• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Modi Critics

త్రిపుర ఐఏఎస్‌ అధికారికి నరేంద్రమోడీ ఫోను, సమాధానం లేని ప్రశ్నలు

30 Tuesday Aug 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

Modi, Modi Critics, Modi Sarkar, pm modi's call to tripura ias

ఎం కోటేశ్వరరావు

    ఒక ఐఏఎస్‌ అధికారికి రాత్రి పదిగంటల సమయంలో అదీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా ఫోన్‌ చేసి రోడ్డు మరమ్మతుల గురించి మాట్లాడటం ప్రస్తుతం మీడియాలో ఒక పెద్ద వార్తగా మారింది. తొలుత కోరా అనే ఒక వెబ్‌సైట్‌లో రాసిన కథనం క్రమంగా జాతీయ వార్తగా మారింది.నిజమే ఒక జిల్లా అధికారికి ప్రధాని స్వయంగా ఫోన్‌ చేయటం అంటే చిన్న విషయం కాదు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకోవటంతో నాలుగు రోజుల్లో రహదారి మరమ్మతులు పూర్తి చేసి లీటరు పెట్రోలు మూడువందల రూపాయలకు, అదే స్థాయిలో ఇతర నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్న త్రిపుర పౌరుల దుస్థితిని తప్పించి ఎంతో మహోపకారం చేశారన్నది కధనం సారాంశం. అయితే ఈ కధనాన్ని అనేక మంది అదొక కట్టుకధ అని భావించారు, ఇప్పటికీ భావిస్తున్నారు. కాదు నిజమే అని త్రిపుర వున్నతాధికారులు ధృవీకరించినట్లు అక్కడి ఒక పెద్ద పత్రిక రాసింది కనుక నిజమే అని, అనుమానం వున్నవారు దాన్ని చదవ వచ్చని కూడా కొందరు పేర్కొన్నారు. పెద్ద పత్రికలు అసలు అవాస్తవాలు రాయవు అన్నది వారి గట్టి నమ్మకం.

    ఈ వుదంతం వాస్తవమా అవాస్తవమా అన్నది తేల్చటం కష్టం .ప్రధాని ఫోను కధనాన్ని నమ్మేవారు తమకు తాము కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎవరైనా లేవనెత్తిన వాటికి సమాధానం చెప్పాలి. వున్నత పదవులలో వున్నవారి ప్రతిష్ట పెంచటంలో భాగంగా అలాంటి జిమ్మిక్కులు చేయటం ఈ వుదంతంతో ప్రారంభం కాలేదు, గతంలోనూ జరిగాయి, ఇంతటితో ఆగవు. అయితే దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయ మన్నట్లుగా ఎలాంటి ఆలోచన లేకుండా నమ్మేవారికి ఏ సందేహాలు రావు. జనమంతా అలాగే వుండాలని పాలకులు కోరుకుంటారు. అక్కడే వస్తుంది పేచీ. ప్రభువులు ఒక విధంగా ఆలోచిస్తే జనం ఆలోచన మరో విధంగా వుంటుంది.జన కోణం నుంచి ఈ వుదంతాన్ని పరిశీలిద్దాం.

    దాదాపు 93వేల కిలోమీటర్ల దూరం వున్న జాతీయ రహదారులలో ఒక రాష్ట్రానికి కీలకంగా వున్న ఒక రహదారిలో 15 కిలోమీటర్ల మేర తక్షణం మరమ్మతులు చేయాలంటే స్వయంగా ప్రధాని జోక్యం చేసుకుంటే తప్ప పని జరగని పరిస్థితి భారత్‌లో వుంది అని ప్రపంచానికి తెలిసింది. జాతీయ రహదారి కనుక ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటుంది. రోడ్ల శాఖకు నితిన్‌ గడ్గరీ అనే ఒక పెద్దాయన మంత్రిగా వున్నారు. ఆయన కింద పెద్ద యంత్రాంగం వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాన మంత్రి రాత్రి పది గంటలకు (ఈశాన్య ప్రాంతంలో ఒక గంట మనకంటే ముందే సూర్యుడు అస్తమిస్తాడు కనుక స్థానిక సమయం పదకొండు గంటలనుకోవాలి.) ఒక జిల్లాలోని ఐఏఎస్‌ అధికారిని లేపి ఆ సమయంలో అంతరాయం కలిగించినందుకు క్షమాపణ కూడా చెప్పి ప్రధాని మాట్లాడారంటే అప్పటి వరకు కేంద్ర మంత్రి ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

    ప్రధాన మంత్రి అంటే వున్నత స్ధాయిలో జరగాల్సిన దౌత్య నిర్ణయాలు, ఆర్ధిక, రాజకీయ విధానాల వంటి ముఖ్యమైన అంశాలపై కేంద్రీకరిస్తారని మాత్రమే ఇప్పటి వరకు అనుకుంటున్నాము. మరమ్మతులు చేయాల్సిన రోడ్ల వంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా వదలటం లేదంటే మన దేశానికి మంచి రోజులు వచ్చినట్లే. మన వీధిలో మున్సిపాలిటీ, పంచాయతీ వారు చెత్త కుప్పలను ఎత్తివేయకపోయినా, రోడ్ల మీద తిరిగే వట్టి పోయిన ఆవులు పేడవేసినా అవి ప్రధాని దృష్టిలో వుంటాయని, ఏదో ఒక రోజు ప్రతి పారిశుధ్య కార్మికుడికి ఫోన్‌ వస్తుందని ఆశించటం తప్పుకాదు. కేంద్ర మంత్రులు, అధికారులు పెద్దగా పని చేయనవసరం లేదు, ఎందుకంటే అన్నీ ప్రధాని పట్టించుకుంటారు కదా !

   మరమ్మతు చేయాల్సిన రోడ్డు అసోంలో వుంది. ముందే చెప్పుకున్నట్లు జాతీయ రహదారుల నిర్వహణకు ఒక సంస్ధ, దానికి ఒక పెద్ద యంత్రాంగం వుండగా ప్రధాని సంబంధిత అధికారికి ,లేదా అసోం అధికారికి ఫోన్‌ చేయకుండా త్రిపుర ఛీఫ్‌ సెక్రటరీని వదలి ఒక జిల్లా అధికారికి ఎందుకు చేశారు? ఇక్కడ ఏం జరిగి వుండాలి. ప్రధాన మంత్రి కార్యాలయంలో లేదా ఇంటి వద్ద పని చేసే అధికార యంత్రాంగానికి రోడ్ల నిర్వహణ అధికార వ్యవస్ధ గురించి తెలిసి వుండకపోవటం, లేదా పని వత్తిడిలో ఆపరేటర్‌కు రాంగ్‌ నంబరు ఇచ్చి వుండాలి లేదా విసిగిపోయిన ఆపరేటర్‌ కనపడిన నంబర్‌కు కలిపి వుండాలి లేదా నానా ఇక్కట్లు పడుతున్నది త్రిపుర జనం కనుక ఆ రాష్ట్ర అధికారికి కలిపారా అన్నది అది బుర్రవున్నవారు అడగ కూడని ప్రశ్న. లేదా ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే అసోంలో ఇప్పటికే బిజెపి అధికారంలో వుంది కనుక మరో మరో నాలుగున్నర సంవత్సరాల వరకు పట్టించుకోనవసరం లేదు. త్రిపురలో పాగా వేయాలని చూస్తున్న బిజెపికి ఏదైనా మేలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్న త్రిపుర జనానికి పాలక సిపిఎం పై ఆగ్రహం కలగాలి. రాష్ట్రం పట్ల ప్రధాని ఎంత శ్రద్ధ చూపుతున్నారో చూడండి, ఆయన స్వయంగా పట్టించుకున్న తరువాతనే రోడ్డు బాగుపడింది, అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం ఏమీ చేయించలేకపోయింది, బిజెపి ఆ పని చేసిందనే సానుభూతి అక్కడి జనానికి కలగాలని ఆ పని చేశారా ? ఏమో ?

    మన అధికార వ్యవస్ధలో ఒక వూరి ముససబు మరోవూరిలో వెట్టి కంటే హీనం అన్న సామెత గురించి తెలిసిందే. ఒకే ప్రభుత్వంలో ఒక శాఖకు సంబంధించి మరో శాఖ జోక్యం చేసుకుంటే దిగువ స్ధాయి గుమస్తా కూడా ఎందుకు చేయాలని ప్రశ్నించే పరిస్ధితి వుంది. అటువంటిది ప్రధాని ఒక జిల్లా అధికారికి ఫోన్‌ చేసి మరో రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులతో పని చేయించి రోడ్డు మరమ్మతుల పని పురమాయించటం ఏమిటి ? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీకి ఈ చిన్న విషయం కూడా తెలియదా ? రంజుగా చెబుతున్న కథను వినాలే తప్పరామాయణంలో పిడకల వేటలా ఇలాంటివి అడగకూడదేమో ?

    తాను ఇప్పటికే అసోం, త్రిపుర ప్రభుత్వాలతో మాట్లాడానని కావాల్సిన సాయం అందుబాటులో వుంటుందని ఐఏఎస్‌ అధికారితో ప్రధాని చెప్పినట్లుగా కధనం వుంది. అంటే ఎవరి చేత పనిచేయించాలో నిర్ణయించేది ప్రధాని కార్యాలయమా? రాష్ట్ర ప్రభుత్వాలా, జాతీయ రహదారుల సంస్ధా ? నిజంగా ప్రధాని కార్యాలయం ఆ రోడ్డు గురించి అంతకు ముందే సంబంధిత రాష్ట్రాల లేదా జాతీయ రహదారుల సంస్ధ అధికారులతో మాట్లాడినపుడే పని చేయించాల్సిన అధికారిని కూడా నిర్ణయిస్తారా ? పోనీ నిర్ణయించిన తరువాత సంబంధిత రాష్ట్ర, సంస్ధ వున్నతాధికారులు తెలియచేసే లోపే ప్రధాని కార్యాలయం సంబంధిత ఐఏఎస్‌ను కాంట్రాక్టు చేసిందా ? రోజూ ఇలాగే ప్రధాని కార్యాలయం ప్రధానితో అందరితో మాట్లాడిస్తుందా ? తెల్లవారి ఐఏఎస్‌ అధికారి కార్యాలయానికి వెళ్లే సరికి ఆ సమాచారం అక్కడ వుందట. అదెలా సాధ్యం. అంతకు ముందు రోజు పని వేళల్లో వచ్చి వుంటే తప్ప తపాలాను తెరిచి చూసే వారే వుండరు కదా ? లేదా తెరిచి చూసిన వుద్యోగి అంతటి ముఖ్యమైన సమాచారాన్ని సంబంధిత అధికారికి ఎందుకు చెప్పలేదు ? మరుసటి రోజు సిబ్బందిని తీసుకొని త్రిపుర అధికారి అసోంలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేయించేందుకు వెళ్లే సరికే అక్కడ అసోం సర్కార్‌ జెసిబిలను సిద్ధం చేసిందట. కాశీ మజిలీ కధల్లో రాజకుమారులకు, గంధర్వులో ,తపస్సంపన్నమునులో, మారు వేషాలలో వున్న దేవతలు సమకూర్చినపుడు తప్ప ఈ రోజుల్లో అధికార యంత్రాంగానికి ఇలాంటివి సాధ్యమా ?

     మొత్తానికి మూడు వందల ట్రక్కుల్లో పరికరాలు, సామాగ్రి వచ్చి నాలుగో రోజుకల్లా రోడ్డు మరమ్మతు పూర్తి అయిందట. కేంద్ర మంత్రి గడ్కరీ ఆ అధికారికి ఫోన్‌ చేసి ఢిల్లీ వచ్చినపుడు ప్రధాని కార్యాలయానికి రమ్మని ఆహ్వానించారట. ఇదొక ట్విస్టు. పోనీండి సుఖాంతం అయింది. ప్రధాని ఫోన్‌ చేసింది జూలై 21న అంటే 26వ తేదీ నాటికి రోడ్డు మరమ్మతు పూర్తి అయింది. వెంకయ్య నాయుడికి ఈ సమాచారం తెలిసి వుంటే నరేంద్రమోడీ రెండు సంవత్సరాల పాలనలో సాధించిన విజయాల జాబితాకు దీనిని కూడా జత చేసి సమాచార, ప్రసార శాఖల మంత్రి కనుక వూరూ వాడా టాంటాం చేయించి వుండేవారు.యధాలాపంగా ఈ సమాచారం తెలిసినట్లు దీనిని ఒక నెల రోజుల తరువాత ఒక వెబ్‌ సైట్‌ తన కధనంగా రాసింది. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరిగిందో కూడా చూడకపోతే ఎలా !

http://www.indiatimes.com/news/india/tripura-s-only-link-with-the-world-has-turned-to-slush-after-rains-sadly-no-one-cares-257390.html

     దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అవసరమైన వస్తువులు, ప్రయాణీకుల రవాణాకు కీలకమైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి,అసోం ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని త్రిపుర రవాణాశాఖ మంత్రి మాణికే డే జూన్‌ 25న విలేకర్ల ముందు వాపోయారు. అంతకు ముందు త్రిపుర గవర్నర్‌గా వున్న బిజెపి నేత తధాగతరాయ్‌, త్రిపుర బిజెపి నేతలు కూడా కేంద్ర మంత్రి గడ్కరీ, అసోం ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. కేంద్ర మంత్రి, ప్రభుత్వానికి వందలాది ఇ మెయిల్స్‌ పంపినా ఒక్కదానికీ సమాధానం రాలేదని డివైఎఫ్‌ఐ నేత చెప్పారు. పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మూడు నెలలుగా రవాణాకు పనికి రాకుండా రోడ్డు చెడి పోయిందని త్రిపుర పిడబ్ల్యుడి శాఖ మంత్రి బాదల్‌ సరోజ్‌ చెప్పారు. ఇంకా అనేక సంస్ధలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి.పెట్రోలు, డీజిలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరతతో పాటు రోజుల తరబడి వందలాది వాహనాలు నిలిపోవటం గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.

http://economictimes.indiatimes.com/news/economy/infrastructure/tripura-urges-centre-assam-for-immediate-repair-of-national-highway-8/articleshow/52940775.cms

    సరైన రోడ్డు సౌకర్యం లేక కొల్‌కతా రేవు నుంచి బంగ్లాదేశ్‌కు సరకులను రవాణా చేసి అక్కడి నుంచి త్రిపురకు చేర్చిన వుదంతాలు అనేక వున్నాయి. ఇంతటి కీలకమైన రోడ్డు మరమ్మతు గురించి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై త్రిపుర ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తమైన తరువాతే రోడ్డు మరమ్మతు పూర్తయింది.

   ప్రధాని ఫోను కధనాన్ని నమ్మేవారు అంతకంటే తీవ్రమైన విషయాల మీద అధికార యంత్రాంగాన్ని కదిలించాలని కోరుతూ ప్రధాని కార్యాలయానికి లేఖలు రాస్తే వుపయోగం, అది ఎలా స్పందిస్తుందో, పనులు ఎంత త్వరగా తెలుస్తాయో స్వానుభవం పొందవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీత్వ-మనువాదుల మనోగతం ఏమిటి ?

22 Friday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, manuvadam, manuvadis, Modi Critics, moditva manuvadi's, Narendra Modi Failures, narendra modi's ruling, RSS, RSS game

ఎం కోటేశ్వరరావు

    రెండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన వుత్సవాలు త్వరలో జరగబోతున్నాయి. తొలి ఏడాది మాదిరి ఈ సారి హడావుడి వుంటుందా ? లేక వైఫల్యాల మనోవైకల్యంతో సాదాసీదాగా వుంటుందా? మోడీని దేవదూతగా వర్ణించిన వెంకయ్య నాయుడి వంటి వారు సాదాసీదాగా జరగనిస్తారా ? వదిలేయండి ఎలా అయితేనేం, దేశానికి జరిగిందేమిటి? సామాన్యులకు ఒరిగిందేమిటన్నదే ముఖ్యం ! గత ఎన్నికలలో గుజరాత్‌ మోడల్‌ పాలన అనే ఎండమావులను చూసి భ్రమలు పెంచుకున్నవారు కొందరైతే, అంతకు ముందు గుజరాత్‌ మారణకాండతో వుత్సాహం పొంది హిందూత్వకు పెద్ద పీట వేస్తారని చూస్తున్న మనువాదులు ఎలాగూ వున్నారు. రెండు సంవత్సరాల సంబరాల సందర్భంగా వారేమనుకుంటున్నారు ?

   ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.’ ఈ మాటలు స్వరాజ్య అనే మితవాదుల పత్రికలో మురళీ ధరన్‌ అనే కాలమిస్టు రాసినవి.ఆ పత్రిక నరేంద్రమోడీ, హిందూత్వవాదుల అనధికార వాణిగా వుంది. అలాంటి దీనిలో ఇలాంటి వ్యాసం ప్రచురించటం ఏమిటి అని ఆశ్చర్య పోయిన వారు కూడా వున్నారు. నిజానికి ఇది మోడీకి వ్యతిరేకంగా రాసినది కాదు, ఆయనను హెచ్చరిస్తూ ఇష్టం లేకున్నా వెళ్ల బోసుకున్న ఆవేదన. బిజెపి, నరేంద్రమోడీని రాజకీయంగా, విధాన పరంగా వ్యతిరేకించే వారే కాదు, సమర్ధించేవారిలో కూడా ‘అసంతృప్తి’ ఎలా పెరుగుతోందో ఈ వ్యాసంపై వెలువడిన అభిప్రాయాలు మోడీ-మనువాదుల మనోగతాన్ని వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్నింటి సారాంశాన్ని చూద్దాం.

    అమెరికన్లు అంతరిక్షంలో చంద్రుడి వద్దకు వెళ్లాలని అనుకున్నపుడు వారిదగ్గర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏమీ లేదు, కాని వారు ఆ మేరకు కలకన్నారు,జనాన్ని ఆ వైపుగా నడిపించి సాధించారు.మన చేతుల్లో చేయాల్సిన పని చాలా వుంది.ఇప్పటికీ రోడ్ల మీద చెత్తవేయటాన్ని చూస్తున్నాం, దీని గురించి మోడీ పెద్దగా చేయగలిగిందేమీ లేదు. దిశను నిర్ధేశించటమే ఆయన బాధ్యత.మోడీ దగ్గర పెద్ద సైన్యం వుంది వారు ఎంతగానో కష్టపడాల్సి వుంది. సమస్య ఏమంటే వారంతా ఆయన చుట్టూ కుర్చుంటున్నారు తప్ప చేస్తున్నది తక్కువ. నాకు తెలిసినంత వరకు నరేంద్రమోడీ మంత్రివర్గంలో పని చేస్తున్న అధికారులందరూ పధకాలను విజయవంతం చేసేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు.నరేంద్రమోడీ నిర్దిష్ట కాలంలో ఫలితాలు రావాలని కోరుకొనే నేత, ఆయన మంత్రులందరూ కష్టపడి పని చేస్తున్నారు. 2017 నుంచి నిర్మలా సీతారామన్‌, ప్రకాష్‌ జవదేకర్‌, పియూష్‌ గోయల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, మీనాక్షి లేఖి, స్మృతి ఇరానీ లను టీవీ చర్చలకు పంపటం నరేంద్రమోడీకి మంచి వ్యూహంగా వుంటుంది.తద్వారా సాధించిన మంచి గురించి చైతన్యాన్ని కలిగించవచ్చు.

    నిజంగా మంచిని సాధిస్తే జనానికి తెలుస్తుంది, జరిగినట్లు భావిస్తారు, సాధించిన వాటి గురించి చెప్పటానికి డజను మందిని పంపనవసరం లేదు. ఫలితాలే స్వయంగా వెల్లడిస్తాయి.

    మీడియా, ప్రతిపక్షాలు దెబ్బతీసే పనిలో వున్నపుడు మనం అలాంటి పనులు చేయాల్సి వుంటుంది.

  యుపిఏ పాలనా కాలంలో ప్రతివారం లూటీ జరిగినా ఎన్నికల ఫలితాలలో మోడీ వచ్చేంతవరకు అది కాంగ్రెస్‌ను ప్రభావితం చేయలేదు. మీడియా మద్దతు లేకుండా తాము చేసిన దానిని ప్రజలకు చెప్పుకోగలమని బిజెపి నాయకులు అనుకుంటే భ్రమలో వున్నట్లే. కనీసం వామపక్షాలకు మద్దతు ఇచ్చే నెట్‌వర్క్‌ను అయినా ధ్వంసం చేయాలి. వారు వాటితో బతగ్గలగటమే కాదు వృద్ధి చెందుతున్నారు.

    కేవలం విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, రైల్వేలు, అవినీతి రహిత పాలన కారణంగానే ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలలో గెలుస్తారు.

   మోడీ పాలనాయంత్రాంగం అత్యంత ముఖ్యమైన సమస్యలను కూడా పట్టించుకోవటం లేదు.భారత్‌లో హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారు. మైనారిటీలతో సమంగా హిందువుల దేవాలయాలను స్వాధీనం చేసుకోవటం గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.ఆయన ఓటర్లందరూ హిందువులే, వారిని విస్మరిస్తున్నారు.

   మోడీ హిందూ హృదయ సామ్రాట్‌గా వుండాలని అంగీకరిస్తా. మన హిందువులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని నేను ఇంకా వేచి చూస్తున్నా.

   హిందువులను విస్మరించటం లేదు. కానీ దేవాలయ ట్రస్టులు డబ్బును వెనక్కి తీసుకోవటం అంత సులభం కాదు, అది 1949లోనో ఎప్పుడో జరిగింది. అందరూ ఇంతకాలం ఎందుకు నోర్మూసుకున్నారు.

   సమస్య రాష్ట్ర ప్రభుత్వాలతో వుంది. ప్రధాన రాజకీయాలు, పధకాల అమలు రాష్ట్ర స్థాయిలోనే జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చౌకబారు స్థానిక రాజకీయాల మీద తప్ప పధకాల అమలు మీద ఎప్పుడో తప్ప శ్రద్ధ పెట్టటం లేదు. మోడీ లేదా బిజెపి తన సమయం, డబ్బును పశ్చిమబెంగాల్‌, కేరళ వంటి ప్రయోజనం లేని రాష్ట్రాల మీద వెచ్చించే కంటే తమ పాలనలో వున్న వాటిమీద పెట్టటం మంచిది. మోడీ గుజరాత్‌లో చేసిన మాదిరి ఆ రాష్ట్రాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 2019 ఎన్నికలలో ఆ విజయాలను ముందుకు తేవటం మంచిది.

    వారి స్వంత రాష్ట్రాలపైనే పూర్తిగా కేంద్రీకరించటం మంచిది. చివరికి చత్తీస్‌ఘర్‌ కూడా మారిపోతే ఇతర రాష్ట్రాలలోని జనం వాటిని చూసి ఈర్ష్య పడతారు, ఇతర పార్టీలను అపహాస్యం చేస్తారు.

    ఒంటి చేత్తో దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. సమయాన్ని వృధా చేస్తూ ముందుగా వ్యవస్ధలను నిర్మించి తరువాత పధకాలను ప్రారంభించాలని అనుకుంటే ఫలితాలు సంపూర్తిగా వుండకపోవచ్చు. మార్కెట్లోను, జనంలోనూ ఆశాభావాన్ని కలిగించటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. స్వంత ప్రభుత్వంలో ప్రతిభలేమిని ఆయన ఎదుర్కొంటున్నారు, కానీ ఆయన ప్రతి పధకానికి వున్న ఆటంకాలను తొలగించగలరు.ఆయన పద్దతి కొద్దిగా తేడాగా వుండవచ్చు కానీ కాంగ్రెస్‌కు ఇచ్చిన మాదిరి ఆయనకు మరింత సమయాన్ని ఇవ్వాలి. భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్గతంగా తన ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటంపై మోడీ జయప్రదంగా పోరాడారు. ఇది పశ్చిమ దేశాలకు కోపకారణమైంది. వారి, మన మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నది.ఆయనను వూపిరి సలుపుకోనివ్వండి.

   ప్రకటించటంతో పాటు పధకాల అమలుపై కూడా శ్రద్ధ పెడితే అవి పని చేస్తాయి. దిగువ స్ధాయిలో అటువంటి ప్రయత్నాలకు కొన్ని సమస్యలు ఎదురౌతాయి, ముందుకు పోతే వాటిని సరిచేసుకోవచ్చు.వాటిని అమలు జరిపితేనే పురోగతి వుంటుంది, చరిత్రను చూస్తే సన్నాహాలు లేకుండా ప్రారంభిస్తే పనిచేయవని చాలా మంది చెప్పటం జరుగుతూనే వుంటుంది.మోడీ అందుకు మార్గం చూపారు.మోడీ ప్రచారం కారణంగా విజయం సాధిస్తారు. విజయం దానంత అదే రాదు.

    బిజెపి వారు (ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి తదితరులతో సహా) నిజానికి భిన్నమైన వారేమీ కాదు. వాగాడంబర నినాదాలు తదుపరి చర్యలు, ఫలితాలు వుండటం లేదు.టీవీలలో జనాన్ని మెప్పించే ఒప్పించే మేథావంతులు కొద్ది మందే వున్నారు. ప్రచారాన్ని ప్రారంభించటం వాటిని చివరిదాకా పూర్తి చేయకుండా వదలి వేయటం లేదా ప్రతి వుదంతంలోనూ వెనక్కి తగ్గటం గురించి అనేక వుదాహరణలు చెప్పుకోవచ్చు.

1. ఘర్‌ వాపసీ: దానిని ప్రారంభించారు తరువాత వదలివేశారు. గత రెండు సంవత్సరాలుగా తిరిగి అది వినపడటం లేదు.

2.జెఎన్‌యు వుదంతం: కన్నయ్య ఇతరుల గురించి ఎంతో మాట్లాడారు, వారేమో చేయదలచుకున్నది చేస్తూనే వున్నారు.

3. భారత మాతాకీ జై : పసలేని నినాదం, నిట్‌లో భారత అనుకూల విద్యార్ధులను రక్షించటానికి కూడా బిజెపి ముందుకు రాలేకపోయింది. ఒక నినాదంపై పిల్లచేష్టమాదిరి చర్చలు తెలివి తక్కువ వారిగా చేస్తున్నాయి తప్ప దేశభక్తులుగా కాదు.

4. గొడ్డు మాంస నిషేధం: గేదెలు, ఆవులు మేకలు,ఎద్దులు, కోళ్లు, పందులను వధించవచ్చు గానీ ఆవులను మాత్రం కాదు, ఏమిటీ తర్కం. గోవాలో బిజెపి ప్రభుత్వం గొడ్డు మాంసాన్ని అనుమతించవచ్చా, ఏమిటీ అసంబద్ధ ద్వంద్వ ప్రమాణాలు.

5.అనుపమ ఖేర్‌ : అతనికి ఏమైంది. కేంద్రం, రాష్ట్రంలోనూ రెండు చోట్లా బిజెపి అధికారంలో వున్న తన స్వంత దేశంలో శ్రీనగర్‌లో కనీసం ప్రవేశించనివ్వకుడా వెనక్కి తిప్పి పంపారు.

6.వెర్రి వారిగా పిలువబడే బిజెపి వారు:అసహ్యంగా మాట్లాడేవారి గురించి ఏం చేశారు ?

7. వుమ్మడి పౌర స్మృతి: ముస్లిం మహిళలకు బిజెపి ప్రభుత్వ మద్దతు ఎక్కడ ?

8. పాకిస్ధాన్‌పై విధానం: పాకిస్థాన్‌ ఏ టు ఇ ని నాకటం తప్ప బిజెపి చేసిందేముంది. ప్రతిఘటన ఎక్కడ ? పఠాన్‌ కోట్‌ వైమానికి స్ధావరంపై వారు చేసిన దాడి గురించి దర్యాప్తు చేయటానికి ఐఎస్‌ఐని ఆహ్వానించటం కంటే దారుణం ఇంకేముంటుంది? ముందే చెప్పినట్లు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు లేదు. బిజెపి,మోడీలపై జనం పెట్టుకున్న ఆశలు వేగంగా అంతరిస్తున్నాయి. ఈ బుద్దిలేని గుంపుతో పోలిస్తే 2019 రాహుల్‌ గాంధీ ఒక గొప్ప రాజకీయవేత్తగా కనిపిస్తారేమో ఎవరికి తెలుసు !!

(ఈ వ్యాఖ్యల గురించి ఎవరికైనా అనుమానం వుంటే మురళీధరన్‌ వ్యాసం పూర్తిగా చదువుకొనేందుకు, దానిపై వెలువడిన అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ లింక్‌ను చూడవచ్చు)

http://swarajyamag.com/politics/to-retain-power-in-2019-the-bjp-must-eschew-its-fascination-for-micawberism

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బలహీనపడుతున్న నరేంద్రమోడీ – బలపడుతున్న విమర్శకులు

09 Saturday Jan 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, Modi Critics, Narendra Modi

ఎంకెఆర్‌

నరేంద్రమోడీ 2014 ఎన్నికలకు ముందు బిజెపిలో తిరుగులేని నేత ! వుక్కు మనిషిగా అభిమానులు కీర్తించిన ఎల్‌కె అద్వానీని సైతం తుక్కు కింద జమకట్టి మూలన పడేసిన అపర చాణక్యుడు !! మరి నేడు ? ఏం పీకుతారో పీక్కోండి అంటూ మోడీ-అమిత్‌షాల నాయకత్వాన్ని సవాలు చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంత తేడా !!! ఎందుకీ పరిస్ధితి? ఏం జరుగుతోంది?

భారతీయ జనతా పార్టీ దాని పూర్వరూపాలైన జనసంఘం,జనతా పార్టీ న్యూఢిల్లీలో సాంప్రదాయంగా బలంగా వుండేవి. అలాంటిది కేంద్రంలో స్వంతంగా తొలిసారి బిజెపి అధికారానికి వచ్చిన తరువాత అక్కడ బిజెపి ఆమ్‌ ఆద్మీ చేతిలో చావు దెబ్బ తిన్నది. సృష్టి, స్ధితి, లయ కారకుడిగా నరేంద్రమోడీని వర్ణించినందున అక్కడ తగిలిన చావు దెబ్బకూ ఆయనే మూలం. తరువాత బీహార్‌లో పద్దతి మార్చారా అంటే అదీ లేదు, అక్కడా బిజెపి విష్ణుమూర్తి బోర్లా పడ్డాడు. తాను పాలించిన గుజరాత్‌ అభివృద్దికి నమూనా అని దాన్ని దేశం మొత్తానికి విస్తరింప చేస్తానని నమ్మబలికిన పెద్ద మనిషి ఇరవై నెలలు గడిచినా దాని జాడే లేదు, అంతకు ముందు కంటే వుత్పత్తి రంగంలో అధోగతిలోకి దేశం దిగజారింది. ఏ రంగంలో చూసినా పరిస్ధితి దిగజారటమే తప్ప సమీప భవిష్యత్‌లో మెరుగు పడే సూచనలు కనిపించటం లేదు. ఇంటా బయటా మరిన్ని సంస్కరణలు అమలు జరపాలన్న వత్తిడి పెరుగుతోంది. జిఎస్‌టి వంటి బిల్లులు ఆమోదం పొందే పరిస్ధితి కనిపించటం లేదు. నోరు తెరిస్తే జర్నలిస్టులు ఏం అడుగుతారో, ఏం చెప్పాల్సి వస్తుందో తెలియని స్ధితిలో నరేంద్రమోడీ మన్మోహన్‌ సింగ్‌ బాటలోనే మౌన ముని అవతారమెత్తారంటే అతిశయోక్తి కాదు.

ఇన్ని వైఫల్యాల తరువాత నరేంద్రమోడీకి, ఆయన అంతర్భాగం లేదా అంతరంగమైన అమిత్‌షాకు పార్టీపైన పట్టేముంటుంది. పూర్వాశ్రమంలో సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి తనకంటూ ఒక ఇమేజ్‌ సృష్టించుకున్న షాట్‌ గన్‌ శతృఘ్న సిన్హా ఇప్పుడు బిజెపి మందలో ఒకడు. అద్వానీ సమక్షంలో షాపై జోకులు పేల్చుతున్నాడు. బీహార్‌ పీఠాన్ని ఆశించి భంగ పడ్డవారి జాబితాలో వున్నాడు. తన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సందర్భంగా పాత గాయాన్ని మరోసారి కెలికినట్లు బీహార్‌ ఘోరపరాజయాన్ని జనం ముందుకు తెచ్చారు.ఆ సభలో బిజెపిలో మూలన పడేసిన అద్వానీ, యశ్వంత సిన్హా, ఇద్దరు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, వికె సింగ్‌,ఎస్‌పి నేత అమరసింగ్‌,కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా కూడా హాజరై సభను రక్తి కట్టించారు.’ మా నాయకుడు అమిత్‌ షా బీహార్‌లో మూడింట రెండువంతుల మెజారిటీతో గెలుస్తామని జోస్యం చెప్పారు.బహుశా అలా చెప్పటం ఆయనకు అలవాటు అనుకుంటా ఎందుకంటే ఢిల్లీలో కూడా అదే చెప్పారు అక్కడ మూడింట రెండువంతులకు బదులు రెండుమూడు సీట్లు వచ్చాయి’ అని శతృఘ్న సిన్హా జోక్‌ చేశారు. బీహార్‌కు చెందిన ఇతర మా నాయకులు ప్రతివారూ వాటిని చిలుక పలుకుల్లా వల్లించారు. వుల్లితో కన్నీరు తెప్పించి గతంలో ఓడిపోయి మనం కన్నీరు కార్చాము ఈ సారి దానిని పునరావృతం కాకుండా ధరలు తగ్గించమని తాను చెప్పానని, తన మాట ఎవరూ వినలేదని సిన్హా ఆత్మకధలో రాసుకున్నారు. తనకు నాయకత్వం అప్పగించని కారణంగా పార్టీ ఓడిపోతుందని కొందరు తనతో చెప్పారని చివరికి అదే జరిగిందని కూడా పేర్కొన్నారు.సిన్హా ఈ విధంగా మాట్లాడటానికి తొలి ఏడాది కాలంలోనే నరేంద్రమోడీ పసేమిటో తేలిపోవటం మినహా మరొకటి కాదని వేరే చెప్పాలా ?

ప్రధాని సన్నిహితులలో ఒకరైన అరుణ్‌జైట్లీ అవినీతి గురించి ధ్వజమెత్తిన బిజెపి ఎంపీ కీర్తీ అజాద్‌పై ఏ క్షణంలో అయినా పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకొనే అవకాశం వుంది. అజాద్‌ క్రమశిక్షణను వుల్లంఘించినట్లు క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఆయన ప్రవర్తన పార్టీ ప్రతిష్టను దిగజార్చేదిగా వుందని కమిటీ అధ్యక్షుడు గణేషీ లాల్‌ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లో జరిగిన నిధుల అవినీతి గురించి అజాద్‌ ఎవరి పేరునూ ప్రస్తావించకుండానే విలేకర్ల సమావేశంలో పరోక్షంగా జెట్లీ గురించి చెప్పారు. విలేకర్లతో మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించినా ఖాతరు చేయలేదు. పార్టీ ఇచ్చిన సంజాయిషీ లేఖను కూడా పట్టించుకోకుండా తానెలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడలేదని పేర్కొన్నారు.

గతంలో తాను అధ్యక్షుడిగా వున్న క్రికెట్‌ అసోసియేషన్‌ వ్యవహారాలపై ఆరోపణలు చేసినందుకు అరుణ్‌ జైట్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఇతర ఆప్‌ నేతలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం పేద అయినందున తాను కేవలం ఒక రూపాయి ఫీజు తీసుకొని జైట్లీకి వ్యతిరేకంగా వాదిస్తున్నట్లు బిజెపి మాజీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు రామ్‌ జెత్మాలనీ చెప్పారు. దేశంలో ఎక్కువ ఫీజు తీసుకొనే న్యాయవాదిని తాను అన్న మాట వాస్తవమేనని అయితే తాను వాదించే కేసులలో కేవలం పదిశాతం మంది నుంచే డబ్బు తీసుకుంటానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయి సర్కారులో న్యాయశాఖ మంత్రిగా వున్న తనను తొలగించటంలో అరుణ్‌జెట్లీ పాత్ర వుందని అన్నారు. తనకు జైట్లీ మీద బలమైన అభిప్రాయాలు వున్నాయని అయితే అవి మంచివి కాదని చెప్పారు. తన గురించి నాకు ఎన్నో విషయాలు తెలుసని జైట్లీకి తెలుసని కూడా అన్నారు.ఎన్నికల ప్రచారంలో చెప్పిన నల్ల ధనం గురించి మోడీ-అమిత్‌ షా- జెట్లీ ఎన్నో చెప్పినపుడు తాను వారి అభిమానినయ్యానని, వాటి గురించి ఇప్పుడేమీ చేయని కారణంగా తాను వారి విమర్శకుడిగా మారినట్లు జెత్మలానీ చెప్పారు.

నరేంద్రమోడీ ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని విమర్శిస్తూ సామాజిక వుద్యమ కార్యకర్త అన్నా హజారే ఒక లేఖ రాశారు. అంతకు ముందున్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ పాలనకూ మోడీ ఏలుబడికి పెద్ద తేడా కనపడటం లేదని పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని, లోక్‌పాల్‌, లోకాయక్తలను సక్రమంగా అమలు చేస్తానని చెప్పిన మోడీ వాటిని విస్మరించారని పేర్కొన్నారు.ఈ విషయమై తాను ఎన్నిసార్లు లేఖలు రాసినా వాటిని చెత్తబుట్టలో వేశారని ఇది కూడా అలాంటిదే అని వ్యాఖ్యానించారు.గతంలో లంచం ఇవ్వకుండా ఆఫీసుల్లో పని జరగదని మీరు చెప్పిన మాటలను జనం నమ్మారు, ఇప్పుడు కూడా పరిస్ధితి అలాగే వుంది, ద్రవ్యోల్బణం కూడా తగ్గలేదని హజారే విమర్శించారు. చేసిన వాగ్దానాలను మరిచి పోయారని పేర్కొన్నారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో తాను దీక్ష చేపట్టిన సమయంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాదు బిజెపి నేతలు సుష్మా స్వరాజ్‌,అరుణ్‌ జైట్లీ కూడా అవినీతి వ్యతిరేక బిల్లును అమోదిస్తామని తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి లేఖకు ప్రధాని స్పందించటం సాధ్యం కాదని తనకు తెలుసునని తన వంటివ వారికి సమాధానం రాయాల్సి వుందన్నారు.పివి నరసింహారావు ప్రధానిగా వున్నపుడు కొన్ని సార్లు ఫోన్లో మాట్లాడారని, వాజ్‌పేయి పూనేకు వచ్చినపుడు తన గురించి తెలుసుకున్నారని, మన్మోహన్‌ సింగ్‌ తన లేఖలకు సమాధానాలు రాసేవారని, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు శేషాద్రి తన వూరు పహెల్‌ గామ్‌ సిద్దికీ సందర్శించి తనను గ్రామ కర్మయోగిగా ఒక పుస్తకంలో రాశారని అలాంటి తనను మోడీ విస్మరించారిని హజారే వాపోయారు.

ఇదిలా వుండగా ఇది జరిగిన కొద్ది రోజులకే మహారాష్ట్రలోని బిజెపి సర్కార్‌ హజారే తదితరులు ట్రస్టు సభ్యులుగా వున్న ఒక ప్రభుత్వేతర సంస్ధ పేరులోని అవినీతి వ్యతిరేక అనే పదాన్ని తొలగించనందుకు గాను వారిని ట్రస్టీలుగా తొలగిస్తూ ప్రభుత్వం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతేడాది జూన్‌లో ఈ మేరకు అధికారులు జారీ చేసిన నోటీసులో అవినీతి వ్యతిరేక అనే పదాన్ని తొలగించకపోతే చర్య తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక సేవ తప్ప అవినీతి వ్యతిరేక చర్యలు తీసుకొనే బాధ్యత ధర్మాదాయ సంస్ధల చట్టం కింద నమోదైన సంస్ధల పని కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ నోటీసు అందుకున్న హజారే అందుకు తిరస్కరించారు.ప్రభుత్వం ఎన్‌జీవోలను వేధించటం మానుకొని అవినీతి నిరోధక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మొత్తం ఇరవై సంస్ధలకు ఇలాంటి నోటీసులే ఇచ్చింది. అవినీతి నిరోధక చర్యల పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కార్‌ ఇలాంటి చర్యలకు పూనుకోవటం నిజంగా ఆశ్చర్యం గొలుపుతోంది కదూ !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: