• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Nara lokesh

వివాదాస్పద కార్టూన్‌పై తెలుగుదేశం వివేచనతో వ్యవహరిస్తుందా ?

22 Saturday Apr 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

cartoonist, cartoons, CHANDRABABU, derogatory jokes, Nara lokesh, social media, tdp

Image result for controversial cartoon, inturi ravikiran

ఎం కోటేశ్వరరావు

పెద్దలకు మాత్రమే అనే కాప్షన్‌తో ఒక ‘ముదురు’ సినిమా పోస్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి భవనపు ముందుభాగం ఫొటో, నాన్నారూ నేను పెద్దల సభకే వెళతా అనే కాష్షన్‌తో నారా లోకేష్‌, ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫొటోలతో కూడిన ఒక చిత్రం సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదెలాంటి ప్రభావం చూపిందంటే వంద మంది వంది మాగధుల కొలువు మధ్య ఒక్క విమర్శకుడు నోరు విప్పితే రాజో, యువరాజో, యువరాణికో ఎలా వుంటుంది ? నూరు కాకుల కావ్‌ కావ్‌లే మధురగీతాలుగా తన్మయత్వంతో అప్పటికే వూగిపోతున్న వారి మధ్యలో ఒక్క కోయిల చేరి పాడితే ఎలా కర్ణకఠోరంగా వుంటుందో అలా !

కొన్ని మినహా అన్ని అగ్రశ్రేణి సాంప్రదాయక మాధ్యమాలన్నీ ఆహా ఓహో అంటూ పొగుడుతుంటే సామాజిక మాధ్యమంలో వచ్చిన పై చిత్రం కొంతమందికి అభ్యంతరగా కనిపించటంతో వివాదాస్పదమై, చట్టపరమైన చర్యలకు దారి తీసింది. ఇంటూరి రవికిరణ్‌ వేసిన కార్టూన్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి భవనాన్ని కించపరిచేదిగా వుందంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి, బెయిలుపై విడుదల చేయటం రెండు తెలుగు రాష్ట్రాలు, జాతీయ మీడియాలో కూడా ఒక సంచలన వార్తగా మారింది. మీడియాలో వచ్చిన ఏదైనా అంశంపై ఎవరికైనా అభ్యంతరం అనిపించినపుడు ఇప్పుడేం జరుగుతోంది. సంబంధిత చట్టపరమైన సంస్ధలకు ఫిర్యాదు చేయటం అవి తీసుకొనే చర్యల కోసం కాలయాపన చేయటం కంటే అసలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటే పోలా అన్నట్లు అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నారు.

రవికిరణ్‌ తయారు చేసిన చిత్రం విషయంలో ముందుగా చేయాల్సింది. ఏ సామాజిక మాధ్యమంలో అయితే అది తిరుగాడుతోందో దాని యజమానులకు ఫిర్యాదు చేసి దానిని ముందుగా వుపసంహరింప చేయించాలి. అదేమీ జరిగినట్లు లేదు. ఎందుకంటే రవికిరణ్‌ అరెస్టు, విడుదల తరువాత కూడా ఆ చిత్రాన్ని చూపమ్మా అని గూగులమ్మ తల్లిని ప్రార్ధిస్తే అంతకంటేనా నీ కోరిక తీరుతుంది భక్తా అన్నట్లు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో చూపింది. దానిని పాఠకుల సౌకర్యార్ధం  ఇస్తున్నాం.

మీడియాలో సంచలనాన్ని చూసిన తరువాత ఈ చిత్రం ఇంకా అనేక మందిలో ఆసక్తిని రేకెత్తించి సామాజిక మాధ్యమానికి దూరంగా వున్న వారిలో కూడా ఆసక్తిని రేపి మరింత ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా నారా లోకేష్‌, నారా చంద్రబాబు నాయుడి ప్రచార గ్రాఫ్‌లు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. పైసా ఖర్చు లేకుండా వచ్చిన ఈ ప్రచారానికి ముందుగా ఆ చిత్రం అభ్యంతరంగా వుందని అనిపించిన పెద్దలకు, , రవి కిరణ్‌ను హైదరాబాదులో అరెస్టు చేసి తుళ్లూరుకు తీసుకురావటంలో ఆలశ్యం చేసి ఆసక్తి పెంచిన పోలీసులకు, దీన్నొక సమస్యగా చేసి సామాజిక మాధ్యమంలో చినబాబు, పెదబాబులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారికి ఒక గుణపాఠం చెప్పాలన్న ఆలోచన ముందుగా వచ్చిన వారికి, మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మా బాబులపై వ్యంగ్యాస్త్రం వేసినందుకు కాదు, శాసనమండలిని కించపరిచినందుకు అన్న ఒక తెలివైన పాయింటును ముందుకు తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయించిన, చేసిన వారికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వుదంతంతో ప్రమేయం వున్నవారందరికీ ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా అభినందనలు చెప్పక తప్పదు.

ఇదే జరిగి వుండకపోతే ప్రపంచానికి అనేక విషయాలు మరుగునపడి తెలియకుండా వుండేవి.భావ ప్రకటనా స్వేచ్చ గురించి అన్ని రకాల మీడియాల్లో నలుగురి నోళ్లలో నాని వుండేది కాదు. కొంత మంది గురించి కొందరు చేసిన పప్పు, సుద్ద పప్పు అన్న వ్యాఖ్యలు వారికి తగవు, పప్పులాగా వున్నా వుప్పు, నిప్పుగా నిరూపించుకొనే సందర్భాలు వస్తాయి అని రుజువైంది. ఏ మీడియా అయినా తమ రేటింగ్‌ను పెంచాలి తప్ప మరొక విధంగా చేయకూడదని రాజకీయ నేతలు కోరుకుంటారు తప్ప విమర్శిస్తే వూరుకోరని గతంలోనే మమతా బెనర్జీతో అనేక మంది నిరూపించారు. తెలుగు దేశం పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదని రుజువైంది. సరే ఒక పార్టీకి చెందిన మరుగుజ్జు సేన(ట్రోల్స్‌) తమ నేతలపై విమర్శలు చేసిన వారి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందో సామాజిక మీడియాలో విమర్శనాత్మకంగా పరిశీలించే వారందరికీ తెలిసిందే.

చట్టపరంగా రవి కిరణ్‌ రూపొందించిన చిత్రం శిక్షార్హమైనదా, కాదా, ఆ చిత్రాన్ని ఎవరు ఎవరికోసం వేయించారు, ఎందుకు వేశారు, జరిగిన నష్టం ఏమిటి, అందుకు శిక్ష వుంటుందా, తప్పేమీ లేదని కొట్టి వేస్తారా అన్న అంశాలలో కొన్ని వూహా జనితమైనవి. కేసు దాఖలు చేశారు గనుక చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఆయేషా మీరా హత్య కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సత్యం బాబు నేరం చేయలేదని స్వయంగా ఆయేషా తల్లితండ్రులు కేసు విచారణ రోజు నుంచి ఎంత మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా చట్టం తనపని తాను చేసి నిర్దోషి అయిన సత్యంబాబును అన్యాయంగా జైలుపాలు చేసిందని తాజా కోర్టు తీర్పుతో వెల్లడైన విషయం తెలిసిందే. అందువలన కొన్ని సందర్భాలలో చట్టం తనపనే గాక అధికారంలో వున్నవారికి చుట్టంగా కూడా పని చేస్తుందని స్పష్టమైంది. సరే తాజా చిత్రం కేసులో ఏమౌతుందో తెలియదు.

ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ప్రస్తావనకు వస్తున్న అంశాలేమిటంటే పేరుకు శాసన మండలిని కించపరిచారనేది సాంకేతికంగా కేసు బనాయించటానికి తప్ప వాస్తవానికి ఇద్దరు బాబుల ప్రస్తావన వున్నందుకు ఇది ప్రతీకారం అని ప్రజాభిప్రాయంగా వుంది. అనేక మంది రాజకీయ నాయకులు ఈ రోజుల్లో దేవతా వస్త్రాలు ధరించి రాజకీయాలు చేస్తున్నారు. పుణ్యం చేసుకున్న వారికే దేవతా వస్త్రాలు కనిపిస్తాయి అన్నట్లుగా వారి తీరు అందరికీ కనిపించదు. కొన్ని సందర్భాలలో ప్రజాభిప్రాయం కూడా తప్పు కావచ్చు. హిట్లర్‌ మంచివాడే, అతగాడిని బలపరచాలన్న అభిప్రాయం ప్రజలలో కలిగిన అంశం చరిత్రలో తెలిసిందే. అలాగే మన దేశంలో బాబరీ మసీదు కూల్చివేత కూడా ప్రజాభిప్రాయం, అభిష్టం మేరకే బహిరంగంగానే జరిగింది తప్ప దానిలో కుట్రేమీ లేదని చెబుతున్న విషయం తెలిసిందే. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని రామకృష్ణ కవిచేత చెప్పించారు. చట్టపరంగా ఓటింగ్‌ జరిపి తేలింది తప్ప మిగిలిన ప్రజాభిప్రాయాలన్నీ ఎలా కావాలంటే అలా వినియోగపడేవే.

ఒక చట్ట సభను కించపరచవచ్చా అంటే ఎవరూ సమర్ధించరు. కానీ చట్ట సభలలో జరుగుతున్న విషయాలను చూస్తే నేడు వాటి పట్ల ఎందరిలో సానుకూల వైఖరి వుంది. అనేక అవాంఛనీయ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి, వుదంతాలు జరుగుతున్నాయి. సభాధ్యక్షుల నిర్ణయం మేరకు అనేక అంశాలు రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్న కారణంగా అవన్నీ సమాజ రికార్డులలో నమోదు అవుతున్నాయి. వాటిని తొలగించే అవకాశం లేదు. అధికారాన్ని వుపయోగించలేరు. కర్ణాటక, గుజరాత్‌ అసెంబ్లీలలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం తమ సెల్‌ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారిని అరెస్టు చేసి శిక్షించినట్లు వార్తలు లేవు. ఒక వీధిలో ఎ ఇద్దరు కొట్లాడుకున్నా చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చు. మన దేశంతో సహా అనేక దేశాలలో చట్ట సభలలో కొట్టుకున్న ప్రజాప్రతినిధులపై ఎక్కడా కేసులు నమోదు చేసినట్లు మనకు తెలియదు. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విషయాలు తెలిసిందే. అందుకనే ఒక గూండా బొమ్మ గీసి నా అడ్డా అసెంబ్లీలో వేయాలని వుంది అంటే అది అసెంబ్లీని కించపరిచినట్లు అవుతుందా ? అవదు, అయితే రవి కిరణ్‌ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి అనే బోర్డుతో వున్న భవనపు బొమ్మ వుంది కనుకనే చట్టపరమైన సమస్యలు వచ్చాయి. ఐరోపాలోని ఐర్లండ్‌ పార్లమెంట్‌ భవనపు బొమ్మపై మార్ఫింగ్‌తో సర్కస్‌ టెంటు వేసి సర్కస్‌, ప్రవేశం అని రాశిన బొమ్మను ఎవరైనా చూడవచ్చు. పార్లమెంట్‌ను ఒక సర్కస్‌గా వర్ణించిన ఆ విమర్శకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ బొమ్మను దిగువ చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings, ireland

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్‌ నిర్మించిన ఒక సినిమాలో ఒక పాత్రను మరో పాత్ర దద్దోజనం అని హేళన చేస్తుంది. అలాగే మరో సినిమాలో పండూ అని పిలిస్తే హీరోయిన్‌ ఎంతలా రెచ్చి పోతుందో తెలిసిందే. ఇండ్లలో వున్నంత వరకు కుటుంబ సభ్యులు, బాగా సన్నిహితులైన ఇరుగుపొరుగు పిల్లలకు చిన్నతనంలో పెట్టిన కొన్ని ముద్దు పేర్లు పెద్దయిన తరువాత కూడా వారిని వదలి పెట్టవు. ఎండ పెరిగే కొద్దీ దున్నలు రెచ్చిపోయి పొలందున్నుతుంటాయి, అదే ఎద్దులు ఎండ పెరిగే కొద్దీ నీడలోకి జారుకొనేందుకు లాగుతాయి. రాజకీయాలలోకి అంటే బహిరంగ జీవనంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్ధులు కొన్ని పేర్లు పెడుతూ వుంటారు. అలాంటపుడు ఎంత ప్రతికూల వాతావరణం వున్నా పోలిక కాస్త ఇబ్బంది పెట్టినా దున్నపోతుల మాదిరి వాటన్నింటినీ భరించే విధంగా తయారు కావాలి తప్ప ఎద్దుల్లా సున్నితంగా వ్యవహరించకూడదు. లేదంటే రాజకీయాలకు దూరంగా వుండాలి. అనేక దేశాలలో ప్రత్యర్ధుల మీద ఎన్నో జోకులు వేస్తుంటారు. సందర్భం వచ్చినపుడు ప్రత్యర్ధులు కూడా అదే ప్రయోగం చేస్తుంటారు. వాటిని తేలికగా తీసుకోవాలి తప్ప అంతకు మించి పోకూడదు. కెనడా పార్లమెంట్‌ బొమ్మ వేసి ఎంపీలు, స్పీకర్‌పై వేసిన జోకును చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings

క్షమించాలి స్పీకర్‌ గారూ పరస్పరం గౌరవించుకొనే మన యత్నాలలో భాగంగా దానిని మరో రూపంలో నన్ను చెప్పనివ్వండి !

గౌరవ నీయులైన ప్రతిపక్ష సభ్యుడు దయచేసి సున్నితమైన నోటిలో వున్న వాటిని బయటకు రాకుండా మూస్తారా !

చట్ట సభలలో వుపయోగించే భాషపై వేసిన జోక్‌ ఇది. అంటే దాని అర్ధం మొత్తం సభ్యులందరూ అలా వున్నారంటూ మా మనోభావాలను కించపరిచారని ఎవరూ ఆ కార్టూనిస్టు మీద చర్య తీసుకోలేదు. తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం, మంత్రుల వ్యవహారశైలి గురించి ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌ తన చిత్రాల ద్వారా ఏకి వదలి పెట్టేవారు. ఒక సందర్భంలో నెహ్రూ నన్ను కూడా వదలి పెట్టవద్దని శంకర్‌తో అన్నారని అందరం చదువుకున్నాం.పూటకో పార్టీ మారుతున్న, అలాంటి వారిని నిస్సంకోచంగా పార్టీలలో చేర్చుకుంటున్న నేటి రాజకీయ నాయకులు కూడా చదువుకోవటం అవసరం.

గీతలతో తమ భావాలను స్వేచ్చగా వెలిబుచ్చే వారికి చట్టపరమైన అవగాహన కూడా అవసరం అని గతంలో కూడా అనేక అనుభవాలు రుజువు చేశాయి. ఐరోపాలోనో మరొకచోటో అలాంటి కార్టూన్లు వేస్తే సహించారు కదా ఇక్కడెందుకు చేయరు అని వాదిస్తే లాభం లేదు. అక్కడా చట్టాలున్నాయి.మనం బూతు అనుకొనే పదాలతో మరింత పచ్చిగా విమర్శలు, వ్యాఖ్యలు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకొనే దశను వారు దాటిపోయారు. పార్టీ మారిన వారు పూర్వపు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్నది ఒక నాటి నీతి. అలాంటిదేమీ లేదు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చివరకు మంత్రి పదవులు కూడా పుచ్చుకోవచ్చన్నది నేటి ఆచరణ. అంటే సిగ్గుపడే దశను దాటి ముందుకు పోయాం. అలాంటి వారిపై గౌరవనీయ చట్ట సభలు, వాటి అధిపతులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రక్షిస్తున్నారనే ఫిర్యాదులు, విమర్శలున్నాయి. రాజ్యాంగాన్ని అమలు జరిపే గవర్నర్లు సైతం అలాంటి వారి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. మన రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలలో వున్న లొసుగుల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో దిగంబర కవులుగా పేరు పెట్టుకున్న వారు పార్లమెంటు, అసెంబ్లీలను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఇప్పుడు చట్ట సభలు, వాటిలో జరుగుతున్న వాటి గురించి నైతికంగా ఆలోచించే వారందరూ దిగంబరు కవులు కాకుండానే వాటిని ఏవగించుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో సాంకేతికపరమైన, చట్టపర అంశాలకు అతీతంగా ఆలోచించి మందలింపుతోనో మరొక చర్యతోనో సరిపెట్టి కార్టూనిస్టు రవి కిరణ్‌పై క్రిమినల్‌ చర్యలను వుపసంహరిస్తే తెలుగు దేశం పార్టీకి సామాజిక మాధ్యమంలో జరిగిన నష్టం నివారించబడుతుంది. అటువంటి విశాల వైఖరిని వారు ప్రదర్శిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మహానాడు జయప్రదంగా జరిగింది, అయితే ఏమిటి ?

30 Monday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amitshaw, BJP, CHANDRABABU, Nara lokesh, tdp, tdp mahanadu, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

   తిరుపతిలో తెలుగుదేశం మహానాడు మూడు రోజుల సువార్త కూటములు ముగిశాయి. రాష్ట్ర దేవదూత చంద్రబాబు నాయుడు అన్నీ తానే అయి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులకు సందేశాలను అందచేశారు. ఇదే సమయంలో కేంద్ర దేవదూత నరేంద్రమోడీ ప్రభుత్వ విజయ గానోత్సవాలు దేశమంతటా ప్రారంభమయ్యాయి. అయితే ఏమిటి అన్న సామాన్యుల ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకటం లేదు. తిరుపతిలో మిగిలిపోయిన తీర్మానాలు లేదా అక్కడ చేసిన వాటినే పునరుద్ఘాటిస్తూ జూన్‌ రెండున విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అసలు సమస్యల గురించి తేల్చకుండా ఎన్ని దీక్షలు చేసినా ఆ ప్రాంతంలో జనాన్ని ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురిచేయటం తప్ప సాధించేదేమీ వుండదు. గతేడాది దీక్ష ఫలితంగా ఏం సాధించారో చెప్పి ఈ ఏడాది ఎందుకు చేస్తున్నారో చెబితే అర్ధం వుంటుంది.

    ఇటు చంద్రబాబు మూడు రోజుల ప్రసంగాలు, ఆయన వంది మాగధుల స్త్రోత్రాలు, అటు కేంద్రంలో నరేంద్రమోడీ వుపన్యాసాలు, భజనపరుల కీర్తనలు అతిశయోక్తులతో నిండి దాదాపు ఒకే విధంగా వున్నాయి. సందేశ, వుపదేశ, భజన వ్యూహాలను బహుశా ఒకటి కొంటే ఒకటి వుచితం అన్నట్లుగా ఒకే నిపుణుల బృందం రెండు చోట్లా సమకూర్చి వుండాలి. చేసిన పనులను వాస్తవాలతో నిమిత్తం లేకుండా పెద్దవి చేసి చెప్పటం (తమపాలనలో దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారం చేసి 2004 ఎన్నికలలో ఆరిపోయిన విషయాన్ని నరేంద్రమోడీ, చంద్రబాబు మరిచి పోయి లేదా గోబెల్స్‌ను ఆదర్శంగా అయినా తీసుకొని వుండాలి), ఆత్మస్తుతి, పరనిందలతో మోతెక్కించారు. కాంగ్రెస్‌ తన ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తున్నదని మోడీ చెబితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తమ పాలనకు ఆటంకం కలిగిస్తున్నదని తెలుగుదేశం మహానాడు తీర్మానించింది. వాస్తవం ఏమంటే కేంద్రంలో కాంగ్రెస్‌కు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేదు, వైఎస్‌ఆర్‌సిపికి వున్నా ప్రయోజనం లేని పార్టీగా కనిపిస్తున్నది. అవ్వతో వసంత మాడినట్లు రెండు చోట్లా రెండు సంవత్సరాల తరువాత కూడా వాటిపై దాడి చేస్తూ కాలం గడుపుతున్నారు. తన ప్రభుత్వం చేసిన అవినీతి ఏదైనా వుంటే చూపమని ఢిల్లీలో మోడీ సవాలు విసిరితే, తన ప్రభుత్వంలో అవినీతి లేదుకను రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నానని చంద్రబాబు, తన మీద అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే తానే వెళ్లి జైల్లో కూర్చుంటానని కుమారుడు నారా లోకేష్‌ తమ ప్రసంగాలలో చెప్పారు.

    ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు( లోకేష్‌ తొమ్మిదో, పదో చదువుతుండగానే 1996లో తాత్కాలిక మైన ప్రధాని పదవి చేపట్ట వద్దని తనకు సలహా యిచ్చినట్లు చంద్రబాబు నాయుడు మహానాడు సందర్భంగా విలేకర్లతో ఇష్టాగోష్టిగా వెల్లడించారని వార్తలు)కుమారుడు లోక్‌ష్‌, మంత్రులు గత రెండు సంవత్సరాలుగా దేశ, విదేశాలలో తిరిగి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, పెట్టుబడులు పెట్టేవారికి ఎన్నో రాయితీలు వస్తాయి గనుక రా రమ్మని ఆహ్వానాలు పలికి వచ్చారు. ఇప్పుడు అది రాదని తేలిపోయింది. పాండవులకు చివరకు ఐదూళ్లు కాదు కదా సూది మోపినంత స్ధలం కూడా ఇవ్వం అని కౌరవులు స్పష్టం చేసినట్లుగా ఏపికి ప్రత్యేక హోదా కాదు కదా ప్రత్యేక పాకేజి కూడా సాధ్యం కాదని బిజెపి వారు తేల్చిపారవేశారు. మరి ఇప్పుడేమి చేస్తారు?

    పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదాకు ఆటంకంగా వున్నాయని పిట్టకధలు చెబుతున్నారు. అటువంటపుడు ఆ నిబంధనలు ప్రత్యేక పాకేజికి కూడా ఆటంకమే కదా. లేకుంటే గత రెండు సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదు. పోనీ ఇప్పటికైనా సూటిగా ఎందుకు తేల్చరు? ప్రపంచంలో పెట్టుబడులు ఎక్కడ లాభం వుంటే అక్కడకు తరలుతాయి. టాటా తన నానో కార్ల ఫ్యాక్టరీని బెంగాల్‌ నుంచి భారీగా రాయితీలు ఇచ్చిన గుజరాత్‌కు తరలించారు. మిగతా రాష్ట్రాలు పోటీ పడలేకపోయాయి. వుమ్మడిగా వున్నపుడే ఆంధ్రప్రదేశ్‌ పోటీ పడలేక అనేక పరిశ్రమలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు పోయేట్లు చేసింది. ఇప్పుడు అసలే ఇబ్బందుల్లో వున్న స్థితిలో స్వంత నిధులతో రాయితీలు ఇచ్చి ఆకర్షించటం సాధ్యమయ్యేదేనా ? కేంద్రం ఇతర రాష్ట్రాలలో వెనుక బడిన ప్రాంతాలకు ఇస్తున్న మాదిరే ఆంధ్రప్రదేశ్‌కూ ఇస్తున్నది తప్ప దయా దాక్షిణ్యం కాదు, లోటు భర్తీ చేస్తామన్న వాగ్దానాన్ని కూడా కేంద్రం నెరవేర్చటం లేదని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ఈ స్ధితిలో వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మహానాడు ఇచ్చిన సందేశం లేదా భరోసా ఏమిటి ?

   తెలుగు దేశం మహానాడు జరుగుతున్న కాలంలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాదు పర్యటనకు వచ్చారు. తెలుగు దేశం పార్టీ 2019 తెలంగాణాలో అధికారానికి రావాలని తీర్మానం చేసిన సమయంలోనే తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని అమిత్‌ షా తెలంగాణా బిజెపికి దిశానిర్ధేశం చేశారు. అంటే తెలుగు దేశం పార్టీని పక్కకు నెట్టేయమనేగా ? ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి నేతలు పదే పదే మాట్లాడుతున్నదేమిటి ? దేశమంతటా చెబుతున్నదేమిటి? తమకు అవకాశం లేని చోట పాగా వేయటానికి ప్రాంతీయ పార్టీలను సోపానాలుగా చేసుకోవటం తరువాత, వాటిని పక్కన పెట్టి తమ చుట్టూ తిప్పుకోవటమేగా. మహారాష్ట్రలో బలంగా వున్న శివసేన, అసోంలో వున్న ఏజిపీలను బిజెపి అలాగే పక్కకు నెట్టివేయలేదా ? కర్ణాటకలో జరిగిందేమిటి ? తెలుగు దేశం పార్టీతో సఖ్యత తెగకొట్టుకున్నది తాము కాదనే పేరు తెచ్చుకోకుండా బిజెపి జాగ్రత్త పడుతున్నది. తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ ఫినిష్‌ అయిందన్న అంచనాతోనే బిజెపి నేతలు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ వైఖరిని వెల్లడించేందుకు అది సమయం కోసం ఎదురు చూస్తున్నది. విజయోత్సవాలలో భాగంగా విజయవాడలో కూడా బిజెపి ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది.

     కేంద్రం ఇప్పటికే ఎంతో చేసింది, వాటికి లెక్కలు చెప్పాలంటున్న బిజెపి నేతలకు సమాధానంగా మహానాడులో ఇప్పటి వరకు జరిగిందేమిటో శ్వేత పత్రం ద్వారా వెల్లడించి వుంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడి అయి వుండేవి. భక్తులు స్వామీజీల, బాబాల వుపన్యాసాలు వినేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో వెళతారు. బోధనలు విన్నంత సేపు అలాగే వుండాలనుకుంటారు. ఇంటికి వచ్చిన తరువాత షరా మామూలే. అలాగే తెలుగు దేశం కార్యకర్తలు, జనానికి వుపన్యాసాలతో చంద్రబాబు బోధలు చేసి పంపారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటల పధకాల గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి, ప్రత్యేక హోదా రాకపోవటం, లోటు భర్తీకి చర్యలు తీసుకోకపోవటం, రాజధాని నిర్మాణానికి తగినన్ని నిధులు ఇవ్వకపోవటం కూడా అంతకంటే తక్కువేమీ కాదు. ప్రభుత్వానికి దిశా నిర్ధేశం చేసే మహానాడు ఈ విషయంలో ఆలోచించిన ప్రత్యామ్నాయం ఏమిటి ? 2050వరకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారంలో వుండాలని వూదరగొట్టటంద్వారా యువతకు వుద్యోగాలు వస్తాయా ?అవినీతి, కేసుల గురించి వూకదంపుడుగా చెప్పటమే తప్ప సత్వర విచారణకు తీసుకున్న చర్యలు లేవు, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లేదా తండ్రీ ,కొడుకులు ప్రతిపక్ష నేతపై ఎంత కాలం శాపనార్ధాలు పెడుతూ, తిట్టిపోస్తూ ఎంత కాలం గడుపుతారు? దాని వలన రాష్ట్రానికి ఒరిగేదేమిటి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చంద్రబాబు వలవల- వీర భక్తుల విలవిల

14 Sunday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Nara lokesh, tdp, telangana tdp

మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో !

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని మీరు కాపాడండి-ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఈ మాట ఎక్కడో చూసినట్లు, విన్నట్లు వుంది కదూ ! చంద్రబాబు నాయుడు అనే గొప్ప సంస్క ర్త( ఇది నేను చెప్పింది కాదు, ఎవరూ ఎస్సీలుగా పుట్టాలనుకోరు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యకు ఆయన ఒక సంస్కర్తలా అనుగ్రహ భాషణం చేశారని ఆయన మద్దతుదార్లు ఇచ్చిన టీకా తాత్పర్యంలో భాగం) తెలంగాణాలో మీరు పార్టీని కాపాడండి-పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పిన మాటలు వినగానే గుర్తుకు వచ్చాయి. తీరా చూస్తే అనేక చోట్ల గోడల నిండా రాసి కూడా వున్నాయి. యుగ యుగాలుగా, తరతరాలుగా ఇలాంటి సంస్కర్తలు నాలుగు పాదాల నడిచిన ధర్మానికి ఇప్పుడు అసలు ఒక పాదం అయినా వుందో లేదో తెలియకుండా చేశారు. అదీ ధర్మాన్ని రక్షించే పేరుతోనే సుమా ! అయినా ధర్మం తనను తాను కాపాడుకోలేక పోవటమే కాదు ధర్మంగా వున్న వారిని కూడా కాపాడలేకపోయిందని ప్రతి యుగంలో, తరంలో ఏ రంగంలో చూసినా మనకు తెలుస్తూనే వుంది.

      అలాంటిది తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఎలా కాపాడగలుగుతారు? ఆయన కుమారుడు లోకేష్‌ అంటే పుట్టుకతో తెలుగుదేశం కనుక సిద్ధాంతాల గురించి మాట్లాడే నైతిక అర్హత వుంది.అయితే తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాత భూమ్మీదకు వచ్చిన లోకేష్‌ అంతకు ముందే పార్టీలోకి వచ్చిన నేతల కంటే ఎక్కడలేని అధికారం ఎలా చెలాయిస్తున్నట్లు అంటే సమాధానం కష్టం.(మన అదృష్టం కొద్దీ లోకేష్‌ ఇంకా సిద్ధాంతాల గురించి వాటి పవిత్రత, కాపాడటం గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే కొంత మంది అవతార పురుషులు, కారణ జన్ములు అవసరం వచ్చినపుడే నోరు విప్పుతారు మరి ! చంద్రబాబు నాయుడు పుట్టింది కాంగ్రెస్‌లో పెరిగింది కాంగ్రెస్‌లో, తొలి మంత్రి పదవి వెలగబెట్టింది కాంగ్రెస్‌లో కనుక ఆయన నీతి సూత్రాల గురించి మాట్లాడటం వినేవారికి కాస్త ఇబ్బందే. తెలుగుదేశం హైదరాబాదులో సరిగ్గా పనిచేయని కారణంగానే నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. నిజమే, నారా లోకేషే అన్నీ అయి పని చేశారు అన్నది అందరికీ తెలిసిందే.

     మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో ! ఏకంగా శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించిన తరువాత జరిగిన సంతాపసభలో (పోయిన వారికి అని వక్తలు చెప్పినప్పటికీ మిగిలి వున్న వారికి ధైర్యం చెప్పిన సంతాపసభ అది అనటం బాగుంటుందేమో ) పాల్గొన్న నారాయణపేట(మహబూబ్‌ నగర్‌ జిల్లా) ఎంఎల్‌ఏ రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ తన వంటి వారు హైదరాబాదు వచ్చి వెళితే శీలపరీక్ష చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరీక్షల అవసరం లేకుండా చేసుకొనేందుకు కాబోలు అలా మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే ఏం జరిగింది. సమావేశానికి పసుపు సైకిల్‌పై వచ్చి వెళ్లేటపుడు గులాబీ కారులో వెళ్లారు. అందరికీ ఎడాపెడా శరీరాన్ని కోసి ఆపరేషన్లు చేసే వైద్యుడు తన కాలుకు ముల్లు గుచ్చుకోగానే విలవిల్లాడి పోతాడట. పాపం చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువే బాధపడి వుంటారు.ఎందుకుంటే ఆకర్ష… ఆకర్ష అని నిత్యం ఏదో ఒక పార్టీలోని వారికి గాలం వేసే వారు తన గేలానికి చిక్కిన చేపలే తప్పించుకుపోతుంటే నిజంగా ఎంత బాధగా వుంటుందో కదా ! అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన కంటే ఎక్కువగా వీరాభిమానులు విలవిలాడి పోతున్నారు. ఆ క్రమంలో తమ నాయకుడికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా చూడకుండా తెగ సుభాషితాలు చెబుతున్నారు. అలాంటి వాటిలో కొన్ని ఆణి ముత్యాలు ఇలా వున్నాయి. ‘పార్టీ మారటానికి ఒక విధానమంటూ వుంటుంది. మరీ ఇంత నిర్లజ్జగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంటుంది. ఎర్రబెల్లి దయాకరరావు ప్రభృతుల జంపింగ్‌ పట్ల ప్రజలెవ్వరూ ఆశ్చర్యపోలేదు.అయితే, ఈ సందర్బంగా వారు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు మాత్రం ఔరా అనిపించేలా వున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలు తనవి కావని, పార్టీ నాయకత్వం ఇచ్చిన డైరెక్షన్‌తోనే ఆ విమర్శలు చేశానని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పటం మాత్రం రోతగా వుంది.’అని ఒక పత్రికా వ్యాఖ్యాత వాపోయారు.

     గతంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల వారిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటానికి ఏ విధానాన్ని అనుసరించింది? ఏ లజ్జ ప్రకారం వచ్చిన వారు వచ్చారు, చేర్చుకున్నవారు ముద్ర వేశారు. మామూలుగా పార్టీ మారితే ఎవరు గుర్తిస్తారు, ఏ ప్రచార సాధనాలు పట్టించుకుంటాయి.ఇప్పుడు దేనికైనా ఒక కిక్కు కావాలి.అదే జరుగుతోంది. ఒక మహానటుడు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఎందరో రాజకీయ మహానటులు చేరారు. అందువలన అక్కడ జరిగేది కూడా అంతా నాటకీయమే, సినిమా ఫక్కీనే .తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చేరితే ఒక పద్దతి వున్నట్లు ఆ పార్టీ నుంచి బయటకుపోతే లజ్జలేనట్లా ?

    పార్టీ ఫిరాయించిన ఎర్రబెల్లి దయాకరరావు తాను టిఆర్‌ఎస్‌ నాయకత్వం గురించి అనుచితంగా మాట్లాడి వుంటే క్షమించాలని అదంతా అధినేత డైరెక్షన్‌ ప్రకారమే జరిగిందని చెప్పటంపై అభ్యంతరం ఎందుకు ? అసలు అలా మాట్లాడని వారెవరు? పార్టీ ఫిరాయించిన తరువాత అలా చెప్పని వారెవరు? ఎక్కడో ఒక్కడ మొదలు పెట్టాలి గనుక చంద్రబాబు నాయుడినే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో చంద్రబాబు నాయుడు తొలి ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసినపుడు ఎన్టీరామారావు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేశారో కావాలంటే పాత పత్రికలు తిరగవేసుకోవచ్చు. ఎందుకు చేసినట్లు ? ఏ గూటి చిలక ఆగూటి పలుకులు పలికినట్లు అదే చంద్రబాబు తెలుగుదేశంలో చేరిన తరువాత కాంగ్రెస్‌ పార్టీని తిట్టని తిట్టు , చేయని విమర్శ వుందా ? ఎవరి డైరెక్షన్‌ ప్రకారం అదంతా జరిగింది? మైసూరా రెడ్డి కాంగ్రెస్‌లో వున్నపుడు విద్యుత్‌ చార్జీల వుద్యమం సందర్బంగా తెలుగుదేశం నాయకత్వంపై చేసిన విమర్శలేమిటి ? తరువాత అదే పెద్దమనిషి తెలుగుదేశంలో చేరినపుడు చెప్పిన మాటలు తియ్యగా అని పించలేదా ? అంతెందుకు ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యులుగా వున్నవారు, పార్టీలో ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు,ఎంపీలుగా వున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు ? పూర్వపు పార్టీలలో వున్నపుడు చేసిన విమర్శలు తెలుగుదేశంలో చేరి తిరిగి తమ పాత పార్టీలపై చేస్తున్న విమర్శలు రోతగా అనిపించటం లేదా ? అంతెందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నూతన శాసనసభా పక్ష నాయకుడిగా నియమితుడైన రేవంత రెడ్డి ఒకనాడు టిఆర్‌ఎస్‌లో వున్న పెద్ద మనిషే కదా ! అప్పుడు ఇతర పార్టీలను ఎందుకు తిట్టావంటే నాయకత్వ డైరెక్షన్‌ అనో పార్టీ విధానమనో గాక కొత్తగా ఇప్పుడేమి చెబుతారు ?

     ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మిగిలివున్న నేతలు, ఎంఎల్‌ఏలు కూడా ఆ పార్టీలో ఎంత కాలం వుంటారనేది ఒక ప్రశ్న. రేపు టిఆర్‌ఎస్‌తో రేవంత రెడ్డి సర్దుబాటుకు రారన్న గ్యారంటీ ఏమన్నా వుందా ? ఒకప్పుడు సిపిఎంలో వున్న సండ్రవెంకట వీరయ్య తెలుగుదేశంలోకి వెళ్లగలిగినపుడు మరో పార్టీలోకి వెళ్లటానికి అభ్యంతరం ఏముంటుంది? డొల్లుపుచ్చకాయలకు ఒక మార్గం, ఒక పద్దతి ఏముంటుంది?ఎటయినా దొర్లుతారు . ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన రేవంత రెడ్డి, ఇతరులు రేపు పార్టీ ఫిరాయించి దయాకరరావు మాదిరే తాము నాయకత్వ డైరెక్షన్‌ మేరకే ఆలా చేశాం, డబ్బు కూడా వారే సమకూర్చారు తప్ప మావరకు మేము పరిశుద్ధులమే అని అప్రూవర్‌లుగా మారరని గ్యారంటీ ఏముంది? తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలిగా రోజా కాంగ్రెస్‌ పార్టీని ఎలా తిట్టిందో తెలిసిందే. రేపు తిరిగి ఆమె మరో శుభముహూర్తాన స్వంత ఇంటికి రారని, వస్తే తిరస్కరిస్తారన్న గ్యారంటీ ఏమైనా వుందా ? నిత్యం వైఎస్‌ఆర్‌సిపి ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న తెలుగు దేశం వారు తిట్టిన తిట్లు లేదా మర్యాదస్తుల భాషలో చెప్పాలంటే విమర్శలను పట్టించుకుంటుందా ? ఎందుకీ ఆత్మవంచన ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తమరెవరి వలలో చిక్కుకున్నారు లోకేశా ?

11 Thursday Feb 2016

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, CHANDRABABU, Nara lokesh

సత్య

     ‘తాను అభివృద్ధి చేశానని చెప్పుకున్న హైదరాబాదు నగరం తన పార్టీకి ఒక్కటంటే ఒక్కటే కార్పారేటర్‌ సీటు కట్టబెట్టిందంటే ఆయన చెప్పింది అవాస్తవమైనా అయి వుండాలి లేదా చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోకను బట్టి గోదావరిని ఈదినట్లే అని జనం నిర్ధారణకు వచ్చి వుండాలి.’ అని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పర్యవసానాల గురించిన వ్యాఖ్యలో పేర్కొన్నాను. జనమే కాదు, తెలుగుదేశం నేతలు కూడా అదే నిర్ధారణకు వచ్చారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తెలుగుదేశంలో ఇంకే మాత్రం కొనసాగినా తమకు భవిష్యత్‌ లేదని ఇంతకాలం దాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన వారంతా భావిస్తున్నారు. అందుకే తట్టాబుట్టా సర్ధుకుంటున్నారు. ఇంకా మేయర్‌ ఎన్నికలు జరగక ముందే ఏకంగా తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు తెరాస కారు ఎక్కేశారు. తిమ్మినిబమ్మిని చేయటంలో, చాణక్య నీతిని ప్రదర్శించటంలో తెలుగుదేశం నేతలు తిరుగులేని చంద్రబాబు నాయుడిని చూసి ఎంతో నేర్చుకొని ఆయనకే పాఠాలు చెబుతున్నారంటే అతిశయోక్తికాదు. పార్టీలు మారటం సాకులు చెప్పటం ఇప్పుడు ఎంత సులభమైందో. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరవచ్చు. అందుకు మారేవారికే కాదు, చేర్చుకొనే వారికి కూడా సిగ్గు ఎగ్గులు లేవు.ఎక్కడ ఎలా కట్టిందా అని కాదు మా దొడ్లో ఈనిందా లేదా అన్నదే ప్రాతిపదిక. ఇంతకాలం కాంగ్రెస్‌లో వున్నా తెలుగుదేశంలో వున్నా వారు జ నానికి చెప్పిందేమిటి తమ నియోజకవర్గాలను, ప్రజలను తామెంతో అభివృద్ధి చేశామనే కదా ! అలాంటి వారు పార్టీ మారటానికి చెబుతున్న తొలిసాకు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు తీర్చటం కోసమే అని కదా చెబుతోంది. ఎంత ఆత్మవంచన. అయినా సరే జనం అలాంటి వారికి పట్టం కడుతున్నారు. ఇదింకా సామూహిక ఆత్మవంచన.

     హైదరాబాదు ఎన్నికలలో అనూహ్యంగా మట్టి కరచిన తెలుగుదేశం నేతలు కింద పడ్డా మాదే పైచేయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలలో తమకు హైదరాబాదులో లక్షన్నర ఓట్లు అధికంగా వచ్చాయని, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చెబుతున్నారు. ఇంకా నయం గత ఎన్నికల కంటే నా వయస్సు ఐదేళ్లు పెరిగింది అని చెప్పలా. తాను తెలంగాణా తెలుగు దేశం నాయకులతో మాట్లాడానని ఇంకెవరూ పార్టీ నుంచి బయటకు పోరని చెప్పిన మాటలు ఇంకా టీవీలలో మోగుతుండగానే ఏకంగా పార్టీ శాసనసభా పక్షనేతే ఫిరాయించటాన్ని లోకేష్‌ బాబు పసిగట్టలేకపోయారు. ఒకే ఒక్కడు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడెందుకు అంటే దానికి కారణాలు చెప్పకుండా తాము వేసిన ఎత్తుగడలో తెరాస చిక్కుకు పోయి జనానికి అమలు జరపలేని 60వేల కోట్ల రూపాయల వాగ్దానాలు చేసిందని లోకేష్‌ చంకలు కొట్టుకుంటున్నారు. అదీ ఎక్కడా ? విజయవాడ నడి గడ్డ మీద ! అమరావతితో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌లా మారుస్తానని వాగ్దానం చేసిన చోట. కాపులకు రిజర్వేషన్లు, రైతులతో సహా అన్ని తరగతుల రుణమాఫీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం, బాబొస్తే ఇంటికో జాబు ఇలా ఎన్నిలక్షల కోట్లో తెలియని వాగ్దానాలను తెలుగుదేశం ఎవరి వలలో చిక్కుకొని చేసినట్లో లోకేష్‌ చెప్పగలరా ? తెరాస అమలు జరపలేని వాగ్దానాలు చేసి ఇరుక్కు పోయిందని సంతోష పడుతున్న లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌లో తాను, తన తండ్రి చేసిన వాగ్దానాలతో ముందుంది ముసళ్ల పండుగ అని గుర్తించినట్లు లేదు. తెలంగాణాలో తగిలిన ఎదురు దెబ్బలతో జనం దృష్టిని మరల్చటానికి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించటానికి తెలుగుదేశం ప్రయత్నించవచ్చు. ఈ రోజుల్లో అత్యంత సులభమైన చౌకబారు వ్యవహారమది. కోట్ల రూపాయలలో పెట్టుబడి పెట్టి ఎన్నికలలో గెలిచిన వారు వాటితో పాటు లాభాలను కూడా రాబట్టుకొనేందుకు అధికారం ఎక్కడ వుంటే అక్కడ చేరతారు. అందులో తెలియనిదేముంది?

     చంద్రబాబు నాయుడు డబ్బుతో కూడుకున్న వాగ్దానాలు అమలు జరపకుండా కాలక్షేపం చేస్తున్నారంటే కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం చేసిన కాపురిజర్వేషన్ల వాగ్దానం వలన ప్రభుత్వంపై అదనపు ఆర్ధిక భారం పడేదేముంది. అయినా ఇరవై నెలల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక కమిషన్‌ వేసి ఏడు నెలలు, తొమ్మిది నెలల్లోనో ఫలితం చూపాలని హడావుడి చేస్తున్నారు. ఇది కొత్త సమస్యలు, సమీకరణాలకు దారి తీయటం అనివార్యంగా కనిపిస్తోంది. ఆ గందరగోళం కారణంగానే బుర్ర ఖరాబై గత వారంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా అని పిస్తోంది.

     అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణాలో తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్‌ కృష్ణయ్య అని చంద్రబాబు నాయుడు ప్రకటించి వెనుకబడిన తరగతులలో ఒక బలమైన తరగతి ఓట్ల కోసం గాలం వేశారు. ఎవరినైనా వాడుకో, వుపయోగించుకో, అవసరం తీరిన తరువాత వదిలెయ్‌ అన్న ఆధునిక నీతి చంద్రబాబు నాయుడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.ఎన్నికలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధి కృష్ణయ్యను కనీసం శాసనసభా పక్ష నేతగా కూడా చేయలేదు. గత ఎన్నికలలో ఎల్‌బి నగర్‌ నియోజకవర్గంలో కృష్ణయ్యను నిలిపిన కారణంగా అపుడు తమకు రావాల్సిన మెజారిటీ తగ్గిపోయిందని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలలో అక్కడ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్‌ స్ధానమైనా దక్కించుకోలేకపోయిన తరువాత చంద్రబాబు మాట్లాడుతున్నారు. బోడిగుండుకు మోకాలికీ ముడి పెట్టటం అంటే ఇదే. ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నేత చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి మాటలు రావటం అంటే మున్సిపల్‌ ఎన్నికలు ఆయన బుర్రను ఎంతగా ఆందోళనకు గురిచేశాయో అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్సీలలో ఎవరూ పుట్టాలని కోరుకోరు అని ఒక అసందర్భ ప్రేలాపన దాని పర్యవసానమే.తనకు కుల పట్టింపులు లేవని చంద్రబాబు నాయుడు నమ్మబలుకుతారు. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా అని తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీ చరిత్ర విప్పితే కులాన్ని వుపయోగించుకొని పైకి వచ్చిన పెద్ద మనుషులెవరో బహిరంగ రహస్యం. విశ్వవిద్యాలయాలలో కుల జాడ్యం అక్కడి నుంచే వ్యాపించిందన్నది దాచినా దాగని సత్యం .

     కుల రాజకీయాలు చేయటం, దాని వలన పొందేలబ్ది ఏమిటో ఈ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలకు తప్ప మిగతా పార్టీలన్నింటికీ వెన్నతో పెట్టిన విద్య.ఎవరు దీనికి కారకులు అని తర్కించుకోవటం అంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుల గురించి మాట్లాడుకోవటం వంటిదే. ఎవరు వాటి నుంచి బయట పడ్డారన్నదే నేడు గీటురాయిగా వుండాలి. రిజర్వేషన్లు సమస్యల పరిష్కారానికి మార్గాలు కావన్నది చరిత్ర చెబుతున్నది. అసలు ప్రభుత్వ రంగమే అంతరిస్తున్న తరువాత ప్రభుత్వ వుద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం అవుతున్నాయి. రిజర్వేషన్లు కుల నిర్మూలనకు ఒక మార్గంగా అంబేద్కర్‌ భావించారు. ఇప్పుడు ప్రయివేటీకరణ పర్యవసానంగా ప్రభుత్వ వుద్యోగాలు తగ్గిపోతూ దానికి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా తగ్గిపోతున్నాయి. దీనికి తోడు తగిన అభ్యర్ధులు లేని కారణంగా ఎస్‌సిఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు పెరుగుతున్నాయి. కొన్ని సందర్బాలలో వుద్యోగ ప్రకటనలు చేసినపుడు అవే ఎక్కువగా వుండటంతో మిగిలిన వారు అపార్ధం చేసుకోవటం కూడా జరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే రిజర్వేషన్ల పరిధిలోకి తమనుకూడా తీసుకురావాలని కొత్త వారు డిమాండ్‌ చేయటం, కొత్త వారిని తీసుకువచ్చి తమ అవకాశాలను దెబ్బతీయ వద్దని ఇప్పటికే రిజర్వుడు తరగతులుగా వున్నవారు ప్రతిఘటించటం దేశమంతటా జరుగుతోంది.ఏది సమర్ధనీయం ఏది కాదు కాదు అంటే తిరిగి చర్చ విత్తు ముందా చెట్టుముందా అన్నదగ్గరకు చేరుతోంది.

     అందరికీ విద్య, వుద్యోగ అవకాశాలు వుంటే ఇలాంటి సమస్యలు అంతగా ముందుకు రావు. మన దేశంలో ఈ సమస్యలతో పాటు ప్రపంచంలో ఎక్కడాలేని సామాజిక విభజన, వివక్ష సమస్యలు కూడా జనానికి తోడయ్యాయి. ముందుగా వర్గదోపిడీ అంతమైతే కుల సమస్య అంతరిస్తుందని కమ్యూనిస్టులు చాలా కాలంగా నమ్మారు. ముందు కుల సమస్య అంతరించిన తరువాతే వర్గ సమస్య సంగతి చూడాలని అంబేద్కరిస్టులు నమ్మారు. భారత్‌లో వున్న సంక్లిష్టతల కారణంగా రెండు వైఖరులను పునరాలోచించుకోవాల్సి వచ్చింది. వర్గ సమస్యలతో పాటు కుల వివక్ష సమస్యను కూడా తక్కువగా చూడరాదని కమ్యూనిస్టులు చాలా కాలం క్రితమే గుర్తించారు. దానిలో భాగంగానే అనేక రాష్ట్రాలలో కుల వివక్ష వ్యతిరేక సంఘాలను ఏర్పాటు చేసి ఆ సమస్యపై పని చేస్తున్నారు. తాము కలలు కన్న కుల నిర్మూలన ఇప్పట్లో జరిగేది కాదని అంబేద్కరిస్టులు అంతర్గతంగా ఆలోచిస్తున్నా అంగీకరించటానికి ముందుకు రావటం లేదు.ఈ వైఖరి అటు వర్గ, కుల నిర్మూలన పోరాటాలు రెండిండికీ హాని కలిగిస్తుందని గుర్తించటం అవసరం. ఎవరి అభిప్రాయాలు వారు కలిగి వుండవచ్చు, అదే సమయంలో ఎక్కడ ఏ సమస్య ముందుకు వస్తే దానిని, రెండు సమస్యలపై ఐక్యంగా పని చేయవచ్చు. కావాల్సింది చిత్త శుద్ధి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: