• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: media bias

మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !

03 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

media bias, media credibility, Propaganda War, US imperialism, US MEDIA COCK AND BULL STORIES, US Media lies


ఎం కోటేశ్వరరావు


మొదటి ప్రపంచ యుద్ధానికి కారకులలో ఒకడు జర్మన్‌ చక్రవర్తి కైజర్‌ రెండవ విల్‌హెల్మ్‌.1917 ఫిబ్రవరిలో చైనాలో బ్రిటీష్‌ వారి పత్రిక నార్త్‌ చైనా డైలీ న్యూస్‌ ఒక వార్త ప్రచురించింది. కైజర్‌ సేనలు శవాల నుంచి గ్లిజరీన్ను తయారు చేస్తున్నారన్నది దాని సారాంశం. ఏప్రిల్‌ నాటికి లండన్‌ నుంచి వెలువడే టైమ్స్‌, డెయిలీ మెయిల్‌ పత్రికలు తమ ప్రతినిధులు శవాల నుంచి గ్లిజరీన్‌ తీస్తున్న ఫ్యాక్టరీలను చూసినట్లు వార్తలను ప్రచురించాయి. అదే నెలలో లండన్‌ నుంచి ప్రచురితమౌతున్న ఒక బెల్జియన్‌ పత్రిక శవాలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. దానికి జర్మనీలో ప్రచురితమైన ఒక వార్త ఆధారం. జర్మన్‌ పత్రికలో గుర్రాలు, కంచరగాడిదల శవాలను కాల్చుతున్నట్లు విలేకరి పేర్కొన్నాడు. అది బ్రిటీష్‌ పత్రికల్లో మానవశవాలుగా మారింది. అలాంటిదేమీ లేదని జర్మనీ పేర్కొన్నప్పటికీ అప్పటికే జర్మనీ మీద కోపంతో ఉన్న జనం వార్తలను నిజమే అని నమ్మారు. గ్లిజరీన్‌ వార్తకు ఎలాంటి ఆధారం లేదని 1925లో బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వం పేర్కొన్నది. అదే ఏడాది కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీ జాన్‌ చార్టరీస్‌ అమెరికాలో పర్యటించినపుడు తానే ఈ వార్త సృష్టికర్తనని వెల్లడించాడు. అతగాడు పూర్వాశ్రమంలో ఇంటిలిజెన్స్‌ అధిపతిగా పని చేశాడు.1917లో బ్రిటన్‌ గూఢచార సంస్థ ఎం17 వివిధ పత్రికల్లో స్పెషల్‌ కరస్పాండెంట్లుగా పని చేసేందుకు 13 మంది అధికారులు, 25 మంది కిరాయి రాతగాళ్లను నియమించింది. వారిలో ఒకడు శవాల ఫ్యాక్టరీ కట్టుకధ గురించి అంగీకరించాడు.మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్‌ అనుసరించిన ఎత్తుగడలను తరువాత జర్మన్‌ నాజీ హిట్లర్‌ మరింతగా పెంచి నీవు నేర్పిన విద్య అన్నట్లుగా కట్టుకథలను ప్రచారంలో పెట్టించాడు. వాటికి మారు పేరుగా తన ప్రచారశాఖ మంత్రి గోబెల్స్‌ను ప్రపంచానికి అందించాడు.ఇప్పుడు గోబెల్స్‌ వారసులు తామరతంపరగా పెరిగారు.గత వంద సంవత్సరాలుగా మీడియా అబద్దాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి.


అభిప్రాయ సేకరణ సంస్థ గాలప్‌ తాజాగా విడుదల చేసిన జూలై మాస సర్వే ప్రకారం అమెరికాలో కేవలం పదకొండుశాతం మంది మాత్రమే టీవీ ఛానళ్ల వార్తలను నమ్ముతున్నారు.పత్రికలపై 16శాతం మందికి విశ్వాసం ఉంది.రెండవ ప్రపంచ యుద్దం, ఆ తరువాత అమెరికా జరిపిన యుద్దాల సందర్భంగా వాటిని సమర్ధించేందుకు అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన వివిధ దేశాల సంస్థలు వండి వార్చిన తప్పుడు వార్తలతో జనం విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కుహనా వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయుధాలతో పాటు అంతేశక్తి వంతంగా ప్రచారదాడులు సాగుతున్నాయి. సిఐఏ స్థాపక అధికారుల్లో ఒకడైన ఫ్రాంక్‌ విస్నర్‌ ఒక సందర్భంగా మీడియా ఒక సంగీత వాద్యం వంటిదని చెప్పాడు. ప్రపంచంలోని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాల్లో సంగీత దర్శకుల మాదిరి సిఐఏ అధికారులు, గాత్ర,వాయిద్యకారులుగా ఇతరులు చేరతారు. తప్పుడు వార్తలను వీనుల విందుగా, కనులపసందుగా రూపొందిస్తారు. ఇటీవల బిజెపి తమ భావజాలం ఉన్నవారిని ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున మీడియాలో ప్రవేశపెట్టింది. ప్రతి పార్టీ అలాంటి వారిని ప్రవేశపెట్టటం లేదా అప్పటికే ఉన్నవారిని తమకు అనుకూలంగా మార్చుకోవటం చేస్తున్నది. ఇలాంటి వారంతా తమ అజెండాలకు అనుగుణంగా పాఠకులు, వీక్షకులకు వినిపిస్తారు, చూపిస్తారు. అమాయకులను నిందితులుగా, నిందితులను అమాయకులుగా మార్చివేస్తారు. వీరికి పోలీసు, గూఢచార ఏజన్సీల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఎంపిక చేసుకున్నవారికి లీకులు అందిస్తారు. అందుకే ప్రస్తుతం ప్రపంచ మీడియాలో జర్నలిజానికి బదులు ప్రచారదాడి తిష్టవేసిందని అనేక మంది చెబుతున్నారు. ఇది యజమానులకు పెద్ద లాభసాటిగా ఉంది.


పాలకవర్గ దోపిడీ, సామ్రాజ్యవాద కాంక్ష, విస్తరణకు మీడియా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది. అమెరికా-స్పానిష్‌ యుద్దాలలో 1898లో క్యూబా, పోర్టోరికో, ఫిలిఫ్పీన్సును వలసలుగా చేసుకున్నపుడు అమెరికాను మీడియా సమర్ధించింది. దీన్ని అప్పుడే ఎల్లో జర్నలిజం అని పిలిచారు. అంతెందుకు జపాన్‌పై రెండు అణుబాంబులు వేసిన దుర్మార్గాన్ని కూడా అధికభాగం అమెరికన్‌ మీడియా సమర్ధించింది.యుద్దాన్ని ముగించేందుకు అణుబాంబులు వేయకతప్పలేదని పేర్కొన్నాయి. హిరోషిమా నాశనంలో రేడియోయాక్టివిటీ లేదు అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి మరీ రాసింది.అణుదాడితో ప్రమాదకరమైన అణుధార్మికత ఏర్పడదన్న మిలిటరీ అధికారిని ఉటంకించింది. వియత్నాంపై దాడి చేసేందుకు అమెరికా టోంకిన్‌ గల్ఫ్‌ దాడిని సాకుగా చూపింది. ఆ కట్టుకథకు మీడియా ఎంతో ప్రాచుర్యమిచ్చింది. 1980 దశకంలో నికరాగువాలో అమెరికా సిఐఏ ఏజంట్లు, కాంట్రా కిరాయి మూకలు చేసిన చిత్రహింసలు, హత్యలు, దుర్మార్గాలను శాండినిస్టా విప్లవకారులకు అంటగట్టి పత్రికలు ప్రచారం చేశాయి.1990 దశకంలో కువైట్‌పై ఇరాక్‌ దాడి చేసింది. అప్పుడు ఇరాకీ సైనికులు కువైట్‌ ఆసుపత్రుల్లో ఇంకుబేటర్లలో ఉన్న పిల్లలను కిందపడవేసి చంపారని అమెరికా పత్రికలు రాశాయి. ఇలాంటి కట్టుకథలను సాకుగా చూపి ఇరాక్‌ మీద అమెరికా దాడి చేసింది. తరువాత సద్దామ్‌ హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోగేసినట్లు ప్రచారం చేసి దురాక్రమణకు పూనుకోవటం సద్దామ్‌ను హత్యచేసిందీ తెలిసిందే. 2011లో లిబియాపై నాటో దాడిచేసినపుడు కూడా కట్టుకథలు రాశారు. మహిళలపై అత్యాచారాలు చేసేందుకు ఆ దేశ నేత గడాఫీ సైనికులకు వయగ్రా మాత్రలు ఇచ్చాడని రాశారు. సిరియాలో సిఐఏ మద్దతు ఉన్న సలాఫీ జీహాదీ తీవ్రవాదుల దుర్మార్గాలను ప్రభుత్వానికి ఆపాదించారు.ఈ తప్పుడు ప్రచారాన్ని పులిట్జర్‌ బహుమతి గ్రహీత జర్నలిస్టు సేమౌర్‌ హెర్ష్‌ బయట పెట్టినందుకు అమెరికన్‌ కార్పొరేట్‌ మీడియా అతని రచనలను ప్రచురించకుండా నిలిపివేసింది.


అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులను లక్ష్యంగా చేసుకొని క్యూబా, చైనా, రష్యాలు ఎలక్ట్రోమాగటిక్‌ తరంగాలతో దాడులు చేయటంతో వారందరికీ చెవుల్లో గింగుర్లు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినట్లు దీనికి హవానా సిండ్రోమ్‌ అనిపేరు పెట్టి పత్రికలు రాశాయి. ఇది ఒక మానసిక జబ్బు తప్ప మరొకటేమీ కాదని కొందరు నిపుణులు చెప్పారు.నిజానికి అలాంటి అవకాశమే ఉంటే అనేక దేశాల్లో ఉన్న అమెరికన్లందరి మీద ఆప్ఘనిస్తాన్‌ వంటి చోట్ల వాటిని ఇప్పటికే ప్రయోగించి ఉండేవారు. వర్తమానంలో ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఐరోపా మీడియా అల్లిన కట్టుకథలకు లెక్కే లేదు.వీడియో గేమ్‌లను రష్యా దాడులుగా చూపారు.


అమెరికన్‌ మీడియా అనేక దేశాల్లో జరిగిన పరిణామాలను కూడా వక్రీకరించింది.ఇరాన్‌లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వం 1953లో బ్రిటీష్‌, అమెరికన్‌ చమురు కంపెనీలను జాతీయం చేసినపుడు సిఐఏ తప్పుడు ్పచారాలు చేసింది. 1973లో చిలీ అధ్యక్షుడు, సోషలిస్టు నేత సాల్వడోర్‌ అలెండీపై జరిగిన కుట్ర, తిరుగుబాటు, హత్యను ప్రజాగ్రహంగా వక్రీకరించి రాశారు.2019లో బొలీవియాలో ఎన్నికైన వామపక్ష నేత ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర జరిగింది.దాన్ని సమర్ధించేందుకు ఎన్నికల్లో మొరేల్స్‌ రిగ్గింగుకు పాల్పడినట్లు పత్రికలు రాశాయి. ఇలాంటి ఎన్నో ఉదంతాలు తమను తప్పుదారి పట్టించిన కారణంగానే అమెరికన్లు మీడియాను విశ్వసించటం లేదన్నది వాస్తవం. అంతే కాదు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని కూడా నమ్మటం లేదని జూన్‌ నెల గాలప్‌ పోల్‌ పేర్కొన్నది. ఎల్లవేళలా ప్రభుత్వం చేస్తున్నది సరైనదే అని నమ్ముతున్నవారు కేవలం రెండుశాతమే,ఎక్కువసార్లు మంచే చేస్తున్నదని నమ్మేవారు 19శాతమే ఉన్నారు. పార్లమెంటు మీద ఏడు,న్యాయవ్యవస్థపై 14, అధ్యక్ష వ్యవస్థపై 23, సుప్రీం కోర్టుపై 25,కార్పొరేట్లపై 14, పెద్ద టెక్నాలజీ కంపెనీలపై 26, పోలీసులపై 45శాతాల చొప్పున విశ్వాసం వెల్లడించినట్లు మరొక గాలప్‌ పోల్‌ పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద మీడియా విశ్వసనీయ తగ్గుతున్నది.ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఎడెల్‌మాన్‌ బారోమీటర్‌ విశ్లేషణ ప్రకారం 46శాతం మంది జర్నలిస్టులను నమ్మటం లేదని చెప్పారు.2021 నవంబరు నెలలో 28 దేశాల్లో 36వేల మందితో జరిపిన సంభాషణల్లో ఇది వెల్లడైంది.సమాజాలు చీలిపోవటానికి ఒక వనరుగా మీడియా ఉందని 46శాతం మంది చెప్పారు. కుహనా వార్తలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నట్లు 75శాతం మంది చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఆరు రెట్లు అదనంగా కుహనా వార్తలు పుడుతున్నాయి.


మన దేశ మీడియాలో కొన్ని ఛానళ్లు సంచలన వార్తలకు పేరు మోసినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ డిజిటల్‌ న్యూస్‌ రిపోర్టు 2022 పేర్కొన్నది. దీని కోసం 2,035 మంది ఆంగ్ల పాఠకులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అందువలన ఇది మొత్తం అభిప్రాయంగా పరిగణించకూడదు. వారి అభిప్రాయాల ప్రకారం వార్తలను మొత్తం మీద నమ్ముతున్నట్లు చెప్పిన వారు మన దేశంలో 38శాతం మంది ఉన్నారు. సర్వే చేసిన 46 దేశాల్లో మనది 20వ స్థానంలో ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్తలను 75శాతం మంది, రేడియో 72, ది ప్రింట్‌ 61, రిపబ్లిక్‌ టీవి 57, ది వైర్‌ను 57శాతం మంది నమ్ముతున్నారు. వార్తల కోసం తాము ఆన్‌లైన్‌ మీడియా మీద ఆధారపడుతున్నట్లు 84శాతం మంది చెప్పగా ప్రింట్‌ మీడియా మీద 49, టీవీల మీద 59శాతం మంది ఆధారపడుతున్నట్లు వెల్లడించారు.టీవీ ఛానల్స్‌లో బహుళ ఆదరణ పొందినవిగా ఎన్‌డిటివీ, ఇండియా టుడే, బిబిసి ఉండగా పత్రికల్లో టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, హిందూస్తాన్‌ టైమ్స్‌, హిందూ ఉన్నాయి. వార్తల కోసం యుట్యూబ్‌ చూస్తామని 53శాతం, వాట్సాప్‌ చూస్తామని 51శాతం చెప్పారు. క్లుప్తంగా కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.కేవలం 36శాతం మందే మీడియా మీద రాజకీయ ప్రభావం లేదని, 35శాతం మంది కార్పొరేట్ల ప్రభావం లేదని భావిస్తున్నారు. అమెరికాలో 30శాతం మంది వార్తల కోసం యాప్స్‌ మీద ఆధారపడుతుండగా భారత్‌లో 82శాతం ఉన్నారు.ఫేస్‌బుక్‌ను నమ్మేవారు 29-65శాతాలుగా ఉన్నారు. వర్గాల వారీ చీలికలు తెస్తున్న వాటిలో రిపబ్లిక్‌ టీవీ, జి న్యూస్‌ ముందున్నాయి. రిపబ్లిక్‌ టీవిని బిజెపి మద్దతుదార్లు 85శాతం మంది ఇతరులు 50శాతం నమ్ముతున్నారు, జి న్యూస్‌ను 85శాతం బిజెపి, 63శాతం ఇతరులు నమ్ముతున్నారు. మొత్తం మీద ఎన్‌డిటివీని 75శాతం మంది బిజెపి మద్దతుదార్లు, ఇతరులు 81శాతం మంది నమ్ముతున్నారు.


మనుషుల మధ్య సంబంధాలను కలిపేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దోహదం చేసిందో అదే మానవులు అలవోకగా అబద్దాలు ఆడేందుకు,ప్రచారం, మోసం చేసేందుకు సైతం అవకాశం ఇచ్చిందన్నది కాదనలేని సత్యం. రాను రాను పత్రికలు, టీవీ ఛానళ్లతో కూడిన మీడియా మీద రానురాను జనాల్లో విశ్వాసం తగ్గుతున్నది. ప్రత్నామ్నాయంగా ముందుకు వచ్చిన సామాజిక మాధ్యమం కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది. సంప్రదాయ మీడియా స్పందించినా లేకున్నా ప్రశ్నించేందుకు ఒక చిరునామా ఉంటుంది. సామాజిక మాధ్యమానికి అది కనిపించదు, పట్టుకోవటం సామాన్యులకు చాలా కష్టం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం : మీడియా ద్వంద్వ ప్రమాణాలు, జనంపై ప్రచారదాడి !

06 Sunday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 2 Comments

Tags

media bias, Media Double standards, Media Hypocrisy, Ukraine war, Ukraine-Russia crisis



ఎం కోటేశ్వరరావు


రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే మన దేశంతో సహా అన్ని చోట్లా అది కనిపిస్తోంది. ధరలు పెరుగుతున్నాయి, చమురు పిడుగు ఏక్షణంలో పడుతుందో తెలియదు. తమ దగ్గర చిక్కుకు పోయిన లేదా ఉక్రెయిన్‌ బందీలుగా చేసిన భారత్‌, ఇతర దేశాల విద్యార్ధుల భవిష్యత్‌ గురించి తలిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. సకాలంలో కేంద్ర ప్రభుత్వం మేలుకొని ఉంటే ఈ పరిస్ధితి ఉండేది కాదు. ఇక ఈ ఈ యుద్ధం గురించి మీడియా తీరు తెన్నులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.


ప్రపంచ చట్టాలను, భద్రతా మండలి తీర్మానాన్ని లెక్క చేయటం లేదంటూ రష్యాను దోషిగా చూపుతూ ప్రచారం జరుగుతోంది.1995లో తొలిసారిగా నాటో కూటమి యుగ్లోసావియా మీద మార్చినెల 24 నుంచి జూన్‌ పది వరకు 78 రోజుల పాటు వైమానిక దాడులు జరిపింది. దీనికి భద్రతా మండలి అనుమతి లేదు. అప్పుడు దాడికి దిగిన ” ఐరోపా అపర ప్రజాస్వామిక దేశాలు ”, వాటికి మద్దతు పలికిన మీడియాకు అంతర్జాతీయ చట్టాలు, ప్రజాస్వామిక సూత్రాలు గుర్తుకు రాలేదు. కొసావోలో ఉన్న పరిస్ధితులు ప్రాంతీయ స్ధిరత్వానికి ముప్పు వచ్చిందని నాటో సమర్ధించుకుంది. దానికి మీడియా తాన తందానా అంది. అదే నిజమైతే ఇప్పటి మాదిరి ఐరాసలో ఎందుకు చర్చించలేదు? ఇప్పుడు ఉక్రెయినుకు నాటో సభ్యత్వం ఇచ్చే చర్యలు తన భద్రతకు, ప్రాంత దేశాలకు ముప్పు అని ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న రష్యా అభ్యంతరాలను ఎందుకు పట్టించుకోలేదు ? ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌బాస్‌ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న రష్యన్‌ భాష మాట్లాడేవారిపై కిరాయి ఫాసిస్టు మూకలు, మిలిటరీ జరిపిన దాడులతో పదిహేను వేల మంది మరణించటం, ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్దం, జర్మనీ, ఫ్రాన్స్‌ కుదిర్చిన రెండవ మిన్‌స్క్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఉక్రెయిన్‌ ప్రభుత్వ తీరుతెన్నులు ఆ ప్రాంతంలో అస్ధిరతకు దారి తీయవా ? నాటో ఎందుకు పట్టించుకోలేదు ?


పశ్చిమ దేశాలు ఇరాక్‌, లిబియా, సిరియా, ఎమెన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలపై దాడులు జరిపాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యాదాడులు జరుపుతోంది. రెండు ఉదంతాలపై మీడియా స్పందించిన తీరేమిటి ? సిబిఎస్‌ అనే అమెరికా మీడియా కీవ్‌ నగర విలేకరి చార్లీ డి అగటా చెప్పిన వార్తలో ” ఈ ప్రాంతం దశాబ్దాల తరబడి విబేధాలు చెలరేగుతున్న ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటిది కాదు, ఇది వాటితో పోలిస్తే నాగరికమైన ప్రాంతం, ఐరోపాకు చెందినది, ఈ నగరంలో యుద్దం జరుగుతుందని మీరు ఊహించలేరు..” అన్నాడు. అంటే పైన పేర్కొన్న ప్రాంతాలు అనాగరికమైనవన్న శ్వేతజాతి జాత్యహంకారం తప్ప ఆ మాటల్లో మరేమైనా ఉందా ? అమెరికా, ఐరోపా వంటి నాగరిక దేశాలు అనాగరికంగా ఇతర దేశాల మీద దాడులకు దిగటం ఏమిటి ? పశ్చిమ దేశాల్లోని జనాలు అడవుల్లో ఉంటూ సరిగా బట్టలు కట్టుకోవటం కూడా రాని కాలంలోనే ఇరాక్‌ వంటి దేశాలు నాగరికతను కలిగి ఉన్నాయి. అనేక గణిత, సైన్సు అంశాలను బోధించాయి.


మరో అమెరికా మీడియా ఎన్‌బిఎస్‌ విలేకరి హాలీ కోబిలే ఒక మహిళ అనికూడా మరచి మరింత దారుణంగా మాట్లాడింది.” మొహమాటం లేకుండా చెప్పాలంటే వీరు సిరియా నుంచి వచ్చిన నిర్వాసితులు కాదు, ఉక్రెయిన్‌ వారు. వారు క్రైస్తవులు, వారు తెల్లవారు, మన మాదిరే ఉంటారు.” అంటే సిరియన్లు, ఇతరులు ఏమైనా వారికి ఫరవాలేదన్నమాట. బిబిసిలో ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ ” నీలి కళ్లు, తెలుపు-రాగి రంగు జుట్టు కల ఐరోపా వారిని చంపుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను” అన్నాడు. మరొక యాంకర్‌ పీటర్‌ డోబీ మాట్లాడుతూ ” వారి దుస్తులను చూస్తుంటే వారంతా ధనికులు, మధ్యతరగతి వారిలా ఉన్నారు తప్ప మధ్య ప్రాచ్యం, లేదా ఉత్తరాఫ్రికా నుంచి పారిపోతున్న కాందిశీకుల్లా మాత్రం లేరు. మీ పక్కింటి యురోపియన్‌ వారిలానే ఉన్నారు. ” పశ్చిమాసియా,ఆఫ్రికా, ఆసియా ఖండాలలో జరిగిన యుద్ధాలకు పాల్పడిందీ, ప్రపంచాన్ని ఆక్రమించింది ఐరోపా సామ్రాజ్యవాదులే కదా !


బ్రిటన్‌ టెలిగ్రాఫ్‌ పత్రిక జర్నలిస్టు డేనియన్‌ హానన్‌ ఉక్రెయిన్‌ పరిస్ధితిని చూసి దిగ్భ్రాంతి చెందాడట. ఎందుకటా అది ఐరోపా దేశమట. నిజమే రెండు ప్రపంచ యుద్దాలను ప్రారంభించిందీ, అంతకు ముందు ఐరోపాలో, అమెరికాలో కొట్టుకు చచ్చిందీ, యుద్దాలకు పాల్పడిందీ, ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకున్నదీ ” ఐరోపా నాగరికులే ” అని మర్చిపోతే ఎలా, అందుకే తమ కింత ఉన్న పెద్ద మచ్చను ఒకసారి చూసుకోమని చెప్పాల్సి వస్తోంది. ఐదు లక్షల మంది ఉక్రెయినియన్లు నిర్వాసితులుగా మారటం, ఇతర దేశాలకు పోవటం దురదృష్టకరమని ఐరాస అధికారి ఫిలిప్పో వాపోయారు. 1948 నుంచి తమ మాతృదేశం నుంచి వెళ్ల గొట్టిన కారణంగా ఏడున్నరలక్షల మందితో ప్రారంభమై ప్రస్తుతం 56లక్షలకు చేరిన పాలస్తీనియన్లు అప్పటి నుంచి పరాయి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కాందిశీకుల శిబిరాల్లోనే పుట్టి కాందిశీకులుగా అక్కడే మరణించిన వారే కొన్ని లక్షల మంది ఉన్నారు. పిల్లలకు దాడుల భయం తప్ప మరొకటి తెలియదు. వారి గురించి నాగరికులకు పట్టదు, దానికి కారణమైన ఇజ్రాయల్‌కు మద్దతు ఇస్తున్నారు.2019 నాటికి 7.95 కోట్ల మంది ప్రపంచంలో నిరాశ్రయులు కాగా వారిలో 2.04 కోట్ల మంది 18 ఏండ్ల లోపువారున్నారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులెవరు అంటే 99శాతం ఐరోపా, అమెరికా అనాగరికులే.


ఉక్రెయిన్లో రష్యన్‌ సైన్యాన్ని వ్యతిరేకిస్తున్న వారి గురించి కథ కథలుగా చెబుతున్న పశ్చిమ దేశాల మీడియా ఎన్నడైనా పాలస్తీనియన్లు, వియత్నాం తదితర చోట్ల సామాన్యులు చూపిన తెగువ, అమెరికన్లను మూడు చెరువుల నీళ్లు తాగించి సలాం కొట్టించిన ఉదంతాలను ఎప్పుడైనా చెప్పిందా ? అంతెందుకు, మమ్మల్ని ప్రాణాలతో వెళ్లి పోనివ్వండ్రాబాబూ అని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని అమెరికన్లు పారిపోకముందు వరకు వారిని అణచివేశామనే కట్టుకథలనే ప్రపంచానికి వినిపించిన సంగతి మరచిపోగలమా ! ఉక్రెయిన్లో బాంబులు తయారు చేసి ఉపయోగించి చూపటాన్ని దేశభక్తిగా చూపుతున్న మీడియా పాలస్తీనాలో అదే పని చేస్తున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచివేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇలా ద్వంద్వ ప్రమాణాలు, మోసకారితనం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్లు అమెరికా సిఎన్‌ఎన్‌ విలేకరి బెర్నీ గోరెస్‌ను ఉరితీసి చంపారని గతంలో ప్రపంచాన్ని నమ్మించారు. ఇప్పుడు అదే బెర్నీ ఉక్రెయిన్లో దర్శనమిచ్చి పిట్ట, కట్టుకథలను రాసి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాడు. ఐరోపా యూనియన్నుంచి బ్రిటన్‌ విడిపోవటానికి ప్రణాళికను రూపొందించాడన్న పేరు తెచ్చుకున్న ” నాగరిక ” నిగెల్‌ ఫారాజి గతంలో బ్రిటన్‌ నుంచి పోలిష్‌ జాతివారిని బయటకు పంపాలని కోరాడు, ఇప్పుడు రష్యన్లను తరిమివేయాలని చెబుతున్నాడు.


గత ఏడు సంవత్సరాలుగా పశ్చిమ దేశాల తరఫున వకాల్తా పుచ్చుకొని ఎమెన్‌పై దాడులు చేస్తున్న సౌదీ అరేబియా, ఇతర దేశాల దాడుల్లో 80వేల మంది పిల్లలతో సహా ఐదు లక్షల మంది మరణిస్తే ఐరోపా మానవతావాదులు, వారికి మద్దతు ఇచ్చే మీడియాకు చీమకుట్టినట్లుగా లేదు. రష్యన్ల ఆస్తులను స్ధంభింపచేయాలని నిర్ణయించిన ” నాగరికులు ” సౌదీ అరేబియా, ఇతర దేశాల మీద అలాంటి చర్యలెందుకు తీసుకోలేదు, బ్రిటన్‌లో అది రెండు ఫుట్‌బాల్‌ క్లబ్బులను నడుపుతోంది. భద్రతా మండలిలో తటస్ధంగా ఉన్న యుఏయి బ్రిటన్‌లో అత్యంత ధనవంతమైన మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ భాగస్వామి, ఉక్రెయిన్‌పై బాంబు దాడులను నిరసిస్తూ సదరు క్లబ్బులో సభ నిర్వహించింది. దాని తటస్ధత ఎక్కడ ? రష్యన్లు ఉక్రెయిన్‌ తరువాత మిగతా దేశాలను కూడా ఆక్రమించుకుంటారు అని అమెరికా, ఐరోపా దేశాలన్నీ ఊదరగొడుతున్నాయి. ఐరాస తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనా ప్రాంతాలను గత ఏడు దశాబ్దాలుగా ఆక్రమించుకొని స్ధిరపడాలని చూస్తున్న ఇజ్రాయల్‌కు అవి తిరుగులేని మద్దతు ఇస్తున్నాయి. ఉక్రేనియన్లు తమ దేశం వెళ్లి పోరాడేందుకు అన్ని రకాల సాయం చేస్తామని బ్రిటీష్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. కానీ అదే బ్రిటన్‌ పశ్చిమాసియాకు చెందిన వారిని ఉగ్రవాదులుగా చిత్రించి జైళ్లలో పెట్టింది. ఫుట్‌బాల్‌ స్టేడియాల వద్ద పాలస్తీనా పతాకాలను ఎగురవేయటాన్ని బ్రిటన్‌ నిషేధించింది, ఎందుకంటే క్రీడలకు రాజకీయాలకు ముడి పెట్టకూడదని చెప్పింది, అదే ఇప్పుడు ఉక్రెయిన్‌ పతాకాలను ఎగురవేయిస్తున్నది.అమెరికాతో కలసి తనకు సంబంధం లేకపోయినా అనేక దేశాల మీద దాడులకు దిగిన బ్రిటన్‌ ఇప్పుడు రష్యాను చూపి గుండెలు బాదుకుంటోంది.


పశ్చిమ దేశాల మీడియా పోకడలను అమెరికాలోని అరబ్‌ మరియు మధ్యప్రాచ్యదేశాల జర్నలిస్టుల సంఘం ఒక ప్రకటనలో ఖండించింది. ఆ దేశాల దుష్టమనస్తత్వానికి వారి జర్నలిజం ప్రతీకగా ఉందని, మధ్యప్రాచ్యదేశాలలో విషాదాలు సర్వసాధారణమే అన్నట్లు చిత్రిస్తున్నదని పేర్కొన్నది.యుద్ద బాధితులు ఎవరైనా ఒకటేనని, అయితే మధ్యప్రాచ్యదేశాల బాధితుల పట్ల అమానుషత్వాన్ని ప్రదర్శిస్తున్నదని సంఘ అధ్యక్షురాలు హుదా ఉస్మాన్‌ విమర్శించారు. పశ్చిమ దేశాల జర్నలిస్టులు ఇతర దేశాల పట్ల అలవోకగా, సాదాసీదాగా వివక్షను వెల్లడించటం వృత్తికి తగనిపని అన్నారు.


ఇక మన మీడియా విషయానికి వస్తే ఒక మంచి రేటింగుల అవకాశాన్ని కోల్పోయినట్లుగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.రష్యా పట్ల మన దేశం తటస్ధవైఖరిని ప్రదర్శించటం దానికి ఒక కారణం. అయినప్పటికీ పశ్చిమ దేశాల మీడియా కథనాలను కొత్త పాకింగులో అందిస్తున్నది. భక్తి ప్రపత్తులతో తమ పని చేసిపెడుతున్నందున పశ్చిమ దేశాలు మాట్లాడటం లేదు. భారత మీడియా వివక్ష పూరితంగానూ, తప్పుదారి పట్టించే వార్తలను అందిస్తున్నదని రష్యా విమర్శించింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ వాస్తవ సమాచారాన్ని భారత పౌరులకు అందించాలని హితవు చెప్పింది. ఉక్రెయిన్లోని అణువిద్యుత్‌ కేంద్రాలు, చర్చల గురించి తప్పుడు సమాచారాన్ని భారత మీడియా అందించిదని విమర్శించింది. ” రష్యా దురాక్రమణ ” గురించి భారత మీడియా విమర్శించటం లేదెందుకంటూ బిబిసి ఒక కథనాన్ని రాసింది. యుద్దాన్ని ఆసరా చేసుకొని రేటింగులను పెంచుకొనేందుకు, తద్వారా సొమ్ము చేసుకొనేందుకు చూస్తున్న అత్యధిక పశ్చిమ దేశాల మీడియా సంస్ధలు ఇల్లు కాలుతుంటే చుట్టకాల్చుకొనే వారిని గుర్తుకు తెస్తున్నాయి.జనాలను కించపరుస్తున్నాయి, ఏకపక్ష వార్తలు, వ్యాఖ్యానాలతో తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ విషయంలో మన మీడియా కూడా తక్కువ తినటం లేదు. తప్పును తప్పని ఖండించలేని నరేంద్రమోడీ సర్కారు మాదిరి యుద్దానికి అసలు కారకులైన అమెరికా దాని నేతృత్వంలోని నాటో కూటమి కుట్రలు, ద్వరద్వ ప్రమాణాలను వెల్లడించటంలో మ్యావ్‌ మ్యావ్‌ మంటున్నాయి. జనం మీద జరిగే ప్రచారదాడికి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్ధలు అణ్వస్త్రాల క్షిపణుల మాదిరి ఉపయోగపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పత్రికా స్వేచ్చలో నరేంద్రమోడీ ర్యాంకు పతనం

14 Sunday May 2017

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

Free press, India press freedom, Indian media, media bias, press, press freedom, world press freedom day

ఎం కోటేశ్వరరావు

కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ప్రపంచ మీడియా స్వేచ్చలో మన దేశ ర్యాంకు అంతకు ముందున్న 140 స్ధానం నుంచి మెరుగు పడి 136కు వచ్చిందని ప్రకటించగానే అనేక మంది దానికి కారణం నరేంద్రమోడీయే అని అనేక మంది తమ జబ్బలను తామే చరుచుకున్నారు. మరుసటి ఏడాది 133కు పెరగటంతో ఆహా ఓహో అంటూ వీరంగం వేశారు. తాజాగా మే మొదటి వారంలో మన ర్యాంకు 136కు పతనం కావటంతో నరేంద్రమోడీకేమీ సంబంధం లేనట్లు, అది పెద్ద వార్త కానట్లుగా దాదాపు విస్మరించారు. రాజుగారి విజయాలను స్తుతించటానికే వంది మాగధులు తప్ప పరాజయాలకు వుండరన్న విషయం తెలిసిందే.

ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి నేర్పింది మేమే అని చెప్పుకొనే బ్రిటన్‌, స్వేచ్చ అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే అనే అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చంకలు కొట్టుకొనే మన దేశం కూడా ఈ ఏడాది ర్యాంకులు, పాయింట్లలో దిగజారాయి. అనేక ఐరోపా దేశాల ర్యాంకులు కూడా పతనమయ్యాయి.అమెరికా 41 నుంచి 43కు, బ్రిటన్‌ 40 నుంచి 38కి పడిపోయింది. ‘మీడియా స్వేచ్చకు భద్రత లేకపోతే ఇతర స్వేచ్చలకు ఎలాంటి హామీ వుండదు అని భావించే వారికి ప్రజాస్వామిక వ్యవస్ధలుగా భావించే చోట పడిపోతున్న పాయింట్లు ఆందోళన కలిగిస్తున్నాయని, అధోముఖానికి మనల్ని తీసుకుపోతున్నాయని సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ (రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌-ఆర్‌ఎస్‌ఎఫ్‌) సెక్రటరీ జనరల్‌ క్రిస్టోఫీ డెలోయిర్‌ వ్యాఖ్యానించారు.

‘ప్రజాస్వామ్య క్షయంతో బలహీనపడిన జర్నలిజం’ అనే పేరుతో ఆర్‌ఎస్‌ఎఫ్‌ సంస్ధ 2017 నివేదికను విడుదల చేసింది. ప్రతి ఏటా మే మూడవ తేదీన ప్రపంచ పత్రికా పరిరక్షణ దినం సందర్భంగా అంతకు ముందు ఏప్రిల్‌ చివరిలో విడుదల చేసే ఈ నివేదికలలో అంతకు ముందు సంవత్సరాలలో జరిగిన పరిణామాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అందువలన 2017 ర్యాంకు అంటే 2016 పరిస్ధితికి అద్దం పడుతుంది. ఈ రీత్యా చూసినపుడు 2002,03,04 సంవత్సరాలలో బిజెపి ఏలుబడిలో మన ర్యాంకులు వరుసగా 80,128,120గా వున్నాయి. తరువాత 2005-2012 మధ్య 106-131 మధ్య కదలాడి 2013,14లో మాత్రం 140కి పతనమైంది. 2015లో 136కు పెరిగి, 133కు పెరిగి, తిరిగి ఈ ఏడాది 136కు పతనమైంది. అందువలన ప్రతి ఒక్కరూ గతాన్ని ఒక్కసారి నెమరువేసుకోవటం అవసరం.

ఈ నివేదికను రూపొంచిన ఆర్‌ఎస్‌ఎఫ్‌ ‘అటువంటి జాతీయ వాదులు జాతీయ వ్యతిరేకమైన వనే పేరుతో వ్యక్తమౌతున్న అభిప్రాయాలన్నింటినీ జాతీయ చర్చ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని’ పేర్కొన్నది. ఇక్కడ వారిని హిందూ జాతీయ వాదులు అని వర్ణించింది. హిందుస్తాన్‌ టైమ్స్‌ అసోసియేటెడ్‌ ఎడిటర్‌ జతిన్‌ గాంధీ ఈస్ట్రన్‌ ఐ అనే పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ‘ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) నుంచి హింసాకాండ బెదిరింపులు చిత్రంగా వుంటాయి. వాటిని టిటర్‌ ఇతర సామాజిక మీడియా వేదికల నుంచి పంపుతారు. బిజెపి అధికారానికి వచ్చిన తరువాత చాలా ఎక్కువగా పెరిగాయి. తాము జీర్ణించుకోలేని గుర్తించిన వార్తలు రాసినందుకు లేదా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి భూతాల వంటి మరుగుజ్జు సేనలు(ట్రోల్స్‌) వున్నాయి. ఆ పని చేసినందుకు కొందరికి డబ్బు చెల్లిస్తారు. మరి కొందరు వారి భావజాలంతో ప్రభావితమై చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొద్ది రోజులైనా జర్నలిస్టుల జీవితాలను దుఖ:పూరితం చేస్తారు. అంతకు ముందు ప్రభుత్వ హయాంలో వారు లేరని నేను చెప్పలేను, అయితే మితవాద హిందూ మతశక్తులు అధికారంలో వున్న పార్టీ మద్దతు పొందారు. కాబట్టే వారు అధికారంలో వున్న వారు తమకు మద్దతు ఇస్తున్నారనే ధైర్యం తెచ్చుకున్నారు.’ అన్నారు.

ఒకవైపు భూతాల మరుగుజ్జుసేనలను నిర్వహించే ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడైన నరేంద్రమోడీ మరోవెపు ప్రధానిగా ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినం సందర్బంగా విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.’ఈ రోజు మరియు కాలంలో సామాజిక మీడియా ఒక చురుకైన మాధ్యమంగా ముందుకు వచ్చి పని చేస్తోంది.పత్రికా స్వేచ్చకు మరింత పరిపుష్టిని చేకూర్చింది. ప్రపంచ పత్రికా స్వేచ్చ దినం సందర్భంగా ఎలాంటి వూగిసలాటలు లేని మద్దతును పునరుద్ఘాటిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి అత్యవసరం’ అని పేర్కొన్నారు.

నివేదిక వివరాల ప్రకారం ఒక ఏడాది కాలంలో ఏ దేశాలలో అయితే మీడియా పరిస్ధితి మెరుగు లేదా మొత్తం మీద మెరుగ్గా వుంది అన్న తరగతి దేశాలలో 2.3 శాతం పడిపోయింది.ఈ సంస్ధ పరిగణనలోకి తీసుకున్న 180 దేశాలలో కెనడా, పోలాండ్‌, న్యూజిలాండ్‌, నమీబియా వరుసగా 4,7,8,7 పాయింట్ల చొప్పున గతేడాది కంటే పతనమయ్యాయి.వుత్తర ఐరోపా, వుత్తర అట్లాంటిక్‌ ప్రాంతంలో వుండి నార్డిక్‌ లేదా స్కాండినేవియా దేశాలుగా పిలువబడేవి మీడియా స్వేచ్చలో ప్రధమ స్ధానాలలో వుంటున్నాయి. చివరికి అలాంటి చోట్ల కూడా స్వేచ్చకు భంగం వాటిల్లి కొన్ని పాయింట్లు పతనమయ్యాయి.గత ఆరు సంవత్సరాలలో ఫిన్లండ్‌ తన ప్రధమ స్ధానాన్ని తొలిసారిగా కోల్పోయింది, నెదర్లాండ్స్‌ రెండు పాయింట్లు పతనమైంది.

ఈ నివేదికను చూస్తే నరేంద్రమోడీని అభిమానించే వారు ఆశాభంగానికి గురిగాక తప్పదు. ఎందుకంటే వారికి వారికి పాకిస్ధాన్‌ జపం చేయకుండా రోజు గడవదు. పత్రికా స్వేచ్చ విషయంలో గత మూడు సంవత్సరాలలో తన స్దానాన్ని అదెంతో మెరుగుపరుచుకుంది. ఏకంగా 159 నుంచి 139కు పెంచుకొని మనకంటే రెండు దేశాల దిగువనే వుంది. ఆర్‌ఎస్‌ఎఫ్‌ను పాకిస్ధాన్‌ పాలకులు మేనేజ్‌ చేశారేమో అని ఎవరైనా అనే ప్రమాదం లేకపోలేదు. అది నిజమే అనుకుంటే అంతర్జాతీయ మీడియాను కూడా మేనేజ్‌ చేయగల మన నరేంద్రమోడీ, చంద్రబాబు, వెంకయ్య వంటి వారు విఫలమైనట్లు అంగీకరించటమే.

ప్రపంచానికి ప్రజాస్వామ్యం నేర్పామని చెప్పుకొనే బ్రిటన్‌లో గతేడాది ఒక సిరియన్‌ జర్నలిస్టు పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. బ్రిటన్‌ చరిత్రలో పరిశోధనాత్మక జర్నలిజానికి సమాధి కట్టే నిఘా చట్టాన్ని అమోదించారు. అంతకంటే దారుణం ఏమంటే ఎవరైనా ఒక జర్నలిస్టును గూఢచర్య చట్టం కింద ఒక జర్నలిస్టు లీకు చేసిన సమాచారాన్ని సేకరిస్తే అతడు లేదా ఆమెకు 14 సంవత్సరాల జైలు శిక్షను విధించవచ్చు.ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై నియంతృత్వ చర్యలు అమలు జరపటమే బ్రిటన్‌ ర్యాంకు పతనానికి కారణమని లండన్‌ విశ్వవిద్యాలయ జర్నలిజం ప్రొఫెసర్‌ రాయ్‌ గ్రీన్‌ స్లేడ్‌ వ్యాఖ్యానించారు. ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలనే ప్రజాభిప్రాయ సేకరణ(బ్రెక్సిట్‌) సందర్భంగా మీడియాపై జరిగిన దూషణ భూషణలు, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు కూడా అక్కడి పత్రికా స్వేచ్చను దిగజార్చాయి.

విషపూరితమైన ప్రచారం, ఇతర రాజకీయ వతిళ్లు అనే శీర్షికతో అమెరికా గురించి నివేదికలో అక్కడి పరిణామాలను విశ్లేషించారు. భూమ్మీద అత్యంత నీతి నిజాయితీలు లేని వారెవరైనా వున్నారంటే జర్నలిస్టులే అని, మీడియా నకిలీ వార్తలను అందిస్తోందని స్వయంగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించిన అంశాన్ని ప్రస్తావించి, ట్రంప్‌ చేసిన ఈ దాడితో ప్రపంచ వ్యాపితంగా చివరికి ప్రజాస్వామిక దేశాలుగా పరిగణించబడేచోట్ల కూడా మీడియాపై దాడులు పెరిగాయని తెలిపింది. భావప్రకటనా స్వేచ్చను కాపాడే అమెరికా సంప్రదాయంతో ట్రంప్‌ యంత్రాంగం రాజీపడిందని కూడా పేర్కొన్నది.

ట్రంప్‌ తన తొలి వందరోజుల పాలనా ప్రదర్శన సందర్భంగా పెన్సిల్వేనియాలో మాట్లాడుతూ మీడియా నకిలీ వార్తలను అందిస్తోందని మరోసారి ఆరోపిస్తూ వార్తల పరీక్షలో మీడియా తప్పిందని అన్నాడు. అధ్యక్ష భవన మీడియా ప్రతి ఏటా ఇచ్చే వార్షిక విందును బహిష్కరించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్రకెక్కాడు.

ఇండియా స్వేచ్చ నివేదిక

ప్రపంచ మీడియా స్వేచ్చా దినం సందర్భంగా ఇండియా స్వేచ్చ నివేదిక పేరుతో సెవంతీ నైనన్‌, గీతా శేషు, శిల్పి గోయల్‌ విడుదల చేసిన నివేదిక హూట్‌ అనే వెబ్‌సైట్‌ ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. గత పదహారు నెలల కాలంలో పత్రికా స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్చ, ఆన్‌లైన్‌ స్వేచ్చ, వ్యక్తిగత స్వేచ్చ సమస్యల విషయానికి వస్తే ఇటీవల ఎన్నడూ లేని విధంగా మొత్తం మీద తగ్గుతున్న భావన కలుగుతోంది. కుంగి పోతున్న సమాచార, ఇంటర్నెట్‌, భావ ప్రకటనా స్వేచ్చ హక్కులు లేకుండా మీడియా నిజమైన స్వేచ్చతో వుండలేదు. నివేదిక కాలంలో దేశంలోని మీడియాలో ప్రచురితమై హుట్‌ వెబ్‌సైట్‌ సేకరించిన వివరాల ప్రకారం దేశవ్యాపితంగా 54 దాడులు జరిగాయి. వాస్తవంగా ఇంకా పెద్ద సంఖ్యలోనే దాడులు జరిగి వుంటాయి. ఎందుకంటే 2014-15లో జర్నలిస్టులపై 142 దాడులు జరిగినట్లు హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్‌ అహిర్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయితే వారి హత్యలకు జర్నలిజమే అనే సహేతుకమైన కారణం కేవలం ఒక్క కేసులోనే లభ్యమైంది. ప్రతి దాడి వెనుక వున్న కథనాలను చూస్తే ఒక స్పష్టమైన, స్ధిరనిశ్చయమైన పద్దతి కనిపిస్తోంది. అదేమంటే పరిశోధనాత్మక జర్నలిజం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. జర్నలిస్టులు ఎవరైనా ఏ కథనం కోసమైనా పరిశోధనకు పూనుకుంటే అది ఇసుక తవ్వకం, రాళ్ల గనులు, అక్రమ నిర్మాణాలు, పోలీసు దౌర్జన్యాలు, వైద్యపరమైన నిర్లక్ష్యం, దేని నుంచైనా తొలగించే ప్రయత్నం, ఎన్నికల ప్రచారం లేదా పౌరపాలనా యంత్రాంగ అవినీతి ఏదైనా దాడులకు గురవుతున్నారు.

క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతోందన్నది పక్కన పెడితే దానితో పోల్చుకుంటే కాస్త రక్షణ వుండే టివీ స్టూడియోలలో చర్చలునిర్వహించే లేదా సామాజిక మీడియాలో అభిప్రాయాలను వెల్లడించే వారు రకరకాల బెదిరింపులకు గురవుతున్నారు.ఈ వుదంతాల వెనుక వున్న వారిని చూస్తే రాజకీయవేత్తలు, నిఘా బృందాలు, పోలీసు మరియు భద్రతా దళాలు, లాయర్లు ( జెఎన్‌యు వుదంతం సందర్భంగా పాటియాల కోర్టు వుదంతమే గాక కేరళలో అనేక దాడులు చేశారు.) కొందరు బాలీవుడ్‌ హీరోలు, ఎక్కువగా అక్రమ వ్యాపారాలు, గనుల తవ్వకాలు సాగించే మాఫియాలు లేదా నేరగాళ్లు స్ధానిక రాజకీయ నేతలు, చట్టాన్ని అమలు చేసే సంస్ధల ఎరుకలోనే దాడులకు పాల్పడుతున్నారు. దాడులకు పాల్పడుతున్నవారెవరో స్పష్టంగా తెలిసినప్పటికీ వారు స్వేచ్చగా తిరుగుతున్నారు. హూట్‌ దగ్గర వున్న సమాచారం ప్రకారం దాడులలో చట్టాలను చేసే వారు, అమలు చేసే వారే ప్రధాన నిందితులుగా వున్నట్లు వెల్లడి అవుతోంది.

54 దాడుల వివరాలు

దాడులకు పాల్పడిన వారు సంఘటనలు

మాదకద్రవ్య స్మగ్లర్లు 1

సినిమా నటులు, సిబ్బంది 2

ఎబివిబి సభ్యులు 3

అక్రమ నిర్మాణదారులు 3

నిర్ధారణ కాని వుద్ధేశాలు 3

లిక్కర్‌ మాఫియా 2

గుజరాత్‌ దాడుల నేరగాడు సురేష్‌ 3

పోలీసులు 9

అవినీతి అధికారులు 2

రాజకీయనేతలు, మద్దతుదారులు 8

లాయర్లు 4

గోరక్షకులు 1

సైన్యం, పారామిలిటరీ 2

ఇసుక మాఫియా 1

వైద్యులు 1

మీడియా వార్తలను నిరసించిన వారు 9

విద్యార్ధులు 2

అక్రమ గనుల తవ్వకదారులు 1

జర్నలిస్టులను బెదిరించిన 25 వుదంతాలకు బాధ్యులు

రాజకీయనేతలు, సభ్యులు 6

మైనింగ్‌ మాఫియా 2

మిలిటెంట్స్‌ 1

పోలీసు 4

నిఘాబృందాలు 2

ట్విటర్‌ ట్రోల్స్‌ 5

ఎబివిపి 1

లాయర్లు 3

ఆధార్‌ 1

ప్రభుత్వం వివిధ స్థాయిలలో సెన్సార్‌షిప్‌ను అమలు జరిపే యత్నాలు చేస్తోంది, అదే మాదిరి ప్రయివేటు రంగ మీడియా యజమానులు కూడా చేస్తున్నారు. ఈ సమీక్షా కాలంలో మీడియా సెన్సార్‌షిప్‌, వార్తలను తొక్కిపెట్టటం, మరియు స్వయం నియంత్రణకు సంబంధించి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపించే వుదంతాలను చూద్దాం. 2016 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాపుల ఆందోళనకు సంబంధించిన వార్తలను చూపిన తీరు తెన్నులపై సాక్షి మరియు నం 1 న్యూస్‌ ఛానల్స్‌ ప్రసారాలను కేబుల్‌ ఆపరేటర్లద్వారా నిలిపివేయించింది. మాజీ మంత్రి, కాపుల నాయకుడు ముద్రగడ పద్మనాభం తన డిమాండ్లకు మద్దతుగా నిరవధిక దీక్ష ప్రారంభించాడు, దాంతో కోస్తా ప్రాంతంలో వుద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఈ పరిణామాలను విస్తృతంగా చూపగా మిగతా ఛానల్స్‌ ఆచితూచి వ్యవహరించాయి. తరువాత ఆకస్మికంగా సాక్షి టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. తమ ఛానల్‌ ప్రసారాలను అడ్డుకున్నారని సాక్షి గ్రూపు పేర్కొన్నది.

బుర్హాన్‌ వనీ హత్య తరువాత కాశ్మీర్‌ మీడియా సెన్సార్‌షిప్‌ మరియు వేధింపులకు గురైంది. జూలై మాసంలో అక్కడి రెండు పెద్ద పత్రికల కార్యాలయాలపై దాడులు జరిగాయి, వాటి పత్రికలను స్వాధీనం చేసుకున్నారు, వారి ముద్రణా యంత్రాలను మూసివేశారు. ఆగస్టు నెలలో వివిధ ఆదిమ తెగల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ స్వతంత్ర జర్నలిస్టు నేహా దీక్షిత్‌, ఆమె పిల్లల అపహరణ గురించి ఆమెరాసిన వార్తను ప్రచురించిన అవుట్‌లుక్‌ పత్రిక ముద్రాపకుడు, సంపాదకులు అయిన ఇంద్రనీల్‌రాయ్‌, కృష్ణ ప్రసాద్‌లపై 2016 జూలై 29న క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.

అక్టోబరు నెలలో కేత్రస్ధాయిలో జరుగుతున్న సమాచారాన్ని ప్రచురించి కాశ్మీర్‌ రీడర్‌ పత్రికను నిషేధించి చివరికి మూడునెలల పాటు అమలు జరిపారు. రాజ్యం ఎందుకు తమ పట్ల అసహనంతో వ్యవహరించిందో దాని సంపాదకుడు తెలిపారు. పఠాన్‌కోట్‌ దాడి సందర్భంగా సైనిక చర్య వ్యూహాత్మక సమాచారాన్ని వెల్లడించిందనే పేరుతో నవంబరు నెలలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎన్‌డిటీవిపై ఒక రోజు నిషేధాన్ని విధించింది. సదరు ఛానల్‌ ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మంత్రిత్వశాఖ నిషేధాన్ని నిలిపివేసింది. డిసెంబరులో తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న జయలలిత మరణించినపుడు టీవీ ఛానల్స్‌ అ వార్తను సాయంత్రమే ప్రసారం చేయగా యాజమాన్యం ఏడుగంటలపాటు తొక్కి పెట్టింది.

పార్లమెంట్‌ సభ్యుడు, వాణిజ్యవేత్త అయిన రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తావన రెండు వ్యాసాలను వెనక్కు తీసుకోవాలని బెంగలూరు కోర్టు ఏకపక్షంగా ది వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ను ఆదేశించింది. ఇదెంతో ఆసక్తిని కలిగించింది, ఎందుకంటే ఆయన మద్దతు ఇచ్చే రాజకీయ సిద్ధాంతాలు, ఆయన స్వంతమైన మీడియా గురించి సంబంధాలను, లేదా మిలిటరీతో సంబంధాలు కలిగిన అతని వాణిజ్య ప్రయోజనాల గురించి, సాయుధ బలగాల కేంద్రంగా ఆయన బహిరంగ కార్యకలాపాల గురించి వెల్లడించిన తొలి వెబ్‌సైట్‌ అది కాదు.

ప్రపంచ వ్యాపితంగా 2016లో 102 మంది జర్నలిస్టుల హత్య

ప్రపంచ వ్యాపితంగా 2016లో కనీసం 102 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా వెల్లడించారు. ప్రపంచ మీడియా పరిరక్షణ దినం సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులను హత్య చేయటం ఏ మాత్రం అంగీకారం కాదని, ప్రపంచం వారికి రక్షణగా ముందుకు రావాలని కోరారు. శాంతి, న్యాయాలకు పత్రికా స్వేచ్చను పరిరక్షించుకోవాలని కోరారు. వాస్తవ, విమర్శనాత్మకమైన, సమగ్రంగా పరిశోధించిన జర్నలిజం కావాలని కోరారు. పౌర జర్నలిస్టులు జర్నలిజం సరిహద్దులను పున:నిర్ణయిస్తున్నారు, మీడియా జవాబుదారీతనం, విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోంది,ఆన్‌లైన్‌ మీడియాలో ప్రకటనల సమాచారం, సంపాదక సమాచారానికి గీతలు చెరిగి పోతున్నాయి, నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని యునెస్కో డైరెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన సమాచారానికి వనరుగా మాత్రమే గాక భిన్న గళాలకు వేదికగా వుండాలని, సహనం, చర్చలకు నూతన శక్తులను సమీకరించాలని కోరారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రెక్సిట్‌ : మీడియా వైఖరి ఏ పక్షం ?

09 Saturday Jul 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

BBC, brexit, brexit media, Media, media bias

Image result for brexit media bias

ఎం కోటేశ్వరరావు

   ఇటీవలి కాలంలో మీడియా పాత్ర గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి చోటా ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతోంది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ ఘటన, అదే మనిషి కుక్కను కరిస్తే సంచలన వార్త. అదే మాదిరి సాధారణ అర్ధంలో మీడియాకు చెప్పిన నిర్వచనం ప్రకారం వ్యవహరిస్తే అది సాధారణం అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అది చర్చ నీయాంశం అవుతుంది. వర్తమానంలో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవాలనే అంశంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ, అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో అక్కడి ప్రధాన రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీల తరఫున ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే అంశంలో ఆ రెండు పార్టీలలో పోటీ బడిన వారు పార్టీ సభ్యుల మధ్య జరిపిన ఓటింగ్‌ సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు, లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారంలో వున్న చోట ఆ ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా మీడియా వ్యవహరించటం తీవ్ర చర్చ నీయాంశం అయింది. ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ పరిణామాల గురించి చూద్దాం.

   న్యూ (కొత్తది) అనే ఏక వచన ఆంగ్ల పదానికి బహువచన రూపమే న్యూస్‌(కొత్తవి). సులభంగా చెప్పాలంటే తాజా కూరల గంప. దానిలో రకరకాల కాయలు, ఆకు కూరలు, మసాలాకు వుపయోగించే కరిపేపాకు, కొత్తి మీర వంటి వన్నీ గంప లేక బండిలో ఒకే దగ్గర వుంచి విక్రయించినట్లుగానూ న్యూస్‌ పేపర్లు, పుస్తకాలు, అవే ఎలక్ట్రానిక్‌ రూపంలో రేడియో,టీవీలు మొదలైనవి. కొంత మంది న్యూస్‌లో నాలుగు ఆంగ్ల అక్షరాలు నాలుగు దిక్కులను సూచించే పదాలలోని మొదటి అక్షరాలని అంటే నలుదిక్కులకు సంబంధించి సమాచారమని కూడా కొందరు వ్యాఖ్యానాలు చెప్పి వుండవచ్చు. అలా తీసుకున్నా దాని అర్ధంలో పెద్ద మార్పు వుండదు.

  సమస్య ఎక్కడ వస్తుందంటే నాలుగు దిక్కులకు చెందిన నూతన సమాచారాన్ని ఎలా అందించాలన్న దగ్గర వస్తోంది. మన దేశంలో స్వాతంత్య్రానికి ముందు పత్రికలు ప్రభుత్వానికి చెందిన నిర్ణయాలు, అభిప్రాయాలను, వైఖరులను మాత్రమే అందచేసేవి. అంటే ఆంగ్లేయుల పాలన కొనసాగింపు, ఆంగ్లేయుల కంపెనీల ప్రయోజనాలు, ప్రపంచ పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వ, పాలకుల వైఖరిని సమర్ధిస్తూ వార్తలు ఇచ్చేవి. అందుకే రాణిగారి పక్షం అని పిలిచేవారు. ఏకపక్షంగా వార్తలు ఇస్తూ, పాలనలోని లోపాలను, హాని కర విధానాలను విస్మరించటం పాఠకులలో విమర్శలకు కారణం కావటంలో కొన్ని పత్రికలు సున్నితంగా విమర్శలు చేసేవి. రాణిగారి విధానాలు మంచివే గానీ వాటి అమలులో అధికారుల లోపాల కారణంగా సమస్యలు అనే పద్దతిలో వార్తలు ఇస్తే అటు రాణీగారికి ఇబ్బంది లేదు ఇటు పాఠకులను కొంత మేరకు సంతృప్తి పరచవచ్చు. అలా ఇచ్చిన పత్రికలను రాణీగారి ప్రతిపక్షం అని పిలిచారు. ఈ రెండు రకాల పత్రికల ధోరణులకు భిన్నంగా అసలు ఆంగ్ల పాలన, జాతీయ, అంతర్జాతీయంగా బ్రిటన్‌ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేక వైఖరితో స్వాతంత్ర పోరాటానికి అనుకూలంగా వార్తలు ఇచ్చిన పత్రికలు కూడా మన దేశంలో వునికిలోకి వచ్చాయి. ఇవి ఒక తరగతి, స్వాతంత్ర పోరాటంతో పాటు వచ్చే స్వాతంత్య్రం దేశంలోని 99 శాతం మంది ప్రయోజనాలకు అనుగుణంగా వుండాలనే వైఖరితో వార్తలు, వ్యాఖ్యానాలతో వెలువడే పత్రికలు కూడా వచ్చాయి. అందువలన మీడియా అనే సాధనాన్ని ఎవరికి అనుకూలంగా వుపయోగిస్తున్నారనే దానిని బట్టి స్థూలంగా చెప్పాలంటే రెండు రకాలు ప్రతి సందర్భంలోనూ వున్నట్లు మనం గమనించవచ్చు.ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ ప్రజాభిప్రాయం సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు తెన్నులను పరిశీలిద్దాం.

   ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. ఆ మేరకు జూన్‌ చివరి వారంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్‌లో 52శాతం బయటకు వెళ్లిపోవాలని, మిగిలిన వారు వుండిపోవాలని ఓటు చేశారు.ఈ ప్రక్రియను ఆంగ్లంలో పొట్టిగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. ఓటర్లు మొత్తం పాల్గొని వుండి వుంటే, మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే ఫలితం ఎలా వుండేదో చెప్పలేము. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి ఆలోచనల చేయకుండా మీడియా వార్తలను చూసి వ్యతిరేకంగా ఓటేశాము అని చెప్పిన వారు వున్నారు. తూచ్‌ మేము ఇలా అనుకోలేదు, తిరిగి ప్రజాభిప్రాయసేకరణ జరపండి అప్పుడు మేము సరైన నిర్ణయం తీసుకుంటామంటూ వ్యతిరేకంగా, అనుకూలంగా ఓటు చేసిన వారు, అసలు ఓటింగ్‌లో పాల్గొనని వారూ లక్షల మంది పార్లమెంట్‌కు నివేదించారు. బ్రిటన్‌ నిర్ణయం ప్రపంచాన్ని కుదిపివేసింది అంటే అతిశయోక్తి కాదు. అంతర్గతంగానే కాదు అంతర్జాతీయంగా కూడా లాభ నష్టాల పర్యవసానాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒక పెద్ద వుపద్రవం సంభవించినపుడు ఎవరికీ ఏమీ నిర్దిష్టంగా తెలియదు, ప్రతి ఒక్కరూ తోటి వారిని వూరడించేందుకో లేక తెలుసుకొనేందుకో, తనకు తెలిసినదానిని చెప్పేందుకో పడే మూక ఆతురత కనిపిస్తోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎవరైనా యువతీ యువకులు వెంటనే వివాహం చేసుకోవాలనుకుంటే ఏటిఎం ఏదైతేనేం తీసుకోవటానికి మిషన్‌లో డబ్బుందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు పక్కనే వున్న ఆంజనేయ స్వామి గుడి అయినా సరే అర్ధగంటలో ఆ తంతు పూర్తిచేస్తారు, అదే విడాకులు తీసుకోవాలంటే నిర్ణీత వ్యవధి అవసరం అలాగే నిబంధనావళిని పూర్తిగా పాటిస్తే ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది, ఇంకా సాగదీయాలనుకుంటే ఆ తరువాత ఎంత కాలం పడుతుందో తెలియదు. లేదూ ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి ఐరోపా యూనియన్‌లోనే కొనసాగాలని అనుకుంటే అదీ సంభవమే.

     బ్రిటన్‌లో ఎంత అవివేకులైన ఆధునికులు వున్నారో బ్రెక్సిట్‌ వెల్లడించిందని సత్యజిత్‌ దాస్‌ అనే ప్రవాస సంతతికి చెందిన బ్రిటీష్‌ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. మీడియా తమను తప్పుదారి పట్టించింది అని కొందరు మండి పడుతుంటే జనంలో వున్న వెధవాయత్వం గురించి కొందరు అదే మీడియాలో తప్పుడుతున్నారు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని చెప్పినట్లుగా మీడియా ఎలా అయినా సొమ్ము చేసుకుంటుందా ? ఒక వివాదం లేదా ఒక విధానం గురించి చర్చ, ఓటింగ్‌, నిర్ణయం జరిగే సందర్బాలలో మీడియా ఎలా వ్యవహరించాలి అన్నది మీడియా ప్రారంభం నుంచి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూనే వుంది.నిష్పక్షపాతంగా, మంచి చెడ్డలను తక్కెట్లో పెట్టి సమంగా తూచినట్లుగా వుండాలని ఎవరైనా కోరుకుంటారు. అలా జరుగుతోందా ?

    సాధారణంగా ఎన్నికలలో ఓడినవారు విచారపడితే గెలిచిన పక్షం విజయం జరుపుకుంటుంది. ఈ బ్రెక్సిట్‌లో అక్కడి టోరీ, లేబర్‌ పార్టీ రెండూ ఓడాయి, రెండూ గెలిచాయి. ఎందుకంటే ఓటింగ్‌ ఫలితం రెండు పార్టీల నాయకత్వాలలో అభిమానులలో చీలిక తెచ్చింది.ఐరోపా యూనియన్‌ శ్రామికుల, మధ్యతరగతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తోందన్న భావన నానాటికీ పెరుగుతోంది కనుక దానికి వ్యతిరేకంగా కొందరు, దీర్ఘకాలంగా దానిలో బ్రిటన్‌ సభ్యురాలిగా వుంది కనుక తమ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసిందని మరికొందరు, మిగతా దేశాలతో మనకు అనవసరం మన దేశం, మన పూర్వవైభం, మన పలుకుబడి, పెత్తనం అనే పెత్తందారీ జాతీయవాదం తలకెక్కించుకున్నవారు ఇలా వివిధ కారణాలతో ఓటు చేశారని చెబుతున్నారు. కొంతమంది చెప్పినట్లు ప్రపంచీకరణ, అక్కడి పాలకవర్గం అనుసరిస్తున్న పొదుపు చర్యలపై రెండు పార్టీల వెనుక వున్న సామాన్యుల ఆగ్రహం అందామా ? ఒక వేళ అదే సరైనది అనుకుంటే బ్రెక్సిట్‌ను మొత్తం మీద మీడియా అంతా బలపరిచింది అంటున్నారు కనుక మీడియా కూడా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మారిందా ? మీడియాను అదుపు చేస్తున్న కార్పొరేట్‌ శక్తులు మారుమనసు పుచ్చుకున్నాయా ? అన్న ప్రశ్నలకు సమాధానం కష్టం. ప్రపంచాధిపత్యంలో పోయిన బ్రిటన్‌ ప్రాభవాన్ని లేదా పెత్తనాన్ని పూర్తిగా పునరుద్దరించలేకపోయినా కనీసం తమ ప్రయోజనాలనైనా రక్షించుకోవాలనే బ్రిటన్‌ కార్పొరేట్‌ (ఆర్ధిక) జాతీయ వాదం వైపు మొగ్గేట్లు జనాన్ని మీడియా ఒకవైపుకు నెట్టిందా ? ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే వర్గ, ఆర్ధిక,విద్య, వయస్సు, నివాసం, జాతి మొదలైన అంశాలన్నీ పని చేసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆ లక్షణాలన్నీ దానిలో వున్నాయి. ఏది ఎక్కువ పని చేసింది ? ఇంకా లోతుగా అధ్యయనాలు వెలువడితే తప్ప నిర్ధారణకు రాలేము. సాంకేతికంగా ఈ ఓటింగ్‌కు ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగటానికి సంబంధం లేదు. ఓటు చేశారు కనుక వెంటనే వెళ్లి పోండి అని మిగతా సభ్య దేశాలు కోరాయి గనుక బ్రిటన్‌ వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. మేం విడిపోవాలనుకున్నాం అని చెప్పినంత మాత్రాన విడాకులు రావు, కోర్టులో తమ వినతిని దాఖలు చేయాలి. అలాగే ఐరోపా యూనియన్‌ నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 ప్రకారం తాము విడిపోయేందుకు క్రమాన్ని ప్రారంభించాలని బ్రిటన్‌ కోరినపుడే ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రధానిగా వున్న కామెరాన్‌ రాజీనామా ప్రకటించారు, కొత్త ప్రధాని ఎన్నికైన తరువాత ఆ క్రమాన్ని ప్రారంభంపై నిర్ణయంతీసుకుంటారని చెప్పారు. బ్రెక్సిట్‌లో మీడియా పాత్ర గురించి చూద్దాం.

   రెండు తెలుగు రాష్ట్రాలలోని పత్రికలు అసాధారణరీతిలో ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని పాఠకులకు అందించాయి.సామాన్య జనం కంటే మధ్యతరగతి, ధనికులు, కార్పొరేట్‌ శక్తులకు ఆసక్తికలిగించే అంశం నుక అంత ప్రాధాన్యత ఇచ్చాయని వేరే చెప్పనవసరం లేదు. బ్రిటన్‌ జాతీయ పత్రికలన్నీ దాదాపుగా బ్రెక్సిట్‌కు మద్దతు ఇచ్చాయి. అయితే కొన్ని పత్రికలు పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొలది తామూహించినట్లు జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత లేకపోవటాన్ని గమనించిగానీ లేదా తాము ప్రచారం చేసిన దానికి భిన్నంగా ఫలితం వస్తే తమ విస్వసనీయత దెబ్బతింటుందని భయపడి గానీ చివరి క్షణంలో వైఖరి మార్చుకున్నాయి. బ్రెక్సిట్‌కు అనుకూలంగా వ్యవహరించినవి కొన్ని అనుకూల రాగాలాపన చేశాయి. డేవిడ్‌ కామెరాన్‌, ఐరోపా అనుకూల శిబిరానికి దెబ్బ అంటూ తొలిపేజీలో ఒక పెద్ద వార్తను దాదాపు రెండు నెలల ముందుగానే ‘అబ్జర్వర్‌ ‘ ప్రచురించింది.నలభైమూడు శాతం విడిపోవటానికి, 39శాతం వుండిపోవటానికి అనుకూలంగా వున్నారని 18శాతం మంది నిర్ణయించుకోలేదని అది పేర్కొన్నది. నల్లడబ్బు అక్రమంగా దాచుకున్నవారి గురించి పనామా పత్రాలు వెల్లడి అయిన రోజు కూడా బ్రిటన్‌ పత్రికలు విడాకుల వార్తలకే ప్రాధాన్యత ఇచ్చాయి. జూన్‌ 23వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచీ ఐరోపాకు వస్తున్న వలస జనాభాకు, ఐరోపా యూనియన్‌కు లంకె పెట్టి వ్యాఖ్యాతలు, సంపాదకులు తమ రచనలను నింపివేశారు.త్వరలో వెల్లడి కానున్న బ్రిటన్‌కు వలస వచ్చిన వారి వివరాల సమాచారమంటూ నెల రోజుల ముందే డెయిలీ మెయిల్‌ తొలి పేజీలో డెయిలీ మెయిల్‌, సన్‌ పత్రికలు రెండవ పేజీలో వార్తలను ప్రచురించాయి. విడిపోవాలన్న వైఖరి తమకు ఒక పెద్ద విజయమని డెయిలీ మెయిల్‌ ముందే ప్రకటించుకుంది. బ్రెక్సిట్‌ తరువాత బ్రిటన్‌ వృద్ధి చెందుతుందని పేర్కొనటమే గాక, వేర్పాటుకు ఓటు వేయాలని కోరుతూ ఇంధనశాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్‌ రాసిన వ్యాసాన్ని కూడా అది ప్రచురించింది.అపరిమితంగా వస్తున్న వలసజనంతో ఇప్పటికే స్కూళ్లు, ఆసుపత్రులు, వుద్యోగాలు, ఇండ్లపై ఎంతో వత్తిడి పెరిగిందని ఆమె పేర్కొటాన్ని ఆ పత్రిక ప్రశంసించింది. పదమూడు లక్షల బ్రెక్సిట్‌ బాంబు పేలబోతున్నదని సన్‌ శీర్షిక పెట్టింది. తాను ప్రధానిగా వున్నానని, మనల్ని పరిపాలించాలనే విషయాన్ని కూడా మరచిపోయి డేవిడ్‌ కామెరాన్‌ మనల్ని ఐరోపా యూనియన్‌లో వుంచేందుకు పూర్తిగా నిమగ్నమయ్యారని సన్‌ సంపాదకీయం ఎత్తిపొడిచింది.

     అబ్జర్వర్‌ పత్రిక సర్వే ప్రకారం వేర్పాటు కోరుకొనేవారు నాలుగుశాతం మెజారిటీగా వున్నారని, పెద్ద వారి కంటే వారి కుటుంబాలలోని యువతరం ఐరోపా యూనియన్లో కొనసాగేందుకు ఎక్కువగా కట్టుబడి వుందని, వ్యతిరేకంగా ఎందుకు ఓటెయ్యాలో వారికి చెప్పండని డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ తన సంపాదకీయంలో పెద్దలకు సలహా ఇచ్చింది. ఈ వేసవిలో గ్రీసు నుంచి టర్కీకి వలస జనాన్ని తరలించే పధకం కనుక విఫలమైతే సంక్షోభం మరింత తీవ్ర అవుతుందని డెయిలీ టెలిగ్రాఫ్‌ పేర్కొన్నది. ఐరోపా యూనియన్‌ వ్యతిరేకి బోరిస్‌ జాన్సన్‌ రాసిన వ్యాసాలకు ఆ పత్రిక పెద్ద పీట వేసింది.’ ప్రతి సందర్భంలోనూ మనకు ఐరోపా యూనియన్‌ సమస్యగా మారుతోంది.మన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, ప్రభుత్వం చేసే సాయాలన్నింటికీ యూనియన్‌ అభ్యంతరం చెబుతోంది,చివరికి మన ఇంట్లో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవటాన్ని కూడా అది ప్రశ్నిస్తోంది, అర్ధమయ్యేట్లు చెప్పాలంటే మిగతా దేశాలతో సమంగా మన ఇంధన ఖర్చును తగ్గించుకోవటానికి కూడా అదే ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. వేలాది వుద్యోగాలకు ముప్పు వచ్చినప్పటికీ మనమేమీ చేయలేం, ప్రజాభిప్రాయ సేకరణ ప్రచారం ప్రారంభమైనపుడు కీలక సమస్య మన సార్వభౌమత్వం అని నేను చెప్పాను, జనం నా వైపు జాలి చూపులు చూడటం నాకు గుర్తు వస్తోంది, సార్వభౌమత్వం గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని వారు చెప్పారు.అని బోరిస్‌ జాన్సన్‌ రెచ్చగొట్టాడు. మీడియా మొఘల్‌గా పేరు తెచ్చుకున్న రూపర్ట్‌ మర్డోచ్‌ పత్రికలైన సన్‌, టైమ్స్‌ రెండు వైపుల నుంచి వెలువడిన వాదనలను ప్రముఖంగా ఇచ్చాయి, మొగ్గు మాత్రం విడిపోయేవైపే వుంది. గార్డియన్‌ పత్రిక మాత్రం బ్రెక్సిట్‌ను వ్యతిరేకించింది. పోలింగ్‌ దగ్గర పడుతున్న సమయంలో మెయిల్‌ పత్రిక ఆశ్చర్యకరంగా కొనసాగాలనే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది. బ్రిటన్‌ శాంతి, సంపదలను ఫణంగా పెట్టే సమయం కాదిది అని పేర్కొన్నది. ఏ లెక్కన చూసుకున్నప్పటికీ బ్రిటన్‌ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతే అధిక పన్నులు, ద్రవ్య మార్కెట్లలో గందరగోళం, అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ఐరోపా యూనియన్‌ వెలుపల బ్రిటన్‌ సిరిసంపదలను పొందుతుందని చెప్పేవారు ప్రమాదకరమైన భ్ర మను కలిగించేందుకు పూనుకున్నారని రెండు పేజీల పెద్ద సంపాదకీయం రాసింది. సండే టెలిగ్రాఫ్‌, సండే టైమ్స్‌ మాత్రం వ్యతిరేకంగా ముందుకు వచ్చాయి. తొలుత బ్రెక్సిట్‌కు అనుకూలంగా వున్న అబ్జర్వర్‌ పత్రిక కూడా చివరికి ‘ఎన్ని లోపాలు వున్నప్పటికీ ఐరోపా యూనియన్‌ మంచికే శక్తి నిస్తుందన్నదానిని ప్రశ్నించలేము’ అని పేర్కొన్నది. మొత్తం మీద మీడియా వ్యవహరించిన తీరు తొలి రోజుల్లో తటస్థంగా వున్నవారిని బ్రెక్సిట్‌ వైపు మొగ్గేట్లు చేసిన కారణంగానే ఫలితాలు అలా వెలువడ్డాయని చెప్పవచ్చు. ఒకసారి ఓటరు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత చివరి క్షణంలో మీడియా వైఖరిలో వచ్చిన మార్పు పెద్దగా ప్రభావితం చేయదని చెప్పవచ్చు.

    ప్రయివేటు మీడియా తీరుతెన్నులు ఒక ఎత్తయితే ప్రభుత్వ నిధులతో స్వతంత్రంగా నడుస్తుందని చెప్పబడే బిబిసి ఏ విధంగా వ్యవహరించిందనేది కూడా ఆసక్తి కలిగించే అంశమే. బ్రెక్సిట్‌ ప్రచారం, ఎన్నికల సందర్భంగా బిబిసి ‘పిరికిగా’ వ్యవహరించిందనే శీర్షికతో ఒక పత్రిక వ్యాఖ్యానించింది. మీడియా శైలిలో అతి పెద్ద సవాలును అది ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. రెండు వైపుల నుంచీ వినిపించే వాదనలకు సమ ప్రాధాన్యత ఇవ్వలేదని, మొత్తం మీద మొగ్గు ఐరోపాయూనియన్‌లోనే వుండి పోవాలనే వైఖరి వైపు వున్నదని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. బ్రిటన్‌ కార్పొరేట్‌ శక్తులలో వ్యతిరేక, అనుకూల వైఖరి వెల్లడైంది. విడిపోయి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తే ఎక్కువ లాభం అని భావించే వారు మెజారిటీగా వున్నప్పటికీ యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూసే వారు కూడా గణనీయంగా వున్నారు.ఈ శిబిరాలు చేసిన వాదనలతో జనం ఒక విధంగా గందరగోళపడ్డారంటే అతిశయోక్తి కాదు. ఐరోపా యూనియన్‌ ఏర్పాటు అన్నది అమెరికా, జపాన్‌ పోటీని ఐక్యంగా ఎదుర్కొనేందుకే అని చెప్పినప్పటికీ ఆక్రమంలో కార్పొరేట్ల లాభాలను కాపాడేందుకు పొదుపు చర్యల పేరుతో కార్మిక వ్యతిరేక వైఖరిని ఐరోపా యూనియన్‌ తీసుకున్నది. పర్యవసానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టటం, ఎత్తివేయటమో చేస్తున్నారు. దీంతో సహజంగానే ఆ విధానాలకు కార్మికవర్గంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ అసంతృప్తిని సొమ్ము చేసుకొని వారి పేరుతో తమ ప్రయోజనాలను సాధించుకొనేందుకు కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నించాయి. మీడియా వాటికి వంత పాడటం తప్ప కార్మికవర్గ ప్రయోజన కోణం నుంచి గతంలో ఆలోచించలేదు, బ్రెక్సిట్‌ సందర్భంగానూ అదే వైఖరిని అనుసరించింది.

గమనిక :ఈ వ్యాసం వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి జూలై నెల సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: