• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi sarkar

మోడీయే స్వయంగా అస్త్రాలు అందిస్తుంటే విభీషణులతో పనేమిటి ?

03 Sunday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

India budget, India Unemployment, Jobs in India, Narendra Modi sarkar

Image result for narendra modi sarkar itself giving astras to opposition cartoons

ఎం కోటేశ్వరరావు

కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వం రానున్న లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందేందుకు సరిగ్గా నోటిఫికేషన్‌కు ముందు ప్రతిపక్షాల వూహకు అందని అస్త్రాలను బయటకు తీస్తోందని ఆ పార్టీతో పాటు దానికి కొమ్ముకాసే మీడియా ప్రచారం చేసింది. బడ్జెట్‌ తాయిలాలతో ఆ పర్వం ముగిసి అస్త్రాలు అయిపోయాయని అనుకోవాలి. ఇన్ని చేసినా తమకు అధికారం దక్కదేమో అనే అనుమానం తలెత్తితే ఇంకా వేటిని బయటకు తీస్తారో తెలియదు. తమది వ్యత్యాసంతో కూడిన పార్టీ అని బిజెపి స్వయం కితాబు ఇచ్చుకుంది. మన కష్టజీవులకు కానప్పటికీీ నరేంద్రమోడీకి అత్యంత మిత్రదేశమైన అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం(ఓడిఎన్‌ఐ) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. బిజెపి పాలిత ప్రాంతాలలో ఎన్నికలకు ముందు మతఘర్షణలు జరగవచ్చని దానిలో చెప్పినందున చివరకు ఆ మారణాస్త్త్రాలను ప్రయోగిస్తే చెప్పలేము. రామాయణంలో రావణుడిని ఎలా చంపాలో విభీషణుడు చెబితేనే రాముడికి సాధ్యమైంది. ఆ తరువాత రావణకాష్టం గురించి తెలిసిందే. ఇప్పటికే అనేక రామాయణాలు ప్రచారంలో వున్నాయి. బిజెపి రామాయణం కొత్తది. మోడీని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలకు ఆ పార్టీలోని విభీషణుల అవసరం లేదు. మీడియా వర్ణించినట్లు మోడీ అస్త్రాలను బయటకు తీశారా లేక మోడీయే ప్రతిపక్షాలకు అస్త్రాలను అందించారా ?

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్న సామెత తెలిసిందే. అలాగే తాను భిన్నమైన పార్టీ అని బిజెపి స్వంతడబ్బా ఏమికొట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌కూ దానికీ పెద్ద తేడా లేదని,దేశంలోని వ్యవస్ధలను దెబ్బతీయటం, దుర్వినియోగం చేయటం, జనానికి విశ్వాసం లేకుండా చేయటంలో కాంగ్రెస్‌ కంటే రెండాకులు ఎక్కువే చదివిందని ఇటీవలి కాలంలో స్పష్టంగా నిరూపించుకుంది. కాంగ్రెస్‌ పాలనా కాలంలో జనం మీద మోపే భారాలను ముందుగానే ప్రకటించి బడ్జెట్లను భారాలు లేనివిగా ప్రకటించుకొని ఆ ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చారు. దాన్ని గతంలో బిజెపి కూడా కొనసాగించింది. తాజాగా జిఎస్‌టి విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆ రేట్ల తగ్గింపు హెచ్చింపు అన్నది ఇష్టమొచ్చినపుడు చేసే అవకాశం వుండటంతో పధకాల ప్రకటన మినహా బడ్జెట్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వడ్డించేవారు మనవారైతే కడబంతిలో వున్నా మనకు అన్నీ అందుతాయన్న లోకోక్తి తెలిసిందే. బడ్జెట్‌ కూడా అంతే. తమకేమి ఒరగబెడతారా అని సామాన్యులు, మధ్యతరగతి ప్రదర్శించే ఆతృత ధనికులు, కార్పొరేట్లలో కనిపించదు. ఎందుకంటే ప్రభుత్వం తమది కనుక గుట్టుచప్పుడు కాకుండా తమ సింహభాగాన్ని తాము చక్కపెట్టుకొనేందుకు వారేమీ హడావుడి చెయ్యరు.

బడ్జెట్‌ సమర్పణ గురించి సంప్రదాయాలు, స్వయం నిబంధనలు తప్ప ఒక నమూనా లేదు. బ్రిటీష్‌ వారి పాలనలో మన దేశంలో ఆప్రక్రియ మొదలైంది గనుక వారి పద్దతిని, ప్రవేశ సమయాన్ని మనదేశంలో కూడా అమలు జరిపారు. సమగ్ర చర్చకు అవకాశం లేని పరిస్ధితుల్లో మూడునెలలకు సరిపడా అవసరాలకు ఖజానా నుంచి నిధులు తీసుకొనేందుకు అనుమతించే ప్రక్రియను ఓట్‌ఆన్‌ అకౌంట్‌ అంటారు. ఎన్నికలు జరగబోయే తరుణంలో అధికారంలోకి వచ్చే సర్కార్‌ ఎవరిదో, బడ్జెట్‌ ప్రాధాన్యతలు ఏమిటో తెలియవు గనుక ఈ పద్దతిని అనుసరించటం ఆనవాయితీగా వచ్చింది. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని తుంగలో తొక్కింది. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. నిధుల విడుదలకు ఆమోదం తెలపటం తప్ప దీని మీద జరిగే చర్చ ఏమీ వుండదు. తమ ఐదేండ్ల పాలనతో ప్రజల విశ్వాసం పొంది తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం బిజెపిలో లేదని ఈ బడ్జెట్‌ స్పష్టం చేసింది. ఏదైన ఒక చట్టం లేదా చట్ట సవరణ అవసరాలను బట్టి వెనుకటి తేదీ నుంచి అమలులోకి తీసుకురావటం కొత్తేమీ కాదు. కానీ ఓట్ల కోసం రైతుల నిధి ఏర్పాటు, దాన్నుంచి చిన్న రైతులకు మూడు విడతలుగా రెండేసి వేల చొప్పున ఆరువేల రూపాయల అందచేత పధకాన్ని వచ్చే ఏడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టి దాన్ని గత ఏడాది నుంచి అమలయ్యే విధంగా చూశారంటే ఎన్నికల ఆపదమొక్కులు తప్ప మరొకటి ఎలా అవుతుంది.బడ్జెట్‌ ప్రహసనం ప్రతిపక్షాలకు మోడీ అందించిన అస్త్రం కాదా ?

తాము అధికారానికి వస్తే రామాలయ నిర్మాణం చేస్తామన్నది బిజెపి వాగ్దానం. అది సమర్ధనీయమా కాదా అన్నది ఒక అంశమైతే ఎందుకు అమలు జరపలేదో, ఎవరు అడ్డమొచ్చారో బిజెపి చెప్పాలా లేదా ? ఎప్పుడో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అయోధ్య భూమిలో వివాదాస్పదం గాని స్ధలాన్ని యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టు అనుమతి కోరుతూ సరిగ్గా ఎన్నికలకు ముందుకు కేంద్రం పిటీషన్‌ దాఖలు చేయటం ఎన్నికల ఎత్తుగడ కాదా ? దీన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించవా? దాని వెనుక వున్న వాస్తవాన్ని జనం ముందుంచవా ? బాబరీ మసీదు వున్న స్దలంపై హక్కు వివాదంలో దాఖలైన అన్ని పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నిర్ణయం ఆకస్మికంగా జరగలేదు. దానిపై తీర్పు ఎన్నికలకు ముందే వస్తుందన్న నమ్మమూ లేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగలో విశ్వహిందూపరిషత్‌ నిర్వహించిన ధర్మసంసద్‌లో ప్రసంగించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌భగవత్‌ చెప్పిందేమిటి? ‘వారు(బిజెపి) రామాలయం గురించి మాట్లాడేది కేవలం ఓట్లు పొందేందుకే.అయితే విశ్వాసాన్ని దృష్టిలో వుంచుకొని ఆలయ నిర్మాణం జరుగుతుంది. మూడు నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకుంటే మంచిదే, లేనట్లయితే నాలుగు నెలల తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుంది.’ దీనికి రెండు రోజుల ముందు శంకరాచార్యల్లో ఒకరైన స్వరూపానాంద సరస్వతి అక్కడే మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అయోధ్యయాత్ర చేసి అదే రోజు ఆలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తామని, ఇంకేమాత్రం ఆలస్యం కాకూడదని చెప్పారు. వివాదం లేని చోట రామాలయం కట్టేందుకు ఎవరూ అడ్డపడలేదే? లేదూ బాబరీ మసీదు స్ధలంలోనే కట్టాలనుకుంటే దాని యాజమాన్యంపై దాఖలైన పిటీషన్లపై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి, కోర్టు తీర్పునకు కట్టుబడి వుండాలి.ఓట్ల కోసం నాటకాలు గాకపోతే ఏమిటిది?

ప్రపంచంలో మన రిజర్వుబ్యాంకు, మన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ వ్యవస్ధలకు ఒక ప్రత్యేకత వుంది. 2007లో ప్రపంచ ధనిక దేశాలలో బ్యాంకులు కుప్పకూలటంతో ప్రారంభమైన ఆర్దిక సంక్షోభానికి మన బ్యాంకులు, ఆర్ధిక వ్యవస్ధ అంతగా ప్రభావితం గాకపోవటానికి, నిలబడటానికి రిజర్వుబ్యాంకు విధానాలే కారణం. దాని అధిపతితో నిమిత్తం లేకుండా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతీసుకున్నారు. దాని వలన జరిగిన నష్టం ఏమిటో తెలిసిందే. రద్దు నిర్ణయ సమయంలో మాట్లాడటం తప్ప ఇంతవరకు మోడీ నోరు విప్పలేదు. నల్లధనమేమీ బయటకు రాకపోగా దాన్ని కలిగిన వారంతా తెల్లధనంగా మార్చుకున్నారు.దేశ ఆర్ధిక వ్యవస్ధకు, ప్రత్యేకించి సామాన్యులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ప్రభుత్వం దాని మీద చర్చ జరిపేందుకు భయపడింది, అసలేమీ జరిగిందో చెప్పేందుకు కూడా ముందుకు రాలేదు. రిజర్వుబ్యాంకు సైతం తేలుకుట్టిన దొంగలా ఏడాదిన్నర తరువాత వార్షిక నివేదికలో వివరాలు వెల్లడించటం తప్ప ఇతరంగా ప్రశ్నించటానికి అవకాశం ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు తమతో సంప్రదించగా ఆ చర్యను వ్యతిరేకించామని, తమతో సంబంధం లేకుండానే రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని రాజీనామా చేసిన తరువాత రిజర్వుమాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వెల్లడించారు. ఇతరుల మాదిరి రెండోసారి పదవీకాలాన్ని పొడిగించేందుకు మోడీ సర్కార్‌ తిరస్కరించింది. రాజన్‌ స్ధానంలో వచ్చిన గవర్నర్‌ వుర్జిత్‌ పటేల్‌ను అర్ధంతరంగా పదవి నుంచి తప్పుకొనేట్లు చేసింది మోడీ సర్కార్‌. తాము కోరిన విధంగా పెద్ద మొత్తంలో డివిడెండ్‌ రూపంలో ఆర్‌బిఐ నిల్వనిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని వత్తిడి చేయగా తిరస్కరించిన పటేల్‌ రాజీనామా చేసి తప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు దేశ, విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికి తీస్తే ప్రతి ఒక్కరికి 15లక్షల రూపాయల వంతున పంచవచ్చునంటూ కబుర్లు చెప్పిన పెద్దమనిషి గత ఐదేండ్లలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోమారో తెలియదు. తాజా మధ్యంతర బడ్జెట్లో తన ప్రభుత్వం నల్లధనం వెలికితీతకు కట్టుబడి వుందంటూ పెద్ద జోక్‌ పేల్చారు.

విదేశాలలో మన దేశ ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల కోసమే తాను విదేశీ పర్యటనలు చేశానని, ఏటా రెండు కోట్ల వుద్యోగాలు, నైపుణ్యశిక్షణ కలిగించి మెరుగైన వుపాధి కల్పించామంటూ వూదరగొట్టిన అతి పెద్ద బెలూన్‌ గాలిని గత నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సంస్ధ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా నివేదిక తుస్సుమనిపించింది. నాలుగేండ్లమోడీ పాలన తరువాత ఆరున్నర కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగా వున్నారని వెల్లడించింది. అత్యవసర పరిస్ధితికి ఐదు సంవత్సరాల ముందు గరీబీ హఠావో నినాదంతో ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన తరువాత దేశంలో పరిస్ధితి మరింత దిగజారింది. దానికి తోడు రాజకీయంగా తగిలిన ఎదురు దెబ్బల నుంచి తప్పించుకొనేందుకు అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. దానికి రెండు మూడు సంవత్సరాల ముందున్న స్ధాయికి తిరిగి ఇప్పుడు నిరుద్యోగం పెరిగిందన్నది తాజా నివేదిక సారాంశం. 2017జులై నుంచి 2018జూన్‌ మధ్యకాలంలో సేకరించిన సమాచారం మేరకు 6.1శాతం నిరుద్యోగులున్నారు. వారం వారం సేకరించే సమాచార విశ్లేషణ ప్రకారం తాజా వారంలో నిరుద్యోగశాతం 8.9గా నమోదైందంటే ఎంత వేగంగా పరిస్ధితి దిగజారుతోందో అర్ధం చేసుకోవచ్చు.

మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు ఎక్కువ బాధ అన్నది కొత్త నుడికారం. తన ఏలుబడిలో వుపాధి అంత అధ్వాన్నంగా వుందన్న నివేదికాంశాల కంటే అది బయటకు వచ్చిన తీరు నరేంద్రమోడీని తగలరాని చోట దెబ్బతీసింది. నష్ట నివారణకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. తిట్టబోతే అక్క కూతురు-కొట్టబోతే కడుపుతో వుంది అన్నట్లు పరిస్ధితి తయారైంది. వుపాధి గురించి నివేదిక రూపొందించింది ప్రభుత్వ సంస్ధ. అది బయటకు వస్తే ఎన్నికలలో ప్రభావం చూపుతుందని మోడీకి అర్ధమైంది.జాతీయ గణాంక కమిషన్‌ ఆ నివేదికను ఆమోదించింది. దాన్ని బహిర్గతం చేసేందుకు మోడీ కార్యాలయం అడ్డుపడటంతో నిరసన తెలుపుతూ ఇద్దరు కమిషన్‌ సభ్యులు ఈ మధ్యనే రాజీనామా చేశారు. సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడినట్లుగా దాచి పెట్టేందుకు ప్రయత్నించిన నివేదిక బయటకు వచ్చినదాని కంటే దానిలోని అంశాలను ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు, అది తాత్కాలికమైనది అని అటూఇటూ తిప్పి నష్టనివారణకు నీతి ఆయోగ్‌ వున్నతాధికారి చెప్పటం తగలరాని చోట మోడీ సర్కార్‌మీద దెబ్బ వేసినట్లయింది. నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న వుపాధి కల్పన పధకాలు గణనీయంగా వుద్యోగాలను కల్పిస్తాయంటూ ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల మండలి సభ్యుడు వివేక్‌ దేవరాయ్‌ చెప్పిన వీడియోను రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తన ఫేస్‌బుక్‌లో ఈ సందర్భంగా పోస్టు చేయటం గమనించాల్సిన అంశం. తన శాఖకు సంబంధం లేని అంశాన్ని ఆమె ఎందుకు పోస్టు చేశారో తెలియదు. బహుశా ప్రధాని ‘రక్షణ’ కోసం అనుకుందాం.

ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు పనిచేస్తాయా అన్నది అపూర్వ చింతామణి ప్రశ్న. గత ఏడు దశాబ్దాలుగా అధికార పార్టీలు పట్టువదలని విక్రమార్కుడిలా జిమ్మిక్కులకు పాల్పడినా మొత్తం మీద పని చేయలేదు. మట్టి కరచిన వుదంతాలే ఎక్కువ.తాజాగా బిజెపి నాయకత్వ తీరు తెన్నులను, జరుగుతున్న పరిణామాలను చూస్తే కారల్‌ మార్క్స్‌ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్ధ లాభాల కోసం వస్తువులతో పాటు తన గోరీ కట్టే కార్మికులను కూడా తయారు చేసుకుంటుందన్నారు. దాన్ని కొద్దిగా మార్పు చేస్తే మార్క్స్‌ చెప్పినట్లు నరేంద్రమోడీ తన పదవిని పదిల పరుచుకొనేందుకు కొన్ని అస్త్రాలను బయటకు తీయటంతో పాటు తన మీద సంధించే బలమైన అస్త్రాలను కూడా ప్రత్యర్ధులకు అందిస్తున్నారు అని చెప్పక తప్పదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏం చెప్పారు మోడీజీ వహ్వా ! వహ్వా !!

30 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

BJP, Farm prices, Farmers, MSP, Narendra Modi, Narendra Modi Failures, narendra modi namo mantra, Narendra Modi sarkar

యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది

ఎం కోటేశ్వరరావు

     2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ ఇండియా ఆర్ధిక

వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే

1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్‌

2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం

3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు

4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు

6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం

7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం

    ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.

     ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్‌కి బాత్‌ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్‌ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.

     ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్‌ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌ చెల్లించిన ధర 320 డాలర్లు.

    రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్‌ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్‌.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్‌లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?

     గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.

    రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్‌ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్‌, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్‌, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్‌ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?

    2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?

    పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?

   పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎక్కిరించబోయి వెల్లకిలా పడినట్లు ……..

26 Saturday Mar 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Central government, Central government schemes, Central government schemes names, Narendra Modi sarkar, schemes

ఎంకెఆర్‌

    ఎక్కిరించబోయి వెల్లకిలా పడినట్లు బిజెపి దాని మిత్రపక్షాల వ్యవహారం వుంది. ప్రస్తుతం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్‌) వ్యవసాయంలో మంచి ప్రతిభ కనపరిచిన రైతులకు అవార్డులు ఇస్తున్నది. వాటికి ఆర్‌ఎస్‌ఎస్‌, భారతీయ జససంఘ మాజీ నేత అయిన పండిట్‌ దీన దయాళ్‌ వుపాధ్యాయ పేరు పెట్టే విషయాన్ని పరిశీలించమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ ఆ సంస్ధ అధికారులను కోరినట్లు పిటిఐ వార్తా సంస్ధ తెలిపింది. ఇప్పటికే కొన్ని పధకాలు, సంస్ధలకు ఆ పేరు పెట్టారు. పేర్లు పెట్టటమా లేదా , వున్న పేర్లు మార్చటమా, వాటికి తమకు అనుకూలమైన పేర్లు తగిలించటమా అన్నది ఆయా ప్రభుత్వాల విచక్షణకు సంబంధించిన ఒక వివాదాస్పద అంశం. ఏకంగా రంగులే మార్పించవచ్చు, ఏ అడ్డగోలు పని అయినా చేయవచ్చని ఇంతకాల అనుభవం తెలియ చేస్తున్నది. ఇక్కడ సమస్య ఏమంటే ప్రతి పధకానికి తమ నేతల పేర్లు పెట్టి లబ్ది పొందుతున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై బిజెపి, దాని మిత్రపక్షాలు ఇంతకాలం నానా యాగీ చేశాయి. అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పని చేశాడన్నట్లుగా అదే పని అవి చేస్తున్నాయి. ఎవరైనా ఒక మంచి సంప్రదాయాన్ని ప్రవేశపెడితే దాన్ని ఎవరైనా హర్షిస్తారు.తాము విమర్శించిన దానినే తాము చేసేవారిని ఏమనాలి ? ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల దుస్దితిని నివారించేందుకు ఇంతవరకు ఎలాంటి నిర్ధిష్ట చర్యలూ లేవు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు జరిపేందుకు అసలు ప్రయత్నమే లేదు. కానీ రైతులకు ఇచ్చే అవార్డులకు మాత్రం తమ నాయకుల పేర్లు పెట్టేందుకు మాత్రం ఎక్కడ లేని తహ తహ !

    మహారాష్ట్రలో బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం వున్నది. జనవరి నెలలో ఒక ఐదు పధకాలకు పెట్టిన పేర్లు ఎలా వున్నాయో చూడండి.1.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే కన్యాదాన యోజన. ఈ పధకం కింద రాష్ట్ర రవాణాసంస్ధ వుద్యోగుల ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాత లక్ష రూపాయలు ఇస్తారు.2.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే అప్‌గత్‌ సహాయ నిధి యోజన. ఆర్‌టిసి బస్సు ప్రమాదాలలో గాయపడిన, వికలాంగులైన, మరణించిన ప్రయాణీకులకు పరిహారం అందచేసే పధకమిది.3.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ కాలేజి.4.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి.5.హిందూహృదయ సామ్రాట్‌ శివసేన ప్రముఖ్‌ బాలా సాహెబ్‌ థాకరే నిరాధార్‌ స్వావలంబన్‌ యోజన.దీని కింద ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలకు ఆర్ధిక సాయం, ఆటో రిక్షాలు నడుపుకొనేందుకు పర్మిట్లు ఇస్తారు.

     ఒక మతం, పార్టీ పేరును ఏకంగా ప్రభుత్వ పధకానికి పెట్టిన బిజెపికి ఇతర పార్టీలను విమర్శించేందుకు ఎలాంటి నైతిక హక్కు వుంటుంది. ఇది లౌకిక రాజ్యమా, మత రాజ్యమా ? గతంలో వున్న కొన్ని సంక్షేమ పధకాల పేర్లను మార్చిన నరేంద్రమోడీ సర్కార్‌ వాటికి ప్రధాన మంత్రి అనే పేరును తగిలించింది. అది కూడా ప్రధానిగా నరేంద్రమోడీ ఖాతాలోకి ఆ ఖ్యాతిని బదలాయించే దూరాలోచన వున్నప్పటికీ ఆమోదనీయమే. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు బిజెపి మిత్రపక్షమైన పంజాబ్‌ అకాలీదళ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నాటి కేంద్ర ప్రభుత్వమైన యుపిఏపై ధ్వజమెత్తారు. కేంద్రం అమలు జరుపుతున్న పధకాలకు పేర్లు, ఫొటోలు పెట్టటంపై రాష్ట్రాలకు షరతులు విధించటంపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రాల నుంచి వసూలు చేసిన నిధులు తప్ప కేంద్రానికి ప్రత్యేకంగా ఆ పధకాలకు నిధులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు.

UrjaUtsavOdisha Jana Amantrana Karyakram vehicles during flag off ceremony at Bhubaneswar -

    కొద్ది వారాల క్రితం ఒడిషాలోని పారాదీప్‌ ఐఓసి చమురుశుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ప్రధాని వచ్చిన సందర్బంగా దాన్ని బిజెపి కార్యక్రమం మాదిరిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించటం వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోయే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ పెద్ద బొమ్మ, దాని పక్కనే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బొమ్మలతో కూడిన వ్యాన్లను ఒడిషా అంతటా తిప్పారు. ప్రధాని వస్తున్న సందర్భంగా బిజెపి తన స్వంత నిధులతో ఎలాంటి ప్రచారం చేసుకున్నా ఎవరికీ ఇబ్బంది లేదు. ఒక ప్రతిపక్ష పార్టీ అధికారంలో వున్న రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారాన్ని తలపించే విధంగా ప్రచారం చేయటం కక్కుర్తి తప్ప వేరే కాదు.ఈ చర్యను స్ధానిక బిజెపి నాయకత్వం సమర్ధించుకుంది. ‘ వారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పధకాలన్నింటినీ హైజాక్‌ చేశారు. వారి చర్యలను మేము ప్రజల దృష్టికి తీసుకు వస్తుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్నే హైజాక్‌ చేసేందుకు పూనుకున్నారని’ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వసంత పాండా ఆరోపించారు. తప్పులెన్నువారు తమ తప్పు లెరుగరు అంటే ఇదేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆనందం-విషాదం

16 Wednesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Narendra Modi sarkar, NDA, special status to Andhra pradesh, Ycp, ycp jagan

ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్థితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

ఎం కోటేశ్వరరావు

     ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ప్రభుత్వం మీదా, శాసన సభాపతి మీదా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను చాకచక్యంగా తిప్పి కొట్టగలిగామని తెలుగుదేశం పార్టీలు శ్రేణులు చంకలు కొట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదూ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా అరటి పండు వలిచి అరచేతిలో పెట్టినట్లుగా చెప్పటంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం ఆవిరై నీరు గారి పోతున్నారు. ప్రత్యేక హోదా లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అడుగుతూ విసిగిస్తున్నారు అర్ధం కాదా మీకు ముందు బయటకు పొండి అన్న రీతిలో కేంద్ర మంత్రి అరుణ్‌ జెట్లీ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంపీలతో మాట్లాడినట్లు తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన పత్రికలోనే వార్తలు వచ్చాయి. హాస్యాస్పదం, విచారకరం ఏమంటే అది జరిగిన మరుసటి రోజే అలా మాట్లాడితే ఎలా దొరా మంచి మనసు చేసుకొని మా సంగతి చూడండి, మరొక మాట చెప్పండి అన్నట్లుగా విభజస సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని అధికార తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కంద్రానికి మరోసారి విన్నవించుకుంది. ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్ధితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

     ముందుగా ఆనందం గురించి చూద్దాం. ఒకసారి నీతి తప్పిన తరువాత ఎన్నిసార్లు తప్పినా ఒకటే అని తెలుగు దేశం పార్టీ గత రెండు రోజులలో రుజువు చేసింది. తొలిసారి పడితే సిగ్గు. ప్రతిసారీ పడితే అది ఎబ్బెట్టుగా వుంటుంది. కనుక అసలు తొలిసారే సిగ్గు పడనివారు దాని స్థానంలో పండుగ చేసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది. గతంలో కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీలు చేసినా ఇప్పుడు తెలుగుదేశానికి అయినా అది వర్తిస్తుంది. కాకపోతే సందర్భం తెలుగుదేశం పార్టీ గనుక దాని గురించి ముచ్చటించుకోక తప్పదు. ఇతర పార్టీల అజెండా,గుర్తులపై ఎన్నికైన వారు పార్టీ మారాలనుకుంటే తాము ఎన్నికైన స్థానానికి రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చు. చేర్చుకొనే వారికి కూడా అభ్యంతరం వుండనవసరం లేదు. ఆ నీతికి కట్టుబడి వుంటే అయినట్లే అని వారూ వీరు అనుకోవటం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది వైసిపి సభ్యులను పార్టీలో చేర్చుకోవటమే రాజ్యాంగం, స్ఫూర్తికి కూడా విరుద్దం. వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వేటు పడకుండా వుండాలంటే అవిశ్వాస తీర్మానాలపై ఓటింగ్‌ సందర్బంగా వారు ఎన్నికైన పార్టీ విప్‌ జారీ చేయకుండా వుండేందుకు తగిన వ్యవధి లేకుండా తక్షణమే అనుమతించి ఓటింగ్‌ కూడా పెట్టి తీర్మానం వీగి పోయిందని సంతోషించారు. వెంటనే సభాపతిపై పెట్టిన అవిశ్వాసంపై అంతకంటే దారుణంగా ముందుగా అసలు నిబంధనలనే ఎత్తివేసి ఓటింగ్‌ పెట్టి రెండోసారి ‘ఘనవిజయం’ సాధించారు. మొదటిది చాణక్యం అనుకుందాం, మరి రెండవది ?

     ఒక తప్పుడు సాంప్రదాయం లేదా పద్దతికి తెరతీశారు. ఇలాంటి చర్య వలన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు గౌరవం పెరగదు. గాంధీ పేరు గుర్తున్నంత కాలం గాడ్సే కూడా వుంటాడన్నట్లు పార్లమెంటరీ వ్యవస్ధలో చెడు సాంప్రదాయంతో గట్టెక్కిన స్పీకర్‌గా చరిత్రకు ఎక్కారు. స్పీకర్లు పాలక పార్టీకి చెందిన వారిగానే వుంటారు, పైకి ఏం చెప్పినా, నిబంధనలు ఎలా వున్నా పాలకపార్టీని కాపాడటానికి స్పీకర్లు తమ స్థానాలను వుపయోగిస్తున్నట్లు దాదాపు అన్ని శాసనసభల, పార్లమెంట్‌ అనుభవం. అందుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అతీతం కాదు. గతంలో తెలుగుదేశం అధికారంలో వుండగా స్పీకర్‌ ప్రవర్తన, దానిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎలా వ్యవహరించారో తెలియంది కాదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా కూడా అదేపని చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై దాడిలో భాగంగా ఆ పార్టీకి చెందిన స్పీకరుపై ప్రతిపక్ష వైసిపి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే ఎత్తుగడలను వుపయోగిస్తోంది. వుత్తమ, చెడు సాంప్రదాయాల గురించి భవిష్యత్‌లో జరిగే చర్చలో అప్పుడు ఇప్పుడూ స్పీకర్‌గా ఎవరున్నారో వారిని ప్రస్తావిస్తారు తప్ప అలాంటి తప్పుడు సలహాలు చెప్పిన వారిని కాదు.

     నిజానికి తెలుగు దేశం పార్టీకి స్పీకరు స్థానాన్ని, దానిలో వున్న గౌరవనీయ సభ్యుడిని ఫణంగా పెట్టాల్సిన అవసరం వుందా ? ఫిరాయించిన వారి మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడే స్థితి లేదా అంటే అలాంటిదేమీ లేదు. పాలకపార్టీలో లుకలుకలున్నాయా అంటే అదీ లేదు. అంతా సర్దుబాటే తప్ప కుమ్ములాట బాట అవసరం ఏముంది. ఎక్కడ అధికారం వుంటే అక్కడ అనుభవించి తరువాత ఎవరు అధికారానికి వస్తే అభివృద్ది పేరుతో ఆ పార్టీలో చేరటానికి, చేర్చుకోవటానికి తలుపులు బార్లా తెరిచి వుంటాయి గనుక భవిష్యత్‌కూ ఢోకా వుండదని ఫిరాయింపుదార్లు రుజువు చేశారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టటం అన్నది పార్లమెంటరీ చరిత్రలో ప్రతిపక్షానికి వున్న ఒక హక్కు, అవకాశం. ప్రస్తుతం శాసనసభలో వున్న బలాబలాల రీత్యా వైసిపి పెట్టిన తీర్మానాలు ఓడిపోతాయని ఆ పార్టీకి తెలుసు, పాలకపక్షానికి తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టటానికే ఈ అస్త్రాన్ని వాడతారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాలను కాపాడే క్రమంలో ప్రతిపక్ష పార్టీకి మరొక అస్త్రాన్ని అందించటంతప్ప ఇంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా వుత్తమ సాంప్రదాయలను నెలకొల్పాలని లేదా ముందుకు తీసుకుపోవాలని కోరుకొనే వారికి తప్ప ఈక్షణం గడిచిందా లేదా ప్రత్యర్ధిపై దెబ్బతీశామా లేదా అని చూసే వారికి విమర్శలు పట్టవు.

     ఇక రెండో అంశం విషాదం. చంద్రబాబుపై అవిశ్వాసం, స్పీకర్‌పై అవిశ్వాసంలో విజయ తెలుగుదేశం పార్టీకి ఆనందం, వైసిపి విషాదం క్షణ భంగురాలు. ప్రత్యేక హోదా గురించి మరింత వివరణ,స్పష్టత వచ్చింది కనుక తమ అవిశ్వాస తీర్మానాలు ఓడిపోయాయని, తమ పార్టీ జంప్‌ జిలానీలపై వేటు వేసే అవకాశం చేజారిందని వైసిపి నేతలు విషాదంలో మునగనవసరం లేదు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యోగం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదారాదని, ప్రత్యేకంగా నిధులు కూడా రావని చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి తెలియని విషయం కాదు. ఆ విషయం తాము చెప్పకుండానే జనం గ్రహించాలని, తమపై ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించకుండా చెవుల్లో పూలు పెట్టుకొని తలలాడించాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనే ఒక రాజకీయం. ప్రత్యేక హోదా మరొక రాజకీయం, ప్రతిదీ రాజకీయమే, ఒక్క సిపిఎం తప్ప ఎవరికి వారు ఈ రాజకీయంలో తమ వంతు పాత్రను రక్తి కట్టించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తప్పుదారి పట్టించారు. మంగళవారం నాటి పార్లమెంట్‌ చర్చలో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా మోసం చేసిందని వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. నిజమే కాంగ్రెస్‌ మోసం చేసింది. ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని కోరిన వెంకయ్య అది చట్టంలో పొందుపరచలేదనే విషయాన్ని అప్పుడు ఎలా మరిచి పోయారు ? ఆ సమయంలో బిజెపి, తెలుగు దేశం ఎంపీలు ఏ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు? చిన్న పిల్లలేం కాదే, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం చెప్పారే తప్ప ఒక కన్నును పొడుస్తుంటే ఎందుకు వూరుకున్నారు? పోనీ తరువాత అయినా చట్టాన్ని సవరించి ప్రత్యేక హోదాను చేర్చటానికి ఏ పార్టీ అడ్డుచెప్పింది? ఎందుకు ఆపని చేయలేదు. ఇప్పటికైనా చట్టసవరణ చేయవచ్చు కదా ?

    ఎందుకు గతంలో చేయలేదు, ఇపుడు చేయటం లేదంటే. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే 14వ ఆర్ధిక సంఘం ముసాయిదా తయారైంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించటాన్ని నిలిపివేయాలనే సిఫార్సు చేసే ఆలోచనలో వుంది. ఒక వేళ కాంగ్రెస్‌-బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చట్టంలో చేర్చినా తరువాత వెలువడే ఆర్ధిక సంఘం సిపార్సులకు అది వ్యతిరేకం కనుక ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పినా, కోర్టుకు వెళ్లినా అది చెల్లదు. అందుకనే తెలివిగా దాని ప్రస్తావన లేకుండా చట్టం చేశారు. బిజెపి తెలిసి కూడా మౌనం దాల్చింది. తరువాత ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఆర్ధిక సంఘం సిపార్సులు అమలులోకి వచ్చాయి. అందువలన రాజకీయాలు తప్ప చట్ట సవరణ చేసే అవకాశం లేదు. ఒక వేళ చేస్తే అనేక రాజ్యాంగ సమస్యలు వస్తాయి. అందుకే ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పట్ల వ్యవహరిస్తున్నారు.

    బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోప్రత్యేక హోదా అమలుకోసం కేంద్రాన్ని అర్ధిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంతో వినమ్రతతో తన బాడీ లాంగ్వేజ్‌ను సవరించుకొని మాట్లాడారు. బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు తమ కేంద్ర ప్రభుత్వాన్ని, అన్నింటికీ మించి తమ వెంకయ్య నాయుడిని జనం ఎక్కడ అపార్ధం చేసుకుంటారో అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షా 40వేల కోట్ల రూపాయల పాకేజి ఇచ్చిందని , ఏ విద్యా సంస్ధకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో లెక్కలు చెప్పారు. ఆ మాటలు విన్నవారికి ఎవరికైనా అత్యాశ కాకపోతే ఇంకా ఎక్కడి నుంచి కేంద్రం ఇస్తుందనే భావం లుగుతుంది. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు చర్చమధ్యలో జోక్యం చేసుకొని అన్ని విద్యాసంస్థలకు కలిపి ఇప్పటికి ఇచ్చింది 172 కోట్లేనని, విష్ణుకుమార్‌ రాజు చెప్పే మొత్తాలు అవి పూర్తయ్యే నాటికి వస్తాయని అసలు విషయం చెప్పారు. అందువలన ఇప్పటివరకు చేసిన సాయం లేదా ప్రకటించిన సాయం గురించి అటు చంద్రబాబు ఇటు బిజెపి రెండూ కూడా అంకెల గారడీ చేస్తున్నాయి తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఇలాంటి తీర్మానాలు ప్రతి రోజూ పంపినా అవి నరేంద్రమోడీ చెత్తబుట్ట నింపటానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అదనపు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం వుండదన్నది స్పష్టం. అందుకే రాష్ట్ర విభజన, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్‌ యువతకు పెద్ద విషాదం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీ భక్తులారా నిగ్రహించండి !

23 Tuesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra Modi Failures, Narendra Modi sarkar, NDA

ఎం కోటేశ్వరరావు

     మూఢ భక్తి, భక్తులతో ఇదే సమస్య . దేవుడు నిజంగా ప్రత్యక్షమైనా తట్టుకోలేరు, నమ్మిన దేవుడిపై విశ్వాసం సన్నగిల్లుతున్నా భరించలేరు. ఏం మాట్లాడతారో తెలియని వున్మాదంలోకి వెళ్లిపోతారు. కొత్తా దేవుడండీ, కొంగొత్తా దేవుడండీ అన్నట్లు పెద్ద ఎత్తున ప్రచార పటాటోపంతో ముందుకు తెచ్చిన నరేంద్రమోడీ మామూలు మనిషేనని ఆయన దగ్గర మంత్రదండం లేదని హనుమంతుని వంటి వెంకయ్య నాయుడితో సహా అనేక మంత్రులు, ఇతర పెద్దలు ముందు జాగ్రత్త చర్యగా పదే పదే మొత్తుకుంటున్నారు. మోడీ దగ్గర మంత్రదండం వుందని ప్రతిపక్షాలు ఎప్పుడైనా చెప్పాయా ? మహామాంత్రికుడని గుజరాత్‌ను మాయా మహలుగా నిర్మించాడని, దేశమంతటికి దానిని వర్తింప చేస్తారని చెప్పింది ఎవరు ? నరేంద్రమోడీ పాచి పాటనే పాడి బోర్‌ కొట్టిస్తున్నారని రాసినందుకు కొందరు భక్తులకు కోపం వచ్చింది. అంతా వ్యతిరేక దృక్పధమే తప్ప బి పాజిటివ్‌గా వుండటంలేదని, అన్నింటినీ తీసుకుని వచ్చి మన కంచాల్లో వడ్డించాలన్నట్లు కొందరు భావిస్తున్నారని, అసలు పౌరులుగా మన బాధ్యతలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదని వాపోతున్నారు.

     దేశం మనకేమిచ్చిందని కాదు మనం దేశానికేమిచ్చామని ఆలోచించటమే దేశభక్తి అన్నట్లుగా గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది కూడా బి పాజిటివ్‌లో భాగమే. మంగళవారం నాడు పార్లమెంట్‌ వుభయ సభలను వుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అంటే ప్రభుత్వం రాసి ఇచ్చిన వుపన్యాసాన్ని చదివి వినిపించటం తప్ప వేరు కాదన్నది తెలిసిందే. దాన్ని పూర్తిగా విన్నవారికి లేదా చదివిన వారికి దేశంలో ఇంక పరిష్కరించాల్సిన పెద్ద సమస్యలేవీ లేవనే భ్రమ కలుగుతుంది. ప్రధాన మంత్రి జన ధన యోజన పధకం కింద తెరిచిన 21 కోట్ల ఖాతాలలో 15 కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయని, 32వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వాటిలో వున్నట్లు చెప్పటానికి గర్వపడుతున్నట్లు రాష్ట్రపతి చెప్పారు.

     ‘జన ధన యోజన,ముద్రా బ్యాంక్‌, సామాన్యుడికి ఆరోగ్యబీమా వంటి పధకాల వంటి పెద్ద ప్రకటనల ప్రభావం ఆచరణలో కనపడాలంటే అనేక దశాబ్దాలు పడుతుంది’ ఈ మాటలు చెప్పింది నేను కాదు, ‘ఒక భక్తుడి అపరాధ అంగీకారం ‘ పేరుతో తనను తాను మోడీ ‘భక్తుడి’గా ప్రకటించుకున్న రేటింగ్‌ సంస్ధ క్రిసిల్‌ మాజీ డైరెక్టర్‌ ముత్తురామన్‌ స్వరాజ్య అనే పత్రికలో తాజాగా రాసిన వ్యాసంలో పేర్కొన్నఅంశమిది.గ్యాస్‌ సబ్సిడీని వదులు కోవాల్సిన అవసరం గురించి ప్రభుత్వం చేసిన ప్రచారఖర్చుకు సరిపడా కూడా స్వచ్చందంగా గ్యాస్‌ సబ్సిడీని వదులు కున్నారో లేదో అనుమానమే. పదహారు కోట్ల కనెక్షన్లకు గాను సబ్సిడీ వదులుకుంది కేవలం 62 లక్షల మందేనని రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు. ప్రపంచంలో తమదే అతి పెద్ద పార్టీ అని పది కోట్ల మంది సభ్యులున్నారని ప్రకటించుకున్న అధికార పార్టీ సభ్యులు కూడా గ్యాస్‌ సబ్సిడీని వదులుకోలేదన్నది స్పష్టం.సభ్యులు కాని మోడీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నారన్నది గమనించాలి.

      హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయంలో దళితుడైన ఒక యువశాస్త్రవేత్తను ఆత్మహత్యకు పురికొల్పిన పార్టీ పార్లమెంట్‌లో సుభాషితాలు చెబుతోంది. దీన్ని కూడా బి పాజిటివ్‌గా తీసుకోవటం సాధ్యం కాదని జెఎన్‌యులోని ముగ్గురు ఎబివిపి విద్యార్ధి నాయకులే ప్రకటించిన తరువాత కూడా ‘సామాజిక ప్రజాస్వామ్యపునాది లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదని అంబేద్కర్‌ చెప్పిన అంశాన్ని రాష్ట్రపతి వుటంకించారు.

      రైతుల సంక్షేమం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సమయంలోనే మహారాష్ట్ర బిజెపి ఎంపీ రైతులు ఆత్మహత్య చేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారిందని, అలాంటి ఫ్యాషన్‌ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వటంలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చేసిన వ్యాఖ్యను కూడా రైతులు ‘సహించారు.’ఇలాంటి విషయాలలో బిజెపి నేతలు పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు మాట్లాడకూడని సమయంలో మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, తగు సమయంలో స్పందించటం లేదని మోడీ భక్తుడు ముత్తురామన్‌ మొత్తుకున్నాడు. ‘ టాంజానియా యువతిపై మూకదాడి సందర్భంగా బెంగలూరులో జాత్యంహంకారం గురించి మాట్లాడటానికి మీడియా అత్యుత్సాహం చూపుతున్న సమయంలో విదేశీ విద్యార్ధులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బిజెపి నేత సదానంద గౌడ వ్యాఖ్యానించటం ఏమిటంటూ దాని బదులు శాంతి భద్రతలు దిగజారాయాని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించవచ్చు. చర్చిలపై దాడులు లేదా దాద్రి వుదంతాలను గట్టిగా ఖండిస్తూ ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తే వాటి భారం ముఖ్యమంత్రులపై పడేది, దానికి బదులు బిజెపి నేతలు మౌనం వహిస్తున్నారు,అలాగే బీఫ్‌ గురించి మాట్లాడకూడని సమయంలో మాట్లాడారు ‘అని కూడా ముత్తురామన్‌ తల మీద కొట్టుకున్నాడు. వీటన్నింటినీ కూడా పౌరులు తమ బాధ్యతగా సహించారా లేదా భక్తులారా ?

     గతేడాది కాలంగా ఎగుమతులు పడిపోయి, పారిశ్రామిక వుత్పత్తి తగ్గిపోయినట్లు అధికారికంగా ఒకవైపు ప్రభుత్వమే ప్రకటించినా జనానికి మతిమరపు ఎక్కువ అనే ధృడాభిప్రాయంతో కిందపడ్డా విజయం సాధించామన్నట్లుగా ప్రభుత్వం తీసుకున్న సరికొత్త చొరవల కారణంగా సులభంగా వ్యాపారం చేసే దేశాల ప్రపంచబ్యాంకు జాబితాలో మన దేశం పన్నెండు ర్యాంకులు ఎగువకు పోయిందని ప్రభుత్వం ప్రకటించుకుంది.అయితే పెట్టుబడిదారులకు మోడీ పదే పదే వాగ్దానం చేసినట్లుగా పన్ను సంస్కరణలు చేయలేదని మోడీ భక్తుడు నిష్టూరాలాడుతున్నాడు. అందుకే మోడీ పాచి పాట పాడి బోరు కొట్టిస్తున్నారన్న వ్యాసంలో కనీసం భక్తులకు కూడా విశ్వాసం కలిగించలేకపోతున్నారని వ్యాఖ్యానించాను.

      పౌరులు డిమాండ్లు చేయటం తప్ప తమ బాధ్యతలను గుర్తెరగటం లేదని శుద్దులు చెప్పేవారు మరి వీటినేమంటారో. మోడీ భక్తుడు ముత్తురామన్‌ చెప్పిన ప్రకారం (సామాన్యులు తిరిగే) విమానాలకు లీటరు పెట్రోలు రు.37 రూపాయలకు పోస్తుంటే విలాసంగా ద్విచక్ర వాహనాలు, కార్లు,బస్సులు ఎక్కే వారికి పెట్రోలు 60 రూపాయలకు పోస్తున్నారు. దీన్ని నోరు మూసుకొని అధిక చెల్లింపు బాధ్యతగా జనం భావిస్తున్నారా లేదా ? పెట్రోలు అసలు ఖరీదు 20 అయితే పన్నులు 40 చెల్లిస్తున్నారా లేదా ? ప్రపంచ మార్కెట్‌లో చమురు ధర తగ్గినా ద్రవ్యలోటు తగ్గించుకోవటానికి ఎప్పటికపుడు పెట్రోలుపై ఎక్సయిజ్‌ పన్ను, వ్యాట్‌ పెంచుతుంటే దేశభక్తులుగా, రాష్ట్ర భక్తులుగా భరిస్తున్నారా లేదా ? దాని వలన ధరలు పెరిగితే నోర్మూసుకొని వస్తువులు కొంటున్నారా లేదా ? వెంటనే పెట్రోలుపై లీటరుకు పది రూపాయలు, డీజిల్‌పై ఆరు రూపాయలు తగ్గించే విషయం పరిశీలించమని ముత్తురామన్‌ కూడా కోరుతున్నాడు. ఆయనను కూడా కమ్యూనిస్టుగా జమకడతారా ?

      పెద్ద ఎత్తున జరిగిన 2జి, కోల్‌గేట్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ తదితర అవినీతి చర్యల పూర్వరంగంలో అనేక మంది తటస్తంగా వున్నవారు మోడీకి ఓట్లు వేశారని రెండు సంవత్సరాల తరువాత కనీసం ఒక గుమస్తాను కూడా శిక్షించలేకపోయారని మోడీ భక్తుడు ఆక్షేపించారు.సోనియా, మన్మోహన్‌సింగ్‌ వంటివారిపై చర్య తీసుకుంటే వేధింపులకు పాల్పడుతున్నారని అంటారు కనుక వారి జోలికి పోవటంలేదు అని ఎవరైనా అర్ధం చేసుకుంటారు. కానీ కోడా, బన్సాల్‌, మారన్‌, రాజా, కనిమొళి, కల్మాడీ వంటివారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. నిర్బయ అత్యాచార కేసును పదినెలల్లో ముగించగలిగినపుడు రోజు వారీ ప్రాతిపదికన అవినీతి కేసులను ఎందుకు విచారించటం లేదు, కొద్ది మందినైనా రాజకీయ నేతలను, అధికారులను అదే మాదిరి జైలుకు ఎందుకు పంపలేదు. దీనికి సంబంధించినదే నల్లధనానికి సంబంధించి అశాభంగం కలిగించారు, ప్రభుత్వం ఏమి చేస్తున్నదో లేదో పట్టుకున్నవారి జాబితా, ఎంత మొత్తం స్వాధీనం చేసుకున్నది స్పష్టంగా తెలియచేయాల్సిన అవసరం లేదా అని అని ముత్తురామన్‌ ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్‌ అంటే నిజంగానే రోడ్లు శుభ్రపడతాయనుకున్నారు అమాయక పౌరులు. అనేక మంది తొలి రోజుల్లో చీపుర్లు పట్టుకొని నిజంగానే వూడ్చారు. తీరా చెత్త పన్ను పేరుతో జనంపై అదనపు భారం మోపుతున్నా కడుతున్నారే. పన్ను సంస్కరణలంటే సామాన్యులపై భారం తగ్గిస్తారేమోనని అందరూ నిజంగానే నమ్మారు. చివరికి సంస్కరణ అంటే సేవాపన్ను 12.36 శాతం నుంచి 14కు రాబోయే రోజుల్లో 16శాతానికి పెంచబోతున్నా నిబద్దతగల ఏ పౌరుడూ ఇదేమి అన్యాయం అనటం లేదే ఇంతకంటే పౌరులు తమ విధులను ఏమి నిర్వర్తించాలి?అందువలన కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు మోడీ సంజాయిషీ ఇవ్వకపోతే మానే కనీసం తన భక్తులకైనా చెప్పకపోతే ఏం జరుగుతుందో వారే రాబోయే రోజుల్లో వారే చెబుతారు. ముత్తురామన్‌ కార్పొరేట్‌ వర్గాల ప్రతినిధి, మతవాది, మితవాది అని కూడా అతని వ్యాసం చదివితే అర్ధం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్ధల వాటాలు అమ్ముతామని చెప్పి అమ్మలేదని విమర్శించటంతో పాటు మతపరమైన చర్యలు తీసుకోని కారణంగా తాను అపరాధాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాడు. అంటే పచ్చిమితవాదుల నుంచి కూడా రానున్న రోజుల్లో మోడీకి కష్టాలు తప్పేట్లు లేవు. ఒకసారి మతోన్మాద పులిని తామెక్కినా జనాన్ని ఎక్కించినా దాన్ని అదుపు చేయాలి లేదా దానికి బలి కావాల్సి వుంటుంది. ఏది జరిగినా దేశం, సామాన్యజనం ఎంతో మూల్యం చెల్లించాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో కనిపిస్తున్న ముప్పు అదే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హిందీలో కుల నిర్మూలనతో సహా 11 అంబేద్కర్‌ రచనలు నిలిపివేసిన మోడీ సర్కార్‌

16 Saturday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Annihilation of Caste, Narendra Modi sarkar, RSS, RSS Double game

అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతినాపగలరా ? అంబేద్కర్‌ భావాలను అడ్డుకోగలరా ?

ఎం కోటేశ్వరరావు

      నిన్నగాక మొన్న పార్లమెంట్‌లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్బంగా ఆయనకు నివాళి అర్పించారు. తియ్యటి మాటలు చెప్పారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం హిందీలో ప్రచురించిన అంబేద్కర్‌ రచనల సంపుటాలలో ఆయన తన జీవిత కాలం దేనికోసమైతే పోరాడారో ఆ అంశానికి సంబంధించి రాసిన ‘కుల నిర్మూలన,’ హిందూయిజపు వైరుధ్యాలు’ అనే ముఖ్యమైన వాటితో సహా పదకొండు పుస్తకాలను మినహాయించి మిగతా వాటిని ప్రచురించింది. కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని అంబేద్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ పుస్తకాలను అచ్చువేయించారు. వాటిలో మినహాయించిన పుస్తకాల గురించి ఇండియా టుడే గ్రూప్‌ ప్రచురణల మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా పనిచేసిన దిలీప్‌ మండల్‌ రౌండ్‌ టేబుల్‌ ఇండియాలో తాజాగా రాసిన ఒక వ్యాసంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో కులము- వార్తా మాధ్యమం మధ్య వున్న సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. కుల నిర్మూలన అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అంబేద్కర్‌ మినహా మరొకరు కాదు. అలాంటి ముఖ్యమైన వాటిని మినహాయించటం వుపస్థ మినహా కన్యాదాన వంటిదే. పూనా ఒప్పందం, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌, గాంధీతో చర్చల వంటి అంశాలున్న పుస్తకాలు ప్రచురణలలో లేవని దిలీప్‌ వెల్లడించారు.’ఎవరో ‘ దీని గురించి చెప్పకుండా ఈ పని జరిగివుండదని ఆ ఎవరో మోడీ సర్కార్‌ తప్ప మరొకరు కాదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలు లేకుండా అంబేద్కర్‌ రచనలను విక్రయిస్తున్నారని వాటిని ఎప్పుడు ప్రచురిస్తారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. ఆంగ్ల పుస్తకాల ప్రచురణ మరింత సంక్లిష్టం అవుతుందంటూ వాటి ప్రచురణ హక్కులను కలిగిన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రాన్ని అంబేద్కర్‌ ఫౌండేషన్‌ తీసుకోలేదని వెల్లడించారు.

      అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని తెలిసి కూడా అలాంటి ప్రయత్నం చేసే ప్రబుద్ధులు వుంటారనేందుకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఓట్లకోసం అంబేద్కర్‌ పేరును పదే పదే ప్రస్తావించటానికి బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు. దానిలో భాగంగానే అంబేద్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను అభినందించారని, ఆయన హిందూరాష్ట్రకు సైతం వ్యతిరేకం కాదని చిత్రించేందుకు పూనుకున్నారు. అయితే ఆయన భావాలు వారి హిందూత్వ ఎజండాకు, మను ధర్మ శాస్త్రానికి కొరుకుడు పడనివి. మను ధర్మశాస్త్రానికి ప్రతినిధి , మారు పేరు బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు అన్నది కొందరి అభిప్రాయం. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆ తిరోగమన భావజాలానికి లోనైన వారు బ్రాహ్మణులు లేదా ఇతర అగ్రకులాలనబడే వారే కాదు, ఆ మనువాదానికి తరతరాలుగా బలై అంటరాని వారిగా, దూరంగా వుంచబడుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు కూడా దాన్నే భుజాన వేసుకొని మోస్తున్నారు. తమ వర్గాలకు తామే ద్రోహం చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. అందువలన అంబేద్కర్‌ భజన చేస్తూనే ఆయన భావాల వ్యాప్తిని విస్తారమైన హిందీ ప్రాంతంలో అడ్డుకోవాలన్న దుర, దూరాలోచనలు తప్ప వేేరు కాదు. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్వాకంపై అంబేద్కర్‌ అభిమానులు, పురోగామి, ప్రజాతంత్రశక్తులు వత్తిడి తెస్తే తప్ప ఆ పుస్తకాలు వెలుగుకు నోచుకోవు. అలాగే మహారాష్ట్రలో వున్న ప్రభుత్వం కూడా బిజెపిదే కనుక ఆంగ్ల పుస్తకాల ప్రచురణకు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని లేదా తానే వాటిని ప్రచురించాలని వత్తిడి చేయటం మినహా మరొక మార్గం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !
  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: