• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Juan Guaidó

ముందే వెల్లడైన వెనెజులా ప్రతిపక్ష కుట్ర !

06 Monday May 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, cia, Juan Guaidó, Nicolás Maduro, operation liberty coup, Venezuela

Image result for operation liberty coup unveiled weeks before

ఎం కోటేశ్వరరావు

వెనెజులా పరిణామాలు 2

ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన జరిపిన తిరుగుబాటు యత్నం విఫలం కావటంతో ఇప్పుడు వెనెజులా ప్రతిపక్ష నేత జువాన్‌ గుయ్‌డో అమెరికా ప్రత్యక్షంగా మిలిటరీ జోక్యంచేసుకోవాలని కోరుతున్నాడు. తమ నడకలో ఎలాంటి తడబాట్లు లేవని, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. మరోవైపు గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని కారకాస్‌లోని స్పెయిన్‌ రాయబారి ఇంట్లో ఆశ్రయం పొందిన ప్రతిపక్ష నేత లియోపాల్డ్‌ లోపెజ్‌ను అరెస్టు చేయాలని వెనెజులా సర్కార్‌ నిర్ణయించింది. అతను రాజకీయ ఆశ్రయం కోరలేదని తాము ఆతిధ్యం మాత్రమే ఇస్తున్నామని స్పెయిన్‌ ప్రకటించింది.

వెనెజులా వ్యవహారాల్లో అమెరికా జోక్యం నిత్యకృత్యం అన్న విషయం తెలిసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త పధకాలు వేస్తూనే వుంటారు. ఆపరేషన్‌ లిబర్జీ పధకం కూడా అలాంటిదే. మధ్యంతర అధ్యక్షుడిగా జువాన్‌ గుయ్‌డో ప్రకటించుకోవటం, అతగాడి ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలతో దాన్ని గుర్తింప చేయటం, మదురో సర్కార్‌ నియమించిన రాయబారులను గుర్తించటం లేదని ప్రకటించటం వగైరాలన్నీ అంతర్జాతీయంగా వెనెజులాలో ప్రభుత్వం మారిపోయిందని, మదురో ఇంకేమాత్రం అధ్యక్షుడు కాదని ప్రపంచాన్ని నమ్మింపచేయటం ఈ పధకంలో భాగమే. దీన్ని అనేక దశల్లో అమలు జరిపారు. విఫలమైన అంకం ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి దేశంలో అంతర్గతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేయటం, మిలిటరీని తన వైపు రమ్మని కోరటం, తిరుగుబాటు చేయాలని అమెరికా పిలుపు ఇవ్వటం వంటి వన్నీ దానిలో భాగమే. కుట్రను గొప్పగా రూపొందించిన వారికి దాన్ని అనుసరించటానికి వెనెజులా జనం సిద్ధంగా లేరనే స్పృహ లేదు. అక్కడే పప్పులో కాలేశారు.

ఈ పధకంలో భాగంగా అమలు జరపాల్సిన వాటి మీద అమెరికాకు చెందిన సిఐఏ, యుఎస్‌ ఎయిడ్‌, ఎన్‌ఇడి వంటి వాటికి బాధ్యతలు అప్పగించారు. యుఎస్‌ ఎయిడ్‌ రూపొందించిన పలు దేశాలకు రూపొందించిన కార్యాచరణ పధకానికి సంబంధించిన పత్రం ఫిబ్రవరిలోనే వెల్లడైంది. ఆ సంస్ధకు అనుబంధంగా పనిచేసే ‘ యుఎస్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ లాబ్‌ ‘ 75పేజీల పత్రాన్ని రూపొందించింది. దానికి రాపిడ్‌ ఎక్స్‌పెడిషనరీ డెవలప్‌మెంట్‌(ఆర్‌ఇడి)(రెడ్‌) టీమ్స్‌: డిమాండ్‌ అండ్‌ ఫీజ్‌బులిటీ అని పేరు పెట్టింది.( వేగంగా దండయాత్ర నిర్వహించే బృందాలు: అవసరం మరియు సాధ్యాసాధ్యాలు) ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం వివిధ దేశాలలో రహస్య కార్యకలాపాలు నిర్వహించే సామర్ధ్యం గురించి అమెరికా మిలిటరీ, గూఢచార తదితర అధికారులు నివేదికను రూపొందించిన వారిని ఇంటర్వ్యూ చేశారు. ఒక్కో బృందం ఇద్దరిద్దరితో వుండాలని, ఎదురుదాడి, ఆత్మరక్షణ పద్దతులను, ప్రతికూల పరిస్ధితుల్లో ఎలా పని చేయాలో వాటికి నేర్పాలని అవి అమెరికా ప్రత్యేక దళాలు(ఎస్‌ఎఫ్‌) మరియు సిఐఏ పర్యవేక్షణలో పని చేయాలని నిర్దేశించారు. ఇవి స్ధానిక సామాజిక తరగతుల మధ్య అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. స్ధానికంగా వున్న పరిస్దితులను గమనించటం వాటికి అనుగుణంగా వెంటనే స్పందించి పధకాలు రూపొందించటం, నిధులు అందచేయటం, చిన్న చిన్న కార్యకలాపాల నిర్వహణ చేస్తాయి. వీటిలో సామాజిక కార్య క్రమాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే పేరుతో బోధలతో పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించటం కూడా వుంటాయి. దేశమంతటా స్వేచ్చ మరియు సహాయ కమిటీలను దేశ వ్యాపితంగా ఏర్పాటు చేయాలి. రెడ్‌ టీమ్స్‌ పైకి వుత్ప్రేరకాలుగా కనిపించాలి, వాటికి సామాజిక తరగతులను సమీకరించే పద్దతులు, చిట్కాలతో పాటు ఎదురుదాడి, ఆత్మ రక్షణకు ఆయుధాలను ఎలా వినియోగించాలో కూడా శిక్షణ ఇస్తారు. వారు స్ధానికులతో సంబంధాలను నెలకొల్పుకొని వారి ద్వారా మరికొందరిని ప్రభావితం చేసేందుకు, ప్రలోభపరచేందుకు వారి బలహీనతలను గుర్తించి డబ్బు,ఇతర వాటిని ఎరవేస్తారు. ఒకసారి వారి వలలో చిక్కిన తరువాత తమకు నిర్ధేశించిన రహస్యకార్యకలపాలలో నిమగ్నం చేస్తారు. ఈ అంశాలన్నీ ప్రతి దేశంలో అమలు జరపాల్సిన నమూనాలో భాగం. ఈ పధకాన్ని దక్షిణ అమెరికా దేశాలన్నింటా అమలు జరపాలి. ముందుగా అమెరికా పట్ల సానుకూలంగా వుండే ప్రభుత్వాలున్న దేశాలను ఎంచుకోవాలి. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు జరిపేందుకు బ్రెజిల్‌ను ఎంచుకోవాలని సూచించారు.

ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఫాసిస్టు జెయిర్‌ బల్‌సానారో అమెరికాతో సంబంధాల ఏర్పాటు గురించి బహిరంగంగానే చెప్పాడు. సిఐఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి బ్రెజిల్‌ అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ గతం కంటే తమ మధ్య సంబంధాలు బలపడ్డాయని, బ్రెజిల్‌ నాటోలో చేరాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తరువాత బొల్‌సానారో ఫిబ్రవరిలో ఒక ప్రకటన చేస్తూ తమ గడ్డ మీద నుంచి అమెరికా మరో దేశంలో సైనిక జోక్యం చేసుకోవటాన్ని తాము అనుమతించబోమని ప్రకటించాడు. అయితే తండ్రికి సలహాదారు, పార్లమెంట్‌ సభ్యుడైన ఎడ్వర్డ్‌ బొల్‌సానారో మార్చినెలలో మాట్లాడుతూ ఏదో ఒక సమయంలో వెనెజులాలో సైనిక జోక్యం అవసరమని, అన్ని అవకాశాలున్నాయని చెప్పాడు. అయితే బ్రెజిల్‌ నుంచి ప్రత్యక్ష జోక్యం చేసుకొనే అవకాశం లేకపోతే అక్కడి నుంచి రెడ్‌ బృందాలు రహస్య కార్యకలాపాలను నిర్వహించాలని సిఐఏ సూచించింది.

Image result for Venezuela 2 : operation liberty coup unveiled weeks before

నివేదికలో వెనెజులాలో నిర్వహించాల్సిన అంశాలను కూడా అనుబంధాలలో పొందుపరిచారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన ఆపరేషన్‌ ఫ్రీడమ్‌ లేదా లిబర్టీ ప్రారంభమౌతుందని వాటిలో పేర్కొన్నారు. కాన్వాస్‌ అనే సంస్ధ అమెరికా నిధులతో వెనెజులాలో ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించాలో జువాన్‌ గుయ్‌డోకు శిక్షణ ఇచ్చింది. దేశంలోని కీలకమైన వ్యవస్ధలను ధ్వంసం చేయటం ద్వారా మదురో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టటం వాటిలో ఒకటి. దానికి అనుగుణంగానే కొద్ది వారాల క్రితం వెనెజులా విద్యుత్‌ వ్యవస్ధను దెబ్బతీసి అంధకారం గావించిన విషయం తెలిసిందే. ఇలాంటి సలహాలు, ఎత్తుగడలు అమెరికా జోక్యం చేసుకొనే అన్నిదేశాలకూ సూచించారు. చిత్రం ఏమిటంటే వుదాహరణకు అని చెప్పినట్లుగా వెనెజులాలోని గౌరి డామ్‌ వద్ద వున్న సైమన్‌ బోలివర్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీస్తే పర్యవసానాలు ఎలా వుంటాయో వివరించారు.

ఆపరేషన్‌ లిబర్టీలో ఒక అంశం నిర్ణయాత్మక దశ అని పేరు పెట్టారు. దాన్ని ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీల్లో అమలు జరపాలని చూశారు. దాని ప్రకారం ఏం జరిగిందో కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరణ సారాంశం ఇలావుంది.ఆపరేషన్‌ లిబర్టీలో భాగంగా ఏప్రిల్‌ 30వ తేదీ తెల్లవారు ఝామున 5.46 నిమిషాలకు కొంత మంది సైనికుల రక్షణగా కెమెరా ముందు నిలబడిన లియోపాల్డ్‌ లోపెజ్‌ మాట్లాడుతూ పౌరులు వీధుల్లో ప్రదర్శనలుగా రావాలని, జువాన్‌ గుయ్‌డో వేచి వున్న లా కార్లోటా వైమానిక స్ధావరం వద్ద అందరం కలసి అక్కడి నుంచి మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కదులుదామని చెప్పాడు. ఆ తరువాత అర్ధగంటకు తాను నిర్బంధం నుంచి విముక్తి అయ్యానని, గుయ్‌డోకు విధేయులుగా వున్న సైనికులు తనను విడిపించారని ఇది నిర్ణయాత్మక దశ అని విజయానికి ఇదే తరుణం అన్నాడు. కొద్ది సేపటికి తాను వైమానిక స్ధావరం వద్దకు వచ్చానని చెప్పాడు. అయితే పంపిన ఫొటోలు దాని వెలుపల రోడ్డుమీదివి తప్ప మరొకటి కాదు. వుదయం 8.30కు తుపాకి కాల్పులు వినిపించాయి. ఎవరు ఎవరి మీద కాల్చారో తెలియని స్ధితి. మధ్యాహ్నానికి రోడ్ల మీద కొన్ని వుందల మందే వున్నారు. అక్కడి నుంచి ప్రదర్శన జరుపుదామని గుయ్‌డో, లోపెజ్‌ జనంతో చెప్పారు. ఆ సమీపంలోనే అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌, తదితర ప్రభుత్వ భవనాలు వున్నాయి. అటువైపు ప్రదర్శన సాగాలని చెప్పిన తరువాత భద్రతా దళాలు ప్రదర్శకులను అడ్డుకున్నాయి. రెండు గంటల సమయంలో నేషనల్‌గార్డ్స్‌, బొలివేరియన్‌ పోలీస్‌లు ప్రదర్శకులపై కాల్పులు జరిపారు. కొద్ది మంది గాయపడటం తప్ప ఎవరూ మరణించలేదు. సాయంత్రానికి కొద్ది మంది నిరసనకారులు అక్కడే వున్నారు.ఎక్కువ మంది వెళ్లిపోయారు.

తన ప్రయత్నం విఫలమైందని అర్ధం కాగానే గుయ్‌డో మే ఒకటవ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చాడు. మరోవైపు లోపెజ్‌ కారకాస్‌లోని చిలీ రాయబార కార్యాలయంలో వున్న తన భార్యాబిడ్డలను తీసుకొని స్పానిష్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి ఆశ్రయం కోరాడు. అయితే వారు కార్యాలయానికి బదులు రాయబారి ఇంట్లో రక్షణ ఇచ్చారు. వారం రోజులుగా ఇప్పటికి అక్కడే వున్నాడు. ఇరవై అయిదు మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. గుయ్‌డో గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయాడు. తొలి రోజు ఒకడు మరణించినట్లు,59 మంది గాయపడినట్లు వార్తలు వచ్చాయి. రెండవ రోజు మే డే నాడు కొన్ని చోట్ల గుయ్‌డో మద్దతుదార్లు ఘర్షణలకు దిగారు. పోలీసు కాల్పుల్లో ఒక యువతి గాయపడి తరువాత ఆసుపత్రిలో మరణించింది. అంతకు ముందు రోజు రాత్రే తిరుగుబాటును అణచివేసినట్లు మదురో ప్రకటించాడు. మే డే రోజున పెద్ద ఎత్తున ఆయన మద్దతుదార్లు వీధుల్లో అనేక చోట్ల ప్రదర్శనలు జరిపారు. తిరుగుబాటుదార్లు, వారి నేతలు గుయ్‌డో, లోపెజ్‌ల పట్ల మదురో సర్కార్‌ ఎంతో సంయమనం పాటించిందన్నది స్పష్టం. లేకుంటే వారు అంత స్వేచ్చగా కారకాస్‌ శివార్లలో తిరిగే వారు కాదు. తప్పుదారి పట్టిన పౌరుల పట్ల కూడా భద్రతా దళాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. భారీ ఎత్తున కాల్పులు జరిగాయని పశ్చిమ దేశాల మీడియా వార్తలు ఇచ్చింది. అయితే తరువాత అందుకు తగిన ఆధారాలు లేకపోవటంతో గప్‌చుప్‌ అయ్యాయి. తరువాత ఏమిటి అంటూ సమస్యను పక్కదారి పట్టించే కధనాలను ఇస్తున్నాయి. మచ్చుకు ఒకదాన్ని చూస్తే చాలు.

Image result for operation liberty coup

వెనెజులా పౌరులు పోగొట్టుకున్న తమ స్వాతంత్య్రం కోసం వీధుల్లోకి పెద్ద ఎత్తున వచ్చివుంటే ఎందరో మరణించి వుండేవారు. ఛావెజ్‌ను ఎన్నుకొని వారు పెద్ద తప్పు చేశారు. ఇరవై ఏండ్ల సోషలిజపు వినాశకర ప్రభావాలను చూస్తున్నారు. దశాబ్దకాలంగా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. ప్రజాస్వామిక స్వేచ్చలను అణచివేశారు. భావ ప్రకటనా స్వేచ్చ, స్వతంత్ర మీడియా అదృశ్యమైంది. సమాజంలోని ప్రతి స్ధాయిలో క్యూబా గూఢచారులను నింపివేశారు. దేశాన్ని ఒక పోలీసు రాజ్యంగా మార్చివేశారు. చివరకు మదురో వ్యక్తిగత అంగరక్షకులుగా భారీ సంఖ్యలో రష్యన్‌ సాయుధులు వచ్చారు. వెనెజులా మిలిటరీ ప్రస్తుత నాయకత్వాన్ని బలపరచి ప్రయోజనం లేదని గ్రహించి తిరుగుబాటు చేసే వరకు రష్యా, చైనా మదురోకు మద్దతు ఇస్తూనే వుంటాయి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం తొందరపాటు అవుతుంది.

ఇలా చెత్త రాతలన్నీ రాస్తున్నాయి. వాటన్నింటినీ దేవదూతల సందేశాలుగా భావించిన వారు ప్రచారంలో పెడుతున్నారు. ఆపరేషన్‌ లిబర్టీ కుట్ర ముందే వెల్లడి కావటంతో మదురో సర్కార్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవటం కూడా జయప్రదంగా దాన్ని తిప్పి కొట్టటానికి దోహదం చేసిందనవచ్చు. వాస్తవం ఏమిటో అనుభవించిన వారికి స్పష్టంగా తెలుసు, ప్రతిపక్ష నాయకుల గురించి కూడా వారికి చెప్పనవసరం లేదు. అయితే అమెరికన్లు తెగించి ప్రత్యక్ష సైనిక చర్యకు పాల్పడతారా, మరోసారి మిగతా దేశాలలో మాదిరి చేతులు కాల్చుకుంటారా అన్నది వచ్చే ఎన్నికలలో లబ్ది కోసం డోనాల్ట్‌ ట్రంప్‌ చేసే పిచ్చి ఆలోచనలను బట్టి వుంటుంది. ఒక వేల ప్రత్యక్ష జోక్యం చేసుకుంటే అది లాటిన్‌ అమెరికాలో, ప్రపంచంలో మరో కొత్త పరిణామాలకు నాంది అవుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘కుట్ర విఫలంపై మీడియా మూగనోము !

05 Sunday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, Juan Guaidó, Media’s Propaganda Campaign Against Venezuela’s Government, Nicolás Maduro, Nicolás Maduro Moros, Propaganda War, Venezuela

Image result for venezuela 1: mainstream media ignores failed coup

వెనెజులా పరిణామాలు -1

ఎం కోటేశ్వరరావు

ఏప్రియల్‌ 30వ తేదీన వెనెజులా వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘ (స్వేచ్చా ప్రక్రియ) పేరుతో అమలు జరపతలచిన కుట్రను మొగ్గలోనే నికోలస్‌ మదురో సర్కార్‌ తుంచివేసింది. ఇదెంత ప్రాధాన్యత కలిగిన అంశమో అమెరికా మరోసారి పచ్చి అబద్దాల కోరు అని ప్రపంచముందు బహిర్గతం కావటం కూడా అంతే ప్రాధాన్యత కలిగి వుంది. కూల్చివేత ప్రయత్నాల వార్తలకు అంతర్జాతీయ మీడియా ఇచ్చిన ప్రాధాన్యత దాని తుంచివేతకు ఎందుకు ఇవ్వలేదో నిజాయితీగా ఆలోచించే వారు అర్ధం చేసుకుంటారు. వెనెజులా మీద ఇప్పుడు బహుముఖ దాడి జరుగుతోంది. దానిలో ఆర్ధిక దిగ్బంధనం, ప్రచారదాడి, మతాన్ని వినియోగించటం, మిలిటరీని, జనాన్ని అంతర్గత తిరుగుబాట్లకు రెచ్చగొట్టటం ఇలా అనేక రకాలుగా సాగుతోంది. ఇది ఈ నాటిది కాదు, ఇప్పటితో అంతమయ్యేది కాదు. ఇది ఒక్క వెనెజులాకే పరిమితం కాదు. తనను రాజకీయంగా వ్యతిరేకించే వారు ఎక్కడ అధికారానికి వస్తే అక్కడ వారిని కూల్చివేయటం, ఆయా దేశాలు, ప్రాంతాలను ఆక్రమించకోవటం లేదా తన ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం అమెరికాకు నిత్యకృత్యం.

ఐరోపో నుంచి వలస వెళ్లిన వివిధ దేశాలకు చెందిన వారు స్ధానిక రెడ్‌ ఇండియన్లను అణచివేసి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పరిగణించబడుతున్న, ఇతర అమెరికా ఖండ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అవి వివిధ ఐరోపా దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మెజారిటీ ప్రాంతాలు(అమెరికా) బ్రిటీష్‌ పాలనలో వున్నాయి. తమకు తామే పరిపాలించుకొనే శక్తి వచ్చింది కనుక బ్రిటీష్‌ పెత్తనం ఏమిటంటూ వలస వచ్చిన వారు చేసిన తిరుగుబాటు కారణంగానే 1776లో అమెరికాకు స్వాతంత్య్రం వచ్చింది. అంతర్యుద్ధం ముగిసి కుదుట పడిన తరువాత వారే తొలుత తమ పరిసరాలను, తరువాత ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకొని మరోబ్రిటన్‌ మాదిరి తయారయ్యేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్‌ వారు మన దేశంలో ముందు రాజులు, రాజ్యాల మీద యుద్దాలు చేయలేదు. ప్రలోభాలు, కొన్ని ప్రాంతాల మీద హక్కులు సంపాదించుకున్నారు. అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికాలోని పదిహేను రాష్ట్రాలలో, కెనడాలో కొంత భాగం, హైతీగా వున్న దేశంతో కూడిన ఫ్రెంచి ఆధీనంలోని లూసియానా ప్రాంతాన్ని 1803లో అమెరికా కొనుగోలు చేసింది. 1699 నుంచి 1762 వరకు తన ఆధీనంలో వున్న లూసియానా ప్రాంతాన్ని ఫ్రెంచి పాలకులు స్పెయిన్‌కు దత్తత ఇచ్చారు. 1800 సంవత్సరంలో తిరిగి వుత్తర అమెరికా ఖండంలో తమ పాలనను విస్తరించేందుకు లూసియానాను తిరిగి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే హైతీ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటును ఫ్రెంచి సేనలు అణచివేయలేకపోయాయి. దానికి తోడు బ్రిటన్‌తో తలపడేందుకు సన్నాహాలలో భాగంగా లూసియానా ప్రాంతాన్ని విక్రయించేందుకు ఫ్రాన్స్‌ ప్రయత్నించింది. తనకు రేవు పట్టణమైన న్యూ ఆర్లినియన్స్‌ పరిసరాలను కొనుగోలు చేయాలని ముందుగా భావించిన అమెరికా సర్కార్‌ ఫ్రాన్స్‌ బలహీనతను సాకుగా తీసుకొని మొత్తం ప్రాంతాన్ని కొనుగోలు చేసింది.కోటీ 80లక్షల ఫ్రాంకుల అప్పురద్దు రద్దు చేసి మరో ఐదు కోట్ల ఫ్రాంకులను అందుకుగాను చెల్లించింది.(2017 విలువ ప్రకారం 600బిలియన్‌ డాలర్లకు అది సమానం) ఇలా ఇతర దేశాల ప్రాంతాలను కొనుగోలు చేయటం అమెరికా రాజ్యాంగానికి విరుద్దం అని ప్రతిపక్ష ఫెడరలిస్టు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తే అధ్యక్షుడిగా తనకున్న అధికారాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకొని కొత్త ప్రాంతాలను సేకరించవచ్చని థామస్‌ జఫర్సన్‌ సమర్ధించుకున్నాడు. అలా అమెరికా విస్తరణ తొలుత ఒప్పందాలతో ప్రారంభమైతే తరువాత సామ్రాజ్యవాదిగా మారి 1846లో మెక్సికో నుంచి నేటి టెక్సాస్‌ ప్రాంతాన్ని యుద్దంలో ఆక్రమించుకున్న అమెరికా నాటి నుంచి నేటి వెనెజులా వరకు అనేక ప్రభుత్వాలను అదిరించటం,బెదిరించటం, లొంగని వారిని అడ్డుతొలగించుకోవటం, వలసలు చేసుకోవటం, అది సాధ్యం కానపుడు తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం వరకు అన్ని ఖండాలలో అమెరికా పాల్పడని అప్రజాస్వామిక చర్య లేదు. అంతర్జాతీయ చట్టాలకు వక్ర భాష్యం చెప్పటం ఒకటైతే తన పధకాల అమలుకు ఇతర దేశాల మీద స్వంత చట్టాలను రుద్దటం మరొక దుశ్చర్య.

స్పానిష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందిన లాటిన్‌ అమెరికా లేదా దక్షిణ అమెరికా దేశాలలో వెనెజులా ఒకటి. గత వంద సంవత్సరాలలో సామ్రాజ్యవాదుల జోక్యం, మిలిటరీ నియంతలు, ఆర్ధిక పతనాలు ఇలా ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్న దాని చరిత్రను మూసి పెట్టి వామపక్షాల పాలనలోనోనే దేశమంతా పాచిపోయిందనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో వున్న మదురో, అంతకు ముందున్న ఛావెజ్‌లనే కాదు,తనను వ్యతిరేకించిన వామపక్ష వాదులు కాని అనేక మందిని అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో కూల్చివేసేందుకు, గద్దెల నెక్కించేందుకు ప్రయత్నించిన అమెరికా చరిత్ర దాస్తే దాగేది కాదు. వెనెజులా విషయానికి వస్తే 1951-58 మధ్య అధికారంలో వున్న నియంత పెరెజ్‌ జిమెంజ్‌ను అమెరికా బలపరిచింది.1958లో వామపక్ష, మధ్యేవాదులుగా వున్న వారు తిరుగబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. మరో నియంతను బలపరిచే అవకాశాలు లేక తరువాత కాలంలోే ఏ నినాదంతో ధికారంలోకి వచ్చినప్పటికీ పాలకులందరినీ తన బుట్టలో వేసుకొని తన అజెండాను అమలు జరపటంలో అమెరికా జయప్రదమైంది. వామపక్ష వాది ఛావెజ్‌ విషయంలో కూడా అమెరికా అదే అంచనాతో వుంది. అది వేసుకున్న తప్పుడు అంచానాల్లో అదొకటిగా చరిత్రలో నమోదైంది. ఆయన వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురో విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఆయనను తొలగించేందుకు ఆపరేషన్‌ లిబర్టీ పేరుతో విఫలయత్నం చేసింది. దానికి ముందుగా, ఆ సమయంలోనూ, తరువాత ప్రచార దాడిని కొనసాగిస్తోంది. ఈ దాడి తీరుతెన్నులను ముందుగా పరిశీలిద్దాం,( తరువాయి భాగాల్లో మిగతా అంశాలు)

దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమనే వాట్సాప్‌, లైక్స్‌ కొట్టే ఫేస్‌బుక్‌ మరుగుజ్జులు చెలరేగిపోతున్న తరుణమిది. సామ్రాజ్యవాదం తన ప్రచార దాడికి వుపయోగించే ఆయుధాలలో సాంప్రదాయక మీడియాతో పాటు ప్రస్తుతానికి సామాజిక మీడియాలో ఇవెంతో శక్తివంతగా పని చేస్తున్నాయి. అనేక మంది వాటి దాడికి మానసికంగా బలి అవుతున్నారు. వామపక్ష ప్రభుత్వాలు అమలు జరిపిన అనేక పధకాల వలన వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దివాలా దీసింది, జనాన్ని సోమరులను గావించింది, మన దేశాన్ని లేదా తెలుగు రాష్ట్రాలను ఇలా కానివ్వ వద్దు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిలో పేరు మోసిన ఒక రచయిత కూడా స్టార్‌ కాంపెయినర్‌గా మారటంతో అనేక మంది దృష్టిని ఆకర్షించింది. చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు.

Image result for media war on venezuela

వెనెజులా గురించిన ఈ ప్రచారం 2001లో ప్రారంభమైంది.1999లో వామపక్ష వాది హ్యూగో ఛావెజ్‌ తొలిసారి అధికారానికి వచ్చారు. అప్పటికే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ ఘోరవైఫల్యం చెందిన కారణంగానే ఆయనను జనం అందలం ఎక్కించారు. కానీ మీడియా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం గురించి ఏమాత్రం తెలియనట్లే వుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా జరిపిన దుశ్చర్యలు, అది బలపరిచిన పాలకులు జరిపిన మారణకాండ, పర్యవసానాలలో రెండు కోట్ల మంది మరణించారని, లిబియా, ఎమెన్‌, లెబనాన్‌, సిరియాలలో జరిగిన మానవ నష్టం దీనికి అదనమని జేమ్స్‌ ఏ లూకాస్‌ అంచనా వేశారు. వెనెజులాలో అత్యవసర ఔషధాలు లేక 40వేల మంది మరణించారని చెబుతున్నా, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నా, మిలియన్ల మంది పొరుగుదేశాలకు వలసపోయారంటూ అతిశయోక్తులు చెబుతున్నా, అవన్నీ అమెరికా, దాని కనుసన్నలలో వ్యవహరించే పొరుగుదేశాలు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, అమెరికా విధించిన ఆంక్షలే కారణం తప్ప వామపక్ష పాలకులు కాదు. ఇవన్నీ మీడియాకు, పరిశీలకులకు కనిపించవా?

వెనెజులా ఎంతో ధనిక దేశం వామపక్ష పాలనలో దివాలా తీసిందన్నది మరొక ప్రచారం.1999లో ఛావెజ్‌ అధికారానికి వచ్చినపుడు అక్కడ జనాభాలో సగం మంది దారిద్య్రరేఖకు దిగువన, పొరుగు దేశాలతో పోల్చితే శిశు మరణాలు రెండు రెట్లు ఎక్కువ. మరి ధనిక దేశం అయితే అలా ఎందుకున్నట్లు ? అంతకు ముందున్న పాలకులందరూ అమెరికాతో మిత్రులుగా వున్నవారే కదా ! అనేక దేశాలలో వామపక్ష, వుదారవాదులుగా వుంటూ అధికారంలోకి వచ్చిన వారిని అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. చిలీలో అందుకు వ్యతిరేకించిన సాల్వెడార్‌ అలెండీని హతమార్చింది. వెనెజులాలో కూడా ఛావెజ్‌ను తమ వాడిగా మార్చుకోవచ్చని ఆశించిన అమెరికాను 2001లో ఆయన తొలి దెబ్బతీశాడు. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించి ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంతో అప్పటి నుంచి కుట్రలు మొదలు.2002లో మిలిటరీ తిరుగుబాటు చేసి వాణిజ్యవేత్త పెడ్రో కార్‌మోనాకు అదికారం అప్పగించారు. అప్పుడు జార్జి బుష్‌ ఆ తిరుగుబాటను సమర్ధించాడు. వెంటనే ఐఎంఎఫ్‌ రంగంలోకి దిగి సాయం చేస్తామని ప్రకటించింది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆ తిరుగుబాటు విఫలం కాకుండా చూడాలని సంపాదకీయం రాసింది.’కాబోయే నియంత’ ను తొలగించారని ఛావెజ్‌ను వర్ణించింది, ఆయన స్ధానంలో గౌరవనీయుడైన వాణిజ్యవేత్తను ప్రతిష్టించారని ప్రశంసించింది. ఈ కుట్ర వెనుక అమెరికా వుందని ఛావెజ్‌ అబద్దాలు చెబుతున్నారని గార్డియన్‌ పత్రిక ప్రకటించింది. .అయితే ఆ కుట్ర విఫలమై తిరిగి ఛావెజ్‌ అధికారానికి వచ్చాడు. వెంటనే ప్రభుత్వ చమురు కంపెనీలో విద్రోహ చర్యలకు పాల్పడి పెద్ద నష్టం కలిగించారు. అప్పటికే వున్న ఆర్ధిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. నిరుద్యోగం, దారిద్య్రం పెరిగింది. దానికి కారకులు ఎవరు?

Image result for media war on venezuela

దాన్నుంచి బయట పడేందుకు ఛావెజ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా వ్యాపారవేత్తలు తమకు అనువుగా మార్చుకొని మరిన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టారు.ఛావెజ్‌ మరణించిన తరువాత 2014లో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పతనమయ్యాయి. దాంతో ఇబ్బందులు పెరిగాయి. అయినా నికొలస్‌ మదురో స్వల్పమెజారిటీతో విజయం సాధించటంతో తిరిగి కుట్రలు మరో దశకు చేరాయి. బరాక్‌ ఒబామా 2015లో ఆంక్షలను ప్రకటించాడు. ఏ సాకూ దొరక్క మదురో సర్కార్‌ వుండటం తమ జాతీయభద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగిస్తున్నాడు.మరిన్ని కొత్త ఆంక్షలు విధించాడు. వీటన్నింటిని విస్మరించిన మీడియా వెనెజులా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అతిగా చూపుతూ మొసలి కన్నీరు కారుస్తోంది. కెనడాకు చెందిన స్టెఫానీ నోలెన్‌ అనే జర్నలిస్టు వెనెజులా గురించి వాస్తవాలనే పేరుతో అనేక అవాస్తవాలను రాస్తూ ముగింపులో ఇలా పేర్కొన్నారు.’మదురో సర్కార్‌ అంతిమంగా పతనం అవుతుందని ప్రతిపక్ష నేత ఆశాభావంతో వున్నాడు. ఆహారం మొత్తం ఖాళీ అయింది, జనాన్ని వీధుల్లో దింపాలని, మదురో గద్దె దిగే వరకు వారు ఇండ్లకు వెళ్లకూడదనేవిధంగా ఆలోచనలు సాగుతున్నాయని రాశారు. దీనికి అమెరికా, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయని ఎలాంటి బెరకు లేకుండా ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. అంటే ఏం చేయాలో కూడా జర్నలిస్టులు నిర్ణయిస్తారు, అవన్నీ అమెరికా ఆలోచనలకు అనుకూలంగా వుంటాయి.

Image result for media war on venezuela

తాజా పరిణామాల విషయానికి వస్తే మదురో సర్కార్‌ కూలిపోనుందనే రీతిలో ఏప్రిల్‌ చివరివారంలో మీడియా వార్తలున్నాయి. తానే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న గుయ్‌డో రాజధాని శివార్లలోని ఒక వైమానిక స్ధావరం సమీపంలో మకాం వేశాడు. గృహనిర్బంధంలో వున్న అతగాడి గురువు లియోపాల్డో లోపెజ్‌ను తప్పించి గుయ్‌డో వద్దకు చేర్చారు. తిరుగుబాటులో భాగంగా ఆ స్దావరాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది పధకం. అయితే అంతా పదిగంటల వ్యవధిలోనే ముగిసిపోయింది. తిరుగుబాటుదార్లు వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలో వున్నారు. లక్షల మందిగా వస్తారనుకున్న జనం ఎక్కడా జాడలేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి సిఎన్‌ఎన్‌ ఛానల్లో మాట్లాడుతూ మదురో క్యూబాకు పారిపోతున్నాడంటూ చేసిన అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున మీడియా జనం ముందు కుమ్మరించింది. ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన అంతర్జాతీయ మీడియాలో మొత్తంగా అక్కడ తిరుగుబాటు జరుగుతున్నట్లే వార్తలు వచ్చాయి. మదురోకు మద్దతుగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన జనం మీడియాకు కనిపించలేదు.బిబిసి అలాంటి వార్తనే రోజంతా ఇచ్చి చివరకు సాయంత్రానికి దాన్ని కొద్దిగా మార్చుకోవాల్సి వచ్చింది. కొద్ది మంది కిరాయి మనుషులను, గుయ్‌డోను పదే పదే చూపాయి. కుట్రలో భాగంగా కొన్ని చోట్ల సాగించిన దహనకాండను తిరుగుబాటుగా వర్ణించాయి. అయితే ఇంత జరిగినా మీడియాను వెనెజులా జనం విశ్వసించలేదు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా జరుగుతున్న అసత్య ప్రచారం ప్రపంచం కంటే వారికి ఎక్కువగా తెలుసు. వాస్తవం ఏమిటో, కట్టుకధలేమిటో ఎరిగిన వారు. 2002లో తిరుగుబాటు సమయంలో నిరాయధుల మీద ఛావెజ్‌ సర్కార్‌ కాల్పులు జరిపిందని, మారణకాండ జరిపినట్లు కొన్ని మీడియా సంస్ధలు ప్రసారం చేసిన వీడియోలు నకిలీవని తేలింది. అందువలన విశ్వసనీయత కోల్పోయిన మీడియా వార్తలను వారు విస్మరించారు. వాస్తవాలు తెలియదు కనుక మన జనాల్లో కొంత మంది అలాంటి వాటిని నిజమే అని నమ్ముతున్నారు. సమాచార సామ్రాజ్యవాదానికి కావాల్సింది అదే.అయితే అందరినీ ఎల్లకాలం నమ్మించలేమనే వాస్తవం వారికి తెలిసినా, ఇదొక యుద్ధం కనుక అస్త్రాలను ప్రయోగిస్తూనే వుంటారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెనెజులాలో మంగళవారం నాటి తిరుగుబాటును అణచివేసిన వామపక్ష ప్రభుత్వం !

01 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Caracas, Juan Guaidó, Leopoldo Lopez, Nicolás Maduro, Venezuela, Venezuelan Military Putsch, Venezuelan Opposition

ఎం కోటేశ్వరరావు

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికులు, ఇతర భద్రతా దళాలకు చెందిన కొద్ది మంది చేసిన తిరుగుబాటు ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచివేసినట్లు వెనెజులా అధ్య క్షుడు నికోలస్‌ మదురో మంగళవారం రాత్రి ప్రకటించారు. సైనిక అధికారులు, ఇతర ప్రముఖులతో కలసి గంటసేపు టీవీలో చేసిన ప్రసంగంలో వుదయం నుంచి జరిగిన పరిణామాలను దేశ ప్రజలకు వివరించారు. సాయుధ తిరుగుబాటును సాకుగా చూపి అమెరికా మిలిటరీ జోక్యానికి పాల్పడాలని కుట్ర చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమాయానికి కొంత మంది విద్రోహులు బయటపడ్డారని వారిని వదిలేదని చెప్పారు. తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్‌ గుయ్‌డో అజ్ఞాతం నుంచి తిరుగుబాటుకు పిలుపునిస్తూ వీడియోలను విడుదల చేయటం , అక్కడక్కడా బారికేడ్ల ఏర్పాటు, దహనకాండ వుదంతాలు తప్ప ఎక్కడా తిరుగుబాటు సూచనలు లేవని వార్తలు వెల్లడించాయి. మదురోకు మిలిటరీ మద్దతు ఇవ్వటం లేదని గుయ్‌డో చెప్పుకున్నాడు. తమ నాయకుడికి పధకం ప్రకారం అమెరికా నుంచి రావాల్సిన సాయం అందలేదని అనుచరులు చెప్పినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే సైనిక తిరుగుబాటుకు బదులు బుధవారం నాడు శాంతియుత తిరుగుబాటులో భాగంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చి తనకు మద్దతుగా ప్రదర్శనలు చేయాలని గుయ్‌డో విడుదల చేసిన వీడియోల్లో వుందని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక పేర్కొన్నది. బుధవారం నాడు వీధుల్లోకి వచ్చి ప్రతిపక్షాల కుట్రను విఫలం చేయాలని, మేడేను జరుపుకోవాలని మదురో కూడా తన మద్దతుదార్లకు పిలుపునిచ్చాడు. తాను మంగళవారం వుదయం రష్యన్ల మద్దతుతో వెనిజులా నుంచి క్యూబాకు పారిపోనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పటాన్ని మదురో అపహాస్యం చేశాడు. వెనెజులాలో వున్న క్యూబన్‌ సైనికులు అక్కడ ఏదైనా మరణాలు, నష్టానికి కారకులైతే క్యూబా మీద మరిన్ని కఠిన ఆంక్షలు అమలు జరుపుతామని, కనుక వెంటనే స్వదేశానికి వెళ్లాలని మంగళవారం సాయంత్రం ట్విటర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. వెనెజులాలో పరిస్ధితి క్లిష్ట దశకు చేరుకుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ అన్నాడు.ముగ్గురు సీనియర్‌ అధికారులతో తాము సంప్రదించామని, మదురోను తప్పించేందుకు వారు అంగీకరించారని చెప్పుకున్నాడు. అయితే బోల్టన్‌ ఇలాంటి ఇలాంటి కలలు కనటం కొత్త కాదని వెనెజులా విదేశాంగ మంత్రి జార్జ్‌ అరియా వ్యాఖ్యానించాడు.

మంగళవారం తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయంలో గుయ్‌డోకు గురువు, గృహనిర్బంధంలో వున్న ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపెజ్‌ను కొంత మంది సాయుధులు తప్పించి వెలుపలకి తీసుకువచ్చారు. రాజధాని కారకాస్‌లో ఒక రహదారిని మూసివేశారు. నగరశివార్లలోని ఒక చోట లోపెజ్‌, గుయ్‌డో కలుసుకున్నారు. అక్కడి నుంచి వీడియోలు విడుదల చేశారు. రాజ్యాంగపరిషత్‌ అధ్యక్షుడు డియోసడాడో కాబెల్లో టీవీలో మాట్లాడుతూ కుట్రదారుల గురించి వివరించి బలివేరియన్‌ మిలిషియా వీధుల్లోకి వచ్చి అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన జరిపారు. తామనుకున్న విధంగా ఎలాంటి తిరుగుబాటు లేకపోవటంతో గుయ్‌డో కొంత మంది అనుచురులతో కలసి గుర్తు తెలియని ప్రాంతానికి తప్పించుకోగా లోపెజ్‌ తొలుత చిలీ రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడ వున్న కుటుంబసభ్యులతో కలసి తరువాత స్పెయిన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి శరణువేడినట్లు,25 మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారని వార్తలు వచ్చాయి.

రాజధాని కారకాస్‌, ఇతర పట్టణాల్లో గుయ్‌డో అనుచరులు బారికేడ్లు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల దహనకాండకు పాల్పడ్డారని, కారకాస్‌ శివార్ల నుంచి ప్రదర్శన జరిపేందుకు ప్రయత్నించిన గుయ్‌డోను భద్రతాదళాలు చెదరగొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఏడు గంటల పాటు గుయ్‌డో సామాజిక మాధ్యమానికి అందుబాటులో లేకుండా పోయాడు. ప్రతిపక్షం రెచ్చగొట్టే చర్యల పట్ల సంయమనం పాటించాలని మదురో మిలిటరీ, ఇతర భద్రతా దళాలను కోరాడు.తిరుగుబాటు యత్నాలను బలీవియా అధ్యక్షుడు ఇవోమొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ తీవ్రంగా ఖండించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేస్తూ హింస ఏరూపంలో వున్నా ఖండించాలని, సంయమనం పాటించాలని కోరగా, ఐరోపా పార్లమెంట్‌ అధ్యక్షుడు అంటోనియో టజని మాత్రం తిరుగుబాటును సమర్ధించాడు.

నాడు క్యూబా, నేడు వెనెజులాలో చరిత్ర పునరావృతం !

అమెరికా దేశాల సంస్ధ (ఒఎఎస్‌) నుంచి తప్పుకొనే ప్రక్రియను పూర్తి కావటంతో సంతోషం ప్రకటిస్తూ వెనిజులాలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఆ సంస్ధ అమెరికా కీలబొమ్మగా మారిందని ఇప్పుడు తాము మరింత స్వతంత్రంగా వున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో ఆ సంస్ధ చేసే నిర్ణయాలకు కట్టుబడనవసరం లేదు. అది అమెరికా వలస దేశాల మంత్రిత్వశాఖ అని గతంలో కాస్ట్రో చేసిన విమర్శను మదురో పునరుద్ఘాటించారు.అమెరికా ఆంక్షలకు గురైన వెనెజులా విదేశాంగ మంత్రి జార్జి అరియా విదేశాంగశాఖ భవనంపై నుంచి శనివారం నాడు ప్రదర్శకులతో మాట్లాడుతూ మనం నిన్నటి కంటే నేడు మరింత స్వతంత్రుల మయ్యామని ప్రకటించారు. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి లూయీస్‌ మగారో అమెరికాకు వంతపాడుతూ అవసరమైతే మానవతా పూర్వకంగా మిలిటరీ జోక్యం చేసుకున్నాతప్పు లేదని గతంలో ప్రకటించాడు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో సభ్యదేశాలన్నీ గుయ్‌డో సర్కార్‌ను గుర్తించాలని తీర్మానించటమేగాక మదురో సర్కార్‌ ప్రతినిధి బదులు గుయ్‌డో మనిషిని సమావేశానికి ఆహ్వానించింది. ఈ పూర్వరంగంలో వెనిజులా రెండు సంవత్సరాల గడువు నిబంధనను పూర్తి చేసి ఆ సంస్ధ నుంచి వైదొలిగింది. వెనిజులా మీద దాడికి పాల్పడితే సహించేది లేదని రష్యా, చైనా హెచ్చరికలు చేశాయి. యాభై ఏడు సంవత్సరాల క్రితం క్యూబాలో క్షిపణుల మోహరింపు, నేడు వెనెజులాలో అదే పునరావృతం అయింది. నాడు అమెరికా తోక ముడిచి రాజీకి దిగి వచ్చింది.నేడు వుక్రోషంతో హూంకరింపులు చేస్తోంది. ముగింపు కూడా గతమే పునరావృతం అవుతుందా? ఆరు దశాబ్దాల నాటికి నేటికీ ప్రపంచం, రాజకీయాల్లో వచ్చిన మార్పులేమిటి? కొత్త వుద్రిక్తతలకు నాందీ వాచకం పలుకుతుందా, అంతర్జాతీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా వుంటాయి? వీటి మంచి చెడ్డలను ఎలా చూడాలి? రెండింటి మధ్య వున్న సామ్యాలు ఏమిటి ?

నాడు క్యూబాలో జరిగిందానికి, నేడు వెనెజులాలో జరుగుతున్నదానికి అమెరికా సామ్రాజ్యవాదులే కారణం. తమ గుమ్మం ఎదుట ఒక సోషలిస్టు రాజ్యం అవతరించటమా అని నాడు ఆగ్రహం వస్తే, అంతరించిపోయిందనుకు కున్న వామపక్ష శక్తి తన పెరటితోటలోనే పెరగటమా అని నేడు అమెరికా వూగిపోతోంది. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన 1959లో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కాస్ట్రో వ్యతిరేకులకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన అమెరికా 1961లో జరిపిన తిరుగుబాటు కుట్రను బే ఆఫ్‌ పిగ్స్‌ అని పిలిచారు. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌ దృష్టిని క్యూబా నుంచి మళ్లించేందుకు ఐరోపాలోని టర్కీ, ఇటలీలో ఖండాంతర క్షిపణులను మోహరించి రెచ్చగొట్టారు. అమెరికన్ల మద్దతుతో జరిగిన తిరుగుబాటును అణచివేసిన క్యూబా సర్కార్‌ తమకు రక్షణ కల్పించాలని కోరగా 1962 అక్టోబరులో క్యూబా గడ్డమీద సోవియట్‌ తన క్షిపణులను మోహరించింది. ఈ చర్య అమెరికా సమాజంలో ప్రభుత్వం మీద ఆగ్రహం కలిగించింది. తమకు అణ్వాయుధాల ముప్పు తెచ్చారంటూ తీవ్ర నిరసనలు, విమర్శలు చెలరేగాయి. రెండవది అదే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దానికే ఎదురు తిరగటంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముదు అంటే 1962 అక్టోబరు రెండవ పక్షంలో జరిగిన ఈ పరిణామంతో అమెరికా వెనక్కు తగ్గి సోవియట్‌ యూనియన్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టర్కీ, ఇటలీ నుంచి అమెరికా అణ్వాయుధాలను తొలగించాలి, దానికి ప్రతిగా క్యూబా నుంచి సోవియట్‌ తొలగిస్తుంది. క్యూబా వైపు నుంచి ప్రత్యక్షంగా రెచ్చగొట్టే చర్యలు వుంటే తప్ప తాముగా క్యూబాలో జోక్యం చేసుకోబోమని, సోవియట్‌తో న్యూక్లియర్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకుంటామని అమెరికన్లు దిగివచ్చారు.

ఇప్పుడు వెనిజులా విషయంలో అమెరికన్లు ఎత్తుగడను మార్చారు. సైన్యంలో తిరుగుబాట్లను రెచ్చగొట్టి విఫలమయ్యారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షానికి వచ్చిన మెజారిటీని ఆసరా చేసుకొని వామపక్ష మదురో సర్కార్‌ను కూలదోసేందుకు తెరతీశారు.ఈ ఏడాది జనవరి 23న పార్లమెంట్‌ స్పీకర్‌ జువాన్‌ గుయ్‌డో తనకు తానే దేశాధ్యక్షుడనని ప్రకటించుకున్నాడు. బయట ప్రమాణస్వీకార తతంగం కూడా జరిపాడు. దాన్ని అమెరికాతో సహా దాని అనుంగు దేశాలు గుర్తించాయి. గుయ్‌డోకు విధేయులై వుండాలని మిలిటరీ, అధికార యంత్రానికి చేసిన వినతికి స్పందన లేదు. వాస్తవానికి అంతకు ముందే అధ్యక్షుడు మదురో పార్లమెంట్‌ను రద్దు చేసి నూతన రాజ్యాంగ రచనకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. అందువలన గుయ్‌డో అధ్యక్షుడిగా అతను చేసిన ప్రమాణస్వీకారం చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విదేశాలలో ఏర్పాటు అయినట్లు చెప్పుకున్న గుయ్‌డో అనుకూల సుప్రీం కోర్టు అతన్ని సమర్ధించింది. తన పధకానికి అనుగుణంగా పరిణామాలు లేకపోవటంతో కంగు తిన్న అమెరికన్లు వెనెజులా మీద మరింత కఠినంగా ఆంక్షలు పెట్టటమే కాదు, దేశంలోని విద్యుత్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేశారు. ప్రాణావసర ఔషధాలను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మానవతా పూర్వక సాయం పేరుతో ట్రక్కుల్లో ఆయుధాలు చేరవేసేందుకు పన్నిన ఎత్తుగడను మదురో సర్కార్‌ విఫలం చేసింది.

దీనికి ప్రతిగా వెనెజులా కోరిక మీద అమెరికన్ల అధునాతన ఆయుధాల దాడిని ఎదుర్కొనే వుపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే ఎస్‌300క్షిపణులను, వాటిని ప్రయోగించే మిలిటరీ నిపుణుల రష్యా తరలించింది. వాటిని దాపరికం లేకుండా వెనిజులా ప్రత్యక్షంగా ప్రదర్శించింది కూడా. దీనికి తోడు యాంగ్జీఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌లైన్స్‌ చైనా నుంచి బోయింగ్‌ 747 సరకు రవాణా విమానంలో ఔషధాలు, పరికరాలను చైనా పంపింది. నికొలస్‌ మదురో వుద్వాసనకు గురి కాబోతున్నాడంటూ సోమవారం నాడు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. లక్ష కోట్ల డాలర్ల సిల్కు రహదారి(దీన్నే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు) పారిశ్రామిక, వాణిజ్య పధకం గురించి 150దేశాలకు, 90సంస్ధలకు చెందిన ప్రతినిధులతో గతవారంలో బీజింగ్‌లో చైనా పెద్ద సమావేశం నిర్వహించింది. దానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా 37దేశాధినేతలు కూడా హాజరయ్యారు.( ఈ సమావేశాన్ని అమెరికా,దానితో కౌగిలింతల దౌత్యం నడుపుతున్న మన దేశం కూడా బహిష్కరించింది) ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌తో సమావేశమైనపుడు వెనిజులా ప్రస్తావన వచ్చిందని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఇరుదేశాలు దానికి బాసటగా నిలవాలని, అమెరికా వైఖరిని ఖండిస్తూ వారు మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇది అమెరికన్లకు ఆగ్రహం తెప్పించింది. క్యూబా మీద మరిన్ని ఆంక్షలు విధించటాన్ని గుర్తు చేస్తూ మదురో మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్ధితి ఎంతో మెరుగ్గా వుండేదని చెప్పేందుకే తామీ పని చేశామని, మదురోను సమర్ధించే దేశాలన్నింటికీ ఇదే చెప్పదలచుకున్నామని రష్యా, చైనాలను బెదిరిస్తూ పాంపియో మాట్లాడాడు. వెనెజులా పౌరులు, మిలిటరీకి, క్యూబన్లకు, రష్యన్లకు, మీరు గనుక వార్తలు చూస్తే వెనిజులాకు సాయం చేస్తున్న ఇరాన్‌కు, అదే విధంగా ఎంతో చేస్తున్న చైనాకూ ఇదే హెచ్చరిక అన్నాడు. మదురోకు మద్దతుదారుల్లో ఒకరు తిరుగుబాటుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. క్యూబా నుంచి వందల మంది అధికారులు, 20వేల మంది సనికులు వెనెజులా వెళ్లినట్లు అమెరికా చేసిన ఆరోపణలను క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌ తోసి పుచ్చారు. ప్రపంచంలో 800చోట్ల సైనిక స్ధావరాలు, లక్షల మంది సైన్యాన్ని దింపిన అమెరికా తమ గురించి మాట్లాడుతోందని,అబద్దాలు చెబుతోందని అన్నారు.

సర్వసత్తాక దేశాల్లో జోక్యం చేసుకొనే అమెరికా వైఖరిని రష్యా, చైనా ఖండించాయి. వెనిజులాపై చర్య తీసుకొనే అంశంలో తమ అధికారులు సిద్ధంగా వున్నారని అమెరికా దక్షిణ కమాండ్‌ నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ క్రెయిగ్‌ ఫాలర్‌ వెల్లడించాడు. ఈ ప్రకటన మిలిటరీ జోక్యం వూహకాదు వాస్తవమే అని రష్యా వ్యాఖ్యానించింది.అమెరికా అంతర్గత చట్టాల పేరుతో భద్రతా మండలి వెలుపల ఆం్షలు విధించటాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా పేర్కొన్నది.చైనా, ఇరాన్‌ మానవతా పూర్వక సాయాన్ని అందించేందుకు ప్రతినిధులతో పాటు విమానాల్లో సాయాన్ని కూడా పంపాయి. అమెరికా దాడికి సిద్ధం అవుతున్నదనే వార్తల పూర్వరంగంలో భద్రతా దళాలకు మద్దతుగా పది లక్షల మందిని సిద్ధం చేయాలని గతవారం మదురో ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

గత నెల చివరి వారంలో రష్యా నుంచి యుద్ధనిపుణులు వెనిజులా చేరుకున్నారు. అమెరికా నుంచి ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఎత్తుగడలను వారు రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మిలిటరీ కేంద్రాల సంరక్షణకు రష్యా తయారీ ఎస్‌-300 క్షిపణులను ప్రయోగించే నాలుగు సంచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే బ్రహ్మూెస్‌ క్షిపణులను మోసుకుపోగల సుఖోయ్‌ ఎస్‌యు-30 జట్‌ యుద్ధ విమానాలను, టి-72 టాంకులు, వేగంగా ప్రయాణించే పడవలు, ఎకె-103 తుపాకులను తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వుపరితలం నుంచి గగనతలంలోకి సైనికులు భుజాలపై వెంట తీసుకుపోగల క్షిపణి ప్రయోగ పరికరాలను పెద్ద సంఖ్యలో రష్యా సరఫరా చేసింది. అమెరికా తొత్తు గుయ్‌డోకు మద్దతు ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్ళిన గూఢచారశాఖ మాజీ అధిపతి కార్వాజల్‌ను స్పెయిన్‌లో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు.

Crowds gathered outside Miraflores Palace on Tuesday morning. (Cira Pascual Marquina)

అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని  మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన

అమెరికా విధించిన ఆర్ధిక, వస్తు సరఫరాలపై ఆంక్షలు, విద్యుత్‌ కేంద్రాలలో విద్రోహ చర్యల వంటి సమస్యల కారణంగా వెనిజులా పౌరులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారు గత నిరంకుశపాలనతో పోల్చుకొని మదురోకు బాసటగా నిలుస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకొనేందుకు వీలుగా కార్మికుల, వుద్యోగుల వేతనాలను మదురో సర్కార్‌ ఎప్పటికప్పుడు సవరిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి పరిస్ధితి మరింత దిగజారింది. ఆర్ధికంగా జనాన్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటం అమెరికా ఎత్తుగడగా వుంది.ఇప్పటికే చమురుపై ఆంక్షల కారణంగా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయింది. 2017-18లో 40వేల మంది చావులకు అమెరికా ఔషధాలపై విధించిన దుర్మార్గ ఆంక్షలే కారణం. మరో మూడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 2013లో 11.2బిలియన్‌ డాలర్ల మేరకు ఆహారం దిగుమతి చేసుకుంటే ఆంక్షల కారణంగా 2018లో అది 2.46బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఇన్ని ఇబ్బందులను భరిస్తున్నప్పటికీ అమెరికా వ్యతిరేక వైఖరిలో ఇంతవరకు జనంలో పట్టుసడల లేదు. అమెరికాకు చెందిన గాలప్‌ సంస్ధ ఇటీవల జరిపిన సర్వేలో వెనిజులా పౌరుల కంటే ప్రపంచంలో అత్యంత ధనికులు, శక్తివంతులైన అమెరికన్లే ఎక్కువ వత్తిడికి లోనవుతున్నట్లు 2019 ప్రపంచ మనోద్వేగ నివేదికలో గాలప్‌ సంస్ధ తెలిపింది. పగలు తాము అత్యంత వత్తిడికి లోనవుతున్నట్లు 55శాతం మంది అమెరికన్లు చెప్పారట. ఇరాన్‌, శ్రీలంక,అల్బేనియా, అమెరికా నాలుగవ స్ధానంలో వున్నాయి. మొదటి మూడు స్ధానాల్లో గ్రీస్‌, ఫిలిప్పయిన్స్‌, టాంజానియా వున్నాయి.అనేక ఇబ్బందులున్నప్పటికీ వెనెజులా 12వ స్ధానంలో వుంది.

క్యూబాపై అమెరికా కుట్ర చేసిన సమయంలో క్షిపణులను మోహరించిన సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు రాజ్యం. సోదర దేశాన్ని రక్షించటం తన బాధ్యతగా ఎంచుకుంది. ఆ సమయం చైనా కూడా సోషలిస్టు దేశమే అయినప్పటికీ సోవియట్‌ మాదిరి శక్తి కలిగినది కాదు, అంతర్గత ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు రష్యాకు అలాంటి బాధ్యత లేనప్పటికీ ఐరోపాలో తనకు ఎసరు పెడుతున్న అమెరికాను అడ్డుకోవాలంటే దాని పెరటితోటలోనే తాను పాగా వేయగలమన్న హెచ్చరిక దాని చర్యలో కనిపిస్తోంది. మరోవైపున క్యూబా, వెనిజులా, తదితర సోషలిస్టు, వామపక్ష ప్రభుత్వపాలనలో వున్న దేశాల పట్ల చైనా ఇటీవలి కాలంలో బాసటగా నిలవటం మరింత ఎక్కువగా చేస్తున్నది. మాటల కంటే చేతల్లో చూపుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెనెజులా సాకుతో సోషలిజంపై ట్రంప్‌ దాడి – అమెరికాలో పెద్ద చర్చ !

21 Thursday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

46th President of Venezuela, Donald Trump attack on socialism, Donald Trump on Socialism, Juan Guaidó, Nicolás Maduro, Nicolás Maduro Moros, Socialists United of Venezuela (PSUV), Venezuela

Image result for donald trump attack on socialism

ఎం కోటేశ్వరరావు

వెనెజులాలో నికొలస్‌ మదురోను అంగీకరించం, ఈ విషయంలో వెనక్కు పోయేది లేదు, ప్రజాస్వామ్యం మినహా సోషలిజాన్ని మనం అంగీకరించేదిలేదు, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం, మదురో క్యూబా తొత్తు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిప్పులు చెరుగుతూ పిడుగులు కురిపించాడని ఒక పత్రిక సోమవారం నాటి ప్రసంగాన్ని వర్ణించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో స్ధిరపడిన వెనెజులా సంతతి, వలస పౌరుల నుద్దేశించి ట్రంప్‌ మాట్లాడారు. మదురోను వదలి వేసి పార్లమెంట్‌ నేత జువాన్‌ గువైడోకు మద్దతివ్వాలని పౌరులు, మిలిటరీని కోరాడు. అక్కడ సోషలిస్టు ప్రభుత్వం వున్న కారణంగానే పదిలక్షల శాతం ద్రవ్యోల్బణం, ఆకలితాండవిస్తున్నదని, ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం దారిద్య్రంలో చిక్కుకున్నదని, కొలంబియాద్వారా పంపదలచిన ఆహార సాయాన్ని మిలిటరీ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు. ఫ్లోరిడాలోని మియామీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయలో భార్య, కుమార్తెతో సహా పాల్గన్న సభలో మదురో ప్రభుత్వంపై బెదిరింపులు, సోషలిస్టు వ్యతిరేక చిందులు వేస్తూ వూగిపోయాడు. వెనెజులా స్వయంప్రకటిత అధ్యక్షుడు గువైడో రాజకీయ భవిష్యత్‌, సోషలిజానికి వ్యతిరేకతను ట్రంప్‌ ఫ్లోరిడా పర్యటనలో వక్కాణించాడు. సోషలిజం, కమ్యూనిజాల భయానక చర్యలను ప్రత్యక్షంగా భరించిన వారు వాటికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి మరియు ప్రతి ఒక్క రాజకీయ ఖైదీకి, వ్యతిరేకత ప్రకటించిన ప్రతి ఒక్కరికి తాము ఘన స్వాగతం పలుకుతామన్నాడు. అమెరికా యువతలో పెరుగుతున్న సోషలిస్టు భావాల వ్యాప్తిని అరికట్టేందుకు వెనెజులాను బలిచేయాలన్న కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేము.

జనవరి 23న గువైడో వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నప్పటి నుంచి చట్టబద్దంగా ఎన్నికైన అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అధ్యక్షుడిగా గుర్తించేందుకు నిరాకరించటమేగాక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు.సాయం ముసుగులో మదురో వ్యతిరేకులకు ఆయుధాలను చేరవేస్తున్న వాహనాలను కొలంబియా సరిహద్దులో వెనెజులా మిలిటరీ పట్టుకున్న విషయం తెలిసినదే. రోనాల్డ్‌ రీగన్‌ 37 సంవత్సరాల క్రితం మార్క్సిజం, లెనినిజం చరిత్ర బూడిద కుప్పలో కలసినట్లు నోరుపారవేసుకున్నాడు. ఫిబ్రవరి ఐదున అనూహ్యంగా అమెరికన్‌ పార్లమెంట్‌ వుభయసభలనుద్ధేశించి చేసిన ప్రసంగంలో వెనెజులా పరిణామాలను ప్రస్తావించి సోషలిజంపై దండెత్తి అమెరికాలో అనుమతించేది లేదన్నాడు. పదమూడు రోజుల తరువాత మరోసారి మియామీలో అదేపని చేశాడు. గత నెల రోజుల్లో అమెరికా-వెనెజులా పరిణామాలను చూసినట్లయితే ట్రంప్‌ స్వయంగా చెప్పినట్లు మిలిటరీ జోక్యానికి ఆఖరి అస్త్రంగా తగిన అవకాశం, సాకుకోసం అమెరికా చూస్తున్నది.

ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిని వినియోగించుకొని అమెరికన్లు గనుక వెనెజులాపై సైనిక చర్యకు వుపక్రమిస్తే శాశ్వత సభ్యరాజ్యాలైన చైనా, రష్యా వీటో ఆయుధాన్ని ప్రయోగిస్తాయి. మదురో ప్రభుత్వాన్ని అమెరికాతో అంటగాకే కొన్ని మినహా ఆ రెండు దేశాలతో పాటు మన దేశంతో సహా అన్నీ గుర్తించాయి. ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక పరిణామాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. రష్యన్‌ క్షిపణులు, ఎయిర్‌ క్రాఫ్ట్‌ , ఇతర ఆయుధాలను కొనుగోలు చేసి దానికి బదులుగా చౌకధరకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది. అమెరికా బెదిరింపులను సహించేది లేదంటూ రష్యాతో కలసి సైనిక విన్యాసాలు చేస్తోంది. అవసరమైతే తమ జెట్‌ బాంబర్లు, యుద్ధనావలు బాసటగా నిలుస్తాయంటూ ఇటీవలి కాలంలో తరచుగా వెనెజులా తీరాలు, విమానాశ్రయాలకు రష్యా నౌకలు, జెట్‌లు వచ్చి ఆగివెళుతున్నాయి. గత పది సంవత్సరాలలో చైనా 70బిలియన్‌ డాలర్ల మేరకు వివిధ వెనెజులా పధకాలలో పెట్టుబడులు పెట్టింది. లాటిన్‌ అమెరికాలో ప్రధాన రాజకీయ మద్దతుదారుగా క్యూబా వుంది. అమెరికా కుట్రలను ఎదుర్కోవటంలో, చిత్తు చేయటంలో ఎంతో అనుభవం గడించిన క్యూబన్లు భద్రతా, మిలిటరీ సలహాదారులను సరఫరా చేయటమే గాక తమకు అందిన సమాచారాన్ని మదురో సర్కార్‌కు అందిస్తోంది. తన వద్ద వున్న వైద్యులు, నర్సులు, ఇంజనీర్లవంటి నిపుణులను పదిహేను వేల మందిని పంపింది. దీనికి ప్రతిగా చౌకధరలకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది.

చమురు విక్రయాలను అడ్డుకొంటూ అనేక సమస్యలను సృష్టిస్తున్న అమెరికా చర్యల కారణంగా వెనెజులాలో అనేక వస్తువులకు కొరత ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి సోషలిస్టు మదురో పాలన కారణంగానే ఇలాంటి పరిస్ధితి అంటూ సోషలిజానికి లంకెపెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక పధకం ప్రకారం పెద్ద ఎత్తున సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. దానిలో భాగమే అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదన్న ప్రకటనకు పార్లమెంట్‌ వుభయసభల ప్రసంగాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుంచి అమెరికా మీడియాలో సోషలిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సహజంగానే వక్రీకరణలు చోటు చేసుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా జనానికి ఇప్పటి వరకు అక్కడి మీడియా ద్వారా సోషలిజం గురించి వక్రీకరణలు, వైఫల్యం చెందినదిగానే సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు సోషలిజం గురించి వివరించటానికి, పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చెప్పేవారికి మీడియాలో కాస్తయినా చోటివ్వకతప్పటం లేదు. అందువలన యువతరంలో సోషలిజం మీద ఆసక్తిని పెంచటానికి ఇది దోహదం చేసే అవకాశం వున్నందున ఒక విధంగా సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. మారిన పరిస్ధితుల్లో అమెరికాలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ మొదలు కావటం విశేషం. నిజానికి నాలుగైదు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ వ్యవస్ధ చరిత్రలో ఆ వర్గానికి చెందిన వారి నోటే దాని వైఫల్యం గురించి పదే పదే వినిపిస్తోంది. ఈ పూర్వరంగంలో సోషలిజంపై ట్రంప్‌ దాడి గురించి రాసిన విశ్లేషణలకు పెట్టిన కొన్ని శీర్షికలు ఇలా వున్నాయి.’ సోషలిజంపై ట్రంప్‌ దాడి పెట్టుబడిదారీ విధానానికి సాయపడదు : చికాగో ట్రిబ్యూన్‌ ‘ ‘ భయ పడాలనా? భయపడవద్దనా-డెమోక్రాట్‌ గజెట్‌’ ‘

చికాగో ట్రిబ్యూన్‌ విశ్లేషణలో కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది. అమెరికాలో సోషలిజానికి ఎన్నడూ ఆదరణ లేదు, ఇరవయ్యవ శతాబ్దంలో పశ్చిమ దేశాలలో సోషలిస్టు పార్టీలు గణనీయమైన ఆదరణ పొందాయి, ఇక్కడ కొద్ది మందికే పరిమితమైంది.1932లో మహా మాంద్యం సమయంలో సోషలిస్టు పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఇక్కడ కేవలం రెండుశాతం ఓట్లు మాత్రమే పొందారు. అయితే ఆలశ్యంగా అవకాశాలు మెరుగయ్యాయి.2016లో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఎన్నికలలో బెర్నీశాండర్స్‌ 13 రాష్ట్రాలు, బృందాలలో మద్దతు సంపాదించారు.గతేడాది అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఇద్దరూ సోషలిస్టులమనే ముద్రను గర్వంగా తగిలించుకున్నారు.ఇప్పుడు అధ్య క్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనే ప్రముఖ రాజకీయవేత్తను ంచి సోషలిస్టులు ఒక శక్తిని పొందారు. ‘ మన దేశం సోషలిజాన్ని అనుసరించాలనే కొత్త పిలుపులు మనల్ని మేలుకొల్పాయి. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండదని ఈ రాత్రి మన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నా ‘ అని ట్రంప్‌ చెప్పారు. ఇంతకంటే మెరుగ్గా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు అవసరం. సోషలిజంపై దాడి చేయటం ద్వారా ఓటర్లలో ప్రత్యేకించి యువ ఓటర్లలో ట్రంప్‌ చిన్నబోయారు. వామపక్షానికి పెద్ద బహుమతి ఇది, పెట్టుబడిదారీ విధాన అభిమానులకు సంకట స్ధితి కలిగించుతుంది. డెమోక్రాట్లు వుదారవాదులుగా మారటానికి వారేమీ కారల్‌ మార్క్స్‌తోవలో నడవటం లేదు. వారిలో కొందరికి ఆర్ధికాంశాల గ్రహణ శక్తి పట్టుతప్పింది, దాని ఇబ్బంది కలిగించే వాస్తవాలు జుగుప్స కలిగించటం ఒక పాక్షిక కారణం. స్వేచ్చామార్కెట్‌ను సమర్ధించే ఆ పార్టీ నేతలు కొన్ని సామాజిసమస్యలను పరిష్కరించలేకపోవటం కూడా ఒక కారణం. ఆచరణాత్మక పరిష్కారాలకు సిద్ధపడకుండా మితవాదులు మరింత కఠినమైన భావజాలానికి కట్టుబడి వుండటం కూడా పాక్షికంగా అందుకు తోడ్పడింది. బరాక్‌ ఒబామా ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ పధకానికి ఒక రిపబ్లికన్‌ కూడా ఓటువేయలేదు, అదొక సోషలిస్టు చర్యగా చూశారు.

భయపడాలనా ? భయపడకూడదనా అనే శీర్షికతో డెమోక్రాట్‌ గజెట్‌ వ్యాఖ్యను మంచి మనుషులు లేదా మంచి భావజాలం మీద బురద చల్లటానికి ప్రత్యేకించి ముద్రలు వేస్తారు, వాటిని తాను ద్వేషిస్తానంటూ రచయిత దానిని ప్రారంభించాడు. ఈ రోజు అమెరికా రాజకీయాల్లో కొంత మంది డెమోక్రాట్లు అవలంభించిన దాని ముద్ర సోషలిజం. వుదారవాదులను చూసి మితవాదులు భయపడేందుకు అదే పదాన్ని రిపబ్లికన్‌ పార్టీ వుపయోగిస్తోందని చెబుతూ మధ్యలో సోషలిజం, కమ్యూనిజం గురించి తన అభిప్రాయాలను వెల్లడించిన తరువాత ముగింపులో చెప్పిన అంశాలు అమెరికా సమాజంలో జరుగుతున్న సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల మంచి చెడ్డల మధన పూర్వరంగంలో ఎంతో ముఖ్యమైనవి.వివిధ సర్వేలు తేల్చిన సారం ఏమంటే ఈ భూమ్మీద సంతోషంగా వున్న జనం నివశిస్తున్న దేశాలు ఏవంటే సోషలిస్టు ప్రజాస్వామిక వ్యవస్ధలు కలిగినవే. కొన్ని ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు నాణ్యమైన జీవితానికి అవసరమైన లబ్దికి హామీ ఇచ్చేవి, అంటే అందుబాటులో ఆరోగ్య రక్షణ, వ్యక్తిగతంగా తగినంత సెలవు దొరకటం, అందుబాటులో గృహవసతి, స్వచ్చమైన పర్యావరణం వంటివి. అయితే ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్ధలలో కోరుకున్నంత వ్యక్తిగత ఆస్ధి లేదా సంపదలను ఎంచుకోవటానికి స్వేచ్చ వుంటుంది. ఈ దేశాలు మౌలికంగా పెట్టుబడిదారీ విధానం మరియు సోషలిజంతో మిళితమై ఎంతో ప్రభావంతంగా మరియు ఆకర్షణీయంగా వుంటాయి. మనం సోషలిజం గురించి భయపడనవసరం లేదు. దాని కొన్ని సంకల్పాలతో మానవాళి లబ్ది పొందిందని మనసారా మనం గుర్తించాలి. ఆ తరువాత ఆ భావజాలాన్ని మన స్వంత దేశంలో వృద్ధి పొందించటానికి మనం పూనుకోవాలి.

Image result for a big debate on socialism in US

న్యూయార్క్‌టైమ్స్‌, లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్టు వంటి బడా కార్పొరేట్ల పత్రికలు ఈ చర్చను విస్మరించలేకపోయాయి. స్ధలాభావం రీత్యా అన్నింటి సారం అందించటం సాధ్యం కాదు. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో జరుగుతున్న సోషలిస్టు మధనం గురించి శత్రువులు ముందే గ్రహించారు. ప్రపంచమంతటా కారల్‌మార్క్సు 200వ జయంతిని జరుపుకుంటున్న సమయంలో ఆయన భావజాలాన్ని అరికట్టే బాధ్యతను తలకెత్తుకున్నామని చెప్పుకొనే అమెరికా సర్కార్‌ 2018 అక్టోబరు 23న సోషలిజం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ ఒక పెద్ద పత్రాన్ని విడుదల చేసింది. అమెరికా గనుక సోషలిస్టు విధానాలను అమలు జరిపితే భవిష్యత్‌లో సంభవించబోయే నష్టాలను దానిలో ప్రస్తావించారంటే సోషలిజాన్ని కోరుకుంటున్న యువతను సూటిగా వ్యతిరేకించకుండా మరోమార్గంలో వారి మెదళ్లను చెడగొట్టే ప్రయత్నం తప్ప వేరు కాదు. వెనెజులాలో ప్రస్తుతం అధికారంలో వున్న వామపక్ష శక్తులు తప్ప అక్కడ అమలు జరుపుతున్నది కొన్ని సంక్షేమ పధకాలతో కూడిన ప్రజాపాలన తప్ప శాస్త్రీయ సోషలిస్టు సమాజ నిర్మాణం కాదు. అలాగే ఐరోపాలో నోర్డిక్‌ దేశాలుగా వున్న డెన్మార్క్‌, స్వీడన్‌, ఫిన్లండ్‌, ఐస్‌లాండ్‌, నార్వేలలో వున్న మెరుగైన సంక్షేమ పధకాలను చూపి నిజమైన సోషలిస్టు దేశాలుగా చిత్రిస్తూ ఆ పత్రంలో చర్చించారు. వెనెజులా సోషలిస్టు పధకాలను అమెరికాలో అమలు జరిపితే దీర్ఘకాలంలో కనీసం 40శాతం జిడిపి తగ్గిపోతుందని ఆ పత్రంలో పేర్కొన్నారు.నోర్డిక్‌ దేశాల విధానాలను అనుసరిస్తే అమెరికాలో జిడిపి కనీసం 19శాతం తగ్గిపోతుందని ఏడాదికి రెండు నుంచి ఐదువేల డాలర్లు అదనంగా పన్ను విధించాల్సి వుంటుందని, అమెరికాతో పోల్చితే ఈ దేశాల్లో జీవన ప్రమాణాలు పదిహేనుశాతం తక్కువగా వున్నాయని పేర్కొన్నారు. అమెరికాలోని సోషలిస్టులు కోరుతున్న విధంగా ఆరోగ్యఖర్చునున నోర్డిక్‌ దేశాలలో మాదిరి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తే 2022నాటికి జిడిపి తొమ్మిదిశాతం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం ఎలా సాధ్యం కాదో వక్రీకరణలతో సోషలిజం గురించి తెలుసుకోకుండా జనాన్ని నివారించటం కూడా అంతే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెనెజులాలో మదురో సర్కార్‌పై సైనిక తిరుగుబాటుకు అమెరికా మద్దతు !

23 Wednesday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Caracas, Juan Guaidó, military coup, Nicolás Maduro, Socialists United of Venezuela (PSUV), USA, Venezuela president, Venezuelan military

ఎం కోటేశ్వరరావు

డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో జోక్యం చేసుకో నుందా ? మరోసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన వామపక్ష మదురోను కూలదోసేందుకు ప్రత్యక్షంగా తన సైన్యాన్ని పంపుతుందా? పశ్చిమాసియా, ఇతర ప్రాంతాల్లో తగిలిన ఎదురు దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని పరిసర దేశాల మిలిటరీతో తన లక్ష్యాన్ని నెరవేరుస్తుందా లేక వెనెజులా మిలిటరీని ప్రభావితం చేసి తిరుగుబాటు చేయిస్తుందా ? ప్రస్తుతం వెనెజులాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తలెత్తుతున్న ప్రశ్నలివి. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో వెనెజులాలో మిలిటరీ జోక్యం ఆ ఒక్క దేశానికే పరిమితం అవుతుందా? ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుందా ! అసలు వెనెజులాలో, దానికి సంబంధించి బయట ఏమి జరుగుతోంది?

బుధవారం నాడు అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సైనిక తిరుగుబాటుకు, ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో వునికిలో లేని పార్లమెంట్‌ అధ్యక్షుడు జువాన్‌ గుయైడోకు అమెరికా వుపాధ్యక్షుడు మైక్‌ పెనెస్‌ మద్దతు ప్రకటించి ప్రత్యక్ష జోక్యానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి తిరుగుబాటు చేసిన వారిలో 27 మందిని అరెస్టు చేశారని, మరికొందరని అరెస్టు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్ష భవనానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఒక సైనిక అవుట్‌ పోస్టును స్వాధీనం చేసుకున్న కొందరు సైనికులు రెండు మిలిటరీ ట్రక్కులు,కొన్ని ఆయుధాలు తీసుకొని బయలు దేరగా వారిని అరెస్టుచేసినట్లు తొలి వార్తలు తెలిపాయి. అంతకు కొన్ని గంటల ముందు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చిన అనేక వీడియోలలో సైన్యంలోని నేషనల్‌ గార్డ్స్‌ తాము మదురోను అధ్యక్షుడిగా గుర్తించటం లేదని తమకు మద్దతుగా జనం వీధుల్లోకి రావాలని చెప్పినట్లుగా వుంది. అరెస్టులకు ముందు సామాజిక మాధ్యంలో దర్శనమిచ్చిన వీడియోలో పార్లమెంటు నేత, తాత్కాలిక అధ్యక్షుడంటూ ప్రకటించిన జువాన్‌ గుయైడో మాట్లాడుతూ తిరుగుబాటు చేయాలని, కాల్పులు జరపాలని తాము కోరటం లేదని, మన పౌరుల హక్కుల కోసం తమతో పాటు కలసి రావాలని కోరుతున్నామని సైనికులకు విజ్ఞప్తి చేశాడు. మదురోను వదలి వచ్చిన మిలిటరీ, ఇతర పౌర అధికారులకు తాము క్షమాభిక్ష పెడతామని పార్లమెంటు ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సుప్రీం కోర్టు ఒక ప్రకటన చేస్తూ మదురో అధ్యక్ష స్వీకారం చెల్లదంటూ కొద్ది రోజుల క్రితం పార్లమెంట్‌ చేసిన తీర్మానం చెల్లదని, రాజ్యాంగ వుల్లంఘనకు పాల్పడిన పార్లమెంట్‌ నేతలు నేరపూరితంగా వ్యవహరించారో లేదో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. గతంలో కూడా ఇలాంటి చెదురుమదురు తిరుగుబాట్లు, మదురోపై హత్యాయత్నాల వంటివి జరిగాయి. ఈ వుదంతం కూడా అలాంటిదేనా అన్నది చూడాల్సి వుంది. రానున్న కొద్ది రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ శక్తుల కుట్రల పర్యవసానాలు మరింతగా వెల్లడి అవుతాయి.

లాటిన్‌ అమెరికాలో వామపక్షం అధికారంలోకి వచ్చిన దేశాలలో ఒకటి వెనెజులా ! హ్యూగో ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఇంటా బయటి శక్తులు చేయని యత్నం లేదు. ఆయన రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురోకు వ్యతిరేకంగా కూడా అదే జరుగుతోంది. గత ఏడాది మేనెలలో జరిగిన ఎన్నికలలో మదురో మరో ఆరు సంవత్సరాలకు తిరిగి ఎన్నికయ్యారు. ఈనెల పదవ తేదీన తిరిగి అధికారాన్ని స్వీకరించారు. 2015లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షం మెజారిటీ సాధించింది. తరువాత మదురోను తొలగించాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.2017లో సుప్రీం ట్రిబ్యునల్‌ పార్లమెంట్‌ అధికారాలను రద్దు చేసింది. అధికారంలేని పార్లమెంట్‌ కొనసాగుతోంది. తరువాత నూతన రాజ్యాంగ రచనకు రాజ్యాంగపరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.2018 మే నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రెండవసారి మదురో ఎన్నికను అమెరికా మరికొన్ని దేశాలు గుర్తించేందుకు నిరాకరించాయి. రెండవ సారి ప్రమాణ స్వీకారానికి బలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డైయాజ్‌ కానెల్‌, నికరాగువా అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా, సాల్వడోర్‌ అధ్యక్షుడు సాల్వడోర్‌ శాంఛెజ్‌ సెరెన్‌ వంటి నేతలు హాజరు కాగా చైనా ప్రత్యేక ప్రతినిధిని పంపింది. మొత్తం 94దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదురో మాట్లాడుతూ తమ పార్టీ 19ఏండ్ల పాలనా కాలంలో 25ఎన్నికలు జరిగాయని ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు. వెనెజులా మిలిటరీ మదురోకు విధేయత ప్రకటించింది.

మదురో అధికార అపహర్త అంటూ అధికారాలు లేని పార్లమెంట్‌ జనవరి 11న ఒక తీర్మానం చేసి జువాన్‌ గుయైడోను అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించింది. అధికార వ్యవస్ధలో శూన్యం ఏర్పడినపుడు నూతన అధ్యక్షుడిని నియమించే అధికారం తమకుందని చెప్పుకుంది. ఈనెల 23న మదురోకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయాలని, సైన్యం తిరుగుబాటు చేసి పార్లమెంట్‌కు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. తదుపరి ఎన్నికలు జరిగే వరకు తనది ఆపద్ధర్మ ప్రభుత్వమని గుయైడో చెప్పుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం, మిలిటరీలోని మధ్య, దిగువ సిబ్బంది తిరుగుబాటు చేసి తమకు మద్దతు ఇస్తారని ప్రతిపక్ష శిబిరం చెప్పుకుంటోంది. వెనెజులా ఆస్ధులు, ఖాతాలను స్దంభింప చేయాలంటూ పార్లమెంట్‌ 46దేశాలకు లేఖలు రాసింది. మరిన్ని ఆంక్షల అమలుకు తాము ప్రయత్నిస్తామని అమెరికా ప్రకటించింది. రెండోసారి మధురో అధికార స్వీకరణను అమెరికాతో పాటు లిమా బృందంగా పరిగణించబడే 13దేశాలు గుర్తించేందుకు నిరాకరించాయి. వాటికి కొలంబియా, బ్రెజిల్‌ నాయకత్వం వహిస్తున్నాయి.

బస్సు డ్రైవర్ల యూనియన్‌ నేతగా రాజకీయ జీవితం ప్రారంభించిన మదురో ఏడు సంవత్సరాల పాటు ఛావెజ్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఛావెజ్‌ కాన్సర్‌ నుంచి కోలుకొనే అవకాశం లేని స్ధితిలో ఆయన తన రాజకీయ వారసుడిగా మదురోను గుర్తించారు. 2013లో తొలిసారి మదురో పోటీ చేసినపుడు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డాయి. పదకొండు మంది పాలకపార్టీ కార్యకర్తలను హత్యచేశాయి. 2015లో ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ఎన్నికలలో మెజారిటీ సాధించిన వెంటనే ఆరునెలల్లో మదురోను పదవీచ్యుతుని గావిస్తామని ప్రకటించాయి. పార్లమెంట్‌ -అధ్యక్షుడి మధ్య తలెత్తిన వివాదం చివరకు 2017లో సుప్రీం కోర్టు పార్లమెంట్‌ అధికారాలను రద్దు చేయటంతో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తూనే వున్నాయి. పార్లమెంట్‌ స్ధానంలో ఎన్నికైన నూతన రాజ్యాంగ సభ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాల్సి వుంది.

మదురోను గద్దె దింపేందుకు తక్షణమే ట్రంప్‌, ఇతరులు కదలనట్లయితే ఇంకో అవకాశం వుండదని, మరొక క్యూబా మాదిరి మారిపోతుందని అమెరికా, లాటిన్‌ అమెరికాలోని వామపక్ష వ్యతిరేకశక్తులు తొందర పెడుతున్నాయి. అమెరికా, ఐరోపా యూనియన్‌, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలు ఇంతకు ముందే గతేడాది జరిగిన మదురో ఎన్నికను గుర్తించటం లేదని ప్రకటించాయి. ఇంత హడావుడి చేస్తున్నప్పటికీ ప్రతిపక్ష జువాన్‌ గుయైడో ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేసినట్లు ప్రకటించలేదు, తరువాత చేస్తానని మాత్రమే చెబుతున్నాడు. ఈనెల 23న మదురోకు వ్యతిరేకంగా జనాన్ని వీధుల్లో ప్రదర్శనలు చేయించాలని, ఈలోగా మిలిటరీలో తిరుగుబాటు రెచ్చగొట్టాలన్నది ప్రతిపక్షం రూపొందించిన అనేక పధకాలలో ఒకటి. సుప్రీం కోర్టు, మిలిటరీ మద్దతు లేని ఏ ప్రభుత్వమూ ఇప్పుడున్న స్దితిలో వెనెజులాలో నిలిచే అవకాశం లేదు. అయితే పధకంలో భాగంగా కెనడా, బ్రెజిల్‌, అమెరికా దేశాల సంస్ధ పార్లమెంట్‌ తీర్మానాన్ని అభినందిస్తున్నామని, గుర్తిస్తామని చెప్పటం ద్వారా గుయైడోను అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు పరోక్షంగా తెలిపాయి. అధికారిక ప్రకటన చేస్తే గుయైడోను వెంటనే అరెస్టు చేసే అవకాశం వుంది. దాని బదులు అతగాడు నియమించే రాయబారులను గుర్తిస్తూ మదురో సర్కార్‌ నియమించిన వారిని ఖాళీ చేయించటం ద్వారా తమ మద్దతును వెల్లడించవచ్చన్నది ఒక సమాచారం. ఒక వేళ అలా కానట్లయితే ఏదో ఒక దేశ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం కల్పించి అక్కడి నుంచి సమాంతర ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన చేయించే ఆలోచన కూడా లేకపోలేదు. అది చేస్తే మదురో సర్కార్‌ రాయబార కార్యాలయం మీదకు సైన్యాన్ని పంపకపోవచ్చని బ్రెజిల్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి చెప్పారు. గుయైడో ద్వారా వెనెజులాకు మానవతా పూర్వక సాయ అభ్యర్ధన ప్రకటన చేయించి సరిహద్దులకు కొంత మొత్తం సాయాన్ని పంపితే మదురో సర్కార్‌ దానిని అనుమతించదని, ఆ చర్య జనంలో మదురో పట్ల వ్యతిరేకతను పెంచవచ్చని మదురో వ్యతిరేక శక్తులు ఆశిస్తున్నాయి.

Image result for us supported military coup against venezuela president nicolas maduro

తాజా పరిణామాల్లో వెనెజులా వ్యవహారాలలో కెనడా ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో తన పట్టు పెంచుకోవాలని గత కొంతకాలంగా కెనడా పాలకవర్గం అవకాశాల కోసం చూస్తోంది. దానిలో భాగంగానే మదురో రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయకముందే మదురో పాలన చట్టబద్దమైనదిగా తాము పరిగణించటం లేదని ప్రకటించింది. లిమా బృందంలో మెక్సికో కూడా సభ్యురాలిగా వున్నప్పటికీ తాత్కాలికంగా అయినా అది మదురో వ్యతిరేక వైఖరికి దూరంగా వుంది. మెక్సికోలో నూతనంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ వెనెజులా నేత మదురోకు ఆహ్వానం పంపారు. అమెరికా విషయానికి వస్తే నిరంతరం వెనెజులా మిలిటరీలో తిరుగుబాటు, చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. తన చేతికి మట్టి అంటకుండా వ్యవహరించాలని అమెరికా చూస్తున్నది. అందుకే కెనడా వంటి వాటిని ముందు పెడుతున్నది. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి ఆల్మగారో కుట్రను ప్రోత్సహిస్తున్నవారిలో ఒకడు. గుయైడో తానేమిటో చెప్పుకోక ముందే వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడంటూ స్వాగతం పలికాడు. ఈనెల పదిన మదురో ప్రమాణ స్వీకార సమయంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ఒక ప్రకటన చేస్తూ తక్షణమే తిరుగుబాటు ద్వారా మదురోను బర్తరఫ్‌ చేయాలని వెనెజులా మిలిటరీని బహిరంగంగా కోరాడు. మరుసటి రోజు గుయైడోకు ఫోన్‌ చేసి మద్దతు ప్రకటించాడు.ఈ నెల 12న విదేశాంగశాఖ ఒక ప్రకటన చేస్తూ పాలకుల మార్పులో భాగంగా మిలిటరీ తిరుగుబాటుకు తమ మద్దతు వుంటుందని ప్రకటించింది. గూఢచార సంస్ద సిఐఏ సంగతి సరేసరి. అధికారులను ప్రలోభాలకు గురిచేయటం, బ్లాక్‌మెయిల్‌ చేయటం, అనేక పుకార్లను వ్యాపింపచేయటంలో తన పని తాను చేస్తున్నది.

లాటిన్‌ అమెరికాలో పచ్చి నియంతలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా నిర్వాకాన్ని అక్కడి జనం అంత తేలికగా మరచిపోతారనుకుంటే వారి చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయటమే. నియంతలకు వ్యతిరేకంగా పోరాడి అధికారానికి వచ్చిన వామపక్ష శక్తులు నయావుదారవాద విధానాల పునాదుల మీద సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి గతకొన్ని సంవత్సరాలుగా ప్రజాభిమానం పొందారు. అయితే అది దీర్ఘకాలం సాగదని, దోపిడీ సంబంధాలను తెంచివేసి ప్రత్నామ్నాయ విధానాలను అమలు జరిపినపుడే జనం మద్దతు వుంటుందని స్పష్టమైంది. కొన్ని చోట్ల వామపక్ష ప్రభుత్వాల మీద తలెత్తిన అసంతృప్తితో జనం అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల మితవాద, ఫాసిస్టు శక్తులను గద్దెనెక్కించారు. అచిర కాలంలోనే వాటి విధానాల మీద జనం వీధులకు ఎక్కుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నిరంతరం కబుర్లు చెప్పే అమెరికా, కెనడా వంటి దేశాలు, అమెరికా దేశాల సంస్ధ వెనెజులా లేదా మరొక చోట మిలిటరీ చర్యలు, మిలిటరీ తిరుగుబాట్లను ప్రోత్సహించి సమర్ధించుకోవటం అంత తేలిక కాదు. అయితే వైరుధ్యాలు ముదిరినపుడు సామ్రాజ్యవాదులకు మీన మేషాల లెక్కింపు, ఎలాంటి తటపటాయింపులు వుండవు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప
  • జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్న తెలుగు దేశం – పుదుచ్చేరి తరహా పాకేజ్‌ కోసమైనా పవన్‌ తాట తీస్తారా !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప
  • జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్న తెలుగు దేశం – పుదుచ్చేరి తరహా పాకేజ్‌ కోసమైనా పవన్‌ తాట తీస్తారా !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!
  • జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !
  • మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!
  • నాపేరుతో ఓట్లడిగే వారు దొంగ భక్తులు, గడ్డాలు, జులపాలను చూసి మోసపోవద్దు : స్వామి అయ్యప్ప
  • జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్న తెలుగు దేశం – పుదుచ్చేరి తరహా పాకేజ్‌ కోసమైనా పవన్‌ తాట తీస్తారా !

Recent Comments

B. Govardhan on ప్రియాంక చోప్రా మీద మౌనం…
Janaki Ram on ఎంత పని చేస్తివే ట్వీటా : కంగన…
Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: