• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: nationalism

జాతీయవాద పులి మీద నరేంద్రమోడీ స్వారీ !

24 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Eurasia, India economy slowdown, Narendra Modi, Narendra Modi fifth biggest geopolitical risk, nationalism

ఎం కోటేశ్వరరావు
ప్రతి ఉగాదికి పంచాంగం చెప్పే పండితుల గురించి మనకు తెలిసిందే. వాటిలో సానుకూల అంశాలు తప్ప ప్రతి కూల అంశాలు సాధారణంగా చోటుచేసుకోవు. మహా అయితే కరవుల గురించి చెబుతారు. రాజకీయ పార్టీలకు పంచాంగం చెప్పే వారు ప్రతికూలంగా చెబితే వారు కార్యాలయాల గేటును ఎలా దాటుతారో వారికే తెలియదు. కనుక అది కూడా బి పాజిటివ్‌గానే ఉంటుంది.


ఉగాది పంచాంగానికి భిన్నంగా ప్రపంచానికి లేదా దేశాలకు ముప్పుగా పరిణమించే వారు లేదా పరిణామాల గురించి చెప్పేరాజకీయ జోశ్యులు కూడా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పని చేసే యూరేసియా గ్రూప్‌ వాటిలో ఒకటి. 2020లో ప్రపంచ రాజకీయ ముప్పుగురించి జనవరిలో ఒక విశ్లేషణను వెలువరించింది. తరువాత మార్చినెలలో దానిని నవీకరించింది. అయినా తొలి పది ముప్పు జాబితాలో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా అమెరికా గడ్డమీద పని చేస్తున్న సంస్ధ గనుక ప్రపంచానికి అమెరికా నుంచి తలెత్తే ప్రధాన ముప్పు జాబితాలో అక్కడి రాజకీయాలను చేర్చదు. కానీ ఈ ఏడాది దానికి భిన్నంగా తొలి ప్రపంచ రాజకీయ ముప్పుగా అమెరికా అంతర్గత రాజకీయాలని పేర్కొనటం విశేషం. రెండవదిగా సాంకేతిక రంగం, వాణిజ్యంలో చైనా-అమెరికా యుద్దం, మూడవదిగా అమెరికా-చైనా రాజకీయ వ్యవస్ధల మధ్య ముదురుతున్న వైరం, నాలుగవదిగా కార్పొరేట్‌ సంస్ధల పోరు, ఐదవదిగా నరేంద్రమోడీ వైఖరిని పేర్కొన్నది.


ఈ జోశ్యం లేదా రాజకీయ అంచనాలకు అనుగుణ్యంగానే తొలి ఎనిమిది నెలల్లో దాదాపు వాటి చుట్టూనే పరిణామాలు జరగటాన్ని గమనించవచ్చు. జనవరి నాటికి కరోనా వైరస్‌ అంశం యూరేసియా గ్రూప్‌ పరిగణనలో లేదు. మార్చినాటికి సవరించినా అప్పటికి అంతగా సమస్య తీవ్రతరం కాలేదు. ప్రపంచ రాజకీయ ముప్పుకు సంబంధించి తొలి ఐదు అంశాలలో పక్కాగా మొదటిది డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలో, రెండవది ఆ పెద్ద మనిషి జిగినీ దోస్త్‌ నరేంద్రమోడీకి చెందాయి.మరో రెండింటిలో ట్రంప్‌కు మద్దతుగా నరేంద్రమోడీ ఉండటం యాదృచ్చికమా ? పధకం ప్రకారం జరిగిందనుకోవాలా ? నాటకీయ పరిణామాల మధ్య తిరిగి ట్రంప్‌ ఎన్నికైతే పాత కౌగిలింతలు కొనసాగుతాయి, సర్వేలు చెబుతున్నట్లుగా జోబిడెన్‌ గెలిస్తే నరేంద్రమోడీ కొత్త ప్రియుడి ప్రసన్నం కోసం ప్రయత్నించాల్సిందే.
2020లో మోడీ తన రెండవ పదవీ కాలంలో ఆర్ధిక అజెండాను ఫణంగా పెట్టి వివాదాస్పద సామాజిక విధానాలను ముందుకు తెస్తారని, మతపరమైన, ఒంటెత్తువాదంతో అస్దిర పరిస్ధితి ఏర్పడుతుందని, విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురుదెబ్బలు తగులుతాయని కూడా యూరేసియా నివేదిక పేర్కొన్నది. ఆర్టికల్‌ 370రద్దు, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు, ఎన్‌ఆర్‌సి, సిఏఏ వంటి అంశాలను మరింత ముందుకు తీసుకుపోతారనే జోశ్యం దానిలో ఉంది. అయితే అనూహ్యంగా కరోనా సమస్య ముందుకు రావటంతో అవి తాత్కాలికంగా తెరవెనుకకు పోయాయి. విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తున్నదే.


రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి ఆర్ధిక అంశాలను విస్మరించి వివాదాస్పద సామాజిక అంశాలను ముందుకు తెచ్చారనేందుకు తార్కాణంగా గత ఏడాది తొలి మూడు నెలల కాలంలో 8శాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగవ త్రైమాస కాలానికి 4.2శాతానికి పడిపోవటం తెలిసిందే. యూరేసియానే కాదు అనేక మంది ఆర్ధిక వేత్తలు చెప్పినట్లు ఈ దిగజారుడుకు కరోనాకు ఎలాంటి సంబంధం లేదు. అనేక మంది ముందే హెచ్చరిస్తున్నా మందగమనం తప్ప మాంద్యం లేదని ప్రభుత్వం బుకాయించిందే తప్ప వాస్తవాన్ని అంగీకరించలేదు. వరుసగా ఆరునెలల పాటు ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో పయనిస్తే దాన్ని అధికారయుతంగా మాంద్యం అని పరిగణిస్తారు. ఇప్పుడు దేశం వర్తమాన ఆర్దిక సంవత్సరం తొలి మూడుమాసాల్లో ( ఏప్రిల్‌-జూన్‌) తిరోగమనం అన్నది స్పష్టం కాగా అది ఏ స్దాయిలో ఉందో ఇంకా వెల్లడించాల్సి ఉంది. దేవుడు నైవేద్యం తినడనే వాస్తవం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లుగా ఆర్ధిక దిగజారుడు ముందే తెలుసు గనుక కార్పొరేట్లకు రాయితీలతో వర్తమాన సంవత్సర బడ్జెట్‌ను రూపొందించారు. కరోనా రాకపోయినా దానితో ఫలితం ఉండేది కాదు. కరోనా రావటంతో ఇప్పుడు అసలు విషయాన్ని దాచి పెట్టి కరోనా పేరుతో విదేశాంగ విధానం, ఆర్ధిక రంగాలలో జాతీయ వాదానికి తెరతీసి దేశ పౌరుల దృష్టిని మళ్లించేందుకు పూనుకున్నారు.


ప్రపంచీకరణ నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతారు. లేనట్లయితే ఆ క్రమంలో దాని ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ మద్దతు దెబ్బతింటుంది అని ప్రముఖ అమెరికన్‌ ఆర్ధిక వేత్త పాల్‌ శామ్యూల్‌సన్‌ హెచ్చరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎలాంటిదో కరోనా వైరస్‌ నిరూపించింది.దాని కంటే ముందే ప్రపంచీకరణ సంగతి తరువాత ముందు మన సంగతి మనం చూసుకుందామని ప్రతి దేశం రక్షణాత్మక చర్యలకు, జాతీయవాదానికి పెద్దపీట వేస్తున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పీఠీన ఉంటే మన దేశం, నరేంద్రమోడీ కూడా అదే బాటలో ఉన్నారు.

ఓకల్‌ ఫర్‌ లోకల్‌ (స్ధానిక తయారీ వస్తువులనే అడగండి) అని మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు, సరిహద్దు సమస్యను సాకుగా చూపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు వంటివి వాటిలో భాగమే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొన్ని జాతీయవాద ధోరణులను చూద్దాం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ గత ఎన్నికల్లో ఆ నినాదంతోనే ప్రచారం చేశాడు. దానిలో భాగంగానే చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించింది. చైనా వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలపై, ఇతర దేశాలపై తాను ఆంక్షలను ప్రకటించటమే కాదు, తన ఆంక్షలను ఇతరులు కూడా పాటించాలని లేనట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటానని అమెరికా బెదిరిస్తున్నది. ఇరాన్‌ నుంచి మన దేశం చమురు కొనుగోలు నిలిపివేయటానికి ఈ బెదిరింపే కారణం.


గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అనుసరిస్తున్న వైఖరితో తలెత్తిన పర్యవసానాల కారణంగా ఇతర మార్కెట్లలో ప్రవేశించేందుకు బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పేరుతో చైనా తన పధకాలను ముందుకు తీసుకుపోతున్నది. కొందరు దీనిని విస్తరణవాదం అని చిత్రిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బ్రిటన్‌ వంటి దేశాలు విస్తరణవాదంలో భాగం మనవంటి అనేక దేశాలను వలసలుగా చేసుకున్నాయి. చైనా ఏ దేశాన్నీ ఆక్రమించలేదు. మిగతా దేశాల మాదిరి వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుంటోంది.


అమెరికా, జపాన్‌లను ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేని ఐరోపా దేశాలు సమిష్టిగా వ్యవహరించేందుకు ఐరోపా యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.అయినా సభ్యదేశాలన్నీ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. దానిలో భాగంగానే యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగింది. వస్తువుల కోసం చైనా, లేదా ఆసియా దేశాల మీద ఆధారపడకూడదనే ధోరణి ఐరోపాలో పెరుగుతోంది. ఐరోపా జాతీయవాదంతో ఐరోపా యూనియన్‌ ముందుకు పోతున్నది.
ఆర్ధిక జాతీయవాదానికి ముద్దు పేరు ఆర్ధిక దేశభక్తి. ఆర్ధిక జనాకర్షక నినాదాలు, చర్యలు ఆచరణలో భాగం. తొలి రోజుల్లో స్వేచ్చా మార్కెట్‌ ఛాంపియన్‌గా ముందున్న నరేంద్రమోడీ ఇప్పుడు దానికి వ్యతిరేకమైన వైఖరిని అనుసరిస్తున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రపంచీకరణలో భాగమైన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు తిరస్కరించటం వాటిలో ఒకటి.( దానిలో చేరితే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని దేశంలోని దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి) తాజాగా చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యల ఆంతర్యమిదే. ఈ రోజు చైనాతో ప్రారంభం కావచ్చుగానీ ఆర్ధిక జాతీయవాదం మరింత ముదిరితే అది మిగతా దేశాల పెట్టుబడులకు, వస్తువులకు సైతం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్ధానిక వస్తువులనే అడగండి, ఆత్మనిర్భరత పేరుతో స్ధానికంగా అవసరమైన వస్తువులను తయారు చేసుకోవాలనే నినాదాలతో మన దేశం కూడా రక్షణ చర్యలకు పూనుకుంది. దీన్నో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఇంతకు ముందు ఉన్న నిబంధనలను సడలించి 200 కోట్ల రూపాయల లోపు వస్తువులు, సేవలను విదేశాల నుంచి పొందకూడదని నిర్ణయించింది. చైనా నుంచి పెట్టుబడులను నిరోధించేందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీన్ని ఆర్దిక జాతీయవాదం అంటున్నారు.


జాతీయవాదానికి అనుగుణ్యంగా ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే అవసరాలను తీర్చుకొనేందుకు తీసుకొనే చర్యలను తప్పుపట్టనవసరం లేదు. కొన్ని సందర్భాలలో తప్పదు. ప్రపంచీకరణలో భాగంగా అమలు జరుపుతున్న ఉదారవాద విధానాలు అన్ని దేశాలకూ ఉపయోగపడటం లేదు. దానికి మన దేశమే చక్కటి ఉదాహరణ. ఇతర దేశాల వస్తువులన్నీ మన దేశంలో కుమ్మరిస్తున్నారు. ఫలితంగా స్ధానిక చేతివృత్తులు, పరిశ్రమలు, చివరికి వ్యవసాయం మీద కూడా ప్రతికూల ప్రభావాల పడ్డాయి.జాతీయ వాదాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు, కానీ జాతీయోన్మాదాన్ని ఎలా చూడాలి. పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడల్లో భాగంగా ఇలాంటి వాటిని ముందుకు తీసుకు వస్తారు.


జాతీయవాదంలో భాగంగా పోలీసు, మిలటరీ కాంటీన్లలో మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత వస్తువుల జాబితాలో పండ్లు తోముకొనే కోల్గేట్‌ పేస్ట్‌ వంటి బహుళజాతి సంస్దల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవేవీ చైనా ఉత్పత్తులు కాదు. నిజానికి కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్రమోడీ అధికారానికి రాగానే ఈ చర్యలెందుకు తీసుకోలేదు? టిక్‌టాక్‌ లేదా ఇతర చైనా యాప్‌లు మన భద్రతకు ముప్పు అని ఆకస్మికంగా గుర్తుకు రావటం ఏమిటి ? అదే నిజమైతే దానికి మోడీ అండ్‌కోను విచారించాలా లేదా ?


దేశంలో 1991నుంచి నూతన ఆర్ధిక విధానాలకు తెరతీశారు. అప్పటి వరకు లేని స్వదేశీ జాగరణ మంచ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి తెచ్చింది. నూతన ఆర్ధిక విధానాలను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు గనుక, తామూ దేశ ప్రయోజనాలకోసమే పని చేస్తామని చెప్పేందుకు ఆ సంస్ధను ఏర్పాటు చేశారు. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమిటి ?


చైనా వస్తువులను విధిగా కొనాలన్న నిబంధనలేవీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ విధించలేదు. ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీలేవీ చైనా వస్తువుల గురించి లాబీయింగ్‌ జరపలేదు, దిగుమతి చేసుకోవాలని అడగలేదు. చైనా పెట్టుబడుల విషయం కూడా అంతే. గత ఆరు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడి కావటానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన అవకాశాలు తప్ప తమ వస్తువులు కొనమని,పెట్టుబడులు తీసుకోవాలని చైనా వైపునుంచి వత్తిడేమీ లేదు. లేదా అమెరికా మాదిరి ప్రతీకార చర్యలు ఉన్నట్లు ఎవరూ ఇంతవరకు చెప్పలేదు.


అన్ని దేశాలూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో భాగస్వాములుగా ఉన్నపుడు దాని నిబంధనలను అమలు జరపటం వాటి విధి. లేకపోతే బయటకు వచ్చే స్వేచ్చ ఉంది. కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరుపుతోందని భావిస్తున్నారు కనుక ఆ పార్టీ విధానాల మంచి చెడ్డల గురించి సహజంగానే ఆసక్తి ఉంటుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా పెట్టుకుంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఏ బంధం ఉందని బిజెపి ప్రతినిధి బృందాలు చైనా పర్యటనకు వెళ్లినట్లు ? నోరు తెరిస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం అంటారు.


భారత్‌-చైనా మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అందువలన రెండు దేశాల ఆర్ధిక వ్యవస్ధలు,ఇతర అనేక అంశాల గురించి రెండు దేశాలను పోల్చటం నరేంద్రమోడీ అధికారంతో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో జరుగుతోంది.చైనాతో మన దేశాన్ని పోల్చటాన్ని కొందరు దేశ ద్రోహంగానూ, చైనా భక్తిగానూ వర్ణిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో ఆ దాడి ఎక్కువగా ఉంది. చైనాతో మన దేశాన్ని పోల్చి ఎక్కువగా మాట్లాడుతున్నదెవరు ? నరేంద్రమోడీ ప్రధాని అయిన ఆరునెలల్లోపే చైనాను సందర్శించిన బిజెపి బృందాలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే రాజకీయ పాఠశాలలను ఎందుకు సందర్శించాయి. మేము కూడా కమ్యూనిస్టు పార్టీ మాదిరే పార్టీని విస్తరిస్తామని, రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిందెవరు? చైనా కమ్యూనిస్టు పార్టీతో పోల్చుకున్నదెవరు?


చైనాను పక్కకు నెట్టి ప్రపంచానికి వస్తువులను అందిస్తామంటూ మేకిన్‌ ఇండియా, ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అని, త్వరలో జిడిపి రేటులో చైనాను అధిగమిస్తామని చెబుతున్నదెవరు ? ప్రతి ఏటా అనుకూలంగానో వ్యతిరేకంగానో చైనా వస్తువుల గురించి మాట్లాడుతున్నది వారే. అంతెందుకు 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సర్వేలో చైనా మాదిరి ఉపాధి, అభివృద్ది గురించి దాదాపు పదిపేజీలు కేటాయించి రాసినవారెవరు ? దీన్ని పోలిక అంటారా మరొకపేరుందా ?ఒక వేళ అదే దేశద్రోహం అయితే సంఘపరివార్‌ శక్తులే తొలి దేశద్రోహులు అవుతారు. చైనాను పక్కన పెట్టండి, అభివృద్ధి చెందిన దేశాల సరసకు దేశాన్ని తీసుకుపోతామని చెబుతారు. దాన్నేమంటారు ? పోలిక తప్పు కాదు. అయినా పోల్చిన వారిని దేశవ్యతిరేకులు అంటున్నారంటే జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప అది జాతీయవాదమా ? జాతీయోన్మాదమా ?


వలస పాలనను వ్యతిరేకించటం స్వాతంత్య్రానికి ముందు జాతీయవాదం. ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, డచ్‌, పోర్చుగీసు, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలలో జాతీయ వాదం ముందుకు వచ్చింది. తమ దేశం ప్రపంచంలో పై చేయి సాధించాలంటే ప్రపంచాన్ని ఆక్రమించాలనేది వాటి జాతీయ వాదం. చైనా,జర్మనీ, దక్షిణకొరియా, జపాన్‌ వంటి దేశాలతో పోటీపడుతూ వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలను కోవటంలో తప్పు లేదు. వాటిని పక్కకు నెట్టి ఆ స్ధానాన్ని మనమే ఆక్రమించాలనుకుంటే అది సమస్యలకు దారి తీస్తుంది. నాడు జాతీయవాదంతో ఐరోపా దేశాలు పోటీపడి తొలుత ప్రాంతీయ యుద్ధాలు తరువాత ప్రపంచ యుద్ధాలకే పాల్పడ్డాయి. వస్తు తయారీ జాతీయ వాదం ముదిరితే అది వాణిజ్య యుద్దాలకు దారి తీస్తుంది.


అమెరికాను మరోసారి అగ్రస్ధానంలో నిలబెడతానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెబితే మంచి రోజులు తెస్తానని మన నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఇద్దరూ విఫలమయ్యారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటంలోనూ అదే రికార్డు. వైరస్‌ నివారణ రాష్ట్రాల బాధ్యత అని తప్పించుకొనేందుకు పూనుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మహమ్మారులు చుట్టుముట్టినపుడు దేశపాలకులు తమ బాధ్యత లేదని తప్పించుకుంటే కుదరదు. జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోతానని నరేంద్రమోడీ చెప్పారు. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా సాధిస్తారా ? ఏ క్షణంలో అయినా కరోనా కేసుల్లో మన దేశాన్ని అమెరికా సరసన చేర్చే దిశలో ఉన్నారు. నరేంద్రమోడీ ఘోరవైఫల్యంగా ప్రపంచం కరోనా విస్తరణను చూస్తున్నది. అదే విధంగా కరోనా వైరస్‌ను తక్కువ చేసి మాట్లాడటం ట్రంప్‌ ఏలుబడిలోని అమెరికా చరిత్రలో అతి పెద్ద గూఢచర్య వైఫల్యంగా చరిత్రలో నమోదైంది. చరిత్రలో అమెరికా ఎంత ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదో అదే బాటలో భారత్‌ కూడా పయనిస్తున్నది. రెండింటికీ కరోనా ఒక్కటే కారణం కాదు. రాకెట్‌ మాదిరి అమెరికాలో ఆర్ధిక స్దితి తిరిగి దూసుకుపోనుందని ట్రంప్‌ కనీసం మాటలైనా చెబుతున్నారు. నరేంద్రమోడీ నుంచి ఒక్క మాటైనా విన్నామా ?


డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఒకే కంచం-ఒకే మంచం స్నేహితుల మాదిరి ఉన్నారు. ఇద్దరూ తమ వైఫల్యాలను లేదా ఆర్ధిక, కరోనా వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకు వచ్చారు. ఒక రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తున్నదనే పేరుతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. దేశ భద్రతకు ముప్పు అనే పేరుతో చైనా యాప్‌లను మోడీ నిషేధించారు. ఇలా ఇద్దరు స్నేహితులూ ప్రజాకర్షక జాతీయవాద పులి స్వారీ చేస్తున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేనట్లయితే దానికి బలికావాలి ! ఇద్దరు స్నేహితులకు ఆ సత్తా ఉందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నీ ‘దేశ భక్తి, జాతీయవాదం ‘ భారం భరించలేకున్నాం గురూ !

25 Sunday Aug 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP patriotism and nationalism, Naredra Modi, nationalism, patriotism, Rupee Fall

Image result for bjp patriotism and nationalism cartoons

మిత్రమా

వుద్యోగ రీత్యా నువ్వూ నేనూ చాలా దూరంగా వున్నాం. ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కలిసే సందర్భం రాలేదు. అయితే నీ గురించి స్నేహితుల ద్వారా వింటూనే వున్నాను. నీ పేరుకు ముందు చాయ్‌ వాలా, చౌకీదార్‌ అని పెట్టుకున్నావని నవ్వులాటల మధ్య మన స్నేహితులు చెబుతుంటే తత్వంబాగా తలకెక్కింది గామోసు అనుకున్నాను. బహుశా ఇప్పుడు నువ్వు 370 అనో కాశ్మీరీ కన్య అనో పేరుకు ముందు తగిలించుకొని కిక్‌లో వుండి వుంటావు. ఈ మధ్య నువ్వు విదేశీ కిన్లే నీరు బదులు పక్కా దేశీ గోమూత్రం తాగుతూ, చివరికి పతంజలి సబ్బులను కూడా వాడటం మాని ఆవు పేడ ఒంటికి పూసుకుంటూ స్నానం చేస్తున్నావని, ఆఫీసులోనూ బయటా వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత గ్రంధాల్లో దాగున్న టెక్నాలజీని వెలికి తీసేందుకు మరొక పీజీ చేస్తున్నావని, విదేశీ వాట్సాప్‌ తప్ప ఇతర వాటిని పట్టించుకోవటం లేదని, మిస్స్‌డ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎఎస్‌లను చూడటం మానేశావని, మన వాళ్లు చెప్పారు. అందుకే ఈ వాట్సాప్‌ మెసేజ్‌ పెడుతున్నా.

Image result for bjp patriotism and nationalism cartoons

ఆ మధ్యమన ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ప్రచారం చెశారు. ఇప్పుడు 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. మనం చదువుకొనే రోజుల్లో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రాసకోసం నువ్వు తెగ తిప్పలు పడి నగుబాట్లు పాలైన సందర్భాలు గుర్తుకు వచ్చాయి. అదేమిటో నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు. ఆ వాక్‌ ప్రభావం లేదా మహత్తు ఏమిటో గానీ నరేంద్రమోడీ అలా అన్నారో లేదో మరోసారి రూపాయి విలువ ఇలా 72రూపాయల అంచుదాకా పడిపోయింది. నరేంద్రమోడీ ఇప్పుడు కొత్తగా ఆకర్షించాల్సిన వారెవరూ లేకపోయినా పాపం ప్రాస కోసం కష్టపడుతున్నట్లుంది.

ఆరు సంవత్సరాల క్రితం అంటే 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే నువ్వు బిజెపి నేతలు రూపాయి పాపాయి గురించి చేసిన వ్యాఖ్యలను పదే పదే చెప్పి మాకు నవ్వు రాకపోయినా మా బదులు కూడా నవ్వే వాడివి గుర్తుందా ? ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.(2012)రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది.(2013) అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. సుష్మా స్వరాజ్‌ , అరుణ్‌ జైట్లీ మరణించి ఏ లోకాలకు పోయారో పాపం. ‘ రూపాయి విలువ ఎంత వేగంగా పతనమైందంటే గత రాత్రి టీవీ చూస్తూ భయపడి టీవి కట్టేశాను’ అని సుష్మ అన్నారు. రూపాయి విలువ పతనం భయానకంగా వుంది, ప్రధాని నుంచి స్పందన రావాలని డిమాండ్‌ చేస్తున్నా అన్నారు అరుణ్‌ జైట్లీ. ఇప్పటి కేంద్ర మంత్రి, అప్పటి ప్రతిపక్ష బిజెపి నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ‘ యుపిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ(డాలరుతో మారకం) రాహుల్‌ గాంధీ వయసంత( 43 )వుంది, ఇప్పుడు సోనియగాంధీ వయస్సు(67) దగ్గరగా వుంది, త్వరలో మన్మోహన్‌ సింగ్‌ వయస్సు(80)ను తాకుతుంది ‘ అన్న ప్రకటన చదివి అప్పటికే నరేంద్రమోడీ బిజెపి ప్రధాని అభ్యర్ధి అని వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని మా మోడీ వస్తే చూడండి రూపాయి విలువను రాహుల్‌ గాంధీ వయసంత చేస్తా అని గంతులు వేయటం గుర్తుందా ? దాని సంగతేమోగానీ ఇప్పుడు మోడీ గారి వయస్సు(68)ను దాటి నాలుగు అంగలు వేసింది. అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నవ్వుతూనే వున్నావా ?

Image result for bjp patriotism and nationalism are two cost to bear cartoons

జనానికి మతిమరుపు లేదా మోహంలో వున్నపుడు ఏమి చెప్పినా తలకు ఎక్కించుకోరు, ఎదురు మాట్లాడరు అని డిగ్రీలో మన లెక్చరర్‌ పదే పదే చెప్పేవారు గుర్తుందా ? గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు. అంతేనా ఆర్ధికశాఖ నుంచి విద్యుత్‌ శాఖకు మార్చి నా స్ధాయి తగ్గించారు, నా పరువు తీశారు, నేను వుద్యోగం మానుకుంటా ఆమోదించండి అని ప్రకటించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ గతేడాది ఆర్ధికశాఖ అధికారిగా స్పందిస్తూ ఏమన్నారో తెలుసా ‘ ఈ పతనానికి కారణం లేదు. మీరు ఆందోళన చెందుతున్నారు. ఇతర కరెన్సీల విలువలు కూడా పతనమౌతున్నపుడు రూపాయి 80కి పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ‘ అని సెలవిచ్చారు.

మాకు అర్ధశాస్త్రవేత్తలకు కొదవ లేదు చూడండి అంటూ నువ్వు పదే పదే వుటంకించే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి 2018 సెప్టెంబరులో 74రూపాయలకు రూపాయి విలువ పడిపోయినపుడు సరికొత్త కారణాన్ని ఆవిష్కరించారు. నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.

ఇలాంటి నాయకులు ఏది చెబితే దాన్నే ప్రమాణంగా భావించి స్వంత బుర్రను వాడకుండా వాటినే పట్టుకొని వాదించే ఓ మూర్ఖ శిఖామణీ (ఇది మన మిత్రులు నీకు పెట్టిన పేరు ) రూపాయి విలువ ఎంత పతనం అయితే అంతగా నల్లధనం తగ్గినట్లా ? ఆ లెక్కన దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున పేరుకు పోయిందని దాన్ని బయటకు తీస్తామని చెప్పిన బిజెపి నేత నరేంద్రమోడీ జనాన్ని మోసం చేసినట్లు అనుకోవాలా, సుబ్రమణ్య స్వామి లాంటి వారు జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారా ? స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. నోట్లను రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప నరేంద్రమోడీ ఘనత ఏముంది ? 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి దృష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.

బిజెపి మార్కు దేశ భక్త మిత్రమా 2004 నుంచి వార్షిక రూపాయి విలువలు ఎలా వున్నాయో, నరేంద్రమోడీ పాలనలో ఎలా పతనం అయ్యాయో దిగువ ఇస్తున్నాను. ఆధారంగా లింక్‌ కూడా ఇస్తున్నాను. https://www.bookmyforex.com/blog/1-usd-to-inr-in-1947-2019/ సంవత్సరాల వారీ డాలరుతో రూపాయి విలువ ఇలా వుంది. యుపిఏ పాలన-ఎన్‌డిఏ పాలనలో రూపాయి విలువ పతనం ఒక్క రూపాయే అన్న ఒక ఫేక్‌ న్యూస్‌ను నువ్వునాకు షేర్‌ చేశావు.

సంవత్సరం రూపాయి విలువ

2004   45.32

2005   44.10

2006   45.31

2007    41.35

2008    43.51

2009    48.41

2010    45.73

2011    46.67

2012     53.44

2013     56.57

2014     62.33

2015     62.97

2016     66.46

2017     67.79

2018    70.09

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ హయాంలో 65.93కు పతనమైంది. అయినా నరేంద్రమోడీ కాలంలోనే రూపాయి పటిష్టంగా వుందని అడ్డగోలుగా వాదించే వారికి ఈ వాస్తవం రుచించదు. దీని అర్ధం యుపిఏ పాలన బాగుందని కాదు, మన్మోహన్‌ సింగ్‌కు కితాబు ఇవ్వటమూ కాదు. యుపిఏ, ఎన్‌డిఏ రెండూ అనుసరించినవి ఒకే దివాలా కోరు ఆర్ధిక విధానాలే, ఒకదానికి ఒకటి కొనసాగింపు మాత్రమే. మిత్రమా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు చౌక అయినా ఎగుమతులు పెరక్కపోగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురు వంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి జనం నడ్డి విరుస్తున్నాయి. అందుకే దేశభక్తి, జాతీయవాదంతో మీ వంటి వారి నిర్వాకం భరించలేనిదిగా తయారైంది గురూ అని చెబుతున్నా. ఇలా చెప్పిన వారిని మీరు దేశద్రోహులు అనే అంటారు. అలా పిలిపించుకోవటానికి నేను సిగ్గు పడను.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Religion-based Nationalism is back in Full Force

01 Friday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

anti-colonialism, communalism, Hindu Rashtra, Hinduthwa, nationalism, Religion-based Nationalism, Romila Thapar, two-nation theory

Sabrang India – March 29, 2016

Written by Romila Thapar

In the 1960s we were confident that the use of religion for political mobilisation would decline because nationalism, namely, the secular, all-inclusive, anti-colonialism nationalism that brought us independence, would, despite Partition, be firmly established. This was in some ways such a firm belief that it was not thought necessary to specify the inclusion of secularism in the Constitution at the initial stage. This has not happened. Religion as political mobilisation, and religion-based identity as the core of nationalism, sometimes called communalism, is back in full force.

Historians and other social scientists do not make predictions. Our inability to do so is because there may always be some irrational factor in our society that intervenes. So we can only analyse what went wrong and make some suggestions for how to put it right.

It is useful to consider the changing contours of communalism in post-colonial India since the parameters and the historical context are no longer the same as they were in colonial times. There was, to begin with, an anti-colonial relatively secular nationalism that pre-dated and was distinct from communalism, both Muslim and Hindu.

Communalism was born out of colonial policy, and took as its foundation the dubious two-nation theory that culminated in two categories of communalism – Muslim and Hindu. The first led to the creation of Pakistan. Hindu communalism is awaiting its fulfillment.

Communalism continues to have a role in the politics of post-colonial India, but this is not identical with its earlier role. The prime reason for anti-colonial secular nationalism has ostensibly been removed after independence, since we are no longer a colony and do not require an anti-colonial nationalism. But we still have to contend with the kind of communalism, that is aspiring to a Hindu Rashtra, of the 1930s vintage.

Interestingly the defining of this form of a nation, is embedded in the colonial interpretation of Indian society. It goes back to the nineteenth century interpretation of Indian history by James Mill who spoke of the two nations that have always constituted India – namely, the Hindu and the Muslim.

The two-nation theory fueled communalism, assisted by another colonial contribution which was the Census that led to describing Indian society as consisting of a majority community and minority communities. To this was added the colonial theory of the foundation of Indian civilisation being the Aryanism of the Vedas. This contributed to the concept of the nation as a Hindu Rashtra and the Hindu therefore being the primary citizen of India.

Whereas the major nationalism of anti-colonialism led the movement for independence, the colonial perceptions of the history and society of India, gave root to the two communal nationalisms in the form of the Muslim league and the Hindu Mahasabha – to be replaced with the RSS. These latter two did not support secular anti-colonial nationalism but instead focused on opposing each other.

Subsequent to Independence, secular nationalism was no longer confronting a colonial power, but instead, it had to confront the power of identity politics that draws on religious extremism. The need for awareness to check the activities of religious extremism was under-estimated. Both Islamisation and Hindutva took the path of concretising Islamic and Hindu identities as oppositional.

Indian Governments have each to a greater or lesser extent, been party to such politics. We have experienced extreme violence against various minorities – Muslim, Sikh, Christian, Dalits. It has been and continues to be a serious threat to democracy in India.

It is difficult to establish a functioning democracy in a society where there are special categories of privileged and under-privileged groups, and majority and minority communities based on religious identities with varying rights ; and an ideology that endorses the two-nation theory, where religion, caste, and language, become identities. It is difficult because democracy requires the reverse of this – it means equal rights for all and an equality in laws applicable to all citizens.

Many of our problems come from an unquestioned inheritance that we have accepted of colonial policy, administration and law. We continue to base our identities derived from religion and caste on those that the colonial system imposed on us. If we were to question these, something different may well emerge.

I often wonder whether all post-colonial societies nurture continuity and conservatism by clinging to what their colonizers had taught them about who and what they were and are ?

Communalism was born out of colonial policy, and took as its foundation the dubious two-nation theory that culminated in two categories of communalism – Muslim and Hindu. The first led to the creation of Pakistan. Hindu communalism is awaiting its fulfillment.

It would be interesting to do a comparative study with African and Caribbean nationalism, for instance, that saw the emergence of theories such as Negritude and where people read Aimee Cesare and Leopold Senghor when constructing their nationalisms. Did they also go back to colonial versions of their past or did they question these versions?

Are the ideologies of religious and cultural extremism invariably drawn from the interpretations of the society and culture of the ex-colony as constructed by the colonisers ? In other words do we have to endorse the identities that British colonialism imposed on us? Can we not instead question these identities and consider alternatives. The continuation of such identities is inherently anti-democratic. They were meant for a colony not for a free democracy.

This debate has been going on for a while now. There is a need to change the premises.

Instead of speaking of the past only in terms of who victimised whom, (and as we all know such theories of victimisation are easily constructed), we should instead look more carefully at what we want from the present and what from the past can help us construct a more positive present.

We have to recognise that we too, like every other society with a long past, have not been a society characterized by tolerance and non-violence. However much we may wish to believe that we were tolerant and non-violent, it simply isn’t true.

Such theories served their purpose in the days when we were contesting colonialism. But they are not of much help now with the constant daily actions that we witness or even experience, of intolerance and violence, and it seems to increase by the day. But we cannot suddenly have become violent and intolerant. There have to have been some elements of such behaviour in us in the past as well, which we perhaps kept under better control. It would be salutary to investigate why there was less of violence and intolerance in the past, if that was so?

Our texts from pre-Islamic times tell us that there were two streams of dharma that were dominant – the Brahmanical and the Shramanic. The latter were the Buddhists, Jainas, Ajivikas and such like. There are rulers that insistently call for tolerance among the sects as in the edicts of Ashoka Maurya, or there are references to conflicts between sects in Sanskrit texts, or in accounts of visitors to India in those times.

Patanjali, the great grammarian of around the second century BC, refers to the two streams of dharmaas dominant, and adds that their relationship can be compared to that of the snake and the mongoose. Buddhism was finally exiled from India. Sectarian conflicts continued into Islamic times with now an additional factor.

As far as intolerance goes, we must also remind ourselves that every religion in India discriminated against what we today call the Dalits. Even the religions that claimed that all men are equal in the eyes of God, did not give them equality.

Islam and Christianity did not have a category of Dalits outside India, but in India, Muslim, Christian and Sikh Dalits were segregated and lived separately. These are aspects of our society that we still have to come to terms with. We cannot claim to have been a tolerant society in the past by ignoring our treatment of some sections of society that we are now trying to amend. Intolerance does not refer only to religion. It also refers to the demeaning of another human being.

If we want a democracy then it has inevitably to be secular, and not give rights to privileged groups. This is irrespective of whether the claim is that such rights are justified by status or by numbers. It means that institutions of society have to be so organized that privileging a group becomes redundant.

This means a constant check on the functioning of those institutions that sustain a democracy to ensure that they are doing so. This also means being aware, for instance, that institutions of education where we learn about secular democracy, and are socialised to belonging to a democratic society, are not dismantled, or are replaced with teaching that is anti-democratic. This is a serious threat.

It also means changing the mind-set of institutions and people to encourage them to understand and support a democratic society.

What are the major institutions that would be involved with this?

The Constitution is based on values of secular democracy but most of us know so little about it. Perhaps we should be more aware of how it defends democracy. This would also involve greater knowledge about the functioning of the judiciary – so crucial to the current many crises.

We have to recognise that we too, like every other society with a long past, have not been a society characterized by tolerance and non-violence. However much we may wish to believe that we were tolerant and non-violent, it simply isn’t true.

The Code of Civil Laws should be geared to eliminating the continuing discrimination against Dalits, Adivasis and women. We also need to check from time to time to ascertain as to how affirmative action is working and who is benefitting from it.It does seem curious – and this question is now being commonly asked – as to why dominant castes in so many parts of the nation are taking to violence to ensure that they be given reservation rights, some of which are reserved only for those that have an under-privileged status.

A major positive change can be brought about if quality education is made available to all. The aim should not be just for literacy but also to teaching the young how to think, how to question their world, and how to improve it. The aim should be to impart how to handle knowledge and why this is important. Education is not just the acquiring of information. We have to remember that in the coming generation virtually half the population will be young adults with aspirations.

We have to ensure basic human rights so that five hundred million Indians can live with dignity. We have to think of how we can perhaps insist that our administrators, those that run our institutions as well as those that are required to protect us, be taught that their prime function is to protect the rights and the person of the Indian citizen ? Subservience to authority is not what is required from them. They have to be encouraged to be helpful to the citizen.

May be that if we begin to make these our demands and do so with a firm commitment, then some of the indignities associated with the communal mind-set, and that are so common in our society, may start to fade.

Communalism is ultimately an attitude of mind among people based on the assumption that whatever is told to them by their mentors is all they need to know. It shows a disinterest in knowing better. To focus therefore solely on the rights of religious communities – whether of the majority or the minority – ultimately has a limited purpose. This will not terminate communalism.

It seems to me that we have to think of other ways by which identities are defined. We seem to have arrived at a point when communal ideas and activities are taken as legitimate nationalism. We have to disentangle nationalism from communalism. No group has a monopoly on claiming that its activities alone, constitute nationalism, and all others are anti-national. We have to reconstruct nationalism in an inclusive, secular mode, to allow every Indian to participate equally and with equal rights.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జెఎన్‌యు ఘటనల్లో మీడియా విశ్వసనీయతను దెబ్బ తీసిన కొన్ని సంస్ధలు

08 Tuesday Mar 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, Bjp nationalism, credibility, JNU, JNU ROW, journalists, Media, media credibility, nationalism

జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

ఎం కోటేశ్వరరావు

    చదువరులను చంపటానికి రచయిత తన పెన్నును గన్నుగా వుపయోగిస్తాడని ఒక పెద్దమనిషి చెప్పాడు.టీవీలు తలుచుకుంటే విద్యార్ధుల జీవితాలను అంతం చేయటానికి, విద్యా సంస్ధల పరువు ప్రతిష్టలను గంగలో కలపటానికి నకిలీ వీడియోలను వీక్షకుల ముందుంచుతాయని తాజాగా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) వుదంతాన్ని చూసిన తరువాత ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని టీవీ ఛానల్స్‌ ప్రసారం చేసిన రెండు వీడియోలు నకిలీవని తిమ్మిని బమ్మిని చేశారని హైదరాబాద్‌లోని ట్రూత్‌ లాబ్‌ వెల్లడించింది. దీంతో మొత్తం మీడియా పరువు కాలుష్య గంగలో కలిసింది . ఏప్రిల్‌ ఒకటవ తేదీన చదువరులను, వీక్షకులను ఫూల్స్‌ చేయటానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు చేసేవిన్యాసాలలో అలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తాయి, చివరిలో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భం అని చెబుతాయి. కానీ ఇప్పుడు అటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. వాటిని చూసి ఎవరైనా దాడులకు దిగినా ఆశ్చర్యం లేదు. అంతగా మీడియా విశ్వసనీయత కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు.

   మీడియా నిష్పాక్షికంగా వుండదని తెలుగు నేలలో జనానికి 1940,50 దశకాలలోనే తెలుసు.కమ్యూ నిస్టులకు వ్యతిరేకంగా, మహత్తర తెలంగాణా సాయుధ పోరాటాన్ని దెబ్బతీసేందుకు కట్టు కధలకు మీడియా పుట్టినిల్లని అవగతమైంది.తరువాత నాలుగు దశాబ్దాల క్రితం అత్యవసర పరిస్ధితి సమయంలో కొన్ని పత్రికలు నిరంకుశత్వాన్ని, నియంతలను కూడా ఎలా బరపరుస్తాయో దేశమంతా చూసింది. బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు కూడా మీడియా వెనుకాడదని ఆ సమయంలో మరి కొన్ని పత్రికలు, టీవీలు రుజువు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు టీవీ, పత్రికలను స్వయంగా ఏర్పాటు చేసుకుంటే, మరికొన్ని పార్టీలు స్వతంత్రముసుగులో పనే చేసే వాటిని తమ బాకాలుగా మలుచుకోవటమూ తెలిసిందే. ఇప్పుడు జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

     ప్రతి కీలక సమయంలోనూ మీడియా రెండు తరగతులని వెల్లడి అవుతూనే వుంది. స్వాతంత్య్రానికి ముందు ప్రధాన స్రవంతి మీడియా రెండు రకాలు. ఒకటి స్వాతంత్య్రాన్ని కోరుకున్న దేశ భక్త తరగతి, రెండవది బ్రిటీష్‌ వారి పాలన కొనసాగాలని పాటుపడిన రాణీగారి ప్రతిపక్ష తరగతి. ఇప్పుడు కూడా మీడియా ఒకటిగా లేదు. ప్రజా వుద్యమాలు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రచార మీడియా . మిగతా వాటిలో ఎన్నో వుప తరగతులున్నాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేము. కొన్ని పెట్టుబడులతో నడిచేవే అయినప్పటికీ లౌకిక, వుదారవాద విలువలకు కట్టుబడుతున్నాయి. మరికొన్ని కుల, మతోన్మాద శక్తులకు , తిరోగమన భావాలకు పెద్ద పీట వేస్తున్నాయి. వీటి గురించి లోతైన విశ్లేషణ జరగాల్సి వుంది. ప్రస్తుతం జెఎన్‌యు సంబంధిత వ్యవహారాల సందర్బంగా మీడియా ఎలా వ్యవహరించింది అన్నదానికే పరిమితం అవుదాము.

   జెఎన్‌యు పరిణామాలను చూసిన అనేక మంది భారత్‌లో ఏదో అవాంఛనీయ పరిణామం జరగబోతోందని భయపడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. వర్షం రాబోయే ముందు మట్టికి ప్రత్యేక వాసన వస్తుంది. అది మధురంగా వుంటుంది. కానీ జెఎన్‌యు పరిణామాల సందర్భంగా కొన్ని మీడియా సంస్ధలు వ్యవహరించిన తీరు అశుభాన్ని సూచించింది. ఇక్కడ శుభం-అశుభాల గురించి విశ్వాసం సమస్య కాదు. ఒక ప్రమాదకర, ఏకపక్ష భావజాలానికి అనుగుణంగా ఒక వర్గం మీడియా తన వంతు నృత్యం చేయటం నిజంగా భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక అని చాలా మంది భావిస్తున్నారు. ఇటువంటి ధోరణులు గతంలో లేవా అంటే బాబరీ మసీదు విధ్వంసం, గుజరాత్‌ మారణహోమం, అనేక ప్రాంతాలలో జరిగిన మత దాడులు, ఘర్షణల సందర్భంగా కూడా వెల్లడైంది. దానితో పోల్చి చూసినపుడు ఇది మరింత ప్రమాదకరం.బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను ఎదిరించేందుకు మన దేశంలో ముందుకు వచ్చిన జాతీయ వాదానికి, ప్రపంచ ఆక్రమణకు హిట్లర్‌ ఎంచుకున్న జాతీయ వాదానికి తేడా వుంది. దానిని గుర్తించితే ఇప్పుడు దేశంలో ముందుకు తీసుకు వస్తున్న జాతీయ వాదం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హిట్లర్‌ జాతీయ వాదంలోని కొన్ని ప్రమాదకర లక్షణాలు కాషాయ మార్కు జాతీయ వాదంలో వున్నాయి. పాకిస్ధాన్‌ వ్యతిరేకతే అసలైన దేశభక్తిగా , కొన్ని సమస్యలపై తమ వైఖరితో ఏకీభవించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రించి, వారిపై రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. హిట్లర్‌ నాడు యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే నేడు ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారన్నది ఒక అభిప్రాయం. నాడు అనేక మంది హిట్లర్‌ ప్రచారానికి ప్రభావితులై రాగల ప్రమాదాన్ని చూసేందుకు నిరాకరించి ఒక చివరకు వెళితే అదే జర్మనీలో నేడు హిట్లర్‌ పేరును పలకటానికి కూడా జనం ఇచ్చగించకుండా వుండం, జాతీయ వాదం అంటేనే ఆమడ దూరం పోవటం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనిపిస్తోంది. అయితే జర్మన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని ఎంతగా నాశనం చేసిందో, మన దేశంలో ముందుకు తెస్తున్న కుహనా జాతీయ వాదం అదే స్దాయిలో నష్టాలను కలిగించవచ్చు.

      ఈ పూర్వరంగంలో చరిత్ర పాఠాలు తీసుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద లేదా ? వాస్తవాలకు విరుద్దంగా యాజమాన్యాల మనసెరిగి వార్తలనుమలచటం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ కొట్టిన పిండే.అది నైతికమా కాదా అన్న చర్చ వచ్చినపుడు వెల్లడౌతున్న ధోరణులేమిటి? మనకు వేతనాలిచ్చి పనిచేయించుకుంటున్నపుడు యజమానులు చెప్పినట్లు నడుచుకోకపోతే వుద్యోగాలు వుండవు కదా అన్నది ఒకటి. యజమానుల ఆదేశాలు ఎక్కడా రాతపూర్వకంగా లేదా సాక్ష్యాలకు ఆధారాలు లేకుండా వుంటాయి కనుక, వుద్యోగం కావాలంటే వారు చెప్పిన తప్పుడు పనులు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతి పదికిలోల బియ్యానికి ఒక కిలో మట్టి పెడ్డలు కలపమని మిల్లు యజమాని ఒకసారే చెపుతాడు. ఎప్పుడైనా పట్టుపడ్డారనుకోండి, కార్మికులే సరిగా మట్టి పెడ్డలను తొలగించలేదని జనం ముందు కేకలు వేస్తాడు, కేసులు వస్తే ఒకరో ఇద్దరో చిరుద్యోగులను బలి చేస్తాడు. అలాగే మీడియా సంస్ధలు కూడా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదు. అందువలన వార్త పవిత్రమైనది కాదు. తెనాలిరామకృష్ణ సినిమాలో నియోగి అంటే ఎలా కావాలంటే అలా వినియోగ పడేవాడు అని భాష్యం చెప్పినట్లుగా ఇప్పుడు వార్త వున్నది. కనుక ఎవరైనా మేము పక్షపాత రహితంగా వార్తలు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారంటే అనుమానించాల్సిందే. జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఇటీవల మన కళ్ల ముందే జరిగిన రిలయన్స్‌ కంపెనీ గ్యాస్‌ దొంగతనానికి పాల్పడటం గురించిన వార్త అందరికీ ప్రాముఖ్యత కలిగినదే, కానీ కొన్ని పత్రికలు, టీవీలు ప్రముఖంగా ఇస్తే మరికొన్ని ఆ ఏదో జరిగిందటలే అన్నట్లు ఇచ్చాయి. ఏ కోర్టులైనా జోక్యం చేసుకొని సిగిరెట్‌ పాకెట్లు, మద్యం సీసాలపై చట్టబద్దమైన హెచ్చరికల మాదిరి మా వార్తలు మా యజమానుల ఆలోచనలకు లోబడే వుంటాయి అని ఆదేశిస్తే ప్రతివార్తకూ కాకపోయినా ప్రతి పేజీలో పాఠకులకు కనపడేట్లు, టీవీలలో అయితే కింద స్క్రోలింగ్‌ వేసుకోవాలి. అలాంటి హెచ్చరికలు వున్నా మద్యం, సిగిరెట్లు తాగే వారు లేరా అంటే ఆ విషయం ఆదేశించిన వారికీ తెలుసు.

    ఇప్పుడు అలా చేయటం లేదు అంతా నిఖార్సయిన పక్కా నిజమైన వార్తల పేరుతో నడుస్తోంది. అవి వివాదాస్పదం అయినపుడు లేదా కొందరికి కోపకారణమైనపుడు బలౌతున్నది జర్నలిస్టులు తప్ప యజమానులు కాదు. వేతనాలు తీసుకొని పని చేస్తున్నంతమాత్రాన తప్పుడు పనులు చేయాలని లేదు.మనం నాగరికులం, దేశ పౌరులం, మనకూ బాధ్యతలు కూడా వున్నాయని గుర్తించాలా లేదా ? జెఎన్‌యు వుదంతంలో ‘ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తూ అనేక మంది విద్యార్ధుల కలలు,ఆశలూ, ఆకాంక్షలూ జీవితాలను నాశనం చేసేందుకు పూనుకున్న వైఖరికి నిరసనగా తన వుద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ తన లేఖలో పేర్కొన్నాడు. తనకు మరొక సంస్ధ వుద్యోగం ఇవ్వదని కూడా చెప్పాడు. వర్తమాన మీడియా పరిస్ధితులపై ఇంతటి తీవ్ర విమర్శ, వుద్యోగ భద్రత, స్వతంత్ర అభిప్రాయాలను సహించలేని యాజమాన్యాల ధోరణిపై విమర్శ, నిరసన ఇంతకు ముందు వెల్లడి కాలేదేమో. టీవీ ఛానల్స్‌ జబ్బు పడ్డాయని ఎన్‌డిటీవీ ఎడిటర్‌ రవీష్‌ కుమార్‌ తన నిరసన లేదా ఆవేదన వ్యక్తం చేసేందుకు తన కార్యక్రమాన్ని మొత్తంగా చీకట్లోనే నిర్వహించి మీడియాలో జీవితాలను నాశనం చేసే వారే కాదూ కాపాడాలని కోరుకొనే వారూ కూడా వున్నారని, అందుకు సహకరించే యాజ మాన్యాలు కూడా లేకపోలేదని లోకానికి తెలియ చెప్పారని అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని విధించటానికి నిరసనగా కొన్ని పత్రికలు తొలి రోజులలో సంపాదకీయాల స్ధానాన్ని ఖాళీగా వుంచి పాఠకులకు అందించాయి. ఇప్పుడు జెఎన్‌యు విద్యార్దుల వ్యవహారంలో పోలీసులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నాటి పరిస్థితులను తలపిస్తున్నదని గానీ లేదా మీడియాలో కొందరి హానికరమైన పోకడలను ఎత్తి చూపేందుకు గానీ ఎన్‌డిటివీ ఇలా చేసి వుండవచ్చని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఏమైనా ఇది హర్షణీయమే. ఈ చర్యపై కూడా విరుచుకుపడుతున్నవారు లేకపోలేదు. కొన్ని వుదంతాలను పేర్కొని అప్పుడు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చేసినది సరైనదే అని ముందు వారు అంగీకరిస్తే తరువాత గతంలో ఎందుకు చేయలేదు అని అడగటానికి వారికి నైతికంగా హక్కు వుంది. కానీ వారి తీరు అలా లేదు.అయినా ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలా లేదా ? చర్చ జరగనివ్వండి.

     జెఎన్‌యుపై దాడి చేయటానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అక్కడ జరిగిన ఘటనలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకును సమకూర్చేందుకు తిమ్మిని బమ్మిని చేసి వీడియోలను తయారు చేశారు.వాటిలోని అంశాలు కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యాయి. అసలు వాటిని ఎవరు తయారు చేశారు, ఏ ప్రయోజనాల కోసం తయారు చేశారు అన్నది బయటకురావాల్సి వుంది. పోలీసులు జీ న్యూస్‌లో ప్రసారమైనదానిని బట్టి కేసు నమోదు చేశారు, అలాంటి వీడియో గురించి ఆ న్యూస్‌ అవుట్‌పుట్‌ ఎడిటర్‌ నిరసన తెలుపుతూ రాజీనామా చేయటాన్ని బట్టి జీ న్యూస్‌ పాత్ర వుందా అన్నది అనుమానం. తాను దోషిని కాదని, దానిలో తన పాత్ర లేదని అది నిరూపించుకోవాల్సి వుంది. ఢిల్లీ ప్రభుత్వం నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయనున్నదని వార్తలు వచ్చాయి. నిజంగా చేస్తుందా, చేస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిందే.

    ఆ వీడియోలను ప్రసారం చేయటం ఒక ఎత్తయితే మీడియా యాంకర్లు జెఎన్‌యు విద్యార్ధులను దేశద్రోహులుగా సంబోధించటం, అలాంటి వారికి ఆ సంస్ధ ఆలవాలంగా వుందని చిత్రించటం, వారిపైకి జనాన్ని వుసిగొల్పేలా వ్యవహరించటం తీవ్రమైన అంశం. దేశ ద్రోహం, లేదా దేశ వ్యతిరేకి అని కేసులు పెట్టే పోలీసులే నిందితుడు అని పేర్కొంటారు తప్ప నిర్ధారణగా రాయరు. అలాంటిది మీడియాలో పనిచేసేవారు అలా ఎలా చెబుతారు.ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వుంది. టైమ్స్‌ నౌ ఛానల్‌లో దానిని ప్రసారం చేశారు.దాని గురించి సీనియర్‌ జర్నలిస్టు సిద్ధార్ద వరదరాజన్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. తామసలు ఆ వీడియోను ప్రసారం చేయలేదని తమపై అభాండాలు వేసిందుకు క్షమాణలు చెప్పాలని ఆ ఛానల్‌ కోరింది.తొలుత బుకాయించిన సదరు ఛానల్‌ తరువాత చూసుకోకుండా ప్రసారం చేశామని చెప్పుకుంది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతను ఆ వీడియోను ప్రదర్శించమని టైమ్స్‌ నౌ యాంకర్‌ గోస్వామి పదే పదే కోరటం, దానిని అధికారిక వీడియోగానే పరిగణించినట్లు చర్చను నడపటాన్ని చూస్తే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా , విమర్శనాత్మకంగా వున్నట్లు ఎవరైనా ఎలా అనుకుంటారు? కొన్ని ఛానల్స్‌ అసాధారణరీతిలో జెఎన్‌యు వుదంతాన్ని పదేపదే ప్రసారం చేయటం యాదృచ్ఛికమా, ఒకపధకం ప్రకారం జరిగిందా అన్న అనుమానం ఎవరికైనా కలిగితే దానికి కారకులు ఎవరు ? రాజకీయ నేతలు లేదా సాంస్కృతిక సంస్ధగా చెప్పుకుంటూ రాజకీయాలు నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల వారు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు మీడియా వారికి తేడా లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. యావన్మంది దీని గురించి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు,జడ్జి , తలారి పాత్రలను మీడియా పోషించుతోందన్న అభిప్రాయం మీడియాలో పనిచేస్తున్నవారికి ప్రయోజనకరమా, హాని కరమా ?

    తాము ప్రసారం చేసిన వీడియో సాధికారమైనదా కాదా అన్నది సరి చూసుకోలేదని టైమ్స్‌ నౌ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామి తప్పిదాన్ని తప్పించుకొనేందుకు చెప్పారని అనేక మంది భావిస్తున్నారు.కొత్త గనుక అనుభవం లేక చేశామంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్‌ మీడియా మన దగ్గర కొత్తగా వచ్చింది కాదు. గోస్వామి చిన్నవాడూ కాదు, అనుభవం లేని యాంకర్‌ కాదు. దీని గురించి బిబిసిలో నకిలీ వీడియోలను ఏరివేసే విభాగంలో పనిచేస్తున్న మార్క్‌ ఫ్రాంకెనెల్‌ ఏమంటారంటే ఏది నకిలీ ఏది పక్కా అని తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి చోటా వున్నందున ప్రతి ఛానల్‌ ఒక పద్దతిని పాటించి తనిఖీ చేసిన తరువాతే వాటిని ప్రసారం చేస్తుంది. పక్కా వీడియోలో ధంబ్‌నెయిల్‌ చిత్రాలు వుంటాయి, నకిలీ వీడియోలలో వాటిని తుడిపి వేస్తారు. దాన్ని బట్టి అది తిమ్మిని బమ్మిని చేసిందా కాదా అని తేలిపోతుంది. బడా మీడియా సంస్ధలు తమ స్వంత సిబ్బంది రూపొందించే వీడియోలతో పాటు వార్తా సంస్ధలు, జర్నలిస్టులు కాని పౌరులు పంపే వీడియోలను కూడా స్వీకరించి వుపయోగిస్తాయి. అందువలన అవి నకిలీవా, కాదా అనేది ప్రతిదాన్నీ తనిఖీ చేయాలి.ముఖ్యంగా బయటి నుంచి తీసుకున్న వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని ఫ్రాంక్‌నెల్‌ చెప్పారు. మరి దీనిని మన మీడియా సంస్ధలు ఎందుకు పాటించటం లేదు.లేదా కాకపోతే ఖండిస్తారు, మనకు మరో వార్త వస్తుంది, సంచలనంతో రేటింగ్‌ పెరుగుతుంది అని చూసీ చూడనట్లు వూరుకుంటున్నాయా ?అదే అయితే మీడియాకు జవాబుదారీ తనం లేదా అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.

   అనేక దేశాలలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.అయితే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లుగా ఎవరికి వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినపుడు పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకే అంతిమంగా పెట్టుబడితో ముడిపడిన మీడియా పని చేస్తుందన్నది మనకు కనిపిస్తుంది. సామాన్య ప్రజా ప్రయోజనాలు, ఆ సంస్ధలలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలకంటే యజమానులే ఆ సంస్ధలకు ముఖ్యం. వారి ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే స్వేచ్ఛను అనుమతిస్తారు.అన్నీ అలాంటి సంస్ధలేనా అంటే ఎప్పుడూ కొన్ని మినహాయింపులు వుంటాయి.అవెప్పుడూ మైనారిటీగా, పరిమిత సంఖ్యలో వుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

స్వర్గంలో గోబెల్స్‌తో కాషాయం భేటీ

08 Tuesday Mar 2016

Posted by raomk in Current Affairs, Literature.

≈ Leave a comment

Tags

Bjp nationalism, Gobbles, nationalism, RSS, saffron Sainik

చివరి భాగం

సత్య

    రంగు రంగుల పూల చొక్కా వేసుకొని మత్తెక్కించే మదన వాసనల సెంటు గుభాళిస్తుండగా గోబెల్స్‌ దిగాడు. వెనుకే జూనియర్‌ రంభ కూడా వుంది. చొంగ కార్చుకుంటూ నోరెళ్ల బెట్టిన కాషాయం గోబెల్స్‌ బదులు ఆమెను ఆబగా చూశాడు. ఇదేం పాడుబుద్ది , ఒకరి ఇలాకాలో వున్న దాన్ని ఇలా చూస్తాడు , ఆ మాత్రం నీతి లేదా అనుకుని చీదరించుకొని కాషాయాన్ని కోపంగా చూస్తూ తలపై చీర కొంగు కప్పుకొని పైకి వెళ్లి పోయింది.

     దాంతో గతుక్కుమన్న కాషాయం నాజీ వందనం చేయటం కూడా మరిచి పోయి అలవాటు ప్రకారం గురువుగారూ అంటూ గోబెల్స్‌ కాళ్లమీద పడిపోయాడు. ఇది వూహించని గోబెల్స్‌ కాళ్లు లాగి పడవేయటానికి వచ్చిన వాడేమో అనుకొని అంతే వేగంగా వెనక్కు తగ్గాడు, దాంతో కాషాయం నేలమీద పడి మోచేతులూ , ముక్కు బద్దలు కొట్టుకున్నాడు.

    దులుపుకుంటూ లేచి నేను సార్‌ కాషాయాన్ని అన్నాడు. గోబెల్స్‌ సాలోచనగా నఖశిఖ పర్యంతం చూశాడు. అక్కడక్కడా స్వస్తిక్‌ బొమ్మలు కనిపిస్తున్నాయి. వెంటనే ఎవరో తోటి జర్మన్‌ అనుకుని తాను ఇక్కడికి వచ్చే 70ఏళ్లు దాటింది కదా, తోటి నాజీలందరూ విచారణ తప్పించుకొనేందుకు ఎటెటో వెళ్లి పోయి రకరకాల వేషాలు వేశారని తెలిసింది, గనుక ఎవరో గుర్తుకు రావటంలేదు ,అయినా ఎవరు నువ్వు అని అడిగితే బాగుండదని వై గెట్‌ ఎస్‌ డిర్‌ అన్నాడు. అర్ధంగాని కాషాయం తనను కాదనుకున్నాడు. వెర్రిమొహం వేసుకు చూశాడు. ఎలా వున్నారు మీరు అని గోబెల్స్‌ జర్మన్‌ భాషలో అడిగాడు. వెంటనే స్పందన లేకపోవటంతో వచ్చిన వాడు తెలుగు వ్యక్తి అని గ్రహించాడు.

    స్వర్గం అంటే తినటం, తాగటం రంభ,ఊర్వశి, మేనక, తిలోత్తమల వంటి వారో లేక వారు బిజీగా వుంటే జూనియర్స్‌తోనో విచ్చల విడిగా తిరగటమే కదా. మన వాడు జర్మనీలో కూడా అలాంటి గ్రంధసాంగుడే గాక మంచి మాటకారి కూడా. కనుక పలు భాషల భామలతో సంబంధాలు పెట్టుకోవాలంటే దాదాపు ముఖ్యమైన భాషలన్నీ నేర్చుకున్నాడు. వాటిలో తెలుగు ఒకటి. వెంటనే జర్మన్‌ యాసలో కాషాయం ఎలా వున్నారు, బాగున్నారా అని అడిగాడు.

    అసలు గోబెల్స్‌ దర్శనం దొరకటమే గొప్ప అనుకుంటే ఇంత ఆప్యాయంగా పలకరింపా అని కాషాయం మరింతగా తబ్బిబ్బు అయిపోయాడు. బాగున్నా బాగున్నా అంటూ ఆనందబాష్పాలు రాల్చాడు

    ఈ మధ్య ఏపికి ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టుల గుర్తింపు, సింగపూర్‌, మలేషియా, తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు, హైదరాబాదు పాతబస్తీని ఇస్తాంబుల్‌గా మార్చటం, భూపంపకం వంటి వార్తలను ఇంటర్‌నెట్‌ తెలుగు పేపర్లలో చదివి తెలుగు వారంటే అల్ప సంతోషులనే భావం ఏర్పరచుకున్నాడు గోబెల్స్‌ . అది బయటకు రానివ్వకుండా మన వాళ్లంతా క్షేమమేనా అని అడుగుతూ బోయ్‌ నాకు విస్కీ మన కాషాయానికి మంచి నీళ్లు పట్రా అని…. సారీ మీరు కూడా విస్కీ తీసుకుంటారా ? ఈ మధ్య మీ దగ్గర ఎక్కడ బడితే అక్కడ విస్కీ దొరుకుతోందటగా అన్నాడు. ఈలోగా బోయ్‌ వెళ్లటం ఒక చేత్తో విస్కీ, మరో చేత్తో మంచినీళ్లు తెచ్చాడు.

    ఫరవాలేదు సార్‌ ఫరవాలేదు సార్‌ అన్నాడే గానీ విస్కీ వద్దనలేదు, నాక్కూడా విస్కీ తెస్తే నీ సొమ్మేమైనా పోయిందా అన్నట్లు మొహం పెట్టి ఇష్టం లేకుండానే మంచినీళ్ల గ్లాసు అందుకున్నాడు కాషాయం. ఇంతలో ఒక సేవకుడు వచ్చి గోబెల్స్‌ చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే కాషాయం మీరు ఎలా వచ్చారు, ఎక్కడ దిగారు అని అడిగాడు గోబెల్స్‌.

    సార్‌ నేను వేద కాల విమానంలో నేరుగా వచ్చాను, వూర్వశీ నిలయంలో రూమ్‌ రిజర్వు చేసినట్లు చెప్పారు, వీలైతే మీ దగ్గరే మంచి రూం ఇప్పిస్తే అన్నట్లు చూశాడు. దానిని పట్టించుకోనట్లుగా ఓకే అయితే మనం సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడే కలుద్దాం అంటూ మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచాడు గోబెల్స్‌.

    ఓకే సార్‌ నేను మూడు గంటలకే వస్తా, వద్దు వద్దు మేము సమయ పాలన పాటిస్తాము,మీరు ముందూ,వెనుకా రావద్దు ,సరైన సమయానికి , సరైన చోటికి రండి అని నవ్వుతూ గోబెల్స్‌ మెట్లు ఎక్కాడు. సార్‌ సార్‌ అంటూ పరుగెత్తి రెండు మెట్లు ఎక్కి తాను తెచ్చిన పరిచయ లేఖను అందచేశాడు కాషాయం.

      సాయంత్రం అనుకున్న సమయానికి ఇద్దరూ వచ్చారు. పొద్దున్నే ఎవరో ఏమిటో తెలిసింది కనుక ఈ సారి పరస్పరం నాజీ వందనాలు చేసుకున్నారు. తన్మయత్వంలో కాషాయం తాను అసలు ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు.

     చెప్పండి కాషాయం ఇప్పుడు మీ మిత్రులంతా అమెరికన్స్‌ కదా ! మా జర్మన్లతో పని పడింది అంటే ఏదో ప్రత్యేకత వుండి వుంటుంది, ఏమిటో చెప్పండి.

    ఏం లేదు సార్‌ మేం ఏం చేసినా కొద్ది రోజుల్లోనే జనానికి వాస్తవం ఏమిటో తెలిసి పోతోంది.మా కార్యక్రమాలన్నీ దెబ్బతింటున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో మా ఏబివిపి పోరగాడు తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. కానీ అది వాస్తవం కాదని వెంటనే పోలీసులు తేల్చేశారు. మీ హయాంలో పార్లమెంట్‌ భవనాన్ని మీరే తగుల పెట్టుకొని ఆ దుర్మార్గానికి కమ్యూనిస్టులే పాల్పడ్డారని చాలా కాలం ఎలా నమ్మించారు సార్‌?

     చూడు కాషాయం ఆ రోజులే వేరయ్యా ! ఇప్పటికీ దాన్ని నమ్మే ఫూర్‌ ఫెలోస్‌ వున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు…..అయినా మీతో వచ్చిన చిక్కు ఇదే …పాడిందే పాడరా అని మీ తెలుగు వారు ఒక సామెత చెబుతారు కదా అంటే అర్ధం నన్ను ఆదర్శంగా తీసుకోవాలి తప్ప నాలాగే చేయకూడదు.

    అదే సార్‌ మేము ఎన్నోసార్లు మా శాఖల్లో ఇదే చెప్పాము. మన పధకాలన్నీ ఎదురు తంతున్నాయి, కొత్త పద్దతులు నేర్పండి అంటే వినకుండా మనం మనుస్మృతి మార్చలేనట్లే అవి కూడా అంతే అంటూ తాతల కాలం నాటివే నేర్పుతున్నారు…… మీరు ఏవనుకోను అంటే నేను ఒకటి చెబుతా…..

అనుకోను లేవయ్యా చెప్పు.

కాదు, ప్రామిస్‌,

ప్రామిస్‌,

అమ్మతోడు .

అమ్మతోడు అంటే భారత మాత తోడు… ఒకే విసుగ్గా అన్నాడు గోబెల్స్‌.

    అక్కడికీ నేను ఒకసారి ఆ గోబెల్స్‌ పద్దతులు మనకు ఎందుకు ? మన వేదాల్లోనే అన్నీ వున్నాయంటున్నారు కదా వాటిని వెలికి తీసి అందచేయకూడదా , మన దేశ భక్తి వెల్లడి అవుతుంది, మిగతా దేశాల వారు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు కదా అన్నాను. మీరు ఏమీ అనుకోవటం లేదు కదా అన్నది అన్నట్లు చెప్పాను.

     ఏముందయ్యా ఇందులో అనుకోవటానికి, మనం ఇప్పుడు స్వర్గలోక వాసులం. మనలో మనమాట అలాంటి పుక్కిటి పురాణాలు అన్ని దేశాలలో వున్నాయి. అవన్నీ మూసిన గుప్పిట వంటివి. అవి మూసి వున్నంత వరకే ఆసక్తి, తెరిస్తే విరక్తి . అయినా దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లు అలాగే వుంటాయ్‌. అది సరేగాని ఆ ఎంజాయ్‌ జోషి,అదే సెక్స్‌ సిడీ పెద్దమనిషి ప్రేమరోగ్‌ నిందాచార్య ఏం చేస్తున్నారయ్యా ఇప్పుడు, ఎక్కడున్నారు ?

    ఏం చెప్పమంటారు సార్‌ మా ఓడీ సాబ్‌ సిడి ట్రిక్కు ప్రదర్శించి జోషీ గారిని ఇంటికి పంపారు, ఇప్పుడాయన గోళ్లు గిల్లుకుంటూ ఎక్కడ వుభయం దొరికితే అక్కడ అన్నట్లు అక్కడా ఇక్కడా వుంటూ తన దగ్గరికి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తుంటారు. నిందాచార్య పరిస్ధితి మరీదారుణం.ప్రేమ ఫెయిలయింది. దేశభక్తి అంటే స్వదేశీ జాగరణ మంచ్‌, స్వదేశీ జాగరణ మంచ్‌ అంటే దేశభక్తి అన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ! కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది, ఇప్పుడు స్వదేశీ జాగరణ మంచ్‌ అంటే దేశద్రోహం అన్నట్లుగా మారిపోయింది. అందుకు ఎవరూ మాట్లాడటం లేదు. మా ఓడీ సాబ్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇప్పుడు ఓడీ విదేశీ జాగరణ మంచ్‌ హవా నడుస్తోంది.

     బాధ పడకు కాషాయం, అంతా దేవుడి లీల. ఏ ఛానల్‌లో మంచి సీరియల్‌ వస్తుందంటే దాన్ని నొక్కినట్లుగా పై వాడు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు.కింది వారు ఎలా ఎక్కడ వుంటారో తెలియదు.

    అదేసార్‌ నకిలీ సీడీతో జోషీ గారిని ఇంటికి పంపినట్లే జెఎన్‌యులో కూడా అదే ట్రిక్కు చేసి వామపక్ష విద్యార్ధులను దెబ్బతీద్దాం అని చూశాం.ఇపుడు చూడండి దొరికి పోయార? సీతనే మా రాముడు ఆరోజు అగ్ని పరీక్షకు పంపాడు. తెలివి తక్కువతనం కాకపోతే ఇప్పుడు సీడీలను పరీక్షించకుండా వుంటారా ? ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి నకిలీ సీడీలు తయారు చేసిన వాళ్లమీద, వాటిని ప్రసారం చేసిన వారి మీద కేసులు పెడతానంటున్నారు. పరువూ పోయె కేసులూ వచ్చే అన్నట్లుంది.

     కాషాయం మీ వారి మీద కేసులను చూసీ చూడనట్లు పొండి అని చెప్పే పెద్దలు మీ దగ్గర అధికారంలో వున్నారు. మా పరిస్ధితి చూడు రెండవ ప్రపంచ యుద్ధంలో నేరాలంటూ మా మీద పెట్టిన కేసులను ఇంకా కొనసాగిస్తూనే వున్నారు. అందువలన కర్మ చేసిన వాడు ఫలితం అనుభవించక తప్పదని గీతా కారుడు చెప్పలేదా ?

   సార్‌ మీదో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్‌ ఇంకా మీతో చాలా మాట్లాడలని వుంది.ఆ రోజుల్లో మీరు మీడియాను ఎలా అదుపు చేశారు.

     ఈ రోజుల్లో మాదిరి టీవీలు లేవయ్యా, అప్పుడే ప్రయోగాలు జరుగుతున్నాయి. జనానికి అందుబాటులో లేదు. అందువలన రేడియాను పూర్తిగా మా అదుపులోకి తీసుకున్నాం. ఇప్పుడు మీకు ప్రతి టీవీలో గోలగోల గోస్వామి లాంటి వారు తామర తంపరగా కనపడుతున్నారు. మీ వారి పని సులభం అవుతోంది. అలాంటివారిని ఇంకా ఇంకా పెంచండి. చెప్పుకోకూడదు గానీ నిజానికి నేను వారి ముందు మరుగుజ్జును.చూడు కాషాయం మనం స్వర్గంలో వున్నాం అన్నీ ఒకే రోజు మాట్లాడుకుంటే మిగతా రోజుల్లో బోరు కొడుతుందయ్యా ఖాళీ దొరికినపుడల్లా కొన్ని చెప్పుకుందాం. రంభ నుంచి కబురు రాక ముందే వెళితే మంచిది.

ఓకే సార్‌ .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

స్వర్గంలో గోబెల్స్‌తో కాషాయం భేటీ

07 Monday Mar 2016

Posted by raomk in Literature.

≈ Leave a comment

Tags

Bjp nationalism, Gobbles, nationalism, RSS, saffron Sainik

భాగం ఒకటి

సత్య

    భూలోకం నుంచి నేరుగా వేద కాలపు విమానంలో ఒక్కడే వచ్చిన కాషాయం స్వర్గం ద్వారం దగ్గరకు రాగానే జిపిఆర్‌ఎస్‌ చూసుకున్నాడు. తాను దిగాల్సిన భవనం తన కిందే వున్నట్లు గ్రహించిన కాషాయం విమానంలోంచే కిందికి చూశాడు.అంతే విమానం వెంటనే భావాన్ని గ్రహించి చటుక్కున కిందికి దిగటమేమిటి, ఆటోమాటిక్‌గా డోరు తెరుచుకోవటం క్షణ కాలంలో జరిగిపోయాయి.

     బృందావనం గేటెడ్‌ కాలనీకి పెద్ద గేటు, దానిలోంచి లోపలకు చూస్తే పెద్దగా వెతుక్కొనే పని లేకుండానే ‘రంభ సుఖ నివాస్‌’ పెద్దక్షరాలతో సంస్కృతంలో రాసి వుంది. విమానాన్ని గేటు ముందు ఆపగానే సాబ్‌ రోడ్డు అవతల పార్కింగ్‌ ప్లేస్‌ వుంది , ఇక్కడ మెంబర్స్‌ విమానాలను మాత్రమే అనుమతిస్తారు సాబ్‌ అంటూ ఒక సెక్యూరిటీ గార్డు వచ్చాడు.

   వేదకాలపు విమానాలకు రన్‌వేలు, పైలట్లు, ఇంధనంతో పని లేకపోవటంతో చిన్న పిల్లలు బొమ్మ విమానాలను తిప్పినట్లు వెంటనే రయ్యి మంటూ పైకి లేపి పక్కనే వున్న పార్కింగ్‌ ప్లేస్‌లో వుంచి తాళం చెవిని అక్కడి సిబ్బందిపైకి విసిరి వచ్చాడు కాషాయం.

     సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి రిసెప్షన్‌ ఎక్కడా అని అడిగాడు కాషాయం. జాతీయ జండాలోని మూడు రంగుల ముక్కలతో కుట్టిన పెద్ద చొక్కా పెరిగిన బొర్రను దాచలేకపోతోంది, దాని కింద కాషాయ పైజామా, ఒళ్లంతా స్వస్తిక్‌, కమలం పూల పచ్చబొట్లతో వున్న కాషాయాన్ని చూసి సెక్యూరిటీ పన్నెండు గంటల డ్యూటీ భారాన్ని కూడా మరిచిపోయి గోలీ సోడా కొట్టినపుడు వచ్చే సౌండ్‌ మాదిరి కిసుక్కున నవ్వాడు. స్వర్గమన్న తరువాత రకరకాల వారు వస్తుంటారు, వారు మన అతిధులు కనుక చూసి మర్యాదగా వుండాలి నవ్వినా, అమర్యాదగా ప్రవర్తించినా వుద్యోగం వూడుతుందని స్వర్గలోక సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ హెచ్చరిక గుర్తుకు రావటంతో పాపమా ముసలి గార్డు ముఖం మాడిపోయింది. అయినా చిరునవ్వు పులుముకొని ఆయియే సాబ్‌ అని గేటు తీసి రిసెప్షన్‌ ఎక్కడుందో చూపాడు.

    విలాసంగా వెళ్లిన కాషాయానికి వెంటనే అక్కడ వున్న ఒక యువతి లేచి పారిజాత పువ్వు అందిస్తూ బావగారూ బాగున్నారా అని నవ్వుతూ పలకరించింది. అది స్వర్గలోక మర్యాద అని తెలియని, తానెవరో తెలియకుండానే తనకింత ఘనస్వాగతం పలికారని, తెలిస్తే ఇంకెత గా వుంటుందో అని కాషాయం వుబ్బి తబ్బిబ్బు అయ్యాడు. అదే వూపులో రిసెప్షన్‌లో వున్న యువతిని చూసి ఒకసారి కాలర్‌ ఎగుర వేసి గోబెల్స్‌ గారిని కలవాలి అని అంటూ ఒక లెటర్‌ తీసి ఆమెకు అందిస్తూ బల్లమీద దరువేస్తూ అటూ ఇటూ చూస్తున్నాడు. ప్లీజ్‌ సార్‌ శబ్దం చేయవద్దు అని సైగ ద్వారా చెప్పి లెటర్‌ చూడకుండానే ఇదేమిటి అని అడిగింది.

   వెంటనే భూలోకం అమిత్‌ షా రికమెండేషన్‌ లెటర్‌, ముందు చదవండి మీకే తెలుస్తుంది అన్నట్లు సైగ చేశాడు కాషాయం. ఒకసారి స్వర్గానికి రావటం అంటేనే ఇక్కడి వసతులు అన్నీ మీకు వుచితంగా అందుబాటులో వుంటాయని అర్ధం.సిఫార్సులు అవసరం లేదు, భూలోకపు అలవాటును బట్టి లేఖలు తెస్తున్నారు. ఖాళీని బట్టి రూమిస్తాము, రంభా, వూర్వశుల్లో అందుబాటులో వున్న వారిని మీరు ఎంపిక చేసుకోవచ్చు ఓకే. అంటూ లేఖను విప్పకుండానే చెత్త బుట్టలో పడేసింది. ఇక మీకు ఏ గోబెల్స్‌ కావాలి అని అడిగింది.

    అదేమిటి ఎంత మంది వున్నారు, గోబెల్స్‌ అంటే ఒక్కడే కదా ఈ మాత్రం తెలియదా అన్నట్లు చూశాడు. లేదు సార్‌ హిట్లర్‌ కాలంలో అతనొక్కడే , ఇప్పుడో ఎక్కడో ఒకటీ అరా తప్ప ప్రతి టీవీ, ప్రతి పత్రికలో , ఇతర అనేక రంగాలలో ఒకరికి ఇద్దరు, ఇద్దరు నలుగురి మాదిరి తామర తంపరగా తయారయ్యారు, మీకు తెలియదు అసలు గోబెల్స్‌ వారిని చూసి సిగ్గు పడుతూ వుంటారు, ఆయనా వున్నారు. అందుకే మీకు ఎవరు కావాలి అని రిసెప్షనిస్టు అడగ్గానే మా ఆది గురువు అదే జర్మన్‌ మినిస్టర్‌ అన్నాడు కాషాయం.

     అక్కడ కూర్చోండి అంటూ రిసెప్షనిస్టు వలయాలుగా తిరిగే ఒక సోఫా చూపింది. ఇంటర్‌ కామ్‌లో రంగేళీ రాజా జి స్షెషల్‌ అని పెట్టేసింది. స్వర్గం రాజ్యాంగం ప్రకారం అక్కడకు వచ్చిన వారందరూ గతాన్ని గుర్తుంచుకోవచ్చు తప్ప పాత బంధాలను ముందుకు తేకూడదు.ఎవరైనా మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని అంటే వారి మాడు పగలగొడతారు, అవి స్వర్గవాసుల స్వేచ్ఛకు అడ్డు పడతాయి. వావి వరసలు వుండవు. రోమ్‌ వెళ్లినపుడు రోమన్‌లా వుండాలన్నట్లు స్వర్గంలో ప్రతివారూ రంభ, మేనకల కోసం తపించి పోతుంటారు. ముందు తాత, తరువాత కొడుకు ఆ తదుపరి మనవడు వచ్చినపుడు ముగ్గురూ ఒకే రంభ కోసమో, మేనక కోసమో పోటీ పడితే సమస్యలు వస్తాయి. అందువలన బంధాలు, బంధుత్వాలు ఇక్కడ నిషిద్ధం. అందుకే భూలోక పేర్లను పక్కన పెట్టి శాస్త్రీయ నామాలు తగిలిస్తారు. అందుకే అలా కబురంపింది. పావు గంట తరువాత అటువైపు నుంచి కాల్‌ రావటంతో గోబెల్స్‌ లైన్‌లో వున్నారంటూ కాషాయానికి ఫోన్‌ అందచేసింది .

    వెంటనే నేను సార్‌ కాషాయాన్ని అంటూ భూలోకంలో పరిచయం వున్న మాదిరి పెద్దగా చెప్పాడు. ఏమూడ్‌లో వున్నాడో తెలియదుగానీ వెంటనే గోబెల్స్‌కు అర్ధం కాలేదు, మరోసారి కాషాయం అదే చెప్పాడు. దాంతో అటు వైపు నుంచి రిసెస్పనిస్టు సార్‌ పది నిమిషాల్లో అక్కడికే వస్తారు వెయిట్‌ చేయండి అని చెప్పి పెట్టేసింది.

    ఈ మధ్య కాషాయం మంచి హుషారులో వున్నాడు. ఇంతకాలం తాను జాతీయ వాదినని చెప్పుకోవటానికి సిగ్గు పడేవాడు. ఎందుకంటే తమ గురువులందరూ బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన వారే అని బయట పడటంతో నోట మాట వచ్చేదే కాదు. జనానికి మతి మరుపు అని గట్టిగా నమ్ముతాడు కనుక కొంత కాలం తామంతా భగత్‌ సింగ్‌ , చంద్రశేఖర్‌ అజాద్‌ అనుయాయులం అని చెప్పుకు తిరిగాడు. వారిని వురి తీసినపుడు మీ పూర్వీకులు ఏం చేశారు, ఎక్కడున్నారు?మతం తప్ప మరొకటి పట్టని మీకూ మతం,దేవుడిపై నమ్మకంలేని కమ్యూనిస్టు భగత్‌సింగ్‌కూ అసలు సంబంధం ఎక్కడ అని తలోదిక్కునా ప్రశ్నించటంతో కాషాయం కుదేలై పోయి మాట్లాడటం మానేశాడు.

     ఇప్పుడు బస్తీమే సవాల్‌ నేనే అసలైన జాతీయ వాదిని, కాదన్నవాడిని ఖతం చేస్తా అని వీరంగం వేస్తున్నాడు. మాటి మాటికీ జాతీయ జెండా ఎగురవేయటానికి సిద్దం సుమతీ అంటున్నాడు.ఇంతలో జరగరాని ఘోరం జరిగి పోయింది. ప్రమాదంలో ప్రాణం పోయింది.

     ఈ మధ్య ప్రతి సంస్ధకూ అధిపతుల నియామకం సందర్భంగా వచ్చిన వారికి ఎక్కడో అక్కడ పరివార్‌ మచ్చ వుంటే సరే లేకపోతే ముద్రవున్న వారిని వెతికి మరీ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు కూడా బెనారస్‌ విశ్వవిద్యాలయ విసీ మాదిరి మరక మంచి అని ఎత్తి మరీ చూపుతున్నారు. వుగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా స్వర్గంలోకి వుగ్రవాదులు ముఖ్యంగా ఇస్లామిక్‌ తీవ్రవాదులు ప్రవేశించకుండా తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన ఏజన్సీకి కూడా అలాంటి ఒక ముద్రగాడినే అధిపతిగా నియమించారు. ఆ పెద్దమనిషి కొన్ని ఖాళీ పత్రాలు ఇచ్చి నేరుగా స్వర్గానికి పంపాలనుకున్న కాకీ నిక్కర్ల పేర్లు అందులో రాసి అందచేయమన్నారు. ఆ రూటులో వచ్చే వారికి పాసింజరు ఫ్లైట్లకు బదులు వేదకాలపు రెక్కలు లేని సింగిల్‌ సీటరు విమానం కూడా అంద చేస్తారు.అదిగో కాషాయం అలా వచ్చాడు.అందుకే అంత టెక్కు. గోబెల్స్‌తో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ………….(ఇంకా వుంది)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘సంఘపరివార్‌కు అభినందనలు ‘

06 Sunday Mar 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

ANTI NATIONAL, BJP, Bjp nationalism, Durga, HRD ministry, JNU, JNU ROW, Mhishasura, nationalism, RSS, sangh parivar

ఎక్కడైతే తమ భావజాలానికి తావివ్వకుండా సాధ్యమైన మేరకు ప్రతిఘటిస్తోందో, దాని సంగతేమిటో తేల్చాలనుకున్నారో , తమ పెత్తనాన్ని రుద్దాలనుకున్నారో అదే జెఎన్‌యులో ఎబివిపి నాయకులు ముగ్గురు తమ నాయకత్వం మీద తిరుగుబాటు చేయటాన్ని ఎవరైనా వూహించారా ?

సత్య

     విస్సన్న చెప్పిందే వేదం అన్నట్లుగా తాము చెప్పిందే అసలైన జాతీయవాదం, దానికి భిన్నమైనది దేశ ద్రోహం అని సంఘపరివార్‌ ఈ దేశ పౌరుల చేత బలవంతంగా అంగీకరింపచేయాలని చూస్తున్నది. దానితో ఏకీభవించినా లేకపోయినా ఒకటి మాత్రం వాస్తవం. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ వుదంతాలపై మొత్తానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌ ప్రసంగపు కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ఎవరిదో గానీ అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్న పాత సినిమా పాటలా అయింది. పెద్ద పెద్ద చదువులు, పట్టాలు పొందటం,పరిశోధనలు చేయటం, తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్లు తప్ప సామాజిక అంశాలపై అసలు చర్చలు, వాదోపవాదాల మధనం లేకుండా నిస్సారంగా, నిస్తేజంగా, తాతగారి నాన్నగారి భావాలకు దాసులుగా తయారవుతున్న మెజారిటీ యువతను మరోమారు మంచి-చెడు చర్చించే దిశగా కాషాయ పరివార్‌ వ్యవహరించింది. అది చెప్పే భావజాలాన్ని అంగీకరించే లేదా వ్యతిరేకించే శిబిరాలుగా సమీకృతం అయ్యే విధంగా జనాన్ని ముందుకు నెడుతున్న సంఘపరివార్‌కు  ‘అభినందనలు’చెప్పాలి.

   మానవ సమాజం ఎప్పుడూ ముందుకే పోయిందన్నది చరిత్ర చెప్పిన సత్యం. దానిని వెనక్కు తిప్పే శక్తులు ప్రతి తరంలోనూ ప్రయత్నిస్తాయి, ఎదురు దెబ్బలు తింటాయి. అందువలన పురోగమన వాదులెవరూ చర్చకు భయపడరు. మా తాత చెప్పాడు గనుక మానాన్న చేశాడు, మా నాన్న చేశాడు గనుక ఎలాంటి ఆలోచన లేకుండా నేనూ చేస్తున్నాను, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, దాని వలన లాభం సంగతేమో తెలియదు గానీ నష్టం లేదు కదా అనే గొర్రెదాటు పద్దతి ఇటీవలి కాలంలో పెరిగి పోయింది. అలాంటి వారిని సున్నితమైన మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా ఆకట్టుకోవటం సులభం. ప్రపంచంలో ప్రతి తిరోగమన శక్తీ ఈ బలహీనతను వుపయోగించుకొనేందుకు ఎల్ల వేళలా ప్రయత్నిస్తుంది. మన దేశం అందుకు మినహాయింపు కాదు. అలా చేయటం తనకు లాభదాయకమన్న దురాశ అంతర్గతంగా లేకపోతే సంఘపరివార్‌ తన అజెండాను ముందుకు నెట్టదని అనేక గత వుదంతాలు, పరిణామాలు రుజువు చేశాయి. అది శృతి మించి బలప్రయోగానికి దిగినపుడు ప్రతిఘటన ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మన దేశంలో జరుగుతోంది అదే.

   

       జాతీయవాదానికి మన స్వాతంత్య్ర వుద్యమం చెప్పిన అర్ధం, ఆచరణ వేరు.ఇది బానిస బంధాల నుంచి విముక్తి . జర్మన్‌ నాజీ హిట్లర్‌ తన దేశంలో ముందుకు తెచ్చిన జాతీయవాదపు లక్ష్యం, లక్షణం వేరు. అది ప్రపంచ దేశాలను ఆక్రమించుకొనే, కార్మిక వర్గాన్ని అణచేందుకు. స్వాతంత్య్ర వుద్యమ జాతీయ వాదంతో సంఘపరివార్‌ ఏకీభవించలేదు కనుకే అది దూరంగా వుంది. దాని నాయకత్వం బ్రిటీష్‌ ప్రభుత్వానికి సలాం కొట్టి లొంగిపోయింది. హిట్లర్‌ మాదిరి తాను చెప్పే అఖండ భారత్‌ జాతీయ వాదానికి తనదైన భాష్యం, లక్ష్యంతో సంఘపరివార్‌ ఒక మతాన్ని, ఒక పరాయి దేశాన్ని మిళితం చేసి మనోభావాన్ని చొప్పించి యువతను ప్రభావితం చేసేందుకు పూనుకుంది. కేంద్రంలో, పలు రాష్ట్రాలలో తన అధికారాన్ని వుపయోగించి ప్రతి చోటా తన భావజాలాన్ని రుద్ధేందుకు, అలాంటి శక్తులకు స్ధానం కల్పించేందుకు పూనుకుంది. గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర తప్ప పెద్దగా మరో అనుభవం లేని తన సభ్యుడైన ఒక చిన్న నటుడిని ప్రతిష్టాత్మక పూనా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ అధిపతిగా నియమించినదానికి ప్రతిఘటన తలెత్తినపుడు , తరువాత మద్రాస్‌ ఐఐటిలో గుర్తింపు పొందిన పెరియార్‌ అంబేద్కర్‌ అధ్యయన కేంద్రం నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించే కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ ఆకాశరామన్న పేరుతో చేసిన ఫిర్యాదుపై దాని గుర్తింపు రద్దు చేసినపుడు జనం పెద్దగా స్పందించలేదు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తరువాత జెఎన్‌యు వుదంతాలతో ఇప్పుడు మొత్తం చదువుకున్న వారందరూ ఇదేమిటి అని చర్చించకపోయినా ఒక గణనీయ భాగమైనా ఆలోచిస్తున్నది. కొన్ని శక్తులు, సంస్ధలు, వ్యక్తుల గురించి సానుకూల వైఖరితో గుడ్డిగా నమ్మే వారు ఇదేదో తేడాగా వుంది అనుకుంటున్నారా లేదా ? అది చాలు నిజాలేమిటో తెలుసుకొనేందుకు ? ఎక్కడైతే తమ భావజాలానికి తావివ్వకుండా సాధ్యమైన మేరకు ప్రతిఘటిస్తోందో, దాని సంగతేమిటో తేల్చాలనుకున్నారో , తమ పెత్తనాన్ని రుద్దాలనుకున్నారో అదే జెఎన్‌యులో ఎబివిపి నాయకులు ముగ్గురు తమ నాయకత్వం మీద తిరుగుబాటు చేయటాన్ని ఎవరైనా వూహించారా ?

     సంఘపరివార్‌ అసలు తర్కానికి, వాదోపవాదాలకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే అది మా విశ్వాసం అంటారు తప్ప తర్క, హేతుబద్దతకు కట్టుబడే తెగ కాదు. వేదకాలంలోనే మన దగ్గర పైలట్లు, ఇంధనంతో పనిలేని ఖండాంతర విమానాలు వున్నాయి అంటారు. దానికి రుజువు ఏమిటంటే పురాణాల్లో , ఇతిహాసాలలో వుంది, మేం నమ్ముతున్నాం, మా విశ్వాసం అంటారు తప్ప మరో మాట వుండదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో వెల్లడించి దేశాన్ని అగ్రస్ధానంలో వుంచి మేరా భారత్‌ మహాన్‌ అనే పుణ్యం కట్టుకోండి, దేశభక్తులని నిరూపించుకోండి అని ఎవరైనా అంటే మన వేదాలూ, పురాణాలను అపహాస్యం చేస్తున్నారు, మా మనోభావాలను గాయపరుస్తున్నారంటూ దెబ్బలాటలకు దిగుతారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇంత పెద్ద దేశంలో సమాచారం అందుబాటులోకి వచ్చిన తరుణంలో మనోభావాల చాటున తప్పించుకోవాలంటే అంటే నడవదు. వక్రీకరణలు కుదరవు. అందుకే ప్రతి విద్యా సంస్ధ, ప్రతి ఫ్యాక్టరీ, వాణిజ్యసంస్ధ , ఆఫీసు, ఇల్లు , చివరికి ప్రతి మనిషీ ఒక చర్చా కేంద్రం కావాలి. మధనం జరగాలి. వాస్తవాన్ని రాబట్టాలి.

     దుర్గ అంటే మహిషాసురుడిని మర్ధించిన ఒక దేవతగా పురాణాలను బట్టి జనం ఇప్పటి వరకు అనుకుంటున్నారు. అవి పుక్కిటి పురాణాలని కూడా అనుకొనే వారు లేకపోలేదు. తమ వాదనలకు మద్దతుగా వాటి నుంచే వుదాహరణలుగా తీసుకొని ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. పురాణాలకు భిన్నమైన రీతిలో దుర్గ గురించి ఎక్కడా మనకు తెలియదు. ఆమె ఒక వ్యభిచారిణి అని ఒక సంఘం వారు ఒక కరపత్రంలో రాశారని కేంద్ర మంత్రిగారు పార్లమెంట్‌లో చదివి రికార్డులలో ఎక్కించటాన్ని ఏమనాలి. ప్రపంచంలో ఏసుక్రీస్తు, మేరీ, మహమ్మద్‌ ప్రవక్త, రాముడు, కృష్ణుడో మరొక దేవతో దేవుడి గురించో తూలనాడిన వారు చరిత్రలో మనకు ఎందరో కనిపిస్తారు. కానీ అలాంటి వాటన్నింటినీ సేకరించి చట్ట సభల్లో ప్రస్తావించిన ఘనత ప్రపంచంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏకు తప్ప నాకు తెలిసినంతవరకు మరొకరికి దక్కదు. ఎవరైనా వుదాహరణలు చూపితే నా అభిప్రాయాన్ని సవరించుకుంటాను. చట్ట సభలను ఎలా దుర్వినియోగం చేయవచ్చో ఇటీవల కాలంలో అందరూ చూస్తున్నారు. వాటిలో ఇది హైలెట్‌. దుర్గ కల్పిత పాత్రో లేక అనేక మంది నమ్ముతున్నట్లు దేవతా మరొకరా అన్నది వేరే విషయం. ఒక కరపత్రానికి వున్న సాధికారత ఏమిటన్నది ఇక్కడ ప్రశ్న. ఒక పుస్తకమో, ఒక అధికారిక పత్రికో, వెబ్‌సైట్‌లో అలాంటి వర్ణన చేసి వుంటే అది చట్ట ప్రకారం నేరమైతే చర్య తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు. రెచ్చగొట్టటానికి , చిచ్చు పెట్టటానికి ప్రతి మూలనా రోజూ ఏదో ఒక కరపత్రం వెలువడుతూనే వుంటుంది. ఏదో ఒక పేరుతో ఎవరు ఒక కరపత్రం వేస్తే దానిని పార్లమెంట్‌ రికార్డులకు ఎక్కిస్తే వాటికి అంతం ఎక్కడ. అసలు తామా కరపత్రం వేయలేదని మహిషాసుర దినోత్సవ నిర్వాహకులలో ఒకరు చెబుతున్నారు.ఆ వుత్సవం తలపెట్టింది 2014 అక్టోబరులో, అప్పటికి కేంద్రంలో అధికారంలో వున్నది బిజెపి. దుర్గను అలా అమర్యాదకరంగా చిత్రిస్తూ తొలుత ప్రచురించింది యాదవ శక్తి అనే ఒక పత్రిక. దానిపై చర్య తీసుకోవటానికి కేంద్రానికి అధికారం వుంది. దానిని మరొక పత్రిక తరువాత కొద్ది మార్పులతో ప్రచురించిందని సంఘపరివార్‌ అనుయాయులే మరొకవైపు చెబుతున్నారు.మహిషాసుర దినోత్సవం సందర్భంగా ఆ పత్రికను పంపిణీ చేయటంతో ఘర్షణ జరిగి రెండో పత్రికపై కేసు కూడా నమోదైంది. నాటి వుదంతానికి ఇప్పుడు జెఎన్‌యు ఘటనలకు లంకెపెట్టి పార్లమెంట్‌లో ప్రస్తావించటం దురుద్ధేశం, ఎన్నికలలో లబ్దికోసం ప్రచార ఆస్త్రంగా చేయటం తప్ప మరొకటి కనిపించటం లేదు.

   రెండవది మంత్రి అంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. మహిషాసుర దినోత్సవాన్ని జరపటాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదా లేక దుర్గను కించపరచటాన్ని తప్పుపడుతున్నారో స్మృతి ఇరానీ స్పష్టం చేయాలి. దుర్గను కించపరచటంపై కావాలంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్చు. మహిషాసుర దినోత్సవాన్ని వ్యతిరేకించటం అంటే భిన్నత్వాన్ని , మరొక అభిప్రాయాన్ని అణచివేయటం తప్ప మరొకటి కాదు. అసలు ఏ మాంసం తినని వారు ఈ దేశంలో చాలా మంది వున్నారు. అనేక మంది మహిళలు తాము తినకపోయినా ఇంట్లో తినేవారు వుంటే వండి పెట్టటం లేదా ? తినేవారిని అడ్డుకోవటం లేదే !అలాంటపుడు గొడ్డు మాంసం తినే వుత్సవం జరపాలని తినే వారు అనుకుంటున్నపుడు దానిని ప్రతిఘటించాల్సిన అవసరం ఏముంది. ఇష్టం లేకపోతే తినటం మానుకోవాలి లేదా ఆ పరిసర ప్రాంతాలకు ఆ సమయంలో దూరంగా వుండవచ్చు. గణేష్‌ వుత్సవాలు, దసరా వుత్సవాల పేరుతో పెద్ద పెద్దగా లౌడ్‌ స్పీకర్లు పెట్టటం, వూరేగింపుల పేరుతో రవాణాకు ఆటంకం కలిగించటం కొంతమందికి నచ్చదు.అర్ధరాత్రి అపరాత్రి వరకు భారీ సౌండ్‌తో ప్రార్ధనా స్ధలాలలో మైకులు పెడితే చుట్టుపక్కల విద్యార్ధులు, రోగులకు ఎంత ఇబ్బంది. అయినా చేయగలిగిందేమీ లేదు మన ఖర్మ అనుకొని అలాంటి వారు వాటికి దూరంగా తప్పుకుంటున్నారు తప్ప అడ్డుకోవటం లేదే? మహిషాసుర లేదా రావణలీల వుత్సవాలు జరపటం దేశ ద్రోహమా ? జరుపుకోనివ్వండి ఎవరికి నచ్చిన వారిని వారు అభిమానిస్తారు ! అసలు ఏ దేవుడు, దేవతను , రాక్షసులను నమ్మనివారిని కూడా పౌరులుగా దేశ రాజ్యాంగం గుర్తించిందని మర్చిపోతున్నారా ?

     ప్రపంచంలో ప్రతి మతం వాటి దేవతలు, ప్రవక్తల గురించి నిందలు వేయటం కొత్త విషయం కాదు. వాటిని సమాజం పెద్దగా పట్టించుకోదన్నది కూడా వాస్తవం. కొన్ని సందర్బాలలో కొన్ని శక్తులు పధకం ప్రకారం వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పూనుకుంటాయి. క్రైస్తవంపై తిరుగుబాటు నుంచి ఇస్లాం మతం ఆవిర్బవించింది. దాని ప్రవక్త మహమ్మద్‌కు విగ్రహారాధనపై విశ్వాసం లేదు, అందువలననే మక్కాలోని విగ్రహాలన్నింటిని ధ్వంసం చేయించారని చెబుతారు. ఐరోపా దేశాలలోని కొన్ని శక్తులు ముస్లింల ఈ విశ్వాసాన్ని అపహాస్యం చేసేందుకు ఏకంగా ప్రవక్త బొమ్మలు గీయటం అన్నది ప్రతి శతాబ్దంలో ఎక్కడో అక్కడ జరుగుతూనే వుంది. అలాంటి సందర్బాలలో నిరసన వ్యక్తం అవుతోంది. తరువాత ఎవరి జీవన క్రియల్లో వారు వుంటారు. దేవుళ్ల గురించి హేతువాదులు అనేక విమర్శలు చేశారు, తమ తర్కం ప్రకారం ప్రశ్నలు లేవనెత్తారు.వేమన ఇంకా అనేక మంది తమ రచనల్లో ఆచారాలు, మూఢనమ్మకాలు మొదలైన వాటిని చీల్చి చెండాడారు. అంతకు ముందు చార్వాకులు, లోకాయతులు దేవుడు, దేవతల వునికిని ప్రశ్నించారు. ఇప్పుడూ ఎవరైనా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. అంతే తప్ప దుర్గ గురించి మరొక దేవత గురించి ఎవరైనా అసభ్యంగా చిత్రించి, వర్ణించి వారిపై విశ్వాసం పొగొట్టగలమని, లేదా మహిషాసురుడు మరొకరి మీద ప్రేమపెంచగలమని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. నేలవిడిచి సాము చేయటం తప్ప మరొకటి కాదు. విమర్శ సభ్యతతో కూడినదిగా వుండాలి. శైవ-వైష్ణవ మతాల మధ్య మధ్యయుగాలలో ఎంతటి శతృత్వం వుందో ఆ కాలపు రచయితలు రాసిన గ్రంధాలలో సవివరంగా వుంది. విష్ణాలయంలో మోగే గంటను విన్న శివభక్తుడు శ్వపచుడితో (కుక్క మాసం తినేవారితో)సమానం అని శివపురాణంలో రాశారు.ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో కుక్క మాంసం తినేవారు ఇప్పటికీ వున్నారా లేదా ? మరి వారు నాటి పురాణాలు మా మనోభావాలను దెబ్బతీశాయని అంటే ఏం చెబుతారు ? ప్రపంచంలో అనేక దేశాలలో దాన్ని తినేవారు వున్నారు. ఇటీవలి కాలంలో దానిని కూడా వివాదాస్పదం చేశారు.కృష్ణుడి చోర చర్యలను, శృంగారం భక్తులకు పరవశం కలిగిస్తుంది. హేతువాదులకు జారత్వం, చోరత్వం కనిపిస్తుంది, అలాంటి విమర్శలు చేసినంత మాత్రాన కృష్ణ భక్తులందరూ పార్లమెంట్‌లో వాటిని పట్టుకొని చర్చిస్తారా ? అలాగే ప్రతి మతావలంబకులూ పార్లమెంట్‌ను మత విశ్వాస ప్రదర్శన సభగా మార్చివేస్తారా ?

     సృష్టి కర్త దృష్టిలో అందరూ సమానమే అని ఒకవైపు చెబుతారు, మరో వైపు అదే కర్త అందరినీ దేవతలుగా సృష్టించ కుండా కొందరిని రాక్షసులుగా పుట్టించటమెందుకు ? వారి చేత ముందు దేవతలను చావ చితక కొట్టించటం ఎందుకు, అంతా అయిపోయాక వారిని హతమార్చటానికి కొత్త శక్తులను సృష్టించటం ఇవేగా ప్రతి పురాణ సారాంశం. అలా ఎందుకు అంటే లీలా మానుష వినోదం అని టక్కున సమాధానం.అలాగే దుర్గ కూడా కొందరి నిందలకు గురికావటం కూడా అదే అని అలా రాసి పెట్టి వుందని ఎవరి పాపాన వారు పోతారులే అని ఎందుకు ఊరుకోరు ? వుదాహరణకు మహిషాసురుడినే తీసుకుందాం. మైసూరు ఆయన పేరునుంచే పుట్టిందండోయ్‌(మహిషాసుర వూరు మైసూరు అయిందట). జన్మ అంటూ ఎత్తిన తరువాత దానికి పరమార్ధం వుండాలంటారు. అదేమిటో ప్రతి యుగంలో దేవుడి, దేవత హయాంలో రాక్షసులు వారి చేతిలో చావటానికే పుట్టినట్లు అన్ని కధలూ చెబుతాయి. సత్య యుగంలో అందరూ ఒకటే అన్నారు కనుక మనకు రాక్షసులు కనిపించరు. త్రేతాయుగం, ద్వాపరయుగాలలోనే వారు దర్శనమిస్తారు, ధర్మం ఒంటి పాదంలో నడుస్తుందని చెబుతున్న కలియుగంలో మనకు ఎక్కడా కనపడరు. రాక్షసుల వలన జరిగేది యుద్ధాలు తప్ప లోక కల్యాణమేమీ లేదని త్రేతా యుగంలోనే తెలిసిపోయింది కనుక సృష్టి కర్త ద్వాపర యుగంలో అయినా రాక్షసుల సృష్టి నిలిపివేయాలి కదా ఎందుకా పనిచేయలేదు? రాక్షసులు లేకపోతే దేవతలకు గుర్తింపు వుండదనా ? అందువలన విశ్వాసులూ వుద్రేకాలను తగ్గించుకొని వెనుకా ముందూ చూసుకొని స్పందించాలి. చరిత్రలో లోకాయతులూ, చార్వాకులే ఎంతో హుందాగా విమర్శలు చేశారు, వారి వాదనల్లో తర్కం వుంది. మతశక్తులే పరమతాలను, తాము అంగీకరించని దేవతలను బండబూతులు తిట్టాయి. అందువలన లోకాయతుల వారసులు అనుకొనే వారు ఎవరినీ కించపరచకుండా, సభ్యతగా ప్రవర్తించటం ద్వారానే ఎక్కువ మందిని ఆ భావజాలంవైపు కర్షించగలం అని గుర్తిస్తే మంచిదేమో ఆలోచించండి. ఏమైనా ఇలాంటి చర్చలు జరిగేందుకు తెరతీసిన సంఘపరివార్‌కు మరోసారి ‘అభినందనలు’ చెప్పకుండా వుండగలమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !
  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: