• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: may day

వర్తమానంలో మేడే ప్రాధాన్యత !

26 Friday Apr 2019

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

International Workers' Day, may day, May Day 2019, May Day significance, May day significance in the contemporary period

Image result for may day haymarket

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అభివృద్ధి రేటు గతేడాది వున్న 3.6శాతం నుంచి ఈ ఏడాది 3.3కి తగ్గుతుందని, వచ్చే ఏడాది తిరిగి 3.6శాతం వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ఏడాదిలో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధల మంచి చెడ్డల గురించి తన అంచనాలను వెల్లడిస్తుంది. ఈ సంస్ధ వునికిలోకి వచ్చిన ఏడు దశాబ్దాలలో ప్రపంచంలో ముఖ్యంగా ధనిక దేశాలలో తలెత్తిన ఆర్దిక సంక్షోభం గురించి ఎన్నడూ జోస్యం చెప్పలేకపోయింది. అందువలన అది చెప్పే అంచనాలకూ అదే పరిస్ధితి. ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ 3.5శాతం రేటుతో అభివృద్ధి చెందనుందని చెప్పింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ చెప్పే అంకెల విశ్వసనీయత సమస్యను కాసేపు పక్కన పెడదాం. వాటినే పరిగణనలోకి తీసుకుంటే కార్మికవర్గానికి అర్దం అయ్యేదేమిటి? గతేడాది కంటే ఈ ఏడాది పరిస్ధితి దిగజారుతుంది, వచ్చే ఏడాది గతేడాది మాదిరే వుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వున్నాం. మనకు ఆమోదం వున్నా లేకపోయినా మన పాలకులు మన దేశాన్ని ప్రపంచీకరణ రైలు ఇంజనుకు బోగీగా తగిలించారు. అందువలన దాని నడతను బట్టే మన పరిస్ధితీ వుంటుంది. గీతా గోపీనాధ్‌ చెప్పినట్లు రాబోయే రోజుల్లో పరిస్ధితిలో పెద్దగా మార్పు వుండదంటే మూడు సంవత్సరాలలో కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే ఈ మే డే సందేశం.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. మిగతా చోట్ల మిగిలిన దశ ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌ ముగిసిన చోట ఓటరు తీర్పు రిజర్వు అయింది. అందువలన భావోద్వేగాలను పక్కన పెట్టి వుద్యోగులు, కార్మికులు ఆలోచించటం అవసరం. ఈ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో వుపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరిగాయి. చిత్రం ఏమిటంటే రెండు చోట్లా అధికారపార్టీతో అంటకాగిన వుపాధ్యాయ నేతలు మట్టి కరిచారు. గత ఐదు సంవత్సరాలుగా వారు ఆయా ప్రభుత్వాల మీద కల్పించిన భ్రమలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో తొలగిపోతున్నాయనేందుకు ఇదొక సంకేతం. వుద్యోగులు, వుపాధ్యాయుల్లో ఏడాది కేడాది నూతన పెన్షన్‌ స్కీం అమలయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పధకాన్ని ప్రవేశపెట్టి, అమలు జరిపిన పార్టీలు కూడా దానిని రద్దు చేస్తామని ఎన్నికల ఆపదమొక్కులు మొక్కుతున్నాయి. వాగ్దానాలు చేసిన పార్టీలు లేదా వాటికి మద్దతు పలికిన వుద్యోగ సంఘాల నేతలు గానీ అధికారంలో వున్నపుడు కొత్త పెన్షన్‌ స్కీము రద్దు చేసి పాతదానిని ఎందుకు పునరుద్దరించలేదో సంజాయిషీ ఇవ్వాలి, వుద్యోగులు నిలదీయాలి.

ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతున్న నయా వుదారవాద విధానాలు మొత్తంగా జనాన్ని భ్రమలకు గురి చేస్తాయి. అలాంటపుడు శ్రమ జీవులు దానికి అతీతంగా ఎలా వుంటారు. అందుకే ఆశల పల్లకిలో వున్న వారు కుదుపుకు గురైతే తట్టుకోలేరు. ఎప్పుడు వుద్యోగాలు వూడతాయో తెలియదు. ఏటా రెండు కోట్ల వుద్యోగాలను కల్పిస్తాన్న నరేంద్రమోడీ వాగ్దానాన్ని జనం నమ్మారు. కొత్తవాటి సంగతి దేవుడెరుగు వున్న వుద్యోగాలే వూడుతున్నాయన్నది వాస్తవం. ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త , మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

Image result for may day india citu

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన వృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న. వుపాధి రహిత అభివృద్ధి వుద్యోగుల, కార్మికుల బేరసారాలాడే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించే డిఏను వుద్యోగులకు నష్టదాయకంగా ఆరునెలలకు చేస్తే సంఘాలేమీ చేయలేకపోయాయి. కారుచౌకగా పనిచేసేందుకు సిద్దం సుమతీ అంటున్నవారు క్యూకడుతున్న కారణంగానే పర్మనెంటు వుద్యోగాల స్ధానంలో కాంట్రాక్టు, పొరుగు సేవల పేరుతో తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్నారు. ఒకే పనికి ఒకే వేతనం అన్న సహజన్యాయం అన్యాయమై పోతోంది. దీనికి వ్యతిరేకంగా వుద్యో గులు, నిరుద్యో గులూ ఐక్యంగా పోరాడకపోతే రేపు వుద్యోగుల మీద జరిగే దాడిని అన్యాయం అనేవారు కూడా మిగలరు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును ప్రవేశపెట్టినపుడు అప్పటికే వుద్యోగాల్లో వున్న తమకు అది వర్తించదు కదా అని వుద్యో గులు పట్టించుకోలేదు, అసలు వుద్యోగాలు లేనపుడు ఏదో ఒకటి అని నిరుద్యోగులు ఆలోచించలేదు. తీరా కొత్త పెన్షన్‌ స్కీములో చేరిన కొత్తవుద్యో గులకు రోజులు గడిచే కొద్దీ జరిగే నష్టం ఏమిటో అర్ధం అయింది. ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.

ఏడాది క్రితం అమెరికన్లు చైనా, ఇతర దేశాలతో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కారణంగా గతేడాది అక్టోబరు నుంచి ఐఎంఎఫ్‌ మూడు సార్లు ప్రపంచ అభివృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికన్లు వాణిజ్య యుద్ధాన్ని ఒక్క చైనాకే పరిమితం చేయటం లేదు. ఐరోపా యూనియన్‌ నెదర్లాండ్స్‌లోని ఎయిర్‌ బస్‌ విమాన కంపెనీకి అనుచితంగా సబ్సిడీలు ఇస్తున్నందున తమ దేశంలోని బోయింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చాలా కాలంగా అమెరికన్‌ కార్పొరేట్లు గుర్రుగా వున్నాయి. ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై 11బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి పన్నులు విధిస్తాంటూ ఏప్రిల్‌ పదిన డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్దంలో కొత్త రంగాన్ని తెరిచాడు. బోయింగ్‌ కంపెనీకి ఇస్తున్న సబ్సిడీల సంగతి తాము తేలుస్తామంటూ ఐరోపా యూనియన్‌ ప్రతిసవాల్‌ చేసింది. ట్రంప్‌ జపాన్‌ మీద కూడా దాడి ప్రారంభించేందుకు పూనుకున్నాడు. భారత్‌తో సహా వాణిజ్య లోటు వున్న ప్రతిదేశం మీద అమెరికా దాడి చేసేందుకు పూనుకుంది. అంటే బలవంతంగా తన వస్తువులను కొనిపించే గూండాయిజానికి పాల్పడుతోంది. ఇది ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలకు పూనుకొనేట్లు చేస్తోంది, కొత్త వివాదాలను ముందుకు తెస్తోంది. ముందే చెప్పుకున్నట్లు ఏ దేశానికి ఆదేశం తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు పూనుకోవటం అంటే జనం మీద భారాలు మోపటం, వున్న సంక్షేమ చర్యలకు మంగళం పాడటమే. ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల వుద్యమం ప్రతి శనివారం ఏదో ఒక రూపంలో జరుగుతోంది, ఇలాగే అనేక దేశాల్లో కార్మికవర్గం నిరసన తెలుపుతోంది. వేగంగా పెరుగుతున్న సంపద అంతరాలు వుద్యమాలు, విప్లవాలకు దారి తీస్తాయన్న హెచ్చరికలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు.

ప్రపంచంలో ప్రస్తుతం 66దేశాల్లో మేడే రోజున ప్రభుత్వాలు సెలవులు ఇస్తున్నాయి. ఇది కార్మికవర్గ విజయం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే మెజారిటీ దేశాలలో సెలవు లేదంటే దాన్నే సంపాదించలేని కార్మికవర్గం దోపిడీని అంతం చేయాలంటే ఇంకా ఎంతో చేయాల్సి వుందన్నది స్పష్టం. సెలవు వున్న దేశాల్లో కూడా కార్మికవర్గంలో కొన్ని అపోహలు, అవాంఛనీయ ధోరణులు వున్నాయి.

Image result for may day

ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, బ్యాంకు, మార్కెటింగు, విత్త కంపెనీల కార్యకలపాలు నిర్వహించే వుద్యోగులు ఇప్పటికే తాము కార్మికులని అనుకోవటం మానేశారు. కంపెనీ క్యాబుల్లో పని ప్రదేశాలకు వెళుతూ మహానగరాలలో పని చేసే ఐటి కంపెనీలు, వాటి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే వారు తమది ప్రత్యేక తరగతి అనుకుంటున్నారు. ఆ లెక్కన సంప్రదాయ భాష్యం ప్రకారం అసలు కార్మికులు ఎందరు ? ఎవరు? ఇప్పటికీ కార్మికులం అని భావించే అనేక మందికి మేడే ఒక వుత్సవం. మరి కొంత మందికి ఆ రోజు దీక్షా దినం. వుత్సవానికి, దీక్షా దినానికి తేడా ఏమిటి ?

మేడేను వుత్సవంగా జరిపినా, దీక్షా దినంగా పాటించినా కార్మికుల బతుకులు ఆదివారం నాడు అరటి మొలచింది…. శనివారం నాడు పాపాయి చేతికి పండు వచ్చిందన్నంత సులభంగా మారటం లేదు, మారవు అని గమనించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి.

Image result for may day haymarket

ప్రతి ఏడాదీ చెప్పుకొనేదే అయినప్పటికీ కొత్త తరాలు వస్తుంటాయి గనుక ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. చాలా మంది మే డే అంటే ఎర్రజెండా పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. మన దేశంతో సహా అనేక చోట్ల కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. అనేక డిమాండ్లను యజమానుల ముందుంచాయి. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటిపై స్పందన లేకపోవటంతో కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచేందుకు పూనుకుంది.దానిపై చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు మే నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. సంఖ్య ఇప్పటికీ తెలియదు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మినేతలను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో శిక్షలను ఖరారు చేశారు. 1887 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for may day haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని, ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ముఖ్య అనుచరుడైన నారాయణ్‌ మేఘాజీ లోఖాండే. ఒక జర్నలిస్టు, ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, అప్పటికి కమ్యూనిస్టు వాసనలు మన దేశంలో లేవు. బొంబాయి వస్త్ర మిల్లు కార్మికుల పని పరిస్థితులను చూసి చలించిపోయిన ఆ జర్నలిస్టు జ్యోతిబా పూలే సహకారంతో 1880 నుంచీ కార్మికులను సంఘటిత పరిచేందుకు పూనుకున్నాడు.1884లో మిల్లు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. యజమానుల ముందుంచిన వారి ప్రధాన కోరికలు ఇలా వున్నాయి. కార్మికులకు వారానికి ఒకరోజు ఆదివారం నాడు సెలవు ఇవ్వాలి.ప్రతి రోజు మధ్యాహ్నం అరగంట పాటు విరామం కల్పించాలి. మిల్లులను వుదయం ఆరున్నర గంటలకు ప్రారంభించి సూర్యాస్తమయానికి మూసివేయాలి.కార్మికుల వేతనాలు ప్రతినెల పదిహేనవ తేదీన చెల్లించాలి. ఇదే సమయంలో చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని కోసం డిమాండ్‌ చేస్తే బొంబాయి కార్మికులు పన్నెండు గంటల పని డిమాండ్‌ చేశారంటే ఇంకా ఎక్కువ గంటలు పని చేసే వారన్నది స్పష్టం.

ప్రపంచాన్ని వూపి వేస్తున్న ఐటి, దాని అనుబంధ కార్యకలాపాలు, వివిధ టెక్నాలజీలలో శిక్షణ పొంది పరిశ్రమలలో పని చేస్తున్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కార్మికులు కారా? యజమానులైతే కాదు, కనుక వారిని ఏ పేరుతో పిలవాలి. తెల్లచొక్కాల వారు కార్మికులు కాదా ? వారిని ఎలా సమీకరించాలి? ఇలాంటి ప్రశ్నలు వారినే కాదు, కార్మికవర్గాన్ని సమీకరించి దోపిడీ లేని నూతన సమాజాన్ని స్ధాపించాలని పని చేస్తున్న కమ్యూనిస్టు, సోషలిస్టు శక్తులన్నీ పరిష్కరించాల్సినవే. యాజమాన్యం తరఫు విధులు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా వుత్పాదన, సేవలలో నిమగ్నం కాని సిఇఓ, డైరెక్టర్‌ వంటి వున్నత పదవులలో వున్నవారు తప్ప, ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని ఏదైనా ఒక వుత్పత్తి, సేవలలో భాగస్వామి అయిన ప్రతి వారూ కార్మికులే. వారు ఐటి నిపుణుడు, బ్యాంకు అధికారి, గుమస్తా, ఫ్యాక్టరీ ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, జర్నలిస్టు, ప్రతిఫలం తీసుకొనే రచయిత ఇలా ఎవరైనా కావచ్చు. కొంత మంది వుత్పాదక, సేవల విలువ ఎక్కువ మొత్తంలో వుంటుంది కనుక ఆ రంగాలలో పని చేసే వారు పెద్ద మొత్తంలో వేతనంలో పొందినంత మాత్రాన కార్మికులు కాకుండా పోరు. ఆచరణలో అలాంటి వారంతా తాము కార్మికులం కాదనుకుంటున్నారు. వారిని ఆ భావజాలం నుంచి బయటకు తెచ్చి సమీకరించకుండా కార్మికవర్గ పార్టీలు ఎలా ముందుకు పోతాయన్నది ప్రశ్న. దోపిడీ వర్గం సంపదల సృష్టితో పాటు తమను అంతం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుందన్నది చరిత్ర సారమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పారు. బానిస యజమానులను బానిసలు, భూస్వాములను వ్యవసాయ కార్మికులు అంతం చేయటం గత చరిత్ర. పెట్టుబడిదారులను పారిశ్రామిక కార్మికులు అంతం చేయటం భవిష్యత్‌ చరిత్ర. అందుకే దోపిడీదారులు తమ హక్కులను అడగని కార్మికులను ప్రోత్సహిస్తారు, అడిగేవారిని అంతం చేసేందుకు చూస్తారు. తాగి తందనాలాడేందుకు డబ్బిచ్చి మరీ ప్రోత్సహించే యజమానులు, కార్మిక సంఘాన్ని పెట్టుకుంటే తొలగించటం, వేధించటం అందుకే.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోషలిస్టు శక్తులు సాధించిన విజయాలతో మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి. పాలకపార్టీ ఒక కార్మిక సంఘాన్ని ప్రోత్సహించింది. మరోవైపున 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీ పద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం. అందుకే మే డేను వుత్సవంగా జరుపుకోవటం గాక దీక్షా దినంగా పాటించాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల వ్యవహారం కాదు

24 Tuesday Apr 2018

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

communist, communist parties, may day, Trade Union Movement in India

ఎం కోటేశ్వరరావు

మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. ప్రపంచంలో కమ్యూనిస్టులు, పార్టీలు పుట్టక ముందే కార్మికులు, వారిని దోపిడీ చేసే వ్యవస్ధ వునికిలోకి వచ్చింది. ఒక్కసారి అవలోకిస్తే కార్మిక సమస్యల మీద మన దేశంలో స్పందించిందీ, వారిని సంఘటిత పరచేందుకు ముందుగా ప్రయత్నించింది కమ్యూ నిస్టులు కాదు. అసలు శాస్త్రీయ సోషలిజం భావన వునికిలోకి రాక ముందే అంటే 1848లో కమ్యూనిస్టు మానిఫెస్టో విడుదల కాక ముందు, కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం గాక ముందే ప్రపంచంలో కార్మిక చట్టాలు, ప్రాధమిక రూపంలో కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. మన దేశంలో తొలి జాతీయ కార్మిక సంఘాన్ని(ఏఐటియుసి) ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ నాయకులే. దాని తొలి అధ్యక్షుడు లాలా లజపతిరాయ్‌. తరువాతే కమ్యూనిస్టులు దానిలో చురుకుగా పనిచేసి, మిలిటెంట్‌ కార్మిక పోరాటాలను నిర్వహించారు గనుక తరువాత కమ్యూనిస్టులు నాయకత్వ స్ధానాలలోకి వచ్చారు. స్వాతంత్య్రం తరువాత రాజకీయ పార్టీలు తమ భావజాలానికి అనుగుణంగా జాతీయ కార్మిక సంఘాలను ఏర్పాటు చేశాయి.

ఎప్పుడైతే వస్తూత్పత్తి ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టారో అప్పుడే వాటిపై పని చేసే పారిశ్రామిక కార్మికులు కూడా తయారయ్యారు. ఇది పారిశ్రామిక విప్లవ తొలి పర్యవసానం. దోపిడీ, అసమానతల వంటివి సరేసరి. మన వేదాల్లో అంతులేని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దాగుందని కాషాయ తాలిబాన్లు చెప్పగా వినటం తప్ప మనకు కనపడదు. నిజంగా అదే నిజమైతే పారిశ్రామిక విప్లవం భారత వుపఖండానికి బదులు ఐరోపాలో ఎందుకు ప్రారంభమైంది, పోనీ ఇప్పటికైనా వేద సాంకేతిక పరిజ్ఞానాన్ని బయటకు తీసి మేకిన్‌ ఇండియా పిలుపులో భాగంగా ఎందుకు వుత్పత్తి చేయరు, దిగుమతులను ఎందుకు ఆపరు అన్నది ఒక మౌలిక ప్రశ్న. దాని గురించి వేరే సందర్భంగా చర్చించుకుందాం. పారిశ్రామిక విప్లవం ఐరోపాలోనే జరిగినప్పటికీ దానితో ప్రభావితం గాని దేశం లేదు. మన దేశంలో సంభవించిన పర్యవసానాల గురించి 1853లో న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌ పత్రికలో కారల్‌ మార్క్స్‌రాసిన విశ్లేషణలో ఇలా వుంది.’ భారత చేనేత రంగంలో ప్రవేశించిన బ్రిటీష్‌ చొరబాటుదారుడు నేత ప్రక్రియనే నాశనం చేశాడు. ఐరోపా మార్కెట్లనుంచి భారత వస్త్రాలను బయటకు నెట్టటంతో ప్రారంభించి చివరకు హిందూస్తాన్‌లో తానే చేయితిప్పటాన్ని ప్రారంభించింది ఇంగ్లండు.నేత వస్త్రాలకు నిలయమైన దేశాన్ని తన వస్త్రాలతో ముంచివేసింది.1818-36 మధ్య గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి ఇండియాకు ఎగుమతులు 1:5,200 దామాషాలో పెరిగాయి.1824లో గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి భారత్‌కు కేవలం పది లక్షల గజాలలోపే ఎగుమతి జరగ్గా 1837నాటికి 6.40 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఢాకా పట్టణ జనాభా లక్షా 50వేల నుంచి ఇరవై వేలకు పడిపోయింది.ఒక నాడు తమ వస్త్రాలతో పండుగ చేసుకున్న మాదిరి కళకళలాడిన పట్టణాలు దిగజారటం దీని పర్యవసానమే. బ్రిటీష్‌ వారి ఆవిరిశక్తి, సైన్సు హిందూస్దాన్‌ అంతటా వ్యవసాయం-వుత్పాదక పరిశ్రమ మధ్య వున్న సంబంధాన్ని కూకటి వేళ్లతో పెకలించాయి.’

పారిశ్రామిక విప్లవంలో పెరిగిన వస్తూత్పత్తిని అమ్ముకొనేందుకు యజమానులు ఇతర దేశాల మార్కెట్ల వేట సాగిస్తే వారి యంత్రాలపై పని చేసే కార్మికులు దిగజారిన తమ బతుకులను బాగుచేసుకొనేందుకు బతుకుపోరు జరిపారు. పారిశ్రామికీకరణతో వుపాధి కోల్పోయిన చేనేత వృత్తిదారుల నుంచి బ్రిటన్‌లో తొలిసారిగా యాంత్రీకరణకు ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. యజమానుల చర్యలు మార్కెట్లకోసం యుద్ధాలు, వలసలు, ప్రపంచీకరణ, అంతులేని దోపిడీకి దారితీశాయి. కార్మికుల బతుకుపోరు మేడే, సోషలిజం, కమ్యూనిజం వంటి దోపిడీలేని నూతన సమాజాల అన్వేషణకు పురికొల్పాయి. ప్రతి ఏడాది మే ఒకటవ తేదీ, దీన్నే అంతర్జాతీయ కార్మిక దినం అని కొన్ని చోట్ల కార్మికదినం అని పిలుస్తారు. కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరపాలన్నది వారి చైతన్యానికి గీటురాయి. కనీస సౌకర్యాలు కూడా లేక చెమటలు కక్కుతూ శారీరక శ్రమను, అధునాతన భవనాలలోని ఎసి గదుల్లో ఆధునిక కంప్యూటర్లపై పని చేస్తూ మేధోశక్తిని అమ్ముకుంటూ ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే.

మన దేశ కార్మికవర్గ చరిత్రను చూసినపుడు రైల్వేకార్మికులు అగ్రగాములలో ముఖ్యులు. దాని అనుబంధ పరిశ్రమలతో పాటు బగ్గు, పత్తి,జనపనార పరిశ్రమలతో కార్మికులు విస్తరించారు. పారిశ్రామిక విప్లవం జరిగిన ఐరోపాలోగానీ, విస్తరించిన భారత్‌ వంటి దేశాలలోగానీ దుర్భరపరిస్ధితులు, దోపిడీలో ఎలాంటి తేడా లేదు. మన కార్మికవర్గం సామ్రాజ్యవాద పాలన కింద మగ్గటంతో పాటు అటు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులదోపిడీకీ గురైంది అయింది. అందువలన దోపిడీతో పాటు సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయపోరాటంలో కూడా భాగస్వామి అయింది. అందువలన జాతీయవాదులు, వుదారవాదులే తొలి కార్మికోద్యమ నిర్మాతలుగా వుండటం ఒక సహజపరిణామం. దీని ప్రభావం కార్మికవర్గ అవగాహనమీద కూడా పడింది. కొంత మంది కార్మిక సమస్యల కంటే వారిని సామ్రాజ్యవాద వ్యతిరేకులుగా మార్చటంపైనే కేంద్రీకరించారు. బ్రిటీష్‌ యజమానులు, భారత యజమానుల ఫ్యాక్టరీల పట్ల తేడా వుండాలని చెప్పారు. కార్మిక చట్టాలను గనుక అమలు జరిపితే భారతీయ యజమానుల ఆధ్వర్యంలోని ఫ్యాక్టరీలు పోటీని తట్టుకోలేవని భావించారు.ఈ కారణంగానే 1881,91లో తెచ్చిన ఫ్యాక్టరీ చట్టాలను కొందరు వ్యతిరేకించారు. వర్గ అవగాహనతో కార్మికులను విడదీయవద్దని చెప్పారు. దయాదాక్షిణ్యాలతో కార్మికుల ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరచాలని చూశారు.

తొలిసారిగా 1870లో శశిపాద బెనర్జీ కార్మిక క్లబ్బు స్ధాపించి, భారత శ్రమజీవి అనే పత్రికను కూడా ఏర్పాటు చేశారు. సొరాబ్జీ షాపూర్జీ బెంగాలీ చొరవతో 1878లో కార్మికుల పని పరిస్ధితుల మెరుగుదలకు బంబాయి శాసన మండలి ఒక చట్టాన్ని ఆమోదించింది.1880లో నారాయణ్‌ మేఘాజీ లోఖాండే దీన బంధు అనే పత్రికతో పాటు బంబే మిల్‌ అండ్‌ మిల్‌హాండ్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు.1899లో ముంబైలో తొలి రైల్వే కార్మిక సమ్మె జరిగింది. దానికి బాలగంగాధర తిలక్‌ వంటి వారు తమ పత్రికల ద్వారా మద్దతు ప్రకటించారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ధరలు విపరీతంగా పెరిగి కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. అదే సమయంలో రష్యాలో తొలి శ్రామికరాజ్యం ఏర్పడి కార్మికవర్గాన్ని ఎంతగానో వుత్తేజపరచి వుద్యమాలకు పురికొల్పింది. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) కూడా ఏర్పడింది. ఈ పూర్వరంగంలో స్వాతంత్య్ర వుద్య మాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం జాతీయ స్ధాయిలో ప్రజాసంఘాలను నిర్మించటం అవసరమని భావించింది. దాని పర్యవసానమే 1920అక్టోబరు 31ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌(ఎఐటియుసి) ఏర్పాటు. ఆ తరువాతే పెద్ద ఎత్తున చెలరేగిన పోరాటాలను అణచివేసేందుకు, ఆంక్షలు విధించేందుకు వీలుగా 1926లో ట్రేడ్‌యూనియన్‌ తరువాత, ఇతర అనేక చట్టాలను తెచ్చారు. వాటన్నింటికి పరాకాష్టగా మీరట్‌, కాన్పూరు కుట్రకేసులను బనాయించి కమ్యూనిస్టులుగా అనుమానం వున్నవారందరినీ వాటిలో ఇరికించి విచారణ జరిపారు.

బ్రిటన్‌లో తొలిసారిగా 1802లో పారిశ్రామిక కార్మికుల చట్టాన్ని తెచ్చారు. ఫ్యాక్టరీల్లో పిల్లలతో ఎన్నిగంటలు, ఎలాంటి పని చేయించాలి, ఏ తరహా సంస్ధలలో ఎలాంటి పరిస్ధితులు వుండాలో దాన్లో పేర్కొన్నారు. ఎవరైనా ఈ చట్టాన్ని వుల్లంఘించితే రెండు నుంచి ఐదు పౌండ్ల జరిమానా విధించాలని కూడా పేర్కొన్నారు. తరువాత ఆ చట్టాన్ని 1819లో సవరించారు.1833లో ఫ్యాక్టరీల తనిఖీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. 1874లో బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీపాలన రద్దయి విక్టోరియా రాణి పాలన మొదలైంది. 1875లో కార్మికుల పని పరిస్ధితులపై అధ్యయనానికి ఒక కమిటీని వేసి దాని నివేదిక ఆధారంగా వంద అంతకంటే ఎక్కువ మంది పని చేసే ఫ్యాక్టరీలలో అమలు చేసే విధంగా 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం వచ్చింది. అధ్యయన కమిటీ విషయం తెలిసిన కొందరు 1879డిసెంబరులో రఘబా సుఖరామ్‌ అనే కార్మికుడి నాయకత్వంలో సమావేశమై రాతపూర్వకంగా తమ స్ధితిగతులను వివరించారు. దానిపై 578 మంది సంతకాలు చేశారు. భారత కార్మికోద్యమ చరిత్రలో తొలి నేతగా సుఖరామ్‌ నమోదయ్యాడు. తొలి ఫ్యాక్టరీ చట్టంపై నాటి మీడియాలో కొన్ని సమర్ధించగా మరికొన్ని తీవ్రంగా విమర్శించాయి. బ్రిటీష్‌ పాలకులకు విన్నపాలు చేయటం ఏమిటి, మన పని మనం చేసుకుందాం అంటూ కొందరు జాతీయవాదులు పత్రికల్లో రాశారు. బాలగంగాధర తిలక్‌ 1881 మార్చి 13న తన మరాఠా పత్రికలో ఇండియా పాలన ఇండియా కొరకు గాక ఇంగ్లండు ప్రయోజనాలకొరకు జరుగుతోంది.మనది పరాజిత దేశం, ఒక పరాజిత దేశంగానే పరిపాలించబడతామని దేశీయులు తెలుసుకోవాలి’ అని రాశారు. మన దేశంలో పారిశ్రామికీకరణ పందొమ్మిదవ శతాబ్ది మధ్యలో ప్రారంభమైంది. అసోంలో 1839లో తొలి తేయాకు కంపెనీ, 1843లో బెంగాల్‌ బగ్గు కంపెనీ, 1854లో బంబాయిలో తొలి బట్టల మిల్లు, కొలకత్తాలో తొలి జూట్‌మిల్లు ప్రారంభమైంది. ఆ తరువాతే ముడి సరకుల రవాణాకు రైలు మార్గాలను వేశారు. 1890నాటికి వివిధ దేశాలలో పని చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు పంపిన భారతీయ కార్మికుల సంఖ్య ఐదులక్షలు కాగా దేశంలో పారిశ్రామిక కార్మికులు సంఖ్య మూడులక్షలు మాత్రమే.

రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది.

పందొమ్మిదవ శతాబ్ది, ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. దుర్భర పరిస్ధితుల నుంచి బయటపడేందుకు కార్మికవర్గం చేసిన పోరాటాల ఫలితమే సాధించుకున్న హక్కులు, చట్టాలు. తొలి చట్టాలు అమలులోకివచ్చి వందసంవత్సరాలు కూడా గడవక ముందే సంస్కరణల పేరుతో వాటికి చెల్లుచీటీ ఇవ్వటం ప్రారంభమైంది. ఫలితంగా నూటయాభై సంవత్సరాల నాటి దుర్భరపరిస్ధితులైన పన్నెండు గంటల పని, తక్కువ వేతనాలు, యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం పునరావృతం అవుతున్నాయి. ఇదంతా స్వేచ్చావాణిజ్యం, ప్రపంచీకరణపేరుతో జరుగుతోంది. వీటినే నయా వుదారవాద విధానాలు అని కూడా అంటున్నారు. కొంత మంది వీటిని వూట సిద్ధాంతంగా వర్ణించారు. దాని ప్రకారం సరిహద్దులు, కరెన్సీ,మిలిటరీ, పోలీసు వంటి అంశాలు తప్ప మిగిలిన అన్నింటినీ ప్రయివేటు రంగాలకు అప్పచెబితే ఆ రంగం నుంచి వచ్చే ఫలితాలు వూట మాదిరి సమాజం అంతటికీ దిగుతాయి. గత మూడున్నర దశాబ్దాల ఈ విధానాల అమలులో వూట ఎలా దిగింది? కేంద్ర ప్రభుత్వ సమాచారం, గణాంకాల ప్రకారం 1980-81లో ఒక వస్తువు తయారీ లేదా సేవ విలువ(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌- జివిఏ)లో వేతనాలు, అలవెన్సులు తదితర రూపాలలో సగటున కార్మికులకు దక్కిన లబ్ది 44శాతం. అది 2012-13 నాటికి 23.6కు పడిపోయింది. ఇదే సమయంలో వడ్డీ చెల్లింపులు 19.8 నుంచి 13.7శాతానికి తగ్గాయి. మరి లాభాల వాటా 15.7 నుంచి 44.1శాతానికి పెరిగింది. 2012 జిడిపి ఆధారంగా గుణిస్తే మన దేశంలో ఒక శ్రామికుడు గంటలో చేసిన వుత్పత్తి విలువ రెండు వందల యాభై రూపాయలు అదే రోజుకు రెండువేలు. వివిధ పరిశ్రమలు, రంగాలలో వున్న కనీస వేతనాల మొత్తాలను చూస్తే కార్మికులు ఎంత దోపిడీకి గురవుతున్నారో చెప్పనవసరం లేదు. అ తక్కువ మొత్తాలను కూడా దశాబ్దాల తరబడి సవరించని ప్రభుత్వాలున్నాయి. ఇవి చట్టాలను నీరుగార్చటమే. అవసరాల మేరకు పెంపుదల సంగతిపక్కన పెడితే అసలు ఏదో ఒక సవరణ కోసం కూడా వుద్యమించాల్సిన రోజులివి. ఈ పూర్వరంగంలో కార్పొరేట్లకు మరింత లబ్ది చేకూర్చేందుకు సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ అమలు జరప ప్రయత్నించిన వాటిని బిజెపి ఆచరించేందుకు పూనుకుంది. ఇది అధికార దుర్వినియోగం కాదా ? దీన్నెవరు ప్రశ్నించాలి, కోర్టు పరిభాషలో చెప్పాలంటే ఈ పరిస్ధితిని ఎలా సరిచెయ్యాలి?

బిజెపి పాలిత రాజస్ధాన్‌ కార్మిక చట్టాల సవరణ ప్రయోగశాలగా తయారైంది.అక్కడి పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి తిరిగి పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన ఘనత బిజెపి ఖాతాలో చేరింది. ఇది దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది. యాంత్రీకరణ, రోబోల వినియోగం మరింతగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి సవరణలు చేయటం అంటే అత్యధిక ఫ్యాక్టరీలు, సంస్ధలను కార్మిక చట్టాల పరిధి నుంచి తొలగించటమే. అలాంటపుడు కనీసవేతనాలను సవరించినా వుపయోగం ఏముంది? ప్రభుత్వం యజమానులు ఏం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతిచ్చే చర్యలకు ముద్దుగా ‘సంస్కరణలు’ అని పేరు పెట్టింది.

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇటువంటి పరిస్ధితిని అన్ని రాష్ట్రాలలో రుద్దాలని చూస్తున్నారు. లేదా వున్న చట్టాలను అమలు జరపకుండా వుపేక్షిస్తున్నారు. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌.

ప్రపంచవ్యాపితంగా ధనిక దేశాలన్నింటా అప్రెంటిస్‌షిప్‌(నైపుణ్య శిక్షణ) పేరుతో పెద్ద ఎత్తున పర్మనెంటు కార్మికుల స్ధానంలో కార్మిక చట్టాల పరిధిలో లేని కార్మికులను నియమిస్తున్నారు. వారికి తక్కువ వేతనాలు, అలవెన్సులు చెల్లించేందుకు ఇదొక దొంగదారి అన్నది తెలిసిందే. మన దేశంలో కూడా అప్రెంటిస్‌షిప్‌ చట్టాన్ని సవరించి శిక్షణలో వున్న వారు చేయకూడని పనులను కూడా వారితో చేయించేందుకు, పెద్ద ఎత్తున నియామకానికి తెరతీశారు. శిక్షణా కాలంలో అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించేవిధంగా పధకాలు సిద్దం చేశారు. ఇది యజమానులకు మరొక అదనపు రాయితీ.

ే మన సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్న మనువాదుల దృష్టిలో మేడే పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. నిజమే ! మనం చెప్పుకుంటున్న ప్రజాస్వామిక వ్యవస్ధ, భావజాలం సైతం పశ్చిమ దేశాల నుంచి అనుకరించింది కాదేమిటి? అంతెందుకు మన నిత్య జీవితంలో ఇతర దేశాల నుంచి అనుకరిస్తున్నవి, వినియోగిస్తున్నవి ఎన్ని వున్నాయో ఎవరికి వారు ఆలోచించుకోండి. ప్రపంచ మానవుడు ఎక్కడ మంచి వుంటే దాన్ని, ఎవరు జీవనాన్ని సుఖమయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే దానిని స్వంతం చేసుకోలేదా ? ఒక దేశం నుంచి ఖండం నుంచి మన దేశం ప్రపంచానికి నాగరికత అంటే ఏమిటో నేర్పిందని కొంత మంది చెబుతారు. మన దాన్ని ఇతరులు అనుసరించినపుడు మే డే వంటి వాటిని దాని వెనుక వున్న పురోగామి భావజాలాన్ని విదేశీ అంటూ మనకు పనికి రాదని పక్కన పెట్టమంటున్నారంటే అర్ధం ఏమిటి? ఏ పదజాలం వెనుక ఏ అర్ధం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే వుంటారని మార్క్సిజాన్ని తొలిసారిగా తమ దేశానికి అన్వయించి తొలి శ్రామికవర్గ రాజ్య స్ధాపనకు నాయకత్వం వహించిన లెనిన్‌ చేసిన హెచ్చరికను తీసుకోవటానికి ఆయన విదేశీయత అడ్డం వస్తుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మే డే, పూలే, అంబేద్కర్‌ !

29 Saturday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

'Bombay Mill Hands Association, b-r-ambedkar, Father of the Trade Union Movement in India, jyothi-rao-pule, may day, narayan meghaji lokhande

Image result

ఎం కోటేశ్వరరావు

మే డే, కార్మికుల దీక్షా దినం. ప్రపంచ వ్యాపితంగా కార్మికవర్గం తన హక్కుల సాధనకోసం పునరంకితమయ్యే అంతర్జాతీయ దినం. అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( మరీ కొంత మంది అయితే దళితులలో ఒక వుప కులానికే పరిమితం చేసే విచారకర ప్రయత్నం గురించి చెప్పనవసరం లేదు.) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఓబిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా చరిత్రలో వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. ఈ ప్రచారానికి ప్రభావితమైన వారు మే డే సందర్భానికి పూలే,అంబేద్కర్‌లకు సంబంధం ఏమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు.

Image result for narayan meghaji lokhande

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాల కే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికుల పని పరిస్థితుల గురించి ఎలాంటి చట్టాలు లేవు. పొద్దు పొడవక ముందే మిల్లు పనిలోకి రావాలి.పొద్దు పోయేంత వరకు పని చేయాలి. ఇంటికి వెళ్లి రావటంలో అలస్యం అయితే యజమానులు అంగీకరించరు కనుక అనేక మంది రాత్రి డ్యూటీ దిగి గేటు దగ్గరే నిద్రపోయి తెల్లవారు ఝామున లేచి తిరిగి పనికి వెళ్లే వారు. మధ్యలో భోజనానికి పావు గంటా ఇరవై నిమిషాలు మాత్రమే అనుమతించేవారు. ఇక ఫ్యాక్టరీలలో కాలకృత్యాలు తీర్చుకొనే సౌకర్యాలు, తగిన గాలి, వెలుతురు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కొన్ని పండుగలకు ఇచ్చే సెలవులు తప్ప 365రోజులూ పని చేయాల్సిందే. దీనికి తోడు దాదాపు రోజంతా యంత్రాలు పని చేసిన కారణంగా వాటి రాపిడికి ఫ్యాక్టరీలో వేడి వాతావరణం వుండేది. దీంతో కార్మికులు అయిదారు సంవత్సరాలకు మించి పని చేయలేకపోయే వారు.1881 లెక్కల ప్రకారం బొంబాయి మిల్లులలో పని చేసే వారిలో 23శాతం మంది 15 ఏండ్ల లోపు బాల కార్మికులు వుండేవారు. రోజు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన నారాయణ్‌ ఆ పరిస్థితులు మారాలనే ప్రచారానికి పూనుకున్నారు.1877లో ప్రారంభమైన దీన బంధు పత్రిక ఆర్ధిక ఇబ్బందులతో వెంటనే మూత పడింది. దానిని తిరిగి పునరుద్ధరించి 1880లో సంపాదక బాధ్యతలు చేపట్టిన నారాయణ్‌ మరో నాలుగు సంవత్సరాలకే బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో ఏర్పాటు చేశారు. అమెరికా, తదితర దేశాలలో జరుగుతున్న కార్మికోద్యమాలను చూసిన బ్రిటీష్‌ ప్రభుత్వం 1875లోనే ఒక కమిషన్‌ వేసి 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టాన్ని చేసింది. అయితే దానితో కార్మికుల పని పరిస్థితులలో పెద్దగా మార్పేమీ లేదు. అదెంత కంటి తుడుపు వ్యవహారమంటే ఏడు సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టరాదని, 7-12 ఏండ్ల బాల కార్మికులతో తొమ్మిది గంటలకు మించి పని చేయించరాదని, యంత్రాల చుట్టూ కంచెలు వేయించాలనే తరహా నిబంధనలు పెట్టింది. వీటిని కూడా యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం దానిని కూడా అమలు జరిపే యంత్రాంగం, ఆసక్తి ప్రభుత్వానికి లేదు. నారాయణ్‌ మేఘాజీ తన పత్రిక ద్వారా, ఇతర పద్దతులలో దాని వలన పెద్ద కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదని ప్రచారం చేయటంతో పాటు, కార్యాచరణకు గాను ముందే చెప్పుకున్నట్లు 1884లో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హోదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు.

1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయంగా ఒకటి. మార్కెట్‌లో వున్న మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొకటి.

అంతకు ముందు ఆమోదించిన ఫ్యాక్టరీ చట్టం కార్మికులను సంతృప్తి పరచకపోవటం, ఆందోళనలు పెరిగి పోవటంతో ప్రభుత్వం 1890లో ఫ్యాక్టరీ లేబర్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది.దానిలో లోఖండేను సహ సభ్యునిగా నియమించింది. దాని సిఫార్సుల మేరకు 1891లో ఆమోదం పొంది మరుసటి ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం పది మంది వున్న ఫ్యాక్టరీలన్నింటికీ వర్తించింది. తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలతో పనిపై నిషేధం, 14 ఏండ్ల లోపు వారికి, మహిళల చేత 9,11 గంటలు మాత్రమే పని చేయించాలని, వారికి నెలకు నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలని దానిలో పేర్కొన్నారు.

Image result for jyothi rao pule

జ్యోతిబా పూలే తిరుగులేని అనుచరుడిగా వున్న లోఖాండే కార్మికనేతగా పని చేయటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి సంస్కర్తగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు అమానుష దోపిడీ, దుర్భర పని పరిస్ధితులలో కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి ప్రతిఘటన పోరాట యోధుడు. నాటి పరిస్థితులలో మహజర్లు సమర్పించటం, సభలు జరపటం వంటి రూపాలనే ఎంచుకోవటం సహజం. తన పత్రికలో రాసిన సంపాదకీయాలను చూస్తే ఈ రెండు అంశాలతో పాటు 1893లో జరిగిన మత ఘర్షణల సందర్భంగా హిందూ-ముస్లిం ఐక్యత అవసరం గురించి ఆయన రాసిన సంపాదకీయాలు మతశక్తుల పట్ల వైఖరిని వెల్లడించాయి. అన్ని మతాల వారితో ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 60వేల మంది హాజరయ్యారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలను ఆయన నిరసించాడు.కార్మిక నేతగా ప్రత్యేకంగా మహిళాకార్మికులను సమీకరించి కూడా సభలు జరిపారు. భర్త మరణించినపుడు స్త్రీల తలలు గొరిగి గుండ్లు చేయటాన్ని ఆయన వ్యతిరేకించారు.1890 మార్చినెలలో దాదాపు ఐదు వందల మంది క్షురకులను సమీకరించి ఏర్పాటు చేసిన సభలో మహిళలకు గుండ్లు చేయబోమని వారిచేత ప్రతిజ్ఞ చేయించటం ఒక అపూర్వ ఘట్టం. పేదలకు సేవ చేసేందుకు ఆయన ఒక ఆసుపత్రిని కూడా ప్రారంభించారు.1886లో బొంబాయి, పరిసరాలలో వ్యాపించిన ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూనే 1887 ఫిబ్రవరి తొమ్మిదిన ఆయన మరణించారు.

2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. మొత్తం మీద చూసినపుడు లోఖండేలో సంఘసంస్కర్త పాలు ఎక్కువా లేక కార్మికోద్యమ నేత పాలు ఎక్కువగా అన్నది పక్కన పెడితే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు.

Image result for ambedkar

భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ జీవితాన్ని పరిశీలించినపుడు ఆయనలో వున్నన్ని భిన్న పార్శ్వాలు మరే నాయకుడిలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుడిని కొందరు నేడు దళితులలో ఒక వుప కుల ప్రతినిధిగా చూస్తూ కొందరు ఆరాధిస్తుంటే అదే కారణంతో మరికొందరు ఆయనను విస్మరిస్తున్నారు. రెండు వైఖరులూ సరైనవి కావు. అంబేద్కర్‌ రాజ్యాంగ పద్దతులలో కార్మికవర్గానికి చేసిన మేలు తక్కువేమీ కాదు. ఆయన ఇండియన్‌ లేబర్‌ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా రైతాంగ సమస్యలపై కూడా పని చేశారు. మొత్తం మీద చూసినపుడు మొగ్గు రాజ్యాంగం, చట్టాలు, దళితుల అభ్యుదయానికి ఆయన మారుపేరుగా మారారు.

Image result for may day

మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కృషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. దాని మంచి చెడ్డల విషయానికి వస్తే అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కృషిని గుర్తించిన మాట వాస్తవం. కార్మిక, కర్షక వుద్యమాలు, సంఘాల నిర్మాణాలతో పాటు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, మహిళల ప్రత్యేక సమస్యలు, హక్కుల గురించి పోరాడేందుకు ఏర్పాటు చేస్తున్న సంఘాలు, వాటి కార్యకలాపాలే అందుకు నిదర్శనం. వాటిని గుర్తించేందుకు కొంతకాలం పట్టవచ్చు. గతంలో పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించ వచ్చు. లేదూ అది చాలదు అనుకుంటే తమ అభిప్రాయాలను తాము అట్టి పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారి గురించి కూడా కొన్ని విమర్శలున్నాయనే అంశాన్ని మరచి పోకూడదు. కార్మిక, కర్షక సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యతను కమ్యూనిస్టులు కుల వివక్ష సమస్యకు ఇవ్వలేదని ఎలా విమర్శలు వచ్చాయో, పూలే-అంబేద్కరిస్టులు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ పోరాటాలను విస్మరిస్తున్నారనే ఆ విమర్శ. అందువలన ఇద్దరు మిత్రులూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి మిత్ర వైరుధ్యాలు తప్ప శత్రువైరుధ్యాలు కావు. అందువలన ఇప్పుడు రెండు వైపుల నుంచీ వినిపిస్తున్న లాల్‌ -నీల్‌ ఐక్యతను పెంపొందించేందుకు చిత్తశుద్దితో కృషి చేయటం అవసరం. ఈ మేడే సందర్భంగా రెండు శక్తులూ కర్తవ్యానికి పునరంకితం కావటమే చికాగో అమర జీవులు, పూలే-అంబేద్కర్‌లకు నిజమైన నివాళి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మే డేకు నాంది పలికిన చారిత్రాత్మక రైల్వే సమ్మె

24 Sunday Apr 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

Great Railroad Strike, Great Railroad Strike of 1877, Great Upheaval, may day

Image result for may day

ఎం కోటేశ్వరరావు

     చరిత్ర ఎంత చిత్రమైనదో కదా ! అనేక మంది వాటి గురించి ప్రస్తావించారు.చుంచెలుక ఎప్పుడూ భూమిలో తవ్వుతూనే వుంటుంది. అది దాని స్వభావం, ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు.కొన్నిసార్లు మనకు అలా కనిపించి ఇలా మాయమై పోతుంటుంది. కానీ నిరంతరం అది తవ్వుతూనే వుంటుంది. ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్‌ ఈ జీవి గురించి తన హామ్లెట్‌ నాటకటంలో ప్రస్తావించారు. కారల్‌ మార్క్సు దానిని విప్లవానికి అన్వయించారు. ఆయన ఊహించిన విధంగా బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలలో విప్లవం రాలేదు. కానీ అందుకు భిన్నంగా అంతకంటే తక్కువ అభివృద్ధి చెందిన రష్యాలో వచ్చింది. తరువాత అత్యంత వెనుకబడిన ఫ్యూడల్‌ చైనాలో వచ్చింది. చరిత్ర చిత్రాల గురించి ఎంగెల్స్‌ ఇలా పేర్కొన్నారు.’మన కంటికి ఆకస్మికంగా కనిపించే గొప్ప విప్లవాలన్నింటికీ ముందు కాలపు ఆలోచనలు, సాహిత్యం, రాజకీయాల ఫలితంగా నిశ్చల మరియు రహస్య విప్లవాలు జరిగే తప్పనిసరిగా జరిగి వుంటాయి. విప్లవం ప్రతి కంటికీ కనిపించదు.’

     ఈఏడాది నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బెర్నీ శాండర్స్‌ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడటం ఒక అనూహ్య పరిణామం. అవును మేం కూడా శాండర్స్‌ మాదిరి డెమోక్రటిక్‌ సోషలిస్టులమే అంటూ మిలియన్ల కొలదీ యువతరం ఆయనకు జేజేలు పలకటం ఎవరైనా వూహించారా? అదీ సోషలిజంపై సాగించిన ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని, కమ్యూనిజానికి సమాధి కట్టా మని, తమకు ఇంక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా పాలకవర్గానికి చెమటలు పట్టిస్తారని ఎవరైనా కలగన్నారా ? సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటేనే శతృవులుగా చూసే అమెరికన్లు సోషలిస్టులు, కమ్యూనిస్టులా అయితే ఏమిటి అంటూ రోజురోజుకూ వారి పట్ల సానుకూలతను పెంచుకుంటున్నారని స్వయంగా అమెరికా సంస్ధల సర్వేలే వెల్లడించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అయితే ఇవన్నీ యాదృచ్చికంగా జరిగాయా ?ఎంగెల్స్‌ చెప్పినట్లు ఎన్నో కారణాలు,ఎన్నెన్నో పరిణామాలు దోహదం చేశాయి.అంటే చుంచెలుక అమెరికాలో అంతర్గతంగా తొలుస్తోందా ? ఏమో చరిత్ర చిత్రాలను ఎవరు వూహించగలరు ?

    అమెరికా ఖండాల చరిత్రను చూస్తే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యం గొలపవు. మొత్తంగా వలస వచ్చిన వారితో, బానిసలుగా ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా పట్టుకు వచ్చిన వారితో ఏర్పడిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో(యుఎస్‌ఏ) ఇప్పుడు రిపబ్లికన్‌ పార్టీ నేతలు భారత్‌ వంటి దేశాల నుంచి వుపాధికోసం వచ్చే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నూతన ప్రపంచం పేరుతో అక్కడి ప్రకృతి సంపదలను స్వంతం చేసుకున్న ఐరోపా పాలకవర్గం తమకు అవసరమైన పని వారి కోసం పెద్ద ఎత్తున ఐరోపా నుంచి వలసలను ప్రోత్సహించింది. వలస కార్మికులకు రంగుల కలలను చూపింది.ఆఫ్రికా నుంచి అక్కడి జనాన్ని బానిసలుగా పట్టుకు వచ్చింది.పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు నిత్యకృత్యం.

    1870దశకంలో ఐరోపాలో తీవ్రమైన ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. దాని ప్రభావం అమెరికాపై పడింది. దానిలో భాగంగా 1873 సెప్టెంబరు 18న అమెరికాలోని అగ్రశ్రేణి బ్యాంకింగ్‌ సంస్ధ జె కూక్‌ అండ్‌ కంపెనీ కుప్పకూలింది.ఈ కంపెనీ అమెరికాలో రైలు మార్గాలకు పెట్టుబడులు పెట్టింది.అంతకు ముందు అమెరికా జరిపిన అనేక యుద్ధాల సమయంలో రుణలావాదేవీలను నిర్వహించటంలో కీలక పాత్ర పోషించింది.అమెరికాపై ఈ మాంద్య ప్రభావం ఆ నాడు ఎంత తీవ్రంగా వుందంటే ఈ బ్యాంకు కుప్పకూలటంతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ పది రోజుల పాటు మూత పడింది. కంపెనీలకు అప్పులు కరవయ్యాయి.పద్దెనిమిదివేల వ్యాపార సంస్ధలు దివాలా తీశాయి. నిరుద్యోగం 1876 నాటికి 14శాతానికి పెరిగింది. పని దొరికిన కార్మికులకు కూడా ఆరునెలలు మాత్రమే, అదీ 45శాతం వేతన కోతతో రోజుకు ఒక డాలరు కంటే తక్కువకే పనిచేశారు. దేశంలోని 364 రైలు మార్గ కంపెనీలలో 89 దివాలా తీశాయి.అంతకు ముందు ప్రభుత్వం రైలు మార్గాల నిర్మాణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.అందుకుగాను పెద్ద విస్తీర్ణంలో భూమి, ఇతర సబ్సిడీలను ఇచ్చింది.దాంతో మదుపుదార్లందరూ రైలు మార్గ కంపెనీలకు తమ పెట్టుబడులను మరల్చారు. బ్యాంకులన్నీ డబ్బును ఇటు మళ్లించాయి. మాంద్యం అటు రైలు మార్గ కంపెనీలు, ఇటు వాటిలో పెట్టుబడులు పెట్టిన వారినీ తీవ్రంగా దెబ్బతీశాయి. అవసరాలకు మించి ఎంతగా రైలు మార్గాలను నిర్మించారంటే సబ్సిడీ రూపంలో రాయితీలను పొందేందుకు 1866-73 మధ్య 55వేల కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను నిర్మించారు. ఈ పూర్వరంగంలో ఒకే ఏడాది మూడుసార్లు కార్మికుల వేతనాలను తగ్గించారు. దానికి నిరసనగా 1877లో అమెరికాలో జరిగిన రైల్వే కార్మికుల సమ్మెలను కొంత మంది మహా తిరుగుబాటుగా వర్ణించారు.ఇదే తరువాత కాలంలో ప్రపంచ కార్మికవర్గ దీక్షా దినమైన ‘మే డే ‘కు నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు.

     పశ్చిమ వర్జీనియాలోని మార్టినెస్‌బర్గ్‌లో 1877 జూలై 14న ప్రారంభమైన రైల్వే కార్మిక సమ్మె అనేక ప్రాంతాలకు విస్తరించి 45 రోజుల పాటు జరిగింది. దీనికి ఏ కార్మిక సంఘమూ పిలుపునివ్వలేదు. ఏ పార్టీ మద్దతు పలకలేదు. మాంద్యంతో కార్మికుల నుంచి వెల్లువెత్తిన నిరసన నుంచి చెలరేగిన ఈ సమ్మె, హింసాకాండను అణచివేసేందుకు స్ధానిక, రాష్ట్ర, కేంద్ర పోలీసు, మిలిటరీ బలగాలను దించారు. మాంద్యం 1878-79 నాటికి తగ్గిపోయింది. అయితే ఆ సందర్భంగా కార్మికుల్లో తలెత్తిన నిరసనను పాలకులు అణచివేసినా కార్మికవర్గం అనేక పాఠాలు నేర్చుకుంది. పశ్చిమ వర్జీనియాలో ప్రారంభమైన సమ్మె అణచివేతకు ఆ రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్ర పారామిలిటరీ బలగాలను ఆదేశించాడు. బల ప్రయోగానికి ఆ దళాలు నిరాకరించాయి. దాంతో కేంద్ర దళాలను దించాడు. ఇలా అనేక రాష్ట్రాలలో జరిగింది. పలుచోట్ల కార్మికులు, మిలిటరీ దళాలతో తలపడ్డారు.మేరీలాండ్‌లో మిలిటరీ కాల్పులలో పది మంది కార్మికులు మరణించారు.పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక రైలు మార్గ యజమాని అయిన థామస్‌ అలెగ్జాండర్‌ స్కాట్‌ కార్మికులకు కొద్ది రోజుల పాటు ‘తూటాల భోజనం పెట్టండి ఎలా వుంటుందో రుచి చూస్తారు’ అని వ్యాఖ్యానించాడు.దాంతో జరిపిన కాల్పులలో 20 మంది మరణించారు.ఇలా అనేక చోట్ల స్ధానిక ప్రభుత్వాల ఆదేశాల కంటే రైలు కంపెనీల యజమానుల ఆదేశాలమేరకు సాయుధ దళాలు కార్మికులను అణచివేశాయి.

    ముందే చెప్పుకున్నట్లు ఈ సమ్మె అనేక అనుభవాలను నేర్పింది. మిస్సోరీ రాష్ట్రంలో సెయింట్‌ లూయీస్‌ వర్కింగ్‌ మెన్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మిస్సోరీ నది పరిసర ప్రాంతాలలో అనేక మంది ఇతర కార్మికులు సానుభూతిగా సమ్మె చేశారు. చివరకు రోజుకు ఎనిమిది గంటల పని, బాలకార్మికుల నిషేధం డిమాండ్లతో అమెరికాలోనే తొలి సాధారణ సమ్మెగా అది మారిపోయింది. నది రెండువైపులా ఎనిమిది వేల మంది సాయుధ బలగాలను దించి సమ్మెను అణచివేశారు. కనీసం పద్దెనిమిది మందిని కాల్పులలో చంపివేశారు.

     ఈ సమ్మె అణచివేత తరువాత భవిష్యత్‌లో ఆందోళనలను ఎలా నిర్వహించాలా అని కార్మికవర్గం ఆలోచించింది. మరోసారి ఇలాంటి ఆందోళనలు పునరావృతం కాకుండా ఎలా చూడాలా అని యజమానులు పధకాలు వేశారు. కార్మికుల పట్ల మరింత కఠిన వైఖరిని అనుసరించాలని నిర్ణయించారు. అనేక రాష్ట్రాలలో కొత్త సాయుధ దళాలను తయారు చేశారు. జాతీయ సాయుధ దళాలకు అనేక పట్టణాలలో కేంద్రాలను నిర్మించారు. కార్మికులను అణచివేసేందుకు కొన్ని చట్టాలను కూడా కొత్తగా రూపొందించారు. ఇదే సమయంలో కార్పొరేట్‌ శక్తులను ఎదుర్కోవటంలో కార్మికవర్గం కూడా తనలో ఇమిడి వున్న శక్తిని గుర్తించింది.పిట్స్‌ బర్గ్‌లో సమ్మె అణచివేతకు సారధ్యం వహించిన సాయుధ దళాధికారి మాటల్లోనే ‘ ఒకే లక్ష్యం, ఒకే స్ఫూర్తి వారిలో కనిపించింది. కార్పొరేషన్ల శక్తిని దెబ్బతీసేందుకు ఏ పద్దతి అయినా అనుసరించవచ్చని వారు సమర్ధించుకున్నారు’ అన్నాడు. కార్మికులలో పెరిగిన చైతన్యం కారణంగా యజమానులు కూడా తెగేదాకా లాగితే తమకూ నష్టమే అని కూడా గ్రహించకతప్పలేదు. ఈ పూర్వరంగంలోనే బాల్టిమోర్‌ అండ్‌ ఓహియో రైలు మార్గ కంపెనీ 1880 మే ఒకటిన వుద్యోగుల సహాయ విభాగాన్ని ప్రారంభించి అనారోగ్యం, ప్రమాదాలకు గురైనపుడు సాయం, మరణిస్తే పరిహారం చెల్లించేందుకు ఏర్పాటు చేసింది. అదే కంపెనీ మరో నాలుగు సంవత్సరాల తరువాత పెన్షన్‌ పధకాన్ని ప్రారంభించిన తొలి పెద్ద యాజమాన్యంగా పేరు తెచ్చుకుంది.

   రైల్వే కార్మికుల ఆందోళన తరువాత అనేక పరిశ్రమలలో సమ్మెలు గణనీయంగా పెరిగాయి. 1886లో దాదాపు పదివేల సమ్మెలలో ఏడులక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. అదే ఏడాది పనిగంటలను పన్నెండు నుంచి ఎనిమిదికి తగ్గించాలని కోరుతూ జరిగిన జాతీయ సమ్మెలో 12వేల కంపెనీల కార్మికులు పాల్గొన్నారు. చికాగోలోని హే మార్కెట్‌ ప్రాంతంలో కార్మికులపై దమన కాండ జరిపారు.ఆందోళన అణచివేతలో భాగంగా పోలీసులే బాంబులు వేసి తమ అధికారి ఒకరిని చంపివేశారు.ఆ నెపాన్ని కార్మిక నేతలపై నెట్టి నలుగుర్ని వురితీశారు.ఆ చర్య కార్మికవర్గాన్ని మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. జాతీయ కార్మిక వుద్యమం మరింత విస్తరించింది. మే డేను వునికి లోకి తెచ్చింది.

   1870దశకపు మాంద్యం తరువాత మరో రెండు దశాబ్దాలకు 1893-94లో అమెరికాను మరో మాంద్యం కుదిపేసింది. దేశవ్యాపితంగా సమ్మెలు వెల్లువెత్తాయి. ఇరవై ఆరు రాష్ట్రాలలో కార్మికులు-భద్రతా దళాలు తలపడేంతగా పరిస్ధితులు దిగజారాయి.ఈ సందర్భంగా పుల్‌మాన్‌ అనే రైల్వే కంపెనీలో జరిగిన సమ్మె వైఫల్యం కార్మికోద్యమంలో కొత్త పరిణామాలకు నాంది పలికింది.అప్పటి వరకు కార్మికులు ఏ విభాగంలో పనిచేసినా ఒకే యూనియన్‌లో వుండే వారు. ఈ సమ్మె సందర్బంగా కొన్ని విభాగాల వారు సమ్మెలో పాల్గొనలేదు. అది విభాగాల వారీ యూనియన్ల ఏర్పాటుకు దారి తీసింది.(వుదా కండక్లరు, డ్రైవర్లు, మెకానిక్‌ల యూనియన్ల వంటివి) దీని వలన వుపయోగాలతో పాటు కార్మికవర్గానికి జరిగిన నష్టాలు కూడా వున్నాయి. ఇప్పటికీ ఈ మంచి చెడ్డల గురించి చర్చలు జరుగుతూనే వున్నాయి.

ఈ సందర్భంగానే అమెరికా కార్మికోద్యమ చరిత్రలో పది గొప్ప సమ్మెలుగా పరిగణించబడే వాటి గురించి తెలుసుకుందాం.

నైరుతి రైల్వే కార్మిక సమ్మె

    ఇది 1886 మార్చి-సెప్టెంబరు మాసాలలో జరిగింది. రెండులక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. రబ్బరు కంపెనీల యజమాని అయిన జే గౌల్డ్‌కు రైలు మార్గాల కంపెనీలు కూడా వున్నాయి. ఐదు రాష్ట్రాలలోని కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.అనేక చోట్ల వీధి పోరాటాలు జరిగాయి.ఇతర రైల్వే కంపెనీల కార్మికుల సహకారం లేకపోవటం, పోటీ కార్మికులను పనిలోకి దించటం, కార్మికులపై హింసాకాండ, భయపెట్టటం వంటి అనేక కారణాలతో ఈ సమ్మె విఫలమైంది.తరువాత కార్మిక సంఘాన్నే నిషేధించారు.

పుల్‌ మాన్‌ సమ్మె

    ఇది 1894 మే-జూలై మాసాల మధ్య జరిగింది. పన్నెండు గంటల పని,వేతనకోతలకు వ్యతిరేకంగా రైలు పెట్టెలను తయారు చేసే పుల్‌ మాన్‌ పాలెస్‌ కార్‌ కంపెనీలో చికాగో, ఇల్లినాయిస్‌ కేంద్రాలుగా రెండున్నరలక్షల మంది కార్మికులు సమ్మె చేశారు. వారికి అమెరికన్‌ రైల్వే యూనియన్‌ కార్మికులు కూడా తోడై రైళ్లు నడపటానికి తిరస్కరించారు.ఈ సమ్మెను అణచటానికి నాటి అమెరికా అధ్యక్షుడు చికాగోకు సైన్యాన్ని పంపాడు. సమ్మె విఫలమైంది కానీ, దేశ వ్యాపితంగా కార్మికుల పట్ల సానుభూతి పెరిగింది.

అంత్రాసైట్‌ బొగ్గు కార్మిక సమ్మె

   తూర్పు పెన్సిల్వేనియాలో 1902 మే-అక్టోబరులో జరిగిన సమ్మెలో 147000 మంది పాల్గొన్నారు.మెరుగైన వేతనాలు, పని పరిస్ధితుల కోసం జరిగిన ఈ సమ్మెతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తే పరిస్ధితి ఏర్పడింది.దాంతో దేశాధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ చలికాలంలో సమ్మె జరిగితే పరిస్థితి మరింత దిగజారుతుందని భావించి యాజమాన్యాన్ని హెచ్చరించాడు. ఇదే సమయంలో పారిశ్రామికవేత్త అయిన జెపి మోర్గాన్‌ సమ్మె కొనసాగటం తన ప్రయోజనాలకు కూడా దెబ్బ అని గ్రహించి కార్మికులు కోరిన 20శాతం వేతన పెంపుదలకు బదులు పదిశాతానికి అంగీకరించి ఒప్పందం చేసుకున్నాడు.

వుక్కు కార్మికుల సమ్మె

    మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అమెరికా వుక్కు పరిశ్రమలో దిగజారిన పరిస్థితులపై నిరసనతో కార్మికులు 1919 సెప్టెంబరు 22 నుంచి 1920 జనవరి ఎనిమిది వరకు మూడున్నరలక్షల మంది సమ్మె చేశారు. ఎక్కువ పని గంటలు, తక్కువ వేతన, యూనియన్‌పై వేధింపులకు నిరసనగా ఈ ఆందోళన జరిగింది. సోవియట్‌ యూనియన్‌లో తొలి సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడిన పూర్వరంగంలో యజమానులు,ప్రభుత్వం కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, తదితర కారణాలతో సమ్మె విఫలమైంది. దీంతో తరువాత పది హేను సంవత్సరాల వరకూ వుక్కు పరిశ్రమలో ఎలాంటి ఆందోళనలూ జరగలేదు.

రైల్వే వర్క్‌షాప్‌ కార్మికుల సమ్మె

    1922లో అమెరికా రైల్వే వర్క్‌షాప్‌ కార్మికులకు వేతనంలో ఏడు సెంట్లు తగ్గిస్తూ చేసిన నిర్ణయం కార్మికులను ఆగ్రహానికి గురిచేసింది. దేశవ్యాపితంగా నాలుగు లక్షల మంది జూలై -అక్టోబరులో జసమ్మె చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులను క్వార్టర్ల నుంచి గెంటి వేయటం, పోటీ కార్మికులతో పనిచేయించటం, సమ్మెను నిషేధిస్తూ కోర్టు ప్రకటించటం వంటి కార్మిక వ్యతిరేక వాతావరణంలో ఐదు సెంట్ల వేతన కోతకు అంగీకరిస్తూ కార్మికుల సమ్మెను విరమించారు.

1934 వస్త్ర కార్మికుల సమ్మె

    ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు నిరసనగా 1934 సెప్టెంబరులో నాలుగు లక్షల మంది వస్త్ర కార్మికులు సమ్మె చేశారు. బయటి కార్మికుల మద్దతు లేకపోవటంతో సమ్మె విఫలమైంది.యూనియన్ల పట్ల కార్మికులలో విశ్వాసం సన్నగిల్లింది. దాంతో యజమానులు కార్మికులను మరింతగా లొంగదీసుకొనేందుకు అనేక మంది కార్మికులను బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

బిటుమినస్‌ బొగ్గు సమ్మె

     1946 ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో 26రాష్ట్రాలలోని నాలుగు లక్షల మంది బొగ్గు గని బిట్‌మినస్‌ కార్మికులు సమ్మె చేశారు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అప్పుడే కోలుకుంటున్న స్థితిలో సమ్మెలు ఏమిటనే సాకుతో సమ్మెను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. అధ్యక్షుడు ట్రూమన్‌ జోక్యం చేసుకున్నాడు. కార్మికులు తిరస్కరించారు. సమ్మె పాక్షిక విజయం సాధించింది.

1959 వుక్కు కార్మికుల సమ్మె

   1959లో వుక్కు పరిశ్రమలో లాభాలు విపరీతంగా వచ్చాయి. దాంతో కార్మికులు అధిక వేతనాల కోసం డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో యాజమాన్యాలు ఒప్పందంలో వుద్యోగ భద్రత, పని గంటల గురించి వున్న అంశాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు.దాంతో ఐదు లక్షల మంది జూలై 15 నుంచి నవంబరు ఆరు వరకు సమ్మె చేశారు. చివరకు వేతనాలు పెరిగాయి.

1970 పోస్టల్‌ సమ్మె

    తమ పని పరిస్థితులు, వేతనాలు, తదితర అంశాలపై బేరసారాలాడేందుకు నిరాకరించినందుకు నిరసనగా 1970 మార్చినెలలో రెండు వారాల పాటు 2,10,000 మంది పోస్టల్‌ కార్మికులు సమ్మె చేశారు.తొలుత న్యూయార్క్‌లో ప్రారంభమై దేశవ్యాపితంగా విస్తరించింది.అధ్యక్షుడు నిక్సన్‌ నేషనల్‌ గార్డులను దించి సమ్మె విచ్చిన్నానికి పూనుకున్నాడు. పోస్టల్‌ సేవలు నిలిచిపోవటంతో చివరకు ఒప్పందం చేసుకొని బేరసారాల హక్కుతో సహా అనేక డిమాండ్లను అంగీకరించారు.

యుపిఎస్‌ వర్కర్ల సమ్మె

    1997 ఆగస్టులో 1,85,000 టీమ్‌స్టర్‌ కార్మికులు వేతన పెంపుదల, ఫుల్‌టైమ్‌ వుద్యోగాలివ్వాలనే డిమాండ్లతో సమ్మె చేసి విజయం సాధించారు. ఈ సమ్మెకు పౌరుల నుంచి మంచి మద్దతు లభించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !
  • ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !
  • వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !
  • ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !
  • అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Recent Comments

raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
V.S.Srinivasa Babu on జాడలేని అపర జాతీయవాదులు…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…
K Seenaih on రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ…

Archives

  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 921 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: