• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: JNU

జెఎన్‌యు మూత సలహా ఇతర ‘వర్సిటీలు, సంఘపరివార్‌కూ వర్తింప చేస్తారా ?

15 Wednesday Jan 2020

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Closer of JNU, India R&D expenditure, JNU, JNU ROW, Patents, RSS

Image result for jnu,

ఎం కోటేశ్వరరావు
జెఎన్‌యు గురించి వివరాలు తెలుసుకుందాం. రఘునాథ రామారావు గారి ఆంగ్ల లేఖకు తెలుగు అనువాదం మరి కొంత నా సేకరణ. మదన్‌ గుప్త పేరుతో ఒక పోస్టు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దీన్ని చదివి కొంత మంది దానిలోని అంశాలు నిజమే కదా అని నిజంగానే ఆందోళన పడుతున్నారు. కొందరు దీన్ని పూర్వపక్షం చేస్తూ వాస్తవాలు బయటపెడితే బాగుండు అనుకుంటున్నవారు కూడా లేకపోలేదు. ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ గురించి తెలిసిన వారికి కాషాయ తాలిబాన్లు విసిరిన మరొక బాణం ఇది అని ఇట్టే పసిగట్టగలరు. దీనిలో జెఎన్‌యు గురించి కొత్తగా తెలిపిందేమీ లేదు, చదివిన వారు తెలుసుకొనేదీ ఏమీ లేదు.
ముందుగా అడగాల్సింది అసలు ఆ రామారావు ఎవరు, ఆయనెందుకు ఆంగ్లంలో లేఖ రాశారు, ఆపెద్ద మనిషి కవిత్వానికి మదన్‌ గుప్త తనపైత్యాన్ని జోడించటమెందుకు ? ఈ పోస్టు ఎవరిపేరుతో అయితే ఉందో వారి విశ్వసనీయత, అసలు ఆ పేరుతో ఎవరైనా ఉన్నారో కల్పిత వ్యక్తులో తెలియదు. వారు పేర్కొన్న అంశాలకు ఆధారాలేమిటో అసలే తెలియదు కనుక దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జెఎన్‌యు మీద దాడిలో ఇదో కొత్త కోణం. దీపికా పదుకోన్‌ ఆ విశ ్వవిద్యాలయాన్ని సందర్శించి ముసుగు గూండాల దాడిలో గాయపడిన వారికి మద్దతు తెలిపిన అంశం గురించి ‘కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక ‘ అనే శీర్షికతో రాసిన నా విశ్లేషణపై కాషాయ మరుగుజ్జులు(ట్రోల్స్‌) ఎగిరెగిరి పడ్డారు. జెఎన్‌యు కమ్యూనిస్టుల కిస్‌ కల్చర్‌ (ముద్దుల సంస్కృతి) కేంద్రం అని నోరుపారవేసుకున్నారు. ఆ కేంద్రంలోనే బిజెపి నేతలు నిర్మలా సీతారామన్‌, మేనకా గాంధీ వంటి వారు విద్యాభ్యాసం చేశారు. వారెంత మందికి ముద్దులిచ్చారు, ఎంత మందినుంచి ముద్దులు తీసుకొని ఉంటారో చెప్పగలరా అన్న ప్రశ్నకు జవాబు లేదు. ఇప్పుడు ఎబివిపికి చెందిన ఆమ్మాయిలు, అబ్బాయిలు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి సంస్కృతి అక్కడ ఉందనుకుంటే దానిలో కొనసాగటం ఎందుకు, చదువు మానుకొని బయటకు రావచ్చు, వేద పాఠశాలలు, సంస్ధలలో చేరవచ్చు !
అందువలన ఎవరికిి తెలిసిన భాషలో చెబితేనే వారికి సులభంగా అర్ధం అవుతాయి. ఈ పోస్టుకూడా ఇంచు మించు అలాంటిదే కనుక కొన్ని అంశాలను చూద్దాం. మామిడి చెట్టు నాటితే మామిడి కాయలే కాస్తాయి, జాంకాయలు ఎందుకు కాయటం లేదనే కుతర్కం, బుర్రతక్కువ జనాలకు ఏం చెప్పాలి. జెఎన్‌యు సాంకేతిక విద్యా సంస్ధ కాదు. ప్రధానంగా సామాజికాంశాలతో పాటు సైన్సు కోర్సులు కూడా బోధించే సాధారణ విశ్వవిద్యాలయం. అక్కడ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. డాక్టరేట్స్‌ను ఇస్తున్నారు. ప్రత్యేకించి శాస్త్ర, సాంకేతిక అంశాల అధ్యయనం, పరిశోధనలకు ఐఐటిలు, ఇతర పరిశోధనా సంస్దలు ఉన్నాయి. సాధారణ విశ్వవిద్యాలయాలను, వీటినీ రెండింటినీ ఒకే గాటన కట్టటం వక్రీకరణ.
ఈ పోస్టులో లాభనష్టాల గురించి చర్చ చేశారు. విద్యా సంస్ధలు చేసేది వాణిజ్యం కాదు కనుక లాభనష్టాల ప్రమాణాలు వర్తింప చేయటం అనుచితం. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇదే మాదిరి బోధన, పరిశోధన అవకాశాలను కల్పిస్తున్నాయి. కనుక వాటితో పోల్చి చూపితే ఆ పోస్టుపెట్టిన వారి బండారం ఏమిటో తెలిసి ఉండేది. ఆ చిత్తశుద్ది పోస్టులో లేదు. దానిలో పేర్కొన్న కొన్ని అంశాలకు ఆధారాలేమిటో తెలియదు. జెఎన్‌యులో చదివిన వారు ఎందరు ఉపాధి పొందారో తెలియదు అన్నారు. ఆ పరిశోధకుడు, పరిశీలకుడు కలసి ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివి పట్టాలు పొందిన వారు ఎందరు ఉపాధి పొందారో ఏమి చేస్తున్నారో లెక్కలు చెప్పగలరా ? లేదా నరేంద్రమోడీ గారు సెలవిచ్చినట్లు పకోడీ బండ్లు ఎందరు పెట్టారో తెలుపగలరా ?

Image result for jnu attack
చెడిపోయిన ప్రజాస్వామ్యానికి జెఎన్‌యు ఓ గొప్ప ఉదాహరణ అట. సరే అంగీకరిద్దాం, బాగున్న ప్రజాస్వామ్యానికి ఓ గొప్ప ఉదాహరణగా ఉన్న విశ్వవిద్యాలయం పేరేమిటో చెప్పి ఉంటే వివేక వంతులు పోల్చి చూసుకొనే వారు. ఇప్పటికైనా చెప్పండి, సవాలు కాదు సవినయంగా అడుగుతున్నాం. అక్కడి విద్యార్ధులకు ఖాళీ సమయం ఎక్కువ కాబట్టి కొత్త సమస్యలు సృష్టించటంపైన, మైండు కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి అడ్డమైన భావజాలంతో నింపేస్తారట, అన్నీ ఉచితంగా అందుతూ ఉంటే ముసలి వారైనా అక్కడే వారి జీవితాన్ని గడిపేస్తారుట. సాంఘిక సంస్కరణల ఊసులేదట, ఇలా సాగిన, రాసిన చెత్తకంతకూ సమాధానం చెప్పటం వాణిజ్య భాషలో దండగ, కనుక ఆపని చేయటం లేదు. ఇలాంటి పోస్టులు ఏ మాత్రం విమర్శనాత్మక వైఖరిలేని వారి బుర్రలను ఖరాబు చేస్తాయి. వాటి లక్ష్యమే అది. రెండు రెళ్లు నాలుగే ఎందుకు కావాలి, మూడు ఎందుకు కాకూడదు అని ఎవరైనా వాదించే వారిని సంతృప్తి పరచ చూడటం వృధా ప్రయాస. ఒక సినిమాలో నువ్వు ఎవరు అనే ప్రశ్నతో ఉన్న దృశ్యాలను వారికి చూపటం తప్ప మరొక మార్గం లేదు. దేశంలో పేటెంట్‌లు, పరిశోధనలు తక్కువగా ఉండటానికి కారణం జెఎన్‌యు అన్నట్లుగా చిత్రించిన పెద్దలు ఈ దేశంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, వాటితో సమానమైన సంస్ధలు, ఎన్ని లక్షల మంది వాటిలో చదువుతూ, పరిశోధనలు చేస్తున్నారో తెలుసుకుంటే జెఎన్‌యులోని ఎనిమిదివేల సంఖ్య ఎంత తక్కువో తెలుస్తుంది. జెఎన్‌యును మూసివేయాలని వాదించేందుకు తెగ ఆయాసపడిపోవటం గాకుండా అసలు మొత్తంగా పరిశోధనలు, పేటెంట్ల నమోదులో దేశం ఎందుకు వెనుకబడి పోయిందో, దానికి పరిష్కారాలు ఏమిటో చెప్పి ఉంటే వారి శ్రమ ఫలించేది.

Image result for jnu attack
పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించే వాతావరణం, అందుకు అవసరమైన పెట్టుబడి వంటి అంశాలను మనం చూడాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఆరునెలల క్రితం చేసిన సిఫార్సులో దేశంలో పరిశోధన మరియు అభివృద్ది కార్యకలాపాలకు 2022నాటికి జిడిపిలో కనీసం రెండు శాతం ఖర్చు చేయాలని కోరింది. గత రెండు ద శాబ్దాలుగా చేస్తున్న ఖర్చు 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉంది. అలాంటిది మరో రెండు సంవత్సరాల్లో రెండుశాతానికి పెరుగుతుందని ఆశించే పరిస్ధితి ప్రస్తుతం ఉందా.


ప్రపంచ నవకల్పన సూచికలో మన దేశ స్ధానం గురించి చెప్పుకోబోయే ముందు పరిశోధనకు వివిధ దేశాలు జిడిపిలో చేస్తున్న ఖర్చును చూస్తే ఇజ్రాయెల్‌ 4.3, దక్షిణ కొరియా 4.2, జపాన్‌ 3.2, అమెరికా 2.8, చైనా 2.1 శాతం ఖర్చు (2017) చేస్తున్నాయి. ఈ మధ్య మన కాషాయ పరివారం ప్రతిదానికి పాకిస్ధాన్‌తో పోల్చుకోవటాన్ని ఎక్కువ చేసింది. దాని ఖర్చు 0.5శాతంగా ఉంది కనుక, మన దేశాన్ని మోడీ సర్కార్‌ దాని కంటే కొన్ని మెట్లు ఎగువ నిలిపిందని గొప్పలు చెప్పుకోవచ్చు.
దేశంలో నేడున్న పరిస్ధితి ఏమిటి? ఆపరేషన్లకు ఎలాంటి విఘ్నం కలగ కూడదని వైద్యులు గణపతికి మొక్కుతారు. పోలేరమ్మలకు సద్ది నైవేద్యాలు పెడతారు. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్త్రో శాస్త్రవేత్తలు వెంకటేశ్వరుడిని, సుళ్లూరు పేట గ్రామ దేవతలను వేడుకుంటారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు తామరతంపరగా పెరిగిపోతున్నారు. లక్షల సంవత్సరాల నాడే మన పూర్వీకులు ఎలాంటి ఇంధనం లేకుండా పలు ఖండాలకు ఎటు కావాలంటే అటు తిరిగే, ఎందరు ఎక్కినా మరొకరికి సీటు దొరిక విమానాలు నడిపారని, కృత్రిమ గర్భధారణ పద్దతుల్లో నూరుగురు కౌరవులను పుట్టించారని, ప్లాస్టిక్‌ సర్జరీ తెలిసిన కారణంగానే వినాయకుడికి ఏనుగు తలను అతికించారని, ఆవు మూత్రంలో బంగారం ఉందని, ఆవు పేడలో ఔషధ గుణాలున్నాయని, వాటి మీద పరిశోధనలు చేయండని చెప్పేందుకు ప్రధాని నుంచి కింది స్ధాయి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త వరకు పోటీ పడుతుండటాన్ని చూస్తున్నాము. మూఢనమ్మకాలతో రోజు ప్రారంభమై ముగుస్తున్న సమాజంలో , నరికిన వినాయకుడి తలనే తిరిగి అతికించకుండా ఏనుగు తలను ఎందుకు అతికించారు అనే ప్రశ్ననే అడగకుండా నీకు తెలియదులో నోరు మూసుకో చెప్పింది విను అని మొగ్గలోనే చిదిమేస్తున్నకుటుంబవాతావరణంలో, రాయి రప్పలు, చెట్లు పుట్టలకు మొక్కితే పోయేదేముందిలే అనే తరాలు పెరుగుతున్న తరుణంలో లక్షలు ఎలా సంపాదించాలి, అమెరికా,ఆస్ట్రేలియా ఎలా వెళ్లాలి అనే యావతప్ప శాస్త్ర, సాంకేతిక రంగాలు, పరిశోధనల పట్ల ఆసక్తి ఏమి ఉంటుంది, పరిశోధనల్లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ ఉంటాయి, అయినా ముందుకు పోవాలంటే ఆసక్తి కలిగిన వారికి ఆర్ధిక భరోసా కలిగించకపోతే, సాధించిన విజయాలకు ప్రోత్సాహం లేకపోతే యువతరానికి ఆ రంగంలో కొనసాగాలనే ఆసక్తి ఎలా ఉంటుంది ?
నవకల్పనల విషయంలో మన దేశ స్ధానం ఎక్కడ అన్నది చూద్దాం. ఈ మధ్యకాలంలో మన ప్రధాని నరేంద్రమోడీ కొత్త విషయాలు చెబుతున్నారు. ఐదేండ్ల క్రితం అచ్చేదిన్‌, గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి అని ఊదరగొట్టారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. అంటే వాటన్నింటినీ సాధించారని మనం అనుకోవాలి. రెండో సారి ఎన్నికైన తరువాత 70ఏండ్లలో సాధించలేని వాటిని అన్నింటినీ సాధించామని చెప్పుకుంటున్నారు.మారు మాట్లాడకుండా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని భజన చేయాలి. లేకపోతే దే శద్రోహులం అవుతాం, రాబోయే ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సిలలో మన పేర్లను పక్కన పెట్టి జాతీయతను నిరూపించుకొనే ఆధారాలు సమర్పించమంటారు.
2014లో ప్రపంచ నవకల్పనల సూచికలో 143 దేశాల జాబితాలో మన దేశం 33.7శాతం మార్కులతో 76వ స్ధానంలో ఉంది. మన ఒక పొరుగుదేశం మోడీ అండ్‌కో నిత్యం కలవరించే పాకిస్ధాన్‌ 24 మార్కులతో 134వ స్ధానంలో, చైనా 46.57 శాతం మార్కులతో 29వ స్ధానంలో ఉంది.( ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌కు వచ్చిన మార్కులు 64.78శాతం). ఐదేండ్ల తరువాత 129 దేశాలలో మోడీ పాలనలో మన మార్కులు 36.58శాతంతో 52 స్ధానాన్ని పొందాము. ఇదే సమయంలో పాకిస్ధాన్‌ 31.62 మార్కులతో 113 స్ధానాన్ని, చైనా 54.82 మార్కులతో 14వ స్ధానానికి చేరింది.ఒకటవ స్ధానంలో ఉన్న స్విడ్జర్లాండ్‌ మార్కులు 67.24. దీన్ని బట్టి ఎక్కడ ఎలాంటి ప్రోత్సాహం, పోటీ ఉందో ఎవరికి వారే అర్ధం చేసుకోవచ్చు. అన్ని విజయాలు సాధించిన నరేంద్రమోడీ ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యారు ? చైనా ఐదేండ్లలో తన మార్కులను 8.25, పాకిస్ధాన్‌ 7.62 పెంచుకోగా మనం 2.88కి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యాం ?
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేయకుండా ముందుకు పోజాలదు. మన ప్రధాని దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా మార్చుతామని చెప్పటం తప్ప అందుకు అవసరమైన కనీస చర్యలు కూడా చేపట్టలేదు. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు గుండ్రాయిలా తయారు కావాలంటే కుదురుతుందా? పరిశోధనా ఖర్చును ఎందుకు పెంచలేదో ఎవరైనా చెప్పగలరా ? గతేడాది అక్టోబరు ఆరవ తేదీన ఎకనమిక్స్‌ టైమ్స్‌లో జి సీతారామన్‌ రాసిన ఒక విశ్లేషణ వచ్చింది. దాని సారాంశం, వివరాలు ఇలా ఉన్నాయి. ” ప్రపంచ మేథోసంపత్తి సంస్ధ వివరాల మేరకు 2017లో కొన్ని దేశాలలో దాఖలైన పేటెంట్ల దరఖాస్తులు, మంజూరైన పేటెంట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం         దరఖాస్తులు         పేటెంట్ల మంజూరు
చైనా         13,81,594             4,20,144
అమెరికా      6.06,956              3,18,481
జపాన్‌         3,18,481              1,99,577
ఐరోపా         1,66,585              1.05,645
భారత్‌            46,582                12,387
ప్రతి పదిలక్షల మందికి జపాన్‌లో 2,053, అమెరికాలో 904, చైనాలో 899, జర్మనీలో 887 మంది పేటెంట్లకు దరఖాస్తు చేయగా మన దేశంలో కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు. పరిశోధకుల విషయానికి వస్తే యునెస్కో సమాచారం 2015 ప్రకారం ప్రతి పదిలక్షల మందికి గాను జపాన్‌లో 5,210, అమెరికాలో 4,313,ఐరోపాయూనియన్‌లో 3,749, చైనాలో 1,206 మంది ఉండగా మన దేశంలో 216 మాత్రమే ఉన్నారు.
దేశంలోని ఐఐటీల్లో 2018-19లో బొంబాయి ఐఐటి 98 పేటెంట్లకు దరఖాస్తు చేసింది. మిగతా అన్ని ఐఐటిలు దాఖలు చేసిన వాటిలో ఇవి ఆరోవంతు. ఇదే ఏడాది బొంబాయి ఐఐటి పరిశోధన ఖర్చు 335 కోట్ల రూపాయలు కాగా దానిలో 80శాతం ప్రభుత్వం నుంచి మిగిలిన మొత్తం ప్రయివేటు రంగం నుంచి వచ్చింది.”

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌ దేశాల్లో గణనీయ మొత్తాలను ప్రయివేటు కార్పొరేట్లు కూడా ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో పరిశోధనల ఖర్చు పేరుతో రాయితీలు పొందటం తప్ప వాస్తవ ఖర్చు పరిమితం. ఇక వేదాల్లో, సంస్కృత గ్రంధాల్లో అపార సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని చెప్పేవారు వాటిని వెలికి తీసి పేటెంట్‌ దరఖాస్తులను ఎందుకు దాఖలు చేయలేదు ? ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? వారిని అడ్డుకున్నదెవరు ? చైనా, పాకిస్ధాన్ల గురించి సొల్లు కబుర్లతో కాషాయ దళాలు పోసుకోలు కబుర్లు చెప్పటాన్ని పక్కన పెట్టి వేద విజ్ఞానాన్ని ఎందుకు వెలికి తీయించలేకపోయారు? జెఎన్‌యు గురించి ప్రశ్నిస్తున్నవారు సంఘపరివార్‌ నడిపే సరస్వతి శిశుమందిర్‌లు, ఇతర విద్యా సంస్ధలలో శిక్షణ పొందిన వారిలో ఎందరు పేటెంట్‌లు పొందారో, పరిశోధనలు చేసి ఏమి సాధించారో చెబుతారా ?

Image result for who are advocating closure of jnu, will they extend rss and its affiliates too
విద్యా సంస్ధలలో లెక్చరర్లు, విద్యార్ధులతో కూడి దేశంలో అతి పెద్ద విద్యార్ధి సంఘం అని చెప్పుకొనే ఎబివిపి ఎప్పటి నుంచో దేశభక్తిని నూరిపోస్తున్నట్లు చెప్పుకుంటుంది. అలాంటి సంస్ధ తన సభ్యులతో ముసుగులు వేసి దాడులు చేయించటాలు, విద్యా సంస్ధల్లో గణేష్‌ పూజలు, తిరోగామి భావాలను ప్రోత్సహించటం వంటి వాటిని పక్కనపెట్టి పరిశోధనల వంటి అంశాలపై తన సభ్యులను పురికొల్పి ఉంటే ఈ పాటికి చైనాతో సహా ఎన్నడో ఇతర అన్ని దేశాలను అధిగమించే వారం కదా ? ఎన్నో పేటెంట్‌లు వచ్చి ఉండేవి కదా ? నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధికంగా ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు, ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కల నెరవేరేది. పరిశోధనలు లేవు, పేటెంట్లను సాధించని కారణంగా జెఎన్‌యును మూసివేయాలని సలహా ఇస్తున్న పెద్దలు ఎబివిపికి లేదా దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు , ఇతర యూనివర్సిటీల గురించి ఏమి సలహా యిస్తారు ? విద్యా సంస్దలను, సంఘపరివార్‌ సంస్ధలను మూసుకొమ్మంటారా, లేకపోతే ఇప్పటి మాదిరే పైవిధంగా ముందుకు పొమ్మని ప్రోత్సహిస్తారా ? పనికి రానివి, ప్రయోజనం లేనివి ప్రభుత్వ సంస్దలైతేనేం, ప్రయివేటువైతేనేమి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చట్టం కొందరికి చుట్టం కొందరికి దయ్యమైంది ఎందుకు ?

17 Tuesday May 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

AYUSH, BJP, doctored JNU videos, forgery, JNU, reporter

సత్య

    చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టానికి చుట్టాలుగా వుంటారా ? న్యూఢిల్లీలో మేనెల రెండవ వారంలో పుష్పా శర్మ అనే జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాధానాన్ని ఫోర్జరీ చేశారని, దానిని పత్రికలో ప్రకటించి తప్పుడు సమాచారంతో మతాల మధ్య విబేధాలు రెచ్చగొట్టటానికి ప్రయత్నించారనే ఆరోపణలతో నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా దినం సందర్భంగా శిక్షకుల ఎంపికలో ఒక్క ముస్లింనుకూడా చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర కారమే అలా చేసినట్లు ఆయుష్‌ మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారన్నది పోలీసుల అభియోగం. అది నిజమే అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు.ఈ వుదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరు అసాధారణంగా వుంది. ఆ వార్తను ప్రచురించిన పత్రిక ‘మిలీ గజెట్‌ ‘ అనే పత్రికకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందినట్లు పేర్కొన్న సదరు శర్మను అనేక మార్లు పోలీసులు ప్రశ్నించారు. ఎలాంటి వారంటు లేకుండానే అరెస్టు చేసే బెయిలు రాని సెక్షన్‌ 153ఏ కింద కేసు బనాయించారు.

     కానీ ఇదే పోలీసులు ఫిబ్రవరి నెలలో జెఎన్‌యు వుదంతంలో తిమ్మిని బమ్మిని చేసి చేయని దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా రూపొందించిన వీడియోలను పదే పదే ప్రసారం చేసిన జాతీయ టీవీ ఛానల్స్‌పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.ఆ వీడియోల కారణంగా దేశమంతటా ప్రతిష్టాత్మక జెఎన్‌యు పరువు పోయింది, దానిలో చదువుకొనే విద్యార్ధులు దేశద్రోహులుగా దేశం ముందు ప్రదర్శితమయ్యారు. విద్యార్ధి సంఘనేత కన్నయ్య కుమార్‌తో సహా అనేక మందిపై దేశద్రోహ నేరం కేసులు మోపి అరెస్టులు చేశారు. ఢిల్లీ కోర్టుల వద్ద దేశ భక్తుల ముసుగులో వున్న లాయర్లు విద్యార్ధులు, ఆవార్తలను కవర్‌ చేయటానికి వచ్చిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటాన్ని దేశమంతా చూసింది. భారత మాతాకీ జై అన్న నోళ్లతోనే విద్యార్ధుల అరెస్టులు అక్రమం అన్న మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని బెదిరించారు. దేశమంతటా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అందుకు దోహదం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు తోడ్పడిన వీడియో టేపులను తయారు చేసిన వారు, వాటిని ప్రసారం కోట్లాది మంది జనంలో విద్వేషాన్ని నింపిన సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, టీవీ ఛానల్స్‌ యాజమాన్యాలు, ఆ తప్పుడు వీడియోల ఆధారంగా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు యంత్రాంగంపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అంతే కాదు వుమర్‌ ఖాలిద్‌ అనే విద్యార్ధికి వుగ్రవాద సంస్ధతో సంబంధాలు వున్నాయని తప్పుడు వార్తలను ప్రచురించిన పత్రికలు, ప్రసారం చేసిన టీవీలపై కూడా ఎలాంటి చర్యలు లేవు. తనతో పాటు అనిర్‌బన్‌ భట్టాచార్య అనే విద్యార్ధిపై ప్రచురించిన తప్పుడు వార్తల కారణంగా తాము కనిపిస్తే చంపే విధంగా జనంలో ఆగ్రహం వెల్లడైందని వారు స్వయంగా కోర్టుకు విన్నవించుకున్నారే. అంతటి తీవ్రమైన చర్యలు అక్రమాలుగా కేంద్ర ప్రభుత్వానికి కనిపించ లేదా ? ఒక జర్నలిస్టు పుష్పా శర్మ ఫోర్జరీ(రుజువు కావాల్సి వుంది) కారణంగా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తే, మరో ఫోర్జరీ వీడియోల ద్వారా రాజకీయంగా లాభపడేందుకు అదే ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకేనా వీడియో అక్రమాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విద్యార్ధులపై దాడితో కెసిఆర్‌ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకున్నారా ?

24 Thursday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Education, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

JNU, kanniah kumar, KCR, police attack, students, University of Hyderabad (UoH), UoH

ఎంకెఆర్‌

   హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం విద్యార్ధులతో అమీ తుమీ తేల్చుకొనేందుకే సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.అందుకు కెసిఆర్‌ కూడా సై అన్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంఛార్జి వైస్‌ ఛాన్సలర్‌కు సైతం తెలియకుండా సెలవుపై వెళ్లిన వైస్‌ ఛాన్సలర్‌ పొదిలె అప్పారావు ఆకస్మికంగా విశ్వవిద్యాలయంలో ప్రత్యక్షం కావటం యాదృచ్చికంగా జరిగిందని ఎవరూ అనుకోవటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న విషయమేమీ రహస్యం కాదు. దానికి ముందుగానే వైస్‌ ఛాన్సలర్‌ అకస్మికంగా ప్రత్యక్షం కావటం కన్నయ్యను విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టకుండా చేయటానికే అన్నది సుస్పష్టం. తన ఆందోళన ప్రస్తానంలో విద్యార్ధులను ఎంతగానో వుపయోగించుకున్న తెలంగాణా ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు కనుసన్నలలో పనిచేసే పోలీసు యంత్రాంగం వివాదాస్పద వైస్‌ ఛాన్సలర్‌కు మద్దతుగా విద్యార్దుల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే ఓడమల్లయ్య బోడి మల్లయ్యను గుర్తుకు తెస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ మద్దతు లేకుండా వైస్‌ ఛాన్సలర్‌ తిరిగి విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టే సాహసం చేసి వుండరని లోకం కోడై కూస్తున్నది.

    ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులపై దేశ ద్రోహ నేరం మోపేందుకు బహుశా బ్రిటీష్‌ పాలకులు కూడా సిగ్గుపడే విధంగా వీడియోలను తిమ్మిని బమ్మిని చేసి చేతులు కాల్చుకున్న కేంద్ర ప్రభుత్వం అది కాస్త చల్లబడగానే హైదరాబాదులో మరో అధ్యాయానికి తెరతీసింది. వైస్‌ ఛాన్సలర్‌ పొదిలె అప్పారావుకు తిరిగి బాధ్యతలు అప్పగించటం ద్వారా విద్యార్ధులను రెచ్చగొట్టింది. వైస్‌ ఛాన్సలర్‌పై కేసులు నమోదు చేయాలన్న విద్యార్ధుల డిమాండ్లను పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సదరు అప్పారావు కబురు చేయగానే తగుదునమ్మా అంటూ విద్యార్ధులపై తన ప్రతాపం చూపింది. చివరకు అమ్మాయిలను కూడా మగ పోలీసులు వదలి పెట్టలేదు. బూతులు తిట్టకపోతే పోలీసులే కారు అని మరోసారి నిరూపించుకున్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రుజువు చేసుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా వుండాలనుకుంటే అది వేరే విషయం, కానీ అందుకు చూశారా విద్యార్ధులపై ఎలా లాఠీని ఝళిపించానో అంటూ మోడీని సంతృప్తి పరచేందుకు ప్రయత్నించటం అన్యాయం. ఇప్పటి వరకు దేశమంతా కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనే తన నిరసనను కేంద్రీకరించింది, ఇప్పుడు దానిలో కూడా వాటా కావాలని చంద్రశేఖరరావు కోరుకుంటునట్లున్నారు. వైస్‌ ఛాన్సలర్‌ తిరిగి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అంశం పోలీసులకు తెలియదా ? వైస్‌ ఛాన్సలర్‌ రాక సందర్భంగా జరిగాయని చెబుతున్న వుదంతాలే అందుకు నిదర్శనం.అటువంటపుడు ఆయన వస్తే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని కేంద్రానికి తెలంగాణా సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది? ఆ వుదంతాలను ఎందుకు నిరోధించలేకపోయింది? పోనీ తగిన భద్రతా సిబ్బందిని నియమించి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? న్యూఢిల్లీ పోలీసు అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కాబట్టి జెఎన్‌యు విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటానికి కేంద్ర ప్రభుత్వ వత్తిడి కారణం కావచ్చు. కానీ హైదరాబాదు పోలీసులు కూడా అదే పని చేస్తారని బహుశా విద్యార్ధులు వూహించి వుండరు.

   విద్యార్ధులకు తగిన ‘పాఠం’ చెప్పేందుకు ఎంతో అనుభవం వున్న వైస్‌ ఛాన్సలర్‌ హాస్టళ్లు,మెస్‌లను మూసి వేసి, ఇంటర్నెట్‌ను కట్‌ చేసి తానంటే ఏమిటో రుజువు చేసుకున్నారు. బహుశా దేశభక్త ఎబివిపి విద్యార్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వుంటారు, లేదా బయటి నుంచి సాయం తీసుకొని వుండాలి. తిరిగి వస్తూనే ఈనెల 24న జరగాల్సిన అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయటం ఆయన చేసిన తొలి ఘనకార్యంగా చెబుతున్నారు. ఆ సమావేశంలో వివక్ష వ ్యతిరేక కమిటీ ఏర్పాటు, వివిధ కమిటీలలో ఎస్‌సి,ఎస్‌టిల ప్రాతినిధ్యాన్ని పెంచటం, నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ ఎనిమిది నుంచి 25వేలకు పెంచే ప్రతిపాదనను పరిశీలించటం వంటి అంశాలు అజెండాగా వున్నాయి. అలాంటి ముఖ్యమైన సమావేశాన్ని వాయిదా వేయటం వుద్రిక్తతలను వుపశమించటానికి గాక మరింత ఎగదోయటానికే తోడ్పడతాయి.

   హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన తాజా వుదంతాలలో బోధనేతర సిబ్బందిని విద్యార్ధులకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు ప్రయత్నించటం కొత్త , ప్రమాదకర పరిణామం.వైస్‌ ఛాన్సలర్‌ నివాసంపై విద్యార్ధులు దాడి చేశారనే ఆరోపణతో బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగటం, మెస్‌లను మూసివేయటం సరైన చర్య అవుతుందా? అది సమర్ధనీయమే అనుకుంటే విద్యార్ధుల పట్ల వైస్‌ ఛాన్సలర్‌ అనుసరించిన వైఖరి,వాటి పర్యవసానాలకు కూడా వారు బాధ్యత వహిస్తారా ? ఇది విశ్వవిద్యాలయంలో పరిస్థితులు మరింత దిగజారటానికి దారితీయ వచ్చు. బోధనేతర సిబ్బంది-విద్యార్ధులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. పంచాయతీ వారి మధ్య కాదు, వున్నతాధికారులు-విద్యార్ధుల మధ్య కనుక విచక్షణతో వ్యవహరించటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేశం ఎటు పోతోంది ! ఏం జరుగుతోంది !!

17 Thursday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Agriculture, BJP, Bjp nationalism, black money, cbi, INDIA, indirect subsidies, JNU, JNU ROW, lalit modi, Modi, Narendra Modi, subsidies, vijay mallya

 సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది

ఎం కోటేశ్వరరావు

     కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పూర్తి బడ్జెట్లు ప్రవేశ పెట్టింది. వాటి ద్వారా తాము చేసిన వాగ్దానాలపై ఫలానా నిర్ధిష్ట చర్య తీసుకున్నట్లు జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. తన ఎన్నికల ప్రణాళికలో ఇతర పార్టీల మాదిరిగానే అనేక మంచి అంశాలు చెప్పింది. గత ప్రభుత్వంతో పోల్చుకొని జనం గణనీయంగా దానికి ఓట్లు వేశారు. మన ఎన్నికల విధానంలో వున్న ఒక తీవ్రలోపం, ప్రతిపక్ష ఓట్లు చీలటం,వివిధ కారణాలతో దానికి వచ్చిన ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో ఎలాంటి భయం లేకుండా చేసిన వాగ్దానాలను అమలు జరుపుతుందని జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చిత్రం ఏమంటే ఎన్నికల ప్రణాళికలోలేని అనేక అంశాలను అది అమలు జరుపుతోంది. ఏ కాంగ్రెస్‌ విధానాలనైతే తెగనాడిందో అవే విధానాలను మరింత ఎక్కువగా అమలు జరుపుతోంది. గత రెండు బడ్జెట్లలో వుద్యోగులు తీవ్ర ఆశాభంగానికి గురైనట్లుగానే సమాజంలోని అన్ని తరగతుల వారిలో రోజు రోజుకూ తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది. ఇతర పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవకాశం లేకుండా స్వంతంగా మెజారిటీ సీట్లు వున్నప్పటికీ ఒక్క కీలకాంశంపైనా అది ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు.

    నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ ఎందుకు విముఖత చూపుతోంది? ఎందుకంటే అది ఎవరిదో వారికి తెలుసు కనుక, విదేశాల్లో దాచుకున్న ప్రతి పైసాను ఎన్‌డిఏ వెనక్కు తీసుకు వస్తుంది. దాన్ని పంచితే ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయి అని ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ట్వీట్లు చేసి జనానికి స్వీట్ల ఆశచూపారు. పార్టీ అధ్యక్షుడిగా వున్న రాజనాధ్‌ సింగ్‌ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో నల్లధనాన్ని తీసుకువచ్చి దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు జరుపుతామని చెప్పారు.తీరా అధికారానికి వచ్చిన తరువాత బిజెపి అధ్యక్షుడు ఎన్నికల సమయంలో అనేకం చెబుతుంటాం అవి అమలు జరుగుతాయా మీ పిచ్చిగానీ అన్నట్లు మాట్లాడారు.

    నల్లధనాన్ని తీసుకు వస్తామన్న పెద్దమనిషి గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తన పాలనలో ఇప్పుడెవరూ నల్లధనాన్ని బయటకు తీసుకు వెళ్లటానికి సాహసించటం లేదు అని చెప్పారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది ? గతేడాది సెప్టెంబరు వరకు తమ ప్రభుత్వం విధించిన గడువులోగా నల్లధనాన్ని తెల్లదిగా మార్చుకొనే పధకంలో 6,500 కోట్లు వస్తాయని ప్రధాని చెప్పారు. చివరికి అంది పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరిగా తయారైంది. తమ ప్రభుత్వ పధకం ప్రకారం 638 మంది రు 4,147 కోట్లను వెల్లడించారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు.మరి 6500 కోట్ల సంగతేమిటని అడిగితే అబ్బే అబ్బే ఇది మా పధకం ద్వారా కాదు హెచ్‌ఎస్‌బి దర్యాప్తు ద్వారా స్వాధీనం చేసుకున్న మొత్తం అని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పారు.తీరా ప్రభుత్వ పధకం ద్వారా వెల్లడైంది కేవలం 2,488 కోట్లు మాత్రమే అన్నారు. తరువాత ఇది కూడా జనాన్ని తప్పుదారి పట్టించే సమాచారమే అని తేలింది.

     స్విడ్జర్లాండ్‌ బ్యాంకులలో దాచుకున్న డబ్బు గురించి 2011లోనే 1,195 మంది పేర్లతో 25,420 కోట్ల రూపాయలు వున్నట్లు బయటకు వచ్చింది. అయితే మోడీ సర్కార్‌ ఇంకా 628 పేర్లనే పట్టుకు వేలాడుతోంది.హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులో దాచుకున్న సొమ్ము గురించి కూడా తెలిసింది చాలా పరిమితమే.ఆ బ్యాంకులో అక్రమంగా సొమ్ముదాచుకున్నవారి వివరాలు బయటపడటంతో ఫ్రాన్స్‌ 110 కోట్ల డాలర్లు, అమెరికా 190 కోట్లు, స్విడ్జర్లాండ్‌ 4.3 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆ బ్యాంకుకు జరిమానా వేశాయి. మరి మన దేశం ఎంత జరిమానా వేసింది ? అయినా మన జెట్లీ గారు తాజా బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద రంకెలే వేశారు తప్ప ఆచరణ లేదు.

    క్రికెట్‌ అసోసియేషన్‌లో వందల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టగానే లలిత్‌ మోడీ బిజెపి ముఖ్యమంత్రిగా వున్న వసుంధరరాజె, సుష్మస్వరాజ్‌ తదితరుల సహకారంతో దేశం వదలి పారిపోయాడు. అతగాడితో కుమ్మక్కు కానట్లయితే భారత్‌కు రప్పించేందుకు మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలేమిటి. ఇది ఇలా వుండగా కింగ్‌ పిషర్‌ విజయ మాల్య తొమ్మిదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, తన వ్యాపారాలను ఇతర కంపెనీలకు అమ్మివేసి లండన్‌కు పారిపోయి ఇప్పుడప్పుడే తాను భారత్‌కు రానని చెప్పేశాడు. చిన్న చేప లలిత్‌మోడీనే పట్టుకోలేనివారు పెద్ద చేప మాల్యను పట్టుకుంటారా అని జనం అడుగుతున్నారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం పేరుతో ప్రవేశ పరీక్షలలో జరిగిన కుంభకోణం నిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టిన సిబిఐ ఇంతవరకు చేసిందేమీ లేదు. అలాంటిది దేశం వదలి పారిపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చున్న ఆ సంస్ధపై జనానికి విశ్వాసం ఎలా వుంటుంది. తొలుత విదేశాలకు వెళుతుంటే నిర్బంధించమని లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేసిన సిబిఐ తరువాత ఒక నెలలోపే దానిని సవరించి వెళుతున్నట్లు తెలియ చేస్తే చాలని ఎందుకు మార్చినట్లు ? ప్రధాని పర్యవేక్షణలోని ఈ సంస్ధ నిర్వాకం గురించి ఇంతవరకు ఎవరూ నోరు విప్పరేం?

     వ్యవసాయం రంగం తీవ్ర సంక్షోభంలో వుంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్న ఆత్మహత్యలే అందుకు తిరుగులేని నిదర్శనం. వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వచ్చేట్లు చూస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళిక చెప్పింది. ఇప్పటికే పరిమితంగా వున్న ఎరువుల సబ్సిడీని కూడా దుర్వినియోగం అవుతోందనే పేరుతో ఇంకా కోత పెట్టేందుకు పూనుకుంది. యాభై శాతం కాదు కదా అందులో సగమైనా దక్కేందుకు ఇంత వరకు నిర్ధిష్ట పధకం ఏమి లేకపోగా స్వాతంత్య్ర దేశ చరిత్రలో తమ ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎవరూ సాయపడలేదని ఇటీవల బిజెపి రైతు సభలలో ప్రధాని చెప్పుకున్నారు.

   ధరల పెరుగుదలను అరికట్టటంలో వైఫల్యం గురించి తమకు పెరుగుతున్న కరువు భత్యమే పెద్ద సాక్ష్యమని వేరే చెప్పనవసరం లేదు. రెండు నెలలపాటు వుల్లిపాయలను బ్లాక్‌ మార్కెట్‌ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను జనం నుంచి గుంజిన వ్యాపారులపై తీసుకున్న చర్యలేమిటి ? అదే విధంగా కంది పప్పు. దాని కంటే చేపలు, కోడి మాంసం చౌక అయిందా లేదా ? ఇక ధరల తగ్గింపు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రయివేటు వర్తకులు అడ్డగోలు పద్దతుల్లో ధరలు పెంచారంటే అదొక దారి. వాగ్దానాలు చేయని వాటిని అమలు జరుపుతున్నదని ముందే చెప్పుకున్నాం. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు లీటరు పెట్రోలుపై రు.9.48 పైసలు ఎక్సైజ్‌ డ్యూటీ వుండేది. దానిని ప్రస్తుతం రు.21.48 పైసలకు పెంచారు. రూపాయి విలువను డాలరుకు రు.62.12 నుంచి ( ఫిబ్రవరి ఒకటిన సగటు రేటు) రు.67.68కి పతనం గావించారు. దీంతో చమురు వినియోగదారులకు అటు గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతనమైనా మన దేశంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోల్చితే నా రూటే సపరేటు అని బిజెపి చెప్పుకుంది. నిజమే అనుకున్నారు జనం. అన్నం వుడికిందా లేదా అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకున్నా చాలని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్‌ విధానాలను అంతకంటే ఎక్కువగా అమలు జరుపుతున్నదనటానికి దిగువ వివరాలు చూడండి.

   సమాజంలో అత్యంత నిరుపేదలు కొనుగోలు చేసే లేదా ఎగుమతి చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో తెలుసా ?చాయ్‌ వాలా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది(2014-15)లో రు. 44,962 కోట్ల రూపాయలు, మరి రెండో సంవత్సరం రు.61,126 కోట్లు. సర్‌ గోచిపాత రాయుళ్లు ఎక్కే విమానాలను దిగుమతి చేసుకున్న విమానాలపై ఇచ్చిన సబ్సిడీ రు.2,945 కోట్ల నుంచి రు.3,516 కోట్లకు పెరిగింది. ఇక వాటికి పోసే పెట్రోలుకు ఇస్తున్న సబ్సిడీ 762 కోట్లు .ఇవి గాక బీదా, బిక్కీ ఎక్కే విలాసవంతమైన కార్లపై ఇచ్చిన రాయితీ రు 20,141-18,260 కోట్ల మధ్య వుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలలో అధికారికంగా రాసినవే. ఇన్ని రాయితీలు ఇచ్చిన కేంద్రం వుద్యోగులకు పన్ను మినహాయింపు విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపుతోంది. పన్ను రాయితీలు అక్కరలేదు, ధరల పెరుగుదలను కూడా స్ధంభింప చేయండి చాలు అని అనేక మంది అంటుంటారు, పోనీ అదైనా చేస్తోందా లేదే. జనం దగ్గర గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ ప్రోత్సాహక పధకాల పేరుతో ఇస్తున్న పరోక్ష రాయితీల మొత్తం పెరుగుతున్నది. అయినా సరే కార్పొరేట్‌, ఇతర బడా కం పెనీలు, పెద్దలు తీసుకున్న రుణాల ఎగవేత కూడా ఏటేటా పెరుగుతున్నది. మరోవైపు మరి ఈ రాయితీల సొమ్మంతా ఎటు పోతున్నట్లు ? గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న రాయితీల మొత్తం ఇలా వుంది. (కోట్ల రూపాయలలో)

2012-13 5,66,234.7

2013-14 5,72,923.3

2014-15 5,54,349.04

2015-16 6,11,128.31

    కేవలం నాలుగు సంవత్సరాలలోనే 22 లక్షల కోట్ల రూపాయలు వివిధ రాయితీల కింద ఇచ్చారు. నిజంగా కాంగ్రెస్‌ విధానాల నుంచి వైదొలిగితే చాయ్‌ వాలా హయాంలో ఈ సబ్సిడీలు తగ్గాలి కదా, చాయ్‌ రేటు కూడా పెరిగిపోయిందా లేదా ? అవే దివాళా కోరు ఆర్ధిక విధానాలు, అంతకంటే ఎక్కువగా అమలు. అందుకే రెండేళ్లలోనే వైఫల్యాల బాట.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్న సామెత తెలిసిందే. అలాగే తమ విధానాలు వైఫల్యం చెందుతాయని నరేంద్రమోడీకి, ఆయనకు మార్గదర్శకంగా వున్న సంఘవపరివార్‌కు తెలియని విషయమేమీ కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్రమోడీ మౌన వ్రతం పూనారు. ఏ ఒక్క కీలక సమస్యపైనా మాట్లాడరు. మరోవైపు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక అంశాలను ముందుకు తెస్తున్నారు.

   వాటిలో స్వచ్చభారత్‌ ఒకటి. నిజమే దీనితో విబేధించాల్సిన అవసరం లేదు. దీని గురించి కొండంత రాగం తీశారు.ఎక్కడ చూసినా అశుభ్రం తప్ప మరొకటి కనపడటం లేదు. చరిత్రలో ఔరంగ జేబు అనేక పన్నులు చివరికి తల పన్ను కూడా విధించాడని చదువుకున్నాం. ఈ ఆధునిక ఔరంగజేబు మురికి పన్ను విధించేందుకే ఇంత ప్రచారం చేశారనేది ఇప్పుడు రుజువైంది. రెండవది అనధికారిక ఎజండాగా గో సంరక్షణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీని గురించి ఎవరి నమ్మకాలు వారికి వున్నాయి. రోజూ గోమూత్రం తాగే వారు కూడా వున్నారు. తాగనివ్వండి, అనారోగ్యం పాలు కానివ్వండి, కార్పొరేట్‌ అసుపత్రులకు లక్షల రూపాయలు సమర్పయామి చేసుకోమనండి. అది వేరే విషయం.

   మన దేశంలో ఆస్తికులతో పాటు నాస్తికులు కూడా సహజీవనం చేశారన్నది పదే పదే చెప్పుకోనవసంర లేదు. ఆరేడు వందల సంవత్సరాల నాడే యోగి వేమన గొప్ప హేతువాది, నాస్తికుడు. అంతకు ముందు చార్వాకులు,లోకాయతులు వున్నారు. అలా భిన్నఅభిప్రాయం వుండటమే, సహన భావమే మన భారతీయ సంస్కృతి. లేకుంటే భిన్న ఆచారాలు, ఆలోచనలు,తత్వ శాస్త్రాలు మనుగడలో వుండేవే కావు. ఆ పరంపరలోనే కర్ణాటకలో కలుబుర్గి అనే రచయిత అనేక రచనలు చేశాడు. వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా ఇచ్చింది. ఆయన రచనలు హిందుత్వకు వ్యతిరేకం అంటూ హిందూ తాలిబాన్లుగా పరిగణిస్తున్నవారు ఒక రోజు కాల్చి చంపారు. తన అవార్డు పొందిన ఒక రచయిత దారుణ హత్యకు గురైతే కనీసం ఖండించటం కనీస సంస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ ఆ పని చేయకపోగా తిరస్కరించింది. అనేక మంది అవార్డు గ్రహీతలు తమ అవార్డులను తిరిగి ఇచ్చి నిరసన తెలిపిన తరవాత గానీ మొక్కుబడిగా ఖండించలేదు. దీని గురించి కూడా కేంద్రం స్పందించలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని హిందూతాలిబాన్లు రెచ్చిపోతున్న స్థితి దేశంలో తలెత్తింది. దీనికి కారణం ఏమిటి కేంద్రంలో తమకు అనుకూలమైన సర్కార్‌ వుందనే ధీమా తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో యుమునా నది ఇప్పటికే కాలుష్యమైంది. అలాంటి దానిని మరింత కాలుష్యం చేసే విధంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ 35లక్షల మందిని సమీకరించే ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అందువలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుందని అనేక మంది పర్యావరణ సంరక్షణ కోరుకొనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వాదన సబబే అని కోర్టు కూడా ఐదు కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాంటి సభలకు పశ్చిమ దేశాలలో అనుమతి ఇవ్వరని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానికి అభ్యంతర పెట్టటమే తప్పు దేశద్రోహం అన్నట్లుగా విమలేందు ఝా అనే కార్యకర్తపై ఓంజీ అనే ఒక స్వామి రెచ్చిపోతూ హేతువాది నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలబర్గిల మాదిరే నిన్ను హత్య చేస్తాం, నువ్వొక సిఐఏ ఏజంట్‌,ద్రోహివి, జాతి వ్యతిరేకివి అంటూ కెమెరాల ముందే బెదిరింపులకు దిగాడు. వీరు స్వాములా ? గూండాలా ? ఏ దమ్ము చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నారు?

   ఒక ముస్లిం కుటుంబం పండుగ సందర్భంగా గొడ్డు మాంసం తెచ్చుకొని వండుకోవటమేమిటి? అది గో మాంసం అని కొందరు దేవాలయ మైకులో ప్రకటించటం, వందలాది మంది ఆ ఇంటిపై దాడి చేసి కుటుంబ యజమానిని హత్య చేయటం మధ్య యుగాలలోనో అంతకు ముందు ఆటవిక యుగంలో చేసే పని తప్ప మరొకటి కాదు. తీరా అది గోమాంసం కాదని తేలింది. దేశమంతటా దాని గురించి ఆవేశకావేషాలను రెచ్చగొట్టింది ఎవరు ? ఆ సామూహిక హత్యకు పాల్పడిన నేరగాళ్లను అరెస్టు చేస్తే దానికి వ్యతిరేకంగా బిజెపి వారు రంగంలోకి రావటాన్ని బట్టి దీని వెనుక వారి పధకమే వుందని జనం అనుకున్నారు.దేశమంతటా చర్చనీయాంశం అయింది, దాని గురించి మాట్లాడవయ్యా అంటే మోడీ నోరు విప్పరు.

   అప్జల్‌ గురు అనే వుగ్రవాది నాయకత్వంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని కోర్టు తీర్పు చెప్పి వురి శిక్ష విధించింది. అసలు వురిశిక్షలనే వ్యతిరేకిస్తున్నవారు మన దేశంలో వున్నారు. వురి శిక్ష పడిన ఎవరైనా క్షమా భిక్ష కోసం దరఖాస్తు చేసుకోవటానికి చట్టం అవకాశం ఇచ్చింది. వారు వుగ్రవాదులా మరొక దారుణం చేసిన వారా అనేది ఎక్కడా లేదు. ఆ విధంగా చూసినపుడు అప్జల్‌ గురుకు తగిన అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వురి తీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అదే అభిప్రాయంతో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు సభ పెట్టారు. ఆ వురిని ఖండించారు.అలాంటి సభలు కాశ్మీర్‌లో, దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక జరిగాయి. ఇష్టం వున్న వారు పాల్గొన్నారు. లేనివారు లేదు. కానీ అలాంటి సభ జరపజరపటం దేశ ద్రోహం, విశ్వవిద్యాలయ దేశ ద్రోహ కార్యకలాపాలకు నిలయంగా మారింది చర్యలు తీసుకోండంటూ ఇద్దరు కేంద్రమంత్రులు లేఖలు రాయటం వారిని మెప్పించేందుకు ఐదుగురు దళిత విద్యార్ధులపై చర్యలు తీసుకోవటం, వారిలో ఒకరైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. తీరా అది కేంద్ర ప్రభుత్వం, బిజెపి మెడకు చుట్టుకోవటంతో ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకు అసలు రోహిత్‌ దళితుడు కాదు బిసి అని బిజెపి అనుబంధ ఎబివిపి వారు ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు.

    అప్జల్‌గురు వురితీయటం సరైంది కాదు అన్న అభిప్రాయం వ్యక్తం చేయటమే దేశద్రోహమైతే అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమే కాదు, గురు అస్తికలను కాశ్మీర్‌కు అందచేయాలని కోరిన కాశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పిడిపి)తో కలసి బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అది దేశ ద్రోహం కాదా ? కాశ్మీర్‌లో వేర్పాటు వాదానికి గురైన ప్రతి ఒక్కరూ అప్జల్‌ గురు వురిని వ్యతిరేకిస్తారు.అందరినీ దేశద్రోహులు కింద జమకట్టి చర్యలు తీసుకుంటారా ?

   ఈ వుదంతం సద్దుమణగ ముందే ఢిల్లీలోని జెఎన్‌యులో మరో చిచ్చు రేపారు. అక్కడ కూడా అప్జల్‌ గురు వురి మీదే కొంత మంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. దానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతించారు. చివరి నిమిషంలో ఏబివిపి జోక్యం చేసుకొని అ సభ జరగటానికి వీల్లేదు అంటూ అభ్యంతర పెట్టింది. దాని వత్తిడికి లొంగి పోయిన అధికారులు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దాంతో సభ నిర్వాహకులు విశ్వవిద్యాలయంలోని ఇతర విద్యార్ధి సంఘాలు, విద్యార్ధి యూనియన్‌ నాయకులను కలసి సభ జరుపుకొనేందుకు తమకు సహకరించాలని సాయం కోరారు. ఈ రోజు ఏబివిపి వత్తిడితో ఈ సభ అనుమతిని రద్దు చేసిన వారు రేపు తమ సభలనైనా అడ్డుకుంటారనే భయంతో అన్ని సంఘాలు ఏకమైన ముందు ఇచ్చిన అనుమతి ప్రకారం సభ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని వత్తిడి తెచ్చాయి. దాంతో లౌడ్‌ స్పీకర్లు లేకుండా సభ జరుపుకోవచ్చని అధికారులు

  షరతులతో అనుమతి ఇచ్చారు. అయితే ఆ సభను అడ్డుకోవాలని ఎబివిపి నిర్ణయించి తమ మద్దతుదార్లను సమీకరించటంతో సభ ప్రాంగణంలో మిగతా విద్యార్ధి సంఘాల కార్యకర్తలు కూడా అక్కడే వున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. జెఎన్‌యు వివిధ భావజాలలను స్వేచ్చగా చర్చించుకొనేందుకు అనువైన వాతావరణం ఒక నిజమైన ప్రజాస్వామిక కేంద్రం. ఇక్కడ వామపక్ష వాదులు, నక్సలైట్లు, వేర్పాటు వాదులు, అరాజకవాదులు, ఇతర అన్ని రకాల భావజాలంతో వుండే విద్యార్ధులు వున్నారు. అలాంటి వారిలో కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్దించే నక్సలైట్లు, ఇతరులు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సభను ఏర్పాటు చేశారు. ఆ విషయం విశ్వవిద్యాలయ అధికారులకూ తెలియందేమీ కాదు. వారి భావజాలాన్ని, కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఆ సభకు ఎందుకు వెళ్లారని అనేక మంది అడగవచ్చు.వివాదాస్పద అంశాలపై సభలు జరగటం అక్కడ కొత్త కాదు. అసలు అధికారులు లేదా శాంతి భద్రతల సమస్య తలెత్త వచ్చని నిఘావర్గాలు హెచ్చరించినపుడు తొలుత అనుమతి నిరాకరించి వుంటే వుంటే అది నిర్వాహకులు- అధికారుల మధ్య సమస్యగా వుండేది. ఏబివిపి రంగ ప్రవేశంతోనే అసలు సమస్య వచ్చింది. షరతులతో కూడిన సభ జరిగింది. దానిలో చేసిన వుపన్యాసాలు, వాటిలోని అంశాలతో మిగతా విద్యా ర్ధి సంఘాలకు ఎలాంటి ప్రమేయం ఏకీభావం లేదు. దానిని ఎబివిపి అడ్డుకోవటంతో అక్కడ గొడవ జరిగింది. కొంత మంది బయటి నుంచి వచ్చిన వారు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇదీ జరిగింది. కానీ చివరికి అది ఎలా మారిపోయింది?

     విద్యార్ధి యూనియన్‌ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు అక్కడ చేరి దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, అందువల వారిపై దేశద్రోహం నేరం కింద పోలీసులు కేసు బనాయించారు. అనేక మంది విద్యా ర్ధులకు నోటీసులు ఇచ్చారు. వారిలో కొందరు సభా నిర్వాహకులు కూడా వున్నారు.ఇక్కడ చిత్రమేమంటే నిజంగా నినాదాలు ఇచ్చిన వారిలో ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేదు.వీడియోను మార్ఫింగ్‌ చేసి నినాదాలు చేయని వారు చేసినట్లు తయారు చేసిన నకిలీ వీడియోల ఆధారంగా కేసులు బనాయించి కన్నయ్యను అరెస్టు చేశారు. తీరా అవి నకిలీవి, అతను ఆ నినాదాలు చేయలేదని తేలటంతో ఆరునెలల బెయిలు ఇచ్చారు. కన్నయ్యను కోర్టులో హాజరు పరిచినపుడు బిజెపి ఎంఎల్‌ఏ, లాయర్ల ముసుగులో వున్న కొందరు కన్నయ్య మీద, వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. కన్నయ్య అరెస్టును ఖండించిన వారందరినీ దేశద్రోహులుగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. దాడులను రెచ్చగొట్టారు. మహిళా జర్నలిస్టులను మానభంగం చేస్తామని బెదిరించారు. అన్నింటికంటే దారుణం జెఎన్‌యులో రోజుకు మూడు వేల కండోమ్‌లను వినియోగిస్తారని, మందుతాగుతారని స్వయంగా బిజెపి ఎంఎల్‌ఏ తప్పుడు ప్రచారానికి దిగాడు. అక్కడ చదివే వారిలో ఎబిపివి చెప్పే భారత మాత పుత్రికలు, పుత్రులు కూడా వున్నారని అది వారికి కూడా వర్తిస్తుందనే జ్ఞానం సదరు నేతకు లేకపోయింది. వీటిపై కూడా నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు.అందుకే దేశంలో ఏం జరుగుతోంది, ఎటు పోతోంది అని ప్రతివారూ ఆలోచించాల్సిన తరుణం ఇది. బిజెపి పూర్వీకులు స్వాతంత్య్ర వుద్య మ సమయంలో బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి లొంగిపోయి లేఖలు రాసిన చరిత్ర కలిగిన వారు. అందుకే భగత్‌ సింగ్‌, రాజగురు,సుఖదేవ్‌లను వురితీసినపుడు వారెక్కడ వున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాంటి వారు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువలన ఏది దేశభక్తి, ఏది దేశ ద్రోహం అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చర్చించాలి. విదేశీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇవ్వటం, మన సొమ్మును విదేశాలకు తరలించుకుపోనివ్వటం ప్రభుత్వ విధానంగా వుంది.ఇది దేశద్రోహమా దేశ భక్తా ?ఈ విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే ఇప్పుడున్న బ్రిటీష్‌ కాలం నాటి చట్ట ప్రకారం దేశద్రోహ నేరం కింద జైల్లో పెట్ట వచ్చు.జర్మనీలో హిట్లర్‌ కూడా దేశ భక్తి, జాతీయ వాదంతోనే రెెచ్చగొట్టి తనను వ్యతిరేకించిన వారిని మారణకాండకు బలిచేశాడు. ఇప్పుడు మనదేశంలో కూడా నేను చెప్పిందే దేశభక్తి కాదని కాదన్న వారిని ఖతం చేస్తా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు మనకేమీ ముప్పులేదులే అని ఎవరైనా అనుకుంటే మనదాకా వచ్చినపుడు అయ్యో పాపం అనేవారుండరు .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పరివార్‌ ప్రొడక్షన్స్‌ తాజా చిత్రం ‘డర్టీ పిక్చర్‌’

12 Saturday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

dirty picture, JNU, JNU ROW, JNUSU, kanniah kumar, parivar, RSS, RSS game

సత్య

   జెఎన్‌యు విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ను దేశద్రోహిగా చిత్రించేందుకు అతని బహిరంగ కార్యక్రమాలను తప్పుపట్టటంలో ఘోరంగా విఫలమైన పరివార్‌ యంత్రాంగం ఇప్పుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ప్రచారంతో అతని ప్రయివేట్‌ పార్టుల(మర్మావయాల)ను వెతికే పనిలో పడింది. జెఎన్‌యులో రోజుకు మూడువేల కండోమ్‌లను వుపయోగిస్తారంటూ కచ్చితంగా లెక్క పెట్టి చెప్పిన పార్టీ త్వరలో కన్నయ్య ప్రయివేట్‌ పార్టుల గురించి ఒక వీడియోను రూపొందించి విడుదల చేసి తమతో చేతులు కలిపిన టీవీఛానల్స్‌, సామాజిక మీడియాలో ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలను ఎంత నీచ స్థాయికి దిగజార్చుతున్నారు !

    గత సంవత్సరం ఒక రోజు కన్నయ్య జెఎన్‌యు ప్రాంగణంలో ఒక చోట బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో సమీపంలో వున్న ఒక మాజీ విద్యార్ధిని అభ్యంతర పెట్టింది. అతని ప్రవర్తన అభ్యంతరకరంగా వుందని అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు విచారణ జరిపి మూడువేల రూపాయల జరిమానా విధించారు. దానిని అతను చెల్లించాడు. దాంతో ఆ వుదంతం ముగిసింది. తరువాత జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో అతను పోటీ చేశాడు, గెలిచాడు. మూత్ర విసర్జన వుదంతాన్ని ఇప్పుడు బయటకు తీసి దాన్ని అందమైన భాషతో వర్ణించి విప్లవం గురించి కబుర్లు చెప్పే కన్నయ్య బహిరంగ మూత్ర విసర్జన చేయటం ఏమిటి, దాన్ని అభ్యంతర పెట్టిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించటం విప్లవ కార్యక్రమమా అంటూ ఆ యువతి పేరుతో తయారు చేసిన ఒక లేఖను తీసుకొని ప్రతివారినీ తట్టి మరీ చదివిస్తున్నారు. హద్దులు మీరనంత వరకు, నేరం కానంత ఎవరికైనా ఏం చేయటానికైనా అభ్యంతరం లేదు. దీనిపై ఎఐఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటన చేస్తూ కన్నయ్య జరిమానా చెల్లించిన మాట వాస్తవమేనని, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనేది తప్పుడు ఆరోపణ అని పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

   ఇక్కడ సమస్య ఏమిటంటే కన్నయ్య బహిరంగ మూత్ర విసర్జనను ఎవరూ సమర్ధించరు అది ముగిసిపోయిన అంశం. మన దేశంలో బహిరంగ మల, మూత్ర విసర్జన ఒక పెద్ద సామాజిక సమస్య.పట్టణాలలో వుండేవారికి ఇది నిత్యం కనిపించే దృశ్యం.దాని మంచి చెడ్డల గురించి వేరే సందర్బంలో చర్చించుకోవచ్చు. గతేడాది జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఎబివిపి కూడా పోటీ చేసింది. సాధారణంగా ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్ధుల గురించి విద్యార్దినీ, విద్యార్ధులు ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. ప్రత్యర్ధులు సందు దొరికితే ప్రతి లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఎబివిపి ఆ ఎన్నికలలో ఈ డర్టీ పిక్చర్‌ను ముందుకు తేలేదు. నిజంగా కన్నయ్య మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే కీచకుడే అయితే అతను అరెస్టయినపుడు వందల మంది విద్యార్ధినులు ప్రదర్శనలు, సభల్లో పాల్గొని వుండేవారా ?

    కన్నయ్యపై దేశద్రోహ నేరం కట్టుకధ అని తేలటంతో పరివార్‌ రెండో డర్టీ సీన్‌కు తెరతీసింది. ఇలాంటి ఎత్తుగడలు పశ్చిమ దేశాలనుంచి అరువు తెచ్చుకున్న బాపతు తప్ప భారతీయ సంస్కృతి కాదు. నరేంద్రమోడీతో సహా అనేక మంది ఆరాధించే అమెరికాలో అక్రమ సంబంధాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు, కోపం వస్తే విడాకులిచ్చి మరొకర్ని చూసుకుంటారు. వారు అంతకు ముందు ఎలా తిరిగినా ఫరవాలేదు, పట్టించుకోరు. అందుకే అక్కడ ఏ తల్లికి జన్మించారు అనేది ముఖ్యం. ఎవరైనా ఎన్నికలలో పోటీ చేస్తే ప్రత్యర్ధులు వారి రంకు, గొంకులు, అవినీతి అక్రమాలను ముందు పెట్టి వుతుకుతారు. అంతకు ముందు మనకు తెలియని అనేక విషయాలను ప్రచారంలో పెడతారు, అవి వాస్తవమా కాదా అని తేలే లోపల ఎన్నికలు అయిపోతాయి. ఇప్పుడు దేశద్రోహం అనే తప్పుడు కేసులో బెయిలుపై బయటకు వచ్చాడు. దాన్ని గురించి ఇంక ఎన్నికధలు చెప్పినా జనం నమ్మే స్ధితిలేదు. అందుకని ఈ డర్టీ ప్రచారానికి తెరలేపారు.

   గురివింద గింజ తన కింది నలుపెరగదట. గుజరాత్‌లో ఒక యువతి ఎక్కడికి వెళుతోంది, ఎవరితో తిరుగుతోందో తెలుసుకొని తనకు నివేదించమని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీ ఆదేశించిన విషయాన్ని పరివార్‌ దాచి పెట్టినా దాగేది కాదు. కుమార్తె ప్రవర్తన గురించి ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే అలా ఏర్పాటు చేసినట్లు ఆ చర్యను సమర్ధించుకున్నారు. ఇది భారతీయ యువతుల గౌరవాన్ని పెంచే, మాన మర్యాదలను కాపాడే చర్యగా కన్నయ్యపై లేఖ రాసిన యువతికి గాని దాన్ని పట్టుకుతిరుగుతున్న పరివారానికి గానీ కనిపిస్తోందా ?

   ఆశారాంబాపు ఒక బాలికపై అత్యాచార కేసులో జైలులో వున్న పెద్దమనిషి. అతగాడి అనుగ్రహం కోసం తపించినవారిలో నరేంద్రమోడీ ఒకరు. ఆశారాం నిజస్వరూపం తెలిసిన తరువాత కూడా వుమాభారతి వంటి నేతలు అతనికి మద్దతుగా మాట్లాడటాన్ని చూసి రాజకీయంగా నష్టదాయకం కను ఎవరూ నోరు విప్పవద్దని 2013లో మోడీ కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది సుబ్రమణ్యస్వామి జైలులోవున్న బాపును కలసి నువ్వు నిరపరాధివి బెయిలు పిటీషన్‌పై నీ తరఫున నేను వాదిస్తా అని చెప్పి జోద్‌పూర్‌ కోర్టులో వాదించాడు. అప్పటికే దిగువ, గుజరాత్‌ హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా బెయిల్‌ పిటీషన్‌ను ఐదుసార్లు తిరస్కరించిన ఈ కేసును వాదించకపోతే సుబ్రమణ్యస్వామికి రోజు గడవదా ? ఆ స్ధాయిలో వున్నవారు ఇలాంటి చర్యల ద్వారా ఏ సందేశం పంపారు. వీరు జెఎన్‌యు విద్యార్ధుల గురించి గుండెలు బాదుకుంటున్నారు? సమాజానికి నీతులు చెబుతున్నారు.

   ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది బిజెపి నేతలు వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. వీరు రెచ్చగొట్టే మతోన్మాదం, అసహనం, కుహనా దేశభక్తి వంటి ముప్పు తెచ్చే అంశాలను వదలి వారి డర్టీ పిక్చర్స్‌పై కేంద్రీకరించటం అంటే అసలు సమస్యను పక్కదారి పట్టించటమే.

   కన్నయ్య ఇతర జెఎన్‌యు విద్యార్ధుల విషయంలో బిజెపి ఇప్పుడు ఇరకాటంలో పడింది. పులినెక్కిన మాదిరి వారి పరిస్థితి వుంది. దాన్ని అదుపులోకి అయినా తెచ్చుకోవాలి లేదా దానికి బలి కావాలి. దానిలో భాగంగానే గోబెల్స్‌ మాదిరి వారి తప్పుడు ప్రచారాన్ని కొనసాగించటం, వాటికి తోడు ఫలానా వాడు ఫలానా విధంగా జిప్‌ విప్పాడు, ఫలానాచోట మూత్రం పోశాడు వంటి అంశాలను ముందుకు తీసుకు వచ్చి తమపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకు చూసే ఎత్తుగడమాత్రమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జెఎన్‌యు ఘటనల్లో మీడియా విశ్వసనీయతను దెబ్బ తీసిన కొన్ని సంస్ధలు

08 Tuesday Mar 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, Bjp nationalism, credibility, JNU, JNU ROW, journalists, Media, media credibility, nationalism

జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

ఎం కోటేశ్వరరావు

    చదువరులను చంపటానికి రచయిత తన పెన్నును గన్నుగా వుపయోగిస్తాడని ఒక పెద్దమనిషి చెప్పాడు.టీవీలు తలుచుకుంటే విద్యార్ధుల జీవితాలను అంతం చేయటానికి, విద్యా సంస్ధల పరువు ప్రతిష్టలను గంగలో కలపటానికి నకిలీ వీడియోలను వీక్షకుల ముందుంచుతాయని తాజాగా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) వుదంతాన్ని చూసిన తరువాత ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని టీవీ ఛానల్స్‌ ప్రసారం చేసిన రెండు వీడియోలు నకిలీవని తిమ్మిని బమ్మిని చేశారని హైదరాబాద్‌లోని ట్రూత్‌ లాబ్‌ వెల్లడించింది. దీంతో మొత్తం మీడియా పరువు కాలుష్య గంగలో కలిసింది . ఏప్రిల్‌ ఒకటవ తేదీన చదువరులను, వీక్షకులను ఫూల్స్‌ చేయటానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు చేసేవిన్యాసాలలో అలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తాయి, చివరిలో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భం అని చెబుతాయి. కానీ ఇప్పుడు అటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. వాటిని చూసి ఎవరైనా దాడులకు దిగినా ఆశ్చర్యం లేదు. అంతగా మీడియా విశ్వసనీయత కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు.

   మీడియా నిష్పాక్షికంగా వుండదని తెలుగు నేలలో జనానికి 1940,50 దశకాలలోనే తెలుసు.కమ్యూ నిస్టులకు వ్యతిరేకంగా, మహత్తర తెలంగాణా సాయుధ పోరాటాన్ని దెబ్బతీసేందుకు కట్టు కధలకు మీడియా పుట్టినిల్లని అవగతమైంది.తరువాత నాలుగు దశాబ్దాల క్రితం అత్యవసర పరిస్ధితి సమయంలో కొన్ని పత్రికలు నిరంకుశత్వాన్ని, నియంతలను కూడా ఎలా బరపరుస్తాయో దేశమంతా చూసింది. బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు కూడా మీడియా వెనుకాడదని ఆ సమయంలో మరి కొన్ని పత్రికలు, టీవీలు రుజువు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు టీవీ, పత్రికలను స్వయంగా ఏర్పాటు చేసుకుంటే, మరికొన్ని పార్టీలు స్వతంత్రముసుగులో పనే చేసే వాటిని తమ బాకాలుగా మలుచుకోవటమూ తెలిసిందే. ఇప్పుడు జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

     ప్రతి కీలక సమయంలోనూ మీడియా రెండు తరగతులని వెల్లడి అవుతూనే వుంది. స్వాతంత్య్రానికి ముందు ప్రధాన స్రవంతి మీడియా రెండు రకాలు. ఒకటి స్వాతంత్య్రాన్ని కోరుకున్న దేశ భక్త తరగతి, రెండవది బ్రిటీష్‌ వారి పాలన కొనసాగాలని పాటుపడిన రాణీగారి ప్రతిపక్ష తరగతి. ఇప్పుడు కూడా మీడియా ఒకటిగా లేదు. ప్రజా వుద్యమాలు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రచార మీడియా . మిగతా వాటిలో ఎన్నో వుప తరగతులున్నాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేము. కొన్ని పెట్టుబడులతో నడిచేవే అయినప్పటికీ లౌకిక, వుదారవాద విలువలకు కట్టుబడుతున్నాయి. మరికొన్ని కుల, మతోన్మాద శక్తులకు , తిరోగమన భావాలకు పెద్ద పీట వేస్తున్నాయి. వీటి గురించి లోతైన విశ్లేషణ జరగాల్సి వుంది. ప్రస్తుతం జెఎన్‌యు సంబంధిత వ్యవహారాల సందర్బంగా మీడియా ఎలా వ్యవహరించింది అన్నదానికే పరిమితం అవుదాము.

   జెఎన్‌యు పరిణామాలను చూసిన అనేక మంది భారత్‌లో ఏదో అవాంఛనీయ పరిణామం జరగబోతోందని భయపడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. వర్షం రాబోయే ముందు మట్టికి ప్రత్యేక వాసన వస్తుంది. అది మధురంగా వుంటుంది. కానీ జెఎన్‌యు పరిణామాల సందర్భంగా కొన్ని మీడియా సంస్ధలు వ్యవహరించిన తీరు అశుభాన్ని సూచించింది. ఇక్కడ శుభం-అశుభాల గురించి విశ్వాసం సమస్య కాదు. ఒక ప్రమాదకర, ఏకపక్ష భావజాలానికి అనుగుణంగా ఒక వర్గం మీడియా తన వంతు నృత్యం చేయటం నిజంగా భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక అని చాలా మంది భావిస్తున్నారు. ఇటువంటి ధోరణులు గతంలో లేవా అంటే బాబరీ మసీదు విధ్వంసం, గుజరాత్‌ మారణహోమం, అనేక ప్రాంతాలలో జరిగిన మత దాడులు, ఘర్షణల సందర్భంగా కూడా వెల్లడైంది. దానితో పోల్చి చూసినపుడు ఇది మరింత ప్రమాదకరం.బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను ఎదిరించేందుకు మన దేశంలో ముందుకు వచ్చిన జాతీయ వాదానికి, ప్రపంచ ఆక్రమణకు హిట్లర్‌ ఎంచుకున్న జాతీయ వాదానికి తేడా వుంది. దానిని గుర్తించితే ఇప్పుడు దేశంలో ముందుకు తీసుకు వస్తున్న జాతీయ వాదం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హిట్లర్‌ జాతీయ వాదంలోని కొన్ని ప్రమాదకర లక్షణాలు కాషాయ మార్కు జాతీయ వాదంలో వున్నాయి. పాకిస్ధాన్‌ వ్యతిరేకతే అసలైన దేశభక్తిగా , కొన్ని సమస్యలపై తమ వైఖరితో ఏకీభవించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రించి, వారిపై రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. హిట్లర్‌ నాడు యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే నేడు ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారన్నది ఒక అభిప్రాయం. నాడు అనేక మంది హిట్లర్‌ ప్రచారానికి ప్రభావితులై రాగల ప్రమాదాన్ని చూసేందుకు నిరాకరించి ఒక చివరకు వెళితే అదే జర్మనీలో నేడు హిట్లర్‌ పేరును పలకటానికి కూడా జనం ఇచ్చగించకుండా వుండం, జాతీయ వాదం అంటేనే ఆమడ దూరం పోవటం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనిపిస్తోంది. అయితే జర్మన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని ఎంతగా నాశనం చేసిందో, మన దేశంలో ముందుకు తెస్తున్న కుహనా జాతీయ వాదం అదే స్దాయిలో నష్టాలను కలిగించవచ్చు.

      ఈ పూర్వరంగంలో చరిత్ర పాఠాలు తీసుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద లేదా ? వాస్తవాలకు విరుద్దంగా యాజమాన్యాల మనసెరిగి వార్తలనుమలచటం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ కొట్టిన పిండే.అది నైతికమా కాదా అన్న చర్చ వచ్చినపుడు వెల్లడౌతున్న ధోరణులేమిటి? మనకు వేతనాలిచ్చి పనిచేయించుకుంటున్నపుడు యజమానులు చెప్పినట్లు నడుచుకోకపోతే వుద్యోగాలు వుండవు కదా అన్నది ఒకటి. యజమానుల ఆదేశాలు ఎక్కడా రాతపూర్వకంగా లేదా సాక్ష్యాలకు ఆధారాలు లేకుండా వుంటాయి కనుక, వుద్యోగం కావాలంటే వారు చెప్పిన తప్పుడు పనులు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతి పదికిలోల బియ్యానికి ఒక కిలో మట్టి పెడ్డలు కలపమని మిల్లు యజమాని ఒకసారే చెపుతాడు. ఎప్పుడైనా పట్టుపడ్డారనుకోండి, కార్మికులే సరిగా మట్టి పెడ్డలను తొలగించలేదని జనం ముందు కేకలు వేస్తాడు, కేసులు వస్తే ఒకరో ఇద్దరో చిరుద్యోగులను బలి చేస్తాడు. అలాగే మీడియా సంస్ధలు కూడా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదు. అందువలన వార్త పవిత్రమైనది కాదు. తెనాలిరామకృష్ణ సినిమాలో నియోగి అంటే ఎలా కావాలంటే అలా వినియోగ పడేవాడు అని భాష్యం చెప్పినట్లుగా ఇప్పుడు వార్త వున్నది. కనుక ఎవరైనా మేము పక్షపాత రహితంగా వార్తలు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారంటే అనుమానించాల్సిందే. జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఇటీవల మన కళ్ల ముందే జరిగిన రిలయన్స్‌ కంపెనీ గ్యాస్‌ దొంగతనానికి పాల్పడటం గురించిన వార్త అందరికీ ప్రాముఖ్యత కలిగినదే, కానీ కొన్ని పత్రికలు, టీవీలు ప్రముఖంగా ఇస్తే మరికొన్ని ఆ ఏదో జరిగిందటలే అన్నట్లు ఇచ్చాయి. ఏ కోర్టులైనా జోక్యం చేసుకొని సిగిరెట్‌ పాకెట్లు, మద్యం సీసాలపై చట్టబద్దమైన హెచ్చరికల మాదిరి మా వార్తలు మా యజమానుల ఆలోచనలకు లోబడే వుంటాయి అని ఆదేశిస్తే ప్రతివార్తకూ కాకపోయినా ప్రతి పేజీలో పాఠకులకు కనపడేట్లు, టీవీలలో అయితే కింద స్క్రోలింగ్‌ వేసుకోవాలి. అలాంటి హెచ్చరికలు వున్నా మద్యం, సిగిరెట్లు తాగే వారు లేరా అంటే ఆ విషయం ఆదేశించిన వారికీ తెలుసు.

    ఇప్పుడు అలా చేయటం లేదు అంతా నిఖార్సయిన పక్కా నిజమైన వార్తల పేరుతో నడుస్తోంది. అవి వివాదాస్పదం అయినపుడు లేదా కొందరికి కోపకారణమైనపుడు బలౌతున్నది జర్నలిస్టులు తప్ప యజమానులు కాదు. వేతనాలు తీసుకొని పని చేస్తున్నంతమాత్రాన తప్పుడు పనులు చేయాలని లేదు.మనం నాగరికులం, దేశ పౌరులం, మనకూ బాధ్యతలు కూడా వున్నాయని గుర్తించాలా లేదా ? జెఎన్‌యు వుదంతంలో ‘ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తూ అనేక మంది విద్యార్ధుల కలలు,ఆశలూ, ఆకాంక్షలూ జీవితాలను నాశనం చేసేందుకు పూనుకున్న వైఖరికి నిరసనగా తన వుద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ తన లేఖలో పేర్కొన్నాడు. తనకు మరొక సంస్ధ వుద్యోగం ఇవ్వదని కూడా చెప్పాడు. వర్తమాన మీడియా పరిస్ధితులపై ఇంతటి తీవ్ర విమర్శ, వుద్యోగ భద్రత, స్వతంత్ర అభిప్రాయాలను సహించలేని యాజమాన్యాల ధోరణిపై విమర్శ, నిరసన ఇంతకు ముందు వెల్లడి కాలేదేమో. టీవీ ఛానల్స్‌ జబ్బు పడ్డాయని ఎన్‌డిటీవీ ఎడిటర్‌ రవీష్‌ కుమార్‌ తన నిరసన లేదా ఆవేదన వ్యక్తం చేసేందుకు తన కార్యక్రమాన్ని మొత్తంగా చీకట్లోనే నిర్వహించి మీడియాలో జీవితాలను నాశనం చేసే వారే కాదూ కాపాడాలని కోరుకొనే వారూ కూడా వున్నారని, అందుకు సహకరించే యాజ మాన్యాలు కూడా లేకపోలేదని లోకానికి తెలియ చెప్పారని అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని విధించటానికి నిరసనగా కొన్ని పత్రికలు తొలి రోజులలో సంపాదకీయాల స్ధానాన్ని ఖాళీగా వుంచి పాఠకులకు అందించాయి. ఇప్పుడు జెఎన్‌యు విద్యార్దుల వ్యవహారంలో పోలీసులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నాటి పరిస్థితులను తలపిస్తున్నదని గానీ లేదా మీడియాలో కొందరి హానికరమైన పోకడలను ఎత్తి చూపేందుకు గానీ ఎన్‌డిటివీ ఇలా చేసి వుండవచ్చని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఏమైనా ఇది హర్షణీయమే. ఈ చర్యపై కూడా విరుచుకుపడుతున్నవారు లేకపోలేదు. కొన్ని వుదంతాలను పేర్కొని అప్పుడు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చేసినది సరైనదే అని ముందు వారు అంగీకరిస్తే తరువాత గతంలో ఎందుకు చేయలేదు అని అడగటానికి వారికి నైతికంగా హక్కు వుంది. కానీ వారి తీరు అలా లేదు.అయినా ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలా లేదా ? చర్చ జరగనివ్వండి.

     జెఎన్‌యుపై దాడి చేయటానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అక్కడ జరిగిన ఘటనలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకును సమకూర్చేందుకు తిమ్మిని బమ్మిని చేసి వీడియోలను తయారు చేశారు.వాటిలోని అంశాలు కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యాయి. అసలు వాటిని ఎవరు తయారు చేశారు, ఏ ప్రయోజనాల కోసం తయారు చేశారు అన్నది బయటకురావాల్సి వుంది. పోలీసులు జీ న్యూస్‌లో ప్రసారమైనదానిని బట్టి కేసు నమోదు చేశారు, అలాంటి వీడియో గురించి ఆ న్యూస్‌ అవుట్‌పుట్‌ ఎడిటర్‌ నిరసన తెలుపుతూ రాజీనామా చేయటాన్ని బట్టి జీ న్యూస్‌ పాత్ర వుందా అన్నది అనుమానం. తాను దోషిని కాదని, దానిలో తన పాత్ర లేదని అది నిరూపించుకోవాల్సి వుంది. ఢిల్లీ ప్రభుత్వం నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయనున్నదని వార్తలు వచ్చాయి. నిజంగా చేస్తుందా, చేస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిందే.

    ఆ వీడియోలను ప్రసారం చేయటం ఒక ఎత్తయితే మీడియా యాంకర్లు జెఎన్‌యు విద్యార్ధులను దేశద్రోహులుగా సంబోధించటం, అలాంటి వారికి ఆ సంస్ధ ఆలవాలంగా వుందని చిత్రించటం, వారిపైకి జనాన్ని వుసిగొల్పేలా వ్యవహరించటం తీవ్రమైన అంశం. దేశ ద్రోహం, లేదా దేశ వ్యతిరేకి అని కేసులు పెట్టే పోలీసులే నిందితుడు అని పేర్కొంటారు తప్ప నిర్ధారణగా రాయరు. అలాంటిది మీడియాలో పనిచేసేవారు అలా ఎలా చెబుతారు.ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వుంది. టైమ్స్‌ నౌ ఛానల్‌లో దానిని ప్రసారం చేశారు.దాని గురించి సీనియర్‌ జర్నలిస్టు సిద్ధార్ద వరదరాజన్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. తామసలు ఆ వీడియోను ప్రసారం చేయలేదని తమపై అభాండాలు వేసిందుకు క్షమాణలు చెప్పాలని ఆ ఛానల్‌ కోరింది.తొలుత బుకాయించిన సదరు ఛానల్‌ తరువాత చూసుకోకుండా ప్రసారం చేశామని చెప్పుకుంది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతను ఆ వీడియోను ప్రదర్శించమని టైమ్స్‌ నౌ యాంకర్‌ గోస్వామి పదే పదే కోరటం, దానిని అధికారిక వీడియోగానే పరిగణించినట్లు చర్చను నడపటాన్ని చూస్తే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా , విమర్శనాత్మకంగా వున్నట్లు ఎవరైనా ఎలా అనుకుంటారు? కొన్ని ఛానల్స్‌ అసాధారణరీతిలో జెఎన్‌యు వుదంతాన్ని పదేపదే ప్రసారం చేయటం యాదృచ్ఛికమా, ఒకపధకం ప్రకారం జరిగిందా అన్న అనుమానం ఎవరికైనా కలిగితే దానికి కారకులు ఎవరు ? రాజకీయ నేతలు లేదా సాంస్కృతిక సంస్ధగా చెప్పుకుంటూ రాజకీయాలు నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల వారు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు మీడియా వారికి తేడా లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. యావన్మంది దీని గురించి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు,జడ్జి , తలారి పాత్రలను మీడియా పోషించుతోందన్న అభిప్రాయం మీడియాలో పనిచేస్తున్నవారికి ప్రయోజనకరమా, హాని కరమా ?

    తాము ప్రసారం చేసిన వీడియో సాధికారమైనదా కాదా అన్నది సరి చూసుకోలేదని టైమ్స్‌ నౌ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామి తప్పిదాన్ని తప్పించుకొనేందుకు చెప్పారని అనేక మంది భావిస్తున్నారు.కొత్త గనుక అనుభవం లేక చేశామంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్‌ మీడియా మన దగ్గర కొత్తగా వచ్చింది కాదు. గోస్వామి చిన్నవాడూ కాదు, అనుభవం లేని యాంకర్‌ కాదు. దీని గురించి బిబిసిలో నకిలీ వీడియోలను ఏరివేసే విభాగంలో పనిచేస్తున్న మార్క్‌ ఫ్రాంకెనెల్‌ ఏమంటారంటే ఏది నకిలీ ఏది పక్కా అని తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి చోటా వున్నందున ప్రతి ఛానల్‌ ఒక పద్దతిని పాటించి తనిఖీ చేసిన తరువాతే వాటిని ప్రసారం చేస్తుంది. పక్కా వీడియోలో ధంబ్‌నెయిల్‌ చిత్రాలు వుంటాయి, నకిలీ వీడియోలలో వాటిని తుడిపి వేస్తారు. దాన్ని బట్టి అది తిమ్మిని బమ్మిని చేసిందా కాదా అని తేలిపోతుంది. బడా మీడియా సంస్ధలు తమ స్వంత సిబ్బంది రూపొందించే వీడియోలతో పాటు వార్తా సంస్ధలు, జర్నలిస్టులు కాని పౌరులు పంపే వీడియోలను కూడా స్వీకరించి వుపయోగిస్తాయి. అందువలన అవి నకిలీవా, కాదా అనేది ప్రతిదాన్నీ తనిఖీ చేయాలి.ముఖ్యంగా బయటి నుంచి తీసుకున్న వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని ఫ్రాంక్‌నెల్‌ చెప్పారు. మరి దీనిని మన మీడియా సంస్ధలు ఎందుకు పాటించటం లేదు.లేదా కాకపోతే ఖండిస్తారు, మనకు మరో వార్త వస్తుంది, సంచలనంతో రేటింగ్‌ పెరుగుతుంది అని చూసీ చూడనట్లు వూరుకుంటున్నాయా ?అదే అయితే మీడియాకు జవాబుదారీ తనం లేదా అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.

   అనేక దేశాలలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.అయితే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లుగా ఎవరికి వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినపుడు పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకే అంతిమంగా పెట్టుబడితో ముడిపడిన మీడియా పని చేస్తుందన్నది మనకు కనిపిస్తుంది. సామాన్య ప్రజా ప్రయోజనాలు, ఆ సంస్ధలలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలకంటే యజమానులే ఆ సంస్ధలకు ముఖ్యం. వారి ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే స్వేచ్ఛను అనుమతిస్తారు.అన్నీ అలాంటి సంస్ధలేనా అంటే ఎప్పుడూ కొన్ని మినహాయింపులు వుంటాయి.అవెప్పుడూ మైనారిటీగా, పరిమిత సంఖ్యలో వుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘సంఘపరివార్‌కు అభినందనలు ‘

06 Sunday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

ANTI NATIONAL, BJP, Bjp nationalism, Durga, HRD ministry, JNU, JNU ROW, Mhishasura, nationalism, RSS, sangh parivar

ఎక్కడైతే తమ భావజాలానికి తావివ్వకుండా సాధ్యమైన మేరకు ప్రతిఘటిస్తోందో, దాని సంగతేమిటో తేల్చాలనుకున్నారో , తమ పెత్తనాన్ని రుద్దాలనుకున్నారో అదే జెఎన్‌యులో ఎబివిపి నాయకులు ముగ్గురు తమ నాయకత్వం మీద తిరుగుబాటు చేయటాన్ని ఎవరైనా వూహించారా ?

సత్య

     విస్సన్న చెప్పిందే వేదం అన్నట్లుగా తాము చెప్పిందే అసలైన జాతీయవాదం, దానికి భిన్నమైనది దేశ ద్రోహం అని సంఘపరివార్‌ ఈ దేశ పౌరుల చేత బలవంతంగా అంగీకరింపచేయాలని చూస్తున్నది. దానితో ఏకీభవించినా లేకపోయినా ఒకటి మాత్రం వాస్తవం. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ వుదంతాలపై మొత్తానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌ ప్రసంగపు కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ఎవరిదో గానీ అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్న పాత సినిమా పాటలా అయింది. పెద్ద పెద్ద చదువులు, పట్టాలు పొందటం,పరిశోధనలు చేయటం, తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్లు తప్ప సామాజిక అంశాలపై అసలు చర్చలు, వాదోపవాదాల మధనం లేకుండా నిస్సారంగా, నిస్తేజంగా, తాతగారి నాన్నగారి భావాలకు దాసులుగా తయారవుతున్న మెజారిటీ యువతను మరోమారు మంచి-చెడు చర్చించే దిశగా కాషాయ పరివార్‌ వ్యవహరించింది. అది చెప్పే భావజాలాన్ని అంగీకరించే లేదా వ్యతిరేకించే శిబిరాలుగా సమీకృతం అయ్యే విధంగా జనాన్ని ముందుకు నెడుతున్న సంఘపరివార్‌కు  ‘అభినందనలు’చెప్పాలి.

   మానవ సమాజం ఎప్పుడూ ముందుకే పోయిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. దానిని వెనక్కు తిప్పే శక్తులు ప్రతి తరంలోనూ ప్రయత్నిస్తాయి, ఎదురు దెబ్బలు తింటాయి. అందువలన పురోగమన వాదులెవరూ చర్చకు భయపడరు. మా తాత చెప్పాడు గనుక మానాన్న చేశాడు, మా నాన్న చేశాడు గనుక ఎలాంటి ఆలోచన లేకుండా నేనూ చేస్తున్నాను, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, దాని వలన లాభం సంగతేమో తెలియదు గానీ నష్టం లేదు కదా అనే గొర్రెదాటు పద్దతి ఇటీవలి కాలంలో పెరిగి పోయింది. అలాంటి వారిని సున్నితమైన మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా ఆకట్టుకోవటం సులభం. ప్రపంచంలో ప్రతి తిరోగమన శక్తీ ఈ బలహీనతను వుపయోగించుకొనేందుకు ఎల్ల వేళలా ప్రయత్నిస్తుంది. మన దేశం అందుకు మినహాయింపు కాదు. అలా చేయటం తనకు లాభదాయకమన్న దురాశ అంతర్గతంగా లేకపోతే సంఘపరివార్‌ తన అజెండాను ముందుకు నెట్టదని అనేక గత వుదంతాలు, పరిణామాలు రుజువు చేశాయి. అది శృతి మించి బలప్రయోగానికి దిగినపుడు ప్రతిఘటన ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మన దేశంలో జరుగుతోంది అదే.

   

       జాతీయవాదానికి మన స్వాతంత్య్ర వుద్యమం చెప్పిన అర్ధం, ఆచరణ వేరు.ఇది బానిస బంధాల నుంచి విముక్తి . జర్మన్‌ నాజీ హిట్లర్‌ తన దేశంలో ముందుకు తెచ్చిన జాతీయవాదపు లక్ష్యం, లక్షణం వేరు. అది ప్రపంచ దేశాలను ఆక్రమించుకొనే, కార్మిక వర్గాన్ని అణచేందుకు. స్వాతంత్య్ర వుద్యమ జాతీయ వాదంతో సంఘపరివార్‌ ఏకీభవించలేదు కనుకే అది దూరంగా వుంది. దాని నాయకత్వం బ్రిటీష్‌ ప్రభుత్వానికి సలాం కొట్టి లొంగిపోయింది. హిట్లర్‌ మాదిరి తాను చెప్పే అఖండ భారత్‌ జాతీయ వాదానికి తనదైన భాష్యం, లక్ష్యంతో సంఘపరివార్‌ ఒక మతాన్ని, ఒక పరాయి దేశాన్ని మిళితం చేసి మనోభావాన్ని చొప్పించి యువతను ప్రభావితం చేసేందుకు పూనుకుంది. కేంద్రంలో, పలు రాష్ట్రాలలో తన అధికారాన్ని వుపయోగించి ప్రతి చోటా తన భావజాలాన్ని రుద్ధేందుకు, అలాంటి శక్తులకు స్ధానం కల్పించేందుకు పూనుకుంది. గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర తప్ప పెద్దగా మరో అనుభవం లేని తన సభ్యుడైన ఒక చిన్న నటుడిని ప్రతిష్టాత్మక పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ అధిపతిగా నియమించినదానికి ప్రతిఘటన తలెత్తినపుడు , తరువాత మద్రాస్‌ ఐఐటిలో గుర్తింపు పొందిన పెరియార్‌ అంబేద్కర్‌ అధ్యయన కేంద్రం నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించే కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ ఆకాశరామన్న పేరుతో చేసిన ఫిర్యాదుపై దాని గుర్తింపు రద్దు చేసినపుడు జనం పెద్దగా స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యు వుదంతాలతో ఇప్పుడు మొత్తం చదువుకున్న వారందరూ ఇదేమిటి అని చర్చించకపోయినా ఒక గణనీయ భాగమైనా ఆలోచిస్తున్నది. కొన్ని శక్తులు, సంస్ధలు, వ్యక్తుల గురించి సానుకూల వైఖరితో గుడ్డిగా నమ్మే వారు ఇదేదో తేడాగా వుంది అనుకుంటున్నారా లేదా ? అది చాలు నిజాలేమిటో తెలుసుకొనేందుకు ? ఎక్కడైతే తమ భావజాలానికి తావివ్వకుండా సాధ్యమైన మేరకు ప్రతిఘటిస్తోందో, దాని సంగతేమిటో తేల్చాలనుకున్నారో , తమ పెత్తనాన్ని రుద్దాలనుకున్నారో అదే జెఎన్‌యులో ఎబివిపి నాయకులు ముగ్గురు తమ నాయకత్వం మీద తిరుగుబాటు చేయటాన్ని ఎవరైనా వూహించారా ?

     సంఘపరివార్‌ అసలు తర్కానికి, వాదోపవాదాలకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే అది మా విశ్వాసం అంటారు తప్ప తర్క, హేతుబద్దతకు కట్టుబడే తెగ కాదు. వేదకాలంలోనే మన దగ్గర పైలట్లు, ఇంధనంతో పనిలేని ఖండాంతర విమానాలు వున్నాయి అంటారు. దానికి రుజువు ఏమిటంటే పురాణాల్లో , ఇతిహాసాలలో వుంది, మేం నమ్ముతున్నాం, మా విశ్వాసం అంటారు తప్ప మరో మాట వుండదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో వెల్లడించి దేశాన్ని అగ్రస్ధానంలో వుంచి మేరా భారత్‌ మహాన్‌ అనే పుణ్యం కట్టుకోండి, దేశభక్తులని నిరూపించుకోండి అని ఎవరైనా అంటే మన వేదాలూ, పురాణాలను అపహాస్యం చేస్తున్నారు, మా మనోభావాలను గాయపరుస్తున్నారంటూ దెబ్బలాటలకు దిగుతారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇంత పెద్ద దేశంలో సమాచారం అందుబాటులోకి వచ్చిన తరుణంలో మనోభావాల చాటున తప్పించుకోవాలంటే అంటే నడవదు. వక్రీకరణలు కుదరవు. అందుకే ప్రతి విద్యా సంస్ధ, ప్రతి ఫ్యాక్టరీ, వాణిజ్యసంస్ధ , ఆఫీసు, ఇల్లు , చివరికి ప్రతి మనిషీ ఒక చర్చా కేంద్రం కావాలి. మధనం జరగాలి. వాస్తవాన్ని రాబట్టాలి.

     దుర్గ అంటే మహిషాసురుడిని మర్ధించిన ఒక దేవతగా పురాణాలను బట్టి జనం ఇప్పటి వరకు అనుకుంటున్నారు. అవి పుక్కిటి పురాణాలని కూడా అనుకొనే వారు లేకపోలేదు. తమ వాదనలకు మద్దతుగా వాటి నుంచే వుదాహరణలుగా తీసుకొని ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. పురాణాలకు భిన్నమైన రీతిలో దుర్గ గురించి ఎక్కడా మనకు తెలియదు. ఆమె ఒక వ్యభిచారిణి అని ఒక సంఘం వారు ఒక కరపత్రంలో రాశారని కేంద్ర మంత్రిగారు పార్లమెంట్‌లో చదివి రికార్డులలో ఎక్కించటాన్ని ఏమనాలి. ప్రపంచంలో ఏసుక్రీస్తు, మేరీ, మహమ్మద్‌ ప్రవక్త, రాముడు, కృష్ణుడో మరొక దేవతో దేవుడి గురించో తూలనాడిన వారు చరిత్రలో మనకు ఎందరో కనిపిస్తారు. కానీ అలాంటి వాటన్నింటినీ సేకరించి చట్ట సభల్లో ప్రస్తావించిన ఘనత ప్రపంచంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏకు తప్ప నాకు తెలిసినంతవరకు మరొకరికి దక్కదు. ఎవరైనా వుదాహరణలు చూపితే నా అభిప్రాయాన్ని సవరించుకుంటాను. చట్ట సభలను ఎలా దుర్వినియోగం చేయవచ్చో ఇటీవల కాలంలో అందరూ చూస్తున్నారు. వాటిలో ఇది హైలెట్‌. దుర్గ కల్పిత పాత్రో లేక అనేక మంది నమ్ముతున్నట్లు దేవతా మరొకరా అన్నది వేరే విషయం. ఒక కరపత్రానికి వున్న సాధికారత ఏమిటన్నది ఇక్కడ ప్రశ్న. ఒక పుస్తకమో, ఒక అధికారిక పత్రికో, వెబ్‌సైట్‌లో అలాంటి వర్ణన చేసి వుంటే అది చట్ట ప్రకారం నేరమైతే చర్య తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు. రెచ్చగొట్టటానికి , చిచ్చు పెట్టటానికి ప్రతి మూలనా రోజూ ఏదో ఒక కరపత్రం వెలువడుతూనే వుంటుంది. ఏదో ఒక పేరుతో ఎవరు ఒక కరపత్రం వేస్తే దానిని పార్లమెంట్‌ రికార్డులకు ఎక్కిస్తే వాటికి అంతం ఎక్కడ. అసలు తామా కరపత్రం వేయలేదని మహిషాసుర దినోత్సవ నిర్వాహకులలో ఒకరు చెబుతున్నారు.ఆ వుత్సవం తలపెట్టింది 2014 అక్టోబరులో, అప్పటికి కేంద్రంలో అధికారంలో వున్నది బిజెపి. దుర్గను అలా అమర్యాదకరంగా చిత్రిస్తూ తొలుత ప్రచురించింది యాదవ శక్తి అనే ఒక పత్రిక. దానిపై చర్య తీసుకోవటానికి కేంద్రానికి అధికారం వుంది. దానిని మరొక పత్రిక తరువాత కొద్ది మార్పులతో ప్రచురించిందని సంఘపరివార్‌ అనుయాయులే మరొకవైపు చెబుతున్నారు.మహిషాసుర దినోత్సవం సందర్భంగా ఆ పత్రికను పంపిణీ చేయటంతో ఘర్షణ జరిగి రెండో పత్రికపై కేసు కూడా నమోదైంది. నాటి వుదంతానికి ఇప్పుడు జెఎన్‌యు ఘటనలకు లంకెపెట్టి పార్లమెంట్‌లో ప్రస్తావించటం దురుద్ధేశం, ఎన్నికలలో లబ్దికోసం ప్రచార ఆస్త్రంగా చేయటం తప్ప మరొకటి కనిపించటం లేదు.

   రెండవది మంత్రి అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. మహిషాసుర దినోత్సవాన్ని జరపటాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదా లేక దుర్గను కించపరచటాన్ని తప్పుపడుతున్నారో స్మృతి ఇరానీ స్పష్టం చేయాలి. దుర్గను కించపరచటంపై కావాలంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చు. మహిషాసుర దినోత్సవాన్ని వ్యతిరేకించటం అంటే భిన్నత్వాన్ని , మరొక అభిప్రాయాన్ని అణచివేయటం తప్ప మరొకటి కాదు. అసలు ఏ మాంసం తినని వారు ఈ దేశంలో చాలా మంది వున్నారు. అనేక మంది మహిళలు తాము తినకపోయినా ఇంట్లో తినేవారు వుంటే వండి పెట్టటం లేదా ? తినేవారిని అడ్డుకోవటం లేదే !అలాంటపుడు గొడ్డు మాంసం తినే వుత్సవం జరపాలని తినే వారు అనుకుంటున్నపుడు దానిని ప్రతిఘటించాల్సిన అవసరం ఏముంది. ఇష్టం లేకపోతే తినటం మానుకోవాలి లేదా ఆ పరిసర ప్రాంతాలకు ఆ సమయంలో దూరంగా వుండవచ్చు. గణేష్‌ వుత్సవాలు, దసరా వుత్సవాల పేరుతో పెద్ద పెద్దగా లౌడ్‌ స్పీకర్లు పెట్టటం, వూరేగింపుల పేరుతో రవాణాకు ఆటంకం కలిగించటం కొంతమందికి నచ్చదు.అర్ధరాత్రి అపరాత్రి వరకు భారీ సౌండ్‌తో ప్రార్ధనా స్ధలాలలో మైకులు పెడితే చుట్టుపక్కల విద్యార్ధులు, రోగులకు ఎంత ఇబ్బంది. అయినా చేయగలిగిందేమీ లేదు మన ఖర్మ అనుకొని అలాంటి వారు వాటికి దూరంగా తప్పుకుంటున్నారు తప్ప అడ్డుకోవటం లేదే? మహిషాసుర లేదా రావణలీల వుత్సవాలు జరపటం దేశ ద్రోహమా ? జరుపుకోనివ్వండి ఎవరికి నచ్చిన వారిని వారు అభిమానిస్తారు ! అసలు ఏ దేవుడు, దేవతను , రాక్షసులను నమ్మనివారిని కూడా పౌరులుగా దేశ రాజ్యాంగం గుర్తించిందని మర్చిపోతున్నారా ?

     ప్రపంచంలో ప్రతి మతం వాటి దేవతలు, ప్రవక్తల గురించి నిందలు వేయటం కొత్త విషయం కాదు. వాటిని సమాజం పెద్దగా పట్టించుకోదన్నది కూడా వాస్తవం. కొన్ని సందర్బాలలో కొన్ని శక్తులు పధకం ప్రకారం వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పూనుకుంటాయి. క్రైస్తవంపై తిరుగుబాటు నుంచి ఇస్లాం మతం ఆవిర్బవించింది. దాని ప్రవక్త మహమ్మద్‌కు విగ్రహారాధనపై విశ్వాసం లేదు, అందువలననే మక్కాలోని విగ్రహాలన్నింటిని ధ్వంసం చేయించారని చెబుతారు. ఐరోపా దేశాలలోని కొన్ని శక్తులు ముస్లింల ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేసేందుకు ఏకంగా ప్రవక్త బొమ్మలు గీయటం అన్నది ప్రతి శతాబ్దంలో ఎక్కడో అక్కడ జరుగుతూనే వుంది. అలాంటి సందర్బాలలో నిరసన వ్యక్తం అవుతోంది. తరువాత ఎవరి జీవన క్రియల్లో వారు వుంటారు. దేవుళ్ల గురించి హేతువాదులు అనేక విమర్శలు చేశారు, తమ తర్కం ప్రకారం ప్రశ్నలు లేవనెత్తారు.వేమన ఇంకా అనేక మంది తమ రచనల్లో ఆచారాలు, మూఢనమ్మకాలు మొదలైన వాటిని చీల్చి చెండాడారు. అంతకు ముందు చార్వాకులు, లోకాయతులు దేవుడు, దేవతల వునికిని ప్రశ్నించారు. ఇప్పుడూ ఎవరైనా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. అంతే తప్ప దుర్గ గురించి మరొక దేవత గురించి ఎవరైనా అసభ్యంగా చిత్రించి, వర్ణించి వారిపై విశ్వాసం పొగొట్టగలమని, లేదా మహిషాసురుడు మరొకరి మీద ప్రేమపెంచగలమని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. నేలవిడిచి సాము చేయటం తప్ప మరొకటి కాదు. విమర్శ సభ్యతతో కూడినదిగా వుండాలి. శైవ-వైష్ణవ మతాల మధ్య మధ్యయుగాలలో ఎంతటి శతృత్వం వుందో ఆ కాలపు రచయితలు రాసిన గ్రంధాలలో సవివరంగా వుంది. విష్ణాలయంలో మోగే గంటను విన్న శివభక్తుడు శ్వపచుడితో (కుక్క మాసం తినేవారితో)సమానం అని శివపురాణంలో రాశారు.ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో కుక్క మాంసం తినేవారు ఇప్పటికీ వున్నారా లేదా ? మరి వారు నాటి పురాణాలు మా మనోభావాలను దెబ్బతీశాయని అంటే ఏం చెబుతారు ? ప్రపంచంలో అనేక దేశాలలో దాన్ని తినేవారు వున్నారు. ఇటీవలి కాలంలో దానిని కూడా వివాదాస్పదం చేశారు.కృష్ణుడి చోర చర్యలను, శృంగారం భక్తులకు పరవశం కలిగిస్తుంది. హేతువాదులకు జారత్వం, చోరత్వం కనిపిస్తుంది, అలాంటి విమర్శలు చేసినంత మాత్రాన కృష్ణ భక్తులందరూ పార్లమెంట్‌లో వాటిని పట్టుకొని చర్చిస్తారా ? అలాగే ప్రతి మతావలంబకులూ పార్లమెంట్‌ను మత విశ్వాస ప్రదర్శన సభగా మార్చివేస్తారా ?

     సృష్టి కర్త దృష్టిలో అందరూ సమానమే అని ఒకవైపు చెబుతారు, మరో వైపు అదే కర్త అందరినీ దేవతలుగా సృష్టించ కుండా కొందరిని రాక్షసులుగా పుట్టించటమెందుకు ? వారి చేత ముందు దేవతలను చావ చితక కొట్టించటం ఎందుకు, అంతా అయిపోయాక వారిని హతమార్చటానికి కొత్త శక్తులను సృష్టించటం ఇవేగా ప్రతి పురాణ సారాంశం. అలా ఎందుకు అంటే లీలా మానుష వినోదం అని టక్కున సమాధానం.అలాగే దుర్గ కూడా కొందరి నిందలకు గురికావటం కూడా అదే అని అలా రాసి పెట్టి వుందని ఎవరి పాపాన వారు పోతారులే అని ఎందుకు ఊరుకోరు ? వుదాహరణకు మహిషాసురుడినే తీసుకుందాం. మైసూరు ఆయన పేరునుంచే పుట్టిందండోయ్‌(మహిషాసుర వూరు మైసూరు అయిందట). జన్మ అంటూ ఎత్తిన తరువాత దానికి పరమార్ధం వుండాలంటారు. అదేమిటో ప్రతి యుగంలో దేవుడి, దేవత హయాంలో రాక్షసులు వారి చేతిలో చావటానికే పుట్టినట్లు అన్ని కధలూ చెబుతాయి. సత్య యుగంలో అందరూ ఒకటే అన్నారు కనుక మనకు రాక్షసులు కనిపించరు. త్రేతాయుగం, ద్వాపరయుగాలలోనే వారు దర్శనమిస్తారు, ధర్మం ఒంటి పాదంలో నడుస్తుందని చెబుతున్న కలియుగంలో మనకు ఎక్కడా కనపడరు. రాక్షసుల వలన జరిగేది యుద్ధాలు తప్ప లోక కల్యాణమేమీ లేదని త్రేతా యుగంలోనే తెలిసిపోయింది కనుక సృష్టి కర్త ద్వాపర యుగంలో అయినా రాక్షసుల సృష్టి నిలిపివేయాలి కదా ఎందుకా పనిచేయలేదు? రాక్షసులు లేకపోతే దేవతలకు గుర్తింపు వుండదనా ? అందువలన విశ్వాసులూ వుద్రేకాలను తగ్గించుకొని వెనుకా ముందూ చూసుకొని స్పందించాలి. చరిత్రలో లోకాయతులూ, చార్వాకులే ఎంతో హుందాగా విమర్శలు చేశారు, వారి వాదనల్లో తర్కం వుంది. మతశక్తులే పరమతాలను, తాము అంగీకరించని దేవతలను బండబూతులు తిట్టాయి. అందువలన లోకాయతుల వారసులు అనుకొనే వారు ఎవరినీ కించపరచకుండా, సభ్యతగా ప్రవర్తించటం ద్వారానే ఎక్కువ మందిని ఆ భావజాలంవైపు కర్షించగలం అని గుర్తిస్తే మంచిదేమో ఆలోచించండి. ఏమైనా ఇలాంటి చర్చలు జరిగేందుకు తెరతీసిన సంఘపరివార్‌కు మరోసారి ‘అభినందనలు’ చెప్పకుండా వుండగలమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కండోమ్‌ల వేటలో బిజెపి ఎంఎల్‌ఏ

24 Wednesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP MLAs, condoms, immoral, JNU, JNU ROW, RSS

ఆళ్వార్‌ ప్రాంతంలో రోడ్లపై నిఘావేసే బృందాలకు నాయకత్వం వహించేవారు. ఏ దారుల్లో ఆవులను ఎలా తరలిస్తున్నారో పసిగట్టటంలో దిట్ట అట. బహుశా అందుకే ఆ అనుభవాన్ని జెఎన్‌యులో వాడిపాడేసిన కండోమ్‌లు, మద్యం సీసాలు ఎక్కడ వుంటాయో ఎన్ని వుంటాయో కనుగొనేందుకు పనికి వస్తుందని ఆయనను వినియోగించుకొని వుంటారు.

సత్య

     ఎవరైనా ఏదైనా అంటే అన్నారని గుంజుకుంటారు గానీ ఎవరైనా ఎందుకంటారు అని ఆలోచించేవారు తక్కువ. పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత ఎవరు ఏమన్నా భరించక తప్పదు, అభ్యంతరం అనుకుంటే బయటకు రాకూడదు.రోమ్‌ పోతే రోమన్లా వుండాలన్నది ఒకసామెత. ఇప్పుడు దానిని చెప్పటం దేశద్రోహం అని మనకు తెలియకుండానే ఎవరైనా తన్ని తగలేసే ప్రమాదం వుంది. కనుక కాస్త వెనుకా ముందూ చూసుకోవాల్సిన రోజులివి. రోమ్‌ అన్నది పరమత కేంద్రం, అందునా విదేశీకను అది దేశద్రోహం అని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ బసీ వంటి వారు పాలకుల మెప్పుకోసం లేదా మరో వున్నత పదవి కోసం ముందు కేసు పెట్టి జైల్లో వేసి తరువాత తాపీగా నిరపరాధివని నిరూపించుకో అనే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఎక్కడకు వెళితే అక్కడి పద్దతులను గౌరవించాలి అనిచెప్పుకుందాం. ఎక్కడికి వెళితే అక్కడి పద్దతులను గౌరవించాలి అన్నట్లుగానే ఎవరి పనివారు చేయాలి.

     ఇటీవల జరిగిన కొన్ని వుదంతాలను చూసిన తరువాత నల్లకోటు వేసుకొని లాయర్‌ను అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా వుంది, ప్రతి వారూ నన్ను ఎగా దిగా చూసి భయం, భయంగా దూరంగా జరుగుతున్నార అని కాస్త నాటకీయత జోడించి చెప్పారు. మద్దెల వచ్చి రోటితో మొరపెట్టుకున్నట్లుగా నేను ఎవరితో చెప్పుకోవాలి. మా నాన్న జర్నలిస్టుగా పనిచేస్తున్నారు అంటే జీ న్యూస్‌లోనా ఫ్రెండ్సందరూ నవ్వుతున్నారు, నువ్వు వేరే పని చూసుకో నాన్నా అంటున్నాడు నేను ఎవరికి చెప్పుకోవాలి అని ఎదురు ప్రశ్నించాను. ఇంతలో మా మావయ్య ఎంఎల్‌ఏ అని మరొక మిత్రుడు సినిమా ఫక్కీలో అందుకున్నాడు. ఏ యూనివర్సిటీలో కండోమ్‌లను లెక్క పెడతాడు అని జోక్‌ పేలింది. కుక్క పని గాడిద చేస్తే ఏమైందో చిన్నపుడు కధ చదువుకున్నాం కదా. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రోజు ఎన్ని కండోమ్‌లను వాడుతున్నారో, ఎన్ని బీరు సీసాలు తాగుతున్నారో రాజస్ధాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ గ్యానదేవ్‌ ఆహుజా ప్రకటించటం ఇలాంటిదే కదా ? ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం రోజుకు మూడువేల కండోమ్‌లు, రెండువేల మద్యం సీసాలు, పదివేల సిగిరెట్‌ పీకలు, నాలుగువేల బీడీ ముక్కలు , 50వేల చిన్నా పెద్దా ఎముకలు పోగుపడుతున్నాయట. అంత కచ్చితంగా లెక్క తేల్చారంటే ఎన్నో రోజుల నుంచి సదరు ఎంఎల్‌ఏ తిష్టవేసి వుండి వుండాలి. లేకుంటే ఎలా సాధ్యం ?

     ఇక్కడ మరొక విషయాన్ని కూడా ముచ్చటించుకోకపోతే అసంపూర్ణంగా వుంటుంది. ఒక కుక్కను చంపదలచుకుంటే దానికి పిచ్చి వుందని ముందుగా ప్రచారం చేయాలట. అలాగే సంఘపరివార్‌ పధకాలు కూడా ఎంత పక్కాగా వుంటాయో ఎవరిని ఏ పనికి వినియోగించాలో అర్ధం చేసుకోవటానికి ఈ వుదంతాన్ని అధ్యయనం చేయాలేమో ! ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం అనే ఒక ప్రఖ్యాత సంస్ధను ఆర్‌ఎస్‌ఎస్‌ దెబ్బతీయదలచుకుంది.ఎందుకంటే అక్కడ పాగా వేయించాలని ఎబివిపి చేత ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. నాకు దక్కనిది బతకటానికి వీల్లేదని కొంత మంది కుర్రవాళ్లు అమ్మాయిలపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నట్లే జెఎన్‌యు విషయంలో కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లుంది. సమయం కోసం చూసి అది దేశద్రోహుల కేంద్రం అని ప్రచారదాడి ప్రారంభించింది. అధికారయంత్రాంగం, తన కనుసన్నలలో మెలిగే మీడియా సంస్ధల సహకారంతో అణచివేతకు పూనుకుంది. అది వికటించేట్లు కనిపించటంతో జెఎన్‌యు అన్ని రకాల అనైతిక కార్యక్రమాల అడ్డాగా వుందని మరొక అస్త్రాన్ని వదలింది. అది రాజస్ధాన్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ గ్యానదేవ్‌ ఆహుజా చేత చేయించింది. ఇక్కడ గ్యానదేవ్‌ అజ్ఞానం ఏమిటంటే ఆ విశ్వవిద్యాలయంలో బిజెపి నిర్వచనం ప్రకారం దేశ ద్రోహుల కోవలోకి వచ్చేవారితో పాటు ఏబివిపి దేశభక్తులు కూడా వున్నారు. సదరు ఏబివిపిలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వున్నారు. సదరు మూడువేల కండోమ్‌లు, రెండువేల మద్యం సీసాలు, బీడీ సిగిరెట్‌ పీకలు మొత్తం దేశద్రోహుల వేనా లేక దేశభక్తులవి కూడా వున్నాయా అన్న వివరాలు కూడా వెల్లడించి వుంటే పరిశోధనకు పిహెచ్‌డి వచ్చి వుండేది.

     అయినా మనలో మాట హానికరం కాని శృంగారానికి కండోమ్‌లు వాడండని టీవీ, రేడియోలలో ప్రభుత్వమే నిత్యం ప్రచారం చేస్తున్నది. వైన్‌షాపులు, బార్లకు లైసన్సులు ఇచ్చి ఎంతతాగితే అంత దేశభక్తి పరుల కింద లెక్క అని ప్రోత్సహిస్తున్నది. సదరు ఎంఎల్‌ఏ కనుగొన్న వన్నీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే వున్నాయి కదా? కండోమ్‌లు అమ్మటం, వినియోగించటమే అనైతికం అయితే మరి వీధి వీధినా దుకాణాలలో ఎందుకు అమ్ముతున్నట్లు ? ఇంతకీ సదరు ఎంఎల్‌ఏ ఖాళీ సమయాలలో ఢిల్లీ వచ్చి ఈ పని చేసినట్లా లేక ఎవరూ గుర్తు పట్టకుండా వుంటారు గనుక సంఘపరివార్‌ ఆయనకు ఆపని అప్పగించిందా ? ఇంతకీ ఈ పెద్ద మనిషి కథా కమామిషు కూడా తెలుసు కుంటే బాగుంటుంది.

     గతేడాది జనవరిలో భరత్‌ సింగ్‌ అనే వ్యక్తి జైపూర్‌లో ఒక క్యాషియర్‌ నుంచి 18లక్షలు దోపిడీ చేశాడు. ఇతగాడు ఎంఎల్‌ఏ జ్యానసింగ్‌ మేనల్లుడి దగ్గర డ్రైవర్‌, ఆ దోపిడీకి ఎంఎల్‌ఏగారి కారునే వుపయోగించాడట.డబ్బును కూడా ఎంఎల్‌ఏ గారింట్లోనే వుంచాడట. స్వంత ఇంటి కంటే ఎంఎల్‌ఏ ఇల్లు పదిలం కదా ! అంతే కాదు జూలై నెలలో మరో దోపిడీకి ఏకంగా ఎంఎల్‌ఏనే ఒక కవచంగా వాడుకున్నాడట.తాను దోపిడీ చేసిన సొమ్మును ఎంఎల్‌ఏ ప్రయాణించిన కారులోనే వేరే చోటికి చేరవేశాడట. ఇదంతా ఎలా సాధ్యమైందంటే సదరు ఆహుజా తన మీసాల గురించి తప్ప మిగతా విషయాలేమీ పట్టించుకోరని ఆ నేరగాడు తరువాత పోలీసులకు చెప్పాడు.ఆహుజా రామలీలా వుత్సవాల సమయంలో వేషాలు వేసేందుకు మీసాలను ప్రత్యేకంగా పెంచి పోషించాడట.ఎంఎల్‌ఏ అయినా గానీ అదే విధంగా మీసాలను మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడట.ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన ఆహుజా ఒక పోలీసును కొట్టిన కేసులో పాత నేరస్ధుడి కింద నమోదయ్యాడు. పోలీసులకు దొరక్కుండా పదేళ్లపాటు తప్పించుకు తిరిగాడు.2003లో ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యాక అధికారంలో వున్న స్వంత పార్టీ బిజెపి ప్రభుత్వాన్ని తనపై వున్న కేసును ఎత్తివేయమని కోరితే కోర్టు ఒప్పుకోలేదట. దాంతో పోలీసులకు లొంగిపోయిన కొద్ది క్షణాలలోనే ఆయనకు పొట్టలో నొప్పి రావటం, ఆసుపత్రిలో చేరటం, వైద్యులు సీరియస్‌గా వుందని సర్టిఫికెట్‌ ఇవ్వటం, బెయిలు వచ్చేంత వరకు ఆసుపత్రిలోనే సౌకర్యాలను అనుభవించటం వరుసగా జరిగిపోయాయి.

     ఈ ఎంఎల్‌ఏ గారు గోవులపై ఎంతో పరిశోధన కూడా చేసినట్లున్నారు. బిబిసి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవుపేడను బయోగ్యాస్‌గా వినియోగించి కాలిఫోర్నియా నగరం మొత్తానికి విద్యుత్‌ సరఫరా చేస్తారని, ఆవు పాలలో బంగారం వుందని, భారత్‌లో ఆవును చంపితే అగ్ని పర్వతాలు బద్దలౌతాయని, భూకంపాలు, కరవులు వస్తాయని విదేశీ నిపుణులు కూడా చెప్పారని వివరించాడు. ఇలాంటి పెద్ద మనిషి గోరక్షణ మహానుభావుడిగా కూడా పనిచేయకుండా వుంటాడా ? ఆళ్వార్‌ ప్రాంతంలో రోడ్లపై నిఘావేసే బృందాలకు నాయకత్వం వహించేవారు. ఏ దారుల్లో ఆవులను ఎలా తరలిస్తున్నారో పసిగట్టటంలో దిట్ట అట. బహుశా అందుకే ఆ అనుభవాన్ని జెఎన్‌యులో వాడిపాడేసిన కండోమ్‌లు, మద్యం సీసాలు ఎక్కడ వుంటాయో ఎన్ని వుంటాయో కనుగొనేందుకు పనికి వస్తుందని ఆయనను వినియోగించుకొని వుంటారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీగారూ పాచి పాటతో బోర్‌ కొట్టిస్తున్నారు !

22 Monday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, BJP, Bjp nationalism, JNU, JNU ROW, Media, Narendra Modi, RSS

ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

ఎం కోటేశ్వరరావు

       ప్చ్‌ ! నరేంద్రమోడీ కూడా నిరాశపరుస్తున్నారు. ఆదివారం నాడు ఒడిషాలో మోడీ పాడిన పాచి పాత పాట జనానికి బోర్‌ కొట్టింది. ప్రతివారికీ పదిహేను లక్షల నల్లధన సొమ్ము పంపిణీ, దేశమంతటా గుజరాత్‌ నమూనా విస్తరణ మాదిరి కిక్కిచ్చే కొత్త అంశాలు ఇంకా తమ మహా మౌనబాబా నోటి నుంచి వెలువడతాయని అభిమానులు ఎదురు చూస్తుంటే తన అంబుల పొదిలోంచి పాతపడిన, పదునులేని బాణాలు బయటకు తీస్తున్నారు.అదేదో సినిమాలో డైలాగు మాదిరి ఇదేం చాలా బాగోలేదు, వ్యతిరేకులను ఎలాగూ ఎదుర్కోలేరు, కనీసం భక్తులకు అయినా నమ్మకం కలిగించాలి కదా. ఇందిరా గాంధీ తన పాలన ఇబ్బందుల్లో పడినపుడు, ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్నపుడల్లా తన ప్రభుత్వానికి విదేశీ హస్తం నుంచి ముప్పు వుందని చెప్పేవారు, ముఖ్యంగా 1975లో అత్యవసర పరిస్ధితి విధించబోయే ముందు ఈ మాటలు ఎక్కువగా చెప్పారు. నాడు జనసంఘం ముసుగులో వున్న నేటి బిజెపి నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు, ఆ హస్తాన్ని బయట పెట్టమని అడిగేవారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ఒడిషాలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని, ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చేసిన ఆరోపణ నరేంద్రమోడీకి అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకయ్య నాయుడి మూస ప్రాసలో చెప్పాలంటే రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడిలా మరోసారి ఇందిరా గాంధీని జ్ఞప్తికి తెచ్చింది. ఇలా అయితే మనం గతంలో కాంగ్రెస్‌ను ఏడిపించినట్లుగా ఇప్పుడు వారు మనల్ని కూడా ఆడుకుంటారు సార్‌ అని మోడీ అభిమానులు లోలోపలే మధన పడుతున్నారు. మంత్రసానితనానికి అంగీకరించిన తరువాత ఏదొచ్చినా పట్టక తప్పదు మరి. దేశంలో అత్యవసర పరిస్ధితి పునరావృతమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని గతేడాది జూన్‌లో బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అది కచ్చితంగా నరేంద్రమోడీని వుద్దేశించే చేశారని లోకం కోడై కూసింది. మోడీ ఆరోపణ దానిలో భాగమేనా ? ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

      గత ఇరవై నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైంది. రానున్న రోజులలో మరింత తిరోగమనం తప్ప పురోగమన దాఖలాలు కనిపించటం లేదు. పెట్టబోయే బడ్జెట్‌ కూడా అంత ఆకర్షణీయంగా వుండబోదని ముందే వార్తలు వెలువడుతున్నాయి. వేతన సంఘసిఫార్సులను వుద్యోగులు అంగీకరించటం లేదు. ఈ స్ధితిలో కాషాయ మార్కు జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి కొంతకాలం జనం దృష్టిని మరల్చాలి. అందుకు తగిన అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యులో జరిగిన సభలు, వాటి పర్యవసానాలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వాటిని వుపయోగించుకోకుండా ఏ విఫల అధికారపక్షమైనా ఎలా వుంటుంది. అయితే బిజెపి ఈ బస్సు కూడా మిస్సయినట్లే. కానీ ఒకందుకు మాత్రం బిజెపి మేథోచెరువులో ఈదులాడుతున్న వారిని అభినందించాలి. తిను,తాగు, తిరుగు అనేవి తప్ప దేశంలో వేరే ఇజాలేవీ లేవు అన్న వాతావరణం పెరిగిపోయి యువత అనేక విధాలుగా క్షీణ సంస్కృతి ప్రభావానికి లోనవుతున్న దశలో వారికి తెలియకుండానే ఒక సైద్ధాంతిక చర్చకు దోహదం చేశారు. ఢిల్లీ జెఎన్‌యులోని ఎబివిపి నాయకుల నుంచే తమకు ఎదురు దెబ్బ తగులుతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. మేకతోలు కప్పుకున్న పులి వంటి సంఘపరివార్‌ సంస్ధల నైజం తెలియక లేదా వారే అసలైన దేశభక్తులనే ప్రచారం నిజమే అని నమ్మిగాని లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో గాని అనేక మంది దాని అనుబంధ సంస్ధలలో చేరుతున్నారు, మద్దతతు ఇస్తున్నారు. అయితే వారందరూ శాశ్వతంగా వాటితోనే వుండిపోతారనుకుంటే భ్రమే. ‘జెఎన్‌యులో ప్రస్తుత సంఘటన, మనుస్మృతిపై పార్టీలో కొనసాగుతున్న దీర్ఘకాల విబేధాలతో పాటు రోహిత్‌ వేముల ఘటన.ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విశ్వవిద్యాలయంలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరం.అవి గుండెలు పగిలేలా వున్నాయి.వాటికి కారణమైన వారిని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్షించాల్సిందే……విద్యార్ధి లోకంపై అణచివేతకు దిగిన ప్రభుత్వానికి మేం బాకాలుగా వుండలేం. ప్రభుత్వానికి చెందిన ఓపి శర్మ వంటి శాసనసభ్యుడు పాటియాలా కోర్టులో గానీ, జెఎన్‌యు వుత్తర గేటు వద్దగానీ చేసిన దాడులు మితవాద ఫాసిస్టు చర్యకు నిదర్శనం…..’ అని నిరసన తెలిపిన ఏబివిపి విద్యార్ధి నాయకులు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ముగ్గురే కావచ్చు కానీ వారి ప్రకటన సంఘపరివార్‌కు తగలరాని చోట తగిలిన దెబ్బ.

     ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు కొన్ని టీవీ ఛానల్స్‌ తప్పుడు వార్తల ఆధారంగా తప్పుడు కేసులతో 1975 నాటి అత్యవసర పరిస్థితి మాదిరి వ్యవహరించటం, సంఘపరివార్‌ శక్తులు పాటియాలో కోర్టులో విద్యార్ధులు, జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసినా, సుప్రీంకోర్టు స్పందించినా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు. గతంలో కూడా పలు వుదంతాలలో ప్రధాని బిజెపికి జరిగే నష్ట నివారణ చర్యలలో భాగంగా నోరు విప్పారే తప్ప సకాలంలో ఎన్నడూ స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజెపి నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరుతో ప్రతిష్టను కోల్పోయిన బిజెపిని ఇప్పుడు జెఎన్‌యు వుదంతాలు మరింతగా దెబ్బతీశాయి. అయినా ఎదురుదాడులతో జనం నోరు మూయించాలని చూస్తున్నారు. తమ ప్రభుత్వ చర్యను తాము సమర్ధించుకొనే ధైర్యం లేక తమ కనుసన్నలలో మెలిగే మాజీ సైనికులను ఢిల్లీ వీధులలో ప్రదర్శనలు చేయించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు మరిన్ని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు, పార్లమెంట్‌ సమావేశాలలో ఎదురుదాడికి దిగేందుకు బిజెపి నిర్ణయించినట్లుగా ఒడిషాలో మోడీ ఆరోపణలు వున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలకు విదేశీ నిధులు వస్తున్నాయని తమ ప్రభుత్వం దానిని తప్పుపట్టకపోయినా లెక్కల్ని అడగటం ప్రారంభించేసరికి వారంతా కలసి మోడీని కొట్టండి, మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.

     స్వచ్చంద సంస్ధలకు విదేశాల నుంచి వస్తున్న నిధుల గురించి ఒక శ్వేత పత్రం సమర్పించటానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలూ వున్నాయి. అసలెన్ని సంస్ధలున్నాయి, వాటికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాటికి లెక్కలు చెప్పమని ఎన్నింటిని కేంద్రం అడిగిందీ, ఎన్ని జవాబిచ్చాయి. ఏవేవి ప్రధానిని కొట్టమని చెబుతున్నాయో ప్రకటిస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి. నిధులు రావటాన్ని తప్పు పట్టవద్దని అసలు ఎవరు అడిగారు, అడిగితే వూరుకుంటారా ? ఇరవై నెలలు గడిచినా ఏ చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? ఇప్పుడెందుకు తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని చీకట్లో బాణాలు వేస్తున్నట్లు ? ఇంత పెద్ద దేశంలో లెక్కలు చెప్పని కొన్ని స్వచ్చంద సంస్ధలు కుట్రలు చేస్తే పడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్‌ వుందా ? ఒక బూచిని చూపి ప్రజల దృష్టిని మళ్లించటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.

      ఆర్ధిక, పాలనా రంగాలలో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి రానున్న పార్లమెంట్‌ సమావేశాలలో తప్పించుకోవాలని చూస్తున్నది.ఒకవేళ నిజంగా అదే జరిగితే దీనిలో కూడా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయం. జనసంఘం నుంచి జనతా తరువాత భారతీయ జనతా ఏ పేరు పెట్టినా అది సంఘపరివార్‌ రాజకీయ ప్రతినిధిగానే పని చేసింది. జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో హిట్లర్‌,ముస్సోలినీ వంటి ఫాసిస్టులు కూడా జాతీయ వాదం పేరుతో జనాన్ని రెచ్చగొట్టారు.జాతీయోద్యమాలు పరాయిపాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వుద్యమాలు. అవి దేశ స్వాతంతంత్య్రాలకు దారితీశాయి. కానీ నియంతల జాతీయ వాదాలు ప్రభుత్వ వ్యతిరేకుల అణచివేతలకు, ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. హిట్లర్‌ తన జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీపై రుద్దిన ఒప్పందాలతో పాటు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. అందుకే ఈనాడు ఐరోపాలో ఎవరైనా జాతీయవాదాన్ని ముందుకు తెస్తే దానిని ఫాసిజంగా భావించి జనం ఛీకొడుతున్నారు. ఐరోపాలో జాతీయ వాదం అంటే బూతుపదం కన్నా నీచంగా చూస్తారు. దేశంలో వువ్వెత్తున జాతీయోద్యమం జరిగినపుడు సంఘపరివార్‌ శక్తులు దూరంగా లేదా వ్యతిరేకంగా, చివరికి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపాయి. అందుకు సావర్కర్‌ లేఖ తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు జాతీయ వాదం పేరుతో ఎక్కడలేని దేశభక్తిని తామే కలిగి వున్నట్లు ఫోజు పెడుతున్నాయి.ఈ జాతీయ వాదం ఏ వలస దేశానికి వ్యతిరేకం? సంఘపరివార్‌ ఆదిపురుషులు జాతీయవాదం ఏమిటంటే హిందూయిజమే జాతీయ వాదం,జాతీయ వాదమంటే హిందూయిజం అని ఎప్పుడో నిర్ధారించారు. హిట్లర్‌ యూదు , కమ్యూనిస్టు వ్యతిరేకత మాదిరి భారత్‌లో ఇస్లాం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ పరివార్‌ పూనుకుంది. అందువలన ఏది సిసలైన జాతీయత? ఇప్పుడు కావాల్సింది ఏమిటి అనే చర్చ జరగటం అనివార్యం, ఆరోగ్యకరం కూడా. ఎవరి రంగు ఏమిటో తెలిసి పోతుంది.ముస్లింలను వ్యతిరేకించటం, పాకిస్తాన్‌ను తిట్టిన వారే జాతీయ వాదులుగానూ కానటువంటి మిగతా వారందరినీ జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారు. అందువల్లనే కమ్యూనిస్టులు కానటువంటి రాజదీప్‌ సర్దేశాయ్‌, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులు తాము జాతీయ వాదులం కామని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియాలో జాతీయత, బిజెపి కుహనా జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.

      మీడియాలో సంఘపరివార్‌కు తోడ్పడే శక్తుల బండారం గూడా ఈ సందర్బంగా బయట పడింది. తాము నిష్పాక్షికం అని చెప్పుకున్నంత మాత్రాన ఆచరణలో అలా వుండరని అనేక ఛానళ్లు, పత్రికలు జెఎన్‌యు వంటి వుదంతాల సందర్భంగా తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాయి. స్థూలంగా కాషాయపరివార్‌ జాతీయ వాదాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా రెచ్చగొట్టే శక్తులు, బిజెపి జాతీయవాదాన్ని అంగీకరించకుండా వాస్తవాలను, వాస్తవాలుగా పాఠకులు ముందుంచే వారిగా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. రానున్న రోజులలో ఇది మరింత స్పష్టం కానుంది.సంఘపరివార్‌ చర్యలు,అజెండాతో మీడియాలో ఇంకే మాత్రం కాషాయ పులులు మేకతోళ్లు కప్పుకొని వుండలేని పరిస్ధితి.తమ ఛానల్‌ జెఎన్‌యు వుదంతంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ రాజీనామా చేయటం మీడియాలోని పరిస్ధితికి దర్పణం.వార్తలపై ఎవరైనా ఎటువంటి అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు. కానీ వృత్తికే కళంకం తెచ్చేలా వీడియోలను తారు మారు చేయటం దుర్మార్గం. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని కొందరు జెఎన్‌యు విద్యార్ధులు నినదించినట్లు చూపిన వీడియోలో మార్పులు జరిగాయి.దురభిమానాల కారణంగా భారతీయ కోర్టు జిందా బాద్‌ అన్న నినాదం కాస్తా పాకిస్తాన్‌ జిందాబాద్‌గా మారిపోయిందని విశ్వదీపక్‌ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా కొందరి జీవితాలు, వారి ఆశలు, కుటుంబాలను ప్రమాదపుటంచులలోకి నెట్టారని ఆయన వాపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులా లేక కిరాయి హంతకులా అనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే అసలు మనం జర్నలిస్టులమేనా అన్న ఆశ్చర్యానికి తాను లోనుకావటం ప్రారంభమైందని కూడా ఆవేదన చెందారు. ‘ హింసాకాండను రెచ్చగొట్టటానికి, మరియు జనాన్ని దేశద్రోహులు, లేదా జాతి వ్యతిరేకులు అని పిలవటానికి ,మాట్లాడటానికి గాక బెదిరించటానికి మనం టీవీని అనుమతించాలా అని ఎన్‌డిటివి చెందిన రవీష్‌ కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. పాటియాల కోర్టుల భవనం వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కొందరు జర్నలిస్టులు ప్రదర్శన చేస్తే దానికి సంబంధించిన వార్తల విషయంలో అత్యవసర పరిస్ధితి నాటి స్పందన కనిపించింది. ఆరోజులలో కొన్ని మీడియా సంస్ధలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కొన్ని అనుకూలబాకాలుగా వ్యవహరించాయి. అనేక మంది జర్నలిస్టులు దేశానికి విధేయులుగా వుండాలా ఒక రాజకీయ వైఖరి, వ్యవస్దకు విధేయులుగా వుండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని యాజమాన్యాల కారణంగా జర్నలిస్టులు కూడా ఏ సంస్ధలో వుంటే అది అభిమానించే పార్టీల ప్రతినిధుల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎటు అన్నది తేల్చుకొనే విధంగా సంఘపరివార్‌ ఎగదోస్తున్నది. ఆ విభజన తమకు లాభం అనుకుంటున్నది. జర్మనీ, ఫాసిస్టు హిట్లర్‌ పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరైనా మూర్ఖంగా, మొరటుగా నిప్పును చేత్తో పట్టుకుంటామంటే చేసేదేముంది, పట్టుకొని చూడమని చెప్పటమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

The physical assault on Sh. Kumar in the court premises appears to be organized and pre- planned:NHRC

21 Sunday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

JNU, JNU ROW, JNUSU, Kanhaiya Kumar, NHRC

NHRC Team visits Central Prison, Tihar to inquire into important issues pertaining to Shri Kanhaiya Kumar; inquiry report forwarded to Commission of Police, Delhi and Director General of Prisons, Tihar Jail for comments (19.02.2016)

New Delhi, 19th February, 2016

On 16.02.2016, the Commission took suo motu cognizance of the newspaper report published in Hindu newspaper dated 13.02.2016 captioned as “Govt. acts tough, JNU student leader charged with sedition”. It was reported that the President of JUNSU was arrested on the charges of sedition after allegedly raising anti-India slogans. The Commission issued notice to the Home Secretary, Govt. of India, Chief Secretary, NCT of Delhi, Commissioner of Police, Delhi and the Registrar, Jawaharlal Nehru University.

On 18th February, 2016, the Acting Chairperson, NHRC directed that a team comprising Sh. C. K. Chaturvedi, Registrar (Law) and Sh. S. K. Jain, SSP (Investigation) may visit Central Prison, Tihar and inquire into the following important issues pertaining to Sh. Kanhaiya Kumar :
I. To assess arrangements made and measures taken to ensure safety and security of Sh. Kanhaiya Kumar in the prison and to ascertain the apprehensions, if any, in the mind of Sh. Kanhaiya Kumar with regard to his safety and security.
II. To ascertain the treatment meted out to Sh. Kanhaiya Kumar by the police and prison authorities while in custody.
III. To ascertain whether the statement released to the press by the Commissioner of Police, Delhi in the name of Sh. Kanhaiya Kumar was made by Sh. Kanhaiya Kumar voluntarily and without any extraneous influence.

The NHRC team has submitted a report dated 19.02.2016 with the following findings:

i. The Central Prison, Tihar has made special arrangements to ensure safety and security of Sh. Kanhaiya Kumar inside the prison. He has been kept in an independent and separate cell. Dedicated security staff has been deployed to ensure his safety and security round the clock. Several security instructions have been issued by the prison authorities in this regard. He has no complaints against prison official.
ii. According to Sh. Kanhaiya Kumar, he was arrested without any valid reason and without disclosing to him even grounds of arrest. He had not committed any offences as now alleged. However, this aspect is under investigation by the police.
iii. Sh. Kanhaiya Kumar did not complain of any physical assault by the police while in custody. However, he was subjected to psychological pressure during interrogation.
iv. The statement which was issued by the police as an appeal on behalf of Sh. Kanhaiya Kumar was not written by him voluntarily. The content, construction and framework of the statement were as dictated by the police.
v. Sh. Kanhaiya Kumar was abused and physically assaulted by some persons dressed as advocates in the Patiala House court premises on 17.02.2016. He was even physically assaulted inside the adjoining court room in the presence of police who did not do anything to prevent the assault or apprehend the attackers even though they were identified by Sh. Kanhaiya Kumar then and there.
vi. The physical assault on Sh. Kumar in the court premises appears to be organized and pre- planned.
vii. What happened in the Patiala House Court Complex on 17.02.2016 was a major security lapse on the part of the police. There was serious dereliction of duty on the part of the police.
viii. Going by the sequence of events, the safety and security of Sh. Kanhaiya and his family members is a serious cause of concern.

A copy of the inquiry report submitted by the NHRC team has been forwarded to the Commisioner of Police, Delhi and the Director General of Prisons, Tihar Jail for their comments, to be received by the Commission, on or before 26.02.2016.

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?
  • మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: