABHA

Lok Sabha adjourned repeatedly over CPI-M member's remarks

Parliament House of India

 New Delhi, 30 Nov 2015: The Lok Sabha witnessed repeated adjournments on Monday as differences between some members of opposition and the treasury benches erupted when a CPI-M member attributed some remarks to Home Minister Rajnath Singh.Mohammad Salim of the Communist Party of India-Marxist(CPI-M), who initiated a discussion in the Lok Sabha on the issue of intolerance, cited the home minister as having made the remarks to a magazine. Ruling National Democratic Alliance members contested this strongly.While denying having ever made such remarks, Home Minister Rajnath Singh said he was deeply hurt by the claim.

“I am (have) never been so much hurt in my parliamentary life. If a home minister makes such comments, he has no right to be on his post,” Rajnath Singh said, adding that members of the house and people from the minority community know that he cannot make such remarks.Lok Sabha Speaker Sumitra Mahajan said Salim’s remarks pertaining to the magazine report on the minister would not go on record and she would examine the issue.”I will give my ruling,” she said.

Minister of State for Parliamentary Affairs Rajiv Pratap Rudy said the member should withdraw the comments till their authenticity was ascertained.Rudy said it would be difficult for members on the treasury benches to sit in the house after allegations “which are dangerous for the country”.Biju Janata Dal member Bhartruhari Mahtab said a member has to give prior notice before levelling allegations against another member.

Saugata Roy of the Trinamool Congress, however, said there was no denial from the minister after the publication of the report in the magazine.Salim later said his intention was not to hurt the minister and he had done the job of intelligence agencies by telling the minister about the publication of comments attributed to him.

Rudy, however, insisted that Salim should withdraw his words.As the standoff continued, the speaker adjourned the house for an hour.After the house reassembled, Rudy again insisted on the CPI-M member withdrawing his remarks till the authenticity was proven.

Salim, however, said he would not withdraw his remarks. “This is also intolerance. This is ridiculous,” he said.Salim said he cited the magazine after questions were put to him about his remarks.As the standoff persisted, Deputy Speaker M. Thambidurai briefly adjourned the house.When the house reassembled after its second adjournment of the day, Congress member M. Veerapa Moily said that since both Salim and Rajnath Singh had spoken, the matter should be put to rest.But the stalemate persisted and the house was adjourned till 3.15 p.m. and then again till 4 p.m..

When the house met at 3.15 pm, Salim said he was going by the rules and remarked he would have been happy if Rajnath Singh had become prime minister instead of Narendra Modi.Parliamentary Affairs Minister M. Venkaiah Naidu objected to his remarks and said such comments can also be made about CPI-M general secretary Sitaram Yechury.(IANS)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆడలేక మద్దెల ఓడు – అమీర్‌ఖాన్‌పై అక్కసు

24 Tuesday Nov 2015

Posted by raomk in BJP, Communalism, COUNTRIES

≈ Leave a comment

Tags

Ameerkhan, BJP, Intolerance

 

ఎంకెఆర్‌

అసహనం మరోసారి వ్యక్తమౌతోంది. అది కొత్త రూపం సంతరించుకుంది. అసహనం గురించి చర్చ జరిగింది, దుమ్ము పట్టింది, వదలి వేశారు. ఇప్పుడు పిఆర్‌సి గురించి ఇతర రోజువారీ అంశాల గురించి చర్చించుకుంటున్న సమయంలో తిరిగి సినీహీరో అమీర్‌ ఖాన్‌ దాన్ని గురించి వ్యాఖ్యానించటం ఏమిటని నరేంద్రమోడీ భక్తులు అసహనంతో మండి పడుతున్నారు. దీనిలో ఆశ్యర్యం లేదు. అనుకున్నదొకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా బీహార్‌ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేనివారు అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యను సాకుగా తీసుకొని ఎదురుదాడి చేస్తున్నారు. మరికొంత ముందుకు పోయి బీహార్‌ ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. ఆ తరువాత ఎవరూ అవార్డులను వాపసు చేయలేదు, చూశారా మేము ముందే చెప్పాము, ఇది రాజకీయం అని ప్రత్యక్షంగా అంటున్నవారు కొందరైతే మరికొందరు పరోక్షంగా చెబుతున్నారు.ఇక్కడ ఒక పిట్ట కధతో పాటు రెండు విషయాలను చెప్పుకోవాలి.

ముందు పిట్ట కధ. పూర్వజన్మలో హనుమంతుడు, రావణుడు ఇద్దరూ రాముడికి భక్తులే. వారికి పూర్వజన్మలో ఒక చర్చ వచ్చిందట, తరువాత జన్మలో మీ వద్దకు చేరుకోవటానికి మేము తొందర పడుతున్నాము మార్గం చెప్పండి మహానుభావా అని అడిగారట. దానికాయన. నాకు భక్తుడిగా వున్న వారికంటే శత్రువుగా వున్నవారికి ముందు అవకాశం ఇస్తాను ఏదో తేల్చుకోండి అన్నాడట. దాంతో ముందుగా మోక్షం పొందేందుకు రావణుడు రాక్షసుడిగా రాముడితో వైరం పెంచుకొన్నాడన్నది ఒక కధ.అలాగే సాహితీవేత్తలు, ఇతర మేధావులను రెచ్చగొట్టింది ఎవరు? సాహిత్య అవార్డుల వాపసుపై అక్కసు కక్కిన వారెవరు? వేరే పద్దతులలో నిరసన తెలపవచ్చు, అవార్డులు తిరిగి ఇస్తే ఏం జరుగుతుందట,నేనైతే నా అవార్డును తిరిగి ఇవ్వను, నేనూ ఇచ్చేవాడినే కానీ నాకు అవార్డు ఇంకా రాలేదని వ్యంగ్యోక్తులు వదిలిందెవరు ? బీహారు ఎన్నికల తరువాత ఎవరూ అవార్డులను వాపసు చేయలేదు అంటున్నవారు అంతకు ముందు వాపసు చేసిన వారిపై దాడి చేసి నానాయాగీ చేయటంతో పాటు, వాపస్‌ను మరింత వేగం,విస్తృతం చేసేందుకు దోహదం చేసిన వారే.

బీహారు ఎన్నికల కోసమే అవార్డులను వెనక్కు ఇచ్చారన్న ఆరోపణలు చేసిన వారు ఎన్నికల సమయంలో ఈ మాట చెప్పలేదు, దాన్నొక ఎన్నికల సమస్యగా చేయలేదు. నరేంద్రమోడీ, లేదా ఇతర గల్లీ నాయకుల వుపన్యాసాలలో ఎక్కడా బీహారుకు లక్షా50వేల కోట్ల వుత్తుత్తి రివార్డుల గురించి తప్ప అవార్డుల వాపసు గురించి మనకు వినపడలేదు. తమను విమర్శించిన వారిపై స్వామీజీలు భక్తులను రెచ్చగొట్టినట్లే బిజెపి నేతలు వ్యవహరించారు.

అవార్డుల వాపసు గురించి గతంలోనూ జనాన్ని తప్పుదారి పట్టించారు, ఇప్పుడూ అదే చేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ తన అవార్డు గ్రహీత కలుబర్గి హత్యను ఖండించి వుంటే కవులు తమ అవార్డులను వెనక్కు ఇచ్చి వుండేవారు కాదు, ప్రధాని నరేంద్రమోడీ దాద్రి దురంతాన్ని ఖండించి వుంటే ఇతరులు కవుల బాట పట్టి వుండేవారూ కాదు, బీహారు ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు అవార్డులను వుపయోగించుకున్నారని సాకు చెప్పుకోవాల్సిన అగత్యం పట్టి వుండేది కాదు. అయినా అనుకోకుండా వచ్చిన అవకాశాలను వుపయోగించుకోవటం అందునా చావో రేవో అనే విధంగా వున్న ఎన్నికల సమరంలో వుపయోగించుకోవటం తప్పెలా అవుతుంది. గతంలో బిజెపి రధయాత్ర, బాబరీ మసీదు కూల్చివేత, గోద్రా వుదంతం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల మండల్‌ కమిషన్‌ సిఫార్సులను, తాజాగా గోరక్షణ, బీఫ్‌ నిషేధం, వుమ్మడి పౌరస్మృతి, 370 ఆర్టికల్‌ వంటి వాటిని, అసలు ఏ అంశాన్ని వుపయోగించుకోలేదో చెప్పగలరా? వాటిని బిజెపి కోసమే సృష్టించారా ? అవును అంటే ఎవరో చెప్పండి మరి !

ఆగస్టు 30న కలుబర్గి హత్య జరిగితే దానిని ఖండించటానికి అక్టోబరు 23 వరకు అకాడమీ పెద్దలు కదలలేదు. ఆరోజైనా ఎందుకు ఖండించారంటే దేశంలో తలెత్తిన నిరసన అవార్డుల వాపసు నుంచి మరో రూపం తీసుకోకుండా, మరింత మంది ఆ బాట పట్టకుండా, చివరికి ఆ రంగాలలో వున్న తమ భక్తులపై వస్తున్న వత్తిడి, ఏదో ఒక వైఖరిని తీసుకోవాల్సిన పరిస్థితులలో నష్టనివారణ చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని చెప్పించిన మొక్కుబడి ఖండన తప్ప గుండెల్లోంచి వచ్చింది కాదు. సాహితీ వేత్తలు తొలుత చేసిన డిమాండ్‌ అదే కనుక, ఎట్టకేలకు అది నేరవేరింది కనుక ఆ తరువాత ఎవరూ వాపసు ఇవ్వలేదు. అంతే తప్ప బీహారు ఎన్నికలకు సంబంధం లేదు. వాటికి సంబంధం వుంది అని ఎవరు చెబుతున్నారు అంటే ఎడమ జేబులో ఒకటి కుడి జేబులో మరో స్టేట్‌ మెంట్‌ పెట్టుకొని తిరేగే వారే. ఇప్పుడు టీవీలు వున్నాయి గనుక రెండు నాల్కలతో మాట్లాడే వారే అని చెప్పుకోవాలి.

బీహారు ఎన్నికలలో బిజెపి గెలిచి వుంటే చూశారా తమ మీదకు కవులు, కళాకారులను కూడా రెచ్చగొట్టినా జనం మావైపే వున్నారని గొప్పలు చెప్పుకొనేవారు. అది జరగలేదు కనుక తమ ఓటమికి అవార్డుల వాపసు ఒక కారణమని భావిస్తున్నవారే నిలిపివేత గురించి రెండో స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు. నూరుగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో గోవిందా అన్నట్లుగా నరేంద్రమోడీ పరిస్ధితి తయారైందని, దీని ద్వారా తామెంత బలహీనులమో, ఎలాంటి తప్పుడు దారిని ఎంచుకున్నారో వారే స్వయంగా చెప్పకున్నట్లయింది.

అమీర్‌ఖాన్‌ గురించి సోషల్‌ మీడియాలోనూ ఇతరంగా కాషాయ పరివార్‌ విరుచుకుపడుతున్నది.

నవంబరు ఎనిమిదిన బీహార్‌ ఫలితాలు వచ్చిన తరువాత గత రెండు వారాలలో ఒక్క అవార్డుకూడా తిరిగి ఇవ్వలేదని, ఏ మతం గురించి వివాదాలు లేవని, గొడ్డు మాంసం(బీఫ్‌) గురించి లేదా ఇతర మాంసాల గురించి ఎవరూ మాట్లాడటం లేదని, ఎవరూ కోట్లాటలకు దిగటం లేదని, అసహనం గురించి భయపడటం లేదని, దేశంలో శాంతి నెలకొన్నదని, ఇప్పుడు మనం పిఆర్‌సి ఇతర సాధారణ అంశాల గురించి మాట్లాడుతున్నామని, తీరిగ్గా కూర్చొని మీడియా, కాంగ్రెస్‌ ఆరువారాల పాటు జరిగిన ఎన్నికలలను ఎలా తిమ్మినిబమ్మిని చేసిందీ ఆలోచించాలని, మంత్రించినట్లుగా మరోసారి భారత్‌ సహనశీలిగా, లౌకిక దేశంగా ఎలా మారిపోయిందో చూడటం మంచిదని తన ఫోన్‌లో అనేక మంది పంచుకుంటున్న(షేర్‌) ఒక సందేశం వచ్చిందని ఒక మీడియా విశ్లేషకుడు పేర్కొన్నారు. ఇలాంటి సందేశాలు, రెచ్చగొట్టేవి, తప్పుడు సమాచారం ప్రచారం చేసేవి ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో చాలా వస్తున్నాయి. మతశక్తులు జనాన్ని తప్పు దారి పట్టించేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనే భావంతో అతి తెలివిగా వండి వడ్డించిన చాణక్య వంటకాలలో ఇది ఒకటి. దీని లక్ష్యాలు ఏమిటి ?

బీహార్‌ ఎన్నికలలో నరేంద్రమోడీ ప్రచార సరళి, దాద్రి హత్యపై స్పందించినపుడు ప్రతిపక్షాల మతోన్మాద చర్యల వల్లనే ఇలాంటి వన్నీ జరుగుతున్నాయని ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు అయిపోయాయి గనుక అవన్నీ నిలిచిపోయాయని జనాన్ని నమ్మించేందుకు ఈ సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు. సదరు మీడియా విశ్లేషకుడు అమెరికాలో అభ్యర్ధుల జయాపజయాలను మీడియా నిర్ణయిస్తుందో చూడండి అంటూ ఒక అమెరికన్‌ జర్నలిస్టు రాసిన అంశాలను ప్రస్తావించారు. అది నూటికి నూరు పాళ్లు నిజమే. అయితే ఆ విశ్లేషకుడు నిజాయితీతో దాన్ని ప్రస్తావించి వుంటే అదే వేరే విషయం. బీహార్‌ ఎన్నికలలో బిజెపి, నరేంద్రమోడీ ప్రత్యర్ధులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి చిన్న చిన్న అంశాలను కూడా బూతద్దంలో జాతీయ ప్రాధాన్యతగల అంశాలుగా ప్రచారం చేసి కొంత మందిని తాము ప్రమాదంలో వున్నామనే భ్రమకు లోను చేయటంలోనూ వారు, మనము అనే భావాన్ని సృష్టించి బిజెపి, మోడీపై తప్పుడు ప్రచారం చేశారని మనల్ని నమ్మమనటానికి నానా తాపత్రయ పడ్డాడు, ఇలాంటివే ఇంకా రాబోయే రోజుల్లో కాషాయ జర్నలిజం పాఠశాల విద్యార్ధులు మనకు వండి వార్చనున్నారు.

జనానికి జ్ఞాపక శక్తి తక్కువ అన్నది వీరి అంచనా. కాకపోతే దేశ ఎన్నికల చరిత్రలో ఒక పార్టీ అభ్యర్ధిగా నరేంద్రమోడీని మార్కెటింగ్‌ మరియు ప్రచార కార్యక్రమానికి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధల నుంచి నిపుణులైన రెండు వందల మందితో పని చేయించి మోడీ అంటే ఎవరో తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేసేందుకు ఎన్నికలకు ముందు తొమ్మిదినెలల పాటు పని చేశారని అప్పటి పత్రికలు రాసిన విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. దీనికి ప్రశాంత కిషోర్‌ అనే నిపుణుడు నాయకత్వం వహించి అవసరమైన వ్యూహాన్ని రూపొందించాడని, చాయె పే చర్చ నినాదం అతని బుర్రలో పుట్టిందనే వార్తలూ మనకు పాతవే. ఇపుడు ఆ కిషోర్‌ ప్రధాని నివాసం వీడి నితీష్‌ కుమార్‌ పంచన చేరాడు కనుక మోడీ భక్తులు వుక్రోషం పట్టలేక దానిని ఇప్పుడు వెయ్యి మందితో వ్యతిరేక ప్రచారం చేయించినట్లు ఇటు తిప్పి ప్రచారం చేస్తున్నారు. దాన్ని బిజెపి గ్రహించినప్పటికీ అప్పటికే అందుకోలేనంత దూరం వెళ్లి పోయిందట. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారికి చిన్న ప్రశ్న. సరే ఎన్నికల ప్రచారం సమయంలో ఏ పార్టీ అయినా తమకే విజయావకాశాలు వుంటాయని చెబుతుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తరువాత బిజెపి నేతలు, వారికి అనుకూలంగా వున్న మీడియా సంస్ధలు ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ మాటేమిటి? నిజంగా బిజెపి నేతలు జన నాడిని తెలుసుకొని వుండి వుండుంటే ఓట్ల లెక్కింపు సరళి తెలిసిన తరువాత కూడా తమ విజయావకాశాల గురించి చెప్పారంటే దాని అర్ధం ఏమిటి? విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందురోజే తమ విజయోత్సవాలకు హాజరు కమ్మని మీడియాకు లేఖ పంపిందంటే నమ్మకం ఏ స్దాయిలో వున్నట్లు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Undermining Constitution – Hindu Nationalist Agenda  

22 Sunday Nov 2015

Posted by raomk in BJP, Communalism

≈ Leave a comment

Tags

BJP, Constitution, Intolerance, Modi Sarkar

Ram Puniyani

With Modi Sarkar coming to power in the centre (May 2014), the picture of the country has changed drastically for the worse. (1) On one hand nation is witnessing the increasing unrestricted control of Corporate on our economy and on the other the sectarian divides are on the rise. This government had come to power standing on two pillars; one was the corporate world and other the solid support of RSS. Modi promised Acche din and danga mukt bharat (violence free society). The things have been totally in the opposite direction to the promises. (2) The big corporate are shining with expansions as per their liking and labor reforms have been brought in to please them. That, the land reforms envisaged by them could not be cleared that’s another matter. The policies of the state have been so changed as to undermine the importance of the social welfare schemes and all the right based schemes related to employment, health, nutrition and education have been put on the margins.

Despite the falling prices of crude oil globally; the prices are on the rise with the prices of routines commodities like dal (pulses), onions, tomatoes; shooting the sky. The much promised employment creation is nowhere in sight and youth are writhing in the pangs promise betrayed, promise of millions of jobs. The prime goal of the ‘guardian’ state is nowhere in sight. The economic scenario is abysmal for the average person in the society.

As far as the social-communal harmony is concerned the last year and a half has seen a very poor record. The social atmosphere has been so created where the rationalists thinkers like Dabholkar, Pansare and Kalburgi were killed brutally. (3) The low intensity; below the radar violence; has dominated the scene and issues like mosque, church in different places have been used to divide the society. Surely the large scale violence of the type of Mumbai 92-93 or Gujarat 2002 or Kandhmal 2008 have not been, but increase in scattered acts of violence have been tormenting the society. The ruling outfit and its affiliates have been the protectors of the ground level divisive activities.

Hate Speech

During the first year of Modi Sarkar the Hate speech went up to horrendous limits. One recalls that even before Modi Sarkar assumed the seat of power the divisive activities of ‘BJP associates’ in the form of propaganda of love jihad and Ghar Vapasi were on, and they continued without any respite. Soon after this Government came to power; in Pune; Mohsin Sheikh, a person working in IT was hacked to death by activists of Hindu Jagran Sena. The attack on Churches was very glaring and the process which was dominant in Delhi and Haryana was also witnessed in places like Panvel near Mumbai, Agra in UP amongst other places.(4)

Sakshi Maharaj not only said that Godse was a patriot; he also went on to say that Hindu women should produce four children, as Muslims are overtaking the population. Sadhvi Prachi went to prescribe eight children for Hindu women. She also gave a call that the Muslim film actors, Aamir Khan, Shahrukh Khan and Salman Khan should be boycotted. Pravin Togadia has been the leading person in making hate speeches; he has the highest number of cases regarding hate speech against him. Yogi Adityanath, BJP’s MP keeps making very derogatory remarks, He said that in ‘love jihad’ if one Hindu girl is converted then 100 Muslim girls should be converted to Hinduism.

As such one realizes that ‘Hate speech’ is the outcome of the politics of divisiveness, it is the concentrated expression of the ‘social common sense’ prevailing in the society, it is the forth right and blunt way of putting things, which communal parties propagate anyway. It is not out of the blue that these formulations suddenly crop up, their infrastructure, the base of these has already been made by a section of political outfits.

Growing Intolerance

When Dr. Dabholkar, Com Pansare and then Prof Kalburgi were killed over a period of months, the danger signals started being perceived but still it took the beef lynching of Mohammad Akhlaq in Dadri (5) to give a message that something has drastically changed in the society, and the spate of returning of Sahiya Academy, National and state, awards followed in quick succession. (6) Their protest was against the rising intolerance in the society. The incidents that followed and ran parallel to these ‘award-returns’ were equally horrific. The killing of a trucker on the assumption that he is carrying cows for slaughter; beating of a MLA in Kashmir Assembly by BJP legislatures and the scattered incidents of attacks on Muslims on the ground of beef consumption are too striking. The killing of dalits while they were skinning the dead cow; rings the bell of times to come.

The viciousness of atmosphere is not lost on the social perceptions. The insecurity of minorities has gone up by leaps and bounds. One knows that since the present NDA regime came to power all those ‘spewing hate’ are working overtime. For one Akbaruddudin Owaisi there is an army of Sakshi Mahraj, Sadhvis, Yogis and what have you.

Even after the awards started being returned the BJP leadership looked down upon the writers/scholars and overlooked the phenomenon which has lead to returning of awards. Disturbed by what is going on, the President Pranab Mukherjee on number of occasions urged the nation to uphold, pluralism, the core civilizational value of the country and to uphold tolerance. (7) The Vice President Haamid Ansari reminded the Government that it is the duty of the state to uphold the ‘right to life’ of citizens. The index of the changing social atmosphere is reflected by the statements of two outstanding citizens of the country. Julio Reibero, the top cop, expressed his pain and anguish by saying that “as a Christian suddenly I feel stranger in my own country.” (8) And the renowned actor Naseeruddin Shah had to point out that “Have never been aware of my identity as a Muslim until now.”(9)

These are not ordinary times. The values of pluralism and tolerance have been pushed to the margins. With this Government in power all the wings of communal politics, the RSS affiliates, have unleashed themselves in full blast. Communalism is not just the number of deaths due to violence, it is much more. The foundation of this violence begins with the manufacture of perceptions about the religious minorities. These perceptions based on history and some selective aspects of present society are given an anti human tilt and interpretation. This is used to create hatred for the minorities and that’s where the communal elements can unleash violence either as a massive violence like the one’s of Gujarat or Mumbai or Bhagalpur or Muzzafarnagar or the targeted one in Dadri. This creates the divides in society which over a period of time is converted into polarization. And polarization is the foundation of electoral strength of party wanting a nation in the name of religion. As per Yale study, the communal violence is the vehicle which strengthens BJP at electoral level. (10)

Qualitative change in Hate Politics

Many prominent entrepreneurs like Narayan Murthi and Kiran Majumdar Shaw have shown their concern over growing intolerance. In the same boat of those calling for preserving values of pluralism are people like Raghuram Rajan, the RBI Governor. (11) The ruling dispensation, the BJP leaders labeled the whole process as ‘manufactured rebellion’ as put by Arun Jaitley. It has been alleged that those returning awards are the leftists or those who were recipients of privileges from the state when Congress was the ruling party and now with BJP coming to power from last one year, they are baffled and so the protests. It has been alleged that these people are trying to derail the ‘development story’ being written by the BJP under the leadership of Narendra Modi. Jaitley even goes to say that Narendra Modi is the victim of intolerance by these people returning their awards. (12)

Why the Awards were returned?

As such what has happened is neither a law and order problem nor the one related to loss of patronage; it is related to the much broader phenomenon related to intense communalization of society. This time the degree of communalization has crossed the civil limits. The jibe that these people did not return their awards at the time of emergency, anti Sikh violence, migration of Kashmiri Pundits and at the time of Mumbai blasts of 1993 is a very superficial way of dealing with the social response to the phenomenon of growing intolerance and its degree. As the awards which have been returned and the statements put out by different groups do give the reasons for the same and these reasons pertains to the cumulative process and not this or that event. The present scenario is in a way a type of climax of divisive politics. All these incidents mentioned by Jaitley and company have been a tragic part of recent Indian history. Many a writers did protest against most of these incidents, many of them had not even been awarded at that time. (13)

The present times cannot be compared with the tragic incidents of the past for various reasons. Take the case of emergency for example. It was a dark chapter of Indian history, still it was the authoritarianism imposed mostly from the top. What is most disturbing in the current times is the vast network of organizations related to the ruling party whose followers either they themselves create hatred in the society or they mobilize the social sectors through hate speech; the result of which is violence. Currently there is a twin attack on the values of tolerance and liberal space. From the top the ruling dispensation has people like Yogi Adiyanath- Sakshi Maharaj, Giriraj Singh, Sadhvi Niranjan Jyoti who keep spreading sectarian message while basking in the glory of power and at the societal level divisive statements prevail.

This is just one case in point. The major factor leading to present atmosphere lies in the qualitative transformation of ‘hate for others’. The stereotyping of minorities which began with Hindu nationalism has assumed horrendous proportions where the likes of Gulzar have to say that now people ask your religion before your name! So while the Jaitleys will keep undermining the steps taken by these people and while the Rajnath Singhs’ will keep dubbing it as a law and order problem, the dissatisfaction amongst those standing for democracy is growing, liberal space and tolerance is shrinking. We will have to keep thinking of more ways to draw the attention of larger sections of society towards the threat looming large on our democratic society, the threat of sectarian propaganda and politics leading to stifling of democratic space. And in these times, the divisive process has assumed menacing proportions.

State Institutions

The major initiative of this government has been to change the heads and composition at the top level of public institutions. Since its assuming power it went for major appointments in the institutions of National importance. Most of these appointments are based on the ideological proclivities of the people rather than their professional competence. In Film and Television Institute of India the appointment of Gajendra Singh Chauhan as the Chairman came up with big opposition from the students of the institutes and also forms the major figures of the film World. (14) The governing board of this and other institutes are being filled with RSS sympathizers. The tampering in other institutes like IITs has led to the resignation of Anil Kakodkar as the chairman of Governing board of IIT Mumbai and of Prof Shevgaokar from the directorship of IIT Delhi. Prof Amartya Sen had to resign from the Chancellorship of Nalanda University. The NBT has also got a Hindutva ideologue, former Panchjanya editor Baldev Sharma as its chief. In the case of ICHR one Prof Y.S. Rao has been appointed as the chairperson. He has no peer reviewed publications and has contributed blogs in the name of History research. He holds that Indian mythology is History and attempts have begun to support research in that direction. As per him the caste system was not bad, its rigidities and evils were introduced after the coming of Muslim kings. Zafar Sareshwala, a businessman close to Narendra Modi, has been given the Chancellorship of Maulana Azad Urdu University in Hydrabad.

Education

Even before this government has come to power many attempts to make the education in confiormity with the RSS, Hindutva world view were being pushed through. In Delhi University A. K. Ramanujan’s classic essay on Ramayana (Three Hundred Ramayanas) was withdrawn under the pressure of ABVP, the RSS affiliate. (15) Dinanath Batra of RSS had been instrumental in getting the academic book by Wendy Doniger ‘The Hindus: An Alternative History’ getting pulped. (16) Batra’s books have already been introduced in the schools of Gujarat. RSS has floated Shiksha Bachao Andolan Samiti to promote its views through school books. These ideologues from RSS are the major advisors for reviewing curriculum in the states. Rational thinking has been opposed, as exhibited by the murders of Dabholkar, Pansare and Kalburgi. RSS affiliated organizations like Vidya Bharati are focusing on Bhartiyakaran of education. They assert that Indian education is not suitable for India and propose to bring in changes aimed to promote Hindutva icons and values. They are trying to appropriate Ambedkar through their efforts. (17)

In the previous NDA regime (1998), the major changes were brought in the field of education which brought in Astrology, Paurohitya and Karmakand as part of the courses. Sanskrit is being introduced at different levels to the extent of replacing German as an additional language at places. This time around RSS seems to be preparing for a total Hindutvisation of education, the samples of which were there in the previous NDA regime with Murli Manohar Joshi doing what came to be known as saffronization of education. (18)

Agenda: Hindu Nationalism

RSS is working for Hindu nationalism, a nationalism which stands in polar opposition to Indian nationalism, as inherent in the values of freedom movement and later in the Constitution of India, the values of Liberty; Equality and Fraternity. The goal of India as ‘a nation in the making’, the plural diverse nation with multiple cultures supplementing each other and enriching the society is opposed by for this organization. They have adopted Hindutva as their politics and Hindu nation as their goal. As per them we have been a Hindu nation from times immemorial and the wisdom of ancient Indian society has all the ingredients for the growth of the nation. This political agenda regards secularism and democracy as the Western concepts which should be done away with. It is in pursuance of this agenda that it kept aloof from freedom movement. It has been propagating a view of history where Muslims and Christians are aliens, foreigners. It attributes the ills of society like caste system to the influence of invading foreigners. (19)

For them the major thing is Hindu unity at societal level. This; they have been doing through their shakha baudhiks and by floating many organizations for this purpose. These organizations like Vishwa Hindu Parishad, Vanvasi Kalyan Ashram, Bajrang Dal, Akhil Bhartiya Vidarthi Parishad are doing the propagation of this work through their work in the society. The present degree of communalization-polarization is due to the ceaseless anti minority propaganda. The issues they take are related to identity, like Ram Temple earlier and currently Holy Cow. The issues like love Jihad and Ghar Wapasi also are strong tools in their hands.

The second aspect of Hindu nationalist project has been to infiltrate in bureaucracy, police and other organizations of state. Their trained swayamsevaks join these services and influence the policies. This work as such is in progress but when BJP is in power, this type of work of RSS becomes very intense. Now with BJP having majority in the centre on its own it is moving fast to communalize the state apparatus. This has gone up in intensity in the current times.

When Lal Krishna Advani became the Information and broadcasting minister in Janata Party Government he ensured that most of the media agencies helped by state are taken over by Hindutva volunteers. Currently not only media but also culture, education and science are all being taken over. With this Government the control over institutions of national excellence is going on at a fast pace. (20)

Resistance: Struggle for Democratic Society

The rise of Hindutva politics has been going on from close to a century. This was mainly through RSS shakha baudhiks (intellectual sessions), through education and media apart from the role played by other Hindutva nationalists. This has brought us to a pass where the hate for other community is manifesting as intolerance. This has been strengthened by the use of identity issues, temple, and cow being the major ones, and the proganda related to love jihad, ghar wapasi and terrorist violence. The pyramid of communal politics stands on the ‘hate other’ and the consequent communal violence.

The efforts to save and pluralism and diversity have to be the foundation for all social groups wanting to preserve democratic space. The programmatic unity of these groups on issues related to violation of human rights of weaker section of society is need of the hour. The targeting of religious minorities has to be opposed and their sense of security has to be restored by social and legal struggles for ‘right to life’ as enshrined in our constitution. A multi-layered social platform for defense and nurturing of democratic and human rights is of utmost importance. Here the minor differences between different social political groups have to be overlooked for a broader program based unity, this effort is long overdue.

(Writer can be contacted at ram.puniyani@gmail.com)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?
  • వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !
  • డోనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు – బిజెపి నేతల ఆంతర్యం ఏమిటి ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: