• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Modi

ఆదిత్యనాధ్‌ ఇలాకాలో బిజెపి తొలి ఓటమి !

24 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Bahujan Samaj Party, BJP, Congress party, Modi, Samajwadi Party, Shah, UP Loksabha elections 2019, UP's kairana, Yogi Adityanath

Image result for up lok sabha election 2019

ఎం కోటేశ్వరరావు

అవును ఎన్నికలు ఇంకా జరగముందే ఓడిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నిజంగానే ఏడాది క్రితం నిలిపిన అభ్యర్ధిని ఇప్పుడు మార్చటం అంటే నైతికంగా ఓటమిని అంగీకరించటం కాదా ? కైరానా నియోజకవర్గం ఏడాది క్రితం ఒక సంచలనం. మూడో వంతుకు పైగా ముస్లిం జనాభా వున్న ఈ నియోజకవర్గంలో వారు మెజారిటీగా వున్న చోట్ల నుంచి హిందువులను తరిమి వేస్తున్నారంటూ ఆ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బిజెపి నేత హుకుం సింగ్‌, తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సదరు సింగ్‌ హఠాన్మరణంతో ఏడాది క్రితం వుప ఎన్నిక అవసరమైంది. అది ఒక్క వుత్తర ప్రదేశ్‌ రాజకీయాలనే కాదు, దేశ వ్యాపితంగా బిజెపి వ్యతిరేక శక్తులు ఒక్కతాటి మీదకు వస్తే కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటో వెల్లడించింది.

ఆ ఎన్నికలో బిజెపి అభ్యర్దిగా హుకుంసింగ్‌ కుమార్తె మృగాంకను నిలిపి సానుభూతి ఓట్లతో గెలవాలని చూసింది. అయితే సమాజవాదిపార్టీ, ఆర్‌ఎల్‌డి వుమ్మడి అభ్యర్ధిగా ఆర్‌ఎల్‌డికి చెందిన తబుసుమ్‌ హసన్‌ను రంగంలోకి దిగటమే కాదు గణనీయ మెజారిటీతో బిజెపిని ఓడించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేయలేదు.బిజెపిని ఓడించండి అని కార్యకర్తలకు పిలుపునివ్వటం తప్ప ఫలానా వారికి మద్దతు ఇస్తున్నట్లు బహుజన సమాజవాది పార్టీ నాయకురాలు మాయావతి సూచించలేదు. ఈ ఎన్నిక తరువాత అనూహ్యంగా దశాబ్దాలుగా వుప్పు నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. ఒక ఫార్ములాను రూపొందించుకొని సీట్ల సర్దుబాటు చేసుకొని బిజెపి మీద బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగాయి.

శనివారం నాడు బిజెపి ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కైరానాలో మృగాంకకు మొండి చేయి చూపి పక్క జిల్లాకు చెందిన ఒక ఎంఎల్‌ఏను ఎంపిక చేశారు. వేరే కారణాలేమీ లేకుండా ఏడాదిలోనే అభ్యర్ధిని మార్చటం అంటే నైతికంగా బిజెపి ఓటమిని అంగీకరించటమే. వుప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డి అభ్యర్ధినిగా వున్న తబుసుమ్‌ ఈ సారి సమాజవాది పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సారి కాంగ్రెస్‌ తమ అభ్యర్ధిని నిలిపే అవకాశం వుంది. ఏడుశాతంపైగా గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఏకపక్షంగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్దానాలలో మద్దతు ప్రకటించి మిగిలిన అన్ని చోట్ల ఎస్‌పి, బిఎస్‌పి,ఆర్‌ఎల్‌డి కూటమి అభ్యర్దులను రంగంలోకి దించుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర బిజెపి సర్కార్‌పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ప్రధాన ప్రత్యర్ధులకే దోహదం చేస్తుంది తప్ప కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చదు. అయినా అన్ని చోట్లా తమ అభ్యర్ధులను నిలుపుతామని ఆ పార్టీ ప్రకటించింది.ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది.

Image result for up lok sabha election 2019

అయోధ్య ! రాముడిని వీధుల్లోకి, భారతీయ జనతాపార్టీతో పాటు దేశంలో అనేక మందిని మత రాజకీయాలవైపు నెట్టిన పేరు. పక్కా కాషాయంతో మతం, అయోధ్య రాముడిని వుపయోగించుకొని బిజెపి లాభపడిందన్నది నిస్సందేహం. దాని తీరు చూసి కాంగ్రెస్‌ కూడా పలుచబారిన కాషాయంతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. అయోధ్యలోని బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణం అన్నది గత ఎన్నికలలో బిజెపి వాగ్గానం. దానికి నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి, నల్లధనం వెలికితీత వంటి నినాదాలు తోడయ్యాయి. సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌, తదితర పార్టీలు విడివిడిగా పోటీపడటం బిజెపికి అనూహ్యంగా 80కిగాను 71, దాని మిత్రపక్షం అప్నాదళ్‌కు రెండు, సమాజవాది పార్టీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు వచ్చాయి.

Image result for ayodhya priest surendra das

ఈ సారి రామ మందిరం కాదు, పుల్వామాయే బిజెపిని రక్షిఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని పుల్వామా మాత్రమే రక్షించగలదు తప్ప రామ మందిరం కాదని అయోధ్యలోని వివాదాస్పద తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సురేంద్రదాస్‌ అన్నారు. సాధారణంగా రాజకీయాల గురించి నోరు విప్పని ఆ పెద్దమనిషి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ‘కాశ్మీర్‌పై దాడితో బిజెపి రామ మందిర సమస్యను పక్కన పెడుతుంది. రామ్‌ రామ్‌ అని నినాదాలు ఇచ్చేవారు ఇప్పుడా పని చేయరు. వారు గనుక రామ మందిరం సమస్యను ముందుకు తెస్తే ఓడిపోతారు, జనం వారిని నమ్మటం లేదు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.

గతంలో బాబరీ మసీదు వున్న చోట ఇప్పుడు తాత్కాలిక గుడారంలో భద్రతా సిబ్బంది రక్షణ మధ్య నాలుగు రాముడి విగ్రహాలు వున్నాయి. నాలుగంచలలో సందర్శకులను తనిఖీ చేసిన తరువాత 50 మీటర్ల దూరం నుంచి ఆ విగ్రహాలను చూడనిస్తారు. గతంలో సంస్కృత పండితుడిగా పని చేసిన సురేంద్రదాస్‌ కొన్ని విషయాలను నిర్మొహమాటంగా చెబుతారు. బాబరీ మసీదు కూల్చివేత ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా బాధించిందని, కూల్చాల్సిన అవసరం లేదని అంటారు.

పుల్వామా వుదంతం బిజెపిని తిరిగి అధికారంలోకి తెస్తుందనే అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించటం లేదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని, యూరి సర్జికల్‌ దాడులను బిజెపి ఎన్నికలలో వుపయోగించుకొని జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను విస్మరించి ఓటర్లకు దూరమైన విషయాలను గుర్తు చేస్తున్నారు. పుల్వామా తాత్కాలికంగా భావోద్వేగాలను రగిలించగలదు తప్ప నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభాన్ని ఓటర్లు మరచిపోయే అవకాశం లేదంటున్నారు. పుల్వామా వుదంతాన్ని, అయోధ్య స్ధల వివాదం సుప్రీం కోర్టులో ఇంకా విచారణలో వుండగా దాన్ని ఏ రూపంలో ముందుకు తెచ్చినా బిజెపి విమర్శపాలయ్యే అవకాశం వుంది. రామాలయ నిర్మాణ వాగ్దానంతో అధికారానికి వచ్చిన యోగి ఆదిత్యనాధ్‌ భక్తులను తప్పుదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ఆలయ నిర్మాణం బదులు ఫైజాబాద్‌ జిల్లా పేరును శ్రీ అయోధ్య అని మార్చటం, అయోధ్యలో అతి పెద్ద రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసినదే. బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కోరిన ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు ఎన్నికలు రాగానే మౌనం దాల్చాయి.

కాంగ్రెస్‌ స్వామిగా పేరున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఫిబ్రవరి 21న అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేస్తానని ప్రకటించి తన అనుచరులందరూ రావాలని పిలుపునిచ్చారు. అయితే 14వ తేదీన పుల్వామా వుగ్రదాడితో ఆ కార్యక్రమం వెనక్కు పోయింది. బిజెపి ఎంతగానో వూపిరి పీల్చుకుంది. రామ మందిర నిర్మాణం జరుగుతుందని రామ ప్రభు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు, రామ మందిరం చుట్టూ నాటకం నడుస్తోంది, అదొక ప్రహసనంగా మారుతోంది, బిజెపి ఏమి చెప్పింది, ఏమి చేస్తుంది అన్నది సమస్య కాదు, చివరికి సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది, దాని పట్ల బిజెపి నిజాయితీతో వుండాలి అని పూజారి సురేద్రదాస్‌ వ్యాఖ్యానించారు.

లెక్కలు ఏమి చెబుతున్నాయి !

దేశంలో వుపాధి కల్పన మొదలు, అభివృద్ధి అంకెల వరకు ఎవరు చెప్పేది నిజమో దేన్ని నమ్మాలో నమ్మకూడదో నిర్ణయించుకోలేనంతగా జనాన్ని ఆయోమయంలో పడవేశారు. ఐదేండ్లలో ఎంత మందికి వుపాధి కల్పించారంటే వున్న లెక్కలు తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అంటారు. పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పిన తరువాత పకోడీ బండ్లను కూడా తాను కల్పించిన వుపాధిలో భాగంగా పరిగణిస్తున్నారా ? వాటిని వదలి వేద్దాం. గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల లెక్కలను తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అనటం కుదరదు. అందువలన వాటి ప్రాతిపదికగానే విశ్లేషణలు చేయటం మినహా మరొక మార్గం లేదు.

వుత్తర ప్రదేశ్‌లోని 80 నియోజక వర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.జరుగుతున్నాయి.గత లోక్‌సభ ఎన్నికలలో చిన్న పార్టీలను కలుపుకొని బిజెపి ఎన్‌డిఏ కూటమి పేరుతో, కాంగ్రెస్‌, ఎస్‌పి,బిఎస్‌పి, ఇతర పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బిజెపి పోటీచేసిన 78 స్ధానాల్లో 71, మిత్రపక్షం అప్నాదళ్‌ రెండు చోట్ల పోటీ చేసి రెండూ గెలిచింది. కాంగ్రెస్‌ 66కు రెండు, సమాజవాది పార్టీ 78కి ఐదు గెలవగా 80చోట్ల పోటీ చేసిన బిఎస్‌పి అన్నింటా ఓడిపోయింది. బిజెపికి 42.3శాతం ఓట్లు రాగా ఎస్‌పికి 22.2, బిఎస్‌పికి 19.6, కాంగ్రెస్‌కు 7.5శాతం వచ్చాయి. ఈ ఎన్నికల్లో బిఎస్‌పి 38, ఎస్‌పి 37 చోట్ల వుమ్మడిగా పోటీ చేస్తూ మిగిలిన చోట్ల కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డిని బలపరుస్తున్నాయి. కాంగ్రెస్‌ అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత గానీ నిజంగా ఎన్నిసీట్లలో పోటీ చేసేది తెలుస్తుంది. బిఎస్‌పి, ఎస్‌పి కూటమి గతంలో వచ్చిన ఓట్లను కలిపితే 41.8శాతం ఓట్లున్నాయి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ను చూస్తే బిజెపికి 39.7, దాని మిత్రపక్షానికి ఒక శాతం ఓట్లు వచ్చాయి. అదే బిఎస్‌పి,ఎస్‌పిలకు 22.2, 22శాతం వంతున 44.2శాతం వచ్చాయి. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో బిజెపి సీట్లు సగానికి సగం అంతకంటే ఎక్కువగా పడిపోతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల సర్వేలలో వెల్లడించిన అంకెల సగటును తీసుకుంటే బిజెపికి 29, కాంగ్రెస్‌కు 4, ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 47 వస్తాయని తేలింది.

వుత్తరాది రాష్ట్రాలలో, వుత్తర ప్రదేశ్‌లో బిజెపికి అయోధ్య అంశం ఓట్లు తెచ్చి పెట్టిందేమో కానీ అయోధ్య పట్టణం వున్న ఫైజాబాద్‌ నియోజకవర్గం ఎప్పుడూ దానితో లేదు. బిజెపి ఆయోధ్య ఆందోళన చేపట్టిన తరువాతే అక్కడ అది ఓట్లు తెచ్చుకోగలిగింది. బాబరీ మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఎన్నికలలో దానికి ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. 1957 నుంచి 2014వరకు జరిగిన 15 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఏడు సార్లు విజయం సాధించింది. 1991 తరువాత జరిగిన ఏడు ఎన్నికలలో బిజెపి నాలుగు సార్లు విజయం సాధించగా సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌ ఒక్కోసారి విజయం సాధించాయి. గత ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి లాలూ సింగ్‌కు 48శాతం ఓట్లు రాగా సమాజవాది పార్టీ మిత్రసేన్‌ యాదవ్‌కు 20.43, బిఎస్‌పికి 13.87, కాంగ్రెస్‌కు 12.7శాతం వచ్చాయి.

Image result for up lok sabha election 2019

బాబరీ మసీదు కూల్చివేసిన రోజు సాయంత్రమే జిల్లా కలెక్టర్‌గా నియమితుడైన పరిస్ధితిని చక్కదిద్ది ప్రశంసలు పొందిన విజయ శంకర్‌ పాండే తాజా ఎన్నికల్లో లోక్‌ ఘటబంధన్‌ పార్టీ(ఎల్‌జిపి) అభ్యర్దిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న విజయ శంకర్‌ బాబరీ మసీదు కూల్చివేత అనంతరం ఏర్పడిన పరిస్ధితిని చక్కదిద్దటంలో ఎంతో సమర్ధవంతంగా పని చేశారు. ముక్కుసూటిగా, అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించే పాండేను 52సార్లు బదిలీ చేశారంటే అవినీతి రాజకీయవేత్తలకు ఎంత దడపుట్టించారో అర్ధం అవుతుంది. అరవై రెండు సంవత్సరాల వయస్సున్న ఈ మాజీ అధికారి తాను ఇప్పుడు వునికిలో వున్న ఏ దైనా రాజకీయ పార్టీలో చేరితే ఇంతరకు తాను చేసిందంతా వృధా అయినట్లే అన్నారు.మార్పుకోసం సహకరించమని తాను సూటిగా ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. తాను కలెక్టర్‌గా నియమితమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు అయోధ్యలో మూకలు హింసాకాండకు పాల్పడ్డాయి. రోడ్లన్నింటినీ మూసివేశారు. ఫైజాబాద్‌ వెళ్లే రోడ్డును కూడా మూసివేయటంతో లక్నో నుంచి హెలికాప్టర్‌లో వచ్చి బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. వివాదాస్పద చంద్రస్వామి వివాదాస్పద స్దలం వద్ద హోమం చేయటానికి అనుమతించని కారణంగా కేవలం ఐదు నెలలకే తనను ఫైజాబాద్‌ నుంచి బదిలీ చేశారని చెప్పారు. మాయావతి, ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ తనను వేధించారని చెప్పిన పాండే 2017లో వుద్యోగ విరమణ చేశారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రేమతో ఆవుల బహుమతి: నరేంద్రమోడీ ర్వాండా గో మాంస ప్రియుల సంతుష్టీకరణ దౌత్యం !

26 Thursday Jul 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

cows, Girinka, Girinka Programme, Modi, Modi gifts 200 cows, Rwanda

ఎం కోటేశ్వరరావు

విదేశీ పర్యటనల సమయంలో లేదా విదేశీ అతిధులు మన దేశాన్ని సందర్శించినపుడు మన ప్రధాని నరేంద్రమోడీ అందచేసే బహుమతుల గురించి ఒక పెద్ద పరిశోధనే చేయవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఆయన రూటే వేరు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ఆవులతో కూడా దౌత్యనీతిని ప్రదర్శించవచ్చని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన రాజనీతిజ్ఞుడిగా కూడా చరిత్రకెక్కారు. దేశంలో మోడీ మాతృసంస్ధ సంఘపరివార్‌, దాని అనుబంధ రాజకీయ, ఇతర సంస్ధల కార్యకర్తలందరూ ‘గోరక్షణ కర్తవ్యం పేరుతో’ ముస్లింలపై మూకదాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. గోరక్షణకు కంకణం కట్టుకున్నానని నమ్మబలుకుతున్న నరేంద్రమోడీ దేశ ప్రజల అదృష్టం లేదా ఖర్మకొద్దీ ప్రధానిగా వున్నందున ప్రస్తుతానికి గోరక్షణ కార్యక్రమాలలో పాల్గనే అవకాశాలు లేవు. విదేశీ అతిధులు మన దేశానికి వచ్చినా, నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు జరిపినా పురుష నేతల భుజాలపై చేతులు వేయటం లేదా కౌగలించుకొని ఎంతో ఆత్మీయతను ప్రదర్శించటం తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశంలో పాల్గనేందుకు దక్షిణాఫ్రికా వెళుతూ దానితో పాటు కోటీ 20లక్షల జనాభా వున్న ర్వాండా అనే దేశాన్ని సందర్శించిన మోడీ అక్కడి వారికి 200 ఆవులను బహుమతిగా ఇచ్చి ఇటు జాతీయంగా ప్రతిపక్షాల వారిని అటు అంతర్జాతీయంగా తామే తిరుగులేని తలపండిన పెద్ద దౌత్యవేత్తలమని విర్రవీగుతున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పకతప్పదు. ర్వాండా అధ్యక్షుడికి గోవుల పంపిణీ ఇష్టమని మనసెరిగి గోపాలుడి అవతారమెత్తిన నరేంద్రమోడీ ఒక గ్రామానికి ప్రత్యేకంగా వెళ్లి కార్యక్రమంలో పాల్గని ఆ దేశాధ్యక్షుడిని పడేశారు.

మోడీ ప్రయాణించే విమానంలో మన దేశం నుంచి గోవులను రవాణా చేయటం కుదరదు, ఇక్కడి హిందూ గోమాతలు ఆఫ్రికా వాతావరణానికి సరిపడతాయో లేదో తెలియదు, అన్నింటికీ మించి అక్కడి క్రైస్తవ, ముస్లిం ఆచార వ్యవహారాలతో సరిపడక వాటి మనోభావాలు దెబ్బతినవచ్చు. సంకరంతో వ్రతం చెడవచ్చు. అందువలన ఎవరి మనోభావాలకు దెబ్బతగుల కుండా స్ధానికంగా దొరికే మెజారిటీ క్రైస్తవ గోమాతలనే కొనుగోలు చేయించి వాటిని అక్కడి వారికి బహుమతిగా ఇచ్చి ర్వాండాతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నించారు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కారు.

ర్వాండా పేదల సంక్షేమ పధకాలలో భాగంగా గిరింకా పేరుతో అధ్యక్షుడు పాల్‌ కగామే ఆవుల పంపిణీ పధకం చేపట్టినట్లు మోడీ సర్కార్‌ తెలుసుకుంది. అందువలన దానికి సంబంధించిన బహుమతి ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఆకట్టుకోవచ్చని మోడీ సలహాదారులు భావించి వుండాలి.ఆవుల పంపిణీ కార్యక్రమంపై ర్వాండా అధ్యక్షుకి స్వయంగా ఆసక్తి వున్నందున దానిలో మన దేశం కూడా భాగస్వామి కావటం ప్రాముఖ్యత సంతరించుకుందని విదేశీ వ్యవహారాల ఆర్ధిక సంబంధాల కార్యదర్శి టిఎస్‌ తిరుమూర్తి విలేకర్లతో స్వయంగా చెప్పారు. దాని ఫలితమే ఆవుల బహుమతి. ర్వాండాతో సోదర, సౌహార్ధ్ర సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

గిరింకా పధకం ప్రకారం ప్రభుత్వం పేదలకు ఆవులను బహుమతిగా ఇస్తుంది. వాటిని పొందిన వారు సదరు ఆవులకు పెయ్య దూడలు పుడితే వాటిని పొరుగు పేదలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా మూడున్నరలక్షల ఆవులను పంపిణీ చేయాలని అధ్యక్షుడు నిర్ణయించాడు. ఆవుల పధకంతో కుటుంబాలకు అవసరమైన పాలతో పాటు వ్యవసాయానికి కావాల్సిన ఎరువు సమకూరుతుంది, వట్టిపోయిన తరువాత ఆవులను, కోడెదూడలను మాంసానికి వినియోగిస్తారు కావున పోషకాహారలేమితో బాధపడుతున్న దేశంలోని పిల్లలకు దానిని సరఫరా చేయాలన్నది ఆ పధక లక్ష్యం. ర్వాండా జనాభాలో అత్యధికులు క్రైస్తవులు. వారి ఆహారంలో గొడ్డు మాంసం ముఖ్యమైనది. మనకు ప్రతి వూరిలో హోటల్‌లో ఇడ్లీ, దోసె దొరికినట్లుగా అక్కడ అది దొరుకుతుంది.

గో గూండాలు మరోమారు విజృంభించి మరొకరి ప్రాణం తీసిన వుదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చిన తరుణంలోనే మోడీ గో దౌత్యం గురించి కూడా ఆ వార్తలతో పాటు దీన్ని చదువుకున్నాం గోవధను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిషేధించారు, దేశమంతటా అమలు చేయాలని హిందూత్వ శక్తులు పట్టుబడుతున్న తరుణంలో దానికి అనుగుణంగానే గో గూండాలు చెలరేగుతున్నారు. మూక హత్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి దేశానికి అసలు సిసలైన ప్రతినిధిని అని చెప్పుకుంటున్న మోడీ గొడ్డు మాంసం లేనిదే ముద్ద దిగని దేశంలో ఆవులను బహుమతిగా ఇవ్వటంపై గో అభిమానులే పరిహాసాలాడుతున్నారు.కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు అన్నట్లు పేటెంట్‌ కలిగి వుండకపోయినా గోవుల స్వంతదారుల మాదిరి ప్రవర్తిస్తున్నవారు ఏం చేసినా తప్పులేదని ఎవరైనా వాదించినా ఆశ్చర్యం లేదు.

‘ బుగెసెరాలో ఏర్పాటవుతున్న అతి పెద్ద గోమాంస(పరిశ్రమ) కబేళాకు ప్రేమతో 200 గోవులను బహుమతిగా ఇచ్చిన నరేంద్రమోడీ ‘ అన్నది వాటిలో ఒకటి. పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంలో గోవులు, ఇతర పశుసంపదను పెంచి, వాటి నుంచి మాంసం వుత్పత్తి చేసేందుకు ఒక పెద్ద పరిశ్రమ బుగెసెరా అనే చోట దశలవారీ ఏర్పాటు అవుతున్నది. దానికి దేశాధ్యక్షుడు పాల్‌ కగామే అనుమతి ఇచ్చారు. ఏటా 1200 గోవులతో ప్రారంభమై 2018నాటికి మూడువేల స్ధాయికి పెంచనున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్కో ఆవు నుంచి 160కిలోల మాంసం తయారవుతుంది. దేశం మొత్తంలో 2015లో 86వేల టన్నులుగా వున్న వుత్పత్తిని 2018 నాటికి 2,30,000 టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పశువును 120 రోజులు బాగా మేపి తరువాత కబేళాకు తరలిస్తారు. గో మాంస ఎగుమతులకు బుగెసెరాలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా వినియోగించుకుంటారు. గోవులను పెంచేందుకు, కబేళాల ఏర్పాటుకు ప్రభుత్వమే భూములను కౌలుకు ఇస్తుంది.

‘ మోడీ ర్వాండాకు 200 గోవులను బహుమతిగా ఇవ్వటం కొంత గందరగోళం కలిగిస్తోంది. ఆ దేశంలో ప్రతి చోటా ఆవులు వుండాలని ఆరు కోరుకుంటారు, ప్రత్యేకించి భోజన బల్లల మీద, త్వరిత గతిన దూకే గోరక్షక దళాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చు, వారిని తెల్లవారే సరికి పారా చూట్ల ద్వారా దించటాన్ని నేను చూడగలను’

‘ గోరక్షకులందరికీ సామూహిక అప్రమత్త సందేశం, ర్వాండాలో ఈ ఆవులను రక్షించేందుకు దయచేసి వెళ్లండి, వెళ్లండి, ఇప్పుడే వెళ్లండి’ ‘ ర్వాండాకు రెండువందల ఆవులను తరలిస్తున్న స్మగ్లర్‌ కనిపించాడు.’ ‘ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు ఆవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని వధించారు, మరొక వ్యక్తి 200 ఆవులను భారత్‌ నుంచి ర్వాండాకు తరలిస్తున్నట్లు నేను ఇప్పుడే విన్నాను. అయితే అతనికేమీ కాకూడదని ఆశిస్తున్నాను, అతని కోసం నేను ప్రార్ధిస్తాను.’ ‘200 ఆవులను ర్వాండాకు స్మగ్లింగ్‌ చేస్తున్నందుకు యునెస్కో మోడీకి అతి పెద్ద ఆవుల స్మగ్లర్‌ అనే అవార్డు ఇచ్చింది. వావ్‌ మోడీ వావ్‌, ప్రియమైన భక్తులారా మన ప్రధానిని వధించవద్దు, ఎందుకంటే ఆయన భాగీదారు తప్ప చౌకీదారు కాదు ‘

మాంసం కోసం లేత ఆవులు, కోడె దూడలను వధించటం, అతిధులకు దానిని వడ్డించటం ఒక మర్యాదగా మన దేశంలో ఒకప్పుడు విలసిల్లింది. మా మనోభావాలను గాయపరిచారనే పేరుతో పుక్కిటి పురాణ పాత్రలను విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఆవు పేరుతో ఎలాంటి తప్పు చేయని ఒక మనిషిని మూకదాడిలో చంపితే తోటి మనుషుల మనోభావాలు దెబ్బతినకపోగా మరింతగా జరగాలని ప్రోత్సహిస్తున్నవాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇది సామూహిక వున్మాదం తప్ప వ్యక్తిపరమైన సమస్య కాదు.వ్యక్తికి, ఇంటికి పరిమితం చేయాల్సిన దేవుడు, దేవతలను ఓట్లకోసం వీధుల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపుగానే ఆవును గోమాతను, దేవతను చేశారు. ఓట్ల కోసం మన దేశంలో ఆహారం కోసం గోవును వధించకూడదని నానా రాద్దాంతం చేస్తున్న వారు, మరో దేశంలో మార్కెట్‌, పెట్టుబడుల కోసం పడుతున్న పాట్లలో భాగంగా అక్కడ గోవులను తింటారని, ఆ దేశాధ్యక్షుడికి గోపంపిణీ అంటే ప్రీతి అని తెలిసి గోవులనే బహమతులుగా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మనోభావాలు ఏమైనట్లు? ప్రతిదానికీ మా మనోభావాలు గాయపడ్డాయంటూ నానా యాగీ చేస్తున్న వారు ఇప్పుడేమంటారు? ఇప్పుడేం చేస్తారు? ప్రాణ, విత్త, మానభంగములందు ఆడి తప్పవచ్చు అని మినహాయింపులిచ్చినట్లుగానే పెట్టుబడిదారులు, వ్యాపారుల లాభాల కోసం వధిస్తారని తెలిసీ నరేంద్రమోడీ గోవులను బహుమతిగా ఇచ్చినపుడు, జీవనోపాధికోసం తప్ప వధించటానికి కాదు మేము గోవులను కొనేదీ అమ్మేదీ అని నెత్తీ నోరు కొట్టుకుంటున్న ముస్లింల గోడును ఆయన అనుయాయులు, మద్దతుదారులు ఎందుకు పట్టించుకోరు? మోడీ మాదిరి మనోభావాలకు అతీతంగా వ్యవహరించలేరా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రెస్‌ కాన్ఫరెన్సులు కాదు, పాత మన్‌కీ బాత్‌లన్నీ వినిపించండి, దూలతీరిపోద్ది !

03 Sunday Jun 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

mann ki baat, Modi, Modi press meet

Image result for mann ki baat cartoons

ఎం కోటేశ్వరరావు

మూడు దేశాల పర్యటన ముగించుకొని మన దేశ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు పొద్దున్నే తన సహాయకులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సింగపూర్‌ నుంచే ఆదేశించారు. ఆదివారం నాడు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటూ కాళ్లీడ్చుకుంటూ అందరూ వచ్చారు. ఎప్పుడూ లేనిది నాలుగో సంవత్సరంలో ఇదేమిటి అని ఎవరికి వారే ముఖా ముఖాలు చూసుకుంటున్నారు.

సమావేశం ప్రారంభం కాగానే జనం మన నాలుగేండ్ల పాలన గురించి ఏమనుకుంటున్నారు అంటూ గడ్డం నిమురుకుంటూ అందరివైపు చూశారు ప్రధాని నరేంద్రమోడీ.టీచర్‌ రాగానే గుడ్‌మార్నింగ్‌ సార్‌ అని తరగతి గదిలో పిల్లలు అన్నట్లుగా ఏం చెబితే ఏం ముంచుకొస్తుందో అని అందరూ ఒక్కసారిగా అంతా మంచిగా చెప్పుకుంటున్నారు సార్‌ అన్నారు. తన దగ్గర ఏదో దాస్తున్నారని పెద్దసార్‌కు అర్ధమైంది. అప్పుడే బయటి నుంచి వచ్చిన అమిత్‌ షా ఇది విని ముసి ముసిగా నవ్వుకుంటూ తాను కూడా గడ్డం నిమురు కుంటూ వేరే గదిలో కూర్చుంటా అంటూ చిరునవ్వుతో సైగ చేసి వెళ్లిపోయారు. ప్రధాని జరిపే సమీక్ష అంతా అక్కడికి కూడా వినిపిస్తుంది, కనిపిస్తుంది.

కర్ణాటక, వుప ఎన్నికల వంటి రాజకీయ, ఇతర అంశాలు మినహా మిగతా విషయాల గురించి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పండి. అంటూ ప్రధాని అన్ని వైపులా చూశారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మోడీ గారే మన మన్‌కీ బాత్‌ను మన దూరదర్శన్‌, రేడియోలు తప్ప మిగతా మీడియా పెద్ద పట్టించుకోవటం లేదని విన్నాను, నేను ప్రెస్‌ కాన్ఫరెన్సులు పెట్టటం లేదని ఇంకా జర్నలిస్టులు ఏడుస్తూనే వున్నారా, ఆపారా ?

ఒక అధికారి: అది, ఇది….. కొంతమంది దేశభక్తులు మాట్లాడటం లేదు సార్‌, కొంత మంది దేశద్రోహులు గొణుగుతూనే వున్నారు సార్‌ ! అయినా సార్‌ మీరు ఒక సారి ప్రెస్‌ కాన్ఫరెన్సు పెట్టి వారి నోరు మూయిస్తే బా…గుం….టుం…దే….మో…. సార్‌ ! ఒకటి మాత్రం నిజం సార్‌, మన పాకేజ్‌లు కుదుర్చుకున్న వారు మాత్రం మన గురించి మంచిగా చెప్పటం తప్ప పొరపాటున కూడా ప్రధాని, ప్రెన్‌ కాన్ఫరెన్సు అని మాత్రం అనటం లేదు సార్‌, ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

ప్రధాని: రాజకీయాలు, ఇతర అంశాలు వద్దంటే అర్ధం ప్యాకేజ్‌లు, కోబ్రాపోస్టు స్టింగ్‌ ఆపరేషన్ల గురించి చెప్పమనా, షటప్‌, ప్రెస్‌ కాన్ఫరెన్సూ, ప్రెస్‌ కాన్ఫరెన్సూ మీ క్కూడా ఈ పిచ్చి పట్టిందా ఏమిటి? ఇన్నేండ్లు కాంగ్రెస్‌, ఇతర ప్రధానులు ప్రెస్‌కాన్ఫరెన్సులు పెట్టి సాధించేదేమిటి? నేను సాధించలేనిది ఏమిటీ ! అలాంటివేమీ లేకుండానే ఎన్నో సాధించాం కదా ! ప్రధాని ప్రెస్‌ కాన్ఫరెన్సులు పెట్టాలని రాజ్యాంగంలో ఎక్కడైనా రాశారా? అయినా అసలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ అంటే ఏమిటయ్యా, దాన్ని పెడితే ఏమౌతుంది?

మరొక అధికారి: సార్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ అంటే ఏమిటో నేను కచ్చితంగా చెప్పలేను సార్‌, నేను చాలా చోట్ల చూశాను వచ్చిన వారికి సమోసాలు, స్వీట్ల వంటి శ్నాక్స్‌, కాఫీనో, టీయో ఏదో ఒకటి పోయాలి తప్ప ఫలానేదే పెట్టాలి, పోయాలి అనెక్కడా నిబంధనలు అయితే లేవు సార్‌్‌, నాలుగేండ్ల నుంచి మన ఆఫీసు వాటిని ఏర్పాటు చేయలేదు గనుక మర్చిపోయాం, గతంలో ఏమి జరిగిందో ఒకసారి పాత ఫైల్సు తిరగేసి చూస్తే తెలుస్తుంది సార్‌. ఒక వేళ మనం గనుక ప్రెస్‌కాన్ఫరెన్సు పెడితే పక్కా జాతీయవాదుల మాదిరిగా వుండాలి తప్ప దుష్ట కాంగ్రెస్‌ మాదిరి మాత్రం కాకూడదు, అయితే సార్‌ నాకు తెలిసినంత వరకు ప్రెస్‌ కాన్ఫరెన్సు పెడితే ఆడామగా విలేకర్లు చాలా మంది వస్తారు, రకరకాల ప్రశ్నలు అడుగుతారని అనుకుంటున్నాను సార్‌.

ప్రధాని: ప్రశ్నలా ! ఎలాంటి ప్రశ్నలేస్తారయ్యా ! ఈ రోజు ఏ వారం, ఇప్పుడు టైమెంత, రాత్రిబాగా నిద్రపట్టిందా? ఈ కోటు ఏ పర్యటనలో వేసుకున్నారు, ఏ విదేశీ పర్యటనలో ఎవరిని హగ్‌ చేసుకున్నారు, ఎవరికి షేక్‌ హాండ్‌ ఇచ్చారు, ఐపిఎల్‌ చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌లో కుర్రాళ్లెవరూ లేకపోయినా ఎలా గెలిచారు, ఇలాంటివేనా !

ఒక సీనియర్‌ అధికారి: అలాంటివి అడిగితే అంతకంటే కావాల్సిందేముంది సార్‌, వాళ్లకేమి పోయే కాలం వచ్చిందో, కొద్ది నెలల్లో రిటైర్‌ కాబోతున్నా, అనేక ప్రెస్‌ కాన్ఫరెన్సులు ఏర్పాటు చేశా, ఒక్క చోటా అలాంటి ప్రశ్నలు అడగలేదు. చాలా వికారం పుట్టించే, పరమ మోటుగా వుండే పెట్రోలు, డీజిల్‌ ధరలు అంతగా ఎందుకు పెరిగాయి, వాటి గురించి గతంలో మీరేం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారు. వుద్యోగాలు, నల్లధనం సంగతి ఏమైంది, ఎదుటి పార్టీల నుంచి ఆకర్షించటంలో మీకు ఇతరులకు తేడా లేకుండా ఎందుకు పోయింది వంటి చెత్త ప్రశ్నలన్నీ అడుగుతారు సార్‌ !

ప్రధాని: చెత్తో, చెదారమో ఏదైనా మనల్నెందుకు అడగాలయ్యా? గతంలో ప్రధానులందరినీ ఇలాంటివి అడిగారా ఎప్పుడైనా. ఎవరయ్యా మన్‌కీబాత్‌ చూస్తున్న అధికారి, ఏవయ్యా మనం ప్రతినెలా మన్‌కీబాత్‌లో ప్రతి ప్రశ్నకు, ప్రతి అంశానికి సంబంధించి చెబుతున్నామా లేదా ( చెబుతున్నాం సార్‌, ఎవరూ అడగని విషయాలు కూడా చెబుతున్నాం సార్‌) మనం కాదు, నేను చెబుతున్నాను. పనికి మాలిన ప్రతి చెత్త వెధవా విలేకర్ల ముసుగులో నన్ను ప్రశ్నలడగటానికి వుత్సాహపడేవారే, ముందు అసలు వారు నా మన్‌కీ బాత్‌ వింటున్నారా? ముందు రేడియో విని నేనేం చెబుతున్నదీ ముందు రాసుకోమనండి. మన్‌కీ బాత్‌ గురించి రాతపరీక్ష పెట్టి పాసైన వారికే అక్రిడిటేషన్లివ్వండి సగం గొడవ పోద్ది. ఆ మధ్య ఆర్నాబ్‌ గోస్వామి, మరికొంత మంది మాదిరి ముందుగానే ప్రశ్నలు పంపితే వాటికి సమాధానాలు చెబుతాంగా . అయినా నాకు తెలియక అడుగుతాను ప్రెస్‌కాన్ఫరెన్సులో అయినా నేను చెప్పిందే కదా వారు రాసుకోవాల్సిందీ, విలేకర్లయినా, మరొకరైనా, చివరికి మా పార్టీ వారైనా నేను చెప్పింది వినటం, రాసుకోవటమే కదా చేయాల్సింది, డిక్టేట్‌ చేయటమే నాపని, అందువలన ఎవరైనా నన్ను పెద్ద డిక్టేటర్‌ అనుకున్నా నాకు ఆశ్చర్యం లేదు, అస్సలు ఖాతరు చేయను.

గుజరాతీ అధికారి: మీరు ఎంత గొప్పగా డిక్టేట్‌ చేస్తారో, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, నాలుగేండ్లుగా ప్రధానిగా నేను చూస్తున్నా, ప్రెస్‌ కాన్ఫరెన్సులు పెట్టకుండా పారిపోతున్నారు లేదా తప్పించుకుంటున్నారు అని గొణుక్కుంటున్నారే తప్ప విలేకర్లరెవరూ ఇప్పటి వరకు మిమ్మల్ని డిక్టేటర్‌ అనలేదు, ఎందుకంటే వారు మీరు ఇంత వరకు ముఖాముఖీ ఒక్కసారి కూడా కూర్చోలేదు. మీ డిక్టేషన్‌ ఎలా వుంటుందో వారికి అసలు తెలియదు. కనుక డిక్టేటర్‌ అన్నా ఆశ్చర్యపడను, ఖాతరు చేయను అని మీ అంతట మీరు అన వద్దు సార్‌! గోరక్షకుల గురించి, గోమూత్ర పరిశోధనలకు డబ్బెంత తగలేస్తున్నారు, మీరు చెప్పిన మంచి రోజులు ఇంకా ఎంత దూరంలో వున్నాయి, గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటా ఎందుకు విస్తరింపచేయలేదు, నల్లధనం రప్పించటం ఎంతవరకు వచ్చింది వంటి పనికిమాలిన ప్రశ్నలైతే అడుగుతారు. వారు అడగకుండా మనకు పంపినా మన దగ్గర వాటికి సంతృప్తికరమైన సమాధానం కూడా లేదు సార్‌!

Image result for mann ki baat cartoons

ప్రధాని: సరే ఈ విలేకర్ల గోల ఎప్పుడూ వుండేదే ప్రతి గొట్టాం గాడు ముందుకు వచ్చి బోనులో నిలబెట్టినట్లు అడిగేవాడే. ఎవరైనా ఇంకోసారి గనుక ప్రధాని, ప్రెస్‌కాన్ఫరెన్సు అని అడిగితే సారు మళ్లీ గెలిచిన తరువాత తప్పకుండా పెడతాను అని చెప్పమన్నారు అని చెప్పండి. చెప్పింది వినకుండా ఎవరైనా సతాయిస్తూ ఎక్కువా తక్కువా మాట్లాడితే అలాంటి వారందరినీ ఏదో ఒక పేరుతో ఒక గదిలో పెట్టి బయటకు పోనివ్వకుండా పాత మన్‌కీ బాత్‌లన్నీ వినిపించండి. దూలతీరిపోద్ది, పెన్నూ, నోట్‌బుక్‌, కెమెరా, గొట్టం(మైకు) ప్రతి వాడికీ ఈ మధ్య ఇదొక ఫాషనై పోయింది. ప్రధాని అంటే అంత పనీ పాటా లేకుండా వున్నాడనుకుంటున్నారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బిర్లా, సహారా డైరీలు – జవాబు లేని ప్రశ్నలు !

24 Saturday Dec 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

birla sahara diaries, BJP, cbi, CORRUPTION, it, Modi

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ అడుసు తొక్కారు ! కాళ్లు కడిగే విధము చెప్పండి !!

30 Wednesday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

demonetization, demonetization mesh, Modi, modi government

ఎం కోటేశ్వరరావు

    తాంబోలం ఇచ్చేశాను యిహ తన్నుకు చావండి అంటాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు, మా మోడీ అడుసు తొక్కారు, కాళ్లు కడిగే విధము చెప్పండీ అంటున్నారు నమో ప్రహసనంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ .

    మొదటిది నాటకం. కరటకశాస్త్రి, ఆయన శిష్యుడు, మధురవాణి నాటకం ఆడి బాల్యవివాహాన్ని తప్పిస్తారు. కధను సుఖాంతం చేస్తారు. రెండవది వాస్తవం. ఎలా ముగుస్తుందో తెలియదు. అన్నింటికంటే ఎలా ముగించాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి ముందుగానే వుప్పందిన కారణంగా పెద్ద నోట్ల రద్దును రద్దు చేయాలని లేఖ రాసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందినట్లు అనుకుంటున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తరువాత ఆ లేఖను చూపి ఆ ఖ్యాతిలో తమ నేతకు భాగముందన్నట్లుగా మీడియాలో ప్రచారం వచ్చేట్లుగా తెలుగుదేశం వారు మేనేజ్‌ చేశారు. రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు నగదు రహిత లావాదేవీలపై సూచనలు చేసే పేరుతో ఐదుగురు ముఖ్య మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయతలపెట్టినట్లు, దానికి చంద్రబాబు నాయుడిని సారధ్యం వహించమని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌జైట్టీ ఫోన్లో కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

     కేంద్రం నుంచి అలాంటి ఆఫరు వచ్చినపుడు మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఎగిరి గంతేసి వుండేవారు.అనుకున్నదొకటి అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా తగిన సన్నాహం, పర్యవసానాలను వూహించకుండానే నరేంద్రమోడీ నోట్ల రద్దును ప్రకటించేశారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే సర్వేల లోగుట్టు గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటపుడు నరేంద్రమోడీ తాను చేయించిన సర్వేలో నోట్ల రద్దుకు 93శాతం మద్దతు వుందని చెబితే నమ్మేంత అమాయకంగా చంద్రబాబు వుంటారా ? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు, ఆ విషయాలలో, అలాంటి రాజకీయ చాణక్యంలో సరిలేరు నీకెవ్వరూ సరసాల సుధాకరా అన్నట్లుగా చంద్రబాబు పండిపోయారు. కేంద్రం ప్రతిపాదించిన కమిటీకి సారధ్యం వహించే విషయాన్ని కాదన్నట్లుగా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసే మీడియాలో వార్తలు వచ్చాయి. అవునంటే కాదనిలే అని ఆడవారి గురించి అనవసరంగా ఆడిపోసుకుంటారు గానీ చంద్రబాబు కాదు అన్నారంటే నరేంద్రమోడీ దగ్గర దేనికో టెండరు పెట్టి వుంటారని గుసగుసలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే నోట్ల రద్దు పర్యవసానాలపై తలుపు చెక్కతో కాకుండా తమలపాకుతో కొట్టినట్లుగా జనం కోసమైనా తన అసంతృప్తిని వెల్లడించారు. కేంద్రం వద్ద తన పలుకుబడిని వుపయోగించి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో నోట్లు తెప్పిస్తా అన్నట్లు హడావుడి చేసి అవాక్కయ్యారు. ఇనుము బాగా కాలినపుడే దానిని కావలసిన విధంగా మలచుకొనేందుకు సుత్తి దెబ్బలు వేయాలి. నోట్ల రద్దు గురించి మాట్లాడటానికి పార్లమెంట్‌కు వెళ్ల కుండా ముఖంచాటేయటం ఒక బలహీనత. దానిని ప్రదర్శించిన మోడీని ఎలాంటి ప్రతిఫలం లేకుండా -అదేలెండి రాష్ట్ర అభివృద్ధికే సుమా- వూరికే ఆదుకుంటే ప్రయోజనం ఏముంటుంది ? అది పరిష్కారం అయితే ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించటానికి చంద్రబాబు క్షణంలో సిద్దం అవుతారు.

    నోట్ల రద్దు పర్యవసానాల గురించి జనం అర్ధరాత్రుళ్లు ఎటిఎంల ముందు క్యూలు కడుతుంటే , బ్యాంకుల్లో తమ డబ్బును తాము తీసుకోవటానికి వీల్లేక జనం అవస్తలు పడుతుంటే వాటిని పరిష్కరించాల్సిన కేంద్రం దాని గురించి స్పష్టంగా చెప్పకుండా తక్షణమే నగదు రహిత బదిలీ గురించి సలహాలు చెప్పాలని ముఖ్య మంత్రుల కమిటీని ప్రతిపాదించటం అర్ధంలేని విషయం. నగదు రహిత లావాదేవీల గురించి ఎవరికీ అభ్యంతరం లేదు. దానికి తగిన పరిస్థితులు వున్నాయా లేవా అన్నదే సమస్య. దయ్యాలు తిరిగే సమయంలో ఒక నాయకుడికి ఒక ఆలోచన వస్తే తెల్లవారేసరికి దానిని అమలు జరపాలని పట్టుబడితే కుదరదు. అనేక అభివృద్ది చెందిన దేశాలలో ఇప్పటికీ నగదు లావాదేవీలు గణనీయంగా వున్నాయి. కొన్ని దేశాలలో ఇటీవలి కాలంలో అవి పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందువలన తగిన సన్నాహాలు చేసుకొని చేయాల్సిన మార్పులను తొందరపడితే పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలే ఏర్పడతాయి. ముందు ప్రభుత్వంతో మొదలు పెట్టి దశలవారీగా అమలు జరిపి అవినీతిని అరికడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

నీవు నేర్పిన విద్యయే కదా మోడీ !

     ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటంలో కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఎలాంటి తేడా లేదని తేలిపోయింది. ఓటింగ్‌కు అనుమతించే నిబంధన కింద చర్చకు అధికారపక్షం తిరస్కరించటంతో బుధవారం నాడు లోక్‌సభ పరిమితంగానే కార్యకలాపాలు చేపట్టి గురువారం నాటికి వాయిదా పడింది. గతంలో 2జి స్కామ్‌పై చర్చ సందర్భంగా ప్రధాని మన్మోహస్‌ సింగ్‌ సభకు హాజరై, ఓటింగ్‌కు అనుమతించే నిబంధనల ప్రకారం చర్చ జరగాలని బిజెపి పెద్దలు పట్టుపట్టారు. ఇప్పుడు వారు వీరయ్యారు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. పోయినోడే మంచోడనిపిస్తున్నారు. ఎలాగంటే అప్పుడు చర్చ అవినీతి గురించి కనుక కాంగ్రెస్‌ ప్రధాని సభకు రావటానికి సిగ్గు పడ్డారు, సమర్ధించుకోలేని దుస్థితిలో ఆపని చేశారు. ఇప్పుడు నరేంద్రమోడీ సభకు రావటానికి బిడియమెందుకు ? ఇదేమీ అవినీతి అంశం కాదే. నోట్ల రద్దును అవినీతి అని ఎవరూ అనటం లేదే ! ఓటింగ్‌ జరిగేందుకు వీలు కల్పించే నిబంధనల కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్‌లో పాలక కూటమికి పూర్తి మెజారిటీ వుంది. అయినా వ్యతిరేకిస్తున్నది. ఈ కారణంగా 16వ తేదీ నుంచి జరుగుతున్న వుభయ సభలలో ఈ అంశంపై ముందుకు సాగటం లేదు.ఒక వేళ ఓటింగ్‌ గీటింగ్‌ జరిగితే దాని వలన ప్రభుత్వం పడిపోయే పరిస్థితులేమీ లేవే ! నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా ఓటు చేస్తే ఎందుకు అలా చేశారో వారే చెప్పాల్సి వుంటుంది.

     తాను చేసిన నోట్ల రద్దుకు 93శాతం జనం మద్దతు పలికారని ప్రధానే స్వయంగా చెబుతున్నారు. వందకు రెండువందల మంది మద్దతు వుందనే వంది మాగధుల సంగతి సరేసరి. జనం మద్దతు లేకపోతే మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపి పెద్ద పార్టీగా ఎలా సీట్లు సంపాదించింది అని కొత్త పాయింటును దొరకబుచ్చుకున్నారు. జనం మద్దతు వుందా లేదా అన్నది తేలాలంటే ఆ సమస్య మీదే ఓటింగ్‌ జరగాలి. నోట్ల రద్దుతో తలెత్తిన జన ఇబ్బందులను ఎప్పటిలోగా తీరుస్తారు, ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఇబ్బంది పెట్టే చర్య ఎందుకు తీసుకున్నారని కదా ప్రతిపక్షాలు అడుగుతోంది. ఏ పార్టీ అయినా నోట్ల రద్దును వ్యతిరేకించిందా ? లేదే ! దాని పర్యవసానాల గురించి అడగటానికి ప్రతిపక్షానికి అర్హత లేకపోతే పార్లమెంట్‌కు హాజరై ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్రమోడీ వివరించాలి కదా ! పార్లమెంట్‌తో పని లేకుండా నరేంద్రమోడీ ప్రధాని కాలేదు, ఆయన లోక్‌సభా నాయకుడు. ప్రతిపక్షం చర్చకు అంగీకరిస్తే ప్రధాని సభకు వస్తారు అని పాలకకూటమి వాదిస్తోంది. ప్రధాని రాక నెపంతో పార్లమెంట్‌ను జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షానికి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? జనం సొమ్మును ఎందుకు వృధా చేయాలి? యాభై రోజులలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని, ధరలు తగ్గుతాయని అనటం తప్ప నిర్ధిష్టంగా ఏదీ చెప్పటం లేదు. బంగారం ధరలు తగ్గాయి, జనం దానితో కడుపు నింపుకోలేరు కదా ! కడుపు నింపే పప్పుల ధరలు పెరిగాయి. అలాంటపుడు పాలకులు చెప్పే మాటలను జనం ఎలా నమ్మాలి ?

అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు

       అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ( ఇది మహిళలను కించపరచటంగా భావించవద్దని మనవి ) చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు బ్యాంకర్లపై నిందమోపి తన పరిధిని అతిక్రమించారు. మధ్యలో వారేమి చేస్తారు. ఒక చెక్కు తీసుకొని ఒక రోజు బ్యాంకుకు వెళ్లి వుంటే సిబ్బంది ఎంత వత్తిడితో గత కొద్ది రోజులుగా పని చేస్తున్నారో చంద్రబాబుకు తెలిసి వుండేది. రిజర్వుబ్యాంకు నోట్లు పంపితే కదా పంపిణీ చేసేది. తెలుగు నేలలో కొన్ని మీడియా సంస్ధలు ఒక కొత్త లాజిక్‌ను తయారు చేశాయి. అదేమంటే తెలుగుదేశం అధికారంలో వున్నపుడు తమకు మంచివి అనిపించిన అంశాలను చంద్రబాబు ఖాతాలో జమ చేయటం, వైఫల్యాలన్నింటికి అధికారులను బాధ్యులుగా చేసి వారి ఖాతాలో వేయటం. నోట్ల రద్దు పర్యవసానాలకు నరేంద్రమోడీ నిర్వాకాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా సానుకూలంగా కూడా విమర్శించలేదు. బ్యాంకర్లపై నిందలు మోపి, వారిపై వత్తిడి పెంచి ముఖ్యమంత్రి సాధించేదేమీ వుండదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్న పెదరావూరు ఖాతాలు !

19 Saturday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Bad loans, defaulters, Modi, RBI, Reserve Bank of India, vijay mallya, wilful defaulters, write off

అరే నేనేమిటో మీరు చూసింది చాల తక్కువే

ఎం కోటేశ్వరరావు

     పేరులో ఏమున్నది పెన్నిధి అని చులకనగా మాట్లాడారు గానీ పేరులోనే వుంది పెన్నిధి. ఇప్పుడు కుంభకోణాన్ని ఆ పేరుతో పిలవకూడదు. మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు, కుంభకోణం అంటే కుంభకోణం కాదు, నరేంద్రమోడీ అని కొత్త అర్ధాలు రాసుకోవాల్సిన రోజులు వచ్చాయంటున్నారు. కాంగ్రెస్‌ పాలకులు అనేక కుంభకోణాలకు తెరతీశారు. వాటిని దేశమంతా చూసింది. అదే బాటలో బిజెపి పాలకులు నడిస్తే కిక్కేముంటుంది? అంతకంటే పెద్ద కుంభకోణాలకు వారు తెరతీశారు. వాటినింకా జనం చూడలేదు. అంతే తేడా ! కాంగ్రెస్‌ రుణాలిచ్చి విజయమాల్య వంటి వారిని పెద్దలుగా మారిస్తే జనానికి కిక్కు ఎక్కించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ విజయ మాల్యను మర్యాదగా దేశం దాటించటానికి తన తెలివి తేటలను వుపయోగించింది. అలాంటి వారు దేశం విడిచి పోతుంటే ఎక్కడకు పోతున్నారో తెలుసుకోవాలి తప్ప పోవటాన్ని అడ్డగించకూడదన్న మార్గదర్శకాల కారణంగా నిఘాసిబ్బంది అదే పని చేశారు. కాంగ్రెస్‌ పాలకులు రుణాలు ఇస్తే బిజెపి పాలకులు గత రెండున్నర సంవత్సరాలుగా వాటిని ఎడా పెడా రద్దు చేస్తున్నారు. మాల్య వంటి 63 మంది పెద్దలు తమ బ్యాంకులకు ఎగవేసిన మొత్తాలలో తాజా విడతగా 7016 కోట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) రద్దు చేసింది. ఇది గత 23 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇప్పుడు పెద్ద రగడ కావటంతో ఇక్కడే పేచీ వచ్చింది. దాన్ని రద్దు అన కూడదు, లెక్కలలో సర్దుబాటు అనాలని,ఆ మొత్తాలను వసూలు చేస్తారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ సెలవిచ్చారు.ఆంగ్లంలో రైట్‌ ఆఫ్‌ అన్న పదానికి అర్ధం ‘బే వుమ్మేజు, రానిబాకీగా లెక్కలలో తీసివేయుట ‘ అని దిగవల్లి వెంకటశివరావు 1934లో, ‘రద్దు చేయు, తీసివేయు ‘ అని బూదరాజు రాధాకృష్ణ 2008లో అర్ధం చెప్పారు.

     ఈ పేరు, అర్ధం వివాదం రేగగానే మా ప్రాంత పెద రావూరు ఖాతాల వ్యవహారం గుర్తుకు వచ్చింది. నా చిన్నతనంలో మా వూర్లో ఒక వృద్ధుడు నాకు ఫలానా వారి కుటుంబం నుంచి ఇంత బాకీ రావాలి, అంతరావాలి అని కనిపించిన వారందరికీ పెద్ద మొత్తంలో లెక్కలు చెబుతుండే వాడు. అది నిజమేనా అని అడిగితే నిజమే అవన్నీ పెద రావూరు ఖాతాలో వున్నాయి అని పెద్దల నుంచి సమాధానం వచ్చింది. అర్ధం అయ్యేట్లు చెప్పమంటే అవి వచ్చేవి కాదు, పెట్టేవి కాదు, ఆ ముసలోడు అలాగే చెబుతూనే వుంటాడు అన్నారు. ఇప్పుడు జెట్లీ చెబుతున్నది కూడా పెదరావూరు ఖాతాల గురించే మరి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్ధితి నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎస్‌బిఐ రుణాల రద్దు వార్త కూడా తోడైంది. అయితే సామాన్యులకు తప్ప కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. తమదంతా ‘పారదర్శపాలన’ అని చెప్పుకుంటారు గనుక దానికి అనుగుణంగా ‘మూసి’పెట్టారు. ప్రభుత్వం ఇబ్బందులలో పడింది అనగానే ఎస్‌బిఐ దానికి ఒక చిట్కాను కనిపెట్టింది. ఆ ఏడువేల కోట్ల రూపాయల మొత్తాన్ని రైటాఫ్‌ (రద్దు) చేయలేదు, మేము అసలు ఆ పదాన్ని వుపసంహరించుకుంటున్నాము. ఆ మొత్తాన్ని ‘వసూలులో వున్న ఖాతా'(ఎయుసి-ఎకౌంట్‌ అండర్‌ కలెక్షన్‌) సొమ్ము అని పిలుస్తున్నాము అంటూ ఒక వివరణ ఇచ్చింది. సామాన్య రైతులు పంటలు పోయి తీసుకున్న రుణం చెల్లించకపోతే వూరంతా టాంటాం వేయిస్తారు.ఇంట్లో సామాను బయటకు వేసి అవమానాలు పాలు చేస్తారు. ఇండ్ల కోసం రుణాలు తీసుకున్నవారు కిస్తీలు చెల్లించకపోతే వారి పేర్లజాబితాను పత్రికలలో ప్రకటించి ఆస్ధులను వేలానికి పెడతారు. బ్యాంకులు వారి మొత్తాలను కూడా ఎయుసి ఖాతాలలో వేసి శక్తి వచ్చినపుడు ఎందుకు వసూలు చేసుకోవు ? బడాబాబుల పేర్లు పత్రికలలో ప్రకటించి ఆస్ధులను ఎందుకు వేలం వేయటం లేదు ?

    సాంకేతికంగా రైట్‌ ఆఫ్‌ అంటే రద్దు కాదన్నది వాస్తవమే. అయితే ఆచరణలో జరుగుతున్నదేమిటో ఆరుణ్‌ జెట్లీ వంటి పెద్దలు, లేదా బ్యాంకర్లు చెప్పటం లేదు. మాల్య వంటి పెద్ద మనుషులకు వేల కోట్ల రూపాయలను అప్పులు, అడ్వాన్సులుగా ఇవ్వటం వారు వాటిని తప్పుడు మార్గాలలో దారి మళ్లించి దాచుకోవటం, తరువాత చెల్లించటంలో విఫలమయ్యారనే పేరుతో కొంత కాలం గడిచిన తరువాత నిరర్ధక ఆస్థుల జాబితాలో ఎక్కించటం, తరువాత రాని బాకీల ఖాతాలో రాయటం, ఆ మేరకు జనం సొమ్మును బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరితేరింది. అది వారి హయాంలో పిల్లకాలువగా వుండేది. దానిని నరేంద్రమోడీ సర్కార్‌ దానిని ఓడలు ప్రయాణించే పనామా, సూయజ్‌ కాలువల సైజుకు పెంచింది. నరేంద్రమోడీ అనుయాయులైన సరికొత్త దేశభక్తులకు ఇలా అన్నందుకు ఆగ్రహం కలగవచ్చు.http://www.slideshare.net/deepakshenoy/kc-chakrabarty-on-npas-in-india ఇది రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన కెసి చక్రవర్తి తయారు చేసి 2013లో ఒక సమావేశంలో సమర్పించిన పత్రం. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం 2001 మార్చినెలతో అంతమైన ఆర్ధిక సంవత్సరం నుంచి 2013 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రయివేటు, విదేశీ అన్ని బ్యాంకులు రైట్‌ ఆఫ్‌ (రద్దు ) చేసిన మొత్తం అక్షరాలా ఒక లక్షా 98వేల అరవయ్యారు( 1,98,066) కోట్ల రూపాయలు. ఇదే కాలంలో వసూలు చేసిన మొత్తం కేవలం 37,955 కోట్లు మాత్రమే. దీనికి తనది బాధ్యత ఎలా అవుతుంది అని నరేంద్రమోడీ అమాయకంగా హావభావాన్ని ప్రదర్శించవచ్చు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత గత రికార్డులను తిరగరాస్తూ భారీ మొత్తాలలో పెద్దల బకాయిలను రైటాఫ్‌ లేదా రద్దు చేసి అతి పెద్ద భారీ కుంభకోణానికి తెరతీశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిని తిప్పికొట్టాలంటే తాను అధికారాన్ని స్వీకరించిన తరువాత అన్ని బ్యాంకులు ఎంత మొత్తాన్ని రైటాఫ్‌ చేశాయి, పాత బకాయిలను ఎంత మొత్తం వసూలు చేశాయి అన్న విషయాలను ప్రకటిస్తే చాలు. మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడకూడదని నరేంద్రమోడీ ఒక వ్రతాన్ని పాటిస్తున్నందున ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ అయినా ఆపని చేయాలి. ఎందుకో గానీ ఇంతవరకు వివరాలు చెప్పకుండా అభిమానుల్లో కూడా అనుమానాలకు తెరలేపుతున్నారు.

     ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం 2013,14,15 ఆర్ధిక సంవత్సరాలలో 29 ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం లక్షా 14వేల కోట్ల రూపాయలు. రిజర్వుబ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2012 మార్చి ఆఖరుకు పారు బాకీలు రు.15,551 కోట్లు కాగా 2015 మార్చినాటికి రు.52,542 కోట్లకు పెరిగాయి. వంద కోట్లు అంతకంటే ఎక్కువ ఎగవేసిన వారి వివరాలు తమ వద్ద లేవని ఆర్‌బిఐ తెలిపింది.2004-15మధ్య రు.2.11లక్షల కోట్లను రద్దు చేయగా వాటిలో లక్షా 14వేల 182 కోట్లు 2013-15 మధ్య చేసినవే వున్నాయి. తొమ్మిది సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని పనిని మూడు సంవత్సరాలలో మోడీ చేశారన్నమాట. ఎంత అభివృద్ధి ? అందుకే పెద్ద కరెన్సీ నోట్ల రద్దును బడా పారిశ్రామికవేత్తలంతా ఆకాశానికి ఎత్తుతున్నారా ? కాంగ్రెస్‌ హయాంలో ఏటా నాలుగు శాతం చొప్పున పెరిగితే 2014,15 సంవత్సరాలలో దేశంలో రెండవ పెద్ద బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రద్దు చేసిన బాకీలు 2013-14 మధ్య 98శాతం అయితే మరుసటి ఏడాది 238శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం ఏటా 50వేల కోట్లకు పైగానే బకాయిలు పెదరావూరు ఖాతాలోకి పోతున్నాయి.

    ఇలా రద్దు చేయటం అంతా వుత్తిదే, అంకెల గారడీ, బ్యాంకులు చెల్లించాల్సిన ఆదాయపన్ను తగ్గించేందుకు, ఆర్‌బిఐ నిబంధనలను పాటించేందుకు చేసిన లెక్కల సర్దుబాటు తప్ప మరేమీ కాదు, బ్యాంకుల ప్రధాన కార్యాలయాల స్ధాయిలో పారు బాకీలను రద్దు చేసినట్లు చూపినా దిగువ శాఖలలోని పుస్తకాలలో అలాగే వుంటాయని కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు, పెద్దదైన ఎస్‌బిఐ చెప్పాయి. బకాయిల వసూలు సంగతి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అనేక బ్యాంకుల పారు బాకీల వసూలు శాతాలు పడిపోతున్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వుదాహరణకు ఎస్‌బిఐ 2012-13లో 19.06శాతం వసూలు చేస్తే 2014-15 నాటికి 10.88శాతానికి పడిపోయినట్లు దాని లెక్కలే వెల్లడించాయి.ఐసిఐసిఐ బ్యాంకులో 26.74 నుంచి 15.96శాతానికి పడిపోయాయి. కెసి చక్రవర్తి తన పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం రద్దు చేసిన రుణాలలో కేవలం పదిశాతం లోపుగానే వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల విలువను తక్కువగా చూపి అయినకాడికి తెగనమ్మే ప్రభుత్వం పారుబాకీల వసూలు విషయంలో మాత్రం తక్కువ ధరలకు ఆస్థులను విక్రయించటానికి నిబంధనలు ఒప్పుకోవు అని చెబుతోంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎంత వసూలు చేశారనేది బ్యాంకులో, ప్రభుత్వమో వెల్లడిస్తే తప్ప వివరాలు లేవు. నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన మొత్తాలు నరేంద్రమోడీ విజయాలకు సూచికగా కొండల్లా పెరిగిపోతున్నాయి. గతేడాది అంతకు ముందున్న రు.3,24,300 కోట్ల నుంచి 2016 మార్చినాటికి రు.4,26,400 కోట్లకు పెరుగుతాయని అంచనా వేశారు. లెక్కల ఆల్జీబ్రాలో సర్దుబాటు, పునర్వ్యస్తీకరించిన మొత్తాలను కూడా కలుపుకుంటే పారు బాకీల మొత్తం రు.9,28,000 కోట్లని చెబుతున్నారు. వుద్ధేశ్యపూర్వకంగా ఎగవేసిన కార్పొరేట్ల రుణాల రద్దు ఈ శతాబ్దంలోనే ఇప్పటికి పెద్ద కుంభకోణంగా వర్ణిస్తున్నారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు డాక్టర్‌ కెసి చక్రవర్తికి రుణాల రద్దు గురించి బాగా తెలుసు. ఆయన చెప్పిన ప్రకారం ఒక కంపెనీ కేవలం ఎనిమిదివేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు మాత్రమే కలిగి వుండి 20వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుందనుకుంటే ఒక వేళ బ్యాంకులు రద్దు చేయాల్సి వస్తే పన్నెండువేల కోట్ల రూపాయలకు మాత్రమే అనుమతించాలి.కానీ పుస్తకాలలో వున్న గడువు మీరిన బకాయిలు మొత్తాన్ని రద్దుచేస్తున్నారు. సాంకేతిక కారణాలతో రద్దు చేయటానికి ఎలాంటి నియమనిబంధనలు, పద్దతులు లేవు, అందువలనే అదొక పెద్ద కుంభకోణంగా పరిగణించాలి. ఇది సరళీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత 1993 నుంచి అనుసరిస్తున్నారు. రుణాలే కాదు, అడ్వాన్సులను కూడా రద్దు చేస్తున్నారు. మీరు ఒక చార్టడె ఎకౌంటెంట్‌ను సలహాదారుగా పెట్టుకొని అడ్వాన్సులను టెక్నికల్‌గా రద్దు చేయటానికి అవసమైన విధి విధానాలను రూపొందించుకోవచ్చని బ్యాంకులకు రిజర్వుబ్యాంకే స్వయంగా చెప్పటం విశేషం. గత పదిహేను సంవత్సరాలలో సాంకేతిక కారణాలతో చేసిన రద్దుల మొత్తం మూడున్నరలక్షల కోట్ల రూపాయలు, దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని, ఈ మొత్తాలకు వడ్డీని కూడా కలిపితే రద్దు చేసిన మొత్తాలు నాలుగు రెట్లు వుంటాయని చక్రవర్తి చెప్పారు. ఎగవేసిన పెద్దల పేర్లు బయట పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ పని చేయకుండా తప్పించుకుంటున్నారు.వారి నుంచి బాకీలు వసూలు చేయకపోవటం ఒకటైటే 2018 నాటికి బాసెల్‌-3 నిబంధనల ప్రకారం బ్యాంకులకు ప్రభుత్వం మరో 2.4లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులు సమకూర్చాల్సి వుంటుందని చెబుతున్నారు. అంటే ఇది కూడా ప్రజల సొమ్మే.దీన్ని ఎలా సమకూర్చుతారనేది చూడాల్సి వుంది. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ అధికారంలో వుండగా ప్రతిపక్ష బిజెపి నేత యశ్వంతసిన్హా ఆర్ధికశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా వున్నారు. రుణాల రద్దును సమీక్షించేందుకు ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని రిజర్వుబ్యాంకును ఆ కమిటీ కోరింది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నర్‌గా వున్న రఘురాం రాజన్‌ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూడటానికి, దాడి చేయటానికే తన సమయాన్ని వెచ్చించింది తప్ప ఆ కమిటి ఏమైందో తెలియదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎన్‌డిటివీపై నిషేధం- అసంబద్ద వాదనలు !

08 Tuesday Nov 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, emergency, Free press, Modi, ndtv, ndtv ban, press freedom, un declared emergency

మీడియా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు

ఎం కోటేశ్వరరావు

    చచ్చిన చేప వాగు వాలున కొట్టుకుపోతుంది. బతికున్న చేప మాత్రమే ఎదురు ఈదుతుంది. దేన్నయినా ప్రశ్నిస్తేనే రచ్చ, చర్చ ప్రారంభమౌతుంది. ఫలానా రోజు ఫలానా చర్యను ఎందుకు ప్రశ్నించలేదు, దీన్ని మాత్రమే ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు అంటే కుదరదు. హేతుబద్దత లేకుండా అసంబద్ధతో మరొకటో వుంటేనే ఎవరైనా నిలదీస్తారు. సమర్ధించుకోవటానికి సరైన కారణాలు దొరకనపుడే చర్చను పక్కదారి పట్టించేందుకు చూస్తారు. వ్యూహాత్మకమైన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారని ఆరోపించి ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ ప్రసారాలను నవంబరు తొమ్మిది-పది తేదీలలో ఒక రోజంతా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దండన విధించింది. అత్యవసర పరిస్థితి పేరుతో కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించిన ఘనత తమకు వుందని కమలనాధులు తరచూ చెప్పుకుంటారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి ఒక కారణం, చట్టమూ, అధికారమూ కావాలి. కానీ అనధికారికంగా అమలు జరపటానికి అధికారం వుంటే చాలని నేటి కేంద్ర ప్రభుత్వం ఆచరణలో చూపింది. హేతుబద్దంగా ఆలోచించే వారందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించి నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఒక రోజు నిషేధం మీడియా స్వేచ్చకు, ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి సమయంలో కాంగ్రెస్‌ నేతల మాదిరి తమ చర్యను సమర్ధించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు పూనుకున్నారు. తమ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.జనానికి విచక్షణా జ్ఞానం వుంటుందనే అంశాన్ని కూడా మరచిపోయి అసంబద్ద వాదనలను ముందుకు తెస్తున్నారు.

    కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డిటివీ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీంతో పాటు దేశ, విదేశాలలో నిరసన,మోడీ సర్కార్‌ అప్రజాస్వామిక చర్యపై విమర్శలతో భయపడిన కేంద్రం నిషేధం విషయమై ప్రభుత్వానికి విన్నవించిన కారణంగా ఎన్‌డిటివీ వాదనలు చెప్పుకొనేందుకు మరో అవకాశం ఇస్తున్నామంటూ నిషేధ నిర్ణయం అమలును వాయిదా వేసుకుంది. రద్దు చేయలేదు. ఈ ప్రకటన చేయబోయే ముందు సాయంత్రం వరకు నిషేధాన్ని సమర్ధించిన సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాత్రికి నిషేధాన్ని నిలిపివేసినట్లు అధికారుల చేత ప్రకటన చేయించారు. నవంబరు ఎనిమిదవ తేదీన ఎన్‌డిటివీ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు జడ్జీల సుప్రీం కోర్టు బెంచ్‌ తదుపరి విచారణను డిసెంబరు ఐదవ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం విధించిన నిషేధం అమలును వాయిదా వేసినందున ప్రసారంపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని వుభయపక్షాల అంగీకరించటంతో కోర్టు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం మరొక మలుపు తిరిగింది.

    సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది, నిషేధాన్ని వాయిదా వేశారు తప్ప ఎత్తివేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకీ చర్యకు పాల్పడింది. మీడియా, ప్రజాస్వామిక వాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పర్యవసానాలేమిటి ? ఎప్పటి మాదిరే దీనిపై కూడా ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాసం రాసే సమయం వరకు నోరు విప్పలేదు. కనీసం ట్విటర్‌ ద్వారా కూడా స్పందించలేదు. మన్‌కీ బాత్‌లో ఏమైనా బయటపడతారో లేదో చూడాలి. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై నోరు విప్పకపోవటం నరేంద్రమోడీ వ్యవహార శైలి అన్నది గత రెండున్నర సంవత్సరాల అనుభవం రుజువు చేసింది.

    ప్రతి తరం అత్యవసర పరిస్థితి నాటి కాలాన్ని నిష్పక్షపాతంగా చూస్తే మరొక నేత ఎవరూ అటువంటి తప్పు చేయాలన్న తలంపుకే రారు అని ప్రధాని నరేంద్రమోడీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక అవార్డుల సభలో వుద్బోధ చేశారు. చిత్రంగా ఆ మరుసటి రోజే అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండానే ఎన్‌డిటివీపై ఆ కాలం నాటి నిరంకుశ వైఖరిని ప్రతిబింబిస్తూ ఒక రోజు నిషేధం విధించటం గమనించాల్సిన అంశం. నరేంద్రమోడీకి తెలియకుండానే ఇది జరిగిందా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఇదొక ముఖ్యపరిణామం, అందునా మోడీ అంతరంగం అందరికంటే బాగా ఎరిగిన వెంకయ్య నాయుడు శాఖ, మీడియా స్వేచ్చకు సంబంధించింది, దీని పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ, హోం, తదితర అంతర మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సుల మేరకు నవంబరు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు కార్యక్రమాల ప్రసారాన్ని నిషేధించారు. ఈ ఏడాది జనవరి రెండు నుంచి ఐదువ తేదీ వరకు పఠాన్‌కోట్‌ సైనిక కేంద్రంపై పాకిస్ధాన్‌ వైపు నుంచి ప్రవేశించిన తీవ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించి జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి ప్రసారం చేసిన అంశాలలో మన రక్షణ రహస్యాలను బహిర్గతం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకు గాను 30 రోజుల పాటు నిషేధం విధించాల్సి వున్నప్పటికీ ఒక రోజుకు పరిమితం చేసినట్లు తెలిపింది.ఈ చర్య మీడియా స్వేచ్ఛను ప్రత్యక్షంగా వుల్లంఘించటమే అని, అత్యవసర పరిస్థితి నాటి అవశేషమిదని కూడా భారత సంపాదకుల మండలి (ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) పేర్కొన్నది.

     జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి వార్తలను ప్రసారం చేయగా 29వ తేదీన సమాచార, ప్రసార శాఖ సంజాయిషీ నోటీసు జారీ చేసింది. వ్యూహాత్మకంగా రహస్యమైన సమాచారాన్ని ప్రసారం చేసినందున భద్రతా దళాలు చేపట్టిన ప్రతిక్రియలను అడ్డుకొనేందుకు నేరం చేసిన వారు వుపయోగించుకొనే అవకాశం వున్నందున, అది నిబంధనలకు విరుద్దమైనందునా ఎందుకు ప్రసారం చేశారో సంజాయిషీ ఇవ్వాలని దానిలో కోరింది.2015లో సవరించిన 1995 కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(నియంత్రణ) చట్టం ప్రకారం భద్రతా దళాలు చేపట్టే ఏ విధమైన వుగ్రవాద నిరోధక చర్యలనైనా ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆ చట్టం నిర్దేశించిన ప్రసార స్మృతిలో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్ధావరంపై పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వుగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మిలిటరీ జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. తీవ్రవాదులు దాడి కొనసాగుతుండగానే జనవరి నాలుగున ఎన్‌డిటివి రిపోర్టర్‌ ఆ వార్తలో చెప్పిన అంశం ఇలా వుందని ప్రభుత్వం పేర్కొన్నది.’ ఇద్దరు మిలిటెంట్లు ఇంకా సజీవంగానే వున్నారు, వారు మందుగుండు సామగ్రి డిపో పక్కనే వున్నారు. మిలిటెంట్లు మందుగుండు సామగ్రి డిపోను చేరుకున్నట్లయితే వారిని నిర్వీర్యం చేయటం కష్టమౌతుందని దాడిని ఎదుర్కొంటున్న జవాన్లు ఆందోళన చెందుతున్నారు.’ అని వ్యాఖ్యానించారని, ఆ ప్రసారంలో వైమానిక స్ధావరం గురించి కూడా సమాచారాన్ని వెల్లడించారంటూ ‘ దానిలో మిగ్‌ యుద్ధ విమానాలు, రాకెట్‌ లాంచర్లు, మోర్టార్లు, హెలికాప్టర్లు, ఇంధన నిల్వలు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వున్నాయని కూడా పేర్కొన్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో తెలిపింది.ఈ సమాచారాన్ని స్వయంగా టెర్రరిస్టులు లేదా వారిని ప్రయోగిస్తున్నవారు గానీ వుపయోగించుకోవచ్చని పేర్కొన్నది.

  చట్టం ముందు ఎన్‌డిటివీగానీ మరొక ఛానల్‌ గాని అమలులో వున్న నిబంధనలను పాటించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, ఎవరూ అందుకు విరుద్ధంగా మాట్లాడటం లేదు. ఎవరైనా అలా చేస్త్తే చర్యతీసుకోవాలి, చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అందుకు కోర్టులు, చట్టాలున్నాయి. చట్ట ప్రకారం తప్పుచేస్తే అందరికీ దండన విధించాలి. ఎన్‌డిటివీ, దానిపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న సంపాదకుల మండలి, ప్రయివేటు టీవీ ఛానల్స్‌ సభ్యులుగా వున్న నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఇతర అనేక జర్నలిస్టు సంఘాల అభ్యంతరం కూడా అలాంటి వార్తలనే ఇచ్చిన ఇతర సంస్ధలపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఒక్కదానిపై మాత్రమే దండన ఎందుకు విధిస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. ఏదైనా ఒక శిక్ష అది చిన్నదా పెద్దదా అనేదానితో నిమిత్తం లేకుండా తగిన అధికారాలుగల సంస్ధ లేదా పదవిలో వున్నవారు మాత్రమే విధించాలి. కానీ శిక్ష విధించే అధికారాన్ని సమాచార,మంత్రిత్వశాఖ తనకు తాను పుచ్చుకోవటం ఏమిటని కూడా మీడియా సంస్ధలు సవాలు చేశాయి.

    ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు ఫిబ్రవరి ఐదున ఎన్‌డిటివీ సమాధానమిచ్చింది. తమ వార్త బాధ్యతాయుతంగా,సముచితంగా వుందని, వార్తలో పేర్కొన్న అంశాలు తాము ప్రసారం చేయటానికి ముందే వార్తా పత్రికలలో వచ్చాయని తెలిపింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి తెలిపింది. జనవరి మూడవ తేదీన ఐఎఎన్‌ఎస్‌ (వార్తా సంస్ధ) ఇచ్చిన వార్తను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిందని, దానిలో ‘మిగ్‌ 21 యుద్ధ విమానాలు, ఎంఐ 35 యుద్ధ హెలికాప్టర్లు, ఇతర ముఖ్యమైన సొత్తు ‘ వైమానిక స్ధావరంలో వుందని దానిలో పేర్కొన్నారు. జనవరి మూడున టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో వుపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నిఘారాడార్లు వున్నాయని తెలిపారు. జనవరి నాలుగున ఒక సైనిక బ్రిగేడియర్‌ను వుటంకిస్తూ హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ‘ ఇద్దరు వుగ్రవాదులు ఒక రెండంతస్ధుల భవనంలో వుండిపోయారని, అక్కడ వైమానిక దళ సిబ్బంది నివాసముంటారని ‘ పేర్కొన్నది. వాటిపై తీసుకోని చర్య తమకు ఎలా వర్తిస్తుందని ఎన్‌డిటివీ ప్రశ్నించింది.

     నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఏ) సెక్రటరీ జనరల్‌ ఆనీ జోసెఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వార్తలను ఇతర మీడియా కూడా ఇచ్చిందని అవన్నీ బహిరంగంగా అందుబాటులోనే వున్నాయని పేర్కొంటూ ఎన్‌డిటివీ ఒక్కదానిపైనే చర్య తీసుకోవటం ఆశ్చర్యంగా వుందన్నారు. అంతర మంత్రిత్వ శాఖల కమిటీ, సమాచార మంత్రిత్వశాఖ ఈ అంశాన్ని కేబుల్‌ చట్టంలోని పక్కా నిబంధనల మేరకు గాక రాజ్యాంగంలో హామీ ఇచ్చిన మీడియా స్వేచ్చ కోణం నుంచి చూడాలని, ఒక వేళ ఎన్‌డిటివీ నిబంధనలను వుల్లంఘించిదనుకుంటే ఆ విషయాన్ని ఎన్‌బిఏ ఏర్పాటు చేసిన స్వయం నియంత్రణ సంస్ధ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్స్‌ అధారిటీ (ఎన్‌బిఎస్‌ఏ)కు నివేదించి వుండాల్సిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఎన్‌బిఏ కోరింది.

   ప్రభుత్వ నిర్ణయం అసాధారణమైందని ఖండిస్తూ తక్షణమే వెనక్కు తీసుకోవాలని భారత సంపాదకుల మండలి కోరింది.’ ఒక ఛానల్‌ను ఒక రోజు పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం మీడియా, తద్వారా దేశ పౌరుల స్వేచ్చపై ప్రత్యక్ష వుల్లంఘన, అంతేకాదు కఠినమైన సెన్సార్‌షిప్పును విధించటం అత్యవసరపరిస్థితి నాటి అవశేషమే. వార్తలు ఇచ్చిన తీరుతో ఎప్పుడైనా ప్రభుత్వం అంగీకరించకపోతే మీడియా పనిలో జోక్యం చేసుకొనే అధికారాన్ని స్వయంగా పుచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రసారాలను నిలిపివేయటం ఇదే మొదటిసారి. బాధ్యతా రహితంగా వార్తలను ఇచ్చినపుడు పౌరులు, రాజ్యానికి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవటానికి చట్టపరమైన పలు పరిష్కార మార్గాలు వున్నాయి. న్యాయపరమైన జోక్యం లేకుండా నిషేధం విధింపు స్వేచ్చ, న్యాయమనే ప్రాధమిక సూత్రాలను వుల్లంఘించటమే.’ అని తన ప్రకటనలో పేర్కొన్నది. బ్రాడ్‌కాస్టర్స్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ కూడా ఒక ప్రకటన చేసింది.నిషేధం విధించటం భావ ప్రకటనా స్వేచ్చను వుల్లంఘించటమే అని, నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరింది. ఈ వుదంతంపై తరువాత ఒక సమగ్రనివేదికను తయారు చేస్తామని తెలిపింది.

     ఎన్‌డిటీవిపై నిషేధాన్ని మీడియా రంగానికి చెందిన ఎడిటర్స్‌ గిల్డ్‌, బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌, అనేక జర్నలిస్టు సంఘాలు వ్యతిరేకించాయి. కారణాలు ఏమైనప్పటికీ కొంత మంది మౌనం పాటించారు. నిషేధాన్ని విమర్శిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్‌డియే పక్షాల రాష్ట్ర ప్రభుత్వాలకు కోపం వస్తుందని కావచ్చు, కొన్ని మీడియా సంస్ధలు ఆ విషయాన్ని ప్రచురించకుండా లేదా అప్రాధాన్యత ఇచ్చిగానీ మొత్తం మీద ఏదో తప్పనిసరై వార్త ఇవ్వాల్సి వచ్చిందిగానీ ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదన్న సందేశాన్ని చేరవేశాయి. జెఎన్‌యు విద్యార్ధుల జాతీయ వ్యతిరేక నినాదాల ఆరోపణల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసిన జీ మీడియా , ప్రముఖ పారిశ్రామిక సంస్ధ ఎస్సెల్‌ గ్రూప్‌ అధిపతి, రాజ్యసభ సభ్యుడిగా వున్న సుభాష్‌ చంద్ర మాత్రం ఎన్‌డిటివీని ఒక రోజు నిషేధించటం అన్యాయం, చిన్న శిక్ష , అసలు పూర్తిగా నిషేధించాలని ప్రకటించారు. ఒక వేళ అది కోర్టుకు వెళ్లినా అక్కడ చీవాట్లు తింటుందని కూడా ముందే చెప్పారు. అంతేకాదు, యుపిఏ హయాంలో తమ జీ న్యూస్‌ను నిషేధించాలనే ప్రతిపాదన వచ్చినపుడు మేథావులు, ఎడిటర్స్‌ గిల్డ్‌, ఎన్‌డిటివీ కూడా మౌనం వహించాయని కూడా సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు.

    నిబంధనలను వుల్లంఘించినందుకు గాను ప్రభుత్వం 2005 నుంచి 28సార్లు ఇలా నిషేధ నోటీసులు జారీ చేసిందని వాటిలో 21 యుపిఏ హయాంలో జారీ అయినవే అని అధికారుల ద్వారా ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకొనేందుకు చూసింది. దానిలో భాగంగానే ఎన్‌డిటీవీ తరువాత మరో రెండు ఛానల్స్‌పై తీసుకున్న చర్యలను వెల్లడించింది. ఇది జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ. నిబంధనలను వుల్లంఘించి అన్ని ఛానల్స్‌, పత్రికలపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టటం లేదు. ఒకే తప్పు చేసిన మిగతావారిని వదలి ఒక్క ఎన్‌డిటివీపై మాత్రమే ఎందుకు చర్య తీసుకున్నారు? అన్నదే ప్రశ్న. గతంలో చర్యలు తీసుకున్నపుడు ఆయా ఛానల్స్‌ నిషేధాన్ని సవాలు చేయలేదు. అంటే అవి తప్పు చేసినట్లు అంగీకరించినట్లే. వాటిలో బూతు దృశ్యాలను చూపించిన కేసులు కూడా వున్నాయి.

    మీడియాలోని ప్రభుత్వ భక్తులు కొందరు విచిత్ర వాదనలను ముందుకు తెస్తున్నారు. భారత్‌లో మీడియా స్వేచ్చ తక్కువగానే వుందని చెబుతారు. అయితే అంటూ చైనా, బంగ్లాదేశ్‌, టర్కీ వంటి దేశాలలో ఇంతకంటే దారుణంగా వున్నాయనే వాదనలను ముందుకు తెస్తున్నారు.అంటే నిషేధాన్ని సమర్ధిస్తున్నట్లా ? మనకు కావాల్సిన నేత ఎలా వుండాలంటే ఎవరైనా గాంధీ గురించి చెబుతారు తప్ప అనేక మందితో పోల్చితే గాడ్సే మంచివాడే అన్నట్లుగా వుంది ఈ సమర్ధన. మన కంటే పత్రికా స్వేచ్చ మెరుగ్గా వున్న దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ ? ఇలాంటి చర్యలతో మనం ఎక్కడకు పోతున్నాం అన్నది ప్రశ్న.

    తన తప్పుడు చర్యను సమర్ధించుకొనేందుకు ప్రభుత్వం అనేక అసంబద్ద కారణాలను చూపుతోంది. టీవీ ఛానల్స్‌లో విలేకర్లు చెప్పిన సమాచారాన్ని వుగ్రవాదులు వుపయోగించుకొని దాడులు చేసే ప్రమాదం వుందట. వెనుకటి కెవడో అమాయకుడు నా పేరు ఫలానా రెడ్డి నీకు తెలివి వుంటే నా కులం ఏమిటో కనుక్కో అన్నాడట. ఏ దేశంలో అయినా సైనిక శిబిరాలలో సైనికులు, ట్యాంకులు, విమానాలు, మందుగుండు సామాగ్రి వుంటుందని వేరొకరు చెప్పాల్సిన అవసరం వుంటుందా ? అంతెందుకు మన ప్రభుత్వం ప్రకటించినట్లు మన సైన్యం జయప్రదంగా నిర్వహించిన సర్జికల్‌ దాడులు ఎక్కడ జరపాలో మన సైన్యం ఏ టీవీ, పత్రికా వార్తలను చూసి నిర్ణయించుకుందో ఎవరైనా చెప్పగలరా ? గూగుల్‌ మాప్‌లను చూస్తే ఎక్కడ ఏ సంస్ధలు వున్నాయో, ఎలా వెళ్లాలో కూడా ప్రపంచానికంతటికీ తెలుసు. అయినా దాడికి తెగబడిన వుగ్రవాదులు గానీ లేదా వారిని అంతంచేసేందుకు పూనుకున్న సాయుధ బలగాలు గానీ టీవీ వార్తలు చూసి తమ దాడి, ప్రతిదాడి వ్యూహాలను నిర్ణయించుకుంటారా ? ప్రభుత్వ వాదన ప్రకారమైతే దాడులకు ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో టీవీ పట్టుకోవాలి. పోనీ టీవీలో ఒక ఛానల్‌ కాదుగా అనేక ఛానల్స్‌ వుంటాయి. ఏ ఛానల్‌ ఏ సమాచారం తెలుస్తుందో రిమోట్‌లు నొక్కుతూ కాలక్షేపం చేస్తారా ? ఫఠాన్‌ కోట సైనిక శిబిరంపై దాడికి తెగబడ్డ వుగ్రవాదులను అంతం చేసిన మన సైన్యం వారి శవాల వద్ద టీవీ సెట్లు వున్నట్లు చెప్పలేదు. అత్యాధునికమైన ఇతర పరికరాలతో వారు ప్రవేశించినట్లు కదా ప్రకటించారు.

     ఒక వుదంతం గురించి దాదాపు ఒకే విధంగా వార్తలు ఇచ్చిన పత్రికలు, ఛానల్స్‌లో ఒక్క సంస్ధను మాత్రమే వేరు చేసి చర్య తీసుకోవటం వెనుక ఇతర కారణాలు వున్నాయా ? మోడీ సర్కార్‌ వివక్షను ప్రదర్శించిందా ? ఢిల్లీలోని ఆంగ్ల పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌ తమ పార్టీకి వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అన్యాపదేశంగా గతంలో తరచూ ఆరోపించేది. ఇప్పుడు కూడా మీడియా పట్ల ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు సదభిప్రాయం లేదు. విమర్శనాత్మకంగా వుండటమే దానికి కారణం.విలేకర్లను ప్రెస్టిట్యూట్స్‌ అని ఏకంగా కేంద్రమంతి వికె సింగ్‌ నిందించారు. ఇంతకాలమైనా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను కలవకుండా తప్పించుకోవటానికి ఆంగ్ల భాషా సమస్యతో పాటు ఇదొక కారణమని కూడా చెబుతారు.

    ఎన్‌డిటివీ విషయానికి వస్తే ఆ ఛానల్‌ అన్నా, దానిలో పనిచేసిన కొందరు జర్నలిస్టులన్నా నరేంద్రమోడీకి పడదు. బిజెపికి వీరాభిమాని అయిన జర్నలిస్టు, రచయిత్రి అయిన మధు కిష్వెర్‌ 2013లో మోడీ నామా పేరుతో తన పత్రికలో నరేంద్రమోడీ గురించి ఆకాశానికెత్తుతూ అనేక వ్యాసాలు రాశారు, తరువాత వాటిని పుస్తకంగా ప్రచురించారు.2014లో ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ఆమెకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు జర్నలిస్టులు బర్ఖాదత్‌, రాజదీప్‌ సర్దేశాయి కారణంగానే 2002లో గుజరాత్‌లో ఘర్షణలు చెలరేగాయని మోడీ ఆరోపించారు. ‘తొలి 72 గంటలు(నాలుగు రోజులు) ఘర్షణలు అదుపులో వున్నాయి. తరువాత ఏమైంది ? కొన్ని సంఘటనలను జర్నలిస్టులు సంచలనాత్మకం గావించారు. సూరత్‌ నుంచి బర్ఖాదత్‌, ఒక దేవాలయ్యాన్ని విధ్వంసం చేశారని అంజార్‌ నుంచి సర్దేశాయి ప్రత్యక్ష ప్రసారాలలో వార్తలను అందించారు. సూరత్‌ నగరం ప్రశాంతంగా వుందని, అక్కడ పోలీసులెవరూ లేనందున అలజడులు జరిగే అవకాశముందని బర్ఖాదత్‌ పదే పదే చెప్పారని, ఆమెను పిలిచి మీరు విధ్వంసకారులను సూరత్‌కు ఆహ్వానిస్తున్నారా అని నిలదీశానని, ఆరోజే ఆ ఛానల్‌ను తాను నిషేధించానని మోడీ చెప్పారు. అయితే తరువాత తానసలు సూరత్‌ వెళ్లలేదని బర్ఖాదత్‌ వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. నిజానికి గుజరాత్‌ మారణకాండ సందర్భంగా అనేక ఛానల్స్‌ సంచలనాత్మక కధనాలు ఇచ్చినప్పటికీ నరేంద్రమోడీ వాటిని పట్టించుకోలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఒక్క ఎన్‌డిటీవితో తప్ప ఇతర అన్ని ఛానల్స్‌కు ఇంటర్వూ ఇచ్చారు.

    ఇటీవలి కాలంలో ఢిల్లీ జెఎన్‌యు ఘటనలు, గుజరాత్‌లో అమిత్‌ షా సభను ఆటంక పరిచిన పటేళ్ల ఆందోళన, దళితులపై దాడులకు వ్యతిరేకంగా జరిగిన జరిగిన యాత్ర, గుజరాత్‌ దళితనేత జిగ్నేష్‌ మేవానీ, గుజరాత్‌లో అమ్‌ పార్టీ నేత కేజిరీవాల్‌ సభ గురించి బిజెపి, నరేంద్రమోడీ అండ్‌కోకు నచ్చని రీతిలో ఎన్‌డిటివీ వార్తలను ప్రసారం చేసింది. జెఎన్‌యు ఘటనల సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ అరగంటపాటు బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలనే ప్రదర్శించి తనదైన శైలిలో వ్యవహరించింది. ఇది కూడా బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించింది. పాలకపార్టీ, ప్రభుత్వ తీరుతెన్నులను బహిర్గత పరుస్తున్న కారణంగానే ఎన్‌డిటివీ యాజమాన్య నిర్వహణ, ఆర్ధిక వ్యవహారాల గురించి వేధింపులకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. టేకోవర్‌ నిబంధనలను సరిగా పాటించలేదంటూ సెబి, విదేశీ మారక ద్య్రవ నిబంధనలను వుల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ ద్వారా ఒక నోటీసు పంపి వేధింపులకు పూనుకుందన్న విమర్శలు వున్నాయి.

    భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని వుపయోగించి అధికారుల ద్వారా ఈ విధమైన వేధింపులకు పాల్పడటంతో పాటు ఎన్‌డిటివీపై తన అనుచరగణాన్ని వుసిగొల్పి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున దాడి చేయిస్తున్నది. ఇది ఒక విధంగా బ్లాక్‌ మెయిలింగ్‌ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒక సంస్ధ తప్పు చేస్తే దానిపై ఫిర్యాదు చేయవచ్చు, కేసులు దాఖలు చేయవచ్చు. కానీ ఆ సంస్ధలలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత జీవితాలపై సామాజిక మీడియాలో ప్రచారం చేయటం హేయం. అది ముదిరితే ఏదో ఒకనాటికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు బిజెపి, దాని నేతలపైన కూడా దానిని ప్రయోగిస్తారని వారు తెలుసుకోవటం లేదు. వారు ఒక్క జర్నలిస్టుల గురించే కాదు, తమను వ్యతిరేకించే వారందరి పట్ల ఇదే విధంగా వ్యవహరిస్తారనే విమర్శ వుంది. స్వంత పార్టీలోనే నరేంద్రమోడీని వ్యతిరేకించిన సంజయ్‌ జోషి ఒక మహిళతో వున్నట్లు చూపే బూతు సీడీలను ఆ పార్టీ వారే పంపిణీ చేయించారనే విమర్శలు వున్న విషయం తెలిసిందే. ఆ సంజయ్‌ జోషికి తిరిగి పార్టీలో పదవి ఇచ్చినందుకు గాను పదవి నుంచి తొలగించే వరకు తాను పార్టీ సమావేశాలకు రానని 2009లో నరేంద్రమోడీ బెదిరించిన విషయం, అందుకు పార్టీ తలొగ్గిన విషయం తెలిసిందే. అందువలన ఒక ఛానల్‌, ఒక పత్రికపై జరుగుతున్న దాడిగా దీనిని చూస్తే రాబోయే ముప్పును విస్మరించినట్లే. అధికారంలో వున్న పార్టీ ఈ విధంగా తనకు నచ్చని మీడియాను వేధించటమంటే లొంగదీసుకొని భజన చేయించుకొనేందుకే తప్ప మరొకటి కాదు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలో వుంటే రేపు మరొక పార్టీ రావచ్చు. అప్పుడు మరికొన్ని ఛానల్స్‌, పత్రికల పని పట్టవచ్చు. తెలంగాణాలో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను కేబుల్‌ ఆపరేట్ల ద్వారా అడ్డుకోవటాన్ని ఖండించిన తెలుగు దేశం పార్టీ తాను అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఛానల్‌ను కూడా అదే పద్దతుల్లో అడ్డుకున్న విషయం చూశాము. ఆంధ్రజ్యోతిని అడ్డుకున్నపుడు సాక్షి మౌనం వహిస్తే సాక్షిపై దాడి జరిగినపుడు ఆంధ్రజ్యోతి కూడా అదే పని చేసింది. ఇది మీడియాలో అవాంఛనీయ పోకడ. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆయా సంస్ధలలో పని చేసే జర్నలిస్టులు ఇరకాటంలో పడుతున్నారు. యాజమాన్యాలతో పాటు వారిని కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్‌డిటీవి విషయంలో కూడా కొన్ని మీడియా యాజమాన్యాల వైఖరి అలాగే వుంది. పాలకపార్టీలకు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలని చూస్తున్న శక్తులకు కావాల్సింది ఇదే. ముందు విమర్శనాత్మకంగా వున్న వాటిని తొక్కిపెడితే మిగిలిన వాటిని అదుపు చేయటం వాటికి చిటికెలో పని. అందుకే జర్నలిస్టులు యాజమాన్యాల వైఖరితో నిమిత్తం లేకుండా స్వతంత్ర వైఖరిని కలిగి వుండి, మీడియా, తద్వారా భావ ప్రకటనా స్వేచ్చపై జరిగే దాడిని ఎదుర్కోవటంలో ముందుండటం అవసరం.

గమనిక :నవంబరు నెల వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ సర్కార్‌పై మరో రేటింగ్‌ సంస్ధ క్రిసిల్‌ వత్తిడి

04 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CRISIL, Modi, Narendra Modi, narendra modi government, rating agency crisil, s&p

ఎం కోటేశ్వరరావు

    గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని దేశమంతటికీ వర్తింప చేస్తామని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ అండ్‌ కో ఇప్పుడు దాని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అది మంచిదా, చెడ్డదా అన్న విషయాన్ని పక్కన పెడితే తాను అమలు జరిపినట్లు చెప్పుకున్న దానినే మోడీ ఎందుకు అమలు జరపటం లేదని అది మంచి విధానం అనుకొనే వారు కూడా మోడీని ప్రశ్నించటం లేదు. ఫలితాలు చూపకుండా ఎవరి డబ్బా వారు ఎంత కాలం కొట్టుకుంటారు, ఆ స్ధితిలో ఏదో ఒక సంస్ధ ఇచ్చే కితాబు కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. ఇప్పుడు నరేంద్రమోడీ ఆ స్థితిలో వున్నారు కనుకనే ప్రపంచబ్యాంకు ర్యాంకింగుల  ఇండెక్సు, రేటింగ్‌ సంస్ధల రేటింగ్‌ల కోసం వెంపర్లాడుతున్నారు. గతంలో ఇందిరా గాంధీని ఏవమ్మా ధరలు పెరుగుతున్నాయేమంటే కారణం విదేశీ హస్తం అని చెప్పేవారని జోక్‌ చేసేవారు. ఎందుకంటే విదేశీ హస్తాన్ని ఆమె అంతగా వాడుకున్నారు. చివరకా విదేశీ హస్తానికే ఆమె బలికావటం విషాదం అనుకోండి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు నెలనెలా పడిపోతున్నట్లు వార్తలు రావటమే తప్ప పెరిగినట్లు ఇంతవరకు వినలేదు. కారణం విదేశాలలో పరిస్ధితులు బాగోలేవు అని చెబుతున్నారు. అది ఒక్క మన దేశానికేనా మిగతా దేశాలకు వర్తించవా ? అని ఎవరైనా అడిగితే దేశద్రోహి అన్నట్లుగా విరుచుకుపడతారు.

     మరో రెండు సంవత్సరాల వరకు రేటింగ్‌ను మార్చాల్సినంత సీన్‌ లేదని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ద గాలి తీసింది. దాని కొనసాగింపా అన్నట్లుగా ఇప్పుడు క్రిసిల్‌ అనే మరో సంస్ధ మన ఎగుమతులు పడిపోవటానికి ప్రతికూల పరిస్ధితులే కారణమని సాకు చెపితే కుదరదని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవటంతో పాటు దేశీయంగా వినియోగాన్ని కూడా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తాజాగా రూపొందించిన ఒక విశ్లేషణ పత్రంలో పేర్కొన్నది. ప్రధాని ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేయాలంటే రెండు మార్గాలు అనుసరించాలని సూచిస్తూ ఆ పత్రానికి ‘బైఫోకల్‌ ప్లీజ్‌ ‘ ( దయచేసి రెండు మార్గాల్లో నడవండి ) అని పేరు పెట్టింది.http://www.thehindu.com/business/Economy/global-situation-not-to-blame-for-fall-in-exports-crisil-study/article9301285.ece గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాలను కొనసాగిస్తూ, సంక్షేమ చర్యలకు మరింత కోత విధిస్తూ, పౌరుల ఆదాయాల పెంపునకు అవసరమైన విధానాలు అమలు జరపకుండా దేశీయ వినియోగాన్ని పెంచటం నరేంద్రమోడీ సర్కార్‌కు సాధ్యమేనా అన్నది ప్రశ్న. కుండలో కూడు తరగ కూడదు పిల్లాడు మాత్రం బొద్దుగా తయారు కావాలంటే సాధ్యమేనా ? రేటింగ్‌ సంస్ధలు చేసే విమర్శలు, విశ్లేషణలన్నీ కార్పొరేట్లకు అనుకూలంగానే వుంటాయన్నది గమనంలో వుంచుకోవాలి. క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ విశ్లేషణతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అసలదేం చెప్పిందో చూద్దాం.

    ఎగుమతుల పోటీ తత్వాన్ని పెంచేందుకు కార్మిక చట్టాలలో వున్న కాఠిన్యతను తొలగించాలి, భూ సేకరణతో ముడిపడిన సవాళ్లను పరిష్కరించాలి, అరకొరగా వున్న రోడ్లు,రేవులు, విద్యుత్‌ వంటి వాటిని పుష్కలంగా సమకూర్చాలి, నైపుణ్యం లేని మానవశక్తి స్ధానంలో నిపుణులను అందుబాటులోకి తేవాలి. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2014లో ఒక కంటెయినర్లో వస్తువులను ఎగుమతి చేయాలంటే భారత్‌లో ఖర్చు 1332 డాలర్లు, అదే బంగ్లాదేశ్‌కు 1281, చైనాకు 823, వియత్నాంకు 610, ఇండోనేషియాకు 572 డాలర్లుగా వుంది. చైనా తక్కువ విలువ ఆధారిత వుత్పత్తులైన వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, బొమ్మల నుంచి వైదొలగి అధిక విలువ వుండే వస్తువుల వైపు మరలుతున్నందున దాని ఖాళీలో భారత్‌ ప్రవేశించాలంటే పైన పేర్కొన్న చర్యల వంటి వాటిని తీసుకోవాలి. అయితే ఇప్పటివరకు అందుబాటులో వున్న సమాచారం మేరకు ఇంతవరకు ఇలాంటి చర్యలు లేవు. వుదాహరణకు జౌళి రంగంలో భారత ఎగుమతులు 2001-15 మధ్య కాస్త అటూ ఇటూగా ఒకే విధంగా వున్నాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం ఎన్నో రెట్లు పెంచాయి. పాదరక్షల విషయంలో కూడా భారత వాటా గిడసబారి పోగా వియత్నాం దూసుకుపోయింది.

      ఈ నివేదికలో పేర్కొన్న డిమాండ్లను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు ఇప్పుడేదో కొత్తగా తెచ్చినవి కాదు, ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్ట సవరణకు పూనుకుంది. రూపాయి విలువ పెంచకుండా, సాధ్యమైన మేరకు తగ్గించేందుకు నరేంద్రమోడీ తన సర్వశక్తులు ధారపోస్తున్నారు. ఈ పూర్వరంగంలోనే తెలంగాణా,ఆంధ్రప్రదేశ్‌లలో పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతులను అరెస్టు చేస్తున్నారు, బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. కార్మిక చట్టాలు వున్నప్పటికీ వాటి అమలును పక్కన పడేశారు, ఎక్కడైనా కార్మికులు ప్రశ్నిస్తే పోలీసులను రంగంలోకి దించి పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు భరోసా, ధైర్యం కల్పించే చర్యలకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దివీస్‌ లాబ్‌ విస్తరణ, తుందుర్రులో రొయ్యల శుద్ధి కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది ఇదే. క్రిసిల్‌ చెప్పిన ఒక మార్గంలో ఇవన్నీ భాగమే. ఇక అది చెప్పిన రెండవ మార్గం స్ధానిక వినిమయం లేదా డిమాండ్‌ పెంచటం గురించి చూద్దాం. ఇక్కడే మన దేశానికి చైనాకు కనిపిస్తున్న ప్రధాన వైరుధ్యం. ఎవరైనా దీన్ని ప్రస్తావిస్తే అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది స్వేచ్చా ప్రజాస్వామిక దేశం అన్న సమాధానం టక్కున చెప్పేస్తారు. ప్రజాస్వామ్యంలో వేతనాల పెంపుదల ద్వారా ప్రజల ఆదాయాలు తద్వారా వినిమయాన్ని పెంచవద్దని ఎవరైనా చెప్పారా ? పోనీ కమ్యూనిస్టు నియంతృత్వంలో బలవంతగా వేతనాలు పెంచేట్లు చేశారనుకుందాం, ప్రజాస్వామ్యంలో స్వచ్చందంగా పెంచవచ్చు కదా ? ఎందుకు ఆ పని చేయటం లేదు.

   http://www.businesstoday.in/magazine/features/textile-sector-target-one-crore-jobs-in-three-years/story/238641.html బిజినెస్‌ టుడే తాజా సంచికలో జౌళి రంగం గురించి రాసిన వ్యాసంలో వివిధ దేశాలలో ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల వేతనాల గురించి ప్రస్తావన వుంది. దాని ప్రకారం చైనాలో నెలకు 314, వియత్నాంలో 145, భారత్‌లో 120, బంగ్లాదేశ్‌లో 68 డాలర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాలో మన కంటే వేతనాలు తక్కువ కారణంగా అది చౌకగా దుస్తులను ఎగుమతి చేయగలుగుతున్నదని ఎవరైనా వాదిస్తే దీనికి ఏం జవాబు చెబుతారు ? ఒక్క ఈ రంగంలోనే కాదు అన్నింటా వేతనాలు పెరుగుతున్నాయని అమెరికా ఆర్ధికవేత్తలే చెబుతున్నారు. ఈ కారణంగానే 2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన మాంద్మం కారణంగా చైనా ఎగుమతులు తగ్గిపోయినప్పటికీ, వాటి స్ధానాన్ని దేశీయ వినియోగం పెంచటం ద్వారా భర్తీ చేస్తున్నది. అందుకే పెద్దగా సమస్యలు రాలేదు. ఎగుమతి ఆధారిత విధానం నుంచి క్రమంగా దేశీయ డిమాండ్‌ పెంపుదలకు తీసుకుంటున్న చర్యలను విస్మరిస్తే సరైన అంచనాకు రాజాలము.http://www.sify.com/finance/struggling-indian-savers-threaten-modi-s-growth-ambition-news-economy-qk2eEhagffebf.html ఇది గతనెలాఖరులో రాయిటర్స్‌ ఇచ్చిన వార్త. చైనా నుంచి అభివృద్ధి పతాకాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్న భారత కలలకు పడిపోతున్న పొదుపు రేటు ఒక హెచ్చరిక అని మన స్ధూల జాతీయాదాయం (జిడిపి)లో జాతీయ పొదుపు మొత్తం 2003వ సంవత్సరం తరువాత అతి తక్కువగా ఈ ఏడాది 30.2శాతానికి పడిపోయిందని, రానున్న రెండు సంవత్సరాలలో కూడా ఇది తగ్గుతుందని అంతర్జాతీయ వాణిజ్య సంస్ధ అంచనా వేస్తున్నట్లు దానిలో వుంది. రాయిటర్స్‌గానీ, ఐఎంఎఫ్‌ గానీ మోడీ వ్యతిరేక సంస్ధలు కావని గుర్తించాలి. మన జనం పైసా పైసా కూడ బెట్టి బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర సంస్ధలలో దాచుకుంటారు. వుద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్స్‌, బీమా పధకాల వంటి వాటిలో జమ చేస్తారు. ఈ మొత్తాలను పారిశ్రామిక వాణిజ్య వేత్తలు తమ పెట్టుబడులుగా వుపయోగించుకుంటారు. విజయ మాల్య, కావూరు సాంబశివరావు, సుజనా చౌదరి వంటి వారు కూడా వారిలో వుంటారనుకోండి, ఆ కథలు వేరే. దేశీయంగా పొదుపు మొత్తం తగ్గితే వారు మన కంటే తక్కువ వడ్డీకి వచ్చే విదేశీ పెట్టుబడులపై ఆధారపడతారు. అయితే దాని ఇబ్బందులు దానికి వుంటాయి.

    అభివృద్ధిలో చైనాను వెనక్కు నెట్టి వుద్యోగాలు కావాలనే వారి జాబితాలో ప్రతినెలా చేరు తున్న కోటి మంది యువతీ యువకులకు వుపాధి కల్పిస్తామనే నినాదంతో కదా నరేంద్రమోడీ అధికారానికి వచ్చింది. నూట ముఫ్ఫై కోట్ల జనాభాలో మూడింట రెండు వంతుల మంది 35 సంవత్సరాల వయస్సు లోపు వారే, ఇంత మొత్తం గతంలో ఎన్నడూ లేరు. వారందరికీ వుపాధి కల్పించాలంటే నిరంతర అభివృద్ధి జరిగేందుకు ప్రధాన షరతుగా చెప్పాలంటే దేశీయ పొదుపు మొత్తం 35శాతానికి తగ్గకూడదని సీనియర్‌ ఆర్ధిక వేత్త హన్నా లుచినకావా చెప్పారు. మన దేశంలో ఏడాది క్రితం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మన పొదుపు 29.6శాతానికి పడిపోయింది. చైనా, తూర్పు ఆసియా దేశాలలో దశాబ్దాల తరబడి పొదుపు రేటు 30శాతానికి మించే వుంటున్నది. ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ఖర్చు చేశారు. ఇంకా అంతరం వున్నందున పూర్తిగా సమకూర్చాలంటే మరొక లక్షా 70వేల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.

    పాలకులు అనుసరించిన విధానాల కారణంగా మరోవైపున సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన వుద్యోగ కల్పన, వున్నవి కూడా అరకొరవేతనాలు, అభివృద్ధి మందగింపు వంటి అనేక అంశాలు జనం జేబులను ఖాళీ చేస్తున్నాయి. అప్పులలో ముంచుతున్నాయి. ఈ స్ధితిలో పొదుపు చేయటానికి వారి దగ్గర డబ్బెక్కడ వుంటుంది ? న్యూఢిల్లీలోని ఒక ఎలక్ట్రిక్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేస్తున్న 50 ఏండ్ల టేక్‌ మోహన్‌లాల్‌ గత మూడు సంవత్సరాలుగా తనకు సగటున ఏడాదికి ఎనిమిదిశాతం వేతనం పెరిగిందని అయితే పిల్లల విద్య, తల్లికి మందుల ఖర్చు 40శాతం పెరిగిందని చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది. ప్రయివేటు వుద్యోగుల పరిస్ధితి దాదాపు అన్ని చోట్లా ఇంతే వుంది. ద్రవ్యోల్బణం తగ్గిందంటూ రిజర్వు బ్యాంకు ఇటీవలి కాలంలో 175 పాయింట్ల మేరకు వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో బ్యాంకులు కూడా ఆ మేరకు డిపాజిటర్లకు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇవి పొదుపు చేసే వారిని ఆకర్షించటం లేదు. కొన్ని ధనిక దేశాలలో ఎవరైనా బ్యాంకులలో డబ్బు దాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చే పరిస్ధితి వుంది. మన దేశంలో అధిక వడ్డీ రేటు కోసం పొదుపర్లు చూసే విషయం తెలిసిందే. బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగా గత 53 సంవత్సరాలలో తొలిసారిగా బ్యాంకు డిపాజిట్ల అభివృద్ధి రేటు తగ్గిపోయింది.

   2013 నుంచి సవరించిన వృత్తుల నూతన వర్గీకరణ సమాచారం ప్రకారం http://indianexpress.com/article/india/india-others/rural-wage-growth-lowest-in-10-years-signals-farm-distress-falling-inflation/ మన దేశంలో 2014 నవంబరు మాసంలో గత పది సంవత్సరాలలో అతి తక్కువ గ్రామీణ వేతనం నమోదైంది. సగటున గ్రామీణ ప్రాంత వేతనాలు నవంబరు నెలలో 3.8శాతం వార్షిక పెరుగుదల కాగా 2005 తరువాత అది కనిష్టంగా వున్నట్లు తేలింది. నిజానికి కార్మికశాఖ లెక్కలు వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించవు అనే అభిప్రాయం ఒకటి వున్నప్పటికీ వాటి ప్రకారం కూడా తగ్గింది. 2011 జూన్‌లో గరిష్టంగా 23శాతం వరకు పెరిగింది. తరువాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగ్గులేరుకోవటానికి భలే అవకాశం వచ్చిందిలే అని మరొకడు సంబరపడినట్లుగా గ్రామీణ వేతనాల పెరుగుదల రేటు తగ్గుదల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కంటే తక్కువగా వున్నందున వడ్డీ రేట్లు ఇంకా తగ్గించటానికి అవకాశాలు మెరుగుపడ్డాయని రిజర్వుబ్యాంకు విధాన నిర్ణేతలు భావిస్తుండటం ఆందోళనకరం. గ్రామీణ వేతన రేట్ల పెరుగుదల తగ్గటం అంటే వారి ఆదాయాలు పడిపోవటమే, దాని పర్యవసానం కొనుగోలు శక్తి క్షీణిస్తుంది అది దేశీయ డిమాండ్‌ తగ్గటానికి దారితీసి పరిశ్రమల మూత వంటి పరిణామాలకు దారితీస్తుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ వేతనాలు వేగంగా పెరిగినందున అది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ పెరుగుదలకు దారితీసిందనే తప్పుడు సిద్ధాంతాన్ని చెబుతున్నారు. 2007 నుంచి గ్రామీణ వేతనాల పెరుగుదలకు కారణం వ్యవసాయేతర వుపాధి అవకాశాలు పెరగటం, దానికి తోడు వుపాధి హామీ పధకం తోడైందని, రైతాంగ పంటలకు మంచి ధరలు వచ్చినందున పెరిగిన వేతనాలను రైతాంగం భరించగలిగిందని సూత్రీకరిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ, వుత్పాదక రంగం బలహీనపడటం, పంటల ధరలు పడిపోవటం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాలలో వేతనాల పెరుగుదల రేటు పడిపోయింది. దానికి తోడు వుపాధి హామీ పధకానికి తూట్లు పొడుస్తున్నందున గ్రామీణ వేతన రేట్లు ఇంకా పడిపోయే అవకాశం వుంది.

   గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారి ఆదాయాలను హరిస్తున్నవాటిలో విద్య, వైద్య ఖర్చులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు గాక రుణ వూబిలో కూరుకుపోవటం గురించి మాత్రమే తెలుసు ఇప్పుడు గ్రామీణ, పట్టణ పేదలు, సామాన్య రైతాంగం విద్య, వైద్య ఖర్చుల రుణ వూబిలో దిగబడిపోతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి బయటకు రావాలంటే అప్పులు చేయటం మినహా మరొక మార్గం లేదన్నది అందరికీ తెలిసిందే. ఇటు వంటి స్ధితిలో పొదుపు మరింతగా పడిపోవటం అనివార్యం. దానితో పాటు పారిశ్రామిక వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోతుంది. అపుడు క్రిసిల్‌ పేర్కొన్న రెండవ రోడ్డు మార్గం మూసుకుపోతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నల్లధనంపై దాడులకు ఎవరు అడ్డు పడ్డారు మోడీ గారూ !

24 Monday Oct 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, black money unearth, Modi, surgical strikes

సత్య

     కొంత మంది రాజకీయ నాయకుల మాటలు చూస్తే నేను లేస్తే మనిషిని కాదు అన్న దివ్యాంగుడైన మా మల్లయ్య మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఒక ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మల్లయ్య కాలక్షేపానికి అరుగుమీద కూర్చుంటే కొంటె పిల్లలు ఆట పట్టించేవారు. తన చేతిలోని కర్రను చూపుతూ రేయ్‌ నేను లేస్తే మనిషిని కాను జాగ్రత్త అని హూంకరించే వాడు. పిల్లలు భయపడినట్లుగా నటించే వారు. మరుసటి రోజు కథ మళ్లా మామూలే. నల్లధనంపై ప్రధాని నరేంద్రమోడీ మాటలు కూడా మల్లయ్య కథ మాదిరే వున్నాయంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. మంత్రసాని తనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా, మరొకటొచ్చినా పట్టక తప్పనట్లే రాజకీయాలలో వున్నతరువాత పొగడ్డలు వచ్చినపుడు జబ్బలు చరుచుకోవటం లేదా రొమ్ము విరుచుకోవటమే కాదు విమర్శలు వచ్చినపుడు ‘సహించాలి ‘ మరి.

      నరేంద్రమోడీ రెండున్నర సంవత్సరాల క్రితం చేసిన అనేక బాసలు, వూసులతో పాటు నల్లధనం వెలికితీత వాగ్దానాన్ని కూడా జనం మరచిపోయిన సమయంలో దాని గురించి మౌనం దాల్చకుండా మాట్లాడటం ఎందుకు చెప్పండి ? అది కూడా సర్జికల్‌ దాడులతో ముడిపెట్టి ‘మేం కనుక ఈ విషయంలో కూడా సర్జికల్‌ దాడులు చేస్తే ఎంత బయటికి వస్తుందో మీరు వూహించుకోవచ్చు ‘ అని నల్లధనం గురించి గుజరాత్‌లోని వడోదరాలో ప్రధానే ఆశ్చర్యం వ్యక్తం చేశారట.http://indianexpress.com/article/india/india-news-india/pm-narendra-modi-warns-of-surgical-strikes-against-blackmoney-corruption-3097294/ ప్రధాని అంతటి వ్యక్తి ఏదైనా అనూహ్యమైన విషయాన్ని ప్రకటిస్తే జనం, ప్రతిపక్షం, పాకిస్థాన్‌ ఆశ్చర్యపోవాలి గానీ ఆయన చెప్పినదానికి ఆయనే ఆశ్చర్యపోవటం వింతైన విషయమే. తనే జోక్‌ వేసి తానే అందరికంటే ముందుగా పెద్దగా నవ్వే వారిని గుర్తుకు తెచ్చారు కదూ ! నల్లధనం సంగతేమోగానీ సర్జికల్‌ దాడుల ఘనత తమదే అని స్వయంగా ప్రధాని చెప్పుకోవటం దీనిలో స్పష్టమైంది. కాంగ్రెస్‌, ఇతర అధికార యావ రాజకీయ పార్టీల వారి మాదిరే విజయాలన్నీ తన ఖాతాలో వేసుకొనే తహ తహ, తపనలో మోడీ కూడా పోటీ పడుతున్నారనుకుందాం.

     నల్ల ధనాన్ని వెలికి తీసిన ఖ్యాతిని కూడా మూట కట్టుకోమనే కదా దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. అందుకోసం సర్జికల్‌ దాడులు చేయకుండా మీ ప్రభుత్వానికి ఎవరు అడ్డుపడ్డారన్నదే ప్రశ్న. నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించండి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పధకం ఘోరంగా విఫలమైందని మీడియాలో విశ్లేషణలు వచ్చిన తరువాత బహుశా వాటిని జనం మరిచిపోయి వుంటారనే గట్టి నమ్మకంతో నరేంద్రమోడీ దానినొక పెద్ద విజయంగా చెప్పి తన భుజాన్ని తానే చరుచుకున్నారు. మన ప్రభుత్వాలు నిజాయితీగా వేతనం నుంచే పన్ను మొత్తాన్ని చెల్లించే వుద్యోగులకు రాయితీలు ఇవ్వటానికి ముందుకు రావన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండా గాదె కింది పందికొక్కుల్లా బలిసి పోతున్న వారికి మాత్రం క్షమాభిక్ష లేదా స్వచ్చందంగా ఆదాయ వెల్లడికి పధకాలను ప్రకటించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశమిస్తాయి. అందువల్లనే ప్రతి ఏటా పన్ను చెల్లించటం ఎందుకు? ప్రభుత్వం ఎర్ర తివాచీ పరచి పన్ను ఎగవేతదార్లకు అవకాశం ఇచ్చినపుడు ఎంతో కొంత చెల్లిద్దాము లెమ్మనే దేశ భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

   మెరిల్‌ లించ్‌ కంపెనీ వెల్లడించిన నివేదికల ప్రకారం 2007 నాటికి మన దేశంలో అధిక నిఖర సంపద వున్నవారి సంఖ్య లక్ష దాటింది. గతేడాది నాటికి ఆ సంఖ్య 4.2లక్షలకు చేరింది. 1997లో నల్లధనం దాచుకున్నవారికి క్షమా భిక్ష పేరుతో నాటి కాంగ్రెస్‌ పాలకులు ఒక పధకాన్ని ప్రకటించారు. దానిలో 33వేల కోట్ల రూపాయలను ప్రకటించి పది వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించి గౌరవం పొందారు.అప్పటితో పోల్చితే ఇప్పుడు కనీసం పది రెట్లు దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరిగింది. ఆ లెక్కన కనీసం మూడులక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనాన్ని వెల్లడించి వుండాలి. కానీ 65వేల కోట్లే అదీ ఒక్కొక్కరు సగటున ఒక కోటి వంతున మాత్రమే వెల్లడించారంటే మోడీ గారి పధకం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం 40శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పాతికవేల కోట్ల రూపాయలకు పైబడే, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు.

     బిజెపి, ఎన్‌డిఏ పక్షాలు కాంగ్రెస్‌ అవినీతిని గురించి నిత్య పారాయణం చేస్తుంటాయి. తప్పులేదు, ఆ పార్టీ అందుకు తగినదే. కానీ బిజెపి పాలనలో నరేంద్రమోడీ ఏలుబడి కుంభకోణం మాటేమిటి ? ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా వ్యక్తుల జేబుల్లోకి పంపేందుకు తోడ్పటమే కదా అవినీతి అంటే.తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగవేసి దర్జాగా విదేశాలకు పారిపోతుంటే ఎటు పోతున్నాడో చూడండి తప్ప అరెస్టు చేయటం వంటి అమర్యాద పనులు చేయవద్దని ఆదేశించిన ఘనత నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే జరిగింది. ఆ మాల్యనే ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అలాంటి మల్లయ్యలు బ్యాంకుల నుంచి తీసుకొని దాదాపు ఎగవేసిన సొమ్ము పదకొండులక్షల కోట్ల రూపాయలు. వారిలో ఏ ఒక్కడూ కూడా వ్యాపారంలో, పరిశ్రమలో నష్టం వచ్చిందని మన రైతుల మాదిరి ఆత్మహత్య చేసుకున్నవారు లేరు. వారి ఆస్థుల నుంచి కనీసం పదో వంతు వసూలు చేసినా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చి వుండేది. ఆ పనేమీ చేయకపోగా గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు రద్దు చేసిన అలాంటి బాకీల మొత్తం 1.12లక్షల కోట్ల రూపాయలున్నదన్న సంగతి ఎంత మందికి తెలుసు. ఎందుకంటే ఈ విజయాన్ని ఎక్కడా మోడీ భక్తులు కీర్తించరు ! రైతుల రుణాలు రద్దు చేయమంటే డబ్బు లేదంటారు . మరి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ? గత సంవత్సరం ప్రభుత్వం అందచేసిన లెక్కల ప్రకారమే వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు, ఎగుమతి దిగుమతులకు ఇచ్చిన రాయితీల వలన ప్రభుత్వానికి రావాల్సి రాకుండా పోయిన ఆదాయం ఆరులక్షల పదకొండువేల కోట్లు. ఈ మొత్తంలో లక్షా పదహారు వేల కోట్లరూపాయలు బంగారం, వజ్రాల దిగుమతులు చేసుకున్న మన దేశంలోని ‘ అత్యంత నిరుపేదలకు ‘ నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన రాయితీ అంటే ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి రాయితీలు కాంగ్రెస్‌ హయాంలో మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ హయాంలో కూడా పెరిగాయి తప్ప తరగలేదు ! కానీ ఈ విషయంలో మాత్రం నరేంద్రమోడీకి ఆశ్చర్యం కలగలేదు, సర్జికల్‌ దాడులు గుర్తుకు రాలేదు !! చంద్రబాబు నాయుడి వూతపదం ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ఈ పాలన ఇలా ముందుకు పోవాల్సిందేనా ? జనానికి కబుర్లు, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వాల్సిందేనా ? అన్నింటి కంటే ప్రహసనం ఏమంటే నల్లధనాన్ని అరికట్టేందుకు గతంలో వంద రూపాయల నోట్లను రద్దు చేస్తే సగం అంతరిస్తుందనుకున్నారు. ఇప్పుడు ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు నాయుడు బహిరంగంగానే సలహా ఇచ్చారు. కానీ కేంద్ర త్వరలో రెండువేల రూపాయల నోట్లను చలామణిలోకి తేనున్నదని వార్తలు అంటే నల్లధన కుబేరులకు మరింత సౌకర్యం కల్పించటమేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మంచి వార్తలు సరే , చెడు సమాచారం మాటేమిటి మోడీ జీ ?

28 Wednesday Sep 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

cotton, joblessness, Modi, WEF, WEF rankings

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో పోటీ ఆర్ధిక వ్యవస్ధల జాబితాలో భారత్‌ సూచిక ఒక్క ఏడాదిలోనే ఏకంగా 16 పాయింట్లు పెరిగిందని బిజెపి బాకా లొట్టలు వేసుకుంటూ చెప్పటం విన్నాను. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ బాకాలుగా మన ఆకాశవాణి, దూరదర్శన్‌లు పని చేస్తాయి గనుక బిజెపి బాకా అన్నందుకు ఆ పార్టీ వారు అన్యధా భావించవద్దు. ఎవరైనా అభ్యంతరం అంటే గతంలో కాంగ్రెస్‌ బాకాలని తమ పార్టీ నేతలు చేసిన విమర్శలను ముందుగా వుపసంహరించుకోమని కోరాలి. నీకిది నాకది అంటూ వాటాలు వేసుకొని పంచుకొనే విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్‌ సంస్ధలు మరింతగా మన మార్కెట్‌లో ప్రవేశించేందుకు, పూర్తిగా దిగువ స్ధాయికి విస్తరించి లాభాలు పెంచుకొనేందుకు, మన జనజీవితాలను మరింతగా అవి కట్టడి చేసేందుకు వీలుగా గత రెండున్నర సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ పడుతున్న కష్టం లేదా శ్రమకు ఇది గుర్తింపు అనటం నిస్సందేహం. సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వర్ణించినట్లు ఏదేశంలో అయినా పేపర్‌వాలా లేదా ఒక చాయ్‌వాలా అయినా అపర కోటీశ్వరుడయినా పెట్టుబడిదారీ దేశంలో అధికారానికి వస్తే ఇలాగే జరిగింది. అదేమిటో కాంగ్రెస్‌-బిజెపి, తెలుగుదేశం మరొక పార్టీ ఏది అధికారంలో వున్నా అందరినీ కోటీశ్వరులను చేయాలనే మహత్తర యావలో ముందుగా అప్పటికే వున్న కోటీశ్వరులను మరింతగా ఎంత ఎత్తుకు పెంచవచ్చో చూసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి పార్టీలన్నీ ఒకతానులో ముక్కలే, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లు ఏ పార్టీ అధికారంలో వుంటే దానిలోనే చేరిపోతారు. ఎవరి ఇంట్లో చూసినా ఎప్పుడూ అన్ని పార్టీల కండువాలూ,జండాలూ, కర్రలూ సిద్దంగా వుంటాయి.

    మధ్యలో కొన్నేండ్ల జనతా పార్టీ, నేషనల్‌ ఫ్రంట్‌ ,బిజెపి పాలన పదేండ్లు మినహా 1947 నుంచి 2014వరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ మన దేశంలో అధిక సంపదలు గల వ్యక్తులుగా 2013 నాటికి 1,56,000 మందిని తయారు చేసింది.http://www.ndtv.com/india-news/india-home-to-1-98-lakh-millionaires-world-wealth-report-2015-1217902. చాయ్‌ వాలా నరేంద్రమోడీ ప్రారంభమే జెట్‌ వేగంతో వూపందుకు కుంది కనుక 2014 నాటికే వారి సంఖ్య 1,98,000 వేలకు పెరిగింది. ధనికులలో దారిద్య్రరేఖ నుంచి ఎగువకు ఒక్క ఏడాదిలో నలభై రెండువేల మందిని చేర్చారు.ఈ స్పీడున 2017 నాటికి మొత్తం 3,43,000 మంది ఆ స్థాయికి చేరుకోవచ్చట.http://www.rediff.com/business/slide-show/slide-show-1-117-lakh-ultra-high-networth-individuals-in-india/20140724.htm#1 అరవై సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని దానిని ఐదు సంవత్సరాలలో చేసి చూపుతామని, మంచి రోజులను తెస్తామని బిజెపి, వారికి మద్దతుగా అపర చాణుక్యుడు చంద్రబాబు నాయుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వంటి వారు చెప్పిన మాటలకు, చేసిన బాసలకు అర్ధం ఇదన్న మాట. ఇంతకీ అధిక సంపద అంటే ఎంతయ్యా అంటే వ్యక్తిగతంగా పాతిక కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన కలిమి కలిగిన వారు. అంతకంటే తక్కువ వున్న వారు ధనికులలో దారిద్య్రరేఖకు దిగువ వున్నట్లు లెక్క. గతంలో వాజ్‌పేయి అధికారం చివరి రోజుల్లో భారత్‌ వెలిగిపోతోందని ప్రచారం చేసి ఎన్నికలలో పాల్గొన్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు వాజ్‌పేయి కంటే నరేంద్రమోడీ తెలివిగల వారు కనుక ప్రారంభం నుంచి భారత్‌ వెలిగిపోతోంది అన్న ప్రచారం చేయటంలో కిటుకు ఇదే. తొలి ఆరునెలల్లోనే ప్రధాని మోడీ నాయకత్వంలో ‘చారిత్రాత్మక, అసాధారణ’ విజయాలను సాధించారని స్వయంగా ఆయన ఆత్మ అమిత్‌ షా సుష్పష్టంగా చెప్పారు.http://www.financialexpress.com/economy/shades-of-india-shining-amit-shah-says-extraordinary-modi-govt-has-made-common-mans-life-easier/13416/

     బాకాలెప్పుడూ విజయగానాలే చేస్తుంటాయి. అప్రియాలను వినపడ, కనపడనివ్వవు. పోటీ ఆర్ధిక వ్యవస్ధల జాబితాలో భారత్‌ సూచిక పైకి గంతు వేసిన వార్తతో పాటు దేశంలో నిరుద్యోగిత ఐదు సంవత్సరాల రికార్డుకు చేరింది. మొదటి సంతోష వార్తను ప్రపంచ కుబేరులు ఏర్పాటు చేసుకున్న ప్రపంచ ఆరి&ధక వేదిక అనే ఒక ప్రభుత్వేతర సంస&ధ చెబితే రెండవ దుర్వార్తను స్వయంగా మన కార్మిక మంత్రిత్వశాఖే వెల్లడించింది. పై వార్తతో ఆనంద పడిన వారు అదెంత వరకు వాస్తవమో ఎలాంటి సందేహాలు వెలిబుచ్చలేదు గాని రెండో వార్తను చూసి ఇదంతా తొండి, లెక్కలు సరిగ్గా వేయలేదు, సర్వే పరిమితంగా వుంది, రాష్ట్రాలలో జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకోలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నరేంద్రమోడీని బదనాం చేయటానికి కొత్తగా కార్మిక శాఖేమీ కొత్త పద్దతిని ప్రవేశపెట్టులేదు, గతం నుంచీ అనుసరిస్తున్నదే అది. కార్మికశాఖ వివరాల ప్రకారం 2011-12లో నిరుద్యోగిత 3.8శాతం వుంటే 2015-16లో 5శాతానికి చేరింది. ఇదే కాలంలో మహిళలలో నిరుద్యోగిత రేటు 6.9 నుంచి 8.7కు పెరిగింది. దీన్ని కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ‘చారిత్రాత్మక, అసాధారణ ‘ విజయమే మరి. గత కొద్ది సంవత్సరాలుగా ఒక వైపు కొద్ది తేడాలతో వృద్ధి రేటు కొనసాగుతుండగా వుపాధి పడిపోవటాకి కారణాలు ఏమిటో మన పెద్దలు చెప్పాలి. మన జిడిపి వృద్ధి రేటు గురించి చెప్పుకోవాలంటే సామాన్యులకు అదొక అంతుబట్టని ఆల్జీబ్రా. ప్రభుత్వం లెక్కించే తీరులో, ప్రాతిపదిక సంవత్సరాలలో మార్పు కారణంగా అంకెలు మారిపోతుంటాయి. అందువలన ఒక మార్పు జరిగిన తరువాత పూర్వపు అంకెలతో పోల్చుకుంటే మనకు సరైన అర్ధం దొరకదు. వుదాహరణకు 2011 ప్రాతిపదిక లెక్కల ప్రకారం అంకెలన్నీ మారిపోయాయి. 2011-12 ధరల ప్రకారం జిడిపి 2012-13 నుంచి 2015-16 సంవత్సరాల మధ్య 5.2,5.6,7.2,7.6గా నమోదెంది. అదే సంవత్సరాలలో వర్తమాన ధరల ప్రకారం 13.9, 13.3, 10.8, 8.7గా వుంది. ఒక సూచిక పెరుగుదలను, మరొకటి తగ్గుదలను చూపుతున్నది.http://statisticstimes.com/economy/gdp-growth-of-india.php దున్నబోతే దూడల్లో, మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా రాజకీయ నాయకులు జనం దగ్గరకు వచ్చేసరికి తమకు వాటంగా వున్న అంకెలను గుమ్మరిస్తారు. జిడిపి రేటును ఎటుతిప్పి ఎలా తిప్పినా నిరుద్యోగం వంటి విషయాలకు వచ్చే సరికి అలాంటి గారడీ కుదరదు. అందుకే అవి నిజాలను వెల్లడిస్తాయి.

    ఈ మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్నది పోగా మిగిలిన పత్తి పంట చేతికి వస్తే మంచి ధర వస్తుందేమో అని రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ వార్త చదివితే ఆశపడాలో ఆగ్రహించాలో ఆలోచించుకోవటం మంచిది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పత్తిని శ్రీలంక రాజధాని కొలంబో రేవులో నిల్వ చేసుకొనే వీలు గురించి చర్చించటానికి దక్షిణభారత మిల్లుల యజమానుల సంఘ ప్రతినిధులు ఏడుగురితో కూడిన ప్రతినిధి వర్గం అక్టోబరు మొదటి వారంలో కొలంబో వెళ్ల నుంది.http://www.thehindu.com/business/Industry/cotton-mills-explore-colombo-storage-facility/article9154812.ece సెప్టెంబరుతో ముగిసే పత్తి సంవత్సరంలో మన దేశం 20 లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకున్నదని, వచ్చే ఏడాది దిగుమతి మొత్తం ఇంకా పెరగనుందని మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడు సెంథిల్‌ కుమార్‌ చెప్పారు. భారత్‌, ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ వ్యాపారులు మలేషియాలో పత్తి నిల్వలు చేశారని, దిగుమతి వ్యవధి, ఖర్చు తగ్గింపు చర్యలలో భాగంగా తూత్తుకుడి రేవులో నిల్వ చేసుకొనేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరామని, ఈ లోగా కొలంబో రేవులో నిల్వ చేసుకొనే అవకాశాల గురించి చర్చించేందుకు వారి ఆహ్వానంపై వెళుతున్నట్లు తెలిపారు. అక్కడ రెండు లక్షల బేళ్లను నెల రోజుల పాటు ఎలాంటి రుసుము చెల్లించకుండా నిల్వ వుంచవచ్చునని చెప్పారు. మన దేశ అవసరాలకు మించి పత్తి వుత్పత్తి చేస్తున్న మన రైతాంగానికి విదేశీ దిగుమతులు వెన్ను విరిచేవే తప్ప మరొకటి కాదు. పత్తి దిగుమతి అంటే ఇక్కడ దొరికే రేటు కంటే తక్కువ అయితేనే మిల్లుల వారు మొగ్గు చూపుతారు. అంతకంటే తక్కువ ధరకు రైతులు అమ్మితేనే ఇక్కడ కొనుగోలు చేస్తారు.అదే జరిగితే ఇక్కడి రైతులేం కావాలి మరి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: