• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Media

చెంచా ఛానళ్లు – జర్నలిస్టు చెంచాలు !

12 Wednesday Feb 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Arvind Kejriwal, BJP, chamcha channels, chamcha Journalists, Delhi Polls, Media, NDTV anchor Ravish Kumar

Image result for chamcha channels-journalist chamcha cartoons
ఎం కోటేశ్వరరావు
ఇటీవలి కాలంలో మీడియా పాత్ర వివాదాస్పదం అవుతోంది, ఇదే సమయంలో మీడియా యాంకర్ల ప్రవర్తన కూడా అంతకంటే వివాదాస్పదం, కొన్ని సందర్భాలలో జుగుప్సాకరంగా తయారవుతోంది. రాజును మించిన రాజభక్తి మాదిరి యాజమాన్యాల వైఖరికి అనుగుణ్యంగా తాన్వొక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా వ్యవహరించటం ఒక పద్దతి. దాన్ని మించి యాంకర్లు స్వయంగా రెచ్చిపోవటం పెరిగిపోతోందంటే అతిశయోక్తి కాదు. ఇది జాతీయ ఛానళ్లకే కాదు, కొన్ని తెలుగు వాటికి కూడా ఈ జబ్బు అంటుకొని కొందరు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. తాజా ఉదంతాలకు వస్తే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కొందరు యాంకర్ల తీరు జర్నలిస్టు లోకానికే కళంకం, వృత్తి ప్రమాణాలు, నైతికనియమావళికే విరుద్దం. ఇలా చెబుతున్నామంటే అన్ని ఛానళ్లు, యాంకర్లు అందరూ అలా ఉన్నారని కాదు. పురుషుల్లో పుణ్యపురుషులుంటారయా అన్నట్లుగా ఛానళ్లు, యాంకర్లలో కూడా అలాంటి వారు ఉన్నారు కనుకనే మీడియాకు ఇప్పటికీ విశ్వసనీయత మిగిలి ఉంది.
జి న్యూస్‌ ఎడిటర్‌ మరియు యాంకర్‌గా పని చేస్తున్న సుధీర్‌ చౌదరి జిందాల్‌ కంపెనీని వంద కోట్ల రూపాయల ప్రకటనల కోసం బొగ్గుకుంభకోణంలో బ్లాక్‌మెయిల్‌ చేసిన ఉదంతం తెలిసిందే. ఆ కేసులో పోలీసు కస్టడీలో భాగంగా జైలుకు వెళ్లి వచ్చిన పెద్దమనిషి, పక్కా బిజెపి మనిషి అని అందరికీ తెలుసు. ఒక యాంకర్‌కు బిజెపి కార్యకర్తకు ఉన్న తేడాను చెరిపి వేశాడు. చివరికి బిజెపి కార్యకర్తలు లేదా నేతలు కూడా ప్రయివేటు సంభాషణల్లో ఏ అంశం గురించి అయినా ఎంత చెత్త మాట్లాడినప్పటికీ బహిరంగంగా అందునా టీవీ ఛానళ్లలో అలా మాట్లాడేందుకు సాహసించరు. కానీ యాంకర్‌ ముసుగులో అతగాడు అన్ని రకాల గీతలను చెరిపివేశాడు. హద్దులు మీరి వ్యవహరించాడు. అలాంటి వ్యక్తిని ఎడిటర్ల సంఘం ఏమి చేస్తుందో తెలియదు. ఒక వేళ ఏదైనా చర్యకు సాహసిస్తే సదరు సంఘం ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని భయపడుతుందేమో !
కునాల్‌ కమ్రా అనే ఒక కమెడియన్‌ ఒక రోజు తాను ప్రయాణిస్తున్న విమానంలో రిపబ్లిక్‌ టీవీ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామిని చూసి టీవీ చర్చల్లో ఎదుటి వారి మీద ఎందుకలా విరుచుకుపడతావు, అదేం పద్దతి అంటూ చెడామడా కడిగేశాడు. ఆర్నాబ్‌ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. అయితే సదరు విమాన పైలట్‌ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే కునాల్‌ను ఆ విమాన కంపెనీతో పాటు మరో మూడు సంస్ధలు తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. కునాల్‌ కమ్రా బిజెపిని విమర్శిస్తాడు , ఆర్నాబ్‌ గోస్వామి అడ్డగోలుగా సమర్ధిస్ధాడు కనుక కేంద్ర ప్రభుత్వ మౌఖిక లేదా ఇతర ఆదేశాలతో ఈ చర్య తీసుకున్న విషయం తెలిసిందే. సుధీర్‌ చౌధురి మీద కూడా ఎడిటర్ల సంఘం చర్య తీసుకుంటే మరో రూపంలో సంపాదకులు ఢిల్లీ పెద్దల ఆగ్రహానికి గురికావచ్చు.

Image result for chamcha channels-delhi polls
ఇక సుధీర్‌ చౌధురికి ఢిల్లీ జనం ఏడాది కాలంలో రెండు రకాలుగా కనిపించారు. ముందుగా గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జనం ఎలా కనిపించారో చూద్దాం ” ఈ రోజు మోడీ మద్దతుదారులు సంతోషంగా ఉండి ఉండాలి. మరోవైపు మోడీ వ్యతిరేకులు విచారిస్తూ ఉండి ఉంటారు. వ్యతిరేకించేవారి బుర్రల్లో తప్పుకుండా ఆ ఒక్క వాక్యం తప్పక ఉండాలి, నాకు నిజం చెప్పండి ఇది నిజం కాదా” అని వ్యాఖ్యానించిన పెద్ద మనిషి ఢిల్లీ జనం మోడీ మద్దతుదారుల్లో లేరని చెప్పలేదు.
కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నరేంద్రమోడీ అండ్‌కోకు దిమ్మదిరిగే విధంగా ఉండబోతున్నాయనే సూచనలు వెలువడగానే కల్లుతాగిన కోతిలా మారిపోయాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాడు. అవమానించాడు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం వాటి సారాంశం ఇలా ఉంది.” ఢిల్లీ ఓటర్లకు ఏ సమస్య పట్టింది, ఏది పట్టలేదు అని అతనే ప్రశ్న వేసుకున్నాడు. దానికి తానే సమాధానం చెప్పుకుంటూ వారు సొమ్ము చెల్లించి ఏదీ పొందాలనుకోవటం లేదు, అన్నీ ఉచితంగా ఇచ్చే పార్టీలను కోరుకుంటున్నారు. ఢిల్లీ జనం సోమరిపోతులు. వారి సగటు ఆదాయం రూ30,000 అయినా అన్నీ ఉచితంగా కావాలని కోరుకుంటారు. అందరూ చదువుకున్నారు, కార్లు, ద్విచక్రాలు ఎక్కువ మందికి ఉన్నాయి, అయినా ఓటింగ్‌కు రారు.సామాజిక మాధ్యమ ఎన్నికల్లోనే వారు పాల్గొంటారు.
ఢిల్లీ జనం కేవలం ఉచితం కోసమే చూస్తారు, ఇందుకోసం వారే మిగతా దేశం గురించి పట్టించుకోరు,హిందుస్ధాన్‌-పాకిస్ధాన్‌ పట్టదు, కాశ్మీర్‌ పట్టదు, రామమందిరాన్ని పట్టించుకోరు, ఇంకా ఏవైనా ఇతర జాతీయ సమస్యలున్నా వాటినీ లెక్కచేయరు. మొఘల్‌ పాలన తిరిగి వస్తుంది. రామమందిరం, ఆర్టికల్‌ 370, కాశ్మీర్‌ ఇవేవీ ఢిల్లీ జనం దృష్టిలో అర్ధం లేనివి, దేశం ముక్కలవుతున్నా వారికి పట్టదు. వారికి రోజూవారీ జీవితాలే ముఖ్యం. మిగతా దేశం ఏమైనా వారు లెక్కచేయరు. ఈ జాతీయ సమస్యలను టీవీలలో చూడటం, పత్రికల్లో చదవాల్సినవి తప్ప తమకు గొప్పవి కాదని ఢిల్లీ జనం చెబుతున్నారు. మనం ఎక్కడికైనా పార్టీకి పోతే తాగుతాము ఇలాంటి విషయాలను చర్చించుకుంటాము, అదే మనం ఓటు వేయటానికి పోతే మాత్రం మనకు ఉచితంగా ఏమి వస్తుందా అని చూస్తాము, తాము సోమరిపోతులమని ఢిల్లీ జనం రుజువు చేశారు.”
ఇక్కడ గమనించాల్సిందీ, సుధీర్‌ చౌధురి వంటి వారు కళ్లుండీ చూడలేనిదీ, చెవులుండీ వినిపించుకోనిదీ మెదడుండీ అర్ధం చేసుకోనిదీ ఏమంటే కాలేజీలకు వెళ్లే యువతులకు ఉచితంగా సైకిళ్లు, ఎలక్ట్రానిక్‌ స్కూటర్లను ఉచితంగా ఇస్తామని ఢిల్లీ బిజెపి ఎన్నికల మానిఫెస్టో పేర్కొన్నది. అంతే కాదు మోడీ సర్కార్‌ స్వయంగా ఉచితంగా మరుగుదొడ్లు, ఎల్‌ఇడి బల్బులు, గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు గత ఐదు సంవత్సరాలుగా ప్రచారం చేసుకుంటున్న విషయం మరిచిపోయినట్లు నటిస్తున్నాడా ?
ఇలాంటి జర్నలిస్టులు చర్చలను ఎలా నడుపుతారో వేరే చెప్పనవసరం లేదు. తమ తమ లేదా తమ రాజకీయ యజమానుల అజెండాలోకి ఇతరులను లాగేందుకు ప్రయత్నిస్తారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అదే జరిగింది. కేజరీ వాల్‌, ఆమ్‌ ఆద్మీపార్టీని బిజెపి వలలోకి లాగేందుకు ప్రయత్నించారు. జాతీయ రాజకీయాల గురించి వ్యాఖ్యానించాలని యాంకర్లు పదే పదే కోరగా తాను ఢిల్లీ అభివృద్ధికే కట్టుబడి ఉన్నానని ఆయన పదే పదే చెబుతూ చిరునవ్వు నవ్వారు.
ఈ ఎన్నికల్లో బిజెపి ప్రచారం మొత్తం నరేంద్రమోడీ చుట్టూ తిప్పింది. దాన్ని ఆమ్‌ ఆద్మీ ఒకే చిన్న ప్రశ్నతో ఎదుర్కొన్నది. మాకు కేజరీ వాల్‌ ఉన్నారు. మరి మీకు ఎవరున్నారు? మోడీ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి కాలేరు కదా, అవుతారా చెప్పండి అంటే ఎలాంటి సమాధానం లేదు. షాహిన్‌ బాగ్‌ నిరసనకారులు ఆ ప్రాంత జనాన్ని ఇబ్బంది పెడుతున్నారనే పేరుతో కేజరీవాల్‌ను ఇబ్బంది పెట్టేందుకు బిజెపి పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావించింది. తొలుత కేజరీవాల్‌ దానిని పట్టించుకోలేదు. బిజెపి ముప్పేటదాడికి దిగి ఆ పేరుతో ఓటర్లను విభజించి హిందూఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించింది. ఒక ఇంటర్వ్యూలో కేజరీవాల్‌ దానిని ఇలా తిప్పికొట్టారు. నిరసనతెలుపుతున్నవారిని తొలగించే బాధ్యత ఢిల్లీ పోలీసులకు లేదా ? కేంద్ర హౌం మంత్రికి వారు ఆ విషయాన్ని నివేదించలేదా ? అంతటి శక్తివంతుడైన హౌం మంత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది? అని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ఆధీనంలో ఉంటారు, శాంతి భద్రతల సమస్య బాధ్యత కేంద్రానిదే అన్న విషయం తెలిసినదే. కేజరీ వాల్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు మీడియా, బిజెపి నేతలు ప్రయత్నించారు. ఒక ఛానల్‌ యాంకర్‌ ఉన్నట్లుండి మీరు నిజంగా హనుమాన్‌ భక్తులే అయితే హనుమాన్‌ చాలీసా చదవగలరా అన్న సవాల్‌ విసిరారు. వెంటనే కేజరీవాల్‌ చదివి వినిపించారు. దాంతో యాంకర్‌తో పాటు బిజెపి కూడా కంగుతిన్నది.
యాంకర్లు నిర్వహిస్తున్న పాత్ర గురించి ఎన్‌డిటీవీ హిందీ యాంకర్‌, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ యాంకర్లు ప్రచారమనే సరకును చేరవేసే రోజూ కుర్రాళ్ల మాదిరి తయారయ్యారని వ్యాఖ్యానించారు. టీవీల్లో అజెండా, చర్చ ఎలా ఉండాలో ఒక చోట తయారవుతాయి, వాటిని యాంకర్లు సరఫరా చేస్తారు. న్యూస్‌ యాంకర్ల భాష పూర్తి హింసాపూరితంగా, బెదిరింపులతో ఉంటోంది, మీడియాలో ప్రతిపక్షానికి చోటు ఉండటం లేదు, ప్రతి రోజూ ప్రతిపక్షాన్ని మీడియా చంపివేస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని హతమార్చేందుకు ప్రధాన స్రవంతి మీడియా ఎంతో కష్టపడుతోంది. రాజీపడని జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వారిని సంస్దల నుంచి బయటకు గెంటివేస్తున్నారు, అయినా కొందరు జర్నలిస్టులు తెగించి పని చేస్తున్నారు అన్నారు.

Image result for chamcha channels-journalist chamcha cartoons
అనివార్యమై ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌సు అన్ని ప్రధాన ఛానళ్లు ప్రసారం చేశాయి.ఓటర్ల నాడిని ముందే పసిగట్టిన అనేక మంది ఎదురులేని మనిషి మోడీ ఎదురీదుతున్నారని, ఓటమి ఖాయమని ముందే పసిగట్టాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రచారానికి వెళ్లి వచ్చిన బిజెపి చోటా మోటా నాయకులు తమ పార్టీ ఓడిపోతున్నదనే సమాచారంతోనే తమ స్వస్ధలాలకు తిరిగి వచ్చారు. చిత్రం ఏమంటే ఫలితాలు వెలువడుతుండగా సాయంత్రం మూడు గంటల తరువాతనే తాము ఓటమిని అంగీకరిస్తామని, ఫలితాలు తమకు అనుకూలంగా మారతాయని ఆశాభావంతో టీవీ చర్చలలో వాదించటం గమనించాల్సిన అంశం. మొత్తం మీద ఢిల్లీ ఫలితాలు టీవీ ఛానళ్ల యాజమాన్యాలకు, రెచ్చిపోయి వ్యవహరించే యాంకర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇదే సమయంలో జర్నలిస్టు పాత్రలో సంయమనం పాటించాల్సిన వారు పార్టీ కార్యకర్తలుగా మారితే ఛానళ్లు ఎలా ప్రజావ్యతిరేకంగా మారతాయో, ఎలా నిందిస్తాయో చూపాయి. అయినా ఇంకా మీడియా పక్షపాతం చూపదని ఎవరైనా నమ్ముతుంటే చేయగలిగిందేమీ లేదు. దేనికైనా కొన్ని మినహాయింపులు, ఏటికి ఎదురీదే చేపలు ఎప్పుడూ ఉంటాయి. మీడియాలోనూ అలాంటి వున్నాయని, వాటిని రక్షించుకోవాలని మరచి పోరాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పాలకుల దాడి – ప్రశ్నార్ధకంగా మారిన మీడియా విశ్వసనీయత !

06 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

attacks on journalists, BJP, BJP's social media, Indian media credibility, Journalism in India, Media, Narendra Modi

Image result for government attack and question of indian media credibility

ఎం కోటేశ్వరరావు

ఒకే దేశం ఒకే చట్టం అనే భావోద్వేగాల ముసుగులో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్క దెబ్బతో ఒక రాష్ట్రాన్ని ఏకంగా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి అక్కడి జనానికి దేశంతో సంబంధాలను తెంపివేసిన ఆగస్టు ఐదు, 2019 నాటి అత్యంత అప్రజాస్వామిక చర్య వారాలు గడిచినా సాధారణ పరిస్ధితులు ఏర్పడలేదు. దేశంలో ఎన్ని పత్రికలు, టీవీలు ఈ చర్యను విమర్శనాత్మకంగా చూశాయి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి వున్న అనేక వివాదాస్పద అంశాలు, జనజీవితంతో పెనవేసుకున్న ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు పర్యవసానాల గురించి మీడియాలో ఎంత చోటు దక్కిందన్నది ఒక శేష ప్రశ్నగా మారింది.కాశ్మీరు గురించి మీడియా చర్చల్లో ఎక్కడో కొంత మంది చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తప్ప స్వంత కధనాలను జనం ముందుకు ఎన్ని తెచ్చాయంటే చెప్పలేని స్ధితి. అధికార పార్టీని చూసి నిజం చెప్పలేని స్ధితిలో మీడియా పడిపోయిందా ?ప్రస్తుతం భారత మీడియాలో వేళ్ల మీద లెక్కించదగిన సంస్ధలు తప్ప మొత్తం మీద విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. అంతకు ముందు కూడా ఆ సమస్య వున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా వేగంగా దిగజారుతున్నది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధగా చెప్పుకుంటున్న మన దేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. వుత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ చర్య ఒక వుదాహరణ. మధ్యాహ్న భోజన పధకంలో రొట్టెలతో కూరలకు బదులు వుప్పు అందచేసిన అంశాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు మీద అక్కడి అధికార యంత్రాంగం కేసు పెట్టింది. మీరు కావాలంటే ఫొటోలు తీసుకోవచ్చు, మీకు తప్పుగా కనిపించినదాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ వీడియో తీయటం అంటే అనుమానించాల్సి వస్తోంది. ఒక కుట్రలో భాగంగానే వీడియో తీశారంటూ జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ పటేల్‌ సదరు జర్నలిస్టు మీద పెట్టిన కేసును సమర్ధించారు. కేసు పెట్టాలి, దానికి ఒక సాకు చూపాలి అంతకు మించి దీనిలో మరొకటి కనిపించటం లేదు. ఫొటోలు తీయటానికి అర్హత వున్న ఒక జర్నలిస్టు వీడియో తీయకూడదని ఏ నిబంధనలు చెబుతున్నాయి. జర్నలిస్టుల పట్ల బిజెపి పాలకుల వైఖరికి ఇది చక్కటి నిదర్శనం. అధికారంలో వున్న వారికి వ్యతిరేకంగా నిజం చెప్పకూడదు, చూపకూడదు.

నరేంద్రమోడీ తొలిసారి ఎన్నికైనపుడు చమురు ధరలు భారీగా క్షీణించి జనానికి పెద్దగా వుపయోగపడకపోయినా దిగుమతి బిల్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేశాయి. అయినా ఎప్పుడైతే ఆర్ధికంగా దిగజారుడు ప్రారంభమైందో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.1970దశకం తరువాత గత ఏడాది నిరుద్యోగ శాతం 6.1శాతానికి పెరిగి పాత రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు మొత్తంగా 8.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.4శాతానికి చేరిందని తాజా పరిశీలనలు వెల్లడించాయి. వుద్యోగాలు ఎంత మందికి కల్పించారు అని అడిగితే లెక్కలు సరిగా వేయటం లేదు అని ఒకసారి, పకోడీలు తయారు చేయటం కూడా వుపాధి కల్పనే వాటన్నింటినీ కూడి తరువాత చెబుతామంటూ మోడీ దాటవేశారు. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కొత్త వుద్యోగాలు కల్పించకపోగా వున్న వుద్యోగాలు కూడా పోతున్నాయని, ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకే బంగారమాయెగా అన్నట్లు అసలేం జరుగుతోందో చెప్పటానికి మోడీ నోరు విప్పటం లేదు. బ్యాంకులకు పని గట్టుకొని రుణాలు ఎగవేసినట్లుగా ముఖ్య విషయాలపై మౌనం ఒక ప్రధాన సమస్యగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ తీరు తెన్నుల గురించి మీడియా శల్యపరీక్ష చేయాల్సి వుంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయంలో శక్తిహీనులైతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటం తప్ప మరొకటి కాదు. విమర్శనాత్మకంగా తమ కలాలు, గళాలను పని చేయించే జర్నలిస్టులు వున్నప్పటికీ మీడియా మొత్తంగా కార్పొరేట్ల చేతిలోకి పోవటంతో యాజమాన్యాలు తొక్కిపడుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరం.

Image result for government attack and question of indian media credibility

మూడు సంవత్సరాల క్రితం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్ర్రకటించారు. దాని ఫలితాలు వెంటనే కాదు, తరువాత వస్తాయని నరేంద్రమోడీ చెప్పారు. జిందా తిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా తన చర్యతో అవినీతి మటుమాయం అవుతుందని బల్లగుద్దారు. ఆర్ధికవేత్తలుగా వున్న వారు కూడా ఖాళీ పత్రం మీద సంతకాలు చేసినట్లుగా సమర్ధించారు. ఆ సమయంలో ఒకటీ అరా తప్ప మొత్తంగా మీడియా నిజమే నిజమే అన్నట్లుగా వంత పాడి జనాల్లో భ్రమలను పెంచింది తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలతో అవినీతి తగ్గిందా అనే చర్చకు తెరతీయలేదు. విషాదం ఏమిటంటే త్వరలో పెద్ద నోట్ల రద్దు మూడో వార్షికోత్సవానికి సిద్దం అవుతున్నాము. ఈ కాలంలో నరేంద్రమోడీ దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు నోరు విప్పలేదో ఏ మీడియా అయినా అడిగిందా, ఏ జర్నలిస్టు అయినా ధైర్యం చేశారా? ఏ ఆర్ధిక వేత్త అయినా తాము చెప్పింది తప్పని చెంపలు వేసుకున్నారా?

పుల్వామా వుగ్రదాడి తరువాత మన సైనిక దళాలు బాలాకోట్‌ పట్టణం మీద మెరుపుదాడి చేసి వందల మంది వుగ్రవాదులను మట్టుబెట్టినట్లు మీడియాకు చెప్పారు. అందుకు రుజువు ఏమిటని అడిగిన రాజకీయపార్టీలను దేశద్రోహులు, మన సైనిక సామర్ధ్యాన్ని అవమానిస్తున్నారంటూ మనోభావాలను రెచ్చగొట్టి బిజెపి, దాని సోదర సంస్ధలు జనాన్ని వుసిగొల్పాయి. అది రాజకీయ క్రీడలో భాగం అనుకోండి. మీడియా ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఒకదానితో మరొకటి పోటీపడి ఆ ప్రచారాన్ని తలకెత్తుకొని యుద్దోన్మాదాన్ని, దాన్ని వ్యతిరేకించిన వారిపై వ్యతిరేకతను రెచ్చగొట్టటాన్ని చూశాము. అధికార రాజకీయ పక్షానికి, మీడియా వైఖరికి తేడా చెరిగిపోయింది. రాయిటర్స్‌, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్ధలు మాత్రమే ప్రభుత్వ, అధికారపక్ష ప్రచారాన్ని సవాలు చేశాయి. ఫలితంగా దేశీయ మీడియా విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు గురించి ఎన్నికలకు ముందు మార్చినెలలో వందకు పైగా ఆర్ధికవేత్తలు రాసిన ఒక బహిరంగలేఖను మీడియా విస్మరించిది. వార్త ముగింపులో ఫలానా వారు కూడా ప్రసంగించారు అని రాసినట్లుగా మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్న అభివృద్ధిని తమ లేఖలో ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే అసలు విషయాలను బయటపెట్టాల్సి వస్తోంది. మీడియా దాన్ని పాఠకులకు అందించే సమయంలో గతంలోనే ఫలానా ఆర్ధికవేత్తలు సర్కార్‌ ప్రచారాన్ని ప్రశ్నించారు అని రాయటానికి చేతులు, చెప్పటానికి నోరు రావటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ మనుగడకోసం విధిలేక కొన్ని అంశాలను వెల్లడించాల్సి రావటం తప్ప ఎక్కువ భాగం జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు పాలకపార్టీల బాకాలుగా మారాయి.

ఒక ప్రధానిగా ఇంతవరకు నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెట్టలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడ నుండగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ఒక పత్రికా గోష్టి నిర్వహించారు. ముందే తయారు చేయించిన ఒక ప్రకటన విడుదల చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పక్కన చిరునవ్వులు చిందిస్తూ మోడీ కూర్చున్నారు, విలేకర్ల ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం చెప్పారు. చూశారా ప్రధాని అయ్యుండి కూడా పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంటూ దాన్ని కూడా మోడీ ఘనతగా మీడియా చిత్రించింది.ఎన్నికల సమయంలో మోడీతో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో జాతీయ మీడియా సంస్ధలు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాయి. అలాంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని కారణంగా అదంతా అధికారపక్ష ఆర్ధిక పాకేజీల్లో భాగమని జనం అనుకున్నారు. లాలూచీ కుస్తీ మాదిరి ఇంటర్వ్యూలు సాగాయి తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు ఒక్కటీ వేయలేదు. ఎన్నికల సమయంలో విమర్శనాత్మకంగా వార్తలిచ్చిన హిందూ, టెలిగ్రాఫ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలకు రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ ప్రభుత్వ ప్రకటనల జారీలో కోత పెట్టిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. 2002లో మీడియా స్వేచ్చలో 139దేశాల్లో మన స్ధానం 80వది, అలాంటిది తాజాగా సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ ప్రకటించిన 180 దేశాల్లో మనది 140వ స్ధానం. నిత్యం హింసా వాతావరణం వుండే దేశాలకంటే మనది దిగువన వుంది అని చెప్పుకోవాల్సి రావటం సిగ్గు చేటు.

1975లో నాటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించినపుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే జనం బిబిసి రేడియో మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎదిరించిన మీడియాను అణచివేస్తే లొంగిపోయిన మీడియా ప్రభుత్వ బాకాగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్ధితి లేదు. అయినా కాశ్మీరులో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జాతీయా మీడియాతో ఫలితం లేదని తేలిపోయింది. నాటి అత్యవసర పరిస్ధితిలో మాదిరి తిరిగి నేడు కాశ్మీర్‌లో వేలాది మందిని అరెస్టు చేశారనే వార్తల కోసం విదేశీమీడియాను, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి ఆసక్తి ఎందరికి , అందరిలో వుండే అవకాశం లేదు, అందువలన హిజ్‌మాస్టర్‌ వాయిస్‌ లేదా రాణీగారీ ప్రతిపక్షం మాదిరి మన మీడియా అందిస్తున్న అంతా బాగుంది వార్తలనే చదవటం, చూడాల్సి వస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మొత్తంగా మూసివేసిన మోడీ సర్కార్‌ చర్యను ఏ విదేశీ నేత కూడా ప్రశ్నించలేదు కదా అనే వాదనను మన మీడియా ముందుకు తెస్తోంది. నాణానికి రెండోవైపు చూస్తే ఏ నేత ఏ దేశం కూడా సమర్ధించిన దాఖలా కూడా లేదు. మన దేశంతో వున్న ఆర్ధిక సంబంధాలు, మార్కెట్‌ మీద ఆశతో విదేశాలేవీ మన సర్కార్‌తో ఘర్షణపడేందుకు సిద్దంగా లేవు.

భారత్‌లో పత్రికలు, టీవీ ఛానల్స్‌ పైకీ కిందికీ గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నాయని కాశ్మీర్‌లో పరిస్ధితి గురించి అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టు పేర్కొన్నది. విదేశీ మీడియా ఛానల్స్‌ కధనాల మీద దాడి చేయటంలో సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ అనుకూల మరుగుజ్జుల(ట్రోల్స్‌)తో పాటు, సాంప్రదాయక మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కూడా తోడవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మీడియా దాదాపుగా సమర్దించిందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపి చెబుతోంది. దాని మంచి చెడ్డల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది కనుక కాసేపు పక్కన పెడదాము. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని, రెండుగా చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తామని, ఆప్రక్రియకు ముందూ, తరువాత దాన్ని మొత్తంగా బహిరంగ జైలుగా మారుస్తామని, కమ్యూనికేషన్‌ వ్యవస్ధను మూలన పడేస్తామని బిజెపి ఎక్కడా ముందు చెప్పలేదు కదా ? దీన్ని గురించి మన మీడియా ఎన్నడైనా ప్రశ్నించిందా ? ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలకు చోటు ఇస్తోందా ? కాశ్మీర్‌పై తీసుకున్న చర్యలకు మద్దతుగా మీడియాలో ఇచ్చిన కవరేజి, దేశవ్యాపితంగా దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ మంచి చెడ్డల గురించి వివరించేందుకు కేటాయిస్తున్న సమయం, స్ధలం ఎంత ?.

కాశ్మీరు ఒక పంజరం అనే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావటంతో క్లబ్‌ నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అదే విధంగా సంత్‌ రవిదాస్‌ దేవాలయ కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్ధల వారు ఢిల్లీలోని మహిళా జర్నలిస్టుల క్లబ్బులో పత్రికా గోష్టి నిర్వహించేందుకు హాలును అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం క్లబ్‌ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకువచ్చి అనుమతిని రద్దు చేయించింది.1992లో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఖండిస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్‌ విషయంలో అలా బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భయపడుతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2015లో అద్వానీ, ఆయనేమీ మోడీ అభిమాని కాదు, వెంటనే గాకపోయినా త్వరలో దేశంలో మరో అత్యవసర పరిస్ధితిని ప్రకటిస్తే తాను ఆశ్చర్యపోనని చెప్పారు.అది తీవ్రమైన అనుమానంగానే వుంటుంది, అయితే ఒక విషయం ఖాయం, దాన్ని సమర్ధించేందుకు మీడియా సిద్దంగా వుంటుంది అని ఎకానమిస్ట్‌ పేర్కొన్నది.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా వర్ణించిన నరేంద్రమోడీ అండ్‌ కో ఆయన మాదిరిగా కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం గురించి జరిపిన పరిశీలనలో 201-18 మధ్య సోషల్‌ నెట్‌వర్క్‌ల సంఖ్య 16.8 కోట్ల నుంచి 32.6 కోట్లకు పెరిగింది. వీటి ద్వారా పాలక బిజెపి అర్ధసత్యాలు, అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల మీద ప్రచారదాడులు జరుగుతున్నాయి. భారత సంస్కృతి పరిరక్షణ, వున్నతి గురించి సుద్దులు చెప్పిన నోళ్లతోనే మహిళా జర్నలిస్టులను నోరు బట్టని బూతులు తిట్టటం, మానభంగాలు చేస్తామని బెదిరింపులు కూడా సాగించిన, సాగిస్తున్న వుదంతాలు తెలిసిందే. విమర్శకుల నోరు మూయించే ఆయుధాలుగా సామాజిక మాధ్యమాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన, విమర్శించిన వారిని దేశద్రోహులుగా, పాకిస్ధాన్‌, చైనా ఏజంట్లుగా, వుగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రవేశారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు బిజెపికి చెందిన వారు ఎలా ఈ ప్రచార దాడిని సాగిస్తున్నారో ఒక పుస్తకంలో వివరించారు. తమ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే ఛానల్స్‌,పత్రికల యాజమాన్యాల మీద సిబిఐ, ఇడి వంటి సంస్ధలతో దాడులు చేయించటం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం, అధికారపక్షం నుంచి చర్చలను బహిష్కరించటం వంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి.

తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకొనేందుకు మీడియాను నరేంద్రమోడీ ఎలా వుపయోగించుకున్నారో 2018లో ఒక వుదంతం వెల్లడించింది. చత్తీస్‌ఘర్‌కు చెందిన ఒక గిరిజన మహిళా రైతుతో నరేంద్రమోడీ మాట్లాడినదానిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ధాన్యం బదులు సీతాఫలాలను పండించటం ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని ఆ మహిళ చెప్పింది. అయితే దాని గురించి అనుమానం వచ్చిన ఎబిపి ఛానల్‌ ప్రతినిధులు ఆ మహిళ వద్దకు వెళ్లి విచారించగా అలా చెప్పాలని బిజెపి నేతలకు తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్తను మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించే పుణ్య ప్రసూన్‌ వాజ్‌పేయి ప్రసారం చేయటంతో ప్రధాని పరువుపోయింది. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలితో సహా దాదాపు వంద కోట్ల రూపాయల విలువగల అనేక ప్రయివేటు కంపెనీల వాణిజ్య ప్రకటనలను ఆ ఛానల్‌కు నిలిపివేయాలని వత్తిడి తెచ్చింది. దాంతో యాజమాన్యం ఆ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని తృప్తి పరచింది. తన కార్యక్రమంలో మోడీ ప్రస్తావన రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశించిందని, మీడియాలో మోడీ గురించి వస్తున్న వార్తల తీరుతెన్నులను విశ్లేషించేందుకు రెండు వందల మందితో ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మోడీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో సంపాదకులకు ఆదేశాలు వెళతాయని ప్రసూన్‌ వాజ్‌పేయి వెల్లడించారు. దేశంలో విద్వేష నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలిపేందుకు హిందూస్ధాన్‌ టైమ్స్‌లో ఒక పర్యవేక్షణ ప్రారంభించిన బాబీ ఘోష్‌ అనే జర్నలిస్టు పని తీరు ప్రభుత్వానికి నచ్చలేదంటూ యాజమాన్యంపై వత్తిడి తేవటంతో అతను రాజీనామా చేసి ఇంటికిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక ఆ పర్యవేక్షణను నిలిపివేసింది. లైసన్సు రాజ్యం అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే బిజెపి ఆ విషయంలో తక్కువేమీ తినలేదు. టీవీ ఛానల్స్‌ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. బిజెపి ఎంపీ యాజమాన్యంలో, బిజెపి అనుకూల ఆర్నాబ్‌ గోస్వామి నిర్వహణలో రిపబ్లిక్‌ టీవీకి అలా దరఖాస్తు చేయగానే ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్‌ పట్ల విమర్శనాత్మకంగా వుండే రాజీవ్‌ బహాల్‌ నిర్వహణలో బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ సంస్ధ దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చలేదు.

Image result for government attack and question of indian media credibility

దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్ధ రిలయన్స్‌, దాని యజమాని ముకేష్‌ అంబానీ పెద్ద సంఖ్యలో అన్ని భాషలల్లో ఛానళ్లను ప్రారంభించటం లేదా కొనుగోలు చేసి పెద్ద మీడియా అధిపతిగా మారిన విషయం తెలిసిందే. తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార అవకాశాలు కల్పించటం, విమర్శలకు దూరంగా వాటిని నిర్వహిస్తారు. కోబ్రాపోస్ట్‌ నిర్వహించిన ఒక శూల శోధనలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా టుడే వంటి బడా సంస్ధలతో పాటు 25 మీడియా సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ ఇచ్చే సొమ్మును బట్టి బిజెపికి ప్రచారంతో పాటు మతపరమైన విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేందుకు సిద్దం అని చెప్పిన విషయాలు వెల్లడయ్యాయి. అంటే మన మీడియా సంస్ధలు డబ్బుకోసం ఎంతకైనా తెగించటానికి సిద్దపడుతున్నాయి.అయితే అన్నీ ఇలాంటి సంస్ధలే లేవు. హిందూ పత్రిక, ఎన్‌డిటివీ వంటి న్యూస్‌ ఛానల్స్‌, వైర్‌, స్క్రోల్‌, బూమ్‌లైవ్‌, న్యూస్‌ మినిట్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి వెబ్‌ మీడియా సంస్ధలు వాస్తవాలను వెల్లడించటానికి వెనుకాడటం లేదు. అలాంటి సంస్ధలు వెల్లడించిన కుంభకోణాలు, అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మేర నేరపూరిత పరువు నష్టదావాలను వేస్తూ వాటి నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి సంస్ధలకు ఆదాయాలు పరిమితం, ప్రభుత్వ దాడులను తట్టుకొని అవి ఎంత కాలం నిలబడగలవు అన్నది శేష ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పరువు నష్టం కేసులతో మీడియా నోరు నొక్కే దుష్టయత్నం !

15 Tuesday Aug 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Attack on media, attacks on journalists, bully, defamation cases on media, EPW, free speech, journalism, Media, Samiksha trust, silence, SLAP

ఎం కోటేశ్వరరావు

భావ ప్రకటనా స్వేచ్చ మానవులకు పుట్టుకతో వచ్చిన హక్కు. భూమ్మీద పడగానే గాలి పీల్చుకోవటంతో కేరు మంటూ ప్రారంభమయ్యే స్వేచ్చా గళం తిరిగి అంతిమంగా శ్వాస తీసుకోవటం ఆగినపుడే మూతపడుతుంది. అలాంటి పుట్టుకతో వచ్చిన హక్కును హరించేందుకు మధ్యలో ఎవరు ప్రయత్నించినా దానిని ఏదో ఒక రూపంలో ప్రతిఘటించటమే సజీవ మానవ లక్షణం.

కుక్క పిల్లా, సబ్బు బిళ్లా, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం……… హీనంగా చూడకు దేన్నీ కవితామయమేనోయ్‌ అన్నీ అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. అలాగే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి నియంతలు,పోలీసులు, గూండాలు, కార్పొరేట్లు కావేవీ మినహాయింపు, ఏదీ తక్కువ కాదు అని చెప్పుకోవాల్సిన రోజులచ్చాయి. నియంతలు ఏదో ఒకసాకుతో లంగని మీడియా సంస్ధలను పూర్తిగా మూతవేయించటానికి ప్రయత్నిస్తారు. గూండాలు పశుబలాన్ని వుపయోగిస్తే, పోలీసులు, కార్పొరేట్లు చట్టాలను రక్షణగా తీసుకొని స్వేచ్చ, ప్రజాస్వామ్యాన్ని హరించటానికి ప్రయత్నిస్తాయి.

ఇటీవలి కాలంలో అధికార రాజకీయాలు నడిపే శక్తులు తమకు లంగని రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం ద్వారా వారిని తమ దారికి దారికి తెచ్చుకోవటం ఒక ముఖ్యపరిణామం. దాని ఫలితమే ఎవరు ఏ పార్టీ తరఫున ఎన్నికవుతారో, ఏక్షణంలో పార్టీ మారతారో తెలియని స్ధితి. కార్పొరేట్‌ సంస్ధలు ఒక దశలో స్వయంగా మీడియా సంస్ధలను ప్రారంభించటం ఒక పరిణామమైతే, తమ ప్రయోజనాలకు సహకరించని ఇతర వాటిని ఆర్ధికంగా దెబ్బతీయటం రాజకీయాలలో మాదిరి మరో సరికొత్త కొత్త ధోరణి. అది సంస్ధలకే పరిమితం కాలేదు, వ్యక్తులకు, శక్తులకు, మీడియాయేతర సంస్ధలను కూడా తమ దారికి తెచ్చుకొనేందుకు పైన పేర్కొన్న శక్తులన్నీ పూనుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో వుపాధి,వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే రొయ్యల ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ గ్రామం, పరిసర ప్రాంతాల జనం వుద్యమిస్తే వారిని అణచివేసేందుకు సంబంధిత పారిశ్రామికవేత్తలు గూండాలు, పోలీసులు, అధికారయంత్రాంగం, మంత్రులు, వాణిజ్యమీడియాను ఎలా వుపయోగించుకున్నదీ ప్రత్యక్షంగా చూశాము. వారి కుమ్మక్కును బహిర్గతం చేసేందుకు కొందరు జర్నలిస్టులు సిద్ధంగా వున్నా మీడియా యాజమాన్యాలు వారి నోరు నొక్కుతున్నాయి. వాస్తవాలకు మీడియాలో చోటు కల్పించటం లేదు.

వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు లాభం కలిగించేందుకుాతద్వారా తాము లబ్ది పొందేందుకు అధికారంలో వున్న పార్టీలు, వారి చెప్పుచేతల్లో పనిచేసే అధికార గణం నిబంధనలను ఎలా కావాలనుకుంటే అలా మార్చటం, తమకు అనువైన టీకాతాత్పర్యాలు చెప్పటం చూశాము. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో చెరువులు తవ్వాలనే పేరుతో తమకు ఓటు వేయని దళితుల భూములను ఆక్రమించేందుకు, వ్యవసాయానికి పనికిరాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి ఒక శత్రుదేశంపై దాడి మాదిరి జనాన్ని బయటకు రానివ్వకుండా చేసి, పెద్ద సంఖ్యలో యంత్రాలను ప్రయోగించి ఎలా తవ్వించిందీ లోకం చూసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !

ప్రధాని నరేంద్రమోడీ, బిజెపికి అత్యంత సన్నిహితుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త అదానీ. అతని గ్రూపు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు మార్చిన నిబంధనలు, పన్నుఎగవేత తీరుతెన్నుల గురించి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (ఇపిడబ్ల్యు) జూన్‌ నెలలో రెండు పరిశోధనాత్మక విశ్లేషణలను ప్రచురించింది. వాటిని వెబ్‌ నుంచి వెంటనే వుపసంహరించని పక్షంలో తాము పరువు నష్టం దావా వేస్తామని అదానీ గ్రూపు లాయర్‌ నోటీసులు జారీ చేసింది. దానికి సమాధానంగా సంపాదకుడు పరంజయ గుహ థాకూర్దా ఒక లాయర్‌ను ఏర్పాటు చేసి సమాధానం పంపారు. ఈలోగా ఆ పత్రికను నడుపుతున్న సమీక్షా ట్రస్టు పాలకవర్గం వెంటనే ఆవిశ్లేషణలను తొలగించాలని ఆదేశించటంతో దానికి నిరసనగా పరంజయ్‌ రాజీనామా చేశారు. ఈ పరిణామంతో ఆ పత్రిక యాజమాన్య ట్రస్టు గురించి ఎంతో వున్నతంగా వూహించుకున్న అనేక మంది హతాశులై పత్రిక ప్రతిష్టను పునరుద్దరించాలని ఒక బహిరంగ లేఖ రాశారు. భారతీయ మీడియాలో ఇలాంటి పరిణామం బహుశా ఇదే ప్రధమం. అనేక సంస్ధల యాజమాన్యాలు పాలేర్లను మార్చినట్లు సంపాదకులను మార్చటం చూశాము. అయితే అవన్నీ తెరవెనుక పరిణామాలకే పరిమితం అయ్యాయి. కానీ ఇపిడబ్ల్యు వుదంతం అలాంటి కాదు, అలా జరగలేదు.

కార్పొరేట్ల అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా వుద్యమించిన సంస్ధలు, వ్యక్తులు, శక్తులు, వాటిని బయట పెట్టిన జర్నలిస్టులను కేసులు ముఖ్యంగా భారీ మొత్తాల ప్రమేయం వున్న పరువు నష్టం, తదితర కేసులతో వేధించటం ప్రపంచవ్యాపితంగా జరుగుతోంది. కార్పొరేట్‌ సంస్ధలు ఎప్పుడైతే దేశ రాజకీయాలను శాసించేంత బలంగా తయారయ్యాయో ఆ పరిణామం మన దేశంలో కూడా వేగవంతమైంది. ఆంగ్లంలో స్ట్రాటజిక్‌ లా సూట్‌ ఎగైనెస్ట్‌ పబ్లిక్‌ పార్టిసిపేషన్‌ అనేదాన్ని పొట్టిగా ‘స్లాప్‌’ అంటున్నారు. జన భాగస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక న్యాయపరమైన దావా అని తెలుగులో చెప్పవచ్చు. ఇలాంటి దావాలు కోర్టు విచారణలో నిలుస్తాయా లేదా అన్నదానిని కార్పొరేట్‌ సంస్ధలు పట్టించుకోవు. తమను వుతికి ఆరవేస్తున్నవారిని ముందుకు పోకుండా చేయటమే ప్రధాన లక్ష్యం. అందుకు గాను పెద్ద మొత్తం పరువు పరిహారాన్ని కోరటం, క్రిమినల్‌ కేసులు పెట్టటం ప్రధానంగా జరుగుతుంది. వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో న్యాయవాదులకు డబ్బులిచ్చి కోర్టులలో పోరాడటం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు కనుక ఇలాంటి బెదిరింపులు ప్రతి దేశంలో సర్వసాధారణమయ్యాయి. గ్రీన్‌పీస్‌ అనే సంస్ధ నోరు మూయించటానికి ఒక కేసులో 30కోట్లు, మరోకేసులో 70లక్షల డాలర్ల పరిహారానికి కేసులు నమోదు చేశారు. ‘స్లాప్‌’ కేసులు బనాయించకుండా చూసేందుకు పరిమిత దేశాలు మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ కేసులు పెరిగిపోతూనే వున్నాయి.

పశ్చిమ గోదావరిలో ఒక నాడు ఒక సన్నకారు రైతుగా వుండి తరువాత కాలంలో ఆఫ్రికాలో, మన దేశంలోని బెంగళూరులో ఒక పెద్ద వ్యాపార సంస్ధగా ఎదిగిన కరుటూరి గ్లోబల్‌ యాజమాన్య కార్యకలాపాల గురించి కేయ ఆచార్య అనే ఒక పర్యావరణ జర్నలిస్టు రాసిన వ్యాసాన్ని ఇంటర్‌ ప్రెస్‌ సర్వీసు(ఐపిఎస్‌) ప్రచురించింది. దాని వలన కలిగిన తమ పరువు నష్టంగా వందకోట్ల రూపాయలు చెల్లించాలని 2014 ఆగస్టు ఐదున ఆ సంస్ధ ఎండీ శాయి రామకృష్ణ కరటూరి ఒక నోటీసు పంపారు. కంపెనీ తూర్పు ఆఫ్రికాలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు భారత్‌లోని గులాబి సాగుపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆ జర్నలిస్టు తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఆమెకు నోటీసు అందగానే ఆ విశ్లేషణను తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఐపిఎస్‌ సంస్ధ వెంటనే ఒక ప్రకటన చేసింది. జర్నలిస్టు రాసిన విశ్లేషణలోని అంశాలను, వార్తా వనరు గురించి నిర్ధారించుకొనేందుకు గాను ఆ వ్యాసాన్ని పక్కన పెడుతున్నామని, తమ సంస్ధ నుంచి వార్తలను కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు దానిని ఏ రూపంలోనూ తిరిగి ప్రచురించవద్దని దానిలో పేర్కొన్నది. ఈ నోటీసు తనను బెదిరించేందుకు మాత్రమే కాదని భవిష్యత్‌లో ఆఫ్రికాలో కరుటూరి కంపెనీ కార్యకలాపాల జోలికి పోకుండా మౌనం వహించేందుకు కూడా వుద్దేశించిందని శ్రేయ ఆచార్య పేర్కొన్నారు.

కాలం చెల్లిన పరువు నష్టం చట్టాలను ఇంకా మన దేశంలో కొనసాగించటం స్వేచ్చా గళాలను అణచివేయటానికి సాధనాలుగా చేసుకొనేందుకు అనుమతించటం దారుణం. పరువు నష్టం కేసుల వివరాలను పరిశీలిస్తే బెదిరించటానికే వాటిని వుపయోగిస్తున్నట్లు వెల్లడి అయింది. పెద్ద మొత్తం పరిహారం కోరుతూ జర్నలిస్టులకు నోటీసు పంపితే రాసిన వాటిని వెనక్కు తీసుకోవటమో లేదా తదుపరి రాయకుండా చేయటమో జరుగుతోందని తేలింది. తాజా వుదంతం ఇపిడబ్ల్యు సంపాదకుడు పరంజయ గుహ థాకూర్ధా విషయంలో కూడా దీన్ని గమనించవచ్చు. పరంజయ్‌ గుహ, సుబీర్‌ ఘోష్‌, జ్యోతిర్మయ్‌ చౌదరి ‘గ్యాస్‌ వార్స్‌-క్రోనీ కాపిటలిజం అండ్‌ అంబానీస్‌’ అనే పేరుతో పుస్తకం రాశారు. దానిలో సహజవాయు ధర నిర్ణయంలో జరిగిన అక్రమాలను వివరించారు. ఆ పుస్తకం వెలువడగానే ఆ పుస్తకాన్ని రాసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, దానిని వెబ్‌సైట్‌నుంచి తొలగించాలని, విక్రయాలు, ముద్రణలను నిలిపివేయాలని లేకుంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని అంబానీ సోదరులు నోటీసులు జారీ చేశారు. రచయితలు కూడా వాటికి లీగల్‌గానే సమాధానాలు పంపారు. తరువాత అంబానీల వైపు నుంచి ఎలాంటి కదలికలు లేవు. ఇలాంటి వాటికి తాము భయపడలేదని రచయితలలో ఒకరైన ఘోష్‌ వ్యాఖ్యానించారు.తమను బెదిరించటానికి, వేధించటానికే ఈ నోటీసులు జారీ చేశారని థాకూర్ధా వ్యాఖ్యానించారు.

సహారా గ్రూపు అధిపతి సుబ్రతారాయ్‌ కూడా సహారా: అన్‌ టోల్డ్‌ స్టోరీ పేరుతో మింట్‌ పత్రిక డిప్యూటీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా వున్న తమల్‌ బందోపాధ్యాయ, పుస్తక ప్రచురణ సంస్ధ జైకో పబ్లిషింగ్‌ హౌస్‌పై రెండువందల కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేశాడు. సహారా సంస్ధ లావాదేవీలు, అది ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యల గురించి దానిలో వివరించారు. దాని విడుదలపై కొల్‌కతా హైకోర్టు స్టే విధించింది. తరువాత వుభయ పక్షాలూ కోర్టు వెలుపల వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ఆపుస్తకంలో పరువుకు భంగం కలిగించే అంశాలున్నాయని, సహారా సంస్ధ వాటి గురించి సంతోషంగా లేదనే ప్రకటన కూడా పుస్తకంలో ప్రచురించేట్లు, పుస్తక ప్రచురణ, విడుదలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదిరింది. ఒక వ్యక్తిగా అలాంటి పెద్ద సంస్ధలతో పోరాడటం కష్టమని, తనకు మింట్‌ యాజమాన్య మద్దతు వున్న కారణంగానే పోరాడగలిగానని, అన్నింటికంటే తనకు మీడియా ఎంతగానో మద్దతు ఇచ్చిందని, అయినా తన ఆరోగ్యం దెబ్బతిన్నదని రచయిత తమల్‌ బందోపాధ్యాయ చెప్పారు. ఇలాంటి నోటీసులు నిజాయితీగా వార్తలు అందించటాన్ని అడ్డుకొనేందుకే అన్నది వాస్తవం అన్నారు. మింట్‌ పత్రికను ప్రచురిస్తున్న హిందుస్తాన్‌ టైమ్స్‌ సంస్ధపై రిలయన్స్‌ పవర్‌ కూడా మింట్‌ ప్రచురించిన వార్తపై దావా వేసింది. సెబీతో సహారా కంపెనీ వివాదంపై వార్తలు రాసినందుకు మింట్‌ పత్రిక సంపాదకుడిపై ఆ కంపెనీ పాట్నాలో ఒక పరువు నష్టం దావా వేసింది.

ఒక సంస్ధ లేదా ఒక వ్యక్తికి సంబంధించిన వార్త లేదా వ్యాఖ్య ప్రచురితం లేదా ప్రసారమైనపుడు అభ్యంతరకరమైన అంశాలుంటే ముందుగా వాటికి సంబంధించిన వివరణలు లేదా ఖండనలు ఇవ్వాలి. వాటిని మీడియా విస్మరించినపుడు ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి అక్కడ కూడా న్యాయం జరగలేదని అనిపిస్తే తదుపరి న్యాయపరమైన చర్యలకు పూనుకొనేందుకు ఎవరికైనా హక్కుంటుంది. అయితే దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అందుకు భిన్నంగా జరుగుతోంది. గూండాలు, మాఫియా, ప్రజాప్రతినిధులు లేదా వారి అనుయాయులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని భౌతికదాడులకు పాల్పడుతున్నారు. హత్యలకు కూడా వెనుతీయటం లేదు. పోలీసులు కూడా అత్యధిక సందర్భాలలో వారితో కుమ్మక్కయి జర్నలిస్టులపై ప్రతి కేసులు బనాయించటం లేదా కొన్ని సందర్భాలలో అయితే రౌడీషీట్లను కూడా తెరిచే విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. కార్పొరేట్‌ శక్తులు తమ డబ్బు మదంతో భారీ మొత్తాలకు పరువు నష్టం కేసులు వేస్తూ మీడియా సంస్ధలు, జర్నలిస్టుల నోరు నొక్కేందుకు పూనుకోవటం ఏడుపదుల మన ప్రజాస్వామ్య వ్యవస్ధకు పట్టిన దుర్గతి. ఈ స్ధితిలో ఏం చెయ్యాలి అనే సమస్య ఒక్క జర్నలిస్టులకే కాదు యావత్‌ సమాజం ముందున్నది.

ఇపిడబ్ల్యు వుదంతానికి వస్తే అసలు వాస్తవాలేమిటన్నది బయటకు రావాల్సి వుంది. కేవలం ఒక లాయర్‌ నోటీసుకే యాజమాన్యం ఇలాంటి చర్యలకు పూనుకోవటం అనూహ్యం. ఇప్పటి వరకు వెల్లడైన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అనేక కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అదానీ లీగల్‌ నోటీసు ట్రస్టును వుద్ధేశించిందని అయితే దాని గురించి తమకు తెలపకుండానే ట్రస్టు తరఫున సమాధానం ఇస్తున్నట్లు పేర్కొన్నారని, అది ఏకపక్షంగా నిర్ణయమని విశ్వాసాన్ని వుల్లంఘించారని సమీక్ష ట్రస్టు ప్రకటించింది. జరిగిందేమిటో తమకు తెలపకుండానే లీగల్‌ నోటీసు, సమాధాన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిపింది. వాటితో పాటు అదానీ కంపెనీల గురించిన రాసిన ఆర్టికల్‌ను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని కోరినట్లు తెలిపింది. ఆ తరువాత పరంజయ్‌ రాజీనామా చేశారని, దానిని ట్రస్టు సమావేశం అంగీకరించినట్లు తెలిపారు. లీగల్‌ నోటీసు గురించి అనుమతి తీసుకోకుండా సమాధానం ఇవ్వటం తన పొరపాటేనని అంగీకరించానని, జరిగిందానిని పూర్తిగా ట్రస్టు సభ్యులు వెల్లడించటం లేదని రాజీనామా చేసిన పరంజయ్‌ చెబుతున్నారు.

జరిగిందాని గురించి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అదానీ గ్రూపు లాయర్లు పేర్కొన్న వ్యాసాన్ని తొలగించాలని ట్రస్టు కోరిందీ లేనిదీ స్పష్టం కావాల్సి వుంది. అదానీ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేసిందా అన్నదొక వ్యాసం, అదానీ కంపెనీకి ఐదువందల కోట్ల రూపాయలను అప్పనంగా ప్రభుత్వం కట్టబెట్టిన విధాన లోపం గురించి మరొక వ్యాసంలో పేర్కొన్నారు.రెండవ వ్యాసాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని ట్రస్టు సభ్యులు కోరారన్న అంశంపై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. తొలగించమని కోరటానికి గల కారణాలను ట్రస్టు వెల్లడించలేదు.అదే సమయంలో తామెవరి వత్తిడికి ఎన్నడూ లంగలేదని పేర్కొన్నారు. పరంజయ్‌ రాసిన వ్యాసంలో గుర్తుతెలియని వనరులు చెప్పిన ఆధారాలు లేని అనేక కట్టుకథలు వున్నాయని, వాటి ఆధారంగా నిర్ధారణలు చేశారని ట్రస్టు సభ్యులు ఆరోపించారు. కొద్ది రోజుల తరువాత ట్రస్టు సభ్యుల పేరుతో వెలువడిన ప్రకటనలో ఇపిడబ్ల్యు ప్రమాణాలకు అనుగుణ్యంగా ఆ వ్యాసాలు లేవని, వాటిపై సమీక్ష కూడా సవ్యంగా జరగలేదని పేర్కొనటం గమనించాల్సిన అంశం.

ట్రస్టు సభ్యులతో జరిగిన సమావేశంలో లీగల్‌ నోటీసు అంటే ఒక లాయర్‌ నుంచి వచ్చిందే తప్ప కోర్టులో క్రిమినల్‌ కేసు నుంచి కాదని తాను వివరించానని, దానికి కూడా ట్రస్టు అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా లీగల్‌ నోటీసుకు సమాధానం పంపటం పొరపాటేనని గ్రహించానని అందుకు క్షమాపణ కూడా చెప్పానని పరంజయ్‌ చెప్పారు. అయితే ఆ రోజు జరిగిన దానిని పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. తన పేరుతో వ్యాసాలు రాయవద్దని ట్రస్టీ సభ్యులు చెప్పారని, ఏవైతే సంపాదకుడి విధులు, పాత్ర వుంటుందో అవే వుండే విధంగా ఒక సహసంపాదకుడిని కూడా నియమిస్తామని చెప్పారని, తక్షణమే వెబ్‌సైట్‌ నుంచి ఆర్టికల్స్‌ తొలగించి వెళ్లాలని కోరినట్లు చెప్పారు. తాను ఇతరులతో కలసి రాసిన విశ్లేషణలో ప్రతి వ్యాక్యానికి కట్టుబడి వుంటానని, అందుకు తగిన ఆధార పత్రాలు తన వద్ద వున్నాయని చెప్పానని, తాను రాసిన దానికి సాక్ష్యాల గురించి ట్రస్టీలు అసలు అడగలేదనిఅయినప్పటికీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించాల్సిందేనంటూ తాను చెప్పిందానిని పట్టించుకోలేదన్నారు. ట్రస్టీలకు ఆధారాలపై ఆసక్తి లేదన్నారు. ఒక ట్రస్టీ అయితే ఆ వ్యాసాన్ని తానింకా చదవలేదని కూడా చెప్పారని, వెబ్‌సైట్‌ నుంచి ఆర్టికల్స్‌ను తొలగించిన తరువాతే బయటకు వెళ్లాలని తనతో చెప్పారని కూడా పరంజయ్‌ చెబుతున్నారు. దాంతో తాను ు రాజీనామా చేస్తానని చెప్పానని, ముంబైలో సంపాదకుడికి ఇచ్చే ఫ్లాట్‌ను ఖాళీ చేయటానికి కొద్ది రోజులు గడువిస్తారా అని అడగ్గా జూలై ఆఖరు నుంచి రాజీనామా అమలులోకి వస్తున్నట్లు పరిగణిస్తామని ట్రస్టు సభ్యులు చెప్పారని అయితే తక్షణమే తాను రాజీనామా చేసినట్లు పరిగణించాలని కోరినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు ఆ పత్రిక తీరు తెన్నులను పరిశీలించినపుడు దాని సంపాదకుడి ఎన్నిక మిగతా వాణిజ్య పత్రికల మాదిరిగా జరగదని తెలిసిందే. వివిధ రంగాలలో పరిణితులైన ట్రస్టు సభ్యులు పూర్వపరాలను ఒకటికి రెండుమార్లు పరిశీలించి నిపుణులు, నిబద్ధత కలిగిన వారినే సంపాదకులుగా ఎంపిక చేశారు. గతంలో పని చేసిన వారందరూ వున్నంతలో వున్నత ప్రమాణాలు, విలువలను కాపాడారు కనుకనే ఆ పత్రికకు ఒక విస్వసనీయత ఏర్పడింది.ఆ రీత్యా చూసినపుడు పరంజయ్‌ గుహ థాకూర్ధాను కూడా ఆ ప్రమాణాల మేరకే ఎంపిక చేశారు. పరిశోధనాత్మక జర్నలిజంలో ముందే చెప్పుకున్నట్లు రిలయన్స్‌ వంటి దిగ్గజ సంస్ధకు సైతం వెరవ కుండా దాని అక్రమాలను బయట పెట్టిన చరిత్ర వుంది. అలాంటి వ్యక్తి అదానీ సంస్ధల గురించి అదీ అదానీకి నరేంద్రమోడీతో వున్న సంబంధాలు తెలిసి కూడా ఆషామాషీగా గాలి వార్తలను పోగేసి కధనాలు రాశారని, తమ విశ్వాసాన్ని వమ్ము చేశారని అంటే నమ్మటం కష్టం. ఒక అంశంపై పరిశోధన చేసిన జర్నలిస్టుకు కొన్ని సందర్భాలలో తప్పుడు సమాచారం కూడా వచ్చి వుండవచ్చు. ఇపిడబ్ల్యు పత్రికలో అటువంటి వార్తలు రాశారంటే ఎవరూ నమ్మటం లేదు. అసలు ఆ వార్తల గురించి అదానీ సంస్ధ లేదా ప్రభుత్వ ప్రమేయం కూడా వుంది కనుక ఆయా శాఖల స్పందన ఏమిటన్నది కూడా పరిశీలించకుండానే పరంజయ్‌ ఇతరులతో కలసి రాసిన వార్తలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించాలని పేర్కొనటం ట్రస్టు సభ్యులపై అనుమానాలను పెంచేదే తప్ప వేరు కాదు. ప్రజల ఖజానాకు చేరవలసిన వందల కోట్ల రూపాయలను ఒక సంస్ధ అక్రమపద్దతుల్లో ఎగవేసిందని రాస్తే దానికి తగిన ఆధారాలను చూపాల్సిన బాధ్యత ఆ జర్నలిస్టుకు వుంటుంది. అది వాస్తవం కాదని అనే వారు సంస్ధ అయినా ప్రభుత్వశాఖలైనా అది ఎలా అవాస్తవమో జనానికి తెలియచేయాల్సిన బాధ్యత వారిపై కూడా వుంది. పరంజయ్‌, ఆయన సహరచయితలు రాసిన అంశాలు ప్రయివేటు లావాదేవీలకు సంబంధించినవి కావు. చట్ట సమీక్షకు లోబడినవే.

చట్ట సభలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున ఒకసారి జనంలోకి వెళ్లిన అంశాన్ని స్పీకర్‌ తన విచక్షణాధికారాన్ని వుపయోగించి రికార్డుల నుంచి తొలగించవచ్చు. అంతే తప్ప దాన్ని జనంలో ప్రచారం చేయకుండా నిరోధించలేరు.అలాగే ఇపిడబ్ల్యు పత్రికలో ఆ వ్యాసాలు ప్రచురితమై పాఠకులకు చేరాయి. వెబ్‌సైట్‌లో తొలగించినంత మాత్రాన జనానికి అందకుండా పోవు. వైర్‌ వంటి వెబ్‌సైట్లు వెంటనే ఆ వ్యాసాలను పునర్ముద్రించాయి. వాటికి కూడా ఇపిడబ్ల్యుకు ఇచ్చిన మాదిరే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని చట్టపరంగా ఎదుర్కొంటామంటూ సదరు వెబ్‌సైట్‌ ఆ రెండు విశ్లేషణలను ఇప్పటికీ పాఠకులకు అందుబాటులో వుంచింది. సమీక్ష ట్రస్టు చర్యతో ఆ వ్యాసాల్లో అసలేమి వున్నదనే ఆసక్తి పాఠకుల్లో మరింతగా పెరిగి వాటికి ప్రాచుర్యాన్ని పెంచాయి. అనేక మీడియా సంస్ధలు అదానీకి భయపడుతూనే రేఖా మాత్రంగా అయినా వాటిల్లో ఏముందో చెప్పకుండా వార్తలను ఇవ్వలేవు. జరిగిన అక్రమాల సారాన్ని కొద్ది వాక్యాలలో అయినా చెప్పాల్సి వుంటుంది. ఒక వేళ తమ ఆదాయానికి ఎక్కడ గండిపడుతుందో అని ఆ వార్తలను నిషేధించినా సామాజిక మాధ్యమంలో అందుబాటులో వున్నాయి. ఫేస్‌బుక్‌, గూగుల్‌ కంపెనీలను కూడా ఆదాని మేనేజ్‌ చేసి వారిని సంతృప్తి పరిస్తే తప్ప చర్చించేందుకు అవకాశాలు ఎన్నో వున్నాయి.

ఈ పరిణామం నిస్సందేహంగా దేశంలోని జర్నలిస్టుల ముందు ఒక సవాలు విసురుతోంది. ఎంతో శ్రమకోర్చి పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన అంశాలు జనానికి తెలియకుండా అడ్డుకోవటాన్ని సహిస్తే అసలు జర్నలిజానికి అర్ధం ఏమిటి? అలాంటి వాటిని ఎలా జనానికి తెలియచెప్పాలి. బ్రిటీష్‌ వారి కాలంలో వారికి వ్యతిరేకంగా పని చేసిన పత్రికలను ఎలా అణచివేసిందీ, ఒక పేరుతో వున్న దానిని అచ్చుకాకుండా చేస్తే మరొక పేరుతో ఎలా జనంలోకి తెచ్చిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్ధితులు పునరావృతం కానున్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య మీడియాపై జనంలో విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్నప్పటికీ నిజం కాకపోతే ఎలా అచ్చువేస్తారులే అనుకునే జనం ఇంకా వున్నారు. అందుకే వాస్తవాలను మరుగుపరచి కట్టుకథలు పిట్టకధలతో జనాన్ని నమ్మించగలుగుతున్నాయి.

ఇపిడబ్ల్యు వంటి ట్రస్టు మీద మేధావి వర్గంలో ఇప్పటి వరకు వున్న అభిప్రాయం వేరు ఇక ముందు అలాంటిది వుండదనే విషయాన్ని సమీక్ష ట్రస్టు గుర్తించాలి. పూర్వపు విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే అసలు వాస్తవాలేమిటనే విషయాన్ని అది జనం ముందుంచాలి. తన సంపాదకుడు రాసిన విశ్లేషణకు ఆధారాలు చూపలేకపోతే అప్పుడు అతన్ని రాజీనామా చేయమనటమో లేకపోతే ఏకపక్షంగా తొలగించటమో చేసి తమ పత్రిక చేసిన తప్పిదాన్ని నిజాయితీగా అంగీకరించి వుంటే ఇపిడబ్ల్యు గౌరవం మరింత పెరిగి వుండేది. సంపాదకుడు చెప్పిన అంశాలపై ముందుగా ట్రస్టు అంతర్గత విచారణ జరిపి, పరి శోధనాత్మక వార్తకు వున్న ఆధారాలేమిటో అంతర్గతంగా పరిశీలించిన తరువాత చర్య తీసుకోవటం ఒక పద్దతి అదేమీ లేదు, ఆ వ్యాసాలను ఎందుకు వుపసంహరించారో అధికారికంగా వివరణ లేదు కనుకనే యాజమాన్యం బయటివారి వత్తిడికి లంగిపోయినట్లు భావించాల్సి వస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. అనేక మంది మేధావుల అభిప్రాయాలు, మనోభావాలను మన్నించి పారదర్శకంగా వ్యవహరిస్తే నీలినీడలు పటాపంచలవుతాయి. ఒక విస్వసనీయ పత్రికగా ఇపిడబ్ల్యు ముందుకు పోతుంది. లేకుంటే ఏం జరిగేది చెప్పాల్సిన పని లేదు. అమెరికాలో బడా మీడియా పాలవర్గతొత్తుగా మారి వాటి భజన చేస్తున్న సమయంలో వికీలీక్స్‌ వునికిలోకి వచ్చిన అమెరికా సామ్రాజ్యవాదుల బండారాన్ని వుతికి ఆరేస్తుందని, దాని గుట్టుమట్టులన్నీ బయటపెడుతుందని ఎవరైనా వూహించారా? ఆ సంస్ధ నిర్వాహకులకు అమెరికా ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఆధారాలు అందించబట్టే అది సాధ్యమైంది. అలాంటి వారు ప్రతి దేశంలోనూ వుంటారు. చరిత్రలో హేతుబద్దంగా ప్రశ్నించిన చార్వాకులను నాటి పాలకవర్గం నాశనం చేసింది. వారిని భౌతికంగా అంతమొందించారు తప్ప వారి భావజాలాన్ని అణచివేయలేకపోయారు. అలాగే ఇప్పటి వరకు ఇపిడబ్ల్యు నిర్వహించిన పాత్రను కొనసాగించేందుకు మరొక పత్రిక ఆవిర్భవించకుండా వుంటుందా ? ఏటికి ఎదురీదటమే బతికి వున్న చేపల స్వభావం. చచ్చిన చేపలే వాలునబడి కొట్టుకుపోతాయి. దేశంలో జర్నలిజం, జర్నలిస్టుల కర్తవ్యం కూడా బతికిన చేపల మాదిరి ఎదురీదటమే !

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నిస్సహాయత + అసహనం = చంద్రబాబు

11 Saturday Feb 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

chandababu, chandrababu fire on media, Intolerent chandrababu naidu, Media

Image result for Incapable,Intolerance chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

    అసహనం ! అసహనం !! అసహనం !!! సహనానికి మారుపేరైన మన దేశం, అక్షర క్రమంతో పాటు సహనంలో కూడా అగ్రస్ధానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు అసహనం అనే మందుపాతర మీద వున్నదా అనిపిస్తోంది. ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అన్నట్లు సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఒకటేమిటి అన్ని రంగాలు, స్త్రీ, పురుష బేధం లేకుండా ఎక్కడబడితే అక్కడ అన్ని చోట్లా పెరుగుతున్న అసహనం ఎలాంటి పర్యవసానాలకు దారితీయనుందో !

    అసహన రాజకీయాలు ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయని 90దేశాల పరిణామాలను పరిశీలించిన మానవ హక్కుల నిఘా సంస్ధ జనవరిలో విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ప్రకటించింది. అమెరికా, ఐరోపాలో ప్రజాకర్షక ధోరణి పెరుగుదల ప్రపంచంలో నియంతృత్వ నేతలను ప్రోత్సహించటం, బలిష్టం కావిస్తోందని కూడా హెచ్చరించింది.వేళ్లమీద లెక్కించగలిగిన ప్రపంచ బడా కార్పొరేట్లు, వాటి లాభాల కోసం కొన్ని ధనిక దేశాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాల పర్యవసానంగా ప్రపంచం మొత్తం అభివృద్ధికి ఎదురుగాలి వీస్తున్నది. సంక్షోభం అంటు వ్యాధిలా వ్యాపిస్తున్నది.

   అధికారమే పరమావధిగా ఏ అడ్డదారి తొక్కేందుకైనా సిద్ధం సుమతీ అన్నట్లు వుండే రాజకీయ పార్టీల, నేతల ప్రజాకర్షక నినాదాలు, చర్యలు ప్రకటించటాన్ని ఒలింపిక్స్‌లో చేరిస్తే మనకు అన్ని పతకాలు రావటం ఖాయం. తీరా అధికారానికి వచ్చాక వారి అసలు రంగు బయటపడుతోంది.తాబేలు నడక, ప్లేటు ఫిరాయించటం, చెప్పినవాటిని అమలు జరపమని ఎవరైనా అడిగితే వారిపై తాసుపాములా కస్సుమంటూ లేస్తున్నారు. ప్రశ్నించే తత్వాన్ని ఏ మాత్రం సహించలేక దురుద్ధేశ్యాలను ఆపాదించి అధికార దర్పంతో నోరు మూయించాలని చూస్తున్నారు. రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల పరిధి దాటి జర్నలిస్టులకు సైతం రాజకీయ అనుబంధాలు, వుద్ధేశ్యాలను ఆపాదించి అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది ప్రమాదకర పోకడ, గర్హనీయం కాదా ?

   విద్యా గంధం ఇచ్చే అత్యున్నత ఫలితం సహనం అని ప్రముఖ మానవతావాది హెలెన్‌ కెల్లర్‌ చెప్పారు. అది ఎంత మందిలో ప్రతిబింబిస్తున్నది అన్నది ప్రశ్న. ఒక కేసులో మన సుప్రీం కోర్టు మరో విధంగా చెప్పింది. అసహనం ప్రజాస్వామ్యానికేగాక వ్యక్తులుగా వారికి కూడా ఎంతో ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలని సలహా ఇచ్చింది.

    అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు ఎన్నికలు జరిగిన ప్రతి చోటా ప్రజాకర్షక వాగ్దానాల వరదలు వెల్లువెత్తుతున్నాయి. మచ్చుకు, ఫిలిప్పీనియన్ల జీవితాలను దుర్భరంగా మార్చివేసిన వారందరినీ అంతం చేయండి అంటూ ఎన్నికల ప్రచారంలో జనాన్ని రెచ్చగొట్టిన రోడ్రిగో డార్టే ఆదేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో వుద్యోగాలు అమెరికన్లకే, అమెరికాలో వుత్పత్తి చేయకుండా బయటి నుంచి దిగుమతులు చేసుకొంటే వాటిపై పెద్ద మొత్తంలో పన్ను విధిస్తా, బయటి దేశాలలో పని చేయించే కంపెనీలపై జరిమానాలు వేస్తా అంటూ వాగ్దానాలు చేసిన డోనాల్ట్‌ ట్రంప్‌ కూడా అధ్యక్షుడయ్యాడు. రాష్ట్రాన్ని ఒక పద్దతి ప్రకారం చీల్చకుండా అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్‌ మీద కారాలు మిరియాలు నూరుతూ వూరూ వాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన మిత్రపక్షం బిజెపి, వారిద్దరి మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ గురించి తెలిసిందే.

   బాబొస్తే జాబొస్తుందన్న నినాదం గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా గురించి స్వయంగా నరేంద్రమోడీ ఇక వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి, వేస్తున్న పిల్లి మొగ్గలూ అన్నీ ఇన్నీ కాదు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అక్కడ నరేంద్రమోడీ ప్రధాని, వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి అయ్యారు. వీరందరూ రాజకీయాల్లో, పాలనా వ్యవహారాలలో ముదుర్లు తప్ప లేగ దూడలు కాదు. అందుకే తరువాత చూసుకోవచ్చు లెమ్మని ప్రత్యేక హోదావంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి జనంపై ఎదురుడాడికి దిగారు.

    చంద్ర ‘బాబా ‘ తత్వశాస్త్రం ప్రకారం కేంద్రంపై పోరాటం చేస్తే పోలవరం వంటి ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రత్యేక హోదా బదులు పాకేజి తీసుకోవటం మెరుగు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని పెద్దలు చెప్పారు గానీ అది చివరికి ఎదురు తన్నుతుంది. అధికారానికి వచ్చిన తరువాత అమెరికాలో ట్రంప్‌ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవి అసంగతమైనవని, ఆ చర్యలతో అమెరికాను అస్తవ్యస్ధతలోకి నెట్టారని, ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేస్తాడో ఒక వుదాహరణగా మారాడని, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి జనం అధికారాన్నిచ్చారని, ఒక జోకర్‌గా ట్రంప్‌ తయారయ్యాడని చంద్రబాబు వివిధ సందర్బాలలో వ్యాఖ్యానించారు. జనం సొమ్మును అప్పనంగా ఖర్చు చేసి నేతల కీర్తి కండూతి కోసం మహిళా సాధికారత పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును దలైలామాతో ప్రారంభోత్సవం చేయించారు.

    ఈ రెండు చర్యలు ‘బాబా ‘ గారి లాజిక్కుకు విరుద్దమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు హాని కలిగించేవి. ట్రంప్‌ మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో వుంటారు. అలాంటి వ్యక్తిని పిచ్చివాడని, అమెరికాను నాశనం చేస్తున్నాడు, జోకర్‌ అని విమర్శించిన తరువాత అమెరికా నుంచి లేదా అమెరికా కంపెనీలున్న మలేషియా తదితర దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి. తనను అంత తీవ్రంగా విమర్శించిన నేత పాలకుడుగా వున్న రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే అమెరికాలో స్ధిరపడిన ప్రవాస ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భక్తులు పెట్టే పెట్టుబడుల గురించి ట్రంప్‌ ప్రభుత్వం సహిస్తుందా ? దలైలామా చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మన దేశంలో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి. అలాంటి పెద్దమనిషిని పిలిచి పెద్ద పీట వేస్తే గతంలో చంద్రబాబు చేసిన చైనా పర్యటనలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు చేసిన యత్నాలు ‘పవిత్ర సంగమం’ (కృష్ణా నది)లో పోసినట్లే కదా ! ఎందుకిలా ప్రవర్తిస్తున్నట్లు ? దలైలామాను పిలిచినందువలన మీడియాలో వార్తలు తప్ప పైసా ప్రయోజనం వుంటుందా ? చైనా కంపెనీలు ఒకటికి రెండుసార్లు వెనుకా ముందూ ఆలోచించవా?

   రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింప చేయటానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నాన్చి, నాన్చి రెండు సంవత్సరాల తరువాత ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పేసింది. దానికోసం పోరాడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానాలు చేయించారు. తీరా హోదా లేదు పాకేజి ఇస్తామని చెప్పగానే అందని ద్రాక్ష పుల్లన అన్న నక్క సామెత చందాన హోదా వలన ప్రయోజనం లేదు, అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు తెచ్చే పాకేజి ఎంతో ముద్దు అని కొత్త పల్లవి అందుకున్నారు.పనికిరాదని ముందే తెలిసినపుడు ఎన్నికలలో వాగ్దానమెందుకు? అసెంబ్లీ తీర్మానాలెందుకు? హోదా బదులు పాకేజీకి ఆమోద ముద్ర కోసం పోరాడాలని ఎంపీల సమావేశాలలో వుద్బోధలెందుకు ? ప్రతి నెలా జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశాలలో తెలుగు దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

    పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ వస్తారని అయన కోసం ఎయిర్‌ కండిషన్ల మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయించారు చంద్రబాబు. ప్రధాని రావటం లేదని, కేవలం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడతారని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం. చివరికి అదేమీ లేకపోగా ఏ కార్యక్రమాలూ లేకపోతే ఆకాశవాణిలో ప్రసారం చేసే ‘నిలయవిద్వాంసుల’ సంగీత కార్యక్రమాల మాదిరి వెంకయ్య నాయుడిని పంపారు. ప్రత్యేక హోదాను నిరాకరించిన తరువాత రాష్ట్రానికి రావటానికి నరేంద్రమోడీ జంకుతున్నారా ? వీడియో కాన్ఫరెస్సులో మాట్లాడకపోతే పోనీ రికార్డు చేసిన సందేశం పంపటానికి కూడా మోడీ తిరస్కరించారంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడి పలుకుబడి ఏపాటిదో అర్ధం కావటం లేదా ?

    హోదా లేదన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దానికి కూడా సహనంతో సర్దుకు పోతున్నారు. పోనీ పాకేజీని అయినా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందా అంటే నెలలు గడుస్తున్నా ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారైన స్ధితిలో వాటి గురించి అడగటమే పాపమన్నట్లుగా అటు వెంకయ్య నాయుడు, ఇటు చంద్రబాబు నాయుడు చిందులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా హోదా గురించి అడిగింది మేము మాత్రమే, మిగతావారెవరూ మాట్లాడలేదు, ఇప్పుడు మేమే అవసరం లేదంటున్నాము, అప్పటి మాదిరి ఇపుడు కూడా మిగతావారంతా నోర్మూసుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలోనా లేక నందంటే నంది పందంటే పంది అనక తప్పని నిరంకుశపాలనలో చెవుల్లో పూలు పెట్టుకొని వున్నామా ?

   గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఆయన ప్రభుత్వం పట్ల మీడియా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. తన విధానాలను విమర్శించే లేదా పదే ప్రశ్నించే రెండు పత్రికలను, ఛానళ్లను లక్ష్యంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ముద్రవేసి శత్రుపూరితంగా ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తనకు నచ్చని ఛానళ్లు పత్రికలకు, ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు పార్టీల ముద్రవేసి అదేపని చేస్తున్నారు. తటస్ధ వైఖరి తీసుకొనే మీడియా సంస్ధల జర్నలిస్టులే ప్రశ్నలు అడగాలని నిర్ధేశిస్తున్నారు. మీడియా తటస్ధత అంటే ఒక సంఘటన, ఒక అభిప్రాయం, అంశంపై ఒకే వైఖరిని పాఠకుల ముందుంచటంగాక అన్ని రకాల అభిప్రాయాలకు తగు స్ధానం కల్పించి అందచేయటం తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు అడగకూడదని అర్ధం కాదు.

     చంద్రబాబు తత్వశాస్త్రం ప్రకారం తటస్థం అంటే ఏం జరిగినా నోరు మూసుకోవాలని చెప్పటమే. తటస్ధ మీడియా సంస్ధల జర్నలిస్టులను కూడా చంద్రబాబుతో సహా ఏ ముఖ్యమంత్రీ సహించటం లేదు. మీడియా సమావేశంలో ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే సదరు విలేకరి వార్త ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లక ముందే సంపాదకుడు లేదా యాజమాన్య ప్రతినిధికి సచివాలయం నుంచి ఫోన్లు వెళ్లటం, ప్రకటనలను మరిచి పోవాల్సి వస్తుందని హెచ్చరించటం – వారు విలేకరికి తలంటించటం, వుద్యోగం నుంచి వుద్వాసనకు హెచ్చరికలు బహిరంగ రహస్యం. లాభాల కోసం రంగంలోకి వచ్చిన మీడియా సంస్ధలు చచ్చిన చేపల మాదిరి వాలునబడి పోతాయి తప్ప తటస్థంగా ఎ్కడుంటాయి ? వుద్యోగ భద్రత లేని కారణంగా అనేక మంది బలవంతంగా మౌనంగా సహిస్తున్నారు తప్ప జర్నలిస్టులందరూ ఆ స్థితికి చేరలేదు. ప్రజలకు వుపయోగపడతాయనుకున్న అంశాలను వెలికితీయటం, పాలకులుగా వున్న వారిని ప్రశ్నించే యావ, చేవ ఇంకా సజీవంగానే వుంది. అది లేని వారు యజమానులతో ప్రత్యక్ష సంబంధాలున్న రాజకీయనేతలో, యజమానో అధికారో చెప్పింది రాసుకొనే షార్ట్‌ హాండ్‌ గుమస్తాలు తప్ప జర్నలిస్టులు కారు. అటువంటి స్ధితి ప్రజాస్వామ్యానికి, జనస్వామ్యానికి ముప్పు.

     తటస్థం అని చెప్పుకొనే మీడియా సంస్ధల యాజమాన్యాలకు రాజకీయపార్టీలతో వున్న సంబంధాలు బహిరంగ రహస్యం. అనేక మంది పెట్టుబడులు వాటిలో వున్నాయి, అందువలన తెలుగు నేలపై అలాంటి తటస్థ మీడియా ఎక్కడ వుందనేది పెద్ద ప్రశ్న. ప్రశ్నించిన విలేకరులు, మీడియా సంస్ధలపై వైఎస్‌, చంద్రబాబు, వెంకయ్య నాయుడు వంటి వారు విరుచుకుపడినపుడు సీనియర్‌ జర్నలిస్టులు కూడా మౌనం దాల్చటానికి పూర్వరంగమిదే. పోనీ ఈ మౌనం వలన జర్నలిస్టులు బావుకుంటున్నదేమైనా వుందా అంటే అదీ లేదు. తమకు చట్టపరంగా రావాల్సిన వేతన భత్యాలను పొందుతున్న జర్నలిస్టులు ఎంత మంది వున్నారు. అసలు చట్టాలే అమలు జరగటం లేదు, వాటిని అమలు జరపాల్సిన ప్రభుత్వాలు యజమానుల కొమ్ము కాస్తున్నాయి. కాంగ్రెస్‌ పాలనలోగానీ తెలుగుదేశం పాలనలో గానీ ముఖ్య మంత్రులుగా వున్న వారు కొన్ని సంస్ధలపై విరుచుకుపడి వాటి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించారే తప్ప జర్నలిస్టులకు అమలు చేయాల్సిన చట్టాల అమలుకు ఒక్కటంటే ఒక్క చర్యకూడా తీసుకున్న పాపాన పోలేదు. కార్మిక శాఖ అధికారులు ఎన్ని మీడియా కార్యాలయాలను సందర్శించారు, చట్టాల అమలును పర్యవేక్షించారో చెప్పమనండి. జర్నలిస్టుల వేతన చట్ట అమలు గురించి సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది.

     చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చి మూడో సంవత్సరం త్వరలో పూర్తికానుంది. ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలపై అధికారికంగా యూనియన్‌ ప్రతినిధులతో ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా జరిపి సాధకబాధకాలను చర్చించలేదు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్న అనేక మంది విలేకర్లపై అధికారపక్ష శాసనసభ్యులు, వారి దగ్గరి బంధువులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని నియంత్రించటం లేదు, జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయటానికి సర్కార్‌కు రెండున్నర సంవత్సరాలకుపైగా పట్టింది, ఇంతవరకు ఒక్క సమావేశం కూడా జరపలేదు. ప్రెస్‌ అకాడమీ కూడా అంతే. చైర్మన్‌ నియామకం జరిపారు, పాలకవర్గాన్ని వేయలేదు, ఎలాంటి కార్యకలాపాలను ప్రారంభించలేదు. జర్నలిస్టుల సంక్షేమం గురించి ఇంత వరకు అసలు కమిటీ నియామకమే జరపలేదు. ఎందుకని ?

    అసహనాన్ని వ్యక్త పరిచేందుకు తెలుగులో ఒక సామెత వుంది. అదే మంటే నిస్సహాయతతో ‘ అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు ‘. రాజకీయ చాణుక్యుడిగా పిలిపించుకున్న చంద్రబాబు నాయుడి పరిస్థితి అలాగే వుందా అనిపిస్తోంది.అంతర్జాతీయ విషయాలపై స్పందన అడిగినపుడు మాదీ ప్రాంతీయ పార్టీ అంతర్జాతీయ విషయాలెందుకు బ్రదర్‌ అనే వారు. అలాంటిది ట్రంప్‌పై అసాధారణ వ్యాఖ్యలు చేయటాన్ని చూస్తే చంద్రబాబు బుర్ర ఎంతగా కలవర పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఎపుడైనా ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైనపుడు గతంలో నో కామెంట్‌ (వ్యాఖ్యానించదలచలేదు) అని తనదైన శైలిలో కన్నుగీటుతూ తప్పించుకొనే వారు. దాంతో విలేకరులు కూడా అంతకు మించి అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి ప్రశ్న వస్తే వెంటనే ముందు నువ్వు ఏ పత్రిక, ఏ ఛానల్‌ అని అడుగుతున్నారు. దానిని బట్టి స్పందిస్తున్నారు. విశాఖలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ‘ప్రజాశక్తి’ విలేకరిపై విరుచుకుపడుతూ చేసింది అదే. ఆల్‌ఇండియా, ప్రపంచ స్ధాయిలో ఎందరో జర్నలిస్టులను చూశానని చెప్పిన చంద్రబాబు ఆ స్ధాయిలో వ్యవహరించి వుంటే ఆయనకు హుందాగా వుండేది. అలా చేయకపోవటం విచారకరం. ఏ జాతీయ, అంతర్జాతీయనాయకుడు ప్రశ్న అడిగిన వారిని నువ్వు ఏ సంస్ధ ప్రతినిధివి అని అడిగి రాజకీయ అనుబంధాన్ని అంటగట్టిన వుదంతం మనకు కనపడదు.

    అంతెందుకు ఆ రెండు పత్రికలు, ఛానల్స్‌ అంటూ కయ్యం పెంచుకున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన కుటుంబ సభ్యులతో స్వయంగా ప్రారంభింప చేయించిన పత్రిక, టీవీ ఛానల్‌లో తాను వ్యతిరేకించిన మీడియా సంస్ధల నుంచి వచ్చిన వారినే జర్నలిస్టులుగా నియమించారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నవారికి విధి నిర్వహణ ముఖ్యం. వారు కూడా పౌరులే కనుక ఏ రాజకీయ అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు.యాజమాన్యాల ఆదేశాల మేరకు పని చేసి వుండవచ్చు. అంతమాత్రాన పని చేసే సంస్ధను బట్టి రాజకీయాలు, వుద్దేశ్యాలను అపాదించటం తగని పని. ఆ మాటకు వస్తే ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారి రాజకీయాల సంగతేమిటి ?

అనేక దేశాలు రక్షణాత్మక చర్యలలో భాగంగా తమ దేశాల నుంచి పెట్టుబడులు బయటకుపోకుండా చర్యలు తీసుకోవటంతో పాటు తామే ఆకర్షించుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో రాష్ట్రాలు అంతకంటే ఎక్కువగా రాయితీలతో పోటీ పడుతున్నాయి. అందువలన విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తాయని చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడుల పరిస్థితి అగమ్యంగా వుంది. విభజన సమయంలో ఇస్తామన్న ప్రత్యేక హోదా లేదు, దాని బదులు అంతకంటే మెరుగ్గా ఇస్తామన్న ప్రత్యేక పాకేజి బ్రహ్మపదార్ధంగా మారింది. నిజానికి అలాంటి ప్యాకేజీలు ప్రకటించటానికి కేంద్రానికి అసలు అధికారాలేమిటో ఎవరైనా చెప్పగలరా ?

   కన్నుగీటితే చాలు కాసుల వర్షం అన్నట్లుగా రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు వస్తున్నాయని, వాణిజ్యం చేసేందుకు అగ్రపీఠీన అత్యంత అనుకూల స్ధానంలో వున్నామని నిత్యం ఏదోఒక చోట సంతోషంతో విజయగాధలు వినిపిస్తున్న స్ధితిలో తమ అజెండాలోని వాటి గురించే ఒక చిన్న ప్రశ్న అడిగినా భరించలేని అసహనం ఎందుకు ? దేశ, విదేశాలు తిరిగి ఎంతో అనుభవం గడించిన చంద్రబాబుకు ఈ విషయాలేవీ తెలియవా ? రాష్ట్రంలో జనంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరచటానికి ఏదో ఒక రాజకీయం చేయాలి, లోపల ఏమున్నా పైకి నటించాలి. కేంద్రం నుంచి ప్రచారం చేసిన మాదిరి సాయం రాదని తేలిపోయింది. మాటలతో ఎక్కువ కాలం గడపటం కష్టం. అనేక రంగాలలో పురోగతి లేమి దాంతో ఒకవైపు నిస్సహాయత, దాన్నుంచి మరోవైపు తలెత్తుతున్న అసహనం అన్నీ కలిస్తే చంద్రబాబు అని చెప్పవచ్చు.

     అందుకే ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్‌, వామపక్షాలు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోవటానికి కారణమిదే ! ఇప్పుడున్న స్ధితిలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని ప్రతిపక్షాన్ని చూసి భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు, ఏ రోజు ఏ ఎంఎల్‌ఏను తమ నుంచి తీసుకుపోతారో అని ప్రతిపక్షమే భయపడే స్ధితి. జనానికి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను, వివిధ తరగతులపై జరుగుతున్న దాడులను ఎవరు ప్రతిఘటించాలి? ఎవరికి వారు ఏదో ఒక కారణం వెతుక్కొని నా వరకు వచ్చినపుడు కదా చూసుకోవచ్చు అనుకొనే వారికి జర్మన్‌ రచయిత మార్టిన్‌ నిమోలియర్‌ నాజీల గురించి రాసిన ప్రఖ్యాత కవితను గుర్తు చేయటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు- నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత కార్మికనేతల కోసం వచ్చారు -నేను కార్మికనేతను కాదు కనుక మిన్నకున్నాను

తరువాత యూదుల కోసం వచ్చారు -నేను యూదును కాదు కనుక నోరు విప్పలేదు

తరువాత నాకోసం వచ్చారు – నోరు విప్పేందుకు అప్పటికి నా వెనుక ఎవరూ లేరు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బహుమానం-బలి ఆయుధంగా ‘ప్రకటనలు’

12 Monday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

advertising purchases, freedom house, India press freedom, Media, Narendra Modi, news outlets, press freedom, punish, reward

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫ్రీడం హౌస్‌ విమర్శ

   తాము కోరుకున్న రీతిలో వార్తల ప్రచురణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా సంస్ధలపై బహుమానం-బలి ఆయుధంగా ‘ప్రకటనలను’ వుపయోగిస్తున్నాయని అమెరికా కేంద్రంగా పని చేసే ఫ్రీడం హౌస్‌ 2016 నివేదికలో మన దేశ పరిస్థితి గురించి పేర్కొన్నది. కోరుకున్న రీతిలో వార్తలు ఇస్తే బహుమానంగా ప్రకటనల జారీ, విమర్శనాత్మకం, వ్యతిరేక వార్తలు ఇచ్చిన వారికి శిక్షగా ప్రకటనలు ఇవ్వకపోవటం గురించి మన నిత్యజీవితంలో చూస్తున్నదే. ఆ నివేదికలో మన దేశం గురించి రాసిన కొన్ని అంశాలు ఇలా వున్నాయి. అంతకు ముందు సంవత్సర నివేదికలో పత్రికా స్వేచ్చలో 40, రాజకీయ వాతావరణంలో 20 వ స్ధానాలలో వున్నది కాస్తా 2016లో రెండింటిలో ఒక పాయింటు చొప్పున తగ్గి 41,21గా వున్నట్లు, భారత్‌ను పాక్షిక స్వేచ్చ వున్న తరగతి కింద పరిగణిస్తున్నట్లు పేర్కొన్నది.

    దక్షిణాసియా పరిధిలో భారత మీడియా 2015 సంవత్సరంలో అత్యంత స్వేచ్చాయుతమైనదిగా వుండగా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కింద మీడియా సిబ్బంది ఆటంకాలను ఎదుర్కోవటం కొనసాగింది. ప్రభుత్వ అధికారులను కలుసుకోవటంలో ఇబ్బందులను ఎదుర్కొన్నామని జర్నలిస్టులు చెప్పారు, ఆ ఏడాదిలో ప్రభుత్వ సెన్సార్‌ షిష్‌ను అతిగా వుపయోగించి నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరుగుతోందా అని దేశవ్యాపిత చర్చ జరగగా జర్నలిస్టులు, రచయితలు తమ పనికి సంబంధించి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. విధి నిర్వహణ కారణంగా ఒక జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. శిక్షలు పడని వాతావరణం నెల కొన్న కారణంగా హింసాకాండను ప్రోత్సహించారు.

ముఖ్య పరిణామాలు

    సతాయింపు లేదా ఇబ్బంది కలిగించేందుకు వుద్ధేశించిన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో పెట్టటాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ 2000 సంవత్సర ఐటి చట్టంలోని ఒక సెక్షన్‌ను నిలుపు చేస్తూ 2015మార్చినెలలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీలో 2012లో సామూహిత అత్యాచారం, హత్యకు గురైన ఒక వైద్య విద్యార్దినిపై నిర్మించిన ఒక డాక్యుమెంటరీని అదే నెలలో అధికారులు నిషేధించారు. ఫేస్‌బుక్‌లో విమర్మనాత్మక రిపోర్టులు పెట్టాడన్న కక్షతో వుత్తర ప్రదేశ్‌కు చెందిన పాలక సమాజవాదీ పార్టీకి చెందిన వారు జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ను జూన్‌ నెలలో సజీవదహనం చేశారు. ఆగస్టునెలలో గుజరాత్‌లో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శనలు జరిగిన సమయంలో జనం గుమి కూడ కుండా, వార్తలు, సమాచారాన్ని వెల్లడికానివ్వకుండా చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వం మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.

    భావ ప్రకటన, స్వేచ్చల గురించి రాజ్యాంగం హామీ ఇచ్చినప్పటికీ ఎల్లవేళలా కోర్టులు తగిన విధంగా వాటిని కాపాడలేదు లేదా లేదా ప్రభుత్వ అధికారులు తగిన విధంగా చట్టపరమైన రక్షణలు కల్పించటంలో వాటిని గౌరవించలేదు.మీడియా స్వేచ్చను పరిమితం చేసే అనేక చట్టాలు ఇంకా అమలులోనే వున్నాయి. ప్రభుత్వంపై ద్వేషం లేదా వుల్లంఘన లేదా వ్యతిరేకతను రెచ్చగొట్టటం లేదా ప్రయత్నించటాన్ని దేశ ద్రోహంగా పరిగణించే 1860పీనల్‌ కోడ్‌లోని 124ఏ కొనసాగుతున్నది. భద్రతకు సంబంధించిన అంశాల వార్తలపై నిషేధం, జర్నలిస్టులను శిక్షించే అదికారాన్ని కట్టబెట్టిన 1923నాటి అధికారిక రహస్యాల చట్టం అమలులో వుంది. రోడ్డు నిర్మాణ యంత్రాన్ని తగుల బెట్టేందుకు మావోయిస్టు సానుభూతి పరులకు సహకరించాడనే పేరుతో సోమారు నాగ్‌ అనే జర్నలిస్టును చత్తీస్‌ఘర్‌ పోలీసులు అరెస్టు చేశారు. హింసాకాండ, నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడనే ఆరోపణతో సంతోష్‌ యాదవ్‌ అనే జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. మీడియా సంస్ధలపై పరువు నష్టం కేసులు కూడా పెరిగాయి. ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ రాజకీయ అవినీతికి పాల్పడిందని రాసిన కారవాన్‌ పత్రికపై 3.9 కోట్ల డాలర్లకు కేసు వేసింది.

    దేశంలోని టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే డేటా, ఫోన్‌ కాల్స్‌ను ఒక కేంద్రీయ వ్యవస్ధ ద్వారా అధికారులు తెలుసుకొనేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రభుత్వ వ్యవస్ధకు అనుగుణంగా ఆ సమాచారం లేదని వెల్లడి అయితే దీర్ఘకాల జైలు శిక్షలు విధించవచ్చు. దానిని 2016లో అమలులోకి తీసుకురానున్నారు. జర్నలిస్టులకు వ్యతిరేకంగా దీనిని దుర్వినియోగం చేయవచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా నిఘావేసే ‘నేత్ర’ వ్యవస్ధ ఏర్పాటు గురించి వార్తలు వచ్చాయి.

   కొంత మందికి అనుకూలంగా వార్తలు రాయాలని కొంత మంది మేనేజర్లు జర్నలిస్టులను ఆదేశించటం ఆందోళనకరమైన అంశం. ప్రభుత్వానికి అనుకూలంగా మలిచేందుకు దూరదర్శన్‌ను వినియోగిస్తున్నారు. గొడ్డు మాంసంలో ఐరన్‌ లభ్యం అవుతుందని రాసినందుకు హర్యానా ప్రభుత్వం తన పత్రిక సంపాదకుడిని తొలగించింది. గొడ్డు మాంస వినియోగానికి వ్యతిరేకంగా హిందుత్వవాదులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పూర్వరంగంలో ఇది జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికార ప్రతినిధులు మీడియాతో మాట్లాడవద్దని చెప్పినట్లు తెలిసింది. ఆమేరకు మాట్లాడటం మానివేయటం లేదా ఎంతో కష్టంతో మాట్లాడుతున్నారని గతేడాది మార్చినెలలో 74శాతం మంది జర్నలిస్టులు వెల్లడించారు.

     ప్రభుత్వ రంగ కంపెనీల ప్రకటనలు పోగొట్టుకోకుండా వుండేందుకు కొన్ని మీడియా సంస&థలు స్వయం సెన్సార్‌షిప్పును విధించుకున్నాయి. గతంలో విమర్మశలతో కూడిన వార్తలు రాసిన విదేశీ జర్నలిస్టులకు వీసాలు దొరకటం కష్టమౌతున్నది. ఒక మరాఠీ ఛానల్‌ సంపాదకుడు నిఖిల్‌ వాగ్లేను మితవాద హింసాత్మక హిందూత్వ సంస&థ బెదిరించింది. కేబుల్‌ పంపిణీ నెట్వర్కులను స్వంతం చేసుకుంటున్న రాజకీయ నేతలు తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా లేని టీవీ ఛానళ్లను నిలిపివేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన మీడియాకు లబ్ది చేకూర్చటానికి, నచ్చని వాటిని దెబ్బతీయటానికి ప్రకటనల జారీని సాధనంగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ లేదా ప్రయివేటు ప్రయోజనాలకు గాను జర్నలిస్టులు, సంపాదకులకు లంచాలతో సహా ప్రలోభాలు అందోళన కలిగిస్తున్నాయి. అదే విధంగా బడా కంపెనీలతో ప్రయివేటు ఒప్పందాల కారణంగా అనేక కంపెనీలలో సంపాదకవర్గం-వాణిజ్య విభాగానికి హద్దులు చెరిగిపోతున్నాయి. పార్టీలు, అభ్యర్ధులకు అనుకూలంగా నోటుకు వార్తల ప్రచురణలపై ఎన్నికల కమిషన్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణలు జరుపుతున్నప్పటికీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున అవి జరుగుతున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రజాస్వామ్యం -మిలిటరీ- ప్రశ్నించే హక్కు ?

12 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Congress party, dadri, dalali, democracy, Media, military, right to ask a question, surgical strike

ఎంకెఆర్‌

   సమాజంలో ఎప్పుడూ విరుద్ధ భావజాలాల మధ్య సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అయితే అన్ని వేళలా అన్నీ ఒకే విధంగా సంఘర్షించుకోవు. ఎప్పుడూ ఒకటి ప్రధాన మైన సంఘర్షణగా వుంటుంది. దీని అర్ధం మిగతావి సంఘర్షించుకోవు అని కాదు. ఏ రెండింటి మధ్య జరిగేది ప్రధాన సంఘర్షణ అన్నది గుర్తించటం ముఖ్యం. అయితే వెంటనే దానితో అందరూ ఏకీభవించకపోవచ్చు.అసలు దానిని ఒక వైరుధ్యంగా కొందరు గుర్తించకపోవచ్చు కూడా. ఇప్పుడు దేశంలో అదే పరిస్ధితి వుందన్నది అనేక మంది అభిప్రాయం. కొంత మంది విభేదించినప్పటికీ అనేక దేశాలతో పోలిస్తే మనం మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్ధలో వున్నాం. భావ ప్రకటనా స్వేచ్చ మీద జరుగుతున్న తీవ్ర దాడిని సాధారణంగా మేథావి వర్గంగా భావించే వారందరూ వ్యతిరేకించకపోయినా గట్టిగా వ్యతిరేకించే వారు కూడా వున్నారు. కలుబుర్గి హత్యను ఖండించటానికి కేంద్ర సాహిత్య అకాడమీ తిరస్కరించటం మొదలు, ఎవరు ఏమితినాలి, తినకూడదు అని నిర్ధేశించిన దానిలో భాగంగా గొడ్డు మాంసంపై తలెత్తిన వివాదం, విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడిన వుదంతాలు, గో సంరక్షణ ముసుగులో ముస్లింలు, దళితులపై దాడులు, చివరికి తాజా సర్జికల్‌ దాడుల వరకు అనేక వుదంతాలలో తలెత్తిన ఘర్షణలను చూస్తే పూసల్లో దారంలో తిరోగామి భావజాలానికి ప్రాతినిధ్యం వహించే ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మనువాద, మతశక్తులు అన్ని రంగాలలో, అంశాలలో తమ ఆధిపత్యాన్ని రుద్దేందుకు ప్రయత్నించటం చూస్తున్నాం. వారేమీ దాచుకోవటం లేదు, బాహాటంగానే తెగింపుతో ముందుకు వస్తున్నారు. చర్చను ప్రమాదకర పరిస్థితిల్లోకి నెడుతున్నారు. ఇది ఒక పధకం ప్రకారం జరుగుతున్నదా? యాదృచ్చికమా అన్న గుంజాటన వున్న వారు తీరికగా ఆలోచించి దానిని తేల్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ దాడులకు ప్రతిఘటన కూడా అలాగే వుంది. అనేక మంది ఇదేదో తేడాగా వుంది అని ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి వారు పెరుగుతారు.అయితే ఈ శక్తుల ప్రయత్నాలన్నింటికీ తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఒక ఎత్తుగడగా అయినా వెనక్కు తగ్గి కొత్త దారులు వెతుకుతున్నారు.

    కలుబుర్గి హత్యపై తలెత్తిన రచయితలు, కళాకారులు, మేథావుల నిరసనలతో ఖంగు తిన్న శక్తులు కేంద్ర సాహిత్య అకాడమీతో సంతాపం ప్రకటింపు చేయించి పరువు దక్కించుకొని బయట పడ్డాయి. ఆవు మాసం వివాదం చివరకు దళితులపై దాడులకు తెరతీయటంతో స్వయంగా ప్రధాని జోక్యం చేసుకొని లోపల ఎలా వున్నప్పటికీ దళితుల ఓట్ల కోసం గోసంరక్షకులపేరుతో దుకాణాలు తెరిచారని తీవ్ర విమర్శలు చేయాల్సి వచ్చింది. వురి శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన, యాకుబ్‌ మెమెన్‌ వురి తీత సరైంది కాదని అభిప్రాయపడిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసి హైదరాబాదులో రోహిత్‌ వేముల ఆత్మ హత్యకు కారకులు కావటం, జెన్‌యు విద్యార్ధులపై తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు, కేసులతో వేధించేందుకు పూనుకున్నారు. ఆ రెండు చోట్లా జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఈ విషయంలోనూ తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. తమకు రాజకీయంగా లాభం అనుకుంటే ఏ వివాదాన్ని అయినా రావణా కాష్టంలా రగిలిస్తూనే వుంటారు, తాత్కాలికంగా అయినా నష్టం అనుకుంటే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గుతారు.ఇప్పుడు సర్జికల్‌ దాడుల వివాద వుదంతాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి వుంది.

    ఒక్కొక్క అంశంపై తమ ఆధిపత్యాన్ని రుద్ధేందుకు ప్రయత్నిస్తున్న మత, తిరోగామి శక్తులు సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నించటం ఒకటైతే , తలెత్తిన పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవటం మరొకటి. అసహనం, దేశభక్తి, ఆవు నుంచి తాజా మిలిటరీ చర్యల వరకు నడుస్తున్న చర్చలో రెండు ఈ ధోరణులను మనం చూడవచ్చు. పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదుల అణచివేతలో భాగంగా మిలిటరీ చేపట్టిన సర్జికల్‌ దాడులను దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించాయి. ఎవరూ వాటిని వివాదం చేయలేదు. అయితే ఆ దాడులనుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవటానికి బిజెపి తెరతీయటం, అది తగదన్న అంశంపై తీవ్రమైన రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ముందు బోనులో నిలబెట్టాల్సింది మీడియాను అంటే అతిశయోక్తిగా కనిపించవచ్చు. సర్జికల్‌ దాడుల గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరించినపుడు వచ్చిన వార్తల తీరు తెన్నులను ఒక్కసారి నెమరు వేసుకోండి. దాడుల ఖ్యాతిని పూర్తిగా మిలిటరీకే ప్రతిపక్షాలు అప్పగిస్తున్నాయని, నరేంద్రమోడీకి దానిని పంచేందుకు నిరాకరించాయని రాయటాన్ని ఏమనాలి. మరణించింది సైనికులు, ప్రాణాలకు తెగించి ప్రతిదాడులు జరిపింది సైనికులు, దీనిలో రాజకీయ నాయకులు లేదా పార్టీలకు ఖ్యాతిని ఆపాదించటం ఏమిటి ? వుప్పు తిన్న విశ్వాసం లేదా కిరాయి రాతలని ఇలాంటి వాటినే అంటారు.

    మిలిటరీ చర్యలను, మిలిటరీని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకున్న దేశాలలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన దేశాన్ని కూడా ఆ స్ధితిలోకి నెట్టదలచుకున్నారా ? కొందరి వుత్సాహం అలాగే కనిపిస్తోంది. కార్గిల్‌ యుద్ధాన్ని బిజెపి తన ఎన్నికల ప్రయోజనానికి వుపయోగించుకోవటం జగమెరిగిన సత్యం. ప్రతిపక్షం ఎంత బలహీనంగా వున్నప్పటికీ ఇది 1999 కాదు 2016 అని గుర్తించకుండా సర్జికల్‌ దాడులను కూడా అందుకు వినియోగించుకొనే ప్రయత్నం చేస్తే సహించే పరిస్థితి వుంటుందా ? మిలిటరీ చర్యలనుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించవద్దన్న అభిప్రాయాల వెల్లడి, ప్రకటనలు జాతీయ ఐక్యత ప్రదర్శించాల్సిన సమయంలో సైనికుల శౌర్య, పరాక్రమాలను అవమానించటమే అని చిత్రించటం అత్యంత ప్రమాదకర పోకడ. మొదటిది ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్చకు ప్రతిబింబం అయితే రెండవది అందుకు విరుద్ధమైన అణచివేత వ్యవస్ధ లక్షణం.

    మన దేశంలో స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్‌ పార్టీ చేయని తప్పిదం లేదు. అత్యవసర పరిస్థితి విధించి నిరంకుశత్వాన్ని రుద్ధేందుకు ప్రయత్నించింది. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అనుసరించి సామాన్య జనజీవితాలను అతలాకుతలం చేసింది. మతోన్మాదులతో పోటీపడి ఓట్ల కక్కుర్తితో మతశక్తులతో రాజీపడి లౌకిక వ్యవస్ధకు హాని చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చింది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించి ఇప్పుడు ప్రతిపక్షంగా పార్లమెంట్‌లో గుర్తింపునకు తగిన సంఖ్యలో కూడా సీట్లను పొందలేకపోయింది. ఇంకా దాని తప్పిదాలు చాలా వున్నాయి.

    రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలు జర్మనీ మిలిటరీపై నిషేధం విధించారు. అదే యుద్ధంలో జపాన్‌ను ఓడించి 1945-52 మధ్య కాలంలో తమ ఆక్రమణలో వుంచుకున్న అమెరికా ఆ దేశ రక్షణ బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు ఆ దేశంతో ఒక ఒప్పందం చేసుకొన్నది. రెగ్యులర్‌ మిలిటరీని నిషేధిస్తూ జపాన్‌ నూతన రాజ్యంగంలో ఒక అంశంగా చేర్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీ, జపాన్‌లకు సైన్యం లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ చిత్తుగా ఓడించింది. అంతే తప్ప కాంగ్రెస్‌ పార్టీని లేదా దాని హక్కులను గానీ జపాన్‌,జర్మనీ మిలిటరీల మాదిరి నిషేధించలేదు. అందువలన ఆ పార్టీ అయినా మరొకదానికి అయినా ఒక అంశం మీద అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చను కలిగి వున్నాయి.

    ఆ విధంగా చూసినపుడు బిజెపి లేదా దాన్ని చూసి సమాజవాది పార్టీ గానీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిపే ప్రచారంలో, పోస్టర్లలో సైన్యాన్ని వుపయోగించుకోకూడదని చెప్పేందుకు ఎవరికైనా హక్కుంది. ‘సర్జికల్‌ దాడులకు మా సంపూర్ణ మద్దతు వుందని నిర్ద్వంద్వంగా చెప్పాను. అయితే సైన్యాన్ని రాజకీయ పోస్టర్లు, ప్రచారానికి వినియోగించుకోవటాన్ని నేను సమర్ధించను ‘ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు రోజు కాస్త ఘాటుగా సైనికుల త్యాగాలను సొమ్ము చేసుకొనే దళారులుగా వ్యవహరించవద్దని విమర్శించారు. ఆ విమర్శ తమను గాక మిలిటరీని అన్నట్లే అంటూ బిజెపి విరుచుకుపడింది. సైనికుని బొమ్మను, మోడీ, బిజెపి నేతల బొమ్మలతో కలిపి ముద్రించి వుత్తర ప్రదేశ్‌లో బిజెపి ప్రచారం ప్రారంభించిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై చేసిన విమర్శలను మిలిటరీకి వర్తింప చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.

  దళాలీ( తెలుగులో దళారీ ) అన్నది పార్లమెంటేతర భాష కాదు. భోఫోర్స్‌తో సహా అనేక కుంభకోణాలలో దళారుల పాత్ర ఏమిటో కాంగ్రెస్‌కు, బిజెపికి తెలిసినంతగా ఈ దేశంలో మరొక పార్టీకి తెలిసే అవకాశం లేదు. దానిలో భాగంగానే బిజెపి ‘ధరమ్‌ కీ దలాలీ(మతం), గాయ్‌ కీ దళాలీ( ఆవు ) గంగా కీ దళాలీ ( గంగా నది)ని వుపయోగించుకుంటున్నట్లుగానే సైనికుల త్యాగాలను కూడా వుపయోగించుకుంటున్నదని బిజెపి పోస్టర్లను వుటంకిస్తూ కాంగ్రెస్‌ ఎదురు దాడికి దిగింది. రాజకీయాలలో దళారీ పదం వాడటం వుచితమేనా అన్న ప్రశ్నకు రాజకీయాలకు తావు లేని చోట బిజెపి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నది, మోడీని రాముడిగా చిత్రిస్తూ పోస్టర్లు వేశారు, సర్జికల్‌ దాడులతో ఆయన ఛాతీ 56 అంగుళాల నుంచి వందకు పెరిగిందని చెప్పారు, జాంబవంతుడు చెప్పిన తరువాతే హనుమంతుడికి తన బలం గురించి తెలిసి వచ్చి ఒక్క వూపులో సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించినట్లుగా సర్జికల్‌ దాడుల తరువాత మన సైన్యానికి తన బలం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు రక్షణ మంత్రి పరికర్‌. ఆయనను సన్మానించేందుకు సభలు జరుపుతున్నారు. బిజెపి ప్రతినిధి జివిఎల్‌ నరసింహారావు కూడా అదే రీతిలో తొలిసారిగా మిలిటరీకి తానంటే ఏమిటో తెలిసిందని మాట్లాడారు. నిజానికి ఇవి మిలిటరీని అవమానించే మాటలు. గతంలో చేసిన సర్జికల్‌ దాడులను విస్మరించటం, త్యాగాలను కించపరచటం తప్ప మరొకటి కాదు. దాడుల ఖ్యాతి పూర్తిగా సైనికులకే దక్కాలి. ఈ పూర్వరంగంలో ఒక పదం ముఖ్యం కాదు దాని వెనుక వున్న భావాన్ని అర్ధం చేసుకోవాలని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు. వుగ్రవాదులు పాకిస్తాన్‌ అనే వ్యాధి గ్రస్తు శరీరంలోని క్యాన్సర్‌ కణాల వంటి వారు, ప్రభుత్వం వాటిని అంతం చేయటానికి మద్దతు ఇస్తున్నాం, దానికి గుండెలు పొంగటం ఎందుకు, పోస్టర్ల ప్రచారం దేనికి, ఒక సర్జికల్‌ దాడితో వుగ్రవాదం అంతం కాదు, కానీ బిజెపి వుత్తర ప్రదేశ్‌లో ఆ పేరుతో ఓట్లు అడిగేందుకు ప్రచారం ప్రారంభించింది’ అని కూడా సిబాల్‌ చెప్పారు.

    ఆవు మాంసం కలిగివున్నారంటూ వుత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై సామాహిక దాడి చేసి కుటుంబ పెద్దను హత్య చేసిన కేసులోని ఒక నిందితుడు రవి శిశోదియా జైలులో చికున్‌ గున్యా వ్యాధితో మరణించాడు. అతని మృత దేహంపై బిజెపి నేతలు జాతీయ జండా కప్పటాన్ని ఏమనాలి. హిందూత్వ వాది కనుక కావాలంటే తమ బిజెపి జెండాను కప్పుకోవచ్చు, జాతీయ జెండాను కప్పటమంటే దానిని అవమానించటం తప్ప మరొకటి కాదు. బిజెపి ప్రవచించే జాతీయవాద నిజ స్వరూపం ఇదా ? దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల మృత దేహాలపై జాతీయ జెండా కప్పుతారు. మరి శిశోదియా ఏ త్యాగం చేశాడని ఇలా చేశారు ?

Image result for dadri lynching,sisodia, national flag

చికున్‌ గున్యాతో మరణించిన దాద్రి హత్య నిందితుడికి జాతీయ జెండా కప్పిన బిజెపి జాతీయవాదం

    సర్జికల్‌ దాడుల గురించి చర్చించ కూడదని బిజెపి నేతలు మనకు చెబుతున్నారు. అడిగితే అది పాక్‌ ప్రచార వలలో పడినట్లే నట ! సైనిక చర్యకూ జాతీయ వాదానికి ముడి పెడుతున్నారు. గో వధ నిషేధానికీ అదే ముద్ర, చివరికి గో సంరక్షకుల ముసుగులో చచ్చిన ఆవుల చర్మం తీసే, చచ్చిన ఆవులను తొలగించటానికి నిరాకరించిన దళితులపైనా దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. వారిని అలాగే వదలి వేస్తే చివరికి గో సంరక్షక్షుల దాడుల గురించి కూడా చర్చించటం కూడా దేశ ద్రోహమే అంటారేమో ? కొన్ని టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు, కాషాయ దళాల దృష్టిలో భిన్న, బేదాభి ప్రాయం వ్యక్తం చేసే వారందరూ ప్రమాదకారులు, దేశద్రోహుల కింద లెక్క. కనుక అంతిమంగా అలాంటి వారి నోరు మూయాలి లేకపోతే మూయించాలి, ఇదేగా ఇస్తున్న సందేశం ! ఇది ప్రారంభం మాత్రమే. మొగ్గలోనే ఇలాంటి ధోరణులను ఎదుర్కొనకపోతే చివరికి మానులై కూర్చుంటాయి.

   మిలిటరీని విమర్శించకూడదు ! న్యాయ వ్యవస్ధను విమర్శించకూడదు !! మిలిటరీ, న్యాయవ్యవస్ధలనేవి ఆకాశంలోంచి వూడి పడలేదు, కనుక విమర్శలకు అతీతం కాదు. ఏ దేశంలో అయినా మిలిటరీ చర్యలపై , న్యాయ వ్యవస్ధ తీర్పులపై విమర్శలు సహజం. వుద్రేకాలు, విద్వేషాలను అదుపులో వుంచుకొని ఆలోచించాల్సిన విషయాలు వున్నాయి. న్యాయమూర్తి స్ధానంలో కూర్చున్న వారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలన్నది ఒక విధి. తీర్పు రాకముందే లేదా తీర్పు వచ్చిన తరువాత వారికి దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ముందుగానే మరొక కోర్టులో తన కేసును విచారించాలని కోరే హక్కు ఎవరికైనా వుంది. అంత మాత్రాన సదరు న్యాయమూర్తిని అవమానించినట్లు కాదు. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు స్వచ్చందంగా తప్పుకొంటున్న విషయం విదితమే. అయితే ఒక తీర్పు వెలువడిన తరువాత దాని మంచి చెడ్డలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. అంతిమ తీర్పులో కూడా తమకు న్యాయం జరగలేదని ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. మిలిటరీ వ్యవహారం కూడా అంతే . దానిలో పని చేసే వారి చిత్త శుద్ధిని శంకించటం వేరు, మిలిటరీలో జరిగే, మిలిటరీ చేసే తప్పులను ఎత్తి చూపటం వేరు అని గమనించాలి.మిలిటరీకి అవసరమైన కొనుగోళ్లలో జరిగే అక్రమాల గురించి ఎన్నో విన్నాం.సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా అవి జరగవు. మిలిటరీ గనుక అక్కడ ఏం జరిగినా విమర్శించకూడదు, మీడియాలో దాని గురించి చర్చించకూడదు అంటే ఎలా ? కార్గిల్‌ యుద్ధంలో వందల మంది సైనికులు ప్రాణాలర్పించారు. వారి భౌతిక కాయాలను తరలించేందుకు కొనుగోలులో అక్రమాలకు పాల్పడింది అపర దేశభక్తులుగా పేరుపొందిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలనలో అన్నది తెలిసిందే. మిలిటరీ కొనుగోళ్లు కనుక విమర్శించకూడదంటే ఆ వివరాలు బయటకు వచ్చేవా ? అదే అయితే భోపోర్సు ఆయుధాల కమిషన్‌ ముడుపులూ అంతే కదా ?

    పది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మిలిటరీలో వున్న మైనారిటీల సంఖ్య ఎంత అనే సమాచారాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. ప్రతిపక్షంలో వున్న బిజెపి, మిలిటరీ అధికారులు, మరికొందరు దానిపై నానాయాగీ చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మిలిటరీ అంటే త్యాగం తప్ప రిజర్వేషన్లు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ భాష మాట్లాడతారు, కుల మతాల లెక్క కాదు అన్నారు. వివరాలు సేకరించాలన్నవారి కారణాలు వారికి వుంటే వ్యతిరేకించే వారికారణాలు వారికి వున్నాయి. అయితే మిలిటరీలో కుల, మత లేదా తెగల ప్రస్తావన లేదా, ముస్లింల సంఖ్యా వివరాలు లేవా అంటే వున్నాయి. అలాంటపుడు ఎందుకు వ్యతిరేకించినట్లు ? మన రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు. అయితే అది గౌరవం తప్ప అధికారాలు లేవు. లెక్కలు తీయాలని కోరింది రక్షణ మంత్రిత్వశాఖ. అలా లెక్కలు తీయటం మిలిటరీలో మతతత్వ బీజాలు వేయటమే అవుతుంది కనుక ఆ ప్రక్రియను నిలిపివేయాలని మాజీ సైనికాధికారి ఆర్‌ఎస్‌ కడియన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ఇలాంటి లెక్కలు తీయటాన్ని నిలిపివేసేందుకు రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మాజీ సైనికాధికారులు ధర్నాలు చేశారు. కార్గిల్‌ శవపేటికల కుంభకోణం ఫేం జార్జి ఫెర్నాండెజ్‌ సైన్యాన్ని మత పూరితం చేసే దేశ ద్రోహకర చర్య అని వర్ణించారు. 2004 జనవరి తొమ్మిదిన రక్షణ మంత్రిత్వ శాఖకు సైన్యం పంపిన ఒక నోట్‌లో పదకొండు లక్షల మంది సైనికులలో ముస్లింలు 29,093 మాత్రమే అని పేర్కొన్నారు. అంటే 13శాతం జనాభాకాగా సైనికులలో వారి శాతం 2.6 మాత్రమే. వారి శాతాన్ని పెంచమని కోరటం జాతి వ్యతిరేకం అవుతుందా ? గూర్ఖా, సిక్కు, రాజపుత్ర, డోగ్రా రెజిమెంట్లలలో ముస్లింలతో సహా ఆ తరగతులకు చెందని వారికి చాలా కాలం అసలు ప్రవేశం లేని విషయం తెలిసిందే. 1984లో అమృతసర్‌ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన వుగ్రవాదులను బయటకు గెంటి వేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ చర్య సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లో కొందరు సైనికులు తిరుగుబాటు చేసిన తరువాతే రెజిమెంట్లలో ఇతరులకు కూడా చోటు కల్పించి అఖిల భారత స్వభావం తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.

మన మిలిటరీ, న్యాయవ్యవస్ధ అయినా మన వైవిధ్య సమాజానికి ప్రతిబింబంగా వుండాలన్నదానితో ఎవరూ విబేధించనవసరం లేదు. అలా వుందా లేదా అన్నతి తెలియాలంటే వివరాలు వుండాలి, లోపం వుంటే అధిగమించేందుకు ప్రయత్నించాలి. మన దేశానికి వలస పాలన వారసత్వంగా అనేక అవలక్షణాలు వచ్చాయి. వాటిని వదలగొట్టుకోవాల్సి వుంది. వలస పాలకులు ఎందుకు అలా చేశారన్నది మరో సందర్భంలో చర్చించవచ్చు.మన సైన్యంలో సిక్కు, గూర్ఘా, జాట్‌, రాజపుత్ర, డోగ్రా,పంజాబ్‌, మద్రాస్‌, మరాఠా, బీహార్‌, ఇలా మరికొన్ని పేర్లతో రెజిమెంట్లు వున్నాయి. నిజానికి లౌకిక భారత్‌ లేదా స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ కొనసాగటం ఆశ్చర్యకరమే. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాగా రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశ రక్షణలో మరింత చురుకుగా పాల్గొనేందుకు తమ పేరుతో ఒక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని నాగాల ప్రతినిధులు కోరిన మేరకు 1970లో ఆ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. మేమెంతో మాకంత వాటా మాదిరి నినాదాలతో అస్థిత్వ భావనలు తీవ్రంగా వ్యాపించిన వర్తమాన పరిస్థితులలో ప్రత్యేక రెజిమెంట్ల ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు అవకాశం వుందా లేదా ?

   దేశ విభజనకు ముందు పాకిస్థాన్లో ఎంత మంది హిందువులున్నారు, ఇప్పుడు ఎంత మంది వున్నారో చూడండంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు జనాన్ని తప్పుదారి పట్టించే లెక్కలు కొన్ని చెబుతుంటారు. మన రక్షణ శాఖ సహాయ శాఖ మంత్రిగా పని చేసిన మహావీర్‌ త్యాగి అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశ విభజనకు ముందు భారత సైన్యంలో ముస్లింలు 32శాతంగా వుండగా విభజన తరువాత రెండు శాతానికి పడిపోయింది. ఇది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, ఇతరుల శాతం ఎంత అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ? అయితే సచార్‌ కమిటీ సూచన ప్రకారం ముస్లింల సంఖ్య తెలుసుకోవాలనుకోవటంలో మైనారిటీల సంతుష్టీకరణ, దాన్ని వ్యతిరేకించటంలో మెజారిటీ సంతుష్టీకరణ కోణాలు కూడా లేకపోలేదు. అధికారంలో ఏ పార్టీ వున్నప్పటికీ రాజ్యాంగ బద్దంగా దళితులు, గిరిజనుల వుప ప్రణాళికలకు నిధులు కేటాయించాలన్నా, మత, భాషా మైనారిటీల సంక్షేమానికి చర్యలు, పధకాలను రూపొందించాలన్నా వారి సంఖ్యా, ఇతర పరిస్థితుల వివరాలు తెలియకుండా ఎలా సాధ్యం. వాటిని సేకరించటం ఆ తరగతుల సంతుష్టీకరణ అని ఇంతకాలం రాజకీయం చేసిన బిజెపి ఇప్పుడు కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. అవేమీ లేకుండానే వారికి పధకాలు రూపొందిస్తుందా? వున్న పధకాలను ఎత్తివేస్తుందా ? అమెరికా అంటే బిజెపి, సంఘపరివార్‌ శక్తులకు వల్లమాలిన అభిమానం అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ గొడుగులు పడతారు. అమెరికా పర్యటన జరపాలని నరేంద్రమోడీ ఎంతగా తపించి పోయారో తెలిసిందే. అలాంటి అమెరికా సైన్యంలో ముస్లింలు, నల్లవారు, తెల్లవారు, ఇతర జాతుల వారు ఎందరున్నారో ప్రతి ఏటా సంఖ్యా వివరాలను ప్రకటిస్తారని తెలియదా ? మరి అక్కడ రాని పొరపొచ్చాలు మన దేశంలో ఎందుకు వస్తాయని భావిస్తున్నారు?

    పాకిస్తాన్‌ పాలనలో మిలిటరీ ఆధిపత్యం, ప్రభావం గురించి బహిరంగ రహస్యమే. ఆ మిలిటరీ చర్యలను కూడా అక్కడి మీడియా తప్పు పట్టి ప్రశ్నించిందన్న విషయాన్ని అంగీకరిస్తారా లేక పాక్‌ మీడియా కథలను ప్రచారం చేయటంగా కొట్టి పారవేస్తారా ?http://indiatoday.intoday.in/story/pakistan-miliatry-is-no-holy-cow/1/143245.html ఈ వ్యాసాన్ని మన భారతీయ పత్రిక ఇండియా టుడే ఐదు సంవత్సరాల క్రితం ప్రచురించింది. అందరూ చూస్తుండగానే ఇస్లామాబాద్‌లో సలీమ్‌ షహజాద్‌ అనే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు అపహరించి తరువాత చంపివేశారు.అది మిలిటరీ కనుసన్నలలో పని చేసే ఐఎస్‌ఐ పనే అని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. వార్తలు వాస్తవం కాదని తోసి పుచ్చితే ఒక రకం, అలా కాకుండా వివరాలను వెల్లడిస్తే అది జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని, సైనిక బలగాల నైతిక స్ధైర్యం దెబ్బతింటుందని పేర్కొనటమే కాదు, కస్టడీలోకి తీసుకున్న పౌరులను మిలిటరీ చిత్రహింసలు పెట్టదు, చంపదు అని, సలీమ్‌ సహజాదీ హత్యలో ఐఎస్‌ఐ ప్రమేయమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. దీనిపై పాక్‌ పత్రిక ఫ్రైడే టైమ్స్‌ పత్రిక సంపాదకుడు నజమ్‌ సేథీ వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో విమర్శలకు అతీతమైవేవీ లేవు, మిలిటరీ కూడా అలాంటిదే అని రాశాడు. మరి మనది ప్రజాస్వామ్యం. కాశ్మీర్‌, ఈ శాన్య రాష్ట్రాలలో ప్రత్యేక అధికారాలు కలిగిన మిలిటరీపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మిలిటరీ సైతిక స్ధైర్యం దెబ్బతిన కుండా వుండాలంటే ఆ చర్యలను విమర్శించకూడదా ? మిలిటరీ చర్యలతో దెబ్బతింటున్న సామాన్య పౌరుల మనో స్ధైర్యం నంగతేమిటి ?

    పౌరపాలకుల పర్యవేక్షణలో పని చేస్తున్న మిలిటరీ వ్యవస్ధలలో మనది ఒకటిగా గర్వించాల్సిందే. నిత్యం సరిహద్దులను కాపాడుతున్న వారి సామర్ధ్యం, త్యాగాలకు హారతి పట్టాల్సిందే. వారి విశ్వసనీయతను ప్రశ్నించకూడదన్నది కూడా నిజమే. సర్జికల్‌ దాడులకు మన దగ్గర సాక్ష్యాలు వున్నాయని బల్లగుద్ది మరీ చెప్పినపుడు అబ్బే అసలు దాడులే జరగలేదని పాక్‌ ప్రభుత్వం ఎత్తుగడగానే చెప్పి వుండవచ్చు, ఎందుకంటే తన పౌరులకూ అది సంజాయిషీ ఇచ్చుకోవాలి గనుక.ఈ వుదంతంలో ప్రపంచ దృష్టిలో ఎవరిది పైచేయిగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌ అసలు దాడులే జరగలేదనే వాదనకే కట్టుబడి వుంది. పరిస్థితులు సాధారణంగానే వున్నాయి చూడమంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాలను చూపింది. దాడులు జరిగి వుంటే సాక్ష్యాలు వెల్లడించాలని సవాలు చేస్తున్నది. ఇది కూడా ప్రచార ఎత్తుగడే అనుకుందాం .

  మన దేశంలో జరిగిందేమిటి ? తాజా వివాదానికి అధికార రాజకీయ నేతల, మిలిటరీ వున్నతాధికారుల బాధ్యతేమీ లేదా ? సర్జికల్‌ దాడుల వివరాలతో సహా అనేక అంశాలు గోప్యంగా వుంచాల్సినవే అయినపుడు దాడులను తాము చిత్రీకరించామని, ద్రోణులను కూడా వుపయోగించామని చెప్పాల్సిన అవసరం ఏముంది. దాడులు చేశాం అని మాత్రమే చెప్పి వుంటే సరిపోయేది కదా ? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన మాదిరి కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడించి నట్లు మిలిటరీ వినియోగించిన రాత్రుళ్లు చూడగలిగే పరికరాలు మా మచిలీపట్నంలోని బెల్‌లో తయారు చేశారని, ఆ ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు మా చంద్రబాబు నాయుడు నిమ్మలూరులో మరో ప్లాంట్‌ ఏర్పాటుకు చర్య తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు సర్జికల్‌ దాడుల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదా ? సర్జికల్‌ దాడుల రీత్యా సరిహద్దులలో పాక్‌ మిలిటరీ చర్యకు పూనుకోవచ్చంటూ వందలాది గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించటానికి, తరువాత ఆ కార్యక్రమాన్ని వుపసంహరించుకోవటానికి బాధ్యత ఎవరిది? దాడుల గురించి గుండెలు వుప్పొంగించుకోనవసరం లేదని జబ్బలు చరుచుకోవనవసరం లేదని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారంటూ వచ్చిన వార్తలు కూడా పాక్‌ సృష్టే అంటారా ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి అంతా మోడీకే దక్కాలని రాసిన మీడియా పెద్దమనుషులే రొమ్ములు విరుచుకోవనసరం లేదని ప్రధాని చెప్పినట్లు కూడా రాయటం మోడీ వ్యక్తిత్వాన్ని పెంచటంలో భాగమని సంతోషించి వుండవచ్చు. కానీ అవి సర్జికల్‌ దాడుల తీవ్రతను తగ్గించే సందేశాన్ని కలిగి వున్నాయని గ్రహించారా ? ఎవరు ఎవరి వలలో పడ్డారు.ఈ మొత్తం వుదంతం ఎలాంటి సందేశం ఇస్తున్నది ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బ్రెక్సిట్‌ : మీడియా వైఖరి ఏ పక్షం ?

09 Saturday Jul 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

BBC, brexit, brexit media, Media, media bias

Image result for brexit media bias

ఎం కోటేశ్వరరావు

   ఇటీవలి కాలంలో మీడియా పాత్ర గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి చోటా ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతోంది. కుక్క మనిషిని కరిస్తే అది సాధారణ ఘటన, అదే మనిషి కుక్కను కరిస్తే సంచలన వార్త. అదే మాదిరి సాధారణ అర్ధంలో మీడియాకు చెప్పిన నిర్వచనం ప్రకారం వ్యవహరిస్తే అది సాధారణం అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అది చర్చ నీయాంశం అవుతుంది. వర్తమానంలో ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవాలనే అంశంపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ, అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో అక్కడి ప్రధాన రిపబ్లిక్‌, డెమోక్రటిక్‌ పార్టీల తరఫున ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే అంశంలో ఆ రెండు పార్టీలలో పోటీ బడిన వారు పార్టీ సభ్యుల మధ్య జరిపిన ఓటింగ్‌ సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు, లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారంలో వున్న చోట ఆ ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా మీడియా వ్యవహరించటం తీవ్ర చర్చ నీయాంశం అయింది. ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ పరిణామాల గురించి చూద్దాం.

   న్యూ (కొత్తది) అనే ఏక వచన ఆంగ్ల పదానికి బహువచన రూపమే న్యూస్‌(కొత్తవి). సులభంగా చెప్పాలంటే తాజా కూరల గంప. దానిలో రకరకాల కాయలు, ఆకు కూరలు, మసాలాకు వుపయోగించే కరిపేపాకు, కొత్తి మీర వంటి వన్నీ గంప లేక బండిలో ఒకే దగ్గర వుంచి విక్రయించినట్లుగానూ న్యూస్‌ పేపర్లు, పుస్తకాలు, అవే ఎలక్ట్రానిక్‌ రూపంలో రేడియో,టీవీలు మొదలైనవి. కొంత మంది న్యూస్‌లో నాలుగు ఆంగ్ల అక్షరాలు నాలుగు దిక్కులను సూచించే పదాలలోని మొదటి అక్షరాలని అంటే నలుదిక్కులకు సంబంధించి సమాచారమని కూడా కొందరు వ్యాఖ్యానాలు చెప్పి వుండవచ్చు. అలా తీసుకున్నా దాని అర్ధంలో పెద్ద మార్పు వుండదు.

  సమస్య ఎక్కడ వస్తుందంటే నాలుగు దిక్కులకు చెందిన నూతన సమాచారాన్ని ఎలా అందించాలన్న దగ్గర వస్తోంది. మన దేశంలో స్వాతంత్య్రానికి ముందు పత్రికలు ప్రభుత్వానికి చెందిన నిర్ణయాలు, అభిప్రాయాలను, వైఖరులను మాత్రమే అందచేసేవి. అంటే ఆంగ్లేయుల పాలన కొనసాగింపు, ఆంగ్లేయుల కంపెనీల ప్రయోజనాలు, ప్రపంచ పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వ, పాలకుల వైఖరిని సమర్ధిస్తూ వార్తలు ఇచ్చేవి. అందుకే రాణిగారి పక్షం అని పిలిచేవారు. ఏకపక్షంగా వార్తలు ఇస్తూ, పాలనలోని లోపాలను, హాని కర విధానాలను విస్మరించటం పాఠకులలో విమర్శలకు కారణం కావటంలో కొన్ని పత్రికలు సున్నితంగా విమర్శలు చేసేవి. రాణిగారి విధానాలు మంచివే గానీ వాటి అమలులో అధికారుల లోపాల కారణంగా సమస్యలు అనే పద్దతిలో వార్తలు ఇస్తే అటు రాణీగారికి ఇబ్బంది లేదు ఇటు పాఠకులను కొంత మేరకు సంతృప్తి పరచవచ్చు. అలా ఇచ్చిన పత్రికలను రాణీగారి ప్రతిపక్షం అని పిలిచారు. ఈ రెండు రకాల పత్రికల ధోరణులకు భిన్నంగా అసలు ఆంగ్ల పాలన, జాతీయ, అంతర్జాతీయంగా బ్రిటన్‌ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేక వైఖరితో స్వాతంత్ర పోరాటానికి అనుకూలంగా వార్తలు ఇచ్చిన పత్రికలు కూడా మన దేశంలో వునికిలోకి వచ్చాయి. ఇవి ఒక తరగతి, స్వాతంత్ర పోరాటంతో పాటు వచ్చే స్వాతంత్య్రం దేశంలోని 99 శాతం మంది ప్రయోజనాలకు అనుగుణంగా వుండాలనే వైఖరితో వార్తలు, వ్యాఖ్యానాలతో వెలువడే పత్రికలు కూడా వచ్చాయి. అందువలన మీడియా అనే సాధనాన్ని ఎవరికి అనుకూలంగా వుపయోగిస్తున్నారనే దానిని బట్టి స్థూలంగా చెప్పాలంటే రెండు రకాలు ప్రతి సందర్భంలోనూ వున్నట్లు మనం గమనించవచ్చు.ఈ పూర్వరంగంలో బ్రిటన్‌ ప్రజాభిప్రాయం సందర్భంగా మీడియా వ్యవహరించిన తీరు తెన్నులను పరిశీలిద్దాం.

   ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. ఆ మేరకు జూన్‌ చివరి వారంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్‌లో 52శాతం బయటకు వెళ్లిపోవాలని, మిగిలిన వారు వుండిపోవాలని ఓటు చేశారు.ఈ ప్రక్రియను ఆంగ్లంలో పొట్టిగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. ఓటర్లు మొత్తం పాల్గొని వుండి వుంటే, మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే ఫలితం ఎలా వుండేదో చెప్పలేము. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి ఆలోచనల చేయకుండా మీడియా వార్తలను చూసి వ్యతిరేకంగా ఓటేశాము అని చెప్పిన వారు వున్నారు. తూచ్‌ మేము ఇలా అనుకోలేదు, తిరిగి ప్రజాభిప్రాయసేకరణ జరపండి అప్పుడు మేము సరైన నిర్ణయం తీసుకుంటామంటూ వ్యతిరేకంగా, అనుకూలంగా ఓటు చేసిన వారు, అసలు ఓటింగ్‌లో పాల్గొనని వారూ లక్షల మంది పార్లమెంట్‌కు నివేదించారు. బ్రిటన్‌ నిర్ణయం ప్రపంచాన్ని కుదిపివేసింది అంటే అతిశయోక్తి కాదు. అంతర్గతంగానే కాదు అంతర్జాతీయంగా కూడా లాభ నష్టాల పర్యవసానాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒక పెద్ద వుపద్రవం సంభవించినపుడు ఎవరికీ ఏమీ నిర్దిష్టంగా తెలియదు, ప్రతి ఒక్కరూ తోటి వారిని వూరడించేందుకో లేక తెలుసుకొనేందుకో, తనకు తెలిసినదానిని చెప్పేందుకో పడే మూక ఆతురత కనిపిస్తోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎవరైనా యువతీ యువకులు వెంటనే వివాహం చేసుకోవాలనుకుంటే ఏటిఎం ఏదైతేనేం తీసుకోవటానికి మిషన్‌లో డబ్బుందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు పక్కనే వున్న ఆంజనేయ స్వామి గుడి అయినా సరే అర్ధగంటలో ఆ తంతు పూర్తిచేస్తారు, అదే విడాకులు తీసుకోవాలంటే నిర్ణీత వ్యవధి అవసరం అలాగే నిబంధనావళిని పూర్తిగా పాటిస్తే ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది, ఇంకా సాగదీయాలనుకుంటే ఆ తరువాత ఎంత కాలం పడుతుందో తెలియదు. లేదూ ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి ఐరోపా యూనియన్‌లోనే కొనసాగాలని అనుకుంటే అదీ సంభవమే.

     బ్రిటన్‌లో ఎంత అవివేకులైన ఆధునికులు వున్నారో బ్రెక్సిట్‌ వెల్లడించిందని సత్యజిత్‌ దాస్‌ అనే ప్రవాస సంతతికి చెందిన బ్రిటీష్‌ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. మీడియా తమను తప్పుదారి పట్టించింది అని కొందరు మండి పడుతుంటే జనంలో వున్న వెధవాయత్వం గురించి కొందరు అదే మీడియాలో తప్పుడుతున్నారు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని చెప్పినట్లుగా మీడియా ఎలా అయినా సొమ్ము చేసుకుంటుందా ? ఒక వివాదం లేదా ఒక విధానం గురించి చర్చ, ఓటింగ్‌, నిర్ణయం జరిగే సందర్బాలలో మీడియా ఎలా వ్యవహరించాలి అన్నది మీడియా ప్రారంభం నుంచి ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూనే వుంది.నిష్పక్షపాతంగా, మంచి చెడ్డలను తక్కెట్లో పెట్టి సమంగా తూచినట్లుగా వుండాలని ఎవరైనా కోరుకుంటారు. అలా జరుగుతోందా ?

    సాధారణంగా ఎన్నికలలో ఓడినవారు విచారపడితే గెలిచిన పక్షం విజయం జరుపుకుంటుంది. ఈ బ్రెక్సిట్‌లో అక్కడి టోరీ, లేబర్‌ పార్టీ రెండూ ఓడాయి, రెండూ గెలిచాయి. ఎందుకంటే ఓటింగ్‌ ఫలితం రెండు పార్టీల నాయకత్వాలలో అభిమానులలో చీలిక తెచ్చింది.ఐరోపా యూనియన్‌ శ్రామికుల, మధ్యతరగతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తోందన్న భావన నానాటికీ పెరుగుతోంది కనుక దానికి వ్యతిరేకంగా కొందరు, దీర్ఘకాలంగా దానిలో బ్రిటన్‌ సభ్యురాలిగా వుంది కనుక తమ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసిందని మరికొందరు, మిగతా దేశాలతో మనకు అనవసరం మన దేశం, మన పూర్వవైభం, మన పలుకుబడి, పెత్తనం అనే పెత్తందారీ జాతీయవాదం తలకెక్కించుకున్నవారు ఇలా వివిధ కారణాలతో ఓటు చేశారని చెబుతున్నారు. కొంతమంది చెప్పినట్లు ప్రపంచీకరణ, అక్కడి పాలకవర్గం అనుసరిస్తున్న పొదుపు చర్యలపై రెండు పార్టీల వెనుక వున్న సామాన్యుల ఆగ్రహం అందామా ? ఒక వేళ అదే సరైనది అనుకుంటే బ్రెక్సిట్‌ను మొత్తం మీద మీడియా అంతా బలపరిచింది అంటున్నారు కనుక మీడియా కూడా ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మారిందా ? మీడియాను అదుపు చేస్తున్న కార్పొరేట్‌ శక్తులు మారుమనసు పుచ్చుకున్నాయా ? అన్న ప్రశ్నలకు సమాధానం కష్టం. ప్రపంచాధిపత్యంలో పోయిన బ్రిటన్‌ ప్రాభవాన్ని లేదా పెత్తనాన్ని పూర్తిగా పునరుద్దరించలేకపోయినా కనీసం తమ ప్రయోజనాలనైనా రక్షించుకోవాలనే బ్రిటన్‌ కార్పొరేట్‌ (ఆర్ధిక) జాతీయ వాదం వైపు మొగ్గేట్లు జనాన్ని మీడియా ఒకవైపుకు నెట్టిందా ? ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే వర్గ, ఆర్ధిక,విద్య, వయస్సు, నివాసం, జాతి మొదలైన అంశాలన్నీ పని చేసినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆ లక్షణాలన్నీ దానిలో వున్నాయి. ఏది ఎక్కువ పని చేసింది ? ఇంకా లోతుగా అధ్యయనాలు వెలువడితే తప్ప నిర్ధారణకు రాలేము. సాంకేతికంగా ఈ ఓటింగ్‌కు ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగటానికి సంబంధం లేదు. ఓటు చేశారు కనుక వెంటనే వెళ్లి పోండి అని మిగతా సభ్య దేశాలు కోరాయి గనుక బ్రిటన్‌ వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. మేం విడిపోవాలనుకున్నాం అని చెప్పినంత మాత్రాన విడాకులు రావు, కోర్టులో తమ వినతిని దాఖలు చేయాలి. అలాగే ఐరోపా యూనియన్‌ నిబంధనావళిలోని ఆర్టికల్‌ 50 ప్రకారం తాము విడిపోయేందుకు క్రమాన్ని ప్రారంభించాలని బ్రిటన్‌ కోరినపుడే ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రధానిగా వున్న కామెరాన్‌ రాజీనామా ప్రకటించారు, కొత్త ప్రధాని ఎన్నికైన తరువాత ఆ క్రమాన్ని ప్రారంభంపై నిర్ణయంతీసుకుంటారని చెప్పారు. బ్రెక్సిట్‌లో మీడియా పాత్ర గురించి చూద్దాం.

   రెండు తెలుగు రాష్ట్రాలలోని పత్రికలు అసాధారణరీతిలో ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని పాఠకులకు అందించాయి.సామాన్య జనం కంటే మధ్యతరగతి, ధనికులు, కార్పొరేట్‌ శక్తులకు ఆసక్తికలిగించే అంశం నుక అంత ప్రాధాన్యత ఇచ్చాయని వేరే చెప్పనవసరం లేదు. బ్రిటన్‌ జాతీయ పత్రికలన్నీ దాదాపుగా బ్రెక్సిట్‌కు మద్దతు ఇచ్చాయి. అయితే కొన్ని పత్రికలు పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొలది తామూహించినట్లు జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత లేకపోవటాన్ని గమనించిగానీ లేదా తాము ప్రచారం చేసిన దానికి భిన్నంగా ఫలితం వస్తే తమ విస్వసనీయత దెబ్బతింటుందని భయపడి గానీ చివరి క్షణంలో వైఖరి మార్చుకున్నాయి. బ్రెక్సిట్‌కు అనుకూలంగా వ్యవహరించినవి కొన్ని అనుకూల రాగాలాపన చేశాయి. డేవిడ్‌ కామెరాన్‌, ఐరోపా అనుకూల శిబిరానికి దెబ్బ అంటూ తొలిపేజీలో ఒక పెద్ద వార్తను దాదాపు రెండు నెలల ముందుగానే ‘అబ్జర్వర్‌ ‘ ప్రచురించింది.నలభైమూడు శాతం విడిపోవటానికి, 39శాతం వుండిపోవటానికి అనుకూలంగా వున్నారని 18శాతం మంది నిర్ణయించుకోలేదని అది పేర్కొన్నది. నల్లడబ్బు అక్రమంగా దాచుకున్నవారి గురించి పనామా పత్రాలు వెల్లడి అయిన రోజు కూడా బ్రిటన్‌ పత్రికలు విడాకుల వార్తలకే ప్రాధాన్యత ఇచ్చాయి. జూన్‌ 23వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచీ ఐరోపాకు వస్తున్న వలస జనాభాకు, ఐరోపా యూనియన్‌కు లంకె పెట్టి వ్యాఖ్యాతలు, సంపాదకులు తమ రచనలను నింపివేశారు.త్వరలో వెల్లడి కానున్న బ్రిటన్‌కు వలస వచ్చిన వారి వివరాల సమాచారమంటూ నెల రోజుల ముందే డెయిలీ మెయిల్‌ తొలి పేజీలో డెయిలీ మెయిల్‌, సన్‌ పత్రికలు రెండవ పేజీలో వార్తలను ప్రచురించాయి. విడిపోవాలన్న వైఖరి తమకు ఒక పెద్ద విజయమని డెయిలీ మెయిల్‌ ముందే ప్రకటించుకుంది. బ్రెక్సిట్‌ తరువాత బ్రిటన్‌ వృద్ధి చెందుతుందని పేర్కొనటమే గాక, వేర్పాటుకు ఓటు వేయాలని కోరుతూ ఇంధనశాఖ మంత్రి ఆండ్రియా లీడ్సమ్‌ రాసిన వ్యాసాన్ని కూడా అది ప్రచురించింది.అపరిమితంగా వస్తున్న వలసజనంతో ఇప్పటికే స్కూళ్లు, ఆసుపత్రులు, వుద్యోగాలు, ఇండ్లపై ఎంతో వత్తిడి పెరిగిందని ఆమె పేర్కొటాన్ని ఆ పత్రిక ప్రశంసించింది. పదమూడు లక్షల బ్రెక్సిట్‌ బాంబు పేలబోతున్నదని సన్‌ శీర్షిక పెట్టింది. తాను ప్రధానిగా వున్నానని, మనల్ని పరిపాలించాలనే విషయాన్ని కూడా మరచిపోయి డేవిడ్‌ కామెరాన్‌ మనల్ని ఐరోపా యూనియన్‌లో వుంచేందుకు పూర్తిగా నిమగ్నమయ్యారని సన్‌ సంపాదకీయం ఎత్తిపొడిచింది.

     అబ్జర్వర్‌ పత్రిక సర్వే ప్రకారం వేర్పాటు కోరుకొనేవారు నాలుగుశాతం మెజారిటీగా వున్నారని, పెద్ద వారి కంటే వారి కుటుంబాలలోని యువతరం ఐరోపా యూనియన్లో కొనసాగేందుకు ఎక్కువగా కట్టుబడి వుందని, వ్యతిరేకంగా ఎందుకు ఓటెయ్యాలో వారికి చెప్పండని డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ తన సంపాదకీయంలో పెద్దలకు సలహా ఇచ్చింది. ఈ వేసవిలో గ్రీసు నుంచి టర్కీకి వలస జనాన్ని తరలించే పధకం కనుక విఫలమైతే సంక్షోభం మరింత తీవ్ర అవుతుందని డెయిలీ టెలిగ్రాఫ్‌ పేర్కొన్నది. ఐరోపా యూనియన్‌ వ్యతిరేకి బోరిస్‌ జాన్సన్‌ రాసిన వ్యాసాలకు ఆ పత్రిక పెద్ద పీట వేసింది.’ ప్రతి సందర్భంలోనూ మనకు ఐరోపా యూనియన్‌ సమస్యగా మారుతోంది.మన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం, ప్రభుత్వం చేసే సాయాలన్నింటికీ యూనియన్‌ అభ్యంతరం చెబుతోంది,చివరికి మన ఇంట్లో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవటాన్ని కూడా అది ప్రశ్నిస్తోంది, అర్ధమయ్యేట్లు చెప్పాలంటే మిగతా దేశాలతో సమంగా మన ఇంధన ఖర్చును తగ్గించుకోవటానికి కూడా అదే ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. వేలాది వుద్యోగాలకు ముప్పు వచ్చినప్పటికీ మనమేమీ చేయలేం, ప్రజాభిప్రాయ సేకరణ ప్రచారం ప్రారంభమైనపుడు కీలక సమస్య మన సార్వభౌమత్వం అని నేను చెప్పాను, జనం నా వైపు జాలి చూపులు చూడటం నాకు గుర్తు వస్తోంది, సార్వభౌమత్వం గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని వారు చెప్పారు.అని బోరిస్‌ జాన్సన్‌ రెచ్చగొట్టాడు. మీడియా మొఘల్‌గా పేరు తెచ్చుకున్న రూపర్ట్‌ మర్డోచ్‌ పత్రికలైన సన్‌, టైమ్స్‌ రెండు వైపుల నుంచి వెలువడిన వాదనలను ప్రముఖంగా ఇచ్చాయి, మొగ్గు మాత్రం విడిపోయేవైపే వుంది. గార్డియన్‌ పత్రిక మాత్రం బ్రెక్సిట్‌ను వ్యతిరేకించింది. పోలింగ్‌ దగ్గర పడుతున్న సమయంలో మెయిల్‌ పత్రిక ఆశ్చర్యకరంగా కొనసాగాలనే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది. బ్రిటన్‌ శాంతి, సంపదలను ఫణంగా పెట్టే సమయం కాదిది అని పేర్కొన్నది. ఏ లెక్కన చూసుకున్నప్పటికీ బ్రిటన్‌ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోతే అధిక పన్నులు, ద్రవ్య మార్కెట్లలో గందరగోళం, అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ఐరోపా యూనియన్‌ వెలుపల బ్రిటన్‌ సిరిసంపదలను పొందుతుందని చెప్పేవారు ప్రమాదకరమైన భ్ర మను కలిగించేందుకు పూనుకున్నారని రెండు పేజీల పెద్ద సంపాదకీయం రాసింది. సండే టెలిగ్రాఫ్‌, సండే టైమ్స్‌ మాత్రం వ్యతిరేకంగా ముందుకు వచ్చాయి. తొలుత బ్రెక్సిట్‌కు అనుకూలంగా వున్న అబ్జర్వర్‌ పత్రిక కూడా చివరికి ‘ఎన్ని లోపాలు వున్నప్పటికీ ఐరోపా యూనియన్‌ మంచికే శక్తి నిస్తుందన్నదానిని ప్రశ్నించలేము’ అని పేర్కొన్నది. మొత్తం మీద మీడియా వ్యవహరించిన తీరు తొలి రోజుల్లో తటస్థంగా వున్నవారిని బ్రెక్సిట్‌ వైపు మొగ్గేట్లు చేసిన కారణంగానే ఫలితాలు అలా వెలువడ్డాయని చెప్పవచ్చు. ఒకసారి ఓటరు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత చివరి క్షణంలో మీడియా వైఖరిలో వచ్చిన మార్పు పెద్దగా ప్రభావితం చేయదని చెప్పవచ్చు.

    ప్రయివేటు మీడియా తీరుతెన్నులు ఒక ఎత్తయితే ప్రభుత్వ నిధులతో స్వతంత్రంగా నడుస్తుందని చెప్పబడే బిబిసి ఏ విధంగా వ్యవహరించిందనేది కూడా ఆసక్తి కలిగించే అంశమే. బ్రెక్సిట్‌ ప్రచారం, ఎన్నికల సందర్భంగా బిబిసి ‘పిరికిగా’ వ్యవహరించిందనే శీర్షికతో ఒక పత్రిక వ్యాఖ్యానించింది. మీడియా శైలిలో అతి పెద్ద సవాలును అది ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. రెండు వైపుల నుంచీ వినిపించే వాదనలకు సమ ప్రాధాన్యత ఇవ్వలేదని, మొత్తం మీద మొగ్గు ఐరోపాయూనియన్‌లోనే వుండి పోవాలనే వైఖరి వైపు వున్నదని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. బ్రిటన్‌ కార్పొరేట్‌ శక్తులలో వ్యతిరేక, అనుకూల వైఖరి వెల్లడైంది. విడిపోయి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తే ఎక్కువ లాభం అని భావించే వారు మెజారిటీగా వున్నప్పటికీ యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూసే వారు కూడా గణనీయంగా వున్నారు.ఈ శిబిరాలు చేసిన వాదనలతో జనం ఒక విధంగా గందరగోళపడ్డారంటే అతిశయోక్తి కాదు. ఐరోపా యూనియన్‌ ఏర్పాటు అన్నది అమెరికా, జపాన్‌ పోటీని ఐక్యంగా ఎదుర్కొనేందుకే అని చెప్పినప్పటికీ ఆక్రమంలో కార్పొరేట్ల లాభాలను కాపాడేందుకు పొదుపు చర్యల పేరుతో కార్మిక వ్యతిరేక వైఖరిని ఐరోపా యూనియన్‌ తీసుకున్నది. పర్యవసానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టటం, ఎత్తివేయటమో చేస్తున్నారు. దీంతో సహజంగానే ఆ విధానాలకు కార్మికవర్గంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ అసంతృప్తిని సొమ్ము చేసుకొని వారి పేరుతో తమ ప్రయోజనాలను సాధించుకొనేందుకు కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నించాయి. మీడియా వాటికి వంత పాడటం తప్ప కార్మికవర్గ ప్రయోజన కోణం నుంచి గతంలో ఆలోచించలేదు, బ్రెక్సిట్‌ సందర్భంగానూ అదే వైఖరిని అనుసరించింది.

గమనిక :ఈ వ్యాసం వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి జూలై నెల సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘భావ ప్రకటనా స్వేచ్చ అవధులు లేని హక్కు కాదు’

16 Thursday Jun 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

defamation, Free press, fundamental rights, Media, Speaking Free, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

      భావ ప్రకటనా స్వేచ్చ అవధులు లేని హక్కు కాదు అని సుప్రీం కోర్టు 2016 మే 13వ తేదీన ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. పరువు నష్టం జరిగినపుడు భారతీయ నేర శిక్షా స్మృతి(ఐపిసి) కింద చర్యలు తీసుకోవటం సబబే అని దానిలో వున్న అంశాలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి కాదని కోర్పు పేర్కొన్నది. ఐపసిి సెక్షన్‌ 499, 500 నేరపూరిత పరువు నష్టం గురించి వివరించాయి.నేరపూరితమైన పరువు నష్టం అంటే ఏమిటో 499 వివరించగా దానిని వుల్లంఘిస్తే ఎలాంటి శిక్ష వేయాలో 500 పేర్కొన్నది. ఈ తీర్పు ప్రత్యేకించి రాజకీయవేత్తలు, వివిధ సంస్థల కార్యకర్తలు, జర్నలిస్టులపై ఎంతో ప్రభావం చూపే అవకాశం వుంది. న్యాయమూర్తులు దీపక్‌ మిశ్రా, ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. భావప్రకటనా స్వేచ్చ, వ్యక్తీకరణలపై నేరపూరితమైన పరువు నష్టపు అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయని భావించలేమని, ఒక వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు మరొక వ్యక్తి గౌరవహక్కుతో సమంగా వుండాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు.తమిళనాడు, మహారాష్ట్రలలో బిజెపి నాయకుడు సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ ప్రసంగాల ద్వారా తమ పరువు నష్టం కలిగించే నేరం చేశారని ఆరోపిస్తూ దాఖలైన కేసులపై కోర్టు విచారణ జరిపింది. వలస పాలనా కాలంలో ఆమోదించిన చట్టాన్ని ఇప్పుడు వర్తింప చేయటం అసహేతుకం, నియంత్రత్వమని, స్వతంత్ర భారత్‌లో వాటి గురించి ఎలాంటి చర్చ, రాజ్యాంగబద్దత గురించి పరీక్ష లేకుండానే కొనసాగిస్తున్నారని స్వామి, రాహుల్‌ వాదించారు. బిజెపి నేత నితిన్‌ గడ్కరీ, ఇతరులు కూడా ఇదే అంశాల ఆధారంగా ఆమ్‌ ఆద్మీపార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీ వాల్‌పై కూడా కేసులు దాఖలు చేశారు. నేరమయ జాబితా నుంచి పరువు నష్టం చట్టాన్ని తొలగించాలని కక్షిదారులు వాదించారు. సామాజిక మాధ్యమం ద్వారా జనాన్ని అప్రతిష్టపాలు చేసే ధోరణి పెరుగుతున్నందున దానిని అడ్డుకునేందుకు ఐపిసిలోని సెక్షన్లు 499,500లను కొనసాగించాలని కేంద్రం సమర్ధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్చ హక్కు హామీతో పాటు ఆర్టికల్‌ 19(2) తగినన్ని రక్షణలు కల్పించటంతో పాటు సహేతుకమైన ఆంక్షలు కూడా వున్నాయని పేర్కొన్నది. కోర్టు ఆదేశం మేరకు తన అభిప్రాయం వెలిబుచ్చిన (అమికస్‌ క్యూరీ) టిఆర్‌ అంధ్యార్జున కూడా ఈ వాదనను సమర్ధించారు. గతేడాది ఆగస్టు 13తో వాదనలు ముగిసిన తరువాత న్యాయమూర్తులు తీర్పును వాయిదా వేసి మేనెలలో వెలువరించారు. వివిధ హైకోర్టులలో పరువు నష్టం కేసులను ఎదుర్కొంటున్న సుబ్రమణ్యస్వామి, రాహుల్‌ గాంధీ, అరవింద కేజ్రీవాల్‌కు ఎనిమిది వారాల గడువు ఇస్తూ ఆ కేసులను సవాలు చేయటం లేదా విచారణను ఎదుర్కోవాలని పేర్కొన్నది.

    ఇతర దేశాలలో పరువు నష్టం కేసులు సత్వరమే పరిష్కారం అవుతుండగా మన దేశంలో సంవత్సరాలు, దశాబ్దాల తరబడి కూడా కొనసాగుతున్నాయి. సెక్షన్‌ 500 ప్రకారం పరువు నష్టం కలిగించినట్లు రుజువైతే రెండు సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. భావ ప్రకటనా స్వేచ్చ దారీ తెన్నూ తెలియని వర్తమానంలో పరువు నష్టం కేసులు నేరపూరితమైన వనే అంశాన్ని, వాటి రాజ్యాంగ బద్దతను సవాలు చేయటం దేశంలో బహుశా ఇదే ప్రధమంగా జరిగిందని అనేక మంది చెబుతున్నారు. వివిధ సందర్బాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులు భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనేవిగానే వున్నాయనే అభిప్రాయం కూడా వుంది. వర్గ ప్రయోజనాలు న్యాయవ్యవస్ధను నడిపిస్తున్నాయనే అభిప్రాయం వెలిబుచ్చినందుకు గాను కమ్యూనిస్టు అగ్రనేత నంబూద్రిపాద్‌ను సుప్రీం కోర్టు శిక్షించింది. సినిమాలలో చూపే అధివాస్తవికత కారణంగా రెచ్చగొట్టినపుడు సహజంగానే తమను తాము అదుపుచేసుకోలేని భారతీయ ప్రేక్షకుల స్థితి కారణంగా సినిమాలను ముందుగానే సెన్సార్‌ చేయటం చట్టబద్దమే అని కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు బసవేశ్వరపై కన్నడ రచయిత బరాగుర్‌ రామచంద్రప్ప రాసిన పుస్తకంపై నిషేధాన్ని సమర్ధిస్తూ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు ఇతరులకు లేదని కూడా ఇదే కోర్టు తీర్పు చెప్పింది. మహిళల ఆలయ ప్రవేశంపై సంప్రదాయాలు, మనో భావాలకు వ్యతిరేకంగా కోర్టులు మరోవైపు తీర్పు ఇవ్వటాన్ని కూడా చూశాము.

    భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం ఇవ్వటంతో పాటు సహేతుకమైన ఆంక్షలు కూడా విధించింది. సమస్య. ఈ సహేతుకమైన వాటికి వ్యాఖ్యానం చెప్పటాన్ని బట్టి, అవి అనేక పరిస్థితులపై ఆధారపడి వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. గతంలో ఎన్నో పురోగామి తీర్పులు ఇచ్చిన అవే కోర్టులు తిరోగామి తీర్పులు కూడా ఇవ్వటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.

   పరువు నష్టం విషయానికి వస్తే ఒకపుడు ఐరోపాలో ఎవరైనా అవాస్తవాలను ప్రచారం చేసినట్లు రుజువైతే అలాంటి వారి నాలికను కత్తిరించే శిక్ష వేసేవారు. ఇప్పుడు వాస్తవాలు చెప్పినా, విమర్శలు చేసినా పరువు నష్టం పేరుతో నోరు నొక్కేసే పరిస్థితులు ఇలాంటి తీర్పులతో వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. మన కళ్ల ముందే రెండు ఎకరాలున్న ఒక వ్యక్తి రెండువేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడనుకోండి, మనలో ఒకరిగా సైకిలు మీద తిరిగిన ఒక జర్నలిస్టు ఒక పెద్ద సంస్ధకు అధిపతి, ఒక వీధి రౌడీ, రౌడీ షీటర్‌గా ఒకపుడు రికార్డులకెక్కిన వారు ప్రజా ప్రతినిధిగా, మన కళ్ల ముందే మత ఘర్షణలను రెచ్చగొట్టి మారణకాండకు కారకులైన వారు పెద్ద మనుషులు, రాజ్యాంగ బద్ద, ప్రభుత్వ పదవులకు ఎలా ఎగబాకారని, లేదా రాజధర్మాన్ని విస్మరించి మారణకాండను కొనసాగనిచ్చారని ఎవరైనా విమర్శించి ఆధారాలు చూపకపోతే పరువు నష్టం కింద శిక్షించవచ్చు. అలాంటి ఆరోపణలను ప్రచురించిన లేదా ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్య తీసుకోవచ్చు. కళ్ల ముందు కనిపిస్తున్న వాటన్నింటికీ సామాన్యులు లేదా అసామాన్యులుగాని ఆధారాలు చూపటం సాధ్యం అవుతుందా? కానపుడు మౌన ప్రేక్షకుల మాదిరిగా వుండిపోవటం తప్ప మాట్లాడకూడదు. ఇది ఎవరికి లాభం?

     ఎవరిదైనా ఒక కుక్క అదుపు తప్పి మరొకరిని కరిచిందనుకోండి దాని దాడికి గురైన వారు కుక్క యజమాని మీద కేసు వేసి పరిహారం పొందవచ్చు. ఆ డబ్బుతో బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేయించుకోవచ్చు.అంతటితో సమస్య పరిష్కారం అవుతుంది. పిచ్చి కుక్కల వంటి కొన్ని శక్తులు అదుపు తప్పి మారణకాండకు పాల్పడుతున్నా అధికారంలో వున్న వారు అదుపు చేసేందుకు రాజధర్మాన్ని నిర్వర్తించకుండా వదలి వేస్తే అది అనేక పర్యవసానాలకు దారితీసే సామాజిక సమస్య అవుతుంది. దానిని ఎవరైనా రాజకీయంగా విమర్శించినపుడు అది తన పరువుకు నష్టం కలిగిందని కోర్టుకు ఎక్కితే విమర్శించిన వారు ఆధారాలు చూపకపోతే వారితో పాటు విమర్శలను వెల్లడించిన మీడియాను కూడా శిక్షించటానికి వీలు కలిగింది.

     బ్రిటీష్‌ వారి వలసగా అమెరికా వున్న సమయం, 1735లో న్యూయార్క్‌ వీక్లీ అనే పత్రికలో బ్రిటీష్‌ ప్రభుత్వ ప్రతినిధిగా వున్న న్యూయార్క్‌ గవర్నర్‌ విలియం కాస్బీని విమర్శిస్తూ ఒక వ్యాసాన్ని ప్రచురించారు.అది దేశద్రోహకర పరువు నష్టంగా చిత్రిస్తూ ఒక కేసును దాఖలు చేశారు. రచయితతో పాటు పత్రికను ముద్రించిన వ్యక్తిని కూడా దోషిగా నిలబెట్టారు.అయితే దానిలో వ్యాస రచయిత రాసినవన్నీ నిజాలే కావటంతో ఇద్దరూ పరువు నష్టం కేసునుంచి విముక్తి అయ్యారు. 1964లో అమెరికాలోని అలబామా రాష్ట్ర కోర్టు ఒకటి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పరువు నష్టానికి పాల్పడిందని ఒక తీర్పు ఇచ్చింది. పత్రికలో ప్రచురించిన ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌లో విద్యార్ధి పౌర హక్కుల కార్యకర్తల పట్ల అలబామా అధికార యంత్రాంగం అనుచితంగా ప్రవర్తించిందనే విమర్శ దానిలో వుంది. ఆ ప్రకటనలో కొన్ని అవాస్తవాలు వున్నప్పటికీ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.తెలిసి గానీ తెలియక గానీ వాస్తవానికి విరుద్దంగా ప్రచురించిన దాని వెనుక వున్న వాస్తవమైన దుర్బుద్ధి గురించి అధికార యంత్రాంగం సాక్ష్యాలు చూపాలని కోర్టు పేర్కొన్నది.

     బ్రిటన్‌లో మధ్య యుగాలలో పరువు నష్టాన్ని నేరపూరితమైనదిగా చేయటం ఆ నాటి పరిస్థితులలో దానిని ప్రజా ప్రయోజనాలకోసం అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైనా తమ పరువు తీశారని భావిస్తే ఆరోజులలో ఎదుటివారితో కత్తులు, తుపాకులతో అమీతుమీ తేల్చుకొనేవారు. ఇది మధ్యయుగం కాదు, పరస్పరం తలపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతమైన పరువు నష్టం విషయంలో మాత్రమే దానిని నేరపూరితమైనదిగా చేశారు. అటువంటి వాటికి మొత్తం ప్రజానీకానికి సంబంధించిన చట్టాలను పరిష్కారంగా చేయటం ఏమిటన్నది కొందరి అభ్యంతరం. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మరొక వ్యక్తి చేసిన తప్పిదం మొత్తం సమాజానికి వ్యతిరేకంగా చేసిన తప్పిదం ఎలా అవుతుందన్నది ప్రశ్న. పరువు నష్టానికి సంబంధించి సివిల్‌ చట్టాలుండగా నేర చట్టాల వర్తింపు అవసరం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు.

    న్యూయార్క్‌ టైమ్స్‌ కేసులో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు దగ్గరగా మన సుప్రీం కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. అయితే దానిని తాజా తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోలేదన్నది ఒక సమాచారం. ఆ కేసు వివరాలు క్లుప్తంగా ఇలా వున్నాయి. చెన్నయ్‌ నుంచి ప్రచురితమయ్యే నక్కీరన్‌ వారపత్రిక తరఫున సంపాదకుడు, ముద్రాపకుడు, ప్రచురణకర్త, సహసంపాదకుడు కోర్టుకు ఎక్కటం విశేషం. అదే ఆర్‌ రాజగోపాల్‌-తమిళనాడు ప్రభుత్వం మధ్య నడిచిన కేసు.తమ పత్రికలో అచ్చవుతున్న సమాచారాన్ని నిలిపివేయకుండా తమిళనాడు ప్రభుత్వ అధికారులకు రాజ్యాంగం ఆర్టికల్‌ 32 ప్రకారం ఆదేశాలు జారీ చేయాలని నక్కీరన్‌ తరఫున పిటీషన్‌ దాఖలైంది.

     ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అటో శంకర్‌ అనే ఖైదీ ఆత్మకధ ప్రచురణ నిలిపివేయాలని కోరుతూ తమిళనాడు జైళ్ల ఐజి 1994 జూన్‌ 15న తమకు వర్తమానం పంపారని అది తమ ప్రచురణలలో జోక్యం చేసుకోవటమే కనుక నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని నక్కీరన్‌ పిటీషనర్లు కోరారు. అనేక మంది జైలు అధికారులతో తనకు సంబంధాలు వున్నాయని, తన నేరాలలో వారు కూడా భాగస్వాములే అన్న వర్ణనలు దానిలో వున్నాయి.ఆత్మకధను ఆటో శంకర్‌ తన భార్యకు ఇచ్చాడు. అది జైలు అధికారులకు కూడా తెలుసు. దానిని ప్రచురించాలని శంకర్‌ కోరాడు. భార్య దానిని నక్కీరన్‌ పత్రికలో ప్రచురణకు అందచేసింది. మూడు భాగాలు ప్రచురితమైన తరువాత శంకర్‌ ఆత్మకధలో పేర్కొన్న అంశాలు అవాస్తవాలని,ప్రచురించటం జైళ్ల నిబంధనలకు విరుద్దం గనుక తదుపరి ప్రచురణ నిలిపి వేయకపోతే చట్టపరమైన చర్య తీసుకుంటామని జైళ్ల ఐజి నక్కీరనన్‌ ప్రచురణ కర్తలకు తెలిపారు. దాంతో పర్యవసానాలకు భయపడిన పత్రికా నిర్వహకులు కోర్టును ఆశ్రయించారు.తమకు ప్రచురించే హక్కుందని వాదించారు.ఈ కేసులో ఖైదీ లేదా అతని భార్య ఈ కేసులో కక్షిదారులుగా లేకపోవటంతో ఖైదీ ఆత్మకధ రాయటంగానీ దానిని ప్రచురణకు అనుమతించటం గానీ జరగలేదనే భావనతో ఆ కేసును స్వీకరించింది. ఈ కేసులో ముందుకు అంశాలు క్లుప్తంగా ఇలా వున్నాయి. 1. ఈ దేశ నివాసి మరొక వ్యక్తి తన కధ లేదా జీవిత చరిత్రను రాయకుండా ఆపగలరా ? అనుమతి లేకుండా రాసిన రాత నివాసి యొక్కు గోప్యత హక్కును హరిస్తుందా ? మరొక నివాసి జీవితం, కార్యకలాపాల గురించి రాసిన అటువంటి అనుమతి లేని రాతలను ప్రచురించటం ఆర్టికల్‌ 19(1) ప్రకారం హామీ ఇచ్చిన పత్రికా స్వేచ్ఛకిందకు వస్తుందా ? వస్తే అది ఎంతవరకు, ఎటువంటి పరిస్థితులలో చేయవచ్చు? ఒక వేళ అటువంటి రాతలు గోప్యత హక్కుకు , పరువు నష్టం కలిగించేట్లయితే దానికి పరిష్కారాలు ఏమిటి ? 2.ప్రభుత్వం తన పరువు నష్టానికి చర్య కొనసాగించవచ్చునా ? తన అధికారుల పరువునకు భంగం కలిగించే సమాచారాన్ని ప్రచురించకుండా పత్రికలను నిరోధించేందుకు చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి వున్నదా ? ప్రభుత్వ అధికారులు తాము లేదా తమ సహచరుల పరువు పోవచ్చనే కారణంతో అటువంటి రాతలను ప్రచురించకుండా పత్రికలపై ముందుగానే ఆంక్షలు విధించవచ్చా? 3. జైలులో బందీగా వున్న ఒక ఖైదీ చట్టపరంగా పరిష్కారాలను చూసుకోలేని స్ధితిలో అతని జీవిత కథ ప్రచురణ కాకుండా జైలు అధికారులు అడ్డుకోగలరా ? అతని తరఫున వారు వ్యవహరించవచ్చా ?

     ఈ పూర్వరంగంలో ఒక అంశాన్ని ప్రచురించకుండా ముందస్తుగా ఎవరూ నిరోధించలేరు, ఏదైనా పరువు నష్టం కలిగించే అంశాలుంటే ప్రచురణ తరువాత వాటిని సవాలు చేయాలి అని భావించి ఈ కేసుకు వర్తించే కొన్ని సాధారణ సూత్రాలను కోర్టు రూపొందించింది.1.ఈ దేశ వాసులకు రాజ్యాంగం ఆర్టికల్‌ 21లో హామీగా ఇచ్చిన జీవిత, స్వేచ్ఛా హక్కులలోనే గోప్యత హక్కు కూడా ఇమిడి వుంది. తమ మానాన తమను వదిలేయమనే హక్కు అది. ఒక నివాసి తన స్వంత గోప్యతను కాపాడుకొనే, తన కుటుంబం, వివాహం, సంతానం, మాతృత్వం, బిడ్డలను కనటం, విద్య వంటి ఇతర అంశాలలో ఆ నివాసి అనుమతి లేకుండా ఎవరూ ప్రచురించటానికి వీలమైనాలేదు. అది నిజమైనదైనా, అభినందించేది లేదా విమర్శనాత్మకమైనా ప్రచురించకూడదు. ఎవరైనా దానిని వుల్లంఘిస్తే ఒక వ్యక్తి గోప్యత హక్కును వుల్లంఘించినట్లే.నష్టపరిహారానికి అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు.అయితే ఒక వ్యక్తి స్వచ్చందంగా వివాదంలోకి దిగినా, వివాదాన్ని ఆహ్వానించినా అప్పుడు పరిస్ధితి భిన్నంగా వుంటుంది.2. పైన పేర్కొన్న నిబంధనకు మినహాయింపులు వున్నాయి. ప్రచురణలో పై అంశాలు అభ్యంతరం కానివి అయితే, అది బ హిరంగ రికార్డులను బట్టి రాసిదై వుండాలి. ఒక సారి ఈ అంశాలు బహిరంగ రికార్డులకు ఎక్కిన తరువాత ఇతరులతో పాటు పత్రికలు, మీడియాకు వాటిపై వ్యాఖ్యానించేందుకు చట్టబద్ద అంశం అవుతుంది. అయినప్పటికీ ఈ నిబంధన మర్యాద, యోగ్యతలకు లోబడే వుంటుంది. వుదాహరణకు ఒక మహిళ లైంగిక దాడి, అపహరణ, ఆటంకాల వంటి నేరాలలో బాధిత అయితే ఆ వుదంతాన్ని పత్రికలు, మీడియాలో ప్రచారం చేయటం ద్వారా ఆమె పేరుకు అప్రతిష్ట తీసుకురాకూడదు. ఈ కారణంగానే ఇలాంటి బాధితుల పేర్లు , వుదంతాల వివరాలు రాయకుండా నేరగాళ్ల పేర్లు మాత్రమే వెల్లడిస్తున్నారు.3.దీనికి మరొక మినహాయింపు కూడా వుంది, నిజానికి ఇది మినహాయింపు కంటే ఒక స్వతంత్ర నిబంధన. ప్రభుత్వ అధికారుల విషయానికి వస్తే గోప్యత హక్కు లేదా దానికి సంబంధించిన అంశాలలో నష్టం జరిగినపుడు పరిష్కరించేందుకు కేవలం వారి అధికారిక విధులు నిర్వర్తించటం ద్వారా మాత్రమే కుదరదు. వాస్తవం కాని అంశాలు, ప్రకటనలను ప్రచురించినప్పటికీ నిజం పట్ల మీడియా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు రుజువులు చూపితే తప్ప కుదరదు. అటువంటి వుదంతంలో వాస్తవాలను సహేతుకమైన తనిఖీ తరువాతనే ప్రచురించినట్లు మీడియా వ్యక్తులు రుజువు చేసుకోవాల్సి వుంటుంది. రాసినది వాస్తవమే అని రుజువు చేయాల్సిన అవసరం లేదు. ప్రచురణ దుర్బుద్ధితో కూడినది లేదా వ్యక్తిగత ద్వేషంతో కూడినదని రుజువైతే ప్రచురణ కర్తలు సమర్ధించుకొనేందుకు ఏమీ వుండదని వేరే చెప్పనవసరం లేదు.

    రాజ్యాంగం సంక్రమింప చేసిన విధంగా కోర్టు ధిక్కరణకు పాల్పడితే శిక్షించే హక్కు కోర్టుకు, పార్లమెంట్‌, శాసనసభల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే శిక్షించే హక్కు మాదిరి ఇతర ప్రభుత్వ సంస్థలకు లేదు. ప్రభుత్వ అధికారాలను వుపయోగిస్తున్న ప్రభుత్వం, స్ధానిక సంస్ధలు, ఇతర సంస్ధలు పరువు నష్టానికి దావాలను వేయజాలవు. ముందుగా ప్రచురణలను నిలిపివేసే అధికారం రాజ్యం దాని అధికారులకు అధికారమిచ్చే చట్టం లేదు. అందువలన ప్రభుత్వ రికార్డుల నుంచి తీసుకున్న సమాచారంతో కూడిన జీవిత చరిత్రను సంబంధిత వ్యక్తుల అనుమతితో నిమిత్తం లేకుండానే ప్రచురించటానికి ప్రచురణ కర్తలకు హక్కు వున్నదని కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ రికార్డులలో వున్న దానికి మించి ప్రచురించినట్లయితే ఖైదీ గోప్యత హక్కులకు భంగం కలిగించినట్లే అవుతుంది.

   ఈ తీర్పు పర్యవసానాల విషయానికి వస్తే అధికారంలో వున్న వారు ముందుగా ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న వారు ఎవరైనా అధికార పక్షానికి చెందిన వారిపై అవినీతి, ఇతర ఆరోపణలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వుంటుంది. చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపకుండా అవసరమైనపుడు చూపుతామని తప్పించుకుంటే కుదరదు.ఇది రాజకీయ పార్టీలు, వ్యక్తులకే కాదు మీడియాకు సైతం మెడమీద కత్తే అవుతుంది. అనేక మంది తమ పేరు బయటకు రాకుండా అనేక అంశాలను మీడియాకు తెలియచేస్తారు. వాటిని మీడియా అనధికారిక కధనాలు, వనరుల పేరుతో ప్రచురిస్తోంది. తాను సేకరించిన వార్తల వనరుల గురించి మీడియా వెల్లడించనవసరం లేదు, అయితే తాను ప్రచురించిన అంశాలు వాస్తవమే అని రుజువు చేసుకోవాల్సి వుంటుంది. ఇది ఒక్క అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాతం వంటివాటికే పరిమితం చేస్తారా ?

    బిజెపి, మజ్లిస్‌ వంటి వాటిని మతోన్మాద పార్టీలని రాజకీయ నాయకులు, మీడియా వ్యాఖ్యాతలు కూడా విమర్శిస్తున్నారు. కోర్టు ఖర్చులు తగ్గించుకొనేందుకు ఆ రెండు పార్టీలు వుమ్మడిగా ఒక లాయర్‌ను పెట్టి తమపై చేసిన విమర్శలను రుజువు చేయమని కేసులు వేస్తే పరిస్థితి ఏమిటి ? సాధుపుంగవుడిగా చెప్పబడే పార్లమెంట్‌ సభ్యుడు సాక్షి మహరాజ్‌ ఇటీవల ఒక మహిళ జీన్స్‌ బొత్తాలు విప్పితే అందరూ చూస్తుండగానే ఆమె ప్రయివేటు భాగాలు చూశారని వార్తలు వచ్చాయి. ఇక ముందు అలాంటి వార్తలను ప్రచురించటానికి, టీవీలలో చూపటానికి అవకాశం వుంటుందా ? ఈ తీర్పు పర్యవసానంగా ఆర్నాబ్‌ గోస్వామి వంటి యాంకర్లు ప్రతి రోజూ రాత్రి కాగానే జైలుకు పోవాల్సి వస్తుందని ఒక వ్యాఖ్యాత జోక్‌ వేశారు.

    ఇప్పటికే మీడియాపై దాడులు, వాటి ఆదాయ మూలాలను దెబ్బతీయటం ద్వారా తమ చేతులలో వుంచు కొనేందుకు అనేక శక్తులు పరోక్షంగా ప్రయత్నిస్తున్నాయి. వాటికి చట్టం కూడా మరొక ఆయుధంగా మారితే మరింత ప్రమాదం. రాబోయే రోజుల్లో అనేక పర్యవసానాలకు దారి తీసే సుప్రీం కోర్టు తీర్పు గురించి భావ ప్రకటనా స్వేచ్చను కోరుకొనే వారు, మీడియా నిపుణులు, జర్నలిస్టు సంఘాలు కూడా నిశితంగా అధ్యయనం చేసి అవసరమైతీ చట్టబద్దమైన పోరాటం చేయటానికి సిద్ధం కావాల్సి వుంది.

    ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన వెలువడే ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’ మాస పత్రిక జూన్‌ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జెఎన్‌యు ఘటనల్లో మీడియా విశ్వసనీయతను దెబ్బ తీసిన కొన్ని సంస్ధలు

08 Tuesday Mar 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, Bjp nationalism, credibility, JNU, JNU ROW, journalists, Media, media credibility, nationalism

జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

ఎం కోటేశ్వరరావు

    చదువరులను చంపటానికి రచయిత తన పెన్నును గన్నుగా వుపయోగిస్తాడని ఒక పెద్దమనిషి చెప్పాడు.టీవీలు తలుచుకుంటే విద్యార్ధుల జీవితాలను అంతం చేయటానికి, విద్యా సంస్ధల పరువు ప్రతిష్టలను గంగలో కలపటానికి నకిలీ వీడియోలను వీక్షకుల ముందుంచుతాయని తాజాగా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) వుదంతాన్ని చూసిన తరువాత ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని టీవీ ఛానల్స్‌ ప్రసారం చేసిన రెండు వీడియోలు నకిలీవని తిమ్మిని బమ్మిని చేశారని హైదరాబాద్‌లోని ట్రూత్‌ లాబ్‌ వెల్లడించింది. దీంతో మొత్తం మీడియా పరువు కాలుష్య గంగలో కలిసింది . ఏప్రిల్‌ ఒకటవ తేదీన చదువరులను, వీక్షకులను ఫూల్స్‌ చేయటానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు చేసేవిన్యాసాలలో అలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తాయి, చివరిలో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భం అని చెబుతాయి. కానీ ఇప్పుడు అటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. వాటిని చూసి ఎవరైనా దాడులకు దిగినా ఆశ్చర్యం లేదు. అంతగా మీడియా విశ్వసనీయత కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు.

   మీడియా నిష్పాక్షికంగా వుండదని తెలుగు నేలలో జనానికి 1940,50 దశకాలలోనే తెలుసు.కమ్యూ నిస్టులకు వ్యతిరేకంగా, మహత్తర తెలంగాణా సాయుధ పోరాటాన్ని దెబ్బతీసేందుకు కట్టు కధలకు మీడియా పుట్టినిల్లని అవగతమైంది.తరువాత నాలుగు దశాబ్దాల క్రితం అత్యవసర పరిస్ధితి సమయంలో కొన్ని పత్రికలు నిరంకుశత్వాన్ని, నియంతలను కూడా ఎలా బరపరుస్తాయో దేశమంతా చూసింది. బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు కూడా మీడియా వెనుకాడదని ఆ సమయంలో మరి కొన్ని పత్రికలు, టీవీలు రుజువు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు టీవీ, పత్రికలను స్వయంగా ఏర్పాటు చేసుకుంటే, మరికొన్ని పార్టీలు స్వతంత్రముసుగులో పనే చేసే వాటిని తమ బాకాలుగా మలుచుకోవటమూ తెలిసిందే. ఇప్పుడు జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

     ప్రతి కీలక సమయంలోనూ మీడియా రెండు తరగతులని వెల్లడి అవుతూనే వుంది. స్వాతంత్య్రానికి ముందు ప్రధాన స్రవంతి మీడియా రెండు రకాలు. ఒకటి స్వాతంత్య్రాన్ని కోరుకున్న దేశ భక్త తరగతి, రెండవది బ్రిటీష్‌ వారి పాలన కొనసాగాలని పాటుపడిన రాణీగారి ప్రతిపక్ష తరగతి. ఇప్పుడు కూడా మీడియా ఒకటిగా లేదు. ప్రజా వుద్యమాలు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రచార మీడియా . మిగతా వాటిలో ఎన్నో వుప తరగతులున్నాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేము. కొన్ని పెట్టుబడులతో నడిచేవే అయినప్పటికీ లౌకిక, వుదారవాద విలువలకు కట్టుబడుతున్నాయి. మరికొన్ని కుల, మతోన్మాద శక్తులకు , తిరోగమన భావాలకు పెద్ద పీట వేస్తున్నాయి. వీటి గురించి లోతైన విశ్లేషణ జరగాల్సి వుంది. ప్రస్తుతం జెఎన్‌యు సంబంధిత వ్యవహారాల సందర్బంగా మీడియా ఎలా వ్యవహరించింది అన్నదానికే పరిమితం అవుదాము.

   జెఎన్‌యు పరిణామాలను చూసిన అనేక మంది భారత్‌లో ఏదో అవాంఛనీయ పరిణామం జరగబోతోందని భయపడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. వర్షం రాబోయే ముందు మట్టికి ప్రత్యేక వాసన వస్తుంది. అది మధురంగా వుంటుంది. కానీ జెఎన్‌యు పరిణామాల సందర్భంగా కొన్ని మీడియా సంస్ధలు వ్యవహరించిన తీరు అశుభాన్ని సూచించింది. ఇక్కడ శుభం-అశుభాల గురించి విశ్వాసం సమస్య కాదు. ఒక ప్రమాదకర, ఏకపక్ష భావజాలానికి అనుగుణంగా ఒక వర్గం మీడియా తన వంతు నృత్యం చేయటం నిజంగా భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక అని చాలా మంది భావిస్తున్నారు. ఇటువంటి ధోరణులు గతంలో లేవా అంటే బాబరీ మసీదు విధ్వంసం, గుజరాత్‌ మారణహోమం, అనేక ప్రాంతాలలో జరిగిన మత దాడులు, ఘర్షణల సందర్భంగా కూడా వెల్లడైంది. దానితో పోల్చి చూసినపుడు ఇది మరింత ప్రమాదకరం.బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను ఎదిరించేందుకు మన దేశంలో ముందుకు వచ్చిన జాతీయ వాదానికి, ప్రపంచ ఆక్రమణకు హిట్లర్‌ ఎంచుకున్న జాతీయ వాదానికి తేడా వుంది. దానిని గుర్తించితే ఇప్పుడు దేశంలో ముందుకు తీసుకు వస్తున్న జాతీయ వాదం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హిట్లర్‌ జాతీయ వాదంలోని కొన్ని ప్రమాదకర లక్షణాలు కాషాయ మార్కు జాతీయ వాదంలో వున్నాయి. పాకిస్ధాన్‌ వ్యతిరేకతే అసలైన దేశభక్తిగా , కొన్ని సమస్యలపై తమ వైఖరితో ఏకీభవించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రించి, వారిపై రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. హిట్లర్‌ నాడు యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే నేడు ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారన్నది ఒక అభిప్రాయం. నాడు అనేక మంది హిట్లర్‌ ప్రచారానికి ప్రభావితులై రాగల ప్రమాదాన్ని చూసేందుకు నిరాకరించి ఒక చివరకు వెళితే అదే జర్మనీలో నేడు హిట్లర్‌ పేరును పలకటానికి కూడా జనం ఇచ్చగించకుండా వుండం, జాతీయ వాదం అంటేనే ఆమడ దూరం పోవటం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనిపిస్తోంది. అయితే జర్మన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని ఎంతగా నాశనం చేసిందో, మన దేశంలో ముందుకు తెస్తున్న కుహనా జాతీయ వాదం అదే స్దాయిలో నష్టాలను కలిగించవచ్చు.

      ఈ పూర్వరంగంలో చరిత్ర పాఠాలు తీసుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద లేదా ? వాస్తవాలకు విరుద్దంగా యాజమాన్యాల మనసెరిగి వార్తలనుమలచటం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ కొట్టిన పిండే.అది నైతికమా కాదా అన్న చర్చ వచ్చినపుడు వెల్లడౌతున్న ధోరణులేమిటి? మనకు వేతనాలిచ్చి పనిచేయించుకుంటున్నపుడు యజమానులు చెప్పినట్లు నడుచుకోకపోతే వుద్యోగాలు వుండవు కదా అన్నది ఒకటి. యజమానుల ఆదేశాలు ఎక్కడా రాతపూర్వకంగా లేదా సాక్ష్యాలకు ఆధారాలు లేకుండా వుంటాయి కనుక, వుద్యోగం కావాలంటే వారు చెప్పిన తప్పుడు పనులు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతి పదికిలోల బియ్యానికి ఒక కిలో మట్టి పెడ్డలు కలపమని మిల్లు యజమాని ఒకసారే చెపుతాడు. ఎప్పుడైనా పట్టుపడ్డారనుకోండి, కార్మికులే సరిగా మట్టి పెడ్డలను తొలగించలేదని జనం ముందు కేకలు వేస్తాడు, కేసులు వస్తే ఒకరో ఇద్దరో చిరుద్యోగులను బలి చేస్తాడు. అలాగే మీడియా సంస్ధలు కూడా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదు. అందువలన వార్త పవిత్రమైనది కాదు. తెనాలిరామకృష్ణ సినిమాలో నియోగి అంటే ఎలా కావాలంటే అలా వినియోగ పడేవాడు అని భాష్యం చెప్పినట్లుగా ఇప్పుడు వార్త వున్నది. కనుక ఎవరైనా మేము పక్షపాత రహితంగా వార్తలు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారంటే అనుమానించాల్సిందే. జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఇటీవల మన కళ్ల ముందే జరిగిన రిలయన్స్‌ కంపెనీ గ్యాస్‌ దొంగతనానికి పాల్పడటం గురించిన వార్త అందరికీ ప్రాముఖ్యత కలిగినదే, కానీ కొన్ని పత్రికలు, టీవీలు ప్రముఖంగా ఇస్తే మరికొన్ని ఆ ఏదో జరిగిందటలే అన్నట్లు ఇచ్చాయి. ఏ కోర్టులైనా జోక్యం చేసుకొని సిగిరెట్‌ పాకెట్లు, మద్యం సీసాలపై చట్టబద్దమైన హెచ్చరికల మాదిరి మా వార్తలు మా యజమానుల ఆలోచనలకు లోబడే వుంటాయి అని ఆదేశిస్తే ప్రతివార్తకూ కాకపోయినా ప్రతి పేజీలో పాఠకులకు కనపడేట్లు, టీవీలలో అయితే కింద స్క్రోలింగ్‌ వేసుకోవాలి. అలాంటి హెచ్చరికలు వున్నా మద్యం, సిగిరెట్లు తాగే వారు లేరా అంటే ఆ విషయం ఆదేశించిన వారికీ తెలుసు.

    ఇప్పుడు అలా చేయటం లేదు అంతా నిఖార్సయిన పక్కా నిజమైన వార్తల పేరుతో నడుస్తోంది. అవి వివాదాస్పదం అయినపుడు లేదా కొందరికి కోపకారణమైనపుడు బలౌతున్నది జర్నలిస్టులు తప్ప యజమానులు కాదు. వేతనాలు తీసుకొని పని చేస్తున్నంతమాత్రాన తప్పుడు పనులు చేయాలని లేదు.మనం నాగరికులం, దేశ పౌరులం, మనకూ బాధ్యతలు కూడా వున్నాయని గుర్తించాలా లేదా ? జెఎన్‌యు వుదంతంలో ‘ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తూ అనేక మంది విద్యార్ధుల కలలు,ఆశలూ, ఆకాంక్షలూ జీవితాలను నాశనం చేసేందుకు పూనుకున్న వైఖరికి నిరసనగా తన వుద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ తన లేఖలో పేర్కొన్నాడు. తనకు మరొక సంస్ధ వుద్యోగం ఇవ్వదని కూడా చెప్పాడు. వర్తమాన మీడియా పరిస్ధితులపై ఇంతటి తీవ్ర విమర్శ, వుద్యోగ భద్రత, స్వతంత్ర అభిప్రాయాలను సహించలేని యాజమాన్యాల ధోరణిపై విమర్శ, నిరసన ఇంతకు ముందు వెల్లడి కాలేదేమో. టీవీ ఛానల్స్‌ జబ్బు పడ్డాయని ఎన్‌డిటీవీ ఎడిటర్‌ రవీష్‌ కుమార్‌ తన నిరసన లేదా ఆవేదన వ్యక్తం చేసేందుకు తన కార్యక్రమాన్ని మొత్తంగా చీకట్లోనే నిర్వహించి మీడియాలో జీవితాలను నాశనం చేసే వారే కాదూ కాపాడాలని కోరుకొనే వారూ కూడా వున్నారని, అందుకు సహకరించే యాజ మాన్యాలు కూడా లేకపోలేదని లోకానికి తెలియ చెప్పారని అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని విధించటానికి నిరసనగా కొన్ని పత్రికలు తొలి రోజులలో సంపాదకీయాల స్ధానాన్ని ఖాళీగా వుంచి పాఠకులకు అందించాయి. ఇప్పుడు జెఎన్‌యు విద్యార్దుల వ్యవహారంలో పోలీసులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నాటి పరిస్థితులను తలపిస్తున్నదని గానీ లేదా మీడియాలో కొందరి హానికరమైన పోకడలను ఎత్తి చూపేందుకు గానీ ఎన్‌డిటివీ ఇలా చేసి వుండవచ్చని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఏమైనా ఇది హర్షణీయమే. ఈ చర్యపై కూడా విరుచుకుపడుతున్నవారు లేకపోలేదు. కొన్ని వుదంతాలను పేర్కొని అప్పుడు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చేసినది సరైనదే అని ముందు వారు అంగీకరిస్తే తరువాత గతంలో ఎందుకు చేయలేదు అని అడగటానికి వారికి నైతికంగా హక్కు వుంది. కానీ వారి తీరు అలా లేదు.అయినా ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలా లేదా ? చర్చ జరగనివ్వండి.

     జెఎన్‌యుపై దాడి చేయటానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అక్కడ జరిగిన ఘటనలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకును సమకూర్చేందుకు తిమ్మిని బమ్మిని చేసి వీడియోలను తయారు చేశారు.వాటిలోని అంశాలు కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యాయి. అసలు వాటిని ఎవరు తయారు చేశారు, ఏ ప్రయోజనాల కోసం తయారు చేశారు అన్నది బయటకురావాల్సి వుంది. పోలీసులు జీ న్యూస్‌లో ప్రసారమైనదానిని బట్టి కేసు నమోదు చేశారు, అలాంటి వీడియో గురించి ఆ న్యూస్‌ అవుట్‌పుట్‌ ఎడిటర్‌ నిరసన తెలుపుతూ రాజీనామా చేయటాన్ని బట్టి జీ న్యూస్‌ పాత్ర వుందా అన్నది అనుమానం. తాను దోషిని కాదని, దానిలో తన పాత్ర లేదని అది నిరూపించుకోవాల్సి వుంది. ఢిల్లీ ప్రభుత్వం నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయనున్నదని వార్తలు వచ్చాయి. నిజంగా చేస్తుందా, చేస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిందే.

    ఆ వీడియోలను ప్రసారం చేయటం ఒక ఎత్తయితే మీడియా యాంకర్లు జెఎన్‌యు విద్యార్ధులను దేశద్రోహులుగా సంబోధించటం, అలాంటి వారికి ఆ సంస్ధ ఆలవాలంగా వుందని చిత్రించటం, వారిపైకి జనాన్ని వుసిగొల్పేలా వ్యవహరించటం తీవ్రమైన అంశం. దేశ ద్రోహం, లేదా దేశ వ్యతిరేకి అని కేసులు పెట్టే పోలీసులే నిందితుడు అని పేర్కొంటారు తప్ప నిర్ధారణగా రాయరు. అలాంటిది మీడియాలో పనిచేసేవారు అలా ఎలా చెబుతారు.ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వుంది. టైమ్స్‌ నౌ ఛానల్‌లో దానిని ప్రసారం చేశారు.దాని గురించి సీనియర్‌ జర్నలిస్టు సిద్ధార్ద వరదరాజన్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. తామసలు ఆ వీడియోను ప్రసారం చేయలేదని తమపై అభాండాలు వేసిందుకు క్షమాణలు చెప్పాలని ఆ ఛానల్‌ కోరింది.తొలుత బుకాయించిన సదరు ఛానల్‌ తరువాత చూసుకోకుండా ప్రసారం చేశామని చెప్పుకుంది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతను ఆ వీడియోను ప్రదర్శించమని టైమ్స్‌ నౌ యాంకర్‌ గోస్వామి పదే పదే కోరటం, దానిని అధికారిక వీడియోగానే పరిగణించినట్లు చర్చను నడపటాన్ని చూస్తే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా , విమర్శనాత్మకంగా వున్నట్లు ఎవరైనా ఎలా అనుకుంటారు? కొన్ని ఛానల్స్‌ అసాధారణరీతిలో జెఎన్‌యు వుదంతాన్ని పదేపదే ప్రసారం చేయటం యాదృచ్ఛికమా, ఒకపధకం ప్రకారం జరిగిందా అన్న అనుమానం ఎవరికైనా కలిగితే దానికి కారకులు ఎవరు ? రాజకీయ నేతలు లేదా సాంస్కృతిక సంస్ధగా చెప్పుకుంటూ రాజకీయాలు నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల వారు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు మీడియా వారికి తేడా లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. యావన్మంది దీని గురించి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు,జడ్జి , తలారి పాత్రలను మీడియా పోషించుతోందన్న అభిప్రాయం మీడియాలో పనిచేస్తున్నవారికి ప్రయోజనకరమా, హాని కరమా ?

    తాము ప్రసారం చేసిన వీడియో సాధికారమైనదా కాదా అన్నది సరి చూసుకోలేదని టైమ్స్‌ నౌ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామి తప్పిదాన్ని తప్పించుకొనేందుకు చెప్పారని అనేక మంది భావిస్తున్నారు.కొత్త గనుక అనుభవం లేక చేశామంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్‌ మీడియా మన దగ్గర కొత్తగా వచ్చింది కాదు. గోస్వామి చిన్నవాడూ కాదు, అనుభవం లేని యాంకర్‌ కాదు. దీని గురించి బిబిసిలో నకిలీ వీడియోలను ఏరివేసే విభాగంలో పనిచేస్తున్న మార్క్‌ ఫ్రాంకెనెల్‌ ఏమంటారంటే ఏది నకిలీ ఏది పక్కా అని తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి చోటా వున్నందున ప్రతి ఛానల్‌ ఒక పద్దతిని పాటించి తనిఖీ చేసిన తరువాతే వాటిని ప్రసారం చేస్తుంది. పక్కా వీడియోలో ధంబ్‌నెయిల్‌ చిత్రాలు వుంటాయి, నకిలీ వీడియోలలో వాటిని తుడిపి వేస్తారు. దాన్ని బట్టి అది తిమ్మిని బమ్మిని చేసిందా కాదా అని తేలిపోతుంది. బడా మీడియా సంస్ధలు తమ స్వంత సిబ్బంది రూపొందించే వీడియోలతో పాటు వార్తా సంస్ధలు, జర్నలిస్టులు కాని పౌరులు పంపే వీడియోలను కూడా స్వీకరించి వుపయోగిస్తాయి. అందువలన అవి నకిలీవా, కాదా అనేది ప్రతిదాన్నీ తనిఖీ చేయాలి.ముఖ్యంగా బయటి నుంచి తీసుకున్న వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని ఫ్రాంక్‌నెల్‌ చెప్పారు. మరి దీనిని మన మీడియా సంస్ధలు ఎందుకు పాటించటం లేదు.లేదా కాకపోతే ఖండిస్తారు, మనకు మరో వార్త వస్తుంది, సంచలనంతో రేటింగ్‌ పెరుగుతుంది అని చూసీ చూడనట్లు వూరుకుంటున్నాయా ?అదే అయితే మీడియాకు జవాబుదారీ తనం లేదా అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.

   అనేక దేశాలలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.అయితే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లుగా ఎవరికి వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినపుడు పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకే అంతిమంగా పెట్టుబడితో ముడిపడిన మీడియా పని చేస్తుందన్నది మనకు కనిపిస్తుంది. సామాన్య ప్రజా ప్రయోజనాలు, ఆ సంస్ధలలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలకంటే యజమానులే ఆ సంస్ధలకు ముఖ్యం. వారి ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే స్వేచ్ఛను అనుమతిస్తారు.అన్నీ అలాంటి సంస్ధలేనా అంటే ఎప్పుడూ కొన్ని మినహాయింపులు వుంటాయి.అవెప్పుడూ మైనారిటీగా, పరిమిత సంఖ్యలో వుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీగారూ పాచి పాటతో బోర్‌ కొట్టిస్తున్నారు !

22 Monday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, ANTI NATIONAL, BJP, Bjp nationalism, JNU, JNU ROW, Media, Narendra Modi, RSS

ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

ఎం కోటేశ్వరరావు

       ప్చ్‌ ! నరేంద్రమోడీ కూడా నిరాశపరుస్తున్నారు. ఆదివారం నాడు ఒడిషాలో మోడీ పాడిన పాచి పాత పాట జనానికి బోర్‌ కొట్టింది. ప్రతివారికీ పదిహేను లక్షల నల్లధన సొమ్ము పంపిణీ, దేశమంతటా గుజరాత్‌ నమూనా విస్తరణ మాదిరి కిక్కిచ్చే కొత్త అంశాలు ఇంకా తమ మహా మౌనబాబా నోటి నుంచి వెలువడతాయని అభిమానులు ఎదురు చూస్తుంటే తన అంబుల పొదిలోంచి పాతపడిన, పదునులేని బాణాలు బయటకు తీస్తున్నారు.అదేదో సినిమాలో డైలాగు మాదిరి ఇదేం చాలా బాగోలేదు, వ్యతిరేకులను ఎలాగూ ఎదుర్కోలేరు, కనీసం భక్తులకు అయినా నమ్మకం కలిగించాలి కదా. ఇందిరా గాంధీ తన పాలన ఇబ్బందుల్లో పడినపుడు, ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్నపుడల్లా తన ప్రభుత్వానికి విదేశీ హస్తం నుంచి ముప్పు వుందని చెప్పేవారు, ముఖ్యంగా 1975లో అత్యవసర పరిస్ధితి విధించబోయే ముందు ఈ మాటలు ఎక్కువగా చెప్పారు. నాడు జనసంఘం ముసుగులో వున్న నేటి బిజెపి నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు, ఆ హస్తాన్ని బయట పెట్టమని అడిగేవారు. ఆదివారం నాడు ప్రధాని నరేంద్రమోడీ ఒడిషాలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని, ఒక చాయ్‌వాలా ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని చేసిన ఆరోపణ నరేంద్రమోడీకి అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకయ్య నాయుడి మూస ప్రాసలో చెప్పాలంటే రుచీపచీ లేని పాత చింతకాయ పచ్చడిలా మరోసారి ఇందిరా గాంధీని జ్ఞప్తికి తెచ్చింది. ఇలా అయితే మనం గతంలో కాంగ్రెస్‌ను ఏడిపించినట్లుగా ఇప్పుడు వారు మనల్ని కూడా ఆడుకుంటారు సార్‌ అని మోడీ అభిమానులు లోలోపలే మధన పడుతున్నారు. మంత్రసానితనానికి అంగీకరించిన తరువాత ఏదొచ్చినా పట్టక తప్పదు మరి. దేశంలో అత్యవసర పరిస్ధితి పునరావృతమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయని గతేడాది జూన్‌లో బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అది కచ్చితంగా నరేంద్రమోడీని వుద్దేశించే చేశారని లోకం కోడై కూసింది. మోడీ ఆరోపణ దానిలో భాగమేనా ? ప్రపంచ యుద్ధాలు, ఏ నియంత పాలన చరిత్రను చూసినా ఏదో ఒక చిన్న సాకుతోనే ప్రారంభమయ్యాయి. ఏదీ లేకపోతే వాగు ఎగువన వున్న తోడేలు దిగువన వున్న మేకపిల్లతో నీటిని కెలికావని గిల్లి కజ్జా పెట్టుకొని మింగేసిన కధ తెలిసిందే. మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే జీ టీవీ,ఆర్నాబ్‌ గోస్వామి వంటి జర్నలిస్టులు ఇలాంటి తోడేళ్లకు తోడైన తరువాత ఇంక చెప్పేదేముంది. అయితే అంతిమంగా జనం అందరి పనిపడతారన్నది వేరే విషయం.

      గత ఇరవై నెలల పాలనా కాలంలో నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైంది. రానున్న రోజులలో మరింత తిరోగమనం తప్ప పురోగమన దాఖలాలు కనిపించటం లేదు. పెట్టబోయే బడ్జెట్‌ కూడా అంత ఆకర్షణీయంగా వుండబోదని ముందే వార్తలు వెలువడుతున్నాయి. వేతన సంఘసిఫార్సులను వుద్యోగులు అంగీకరించటం లేదు. ఈ స్ధితిలో కాషాయ మార్కు జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి కొంతకాలం జనం దృష్టిని మరల్చాలి. అందుకు తగిన అవకాశాల కోసం వెతుకుతున్న తరుణంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యులో జరిగిన సభలు, వాటి పర్యవసానాలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. వాటిని వుపయోగించుకోకుండా ఏ విఫల అధికారపక్షమైనా ఎలా వుంటుంది. అయితే బిజెపి ఈ బస్సు కూడా మిస్సయినట్లే. కానీ ఒకందుకు మాత్రం బిజెపి మేథోచెరువులో ఈదులాడుతున్న వారిని అభినందించాలి. తిను,తాగు, తిరుగు అనేవి తప్ప దేశంలో వేరే ఇజాలేవీ లేవు అన్న వాతావరణం పెరిగిపోయి యువత అనేక విధాలుగా క్షీణ సంస్కృతి ప్రభావానికి లోనవుతున్న దశలో వారికి తెలియకుండానే ఒక సైద్ధాంతిక చర్చకు దోహదం చేశారు. ఢిల్లీ జెఎన్‌యులోని ఎబివిపి నాయకుల నుంచే తమకు ఎదురు దెబ్బ తగులుతుందని వారు కలలో కూడా వూహించి వుండరు. మేకతోలు కప్పుకున్న పులి వంటి సంఘపరివార్‌ సంస్ధల నైజం తెలియక లేదా వారే అసలైన దేశభక్తులనే ప్రచారం నిజమే అని నమ్మిగాని లేదా కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో గాని అనేక మంది దాని అనుబంధ సంస్ధలలో చేరుతున్నారు, మద్దతతు ఇస్తున్నారు. అయితే వారందరూ శాశ్వతంగా వాటితోనే వుండిపోతారనుకుంటే భ్రమే. ‘జెఎన్‌యులో ప్రస్తుత సంఘటన, మనుస్మృతిపై పార్టీలో కొనసాగుతున్న దీర్ఘకాల విబేధాలతో పాటు రోహిత్‌ వేముల ఘటన.ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విశ్వవిద్యాలయంలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరం.అవి గుండెలు పగిలేలా వున్నాయి.వాటికి కారణమైన వారిని చట్టప్రకారం తప్పనిసరిగా శిక్షించాల్సిందే……విద్యార్ధి లోకంపై అణచివేతకు దిగిన ప్రభుత్వానికి మేం బాకాలుగా వుండలేం. ప్రభుత్వానికి చెందిన ఓపి శర్మ వంటి శాసనసభ్యుడు పాటియాలా కోర్టులో గానీ, జెఎన్‌యు వుత్తర గేటు వద్దగానీ చేసిన దాడులు మితవాద ఫాసిస్టు చర్యకు నిదర్శనం…..’ అని నిరసన తెలిపిన ఏబివిపి విద్యార్ధి నాయకులు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ముగ్గురే కావచ్చు కానీ వారి ప్రకటన సంఘపరివార్‌కు తగలరాని చోట తగిలిన దెబ్బ.

     ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు కొన్ని టీవీ ఛానల్స్‌ తప్పుడు వార్తల ఆధారంగా తప్పుడు కేసులతో 1975 నాటి అత్యవసర పరిస్థితి మాదిరి వ్యవహరించటం, సంఘపరివార్‌ శక్తులు పాటియాలో కోర్టులో విద్యార్ధులు, జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసినా, సుప్రీంకోర్టు స్పందించినా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఇంతవరకు నోరు విప్పలేదు. గతంలో కూడా పలు వుదంతాలలో ప్రధాని బిజెపికి జరిగే నష్ట నివారణ చర్యలలో భాగంగా నోరు విప్పారే తప్ప సకాలంలో ఎన్నడూ స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బిజెపి నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరుతో ప్రతిష్టను కోల్పోయిన బిజెపిని ఇప్పుడు జెఎన్‌యు వుదంతాలు మరింతగా దెబ్బతీశాయి. అయినా ఎదురుదాడులతో జనం నోరు మూయించాలని చూస్తున్నారు. తమ ప్రభుత్వ చర్యను తాము సమర్ధించుకొనే ధైర్యం లేక తమ కనుసన్నలలో మెలిగే మాజీ సైనికులను ఢిల్లీ వీధులలో ప్రదర్శనలు చేయించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి డ్రామాలు మరిన్ని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు, పార్లమెంట్‌ సమావేశాలలో ఎదురుదాడికి దిగేందుకు బిజెపి నిర్ణయించినట్లుగా ఒడిషాలో మోడీ ఆరోపణలు వున్నాయి. కొన్ని స్వచ్చంద సంస్ధలకు విదేశీ నిధులు వస్తున్నాయని తమ ప్రభుత్వం దానిని తప్పుపట్టకపోయినా లెక్కల్ని అడగటం ప్రారంభించేసరికి వారంతా కలసి మోడీని కొట్టండి, మోడీని కొట్టండి అని నినదిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.

     స్వచ్చంద సంస్ధలకు విదేశాల నుంచి వస్తున్న నిధుల గురించి ఒక శ్వేత పత్రం సమర్పించటానికి కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలూ వున్నాయి. అసలెన్ని సంస్ధలున్నాయి, వాటికి ఎంతెంత నిధులు వస్తున్నాయి? వాటికి లెక్కలు చెప్పమని ఎన్నింటిని కేంద్రం అడిగిందీ, ఎన్ని జవాబిచ్చాయి. ఏవేవి ప్రధానిని కొట్టమని చెబుతున్నాయో ప్రకటిస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి. నిధులు రావటాన్ని తప్పు పట్టవద్దని అసలు ఎవరు అడిగారు, అడిగితే వూరుకుంటారా ? ఇరవై నెలలు గడిచినా ఏ చర్యలు తీసుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? ఇప్పుడెందుకు తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే కుట్ర జరుగుతోందని చీకట్లో బాణాలు వేస్తున్నట్లు ? ఇంత పెద్ద దేశంలో లెక్కలు చెప్పని కొన్ని స్వచ్చంద సంస్ధలు కుట్రలు చేస్తే పడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్‌ వుందా ? ఒక బూచిని చూపి ప్రజల దృష్టిని మళ్లించటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.

      ఆర్ధిక, పాలనా రంగాలలో తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చి రానున్న పార్లమెంట్‌ సమావేశాలలో తప్పించుకోవాలని చూస్తున్నది.ఒకవేళ నిజంగా అదే జరిగితే దీనిలో కూడా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలటం ఖాయం. జనసంఘం నుంచి జనతా తరువాత భారతీయ జనతా ఏ పేరు పెట్టినా అది సంఘపరివార్‌ రాజకీయ ప్రతినిధిగానే పని చేసింది. జర్మనీ, ఇటలీ వంటి దేశాలలో హిట్లర్‌,ముస్సోలినీ వంటి ఫాసిస్టులు కూడా జాతీయ వాదం పేరుతో జనాన్ని రెచ్చగొట్టారు.జాతీయోద్యమాలు పరాయిపాలకులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా వుద్యమాలు. అవి దేశ స్వాతంతంత్య్రాలకు దారితీశాయి. కానీ నియంతల జాతీయ వాదాలు ప్రభుత్వ వ్యతిరేకుల అణచివేతలకు, ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. హిట్లర్‌ తన జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీపై రుద్దిన ఒప్పందాలతో పాటు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టి తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. అందుకే ఈనాడు ఐరోపాలో ఎవరైనా జాతీయవాదాన్ని ముందుకు తెస్తే దానిని ఫాసిజంగా భావించి జనం ఛీకొడుతున్నారు. ఐరోపాలో జాతీయ వాదం అంటే బూతుపదం కన్నా నీచంగా చూస్తారు. దేశంలో వువ్వెత్తున జాతీయోద్యమం జరిగినపుడు సంఘపరివార్‌ శక్తులు దూరంగా లేదా వ్యతిరేకంగా, చివరికి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపాయి. అందుకు సావర్కర్‌ లేఖ తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు జాతీయ వాదం పేరుతో ఎక్కడలేని దేశభక్తిని తామే కలిగి వున్నట్లు ఫోజు పెడుతున్నాయి.ఈ జాతీయ వాదం ఏ వలస దేశానికి వ్యతిరేకం? సంఘపరివార్‌ ఆదిపురుషులు జాతీయవాదం ఏమిటంటే హిందూయిజమే జాతీయ వాదం,జాతీయ వాదమంటే హిందూయిజం అని ఎప్పుడో నిర్ధారించారు. హిట్లర్‌ యూదు , కమ్యూనిస్టు వ్యతిరేకత మాదిరి భారత్‌లో ఇస్లాం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ పరివార్‌ పూనుకుంది. అందువలన ఏది సిసలైన జాతీయత? ఇప్పుడు కావాల్సింది ఏమిటి అనే చర్చ జరగటం అనివార్యం, ఆరోగ్యకరం కూడా. ఎవరి రంగు ఏమిటో తెలిసి పోతుంది.ముస్లింలను వ్యతిరేకించటం, పాకిస్తాన్‌ను తిట్టిన వారే జాతీయ వాదులుగానూ కానటువంటి మిగతా వారందరినీ జాతి వ్యతిరేక శక్తులుగా ముద్రవేస్తున్నారు. అందువల్లనే కమ్యూనిస్టులు కానటువంటి రాజదీప్‌ సర్దేశాయ్‌, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులు తాము జాతీయ వాదులం కామని స్పష్టం చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మీడియాలో జాతీయత, బిజెపి కుహనా జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.

      మీడియాలో సంఘపరివార్‌కు తోడ్పడే శక్తుల బండారం గూడా ఈ సందర్బంగా బయట పడింది. తాము నిష్పాక్షికం అని చెప్పుకున్నంత మాత్రాన ఆచరణలో అలా వుండరని అనేక ఛానళ్లు, పత్రికలు జెఎన్‌యు వంటి వుదంతాల సందర్భంగా తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాయి. స్థూలంగా కాషాయపరివార్‌ జాతీయ వాదాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా రెచ్చగొట్టే శక్తులు, బిజెపి జాతీయవాదాన్ని అంగీకరించకుండా వాస్తవాలను, వాస్తవాలుగా పాఠకులు ముందుంచే వారిగా రెండు శిబిరాలుగా చీలిపోయాయి. రానున్న రోజులలో ఇది మరింత స్పష్టం కానుంది.సంఘపరివార్‌ చర్యలు,అజెండాతో మీడియాలో ఇంకే మాత్రం కాషాయ పులులు మేకతోళ్లు కప్పుకొని వుండలేని పరిస్ధితి.తమ ఛానల్‌ జెఎన్‌యు వుదంతంలో వ్యవహరించిన తీరును నిరసిస్తూ జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ రాజీనామా చేయటం మీడియాలోని పరిస్ధితికి దర్పణం.వార్తలపై ఎవరైనా ఎటువంటి అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు. కానీ వృత్తికే కళంకం తెచ్చేలా వీడియోలను తారు మారు చేయటం దుర్మార్గం. పాకిస్తాన్‌ జిందాబాద్‌ అని కొందరు జెఎన్‌యు విద్యార్ధులు నినదించినట్లు చూపిన వీడియోలో మార్పులు జరిగాయి.దురభిమానాల కారణంగా భారతీయ కోర్టు జిందా బాద్‌ అన్న నినాదం కాస్తా పాకిస్తాన్‌ జిందాబాద్‌గా మారిపోయిందని విశ్వదీపక్‌ పేర్కొన్నారు.ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా కొందరి జీవితాలు, వారి ఆశలు, కుటుంబాలను ప్రమాదపుటంచులలోకి నెట్టారని ఆయన వాపోయారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులా లేక కిరాయి హంతకులా అనే అభిప్రాయం ఎవరికైనా కలిగితే అసలు మనం జర్నలిస్టులమేనా అన్న ఆశ్చర్యానికి తాను లోనుకావటం ప్రారంభమైందని కూడా ఆవేదన చెందారు. ‘ హింసాకాండను రెచ్చగొట్టటానికి, మరియు జనాన్ని దేశద్రోహులు, లేదా జాతి వ్యతిరేకులు అని పిలవటానికి ,మాట్లాడటానికి గాక బెదిరించటానికి మనం టీవీని అనుమతించాలా అని ఎన్‌డిటివి చెందిన రవీష్‌ కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. పాటియాల కోర్టుల భవనం వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా కొందరు జర్నలిస్టులు ప్రదర్శన చేస్తే దానికి సంబంధించిన వార్తల విషయంలో అత్యవసర పరిస్ధితి నాటి స్పందన కనిపించింది. ఆరోజులలో కొన్ని మీడియా సంస్ధలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కొన్ని అనుకూలబాకాలుగా వ్యవహరించాయి. అనేక మంది జర్నలిస్టులు దేశానికి విధేయులుగా వుండాలా ఒక రాజకీయ వైఖరి, వ్యవస్దకు విధేయులుగా వుండాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. కొన్ని యాజమాన్యాల కారణంగా జర్నలిస్టులు కూడా ఏ సంస్ధలో వుంటే అది అభిమానించే పార్టీల ప్రతినిధుల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎటు అన్నది తేల్చుకొనే విధంగా సంఘపరివార్‌ ఎగదోస్తున్నది. ఆ విభజన తమకు లాభం అనుకుంటున్నది. జర్మనీ, ఫాసిస్టు హిట్లర్‌ పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరైనా మూర్ఖంగా, మొరటుగా నిప్పును చేత్తో పట్టుకుంటామంటే చేసేదేముంది, పట్టుకొని చూడమని చెప్పటమే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: