• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: RBI

రెండేండ్ల వరకు ధరల పెరుగుదల తగ్గదన్న ఆర్‌బిఐ గవర్నర్‌ !

25 Thursday Aug 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Causes of Inflation, Consumer Price Index, India inflation, India Price Rise, Narendra Modi, Narendra Modi Failures, RBI, RBI governor


ఎం కోటేశ్వరరావు

నాలుగు శాతానికి ద్రవ్యోల్బణం రేటు తగ్గేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని రిజర్వుబాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ 2022 ఆగస్టు 23న చెప్పారు. వృద్ధి రేటును పెద్దగా కోల్పోకుండానే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. అంటే ఇప్పుడు పెరిగిన ధరల రేటు తగ్గేందుకు మరో రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పటమే. నిజానికిది జనాలతో ధరల చేదు మాత్రను మింగించేందుకు, ఆందోళన చెందుతున్న నరేంద్రమోడీ సర్కార్‌కు ఊరట కలిగించేందుకు వెలిబుచ్చిన ఆశాభావం తప్ప పరిస్థితులు ఇప్పటి కంటే దిగజారితే ఏమిటన్నది ప్రశ్న. గవర్నరే చెప్పినట్లు ఇటీవలి గరిష్టం 7.8శాతానికి చేరుతుందని కూడా ఎంతో ముందుగానే ఆర్‌బిఐ చెప్పి ఉంటే విశ్వసనీయత ఉండేది. మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో ఇంతకంటే తీవ్ర స్థాయికి చేరినపుడు కూడా అప్పటి గవర్నర్లు ఇలాంటి మాటలే చెప్పారు. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు ఆందోళన చెందుతున్నది ? ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, అందుకు ముందు గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ మహిమల మంత్రదండం గురించి మీడియా చెప్పిన కథలు, అన్నింటికి మించి మన్మోహన్‌ సింగ్‌ పాలన చివరి రోజుల్లో దిగజారిన పరిస్థితులు, అవినీతి అక్రమాల కారణంగా మోడీ అధికారానికి వస్తే తెల్లవారేసరికి అద్బుతాలు చేస్తారని నమ్మినవారికి ఎనిమిదేండ్లు గడిచినా రెచ్చిపోతున్న హిందూత్వ నూపుర్‌ శర్మలు, రాజాసింగ్‌లు తప్ప ఆర్ధికంగా జనానికి ఉపశమనం గురించి చెప్పాల్సిన వారు ఎక్కడా కనిపించటం లేదు. గత పదహారు నెలలుగా రెండంకెలకు పైగా నమోదవుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఐదు నెలల తరువాత జూలై నెలలో 13.93కనిష్ట స్థాయికి తగ్గింది. గత సంవత్సరం 11.57శాతం ఉంది. ఇంథనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 43.75 స్థాయికి పెరిగింది.


– ద్రవ్యోల్బణం ఎందుకు సంభవిస్తుంది అన్నదాని మీద ఎవరి భాష్యం, కారణాలు వారివే. ప్రతికూల ప్రభావాలను జనం అనుభవిస్తున్నారు గనుక ఎవరు చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉందో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. ఆర్ధిక రంగంలో నగదు చెలామణి పెంపుదల కూడా దవ్యోల్బణానికి దారితీస్తుంది.1951 నుంచి 2022 వరకు దేశంలో నగదు సరఫరా నెలవారీ సగటున రు. 26,168.65 బిలియన్లు.1952అక్టోబరులో కనిష్ట రికార్డు రు.20.57 బిలియన్లు కాగా 2022 జూలై గరిష్ట రికార్డు 2,09,109.47 బి. రూపాయలు. సరఫరా పెరిగితే దవ్యోల్బణం పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఆర్ధిక రంగంలో ద్రవ్య సరఫరాకు అనుగుణంగా ఉత్పత్తి, సేవలు, వస్తు సరఫరా లేకపోతే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అన్నది ఒక సూత్రీకరణ. ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో పదివేల బిలియన్లు కాగా 2010నాటికి 50వేలకు, 2015కు లక్ష, 2020కి 160వేలకు, 2022 జూలైలో 2,09,109.47 బి. రూపాయలకు చేరింది.


ఉద్యోగుల వేతనాలు పెరిగితే ధరలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. అసలు వేతన పెరుగుదల లేకున్నా ధరలు పెరుగుతాయని కొన్ని బుర్రలకు ఎక్కదు.2020-21 మూడవ త్రైమాసిక ఆదాయంలో గృహ పొదుపు అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌,ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో పది నుంచి ఇరవై శాతం ఉంది. అదే మన దేశంలో 2.8శాతం, ఇండోనేషియాలో రెండు శాతం తిరోగమనంలో ఉంది.అలాంటపుడు రెండు చోట్లా ఒకే కారణంతో ద్రవ్యోల్బణం పెరగకూడదు. మన దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు వేతనాలు ఎంతవరకు కారణం ? దేశంలో 2014 నుంచి ద్రవ్యోల్బణ వార్షిక పెరుగుదల ఇలా ఉంది.
ఏడాది×× ద్రవ్యోల్బణ శాతం
2014 ×× 6.6
2015 ×× 4.9
2016 ×× 4.9
2017 ×× 3.3
2018 ×× 3.9
2019 ×× 3.7
2020 ×× 6.6
2021 ×× 5.1
2022 ×× 6.8(ఏడునెలల సగటు)
ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఏడవ వేతన కమిషన్‌ సిఫార్సులు 2017లో అమల్లోకి వచ్చాయి.కరోనా కాలంలో కొన్ని నెలలు అసలు ప్రైవేటు రంగంలో ఉపాధి, వేతనాల్లేవు, అనేక చోట్ల వేతన కోతలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగింది. దేశంలో 70శాతం కార్మికశక్తి గ్రామాల్లోనే ఉంది.2020లో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు 3.5శాతం తగ్గాయి, మరుసటి ఏడాది అరశాతం పెరగ్గా, 2021-22 తొలి తొమ్మిది నెలల్లో వ్యవసాయ పెరుగుదల 1.6శాతం, గ్రామీణ ఇతర కార్మికుల వేతనాలు 1.2శాతం తగ్గాయి.ఈ కాలంలో అసంఘటిత రంగ కార్మికులకు కనీసవేతనాలేమీ పెరగలేదు.కొన్ని రంగాల్లో కాస్త పెరిగినప్పటికీ మొత్తం మీద చూసినపుడు దేశంలో వేతనాలు పెద్దగా పెరగకున్నా ద్రవ్యోల్బణం పెరిగిందంటే దానికి వేరే కారణాలు దోహదం చేస్తున్నట్లే. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు గృహస్తుల కోసం కరోనా సందర్భంగా పెద్ద ఎత్తున చేపట్టిన ద్రవ్య ఉద్దీపన పధకాలు కారణంగా చెబుతున్నారు.మన దేశంలో పేదలకు నెలకు ఐదు కిలోల బియ్యం, కిలోపప్పులు, జనధన్‌ ఖాతాలున్న వారికి మూడు నెలలు ఐదేసి వందల నగదు, కొన్ని గాస్‌ బండలు తప్ప ఇచ్చిందేమీ లేదు. కరోనాతో నిమిత్తం లేని కిసాన్‌ నిధులు కూడా కలుపు కొని మొత్తం పాకేజి విలువ రు.1.76వేల కోట్లు మాత్రమే. మన దేశంలో కరోనా గృహస్తుల పొదుపు మొత్తాలను హరించటమే కాదు అప్పులపాలు చేసింది.
కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ల వల్ల ఖర్చు చేసేందుకు వీలులేక బలవంతపు పొదుపు పెరిగిందని చెబుతున్నారు. పరిస్థితి చక్కబడిన తరువాత కొనుగోళ్లకు పూనుకోవటంతో అలాంటి చోట్ల అధిక ద్రవ్యోల్బణం తలెత్తిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. ధనికులుగా ఉన్నవారి కొనుగోళ్లు పెరిగినప్పటికీ మొత్తం మీద ఇది మన దేశానికి వర్తించదు.

మాక్రోట్రెండ్స్‌ సంస్థ సమాచారం ప్రకారం కరోనాకు ముందు మన వినియోగదారుల 2018,19 రెండు సంవత్సరాల వార్షిక సగటు ఖర్చు 1,664.28 బిలియన్‌ డాలర్లు కాగా 2020,21 వార్షిక సగటు 1,751.73 బి.డాలర్లు అంటే 5.25 శాతం మాత్రమే పెరిగింది. ఇది ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు 5.85 శాతం కంటే తక్కువ, అంటే వాస్తవ ఖర్చు తగ్గింది. ఇదే అమెరికాను చూస్తే 2021 మే నుంచి 2022 మార్చినెల మధ్య ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉండగా 2022 మార్చినెలలో అక్కడి వినియోగదారుల ఖర్చు 18శాతం పెరిగింది. అంతకు రెండు సంవత్సరాల ముందు పన్నెండు శాతమే ఉండేది.2019తో పోలిస్తే అమెరికన్ల వద్ద ఉన్న పొదుపు మొత్తం 2.8లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. వారంతా ఆ మూటలను విప్పి కొనుగోళ్లకు పూనుకోవటంతో వస్తువులకు డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణం పెరిగింది. మన దేశంలో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పట్టణాల్లో 16శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 16.6శాతం అమ్మకాలు పడిపోయాయినా ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గటం లేదు ? కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితి నుంచి ఆర్ధిక రంగాలను కాపాడుకొనేందుకు అనేక ధనిక దేశాలు పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముద్రించి జనానికి నగదు అందచేశాయి. అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదలకు అదొక కారణమైతే, జనాలు ఆ సొమ్ముతో కొనుగోళ్లకు పూనుకోవటంతో సరకుల కొరత ఏర్పడటం, దిగుమతుల ధరలు పెరగటం వంటి కారణాలు దానికి ఆజ్యం పోశాయి.


ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు అన్ని దేశాలూ ఒకే ప్రాతిపదికను అనుసరించటం లేదు. పరిగణనలోకి తీసుకొనే అంశాల ప్రాముఖ్యత దేశదేశానికీ మారుతుంది. ఉదాహరణకు అమెరికాలో ఆహార వస్తువులకు 7.8శాతం ఇస్తే చైనాలో అది 18.4శాతం, మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు మొత్తానికి 22.62శాతం కాగా వాటిలో ఆహార వస్తువులకు 15.26, పారిశ్రామిక ఉత్పత్తులకు ఇస్తున్న 64.23 శాతంలో ఆహార ఉత్పత్తులకు 19.12 శాతం ఉంది. అమెరికాలో రవాణా రంగానికి 15.1శాతం కాగా చైనాలో 10.1 మన దేశంలో 5.2 శాతం ఉంది. చైనాలో దుస్తులకు 6.2 శాతం, అమెరికాలో 2.8, మన దేశంలో 7.3 శాతం ఉంది. చైనా వస్తువులను ఎగుమతి చేస్తుండగా అమెరికా దిగుమతి చేసుకొనే దేశంగా ఉంది. కనుక వాటి ప్రాధాన్యతలు ఒకే విధంగా ఉండవు.


మన దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయకపోతే ఇబ్బందని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పటికే అర్ధమైంది. వాటిలో లబ్ది పొందటంతో పాటు ధరల అదుపునకు ఇంథన ధరలను స్థంభింప చేశారు. ఎన్నికల తరువాత కూడా 2022 ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి అదే స్థంభన కొనసాగుతోంది. అదొక్కటే చాలదు కనుక కేంద్రం పెద్ద మొత్తంలో విధించిన సెస్‌ను కొంత తగ్గించారు. దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాట్‌ను ఎందుకు తగ్గించవంటూ దాడి చేశారు. పెట్రోలు మీద లీటరుకు రు.8, డీజిలు మీద రు.6 తగ్గించి దీని వలన కేంద్ర ప్రభుత్వం ఏడాదికి లక్ష కోట్ల మేరకు ఆదాయాన్ని ” త్యాగం ” చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని పెంచినపుడేమో మిలిటరీకోసమని జనానికి దేశభక్తి కబుర్లు చెప్పారు, తగ్గించినపుడు కేంద్ర ప్రభుత్వానికి దేశభక్తి తగ్గిందని అనుకోవాలా ? ఈ తగ్గింపు ప్రక్రియను మరో విధంగా చెప్పాలంటే చమురుపై భారీగా పన్నుల పెంపుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నదని అంగీకరించటమే. సత్యహరిశ్చంద్రుడివారసులమని, ఒకటే మాట ఒకటే బాణం అన్న రాముడి భక్తులమని చెప్పుకొనే వారికి నిజాన్ని అంగీకరించే ధైర్యం ఎందుకు లేదు ? 2021 ఏప్రిల్‌-మే మాసాల్లో ద్రవ్యోల్బణం రేటు 2.5శాతం కాగా అదే 2022లో మార్చి నెలలో ఆరుశాతానికి చేరింది.


2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తక ముందే పెరుగుదల బాటలో ఉన్న ద్రవ్యోల్బణం తరువాత ఈ కారణంగా మరికొంత పెరిగింది. డాలరు నిల్వలను పెంచుకొనేందుకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులతో పాటు మన స్టాక్‌ మార్కెట్లో వాటాల కొనుగోలుకు విదేశీ సంస్థలను ప్రభుత్వం అనుమతించింది.ఇదే విధంగా విదేశాల నుంచి తక్కువ వడ్డీలకు దొరుకుతున్న డాలరు రుణాలను కూడా ప్రోత్సహించింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవటంలో ఘోరవైఫల్యం, అమెరికాలో వడ్డీ రేటు పెరుగుదల కారణంగా మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి డాలరు పెట్టుబడులు వెనక్కు మరలాయి. ఇది కూడా ద్రవోల్బణం పెరుగుదలకు దారి తీశాయి.చమురు, ఇతర దిగుమతి వస్తువుల ధరల పెరుగుదలకు రూపాయి పతనం కూడా తోడైంది. దేశంలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు విదేశీ ధోరణులే కారణమని తప్పించుకొనేందుకు కొందరు ప్రభుత్వానికి వంతపాడుతున్నారు. మన దేశాన్ని నయా ఉదారవాద చట్రంలో బిగించినందున ఆ విధానాలను అనుసరిస్తున్న దేశాల జబ్బులన్నీ మనకూ కొంతమేర అంటుకుంటాయి. జనాలకు చమురు, గాస్‌, ఇతర సబ్సిడీలను ఎత్తివేసి, పరిమితం చేసి, కోతలు పెట్టటం, కార్పొరేట్లకు పన్నురాయితీలు ఇవ్వటం, జనాల మీద పన్ను బాదుడు దానిలో భాగమే.పన్నుల పెంపుదల గురించి చట్ట సభల్లో చర్చకు తావులేకుండా జిఎస్‌టి మండలి, విద్యుత్‌ క్రమబద్దీకరణ మండళ్ల ఏర్పాటు, ప్రభుత్వ అదుపులేని ప్రైవేటు రంగానికి అన్నింటినీ అప్పగించటమూ అదే. జిఎస్‌టి విధానం రాక ముందు ధనికులు వాడే విలాస వస్తువులపై 30 నుంచి 45శాతం వరకు పన్నులు ఉండేవి. జిఎస్‌టి దాన్ని 28శాతానికి తగ్గించింది. ఆ మేరకు తాజాగా పెంచిన పన్నులు, విస్తరించిన వస్తువుల జాబితాను చూస్తే సామాన్యుల నడ్డి విరవటమే కాదు ద్రవ్యోల్బణ పెరుగుదలకూ దోహదం చేస్తున్నది. వస్తూత్పత్తిదారులు తమ మీద పడిన భారాన్ని జనం మీదకే నెడతారన్నది తెలిసిందే.


2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా అది 2021-22కు 79.18కి పెరిగింది. 2022-23లో రష్యా తక్కువ ధరలకు చమురు ఇచ్చినప్పటికీ ఆగస్టు 23వ తేదీ వరకు ఏప్రిల్‌ నుంచి ఐదు నెలల సగటు 106.13 డాలర్లకు చేరింది. దీన్ని బట్టి మన దిగుమతుల బిల్లు పెరుగుతుంది, దానికి రూపాయి విలువ పతనంతో మరింత భారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు విదేశాల నుంచి వస్తువులనే కాదు ద్రవ్యోల్బణాన్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. దేశంలో బొగ్గు నిల్వలున్నా వాటిని తవ్వకుండా ఖరీదైన బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం విద్యుత్‌ సంస్థల మీద రుద్దటం ద్రవ్యోల్బణ దిగుమతిలో భాగం కాదా ? ఇలాంటి వాటి కారణంగానే వెంటనే ద్రవ్యోల్బణాన్ని తగ్గించే మంత్రదండం లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారనుకోవాలి. –

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

” సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో ” దేశాన్ని నిజంగా పెడితే ఇదేమిటి ?

14 Sunday Aug 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India's Forex Reserves, Narendra Modi, Narendra Modi Failures, RBI, RBI governor, RSS


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు ఐదవ తేదీతో ముగిసిన వారంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 572.978 బిలియన్‌ డాలర్లని ఆర్‌బిఐ నివేదికలో పేర్కొన్నది. అంతకు ముందు వారంలో ఉన్న మొత్తం 573.875బి.డాలర్లు. జూలై మాస ఆర్‌బిఐ నివేదిక ప్రకారం ఆ నెలలో ఉన్న స్థితిని బట్టి 2022-23లో తొమ్మిదిన్నర నెలల దిగుమతులకు డాలర్‌ నిల్వలు సరిపోతాయి. ఈ అంచనాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.2014 జూలై 28 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషణ ప్రకారం డాలర్‌ నిల్వలు 317బి.డాలర్లకు పెరిగాయి.అవి ఎనిమిది నెలల దిగుమతులకు సరిపోతాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి(2008) ముందున్న కొనుగోలు శక్తి స్థాయికి తిరిగి పుంజుకోవాలంటే వాటిని 500బి.డాలర్లకు పెంచాల్సి ఉంటుందని, 2008కి ముందు మన దగ్గర ఉన్న నిల్వలు పదిహేను నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని పేర్కొన్నారు. 2013 ఆగస్టులో 275 బి.డాలర్లు ఉండగా 2014 జూలై 18 నాటికి అవి 317.8 బి.డాలర్లకు పెరగటానికి ఆర్‌బిఐ ప్రవాస భారతీయుల డిపాజిట్లకు ప్రోత్సాహాకాలివ్వటం, విదేశీ బాంకుల నుంచి రుణాలు తీసుకోవటాన్ని ప్రోత్సహించటమని కూడా చెప్పారు. డాలరు అప్పులు 420 బి.డాలర్లు ఉన్నందున ఆ పరిస్థితి మన కరెన్సీని వడిదుడులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడిలో 2022 మార్చినెలాఖరు నాటికి మన విదేశీ అప్పు 620.7 బి.డాలర్లకు పెరిగింది. ఎనిమిదేండ్ల క్రితం డాలరుకు రు.68 ఉండగా ఇప్పుడు 80కి దిగజారిన సంగతి తెలిసిందే.


2022 మార్చి నెలాఖరుకు ఉన్న 607.3 బి.డాలర్లు అంతకు ముందు ఏడాది లావాదేవీలను బట్టి పన్నెండు నెలల దిగుమతులకు సరిపడా ఉన్నట్లు ఏప్రిల్‌ 16న ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త పేర్కొన్నది. సిఇఐసి సమాచారం ప్రకారం 2022 మే నెలలో ఉన్న నిల్వలు 8.5 నెలల దిగుమతులకు సరిపడా ఉంటే జూన్‌ నాటికి అవి 7.5నెలలకు తగ్గాయి. మన డాలరు నిల్వలు 573 బి.డాలర్లలో సింహభాగం 509.646 బి.డాలర్లు విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్‌సిఏ)గా ఉన్నాయి. అవి నెలనెలా తగ్గుతున్నాయి.(జూలై 8నాటికి 518.089 బి.డాలర్లు) మన రూపాయి విలువ పతనం, పెరుగుదల మీద ఈ నిల్వలు ప్రభావం చూపుతాయి. ఇవిగాక బంగారం నిల్వల విలువ 40.313 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నుంచి ఎస్‌డిఆర్‌లు 18.031 బి.డాలర్లు, ఐఎంఎఫ్‌ నిల్వలు 4.987 బి.డాలర్లు ఉన్నాయి.
తొలిసారిగా మన డాలరు నిల్వలు 2020 జూన్‌లో 500 బిలియన్‌లకు,2021జూన్‌లో 600, అదే ఏడాది సెప్టెంబరు ఎనిమిదిన మరో రికార్డు 642.453 చేరాయి.2022 జూలై 29కి 573.9 బి.డాలర్లకు తగ్గాయి


చమురు మార్కెట్లో ధరల పెరుగుదల వివరాలను చూస్తే మన విదేశీ మారకద్రవ్యంపై దాని వత్తిడి ఎలా ఉందో అర్ధం అవుతుంది. 2014-15 నుంచి 2021-22వరకు ఎనిమిది సంవత్సరాల్లో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 61.08 డాలర్లు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు13 వరకు అది 106.45 డాలర్లకు పెరిగింది. దీన్ని బట్టి మన దిగుమతి బిల్లు ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో చమురు ధరలు తక్కువగా ఉండటాన్ని కూడా తన ఘనతగా బిజెపి చెప్పుకోవటమే కాదు, పాత అప్పులు తీర్చేందుకని, మిలిటరీకి ఖర్చు చేసేందుకని, రోడ్లు వేసేందుకని, కరోనా వాక్సిన్ల కోసమనీ పెద్ద ఎత్తున చమురుమీద పెంచిన భారాన్ని సమర్ధించింది. 2014 మే 29 నుంచి జూన్‌ 11 వరకు సగటున ఒక డాలరు రు.59.17 ఉంటే ఇప్పుడది 2022 జూన్‌ 29 నుంచి జూలై 27వరకు రు.79.54 ఉంది. దీన్ని గోడదెబ్బ చెంపదెబ్బ అనవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరను అదుపుచేసే శక్తి నరేంద్రమోడీకి లేదు. కానీ రూపాయి విలువ దిగజారకుండా కాపాడి ఉంటే ఒక డాలరుకు ఇరవై అదనంగా చెల్లించవలసి వచ్చేది కాదు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మోడీ సర్కార్‌ నిర్వాకానికి జనం చెల్లిస్తున్న మూల్యమిది.


రూపాయి పతనం ఒక్క చమురుకే కాదు, మనం చేసుకుంటున్న దిగుమతులన్నింటికీ అదనపు భారమే. మన విద్యార్ధుల విదేశీ చదువులు కూడా భారంగా మారాయి. మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి కబుర్లతో ఎనిమిదేండ్లుగా జనాన్ని మభ్య పెట్టటం తప్ప దేశం నుంచి ఎగుమతులు పెరగటం లేదు. గత ఏడాది వాణిజ్యలోటు జిడిపిలో 1.2శాతం ఉండగా వర్తమానంలో మూడుశాతం కావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఎగుమతులు 2.14శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే మాసంలో దిగుమతులు 43.61 శాతం పెరిగి 66.27 బి.డాలర్లకు చేరాయి. గతేడాది జూలై వాణిజ్య లోటు 10.63 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 30బి.డాలర్లకు పెరిగింది.ఏప్రిల్‌-జూలై ఎగుమతులు 157.44 బి.డాలర్ల విలువ గలవి జరగ్గా దిగుమతుల విలువ 256.43 బి.డాలర్లు. వాణిజ్య లోటు గతేడాది 42బి.డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది 98.99 బి.డాలర్లకు చేరింది. దిగుమతుల్లో చమురు వాటా గతేడాదితో పోలిస్తే జూలైలో 12.4 నుంచి 21.13 బి.డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో చైనాతో మన వాణిజ్యలోటు 48 బి.డాలర్లు ఉంది. ఒక వైపు చైనా వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ, మరోవైపు భారీ ఎత్తున చైనా నుంచి దిగుమతులకు మోడీ సర్కార్‌ అనుమతిస్తున్నది. కమ్యూనిస్టు వ్యతిరేకులను మానసికంగా సంతృప్తి పరచేందుకు చైనా వ్యతిరేక కబురు, ప్రచారం, కార్పొరేట్ల నుంచి నిధులు పొందేందుకు వారి లాభాల కోసం చైనా నుంచి గత రికార్డులను బద్దలు కొడుతూ వస్తు దిగుమతులకు పచ్చజెండా, జనానికి దేశ భక్తి సుభాషితాలు.విశ్వగురువు లీలలు ఎన్నని చెప్పుకోగలం !


ప్రపంచంలో విదేశీమారకద్రవ్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది నాల్గవ స్థానమని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆగస్టు ఐదవ తేదీన చెప్పారు. ఇది నరేంద్రమోడీ భజనపరులకు వీనుల విందు, కనులకు పసందుగా ఉంటుంది. ఇదే ప్రాతిపదికైతే మనం అమెరికా కంటే కూడా గొప్పవారం అని చెప్పాల్సి ఉంటుంది. బంగారం మినహా విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి వికీపీడియా సమాచారం ప్రకారం అది పదమూడవ స్థానంలో ఉంది. కొన్ని దేశాలు వారానికి ఒకసారి మరికొన్ని నెలకు ఒకసారి వివరాలు వెల్లడిస్తాయి. అందువలన అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. 2022లో కొన్ని దేశాల విదేశీమారకద్రవ్య వివరాలు బిలియన్‌ డాలర్లలో ఇలా ఉన్నాయి. చైనా 3,275.490(జూలై),జపాన్‌ 1,311.254(జూన్‌), స్విడ్జర్లాండ్‌ 960.084(జూన్‌), రష్యా 574.8(ఆగస్టు 5), భారత్‌ 572.978(ఆగస్టు 5), తైవాన్‌ 548.960(జూన్‌), అమెరికా 234.430(జూలై 8). అంతకు ముందు నెలతో పోలిస్తే చైనా నిల్వలు 28.895, రష్యా 3.6 బి. డాలర్ల చొప్పున పెరిగాయి. కరోనా లాక్‌డౌన్ల కారణంగా చైనా, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఇబ్బందులు పడినప్పటికీ వాటి నిల్వలు పెరగ్గా అంతా సజావుగా ఉందని చెబుతున్న మన దేశ నిల్వలు ఎందుకు తగ్గుతున్నట్లు ? పద్మశ్రీ కంగనా రనౌత్‌ చెప్పినట్లు 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనుకుందాం, సమర్ధుడైన తొలి ప్రధాని, నరేంద్రమోడీ సురక్షిత హస్తాల్లో దేశాన్ని పెట్టామని అనేక మంది చెప్పారు, బిజెపి కూడా స్వంత డబ్బా కొట్టుకుంది. జనం కూడా నిజమే అని నమ్మారు. మరి ఇప్పుడీ పరిస్థితి ఎందుకు తలెత్తినట్లు ?కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో సాధించలేని దానిని నరేంద్రమోడీ ఐదు సంవత్సరాల్లో చేసి చూపారని 2019 ఎన్నికలపుడు ఊదర గొట్టారు. మోడీ సాధించిన ఘనతల్లో విదేశీ మారక ద్రవ్య పెంపుదల ఒకటని చెప్పారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన తరువాత ఇప్పుడు పరిస్థితి ఏమిటి ? విదేశీ మారకద్రవ్య నిల్వల గురించి అంతగా తెలియని(విద్యావంతులైన) జనం ఉన్నారు గనుక బిజెపి ప్రచార దళాలు వాట్సాప్‌ పండితులతో ఏది ప్రచారం చేసినా నడుస్తోందా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బడా కంపెనీలకు తిరిగి బ్యాంకుల అప్పగింత స్వాతంత్య్రానికే ముప్పు !

10 Thursday Dec 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Corporate banks, Private banks in India, RBI


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


గతంలో బ్యాంకింగ్‌ అనుభవం ఉన్నవారికే బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే వారు. ఇప్పుడు దానితో పని లేదు. బడా కంపెనీయా కాదా అన్నదే గీటు రాయిగా మారనుంది? కార్పోరేట్‌ కంపెనీలు బ్యాంకుల ఏర్పాటు పై మార్గదర్శకాలను సూచించమని కోరుతూ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీ.కే మహంతి ఆధ్వర్యాన రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఒక అంతర్గత వర్కింగ్‌ గ్రూపు ని 2020 జూన్‌ 20 న నియమించింది. ఈ బ ందం చేసిన సూచనలు దేశంలో ఒక తీవ్ర చర్చను లేపాయి.

కార్పోరేట్‌ పారిశ్రామిక సంస్ధలు స్వంతంగా బ్యాంకులు పెట్టుకోవడానికి అనుమతించాలని,పెద్ద కార్పోరేట్‌ కంపెనీలను బ్యాంకులను ప్రమోటర్లుగా అనుమతించాలని గ్రూప్‌ ప్రతిపాదించింది. ఇవి అమలైతే బడా కార్పోరేట్‌ కంపెనీలన్నీ స్వంత బ్యాంకులను ప్రారంభించుటకు అవకాశం లభిస్తుంది. ప్రైవేటు బ్యాంకులలో ప్రమోటర్ల వాటా పరిమితి ని 15 శాతంనుండి 26 శాతానికి పెంచాలని, 50 వేల కోట్ల పైన ఆస్దులు వున్నకంపెనీలకు బ్యాంకింగ్‌ లైసెన్సులను మంజూరు చేయాలనిసూచించింది. దీనికి చెప్పిన కారణాల సారాంశం ఇలా ఉంది. (1) బ్యాంకులు ప్రారంభించటానికి కార్పోరేట్‌ కంపెనీలకు లైసెన్సులు ఇస్తే పెట్టుబడుల లభ్యత పెరుగుతుంది. (2) పరిపాలనాఅనుభవం తోపాటుగా నైపుణ్యం కలిగిన వ్యూహాత్మక కార్పోరేట్‌ మేనేజ్‌ మెంటు లభిస్తుంది.

భారీ మొత్తాలలో రుణాలకోసం బ్యాంకుల చుట్టూ తిరిగే కార్పోరేట్లకు బ్యాంకులను ఇవ్వటం సరికాదని ఆర్ధికవేత్తలు, మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్ధకే ప్రమాదం అన్నారు.
ఈ సూచనలు అమలైతే టాటా, బిర్లా, అంబానీ, అదానీ, యల్‌ అండ్‌ టీ, వంటి దేశీయ కార్పోరేట్‌ దిగ్గజాలు భవిష్యత్తులో బ్యాంకింగ్‌ రంగంలో కీలకంగా మారనున్నాయి. దేశ ఆర్ధికవ్యవస్ద తమ చేతిలో వుంచుకుని లాభాలే ధ్యేయంగా క షిచేస్తారు. బ్యాంకులను తమ ఆదాయ వనరుగా మారుస్తారు.కరోనా మహమ్మా రి వలన సామాన్యప్రజలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోగా కార్పోరేట్‌ కంపెనీలకు లాభాలపంటపండింది. 2020 మూడవ త్రైమాసికంలో భారత్‌ లోని కార్పోరేట్‌ కంపెనీలు రికార్డు స్ధాయిలో 1.33 లక్షల కోట్లు ఆర్జించాయని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీ యమ్‌ ఐ ఈ )తెలిపింది. ఇదే సమయంలో కొత్తగా బిలియనీర్లయినవారి సంఖ్య కూడా పెరిగింది. అట్టి చరిత్ర కలిగిన కార్పోరేట్‌ కంపెనీలకు బ్యాంకులు అప్పగిస్తే డిపాజిటర్ల డబ్బులకు భధ్రత గురించి కూడా ఆలోచించాలి. బ్యాంకు లో భవిష్యత్‌ అవసరాలకు దాచుకున్నసామాన్యులు, మధ్యతరగతి ప్రజల గతిఏమవుతుందో వూహించటంకష్టం. ఈ ప్రమాదకరమయిన ప్రతిపాదనలు ప్రజల పొదుపుమొత్తాలను ముప్పులో పడేస్తాయి. ఆర్ధికవ్యవస్ధకు తీవ్రమైన హానికలిగిస్తాయి.

భారతీయ రెగ్యులేటరీ ఏజన్సీలను మోసంచేయడం-రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ లోపంవలన , కంపెనీ అధిపతుల అనుకూల ప్రభుత్వవిధానాలవలన, మొండి బాకీలు, అవినీతి పెచ్చుమీరటంవలన బ్యాంకులు కుంటుతున్నాయి. పడిలేస్తున్నాయి. ఎన్నో లోపాలున్నాయి. అయినా రైతులకు, చిరువ్యాపారులకు, మధ్యతరగతి ప్రజలకు కొంతవరకయినా రుణాలివ్వక తప్పటంలేదు. ప్రజలకు లభించిన ఈవెసులుబాటును కూడా ప్రజలకు దక్కకుండా చేయాలని కార్పోరేట్‌ రంగం క షిచేస్తున్నది. 2018సం. మార్చి నాటికి భారతీయ బ్యాంకులలో మొండి బాకీలు రు. 9.62 లక్షల కోట్లు అందులో 73.2 శాతం కార్పోరేటు కంపెనీల బాకీలే అన్నది గమనించాలి. వ్యవసాయ సంబంధిత అప్పులు రూ . 85,344 కోట్లు మాత్రమే.

బ్యాంకులపై పర్యవేక్షణ ఎట్లా వుంది
2014 లో ఆర్భాటంగా ప్రారంభించిన యస్‌ బ్యాంకు 2020 కల్లా దివాళా తీసింది. 2,41,000 కోట్ల బకాయీలలో 1,45,000 కోట్లు పారుబకాయిలు, అంటే తిరిగి రానివి. అందులో ముఖ్యబాకీదారుడు అనిల్‌ అంబానీ. రిజర్వు బ్యాంకు యస్‌ బ్యాంకును రక్షించింది. ప్రభుత్వ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాచేత 49 శాతం వాటాలను కొనిపించి యస్‌ బ్యాంక్‌ ను కాపాడింది.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ను నీరవ్‌ మోడీ 13,800 కోట్లకు ముంచాడు. 2018 లో ఐ డీ బీ ఐ , 2019 లో లక్ష్మీవిలాస్‌ బ్యాంకు,2019 లో పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంకులు వరసగా దివాళాతీశాయి.
రమేష గెల్లీ నాయకత్వాన మోడల్‌ బ్యాంకుగా పేరుపొందిన గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు 1994 లో సికిందరాబాద్‌ లో ప్రారంభమయింది. పది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగి 2004 సం.లో దివాళాతీసింది. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని డిపాజిటర్లను, ఉద్యోగస్తులను, బ్యాంకును కాపాడింది. ప్రభుత్వ సంస్ధ అయిన ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స లో విలీనంచేశారు. బ్యాంకును దారితప్పించి మోసంచేసిన వారికి లాభం చేకూరింది. చివరకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులు క ట్టే సామాన్య ప్రజలే మరొక సారి మోసంచేయబడ్డారు.
ఐసీఐసీ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్‌ వీడియోకాన్‌ గ్రూపుకి 1875 కోట్ల రూపాయలను అక్రమంగా బదిలీ చేశారని ఒక విజిల్‌ బ్లోయర్‌ అరవింద్‌ గుప్తా ప్రధానమంత్రికి, ఆర్ధికమంత్రి అరుణజైట్లీగార్లకు ఎన్నో లేఖలు వ్రాశారు. ఆర్ధికమంత్రి అరుణజైట్లీగారికి ఈ కుంభకోణంలో పాత్ర వుందని ఆరోపణలు కూడా వున్నాయి. ఐసీఐసీ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్‌ నిబంధనలకు విరుద్ధంగా తన భర్త వ్యాపార భాగస్వామి ఐన వేణుగోపాల్‌ ధూత్‌ కి అప్పు సాంక్షన్‌ చేశారు. వేణుగోపాల్‌ ధూత్‌ వీడియోకాన్‌ కంపెనీ అధినేత. అప్పులను మొండిబాకీలుగా (%చీూA%) ప్రకటించారు. వీడియోకాన్‌ గ్రూపునకు రూ.1,875 కోట్ల రుణాల మంజూరులో అవినీతికి, అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలతో చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌పై గతంలో మనీ లాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ అభియోగాల నేపథ్యంలో చందా కొచ్చర్‌పై ఐసీఐసీఐ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. జస్టిస్‌ బీఎన్‌ శ్రీక ష? నేత త్వంలో కమిటీని ఏర్పాటుచేసి దర్యాప్తు జరిపించింది. ఆ తర్వాత ఎండీ, సీఈవో పదవుల నుంచి చందా కొచ్చర్‌ను తొలగించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీపక్‌ కొచ్చర్‌ను అరెస్టు చేసింది.


లక్ష్మీ విలాస్‌ బ్యాంకు సంక్షోభం
94 ఏళ్ళ చరిత్ర వున్నలక్ష్మీ విలాస్‌ బ్యాంకు సంక్షోభం లో చిక్కుకున్నది. 19 రాష్ట్రాలలో 566 బ్రాంచీలతో పేరుపొందింది. మందుల పరిశ్రమ లో కార్పోరేట్‌ సంస్ద అయిన రాన్‌ బాక్సీ సంస్ధకు ఒక్కదానికే 720 కోట్లు అప్పు ఇచ్చారు. ఇంకా మొండిబాకీలు ఎక్కువయి బ్యాంకు దివాళాతీసింది. డిబిఎస్‌లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించింది. డీ బీ ఎస్‌. బ్యాంకు సింగపూర్‌ కేంద్రంగా 18 దేశాల్లో ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తున్న విదేశీ సంస్థ. ఈ విధంగా ఒక విదేశీ బ్యాంకు లక్ష్మీవిలాస్‌ బ్యాంకును మింగేసింది.
ఈ కార్పోరేటు బ్యాంకులు దివాళా తీసినా, వారి పరిశ్రమలు దివాళా తీసినా మొత్తం ఆర్ధికవ్యవస్ధ కుప్పకూలే ప్రమాదం వున్నది. 8లక్షల 80 వేల కోట్ల మొండి బాకీలున్నాయి. వేల కోట్ల రూపాయల బ్యాంకు బాకీలున్నవారందరూ కార్పోరేట్‌ యజమానులే . అందులో 12 మంది బాకీలు 4వ వంతు వున్నాయి. విజయమాల్యా, నీరవ్‌ మోడీ, అనిల్‌ అంబానీ, అదానీ లాంటి మహామహులు ఎంతోమంది వున్నారు.
కార్పోరేట్‌ కంపెనీల చేతులలో బ్యాంకులు వుంటే ఎటువంటి నిబంధనలు లేకుండా నిధులను వారే మంజూరు చేసుకుంటారు. ఇపుడు కార్పోరేట్‌ కంపెనీలు రాజకీయనాయకులకు, పార్టీలకు డొనేషన్లు ఇవ్వటంలో ముందున్నాయి. ఇక బ్యాంకులు , కంపెనీలు కలిపి నిర్వహిస్తున్నబ్యాంకులలో డబ్బులకు కొదవవుండదు. దేశరాజకీయం డబ్బుల చుట్టూతిరుగుతున్నపుడు కార్పోరేట్‌ కంపెనీలు రాజకీయాలను ఇంకా క్రియాశీలంగా నిర్వహిస్తాయి. నీతి నియమాలగురించి పెద్దపట్టింపు లేని కార్పోరేటుకంపెనీల చేతిలో ప్రజల ధనాన్ని వుంచటం పెను ప్రమాదాన్ని సూచిస్తున్నది. గత కొద్ది సంవత్సరాలలో కనీసం 15-20 లక్షల కోట్ల రూపాయలను కార్పోరేటు పారిశ్రామిక వర్గాలు బాకీపడ్డాయి. ఇందులో ఎక్కువ భాగం కావాలని ఎగగొట్టారు.

బ్యాంకుల జాతీయకరణకు ముందు ఎలా వుండేది.
1969 సం.లో 14 ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణ ముందున్న పరిస్ధితిని గుర్తుతెచ్చుకొంటే రాబోయే రోజులలో కార్పోరేటు బ్యాంకులు ఏంచేస్తాయో వూహించవచ్చు. స్వంత ప్రయోజనాలను పెంచుకోవటానికే ఆనాటి బ్యాంకులు పనిచేశాయి. వ్యవసాయంచేసుకునే రైతులకు 2 శాతం అప్పులు కూడా ఇవ్వలేదు. గొర్రెలకు, బర్రెలకు, చేతివ త్తిదారులకు, మహిళలకు, ఇంటికి , చదువులకు,స్కూటర్‌ , చిన్నపరిశ్రమలకు,వ్యాపార రుణాలు బ్యాంకులు జాతీయం చేసినతరువాతనే అందుతున్నాయి. గ్రామీణప్రాంతప్రజలకు, సమాజంలోని బలహీనవర్గాలకు కొంతవరకయినా సంస్ధాగత రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నిలోపాలున్నా ప్రభుత్వబ్యాంకులు కాబట్టి కొంతలోకొంత చిన్నవారికి అవసరానికి అప్పుదొరికింది. బ్యాంకుల కుంభకోణాలను, వైఫల్యాలను, అవినీతిని నివారించి బ్యాంకింగ్‌ వ్యవస్ధకు స్ధిరత్వాన్నికల్పంచి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే వుద్దేశంతో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. బ్యాంకుల జాతీయకరణ హఠాత్తుగా జరగలేదు. ప్రజల త్యాగాలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా నే బ్యాంకుల జాతీయకరణ, ఇన్స్యూరెన్సు కంపెనీల జాతీయకరణ , భారీ పరిశ్రమలు, సమాజంలో కొన్ని అభివ ధికర మార్పులు జరిగాయి. జాతీయకరణకు ముందు బ్యాంకులు పూర్తిగా ప్రైవేటురంగంలో వుండేవి. బ్యాంకుల చరిత్ర చాలా ఆందోళనకరంగా వుండేది. బడా పారిశ్రామికవేత్తలు వారికి వారే అప్పులిచ్చుకునేవారు. ఆర్దిక శాఖ సలహాదారైన వీ.ఏ. పాయి పనానడికర్‌ 1967 లో ఇలా అన్నారు.’బ్యాంకుల అంతర్గత వ్యవహారాలన్నీ డైరక్టర్ల చేతిలోవుండేవి. అప్పుల వ్యవహారాల విచక్షణాధికారం డైరక్టర్లకే వుండేది.”
1969 సం.జులై 19 న జాతీయకరణ జరిగింది. 50 కోట్లకు మించి డిపాజిట్లువున్న 14 బ్యాంకు లను, 1980 లో 200 కోట్లు డిపాజిట్లు వున్న 6 బ్యాంకులను జాతీయంచేశారు. ఆనాటికి డిపాజిట్లు 4646 కోట్లు వుంటే ఇపుడు 125 లక్షలకోట్లున్నాయి. అపుడు 3599 కోట్లరూపాయలను రుణాలుగా ఇస్తే 96.5 లక్షలకోట్లను అప్పులు ఇస్తున్నారు. వ్యవసాయానికి 2.2 శాతం అప్పులిస్తే ఇపుడు 18 శాతం ఇవ్వమని ఆదేశాలున్నాయి. 1969 లో వ్యవసాయానికి మొత్తం 162 లక్టల రూ.ను ఇస్తే , 2011 సం.లో 4లక్షల కోట్ల రూ.లను ఇచ్చారు. ప్రాధాన్యతారంగాలకు అప్పులు15 శాతంనుండి 41 శాతానికి పెరిగాయి. మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్‌ వ్యవస్ధ విస్తరించింది. బ్యాంకు శాఖలు 8262 సంఖ్య నుండి 1,41,756 కు పెరిగాయి.
చరిత్ర లో తనకు సంబంధాలున్నవారికే అప్పులివ్వటం అనివార్యంగా వినాశనానికే దారితీసింది. అప్పుతీసుకునేవాడు యాజమాన్యంలో వుంటే, బ్యాంకు వసూలు చేయగల్గిన రుణాలు ఎలా ఇవ్వగలుగుతుంది. ఫలితంగా నిరర్ధక ఆస్ధులు అలవికాని స్ధాయికి చేరుకున్నాయి. తాజా ఉదాహరణలు యస్‌ బ్యాంకు, లక్ష్మీవిలాస్‌ బ్యాంకు, ఐ.ఎల్‌.ఎఫ్‌.ఎస్‌ బ్యాంకులు – దివాళాతీసిన తీరు ఆర్బీఐ నియంత్రణా వైఫల్యాలను సూచిస్తున్నది..

ప్రస్తుతం కొన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలు కొన్ని బాగా నడుస్తూ వుండవచ్చు. వారి స్వంత క్రమశిక్షణ పాత్ర చాలా ఎక్కువగా వుంటుంది. ప్రభుత్వ పర్యవేక్షణ వలన బాగున్నాయనుకోవటానికి వీలులేదు.చిన్నమొత్తంలో పొదుపుచేసుకునే సామాన్యప్రజానీకాన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల కు అప్పచెప్పటంవలన జరిగిన కంపెనీల ఎగవేతలూ, పొదుపుదారుల ఆక్రందనలూ, ఆత్మహత్యలూ అందరికీ తెలిసినవే. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలపైన పర్యవేక్షణ బలహీనంగా వుంది. కొంతమంది వ్యాపార సామ్రాజ్యాధిపతులు రాజకీయనాయకుల అండదండలతో సామాన్యప్రజలపొదుపు సొమ్ముతో ఆటలాడుకుంటున్నారు.
మన దేశంలో ఇపుడు వున్న బ్యాంకులు చాలవా మళ్ళీ కార్పోరేట్‌ బ్యాంకులెందుకు అనే ప్రాధమిక ప్రశ్నను కొంతమంది లేవనెత్తుతున్నారు. కార్పోరేట్‌ కంపెనీలు ప్రజల సొమ్ముతోనే వ్యాపారాలు చేస్తాయి. స్వంత పెట్టుబడితో వ్యాపారాలు చేయటం చాలా అరుదు. ప్రజల వద్దనుండి నిర్దిష్ట పనులకు తీసుకున్న పెట్టుబడులు ఆయా పనులకు వినియోగించటం వుండదు. బడా కార్పోరేట్‌ సంస్ధలను బ్యాంకులకు దూరంగా వుంచకపోతే మొత్తం ఆర్ధిక వ్వవస్ధనే మింగేస్తారు.

పారిశ్రామిక సంస్ధలకు పెట్టుబడులు కావాలి. వారి చేతిలో బ్యాంకు వుంటే సునాయాసంగా ప్రశ్న లేకుండా డిపాజిట్ల రూపంలో పెట్టుబడులను పొందగలరు. ఆ డబ్బులను స్వంత కంపెనీలలోకి , మళ్ళించటం సహజ ప్రక్రియ. పరిశ్రమ దివాళా తీస్తే బ్యాంకు కూడా దివాళా తీయక తప్పదు. మొండి బాకీలు నిరర్ధక ఆస్ధులయి బ్యాంకు దివాళాతీస్తుంది. బ్యాంకు దివాళా ప్రభావం పరిశ్రమ మీద పడుతుంది. ఈ గొలుసుకట్టు పరిణామాలలో మొదటి బాధితుడు బ్యాంకు లో డబ్బులు దాచుకున్న సామాన్య డిపాజిట్‌ దారుడు. తరువాత ఉద్యోగాలు కోల్పోయే బ్యాంకు ఉద్యోగులు. అసలైన బాధితులు పన్నులు కట్టే సామాన్య పౌరులు .


ప్రయోజనాల మధ్య సంఘర్షణ
స్వంత ప్రయోజనాలకూ తన వ త్తి ధర్మాలకూ సంఘర్షణ సంభవించినపుడు, ఎటువైపు వుంటారనేది ముఖ్యసమస్య. కార్పోరేట్‌ బ్యాంకు రైతులకు, సామాన్యప్రజలకు అప్పులు ఇవ్వాలా లేక తన పరిశ్రమకు అప్పులిచ్చి, స్వంత లాభాలు పెంచుకోవాలా అనే ప్రయోజనాల మధ్య ఘర్షణ వచ్చినపుడు అనివార్యంగా తనపరిశ్రమవైపే మొగ్గుచూపుతున్నారనేది చారిత్రక సత్యం. అదానీ గారు బ్యాంకు పెట్తే, తనకు కొత్తగా కేటాయించిన విమానాశ్రయాలకు అప్పులు ఇస్తాడా లేక రైతులకు అప్పులు ఇస్తాడా? హిందూ వ్యాస రచయిత గోపీనాధ్‌ గారికధలో..ఎట్టిపరిస్ధితులలోనూ కోడిని తినను అని ప్రతిజ్ఞ చేసిన ఒక నక్కను కోళ్లఫారం వద్ద కాపలాపెట్టారు. ఆకలి అయినపుడు నక్కఏంచేస్తుందో-అదే విధంగా కార్పోరేట్‌ కంపెనీలు చేస్తాయని గోపీనాధ్‌ చెప్పారు. సెబీ నిపుణుడు హేమీంద్ర హజారీ ‘ నక్కలను కోళ్ళకు ఇన్‌ఛార్జిగా కాపలా ఉంచాలని, ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు చేసింది. ప్రస్తుత ఆర్థిక పాలనలో కూడా, ప్రారంభ దశలో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వంటి పెద్ద నియంత్రిత ఆర్థిక సంస్థల అనుసంధాన రుణాలను ఆర్‌బిఐ గుర్తించలేకపోయింది.” అన్నారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరల్‌ ఆచార్య సంయుక్తంగా ఒక వ్యాసం వ్రాశారు. కార్పోరేట్‌ కంపెనీలు బ్యాంకులు పెట్టడానికి అనుమతివ్వాలంటూచేసిన ప్రతిపాదన పిడుగుపాటు లా అనిపించిందన్నారు.” చరిత్ర చూసుకుంటే రుణాలు ఇవ్వటమనేది ఇప్పటికీ సరిగ్గా జరగని ప్రక్రియే. అటువంటిది ఒక రుణగ్రహీత చేతిలో బ్యాంకు వుంటే..రుణాల జారీ సక్రమంగా ఉంటుందని ఎలా ఆశించగలం. ఒక స్వతంత్ర నియంత్రణసంస్ధఉన్నా ..దాని చేతిలో ప్రపంచంలోని మొత్తం సమాచారంఉన్నా ..ఆర్ధికవ్యవస్ధలో ఎక్కడో ఏమూలో చోటు చేసుకునే అసమంజస రుణాన్ని ఎలా కనిపెట్టగలదు” అని ప్రశ్నించారు. గత కొన్నేళ్ళుగా కార్పోరేట్‌ ఎగవేతలు మనముందుకనిపిస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా వారికి ప్రమోటర్లుగా అవకాశమిచ్చి బ్యాంకులు పెట్టుకోమని లైసెన్సులు ఇవ్వాలనటం సరికాదని అభిప్రాయపడ్డారు. కొన్ని కార్పోరేట్‌ గ్రూపులు ఆర్ధికంగా మరింత బలపడటానికి బ్యాంకు లైసెన్సులు దోహదపడతాయన్నారు.

బలహీనమైన నియంత్రణ , పర్యవేక్షక సామర్థ్యం లేవి ఆర్బిఐ యొక్క రికార్డును చూస్తే, రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ కార్పోరేట్‌ బ్యాంకుల రుణాలను పర్యవేక్షించగలదా అని ప్రముఖ ఆర్ధిక వేత్త, ప్రభుత్వ మాజీ సలహాదారు ఇలాపట్నాయక్‌ అన్నారు.ఇలా పట్నాయక్‌, రాధికాపాండే అనుమానించారు. రెగ్యులేటరీ వ్యవస్ధను అదనంగా అభివ ధి చేసి పర్యవేక్షించాలని శంకర ఆచార్య, విజయ కేల్కర్‌, అరవింద్‌ సుబ్రమనియన్‌, ఇండిన్‌ ఎక్సప్రెస్‌ పత్రిక లో సంయుక్తంగా ఒక వ్యాసం వ్రాస్తూ, ‘పారిశ్రామిక సంస్ధలకు స్వంత బ్యాంకులను అనుమతించటం ఆర్ధిక వ ద్ధిని , ప్రజాస్వామ్యాన్నీ దెబ్బతీయడమే అన్నారు.భారత పెట్టుబడిదారీ విధానం కళంకం కలిగి వుంది. ఎందుకంటే ప్రభుత్వానికీ పారిశ్రామిక పెట్టుబడికీ దుష్ట సంబంధాలున్నాయి. పారిశ్రామిక పెట్టుబడి కి ఫైనాన్స్‌ కేపిటల్‌ కీ మధ్య అడ్డంగా వున్న రేఖను చెరిపేస్తే ఈ కళంకం మరింత ఘోరంగా వుంటుంది.” అన్నారు. కార్పోరేట్లకు బ్యాంకుల లైసెన్సులు ఇవ్వటం అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి బాటలు వేయటమేనని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్ధికవేత్త కౌశిక్‌ బసు అన్నారు. ప్రభుత్వ చర్యలు ఆర్ధిక అస్ధిరత్వానికి దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు.

ప్రభుత్వ రంగం బ్యాంకులను కార్పోరేట్‌ సంస్ధల స్వంతం చేసే కుట్ర

ప్రస్తుతం రిజర్వ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేంద్రప్రభుత్వ కనుసన్నలలో నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఏమికావాలంటే ఆర్బీఐ అది చేస్తున్నది. కేంద్రప్రభుత్వం కార్పోరేట్‌ సంస్ధల ప్రయోజనాలను నెరవేరుస్తున్నది. ప్రభుత్వ రంగం లోని బ్యాంకులను కైవసం చేసుకోవడానికి ఇదొక కొత్త వ్యూహం.
నయాఉదార వాదవిధానాల పిదప జాతీయబ్యాంకులను మూసివేసి ప్రయివేటు బ్యాంకులుగా మార్చమని భారత్‌ ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతున్నది. ప్రభుత్వ బ్యాంకుల పని తీరు అధ్వాన్నంగా వున్నందున జాతీయకరణ రద్దుచేసి మొత్తం బ్యాంకులనన్నిటినీ ప్రయివేటు చేయాలన్నది బలమైన ప్రజాభిప్రాయంగా మలుస్తున్నారు. జాతీయ బ్యాంకులలో ప్రయివేటువ్యక్తుల మూలధనాన్ని పెంచుకోవటానికి అనుమతించి ఆతరువాత పెట్టుబడుల ఉపసంహరణపేరున షేర్లను అమ్మేసి బ్యాంకులను కార్పోరేట్‌ పరిశ్రమాధిపతులకు అప్పచెప్పేందుకు జరుగుతున్నకుట్ర లో భాగమే ఈ సూచనలు. అంతర్జాతీయద్రవ్యపెట్టుబడి ఆధిపత్యం పెరిగే కొద్దీ బ్యాంకులన్నిటినీ కార్పోరేట్‌ కంపెనీలే స్వంతం చేసుకుంటాయి. మన స్వాతంత్య్రం, జాతీయ సార్వభౌమత్వం దెబ్బతినటమేకాక రైతాంగం, చిన్నఉత్పత్తిదారులు,చిరువ్యాపారులు రుణ సౌకర్యంలేక కష్టాలపాలవుతారు. కొద్దిమంది కార్పోరేట్‌ అధిపతుల వద్ద అనూహ్యమైన సంపద పోగుపడుతుంది. పెట్టుబడి పోగుపడే ప్రక్రియ వేగవంతమయి అసమానతలు పెరిగి దారిద్య్రం తాండవిస్తుంది. ప్రభుత్వబ్యాంకులను కార్పోరేట్‌ సంస్ధలకు కట్టబెట్టే ప్రతిపాదనలు ఉపసంహరించాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లారాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు,ఫోన్‌. 9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఐఆర్‌ఎస్‌ అధికారులపై వేటు: మోడీ బాబాకు అంత ఆగ్రహం ఎందుకు !

30 Thursday Apr 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

A stroke on IRS officers, CBDT, CBDT chargesheets three IRS officers, IRS officers, RBI

मोदी सरकार की 20 बड़ी 'उपलब्धियां ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం, మన దేశం కూడా అత్యంత కష్టకాలంలో ఉంది. గతంలో ప్లేగు, కలరా వంటి మహమ్మారులు ప్రబలినపుడు జనం పెద్ద సంఖ్యలో దిక్కులేని చావులకు గురైయ్యారు తప్ప ఇంతటి ఆర్దిక విపత్కర పరిస్ధితి బహుశా మన దేశంలో ఇదే ప్రధమం కావచ్చు.
మన దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యవ్యవస్ధ కలిగినది అని చెప్పుకుంటాం. అఫ్‌కోర్స్‌ ఆ వైఖరితో విబేధించేవారిని అనుమతించినంత కాలం అది ప్రజాస్వామిక వ్యవస్ధగానే ఉంటుంది. ఎవరైనా కొత్త ఆలోచనను ముందుకు తేవటం లేదా సూచనలు చేయటం తప్పుకాదు. దాన్ని చర్చించి లేదా చర్చించకుండానే పాలకులు పక్కన పెట్టేయవచ్చు. గతంలో అనేక మంది ఎన్నో విలువైన సూచనలు చేశారు. వాటిని పాలకులు చర్చించకుండానే పక్కన పెట్టారు. పాలకులు చేసిన అనేక ప్రతిపాదనలు, చర్యలను జనం తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్య సూత్రం. కానీ అసలు సూచన చేయటమే తలకొట్టివేసే తప్పిదం అన్నట్లుగా ఎవరైనా వ్యహరించటాన్ని ఏమనాలి?
దేశంలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అరవైతొమ్మిది వేల కోట్ల రూపాయల పెద్దల రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు స్వయంగా రిజర్వుబ్యాంకే ఒక సమాచార హక్కు అర్జీదారుకు సమాధానమిచ్చింది. ఇదే విషయాన్ని గృహబందీకి ముందు ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రుణాల రద్దు గురించి వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ గాంధీకి రద్దుకు అర్ధం తెలియకపోతే తమ నేత మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకొమ్మని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో యాభై మంది ఐఆర్‌ఎస్‌ అధికారులు కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యల నిమిత్తం ఆదాయం పెంపుదలకు సూచనలు చేసినందుకు ఐఆర్‌ఎస్‌ అసోసియేషన్‌ నేతలుగా ఉన్న ముగ్గురు సీనియర్‌ అధికారుల మీద నరేంద్రమోడీ సర్కార్‌ వేటు వేసింది. ఈ ప్రతిపాదనలు దేశం కొంపను ముంచుతాయన్నట్లుగా చిత్రించింది. కొద్ది మంది కార్పొరేట్లకు, ధనికులకు లక్షల కోట్ల రూపాయల రుణాల రద్దు, రాయితీలు ఇచ్చినపుడు మునగని కొంప వారి నుంచి పన్ను రూపంలో తాత్కాలిక అత్యవసర చర్యగా కొన్ని లక్షల కోట్లు వసూలు చేస్తే ఎలాా మునుగుతుంది ? ఒక చర్యను అడ్డగోలుగా సమర్ధించుకున్న కేంద్రం మరొక చర్య మీద ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
మన ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడకుండా మౌనవృతంలో ఇప్పటికే ప్రపంచ పాలకుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.కోవిడ్‌-19(కరోనా వైరస్‌) మహమ్మారి విషయంలో మోడీ బాబాగా మారుతున్న తీరు తెన్నులు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రుల సమావేశాల్లో, ఇతరంగా దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడిన సందర్భాలలో చెప్పిన మాటలు, ప్రవచనాలే అందుకు పెద్ద నిదర్శనం. వాటిని పునశ్చరణ చేస్తే భక్తులకు ఆగ్రహం, అంతకంటే చదువరులకు సమయం దండగ అవుతుంది. గృహబందీ ప్రకటించటం ద్వారా మోడీ తన తెలివి తేటలను అమోఘంగా వ్యక్తపరిచారని,జనం ప్రాణాలను కాపాడారని భజన చేస్తున్నవారి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. చైనాలో మన కంటే రెండు నెలల ముందు అమలు జరిపిన గృహబందీని గుర్తు తెచ్చుకొంటే దాన్నే మన దేశంలో అమలు జరపటం అనితర ఆలోచన, పెద్ద గొప్ప అని ఎవరైనా అంటే ఎందుకు కాదు అని తలవంచుకొని పోవటం తప్ప వారితో వాదించి లాభం లేదు.
భారతీయ జనతా పార్టీ పెద్దలు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంటారు. తమ మోడీ గనుకే జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తేగలిగారని ఊరూ వాడా వాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం ఏడవ స్ధానంలోకి తిరోగమించాం. అంతకంటే దిగజార్చలేదుక కనుక అదీ గొప్పేకదా అంటారేమో, దాన్ని కాసేపు పక్కన పెడదాం. కరోనా వైరస్‌ దాడిని ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఉద్దీపన పధకాలు ప్రకటిస్తున్నాయి. వాటిలో లోపాల గురించి లేదా కార్పొరేట్‌ రంగానికే పెద్ద పీట అన్న విమర్శలు-వాస్తవాల గురించి కూడా కాసేపు మరచిపోదాం. మన దేశం ఇంతవరకు ప్రకటించిన తక్షణ ప్రత్యక్ష ఉద్దీపన పధకం లక్షా 75వేల కోట్ల రూపాయలు మన జిడిపిలో 0.7శాతం. ఇదే సమయంలో తక్షణ ఉద్దీపన చర్యలకు గాను అమెరికా 9.1, జర్మనీ 6.9, బ్రిటన్‌ 4.5, ఫ్రాన్స్‌ 2.4శాతం ప్రకటించాయి. ఇవిగాక వాయిదా వేసిన, ఇతర ఉద్దీపనలు కూడా కలుపుకుంటే చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న మనం వీటి సరసన ఎక్కడ ఉన్నాం, ఇంత తక్కువ ప్రకటిస్తే మన నాయకత్వాన్ని అంగీకరిస్తాయా ? ఎందుకు మూట ముడి విప్పటం లేదు, ఆ దేశాలకు మల్లే పరిస్ధితి విషమించిన తరువాత విప్పుతామంటారా ? మరోవైపు మన మోడీ గారి దోస్తు ట్రంప్‌ రెండవ పాకేజీ కూడా ప్రకటించారు. ఆయనకేం నవంబరులో ఎన్నికలున్నాయి కనుక రెండు కాదు నాలుగు ప్రకటిస్తాడు, మనకేం ఎన్నికలున్నాయి అంటారా ? అదైనా చెప్పండి, జనం ఆశలేమీ పెట్టుకోకుండా తిరిగి ఎన్నికలు వచ్చే వరకు తమదారి తాము చూసుకుంటారు. అసలు సమస్య ఏమిటి ?
మోడీ బాబా గారు ఇంతవరకు చేసిన ప్రసంగాలు, ప్రకటించిన కార్యక్రమాల్లో మన సంకల్పాన్ని ప్రదర్శించే చప్పుట్లు కొట్టటం, నూనె, కొవ్వొత్తి దీపాలు వెలిగించటం, విద్యుత్‌ దీపాలు ఆర్పించటం, రోజూ చేతులు కడుక్కోవాలనే అంశాలు తప్ప మరొకటేమీ లేవు. కావాలంటే ప్రతి రోజూ చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దాం, సంకల్పాన్ని పదే పదే ప్రకటిద్దాం. కానీ అది చాలదే ! గృహబందీ పొడిగింపు, సడలింపులకు సంబంధించి ముఖ్యమంత్రులతో మాట్లాడటం తప్ప ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇతరంగా ఆర్ధిక పరిస్ధితి గురించి సూచనలు, సలహాలను కోరుతూ ముఖ్యమంత్రులతో లేదా ఇతరులతో ఎలాంటి ప్రత్యేక వీడియో సమావేశాలను నిర్వహించలేదు, సూచనలు పంపాలని కోరలేదు. మన ఖజానా పరిస్ధితి ఇలా ఉంది ఏం చేద్దామని అడిగితే కేంద్రానికి పోయేదేముంది ?
ఇక బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని కావాలని ఎగవేసిన యాభై సంస్ధల పెద్దలకు దాదాపు 69వేల కోట్ల రూపాయలను గతేడాది సెప్టెంబరు నాటికి రద్దు చేసినట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది. ఇలాంటి మొత్తాలు దాదాపు ఎనిమిది లక్షల కోట్లు, ఇంకా ఎక్కువే ఉంటాయి. అయితే సాంకేతిక భాషలో చెప్పాలంటే వీటిని సాంకేతికంగా రద్దు చేయరు. వసూలు చేయాల్సిన పారు బాకీల కింద రోజువారీ చిట్టాల నుంచి తొలగించి తరువాత వసూలు చేసే ఖాతాలో చూపుతారు. అయితే మన ”సమర్ధ ” ప్రధాని మోడీ గారి ఏలుబడిలో ఈ మొత్తంలో ఎంత వసూలు చేశారన్నది ముఖ్యం. గత పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులను రద్దు చేస్తే ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు సెలవిచ్చినదాని ప్రకారం కేవలం ”పక్కన పెడితే ” దానిలో 80శాతం నరేంద్రమోడీగారి ఏలుబడిలోనే జరిగింది. ఇవన్నీ ప్రతిపక్షాల బుర్రలో పుట్టినవి కాదు, రిజర్వుబ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారమే నండోరు.కాంగ్రెస్‌ ఏలుబడిలో కావాల్సిన వారికి అప్పులు ఇప్పించారని చెప్పిన బిజెపి వారు అలాంటి కాంగ్రెస్‌ అనుకూలుర నుంచి గోళ్లూడగొట్టి ఎందుకు వసూలు చేయలేదు ? మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు వంటి వారందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరటమే దీనికి కారణమా ? పక్కన పెట్టిన (రద్దు చేసిన) బాకీలను వసూలు చేస్తున్నామని బ్యాంకులు, ప్రభుత్వం చెబుతోంది. ఎన్ని లక్షల కోట్లు పక్కన పెట్టారు, ఎన్ని లక్షల కోట్లు వసూలు చేశారో ఎవరికైనా చెబుతున్నారా ? పది హేను నుంచి 20శాతం వరకు మాత్రమే వసూలు శాతం ఉందని ఒక అంచనా, దాని ప్రకారం, నరేంద్రమోడీ తొలి ఏలుబడిలో రద్దు చేసినట్లు చూపిన 5,55,603 కోట్లకు గాను కనిష్టంగా 80వేల కోట్లు, గరిష్టంగా అయితే లక్షా పదివేల కోట్లకు మించి లేవు, అంతకు ముందు రద్దు చేసిన మొత్తంతో సహా ఏడులక్షల కోట్లనుకుంటే లక్షా40వేల కోట్లకు మించి తేలటం లేదు. విజయమల్య తాను చెల్లిస్తాను మహాప్రభో అంటున్నా తీసుకోవటం లేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతకాలం వసూలును సాగదీస్తారు. వీరికి- వారికి పర్సెంటేజ్‌లు ఇంకా కుదరలేదా అని జనం అనుకుంటున్నారు.
బడా బడా బాబులకు వేల కోట్ల రుణాలు రద్దు చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు అది రద్దు కాదు, కావాలంటే మీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకో అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్ల మీద ట్వీట్లతో సమాధానమిచ్చారు. అమ్మా నిర్మలమ్మా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమే అనుకుందాం. అదే రీతిలో అనేక అంశాలకు మీరు కూడా నరేంద్రమోడీ గారిని అడిగి తెలుసుకొని జనానికి చెప్పాలమ్మా ? మచ్చుకు ఒక్కటి, నెలన్నరగా పెట్రోలు, డీజిలు రేట్ల సవరణ చేయకపోవటాన్ని ఏమనాలో కాస్త చెబుతారా ? అసలే ఉపాధిపోయి, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న జనాన్ని లాక్‌డౌన్‌ సమయంలోనూ బాదటం లేదా, జేబులు కొల్లగొట్టటటాన్ని ఏమనాలి? గృహబందీకి ముందు చివరిగా మార్చి16న పెట్రోలు, డీజిలు రేట్లను సవరించారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి సవరణ లేదు, ఈ మధ్య కాలంలో రికార్డు స్ధాయిలో ముడి చమురు రేట్లు పడిపోయాయి. అంతర్జాతీయ రేట్లు తగ్గితే తగ్గింపు, పెరిగితే పెంపు విధానం ప్రకారం ప్రతి రోజూ సవరిస్తామన్నారు కదా గత నెలన్నరగా ఎందుకు నిలిపివేశారు ? చమురు బిల్లు తగ్గింది, జనం దగ్గర వసూలు పెరిగింది, పోనీ ఆమేరకైనా జనానికి సంక్షేమ చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. డబ్బు పోగేసి ఎవరికి ధారాదత్తం చేయాలనుకుంటున్నారు, గతంలో కార్పొరేట్లకు ప్రకటించిన రాయితీలను ఈ విధంగా జనం నుంచి వసూలు చేస్తున్నారా ? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
తొలిసారి ప్రకటించిన నామమాత్ర పాకేజి తప్ప మరోసారి ఆలోచన లేదని అన్ని తరగతుల నుంచి విమర్శలు వెల్లువెత్తినా దున్నపోతు మీద వానకురిసినా మిన్నకున్నట్లు ఏమీ మాట్లాడరు. ఐఆర్‌ఎస్‌ అధికారులు ఒక సలహా చెబితే వారినేతలను ఉద్యోగాల నుంచి పక్కన పెట్టి మీ మీద ఇతర చర్యలు ఎందుకు తీసుకో కూడదో సంజాయిషీ ఇవ్వండని నోటీసులు ఇచ్చారు. ఇదెక్కడి విపరీతం ? వారు తయారు చేసిన సిఫార్సుల పత్రాన్ని ప్రధాని, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డైరెక్టర్లకు, ఆర్ధికశాఖకు పంపారు. అదే ప్రతిని మీడియాకు విడుదల చేశారు. యువ అధికారులను తప్పుదారి పట్టించారని, ఆ సూచన పత్రాన్ని అనుమతి లేకుండా బహిరంగ పరిచారు కనుక అది ఉద్యోగ నిబంధనలను అతిక్రమించటమే అంటూ ఈనెల 27వ తేదీలోగా రాతపూర్వకంగా లేదా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తొలగించింది. ఈశాన్య ప్రాంత దర్యాప్తు విభాగం ముఖ్య డైరెక్టర్‌ సంజరు బహదూర్‌,ఐఆర్‌ఎస్‌ అధికారుల అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి,డిఓపిటి డైరెక్టర్‌ శ్రీ ప్రకాష్‌ దూబే, ఢిల్లీ ఆదాయపన్ను ముఖ్య కమిషనర్‌ మరియు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అయిన ప్రశాంత భూషణ్‌ మీద చర్య తీసుకున్నారు. వారు చేసిందేమిటి ?
ప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ నోటీసు ప్రకారం దూబే, బహదూర్‌ ఆదాయపెంపుదల గురించి ఒక నివేదికను తయారు చేయమని తమ జూనియర్‌ అధికారులను కోరారు. ఆ నివేదికను ప్రశాంత భూషణ్‌ బహిర్గతం చేశారు. ఈ చర్యలు అనుమతి లేనివి, తమ విధులను పక్కన పెట్టి ఇతర పనులు చేయటంగా, ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమైనవి వర్ణించారు. యువ అధికారులు తయారు చేసిన ఈ సూచనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ఉండేది, కానీ ఈ ఉదంతంలో అధికారిక పద్దతుల్లో ప్రభుత్వానికి పంపకుండా బహిరంగ పరచటంతో ఇప్పటికే ఆర్ధిక వ్యవస్ధ వత్తిడికి గురైన స్దితిలో ఈ నివేదిక భయాందోళనలను, పన్ను విధాన అనిశ్చితి పరిస్ధితిని కలిగించిందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. ఈ నివేదిక వివరాలు బయటకు వచ్చిన తరువాత భయంతో ఏ ఒక్క పారిశ్రామిక, వాణిజ్యవేత్త లేదా ఇతర ధనికులు భయంతో ఆత్మహత్యల వంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినట్లు ఎలాంటి వార్తలు లేవు. ఏ విదేశీ కంపెనీ కూడా మన దేశం నుంచి బయటకు పోతామని, ఏ స్వదేశీ సంస్ధ కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించలేదు. కోట్లాది మందికి ఉపాధిపోయినా, వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఆందోళనకు గురైనా, రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురైనా చీమ కుట్టినట్లుగా కూడా లేని కేంద్ర సర్కార్‌ ఈ ప్రతిపాదనల మీద ఎందుకు అంతలా వణికిపోయినట్లు ? అదృష్టం కొద్దీ వారు నివేదికను బహిర్గతం చేసిన సమయంలో మార్కెట్‌లు మూతపడి ఉన్నాయట. అతిశయోక్తి గాకపోతే స్టాక్‌ మార్కెట్‌ ఆ నివేదికకు ముందు ఎన్నివేల పాయింట్లు పతనమైందో జనానికి తెలియదా ? మరి దానికి కారకులెవరు ?
ఐఆర్‌ఎస్‌ అధికారులేమీ ధనికుల ఆస్ధులను స్వాధీనం చేసుకోమని చెప్పలేదే, కోటి రూపాయలకు పైబడిన ఆదాయం వస్తున్నవారి మీద ఆదాయపన్ను 40శాతం విధించాలని, నాలుగుశాతం కోవిడ్‌-19 సెస్‌ విధించాలని, ఐదు కోట్ల రూపాయలకు పైబడిన సంపదలు కలిగిన వారి మీద సంపద పన్ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సంఘపరివార్‌ ప్రమాణాల ప్రకారం చూసినా ఇదేమీ దేశద్రోహం కాదు, సూచనలు చేసిన వారు తుకడే తుకడే గ్యాంగు అసలే కాదు, పోనీ వారు చెప్పినట్లు వసూలు చేస్తే వచ్చే సొమ్ము పాకిస్ధాన్‌ లేదా అది పంపే ఉగ్రవాదులకు పోయేది కాదు. సామాన్యులు, మధ్యతరగతి వారి నుంచి ఎంత వీలైతే అంత పిండి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు గత ఐదు సంవత్సరాలుగా అనుసరిస్తున్న పెద్దలకు దానికి భిన్నమైన ఇలాంటి ప్రతిపాదనలు కేంద్ర సర్వీసు ఉన్నతాధికారుల నుంచి రావటం మింగుడు పడలేదు. ఆగ్రహానికి కారణం ప్రతిపాదనలు చేసినందుకు కాదట, వాటిని బహిర్గత పరచినందుకట. ప్రతి రోజూ కేంద్రానికి ఇలాంటి అనేక ప్రతిపాదనలు వస్తుంటాయి, ఇంతవరకు ఎన్నింటిని బయట పెట్టారు. బహుశా తమ ప్రతిపాదనలు కూడా అలా బీరువాలకే పరిమితం అవుతాయని, బహిరంగ పరిస్దే చర్చిస్తారని భావించి బహిర్గత పరచి వుండవచ్చు. ఇలాంటి ప్రతిపాదనల మీద చర్చ జరిగితే లేదా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే ధనికులకు ఆగ్రహం కలుగుతుంది. అవును, ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో తాత్కాలికంగా కొంత కాలం అయినా ఎందుకు అమలు జరపరు అని కాస్త బుర్ర ఉన్న జనంలో చర్చ జరుగుతుంది. వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం ఎంత జరిగినా పర్లేదు గానీ ఇలాంటి అంశాలు జనం మెదళ్లలోకి ఎక్కితే దాన్ని ” నయా లేదా కాషాయ దేశ భక్తులు ” తట్టుకోలేరు. అందుకే తమదైన శైలిలో ఐఆర్‌ఎస్‌ అధికారులను కొందరు అర్బన్‌ నక్సల్స్‌ అని నిందిస్తూ పోస్టులు పెట్టారు. ఎంత దుర్మార్గం ?
దేశంలోని 140 కోట్ల మంది జనాభాకు కోటీ 75లక్షల కోట్ల మేరకు ఉద్దీపన ప్రకటించిన కేంద్రం,అంతకు కొద్ది వారాల ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు లక్షా 45వేల కోట్ల రూపాయల పన్ను రాయితీ తగ్గించిన విషయం మరువగలమా ? కొత్త పరిశ్రమలకు పన్ను రేట్లు తగ్గించారు. ఆ విధానాన్ని ఐఆర్‌ఎస్‌ అధికారులు తప్పు పడుతూ బజారుకెక్కితే అది ఉద్యోగ నిబంధనలకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కనుక చర్య తీసుకున్నామంటే అర్ధం ఉంది. వారా పని చేయలేదే ! దేశం, ప్రపంచం యావత్‌ ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ఎదుర్కొంటున్న సమయంలో ఉద్యోగా మరొకరా అన్నదానితో నిమిత్తం లేకుండా సూచనలు చేయటాన్ని కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్ధ అంగీకరించదా ?దీన్ని ప్రజాస్వామ్యం అనాలో నియంతృత్వం అని వర్ణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.

baba ji ka thullu by modi
నూరు పూవులు పూయనివ్వండి, నూరు ఆలోచనలను తర్కించనివ్వండి ఇది చైనాలో మావో ఇచ్చిన ఒక ఉద్యమ పిలుపు. చైనా ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలను, విధానాల మీద సవిమర్శలను వ్యక్తం చేయనివ్వాలన్న కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మావో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.(కొందరు నూరు పూవులు పూయనివ్వండి, వెయి ఆలోచనలను వికసించనివ్వండి అని కూడా దీన్ని వర్ణించారు. దీనిలో కూడా తప్పులేదు). అలాంటి ఆలోచనలను ఆహ్వానించిన కారణంగానే నేడు ప్రపంచంలో రెండవ ధనిక దేశంగా చైనా ఎదిగింది. సరే కొందరు కమ్యూనిస్టు నియంతృత్వం అని ఆరోపించే వారు, అది నిజమే అని నమ్మేవారు ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. ఇది చైనా వ్యవహారం కనుక పక్కన పెడదాం. మన దేశం విపత్కర పరిస్ధితుల్లో ఉన్నపుడు ఆదాయ పెంపు సూచనలు చేస్తే వాటితోనే దేశ ఆర్ధిక వ్యవస్ధ తలకిందులై పోతుందన్నట్లుగా భయపడటం అంటే గత ఐదేండ్లలో మన పెరుగుదల వాపా, బలుపా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ పాలనలో ఈ వాస్తవాలను కాదనే ధైర్యం ఉందా !

16 Sunday Feb 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra Modi governance, RBI

Image result for modi governance cartoons
ఎం కోటేశ్వరరావు
దేశమంతటా ఎన్‌ఆర్‌సి గురించి అబ్బే అసలు ఆలోచన కూడా చేయలేదని నరేంద్రమోడీ-అమిత్‌ షా పలికిన ‘సత్య’ వ్యాక్యాలతో వారు అపర సత్యహరిశ్చంద్రులని నమ్మే వారిలో చాలా మందికి దూల తీరింది. వారు కాదన్నా ఎన్‌ఆర్‌సి పెట్టాలంటూ వీరంగం వేసే వారు ఉన్నారు. మోడీ గారి పాలనలో అప్పులు చేయలేదని చెప్పటం కూడా ‘సత్యవాక్పరిపాలన’లో భాగమే. నేతలు అబద్దాలు చెప్పవచ్చు, అంకెలు, అందునా రిజర్వుబ్యాంకు చెప్పదు కదా (ఏమో ఇప్పుడు దాని మీద కూడా అనుమానాలు రావచ్చు)
రిజర్వుబ్యాంకు నివేదికల్లో చెప్పిన దాని ప్రకారం 2014 మన్మోహన్‌ సింగ్‌ గారు దిగిపోయే నాటికి మన స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం :64,11,200 కోట్లు. దీనిలో స్వదేశీ 60,45,007 కోట్లు కాగా విదేశీ 3,66,193 కోట్లు.
నేను గానీ వస్తే మంత్ర దండం వేసి అప్పులు తీర్చివేస్తా, కొత్త అప్పులు చేయను, విదేశాల నుంచి నల్లధనపు నిల్వలు తెస్తా అని ఊరూ వాడా టాంటాం వేసిన నరేంద్రమోడీగారు ఎంత నల్లధనం తెచ్చారో మనకైతే తెలవదు. కానీ అప్పులు మాత్రం 2019 సెప్టెంబరు 15న ఆర్‌బిఐ ప్రచురించిన సమాచారం ప్రకారం 2019 మార్చినెల నాటికి మొత్తం అప్పును 1,02,55,099 (అరవైనాలుగు లక్షల కోట్ల నుంచి అక్షరాలా ఒక కోటీ రెండు లక్షల యాభైఐదు వేల తొంభై తొమ్మిది కోట్లకు) పెంచారు. పోనీ ఇంతా చేసి అభివృద్ధి సాధించారా అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు కూడా ఉంచకపోగా ఐదుశాతానికి లోపుగా దిగజార్చారు.
ఎడా పెడా విదేశాలకు ఎందుకు తిరుగుతున్నారు ప్రధాని గారూ అంటే దేశ పలుకుబడి పెంచటానికి అని చెప్పారు. ఆయన భక్తులైతే మోడీ పలుకుబడితో రాయితీలతో కూడిన అప్పులను పెద్ద మొత్తంలో తెస్తున్నారని భజన చేశారు. ఇది కూడా అబద్దమే. మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో విదేశీ రుణాల(అన్ని రకాలు కలిపి)లో రాయితీలతో ఉన్న మొత్తం 35.8శాతం నుంచి 10.4శాతానికి పడిపోయింది. విదేశాల్లో పలుకు బడి పెంచి, విశ్వసనీయతను పెంచామని చెప్పిన మోడీ గారి ఏలుబడిలో 2019 నాటికి ఆ మొత్తం 8.7శాతానికి పడిపోయింది. విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతామని చెప్పారు.
2014-15లో (మోడీగారి తొలి ఏడాది) రూపాయల్లో అన్ని రకాల విదేశీ పెట్టుబడుల ప్రవాహ విలువ రూ.4,49,072 (డాలర్లలో 73456 మిలియన్స్‌) ఉండగా 2019 మార్చినాటికి ఆ మొత్తాలు రూ.2,12,179 కోట్లకు(30094 మిలియన్‌ డాలర్లు) పడిపోయింది. ట్రంప్‌తో సహా విదేశీ నేతలందరినీ కౌగలించుకోవటం, ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఫొటోలకు ఫోజులివ్వటం తప్ప ఎందుకు విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయో ఎవరైనా చెప్పగలరా ? మన ఆర్ధిక వ్యవస్ధ మీద, దాన్ని నడిపించే నరేంద్రమోడీ మీద విశ్వాసం తగ్గటానికి ఇది సూచిక కాదా ? గత ఆరు సంవత్సరాలలో ముస్లిం, క్రైస్తవ మైనారిటీల వ్యతిరేకతను రెచ్చగొట్టటం, భావోద్వేగాలను రేకెత్తించటం మీద పెట్టిన శ్రద్ద ఆర్ధిక వ్యవస్ధను బాగు చేసేందుకు పెట్టి ఉంటే ఇలా జరిగేదా ? మోడీ అభిమానులు వెనక్కు తిరిగి ఆలోచిస్తారా ?

Image result for modi governance cartoons
మోడీ ఏలుబడిలో ఉపాధి తగ్గిందా పెరిగిందా ! ఆర్‌బిఐ సమాచారం ఏమి చెబుతోంది !
భజన బృందం అంటే చెవుల్లో పూలు పెట్టుకొని ఎలా చేయమంటే అలా భజన చేస్తుంది. కానీ అందరికీ కుదరదే. దేశంలో ఎందరికీ ఉపాధి కల్పించారన్నది ఒక బ్రహ్మపదార్ధం. రిజర్వుబ్యాంకు కమ్యూనిస్టు సంస్ధ కాదు, దానిలో పని చేసే వారు తుకడే తుకడే గ్యాంగ్‌ కాదు. 2019 సెప్టెంబరు మాసాంతానికి ఆర్‌బిఐ అందించిన సమాచారంలో ఉపాధి గురించి ఈ అంశాలున్నాయి.
1996-97లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య దేశ చరిత్రలో గరిష్టం : 195.6లక్షలు
2011-12 నాటికి ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :176.1లక్షలు
1996-97లో ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 86.9లక్షలు
2011-12 నాటికి ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య :119.7లక్షలు
1996-97లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 374.3లక్షలు
2011-12 లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 401.7లక్షలు
2011-12 తరువాత ప్రభుత్వ రంగం, ప్రయివేటు రంగంలో ఎంతెంత మంది ఉన్నారో విడివిడిగా లెక్కలు లభ్యం కాలేదని ఆర్‌బిఐ పేర్కొన్నది. అయితే మొత్తంగా రిజిస్టర్లలో ఉన్న సంఖ్య సంవత్సరాల వారీ దిగువ విధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సమాచారాన్ని ఉటంకిస్తూ ఆర్‌బిఐ తన గణాంక పుస్తకంలో పేర్కొన్నది.
2012-13లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 447.9లక్షలు
2013-14లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 468 లక్షలు
2014-15లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 482.6 లక్షలు
2015-16లో దేశంలో రిజిస్టర్లలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య : 435 లక్షలు
తరువాతి సంవత్సరాల సమాచారాన్ని ఆర్‌బిఐ ఇవ్వలేదు.

Image result for modi governance cartoons
ధరల పెరుగుదల లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, దానికి రుజువుగా ద్రవ్యోల్బణం ఎంత తక్కువ ఉందో చూసుకోమంటారు. 2014 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో వినియోగదారుల ధరల సూచిక 112.2 కాగా 2019 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో అది 139.6కు పెరిగింది. తరువాత 2020జనవరి నాటికి 145.7కు పెరిగింది. దీన్నేమంటారు ? ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, కొంత మేరకు చెల్లించే యాజమాన్యాలుంటే కార్మికులకు కరవు భత్యం పెరుగుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు, ఇతరులు, నిరుద్యోగల పరిస్దితి ఏమిటి ? కాబట్టి భక్తులారా గుడ్డి అభిమానం లేదా దురభిమానంతో మీరు ఎలాగైనా రెచ్చిపోవచ్చు, సామాన్యులారా మోడీ ఏలుబడి గురించి మీకై మీరు నిర్ణయించుకోవచ్చు. దీనిలో పేర్కొన్న అంకెలు వాస్తవం కాదని ఎవరైనా నిరూపిస్తే సంతోషం, లేకపోతే స్వంత బుర్రలతో ఆలోచించటం ప్రారంభించండి, ఇంతకంటే దేశభక్తి మరొకటి లేదు. నేనైతే రాసిన దానికి కట్టుబడి ఉన్నా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెట్రో పన్ను తగ్గించం- గాల్లో దీపం రూపాయి !

05 Wednesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, Currency Value, India oil Tax, Naredra Modi, RBI, Rupee Fall

Image result for rupee value : narendra modi cartoons

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్‌ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.

వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?

కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్‌ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్‌ తన యువాన్‌ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్‌ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.

1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్‌ జర్మన్‌ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?

గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్‌ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.

ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్‌ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ చెప్పారు.

డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.

అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్‌ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్‌ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్‌ ఫ్రాంక్‌ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విదేశీ అప్పు- నరేంద్రమోడీ భక్తుల తిప్పలు !

08 Sunday Jul 2018

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India’s External Debt, RBI, Rupee Fall, value of the rupee

Image result for india’s external debt, modi 2018

ఎం కోటేశ్వరరావు

లేని ప్రతిష్టకోసం అనేక మంది రాజులు, రంగప్పలు భట్రాజులు, కిరాయి కవులను పోషించినట్లు విన్నాం. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం నరేంద్రమోడీ గురించి అలాంటి కిరాయిబాపతు రేయింబవళ్లు పని చేస్తున్నది. వారు సృష్టించిన అవాస్తవాలు, వక్రీకరణలను అనేక మంది అమాయకులు నిజమని నమ్మటమే కాదు, వారు కూడా జీతం భత్యం లేని ప్రచారకర్తలుగా పని చేస్తున్నారు. అలాంటి వాటిలో గత నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో ఒక్క రూపాయి కూడా విదేశీ అప్పులు చేయలేదు అనే హిమాలయపర్వత మంత అబద్దాన్ని ప్రచారం ఒకటి.. నిజం నిదానంగా ఒక అడుగు వేసేసరికి అబద్దం వంద అడుగుల ముందు వుంటుంది. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారంతా బాగా చదువుకున్న ప్రబుద్ధులు కావటమే విచారకరం, ఆందోళన కలిగించే అంశం.

ప్రతి మూడు మాసాలకు ఒకసారి మన అప్పుల గురించి రిజర్వుబ్యాంకు అధికారికంగా వివరాలను ప్రకటిస్తుంది. దానిలో అప్పుల తీరుతెన్నుల గురించి వుంటాయి. అయినా సరే రిజర్వుబ్యాంకు వివరాలను ఎంత మంది చూస్తారు, నిజం తెలిసే లోపల మనం చెప్పే అబద్దాలను జనం గుడ్డిగా నమ్ముతారు, ప్రయోజనం నెరవేరుతుందనే తెంపరితనంతో మోడీ పరివారం వ్యవహరిస్తోంది.

అసలు గత నాలుగేండ్లలో మా మోడీ సర్కార్‌ అప్పులే చేయలేదని చెబుతారు. అది అవాస్తవమని రుజువు చూపితే తేలు కుట్టిన దొంగల మాదిరి దాని గురించి మాట్లాడరు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సరికి అంటే 2014 మార్చి 30 నాటికి మన విదేశీ అప్పు 446.2 కోట్లు, అది 2018 మార్చి నాటికి ఖరారుగాని అంకెల ప్రకారం 529 బిలియన్‌ డాలర్లకు చేరింది. రిజర్వుబ్యాంకు వివరాలివి. దీనితో మోడీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతారా? ఒకవేళ అదే ప్రాతిపదిక అయితే గత పాలకులకు కూడా సంబంధం వుండదు. అలాంటపుడు మోడీ అప్పు చేయలేదని ఎలా చెబుతారు. ఈ వివరాల సంగతేమిటి అని అడిగితే, గత ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో చేశాయి, మోడీ చేసింది తక్కువ అని కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లుగా వాదనలు చేసే వారి గురించి చెప్పాల్సిందేముంది?

గతంలో అప్పు చెయ్యలేదని ఎవరు చెప్పారు. అవసరమైతే తీసుకోవచ్చు. అది అవమాన షరతులు లేదా మన ఇల్లు గుల్ల అయ్యేట్లుగా వుండకూడదు. అప్పుల కోసం ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ షరతులను అమలు జరిపారనే కదా వామపక్షాలు విమర్శలు చేశాయి. దివాలాకోరు, ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరిపిన కారణంగానే మన ఆర్ధిక వ్యవస్ధలో ఇన్నేండ్లలో ధనికులు మరింత ధనికులయ్యారు, సంపద అంతా కొద్ది మంది చేతిలో పోగుపడుతోంది. ఫలితంగా మెజారిటీ జనంలో కొనుగోలు శక్తి లేక మన అభివృద్దికి పరిమితులు ఏర్పడ్డాయి. ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను బార్లా తెరవటంతో విదేశీ సరకులతో మన దుకాణాలు నిండుతున్నాయి. లాభాల పేరుతో సంపద విదేశాలకు తరలిపోతోంది. ఆ విధానాలను బిజెపి పూర్తిగా సమర్ధించింది, వ్యతిరేకించిన చరిత్ర దానికి లేదు. ఆ విధానం నుంచి మోడీ సర్కార్‌ వైదొలగదలచుకుంటే ఎవరు అడ్డు పడ్డారు. 2016లో 484బిలియన్‌ డాలర్ల అప్పును మోడీ 2017నాటికి 471కి అంటే 13 బిలియన్‌ డాలర్లు తగ్గించిన ఘనుడని మోడీ భక్తులు బాజా వాయిస్తున్నారు. దీన్నే అతి తెలివి అంటారు. ప్రవాస భారతీయులు చేసే డిపాజిట్లు కూడా మన విదేశీ రుణాల్లో కలసి వుంటాయి. పైన పేర్కొన్న 13 బిలియన్‌ డాలర్ల అప్పు తగ్గటానికి ఆ ఏడాది ప్రవాసభారతీయుల డిపాజిట్లలో పది బిలియన్‌ డాలర్లు తగ్గాయి. అది కూడా మోడీగారి గొప్పతనమే అంటారా? విదేశాల్లో వుపాధి లేదా డబ్బు సంపాదన ధ్యేయంగా వున్నవారు మాత్రమే ప్రవాస భారతీయులు. వారు సంపాదించిన ఒక డాలరు మరొక డాలరును ఎలా జత చేసుకుంటుంది అనేదే వారికి ప్రధాన లక్ష్యంగా వుంటుంది. అందువలన ఆయా పరిస్ధితులను బట్టి ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడ తమ సొమ్మును డిపాజిట్లుగా పెడతారు. ఇక్కడ దేశభక్తి మరొకటో సమస్యగా రాదు. ఇలాంటి కారణాలతో విదేశీ రుణాలలో ఒక ఖాతాలో తగ్గవచ్చు, ఒకదానిలో పెరగవచ్చు. మొత్తంగా అప్పు పెరుగుతోందా తగ్గుతోందా అన్నదే గీటురాయి. 2018 మార్చి నాటికి చూపిన అంచనాల్లో వాణిజ్య రుణాలు, స్వల్పకాలిక రుణాలలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అందువల్లనే 471 నుంచి 529 బిలియన్‌ డాలర్లుగా ఆర్‌బిఐ పేర్కొన్నది. అసలు నాలుగేండ్లలో అప్పులే చేయలేదు అని ప్రచారం చేసే వారు లేదా దానిని నమ్ముతున్న వారు ఆర్‌బిఐ ఖరారు చేసిన అంకెల ప్రకారం మోడీ పాలన తొలి ఏడాదే అప్పు 446.2 బిలియన్‌ డాలర్ల నుంచి 474.7 బిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగిందో చెబుతారా ? రాజు కంటే మొండి వాడు బలవంతుడు అన్నట్లుగా అడ్డగోలు వాదనలు చేసే వారిని ఎవరేమీ చేయలేరు.

Image result for india’s external debt, modi

రిజర్వుబ్యాంకు అంకెల ప్రకారం 2006-14(మార్చి31) మధ్యకాలంలో మన విదేశీ అప్పు సగటున జడిపిలో 17.5 శాతం వుంది. అదే మోడీ నాలుగేండ్లపాలనలో 21.95 శాతం వుంది. ఇదే సమయంలో విదేశీ అప్పులపై మనం చెల్లించిన వడ్డీ యుపిఏ ఎనిమిదేండ్ల సగటు 5.23 శాతం కాగా మోడీ పాలనలో అది 8.05 వుంది, మొత్తం రుణాలలో రాయితీలతో కూడినవాటి శాతం తొమ్మిదేండ్ల యుపిఏ కాలంలో 17.36 శాతం కాగా మోడీ ఏలుబడిలో 9.07 శాతానికి పడిపోయాయి. ఇన్ని చేదు నిజాలను రిజర్వుబ్యాంకు మనకు అందిస్తుంటే గతంలో చేసిన అప్పులతో పోలిస్తే మోడీ కాలంలో పెరుగుదల శాతం తక్కువగా వుంది కనుక ఈ మంచిని విమర్శకులు చూడటం లేదనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది మొత్తంగా ఫలితం, పర్యవసానాలు ఏమిటి అన్నది. వాటిని చూసినపుడు మోడీని అభినందించాల్సిందేమీ కనిపించటం లేదు.

మన విదేశీ అప్పులలో ప్రభుత్వం చేసేవి, ఇతర వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల లేదా విదేశీయుల డిపాజిట్లన్నీ కలిసే వుంటాయి. రిజర్వుబ్యాంకు అందచేసిన వివరాల ప్రకారం ప్రభుత్వ అప్పుల తీరుతెన్నులు చూద్దాం. 2014-16 మధ్య మన ప్రభుత్వ అప్పు 83.7 నుంచి 93.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అది 2018 నాటికి 111.9 బిలియన్లకు చేరింది. అంటే నాలుగేండ్లలో మోడీ సర్కార్‌ చేసిన అప్పు 83.7 నుంచి 111.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తం పెరిగినా అది జిడిపితో పోలిస్తే శాతాల రూపంలో తగ్గింది. ఇది ఒక్క ప్రభుత్వ రుణాలకే కాదు, ప్రయివేటు రుణాలకూ వర్తిస్తుంది. మన విదేశీ అప్పు పెరుగుదల తగ్గుదలలో రూపాయి విలువ ప్రమేయం కూడా వుంటోంది. రూపాయి విలువ తగ్గితే కొత్త అప్పులు తీసుకోకపోయినా మన అప్పు కొండలా పెరిగిపోతుంది.

మన విదేశీ అప్పులో 2007లో ప్రవాస భారతీయుల డిపాజిట్లు, వాణిజ్య రుణాలు దాదాపు సమంగా వున్నాయి. ఆ ఏడాది మొత్తం అప్పు 172 బిలియన్‌ డాలర్లయితే 41 చొప్పున డిపాజిట్లు, వాణిజ్య రుణాలు వున్నాయి. 2018 నాటికి అవి 126-189 బిలియన్‌ డాలర్లుగా మారిపోయాయి. మన విదేశీ రుణాలలో అత్యధిక భాగం డాలర్‌లో ముడి పెట్టి వున్నాయి. రూపాయి విలువ పెరిగితే మనకు లాభం తగ్గితే అదనపు భారం అవుతుంది. యుపిఏ పాలన అయినా నరేంద్రమోడీ ఏలుబడి అయినా మన రూపాయి విలువ తగ్గటం తప్ప పెరగటం లేదు. ఫలితంగా మనకు తెలియకుండానే విదేశీ అప్పులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నాము. మన అప్పులో (2017 డిసెంబరునాటికి) 78.8శాతం ప్రభుత్వేతర ప్రయివేటు కంపెనీల రుణాలే వున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇంత వరకు మన రూపాయి విలువ ఏడుశాతం పతనమైంది. ఈ మేరకు ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్దలైనా డాలర్‌ చెల్లింపులకు అమేరకు అదనంగా రూపాయలు చెల్లించి డాలర్లను కొనుగోలు చేయాల్సిందే. చమురు ధరలు పెరుగుతున్న కారణంగా చెల్లింపులకు అదనపు డాలర్లు అవసరమయ్యాయి. దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగంది. రూపాయి విలువ తగ్గింది. రూపాయి విలువ పతనం గాకుండా కాపాడాల్సిన బాధ్యత దాని నిర్వహణ చూస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, దాని నేత నరేంద్రమోడీదే. ఆయన భక్తులు చెబుతున్నట్లు అప్పులు తక్కువగా చేసినందుకు మోడీ ఖాతాలో ఎన్ని అభినందనలు వేస్తే రూపాయి విలువ పతనం కారణంగా అదే మోడీ ఖాతాలో అక్షింతలు కూడా వేస్తే రెండూ సమానం అవుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచగానే మన దేశం నుంచి డాలర్ల ప్రవాహం అటు తిరిగింది. దాంతో మన రూపాయి పతనానికి అదొక కారణమైంది. ఇప్పటికే ఈ ఏడాది రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఈ ఏడాది ఆఖరికి మరో రెండుసార్లు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన రూపాయి మరింత పతనం అయ్యే ముప్పు వుంది. ఈ ముప్పును తప్పించేందుకు మన రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఒకసారి వడ్డీరేట్లను పెంచింది. ఇది మన దేశం నుంచి డాలర్లు తరలిపోకుండా చేసేందుకు తీసుకున్న చర్య. వడ్డీ రేట్లను ఇంకా తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్న వాణిజ్య, పారిశ్రామికవర్గాలకు ఇది ఎదురుదెబ్బ. మొత్తం జనం మీద అదనపు భారాలకు కారణం అవుతుంది. ఈ పరిస్ధితిని నివారించేందుకు మోడీ దగ్గర వున్న మంత్రదండాన్ని బయటకు తీయమని ఆయన భక్తులు డిమాండ్‌ చేయాలి తప్ప విమర్శకుల మీద ఎదురు దాడి చేస్తే ప్రయోజనం ఏముంది ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్న పెదరావూరు ఖాతాలు !

19 Saturday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Bad loans, defaulters, Modi, RBI, Reserve Bank of India, vijay mallya, wilful defaulters, write off

అరే నేనేమిటో మీరు చూసింది చాల తక్కువే

ఎం కోటేశ్వరరావు

     పేరులో ఏమున్నది పెన్నిధి అని చులకనగా మాట్లాడారు గానీ పేరులోనే వుంది పెన్నిధి. ఇప్పుడు కుంభకోణాన్ని ఆ పేరుతో పిలవకూడదు. మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు, కుంభకోణం అంటే కుంభకోణం కాదు, నరేంద్రమోడీ అని కొత్త అర్ధాలు రాసుకోవాల్సిన రోజులు వచ్చాయంటున్నారు. కాంగ్రెస్‌ పాలకులు అనేక కుంభకోణాలకు తెరతీశారు. వాటిని దేశమంతా చూసింది. అదే బాటలో బిజెపి పాలకులు నడిస్తే కిక్కేముంటుంది? అంతకంటే పెద్ద కుంభకోణాలకు వారు తెరతీశారు. వాటినింకా జనం చూడలేదు. అంతే తేడా ! కాంగ్రెస్‌ రుణాలిచ్చి విజయమాల్య వంటి వారిని పెద్దలుగా మారిస్తే జనానికి కిక్కు ఎక్కించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ విజయ మాల్యను మర్యాదగా దేశం దాటించటానికి తన తెలివి తేటలను వుపయోగించింది. అలాంటి వారు దేశం విడిచి పోతుంటే ఎక్కడకు పోతున్నారో తెలుసుకోవాలి తప్ప పోవటాన్ని అడ్డగించకూడదన్న మార్గదర్శకాల కారణంగా నిఘాసిబ్బంది అదే పని చేశారు. కాంగ్రెస్‌ పాలకులు రుణాలు ఇస్తే బిజెపి పాలకులు గత రెండున్నర సంవత్సరాలుగా వాటిని ఎడా పెడా రద్దు చేస్తున్నారు. మాల్య వంటి 63 మంది పెద్దలు తమ బ్యాంకులకు ఎగవేసిన మొత్తాలలో తాజా విడతగా 7016 కోట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) రద్దు చేసింది. ఇది గత 23 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇప్పుడు పెద్ద రగడ కావటంతో ఇక్కడే పేచీ వచ్చింది. దాన్ని రద్దు అన కూడదు, లెక్కలలో సర్దుబాటు అనాలని,ఆ మొత్తాలను వసూలు చేస్తారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ సెలవిచ్చారు.ఆంగ్లంలో రైట్‌ ఆఫ్‌ అన్న పదానికి అర్ధం ‘బే వుమ్మేజు, రానిబాకీగా లెక్కలలో తీసివేయుట ‘ అని దిగవల్లి వెంకటశివరావు 1934లో, ‘రద్దు చేయు, తీసివేయు ‘ అని బూదరాజు రాధాకృష్ణ 2008లో అర్ధం చెప్పారు.

     ఈ పేరు, అర్ధం వివాదం రేగగానే మా ప్రాంత పెద రావూరు ఖాతాల వ్యవహారం గుర్తుకు వచ్చింది. నా చిన్నతనంలో మా వూర్లో ఒక వృద్ధుడు నాకు ఫలానా వారి కుటుంబం నుంచి ఇంత బాకీ రావాలి, అంతరావాలి అని కనిపించిన వారందరికీ పెద్ద మొత్తంలో లెక్కలు చెబుతుండే వాడు. అది నిజమేనా అని అడిగితే నిజమే అవన్నీ పెద రావూరు ఖాతాలో వున్నాయి అని పెద్దల నుంచి సమాధానం వచ్చింది. అర్ధం అయ్యేట్లు చెప్పమంటే అవి వచ్చేవి కాదు, పెట్టేవి కాదు, ఆ ముసలోడు అలాగే చెబుతూనే వుంటాడు అన్నారు. ఇప్పుడు జెట్లీ చెబుతున్నది కూడా పెదరావూరు ఖాతాల గురించే మరి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్ధితి నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎస్‌బిఐ రుణాల రద్దు వార్త కూడా తోడైంది. అయితే సామాన్యులకు తప్ప కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. తమదంతా ‘పారదర్శపాలన’ అని చెప్పుకుంటారు గనుక దానికి అనుగుణంగా ‘మూసి’పెట్టారు. ప్రభుత్వం ఇబ్బందులలో పడింది అనగానే ఎస్‌బిఐ దానికి ఒక చిట్కాను కనిపెట్టింది. ఆ ఏడువేల కోట్ల రూపాయల మొత్తాన్ని రైటాఫ్‌ (రద్దు) చేయలేదు, మేము అసలు ఆ పదాన్ని వుపసంహరించుకుంటున్నాము. ఆ మొత్తాన్ని ‘వసూలులో వున్న ఖాతా'(ఎయుసి-ఎకౌంట్‌ అండర్‌ కలెక్షన్‌) సొమ్ము అని పిలుస్తున్నాము అంటూ ఒక వివరణ ఇచ్చింది. సామాన్య రైతులు పంటలు పోయి తీసుకున్న రుణం చెల్లించకపోతే వూరంతా టాంటాం వేయిస్తారు.ఇంట్లో సామాను బయటకు వేసి అవమానాలు పాలు చేస్తారు. ఇండ్ల కోసం రుణాలు తీసుకున్నవారు కిస్తీలు చెల్లించకపోతే వారి పేర్లజాబితాను పత్రికలలో ప్రకటించి ఆస్ధులను వేలానికి పెడతారు. బ్యాంకులు వారి మొత్తాలను కూడా ఎయుసి ఖాతాలలో వేసి శక్తి వచ్చినపుడు ఎందుకు వసూలు చేసుకోవు ? బడాబాబుల పేర్లు పత్రికలలో ప్రకటించి ఆస్ధులను ఎందుకు వేలం వేయటం లేదు ?

    సాంకేతికంగా రైట్‌ ఆఫ్‌ అంటే రద్దు కాదన్నది వాస్తవమే. అయితే ఆచరణలో జరుగుతున్నదేమిటో ఆరుణ్‌ జెట్లీ వంటి పెద్దలు, లేదా బ్యాంకర్లు చెప్పటం లేదు. మాల్య వంటి పెద్ద మనుషులకు వేల కోట్ల రూపాయలను అప్పులు, అడ్వాన్సులుగా ఇవ్వటం వారు వాటిని తప్పుడు మార్గాలలో దారి మళ్లించి దాచుకోవటం, తరువాత చెల్లించటంలో విఫలమయ్యారనే పేరుతో కొంత కాలం గడిచిన తరువాత నిరర్ధక ఆస్థుల జాబితాలో ఎక్కించటం, తరువాత రాని బాకీల ఖాతాలో రాయటం, ఆ మేరకు జనం సొమ్మును బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరితేరింది. అది వారి హయాంలో పిల్లకాలువగా వుండేది. దానిని నరేంద్రమోడీ సర్కార్‌ దానిని ఓడలు ప్రయాణించే పనామా, సూయజ్‌ కాలువల సైజుకు పెంచింది. నరేంద్రమోడీ అనుయాయులైన సరికొత్త దేశభక్తులకు ఇలా అన్నందుకు ఆగ్రహం కలగవచ్చు.http://www.slideshare.net/deepakshenoy/kc-chakrabarty-on-npas-in-india ఇది రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన కెసి చక్రవర్తి తయారు చేసి 2013లో ఒక సమావేశంలో సమర్పించిన పత్రం. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం 2001 మార్చినెలతో అంతమైన ఆర్ధిక సంవత్సరం నుంచి 2013 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రయివేటు, విదేశీ అన్ని బ్యాంకులు రైట్‌ ఆఫ్‌ (రద్దు ) చేసిన మొత్తం అక్షరాలా ఒక లక్షా 98వేల అరవయ్యారు( 1,98,066) కోట్ల రూపాయలు. ఇదే కాలంలో వసూలు చేసిన మొత్తం కేవలం 37,955 కోట్లు మాత్రమే. దీనికి తనది బాధ్యత ఎలా అవుతుంది అని నరేంద్రమోడీ అమాయకంగా హావభావాన్ని ప్రదర్శించవచ్చు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత గత రికార్డులను తిరగరాస్తూ భారీ మొత్తాలలో పెద్దల బకాయిలను రైటాఫ్‌ లేదా రద్దు చేసి అతి పెద్ద భారీ కుంభకోణానికి తెరతీశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిని తిప్పికొట్టాలంటే తాను అధికారాన్ని స్వీకరించిన తరువాత అన్ని బ్యాంకులు ఎంత మొత్తాన్ని రైటాఫ్‌ చేశాయి, పాత బకాయిలను ఎంత మొత్తం వసూలు చేశాయి అన్న విషయాలను ప్రకటిస్తే చాలు. మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడకూడదని నరేంద్రమోడీ ఒక వ్రతాన్ని పాటిస్తున్నందున ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ అయినా ఆపని చేయాలి. ఎందుకో గానీ ఇంతవరకు వివరాలు చెప్పకుండా అభిమానుల్లో కూడా అనుమానాలకు తెరలేపుతున్నారు.

     ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం 2013,14,15 ఆర్ధిక సంవత్సరాలలో 29 ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం లక్షా 14వేల కోట్ల రూపాయలు. రిజర్వుబ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2012 మార్చి ఆఖరుకు పారు బాకీలు రు.15,551 కోట్లు కాగా 2015 మార్చినాటికి రు.52,542 కోట్లకు పెరిగాయి. వంద కోట్లు అంతకంటే ఎక్కువ ఎగవేసిన వారి వివరాలు తమ వద్ద లేవని ఆర్‌బిఐ తెలిపింది.2004-15మధ్య రు.2.11లక్షల కోట్లను రద్దు చేయగా వాటిలో లక్షా 14వేల 182 కోట్లు 2013-15 మధ్య చేసినవే వున్నాయి. తొమ్మిది సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని పనిని మూడు సంవత్సరాలలో మోడీ చేశారన్నమాట. ఎంత అభివృద్ధి ? అందుకే పెద్ద కరెన్సీ నోట్ల రద్దును బడా పారిశ్రామికవేత్తలంతా ఆకాశానికి ఎత్తుతున్నారా ? కాంగ్రెస్‌ హయాంలో ఏటా నాలుగు శాతం చొప్పున పెరిగితే 2014,15 సంవత్సరాలలో దేశంలో రెండవ పెద్ద బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రద్దు చేసిన బాకీలు 2013-14 మధ్య 98శాతం అయితే మరుసటి ఏడాది 238శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం ఏటా 50వేల కోట్లకు పైగానే బకాయిలు పెదరావూరు ఖాతాలోకి పోతున్నాయి.

    ఇలా రద్దు చేయటం అంతా వుత్తిదే, అంకెల గారడీ, బ్యాంకులు చెల్లించాల్సిన ఆదాయపన్ను తగ్గించేందుకు, ఆర్‌బిఐ నిబంధనలను పాటించేందుకు చేసిన లెక్కల సర్దుబాటు తప్ప మరేమీ కాదు, బ్యాంకుల ప్రధాన కార్యాలయాల స్ధాయిలో పారు బాకీలను రద్దు చేసినట్లు చూపినా దిగువ శాఖలలోని పుస్తకాలలో అలాగే వుంటాయని కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు, పెద్దదైన ఎస్‌బిఐ చెప్పాయి. బకాయిల వసూలు సంగతి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అనేక బ్యాంకుల పారు బాకీల వసూలు శాతాలు పడిపోతున్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వుదాహరణకు ఎస్‌బిఐ 2012-13లో 19.06శాతం వసూలు చేస్తే 2014-15 నాటికి 10.88శాతానికి పడిపోయినట్లు దాని లెక్కలే వెల్లడించాయి.ఐసిఐసిఐ బ్యాంకులో 26.74 నుంచి 15.96శాతానికి పడిపోయాయి. కెసి చక్రవర్తి తన పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం రద్దు చేసిన రుణాలలో కేవలం పదిశాతం లోపుగానే వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల విలువను తక్కువగా చూపి అయినకాడికి తెగనమ్మే ప్రభుత్వం పారుబాకీల వసూలు విషయంలో మాత్రం తక్కువ ధరలకు ఆస్థులను విక్రయించటానికి నిబంధనలు ఒప్పుకోవు అని చెబుతోంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎంత వసూలు చేశారనేది బ్యాంకులో, ప్రభుత్వమో వెల్లడిస్తే తప్ప వివరాలు లేవు. నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన మొత్తాలు నరేంద్రమోడీ విజయాలకు సూచికగా కొండల్లా పెరిగిపోతున్నాయి. గతేడాది అంతకు ముందున్న రు.3,24,300 కోట్ల నుంచి 2016 మార్చినాటికి రు.4,26,400 కోట్లకు పెరుగుతాయని అంచనా వేశారు. లెక్కల ఆల్జీబ్రాలో సర్దుబాటు, పునర్వ్యస్తీకరించిన మొత్తాలను కూడా కలుపుకుంటే పారు బాకీల మొత్తం రు.9,28,000 కోట్లని చెబుతున్నారు. వుద్ధేశ్యపూర్వకంగా ఎగవేసిన కార్పొరేట్ల రుణాల రద్దు ఈ శతాబ్దంలోనే ఇప్పటికి పెద్ద కుంభకోణంగా వర్ణిస్తున్నారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు డాక్టర్‌ కెసి చక్రవర్తికి రుణాల రద్దు గురించి బాగా తెలుసు. ఆయన చెప్పిన ప్రకారం ఒక కంపెనీ కేవలం ఎనిమిదివేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు మాత్రమే కలిగి వుండి 20వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుందనుకుంటే ఒక వేళ బ్యాంకులు రద్దు చేయాల్సి వస్తే పన్నెండువేల కోట్ల రూపాయలకు మాత్రమే అనుమతించాలి.కానీ పుస్తకాలలో వున్న గడువు మీరిన బకాయిలు మొత్తాన్ని రద్దుచేస్తున్నారు. సాంకేతిక కారణాలతో రద్దు చేయటానికి ఎలాంటి నియమనిబంధనలు, పద్దతులు లేవు, అందువలనే అదొక పెద్ద కుంభకోణంగా పరిగణించాలి. ఇది సరళీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత 1993 నుంచి అనుసరిస్తున్నారు. రుణాలే కాదు, అడ్వాన్సులను కూడా రద్దు చేస్తున్నారు. మీరు ఒక చార్టడె ఎకౌంటెంట్‌ను సలహాదారుగా పెట్టుకొని అడ్వాన్సులను టెక్నికల్‌గా రద్దు చేయటానికి అవసమైన విధి విధానాలను రూపొందించుకోవచ్చని బ్యాంకులకు రిజర్వుబ్యాంకే స్వయంగా చెప్పటం విశేషం. గత పదిహేను సంవత్సరాలలో సాంకేతిక కారణాలతో చేసిన రద్దుల మొత్తం మూడున్నరలక్షల కోట్ల రూపాయలు, దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని, ఈ మొత్తాలకు వడ్డీని కూడా కలిపితే రద్దు చేసిన మొత్తాలు నాలుగు రెట్లు వుంటాయని చక్రవర్తి చెప్పారు. ఎగవేసిన పెద్దల పేర్లు బయట పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ పని చేయకుండా తప్పించుకుంటున్నారు.వారి నుంచి బాకీలు వసూలు చేయకపోవటం ఒకటైటే 2018 నాటికి బాసెల్‌-3 నిబంధనల ప్రకారం బ్యాంకులకు ప్రభుత్వం మరో 2.4లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులు సమకూర్చాల్సి వుంటుందని చెబుతున్నారు. అంటే ఇది కూడా ప్రజల సొమ్మే.దీన్ని ఎలా సమకూర్చుతారనేది చూడాల్సి వుంది. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ అధికారంలో వుండగా ప్రతిపక్ష బిజెపి నేత యశ్వంతసిన్హా ఆర్ధికశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా వున్నారు. రుణాల రద్దును సమీక్షించేందుకు ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని రిజర్వుబ్యాంకును ఆ కమిటీ కోరింది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నర్‌గా వున్న రఘురాం రాజన్‌ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూడటానికి, దాడి చేయటానికే తన సమయాన్ని వెచ్చించింది తప్ప ఆ కమిటి ఏమైందో తెలియదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సుబ్రమణ్యస్వామి పర్యవేక్షణలో ఆర్ బి ఐ గవర్నర్‌గా బిజెపి కార్యకర్త ?

19 Sunday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP activist, mody, Raghu ram rajan, RBI, RBI governor, Subramanya swamy

ఎం కోటేశ్వరరావు

     జపాన్‌-ఇండియా, అక్కడ ధరలను ఎలా పెంచాలా అని తలబద్దలు కొట్టుకుంటుంటే, ఇక్కడ ఎలా తగ్గించాలా అని చూస్తున్నారు. ఇక్కడ వడ్డీరేటు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడ బ్యాంకులో ఎవరైనా డబ్బు దాచుకుంటే వారే 0.10 శాతం ఎదురు చెల్లించాలి. వడ్డీ రేటు ఎక్కువ వుంటే ఆర్ధికాభివృద్ధి వుండదా ? ప్రపంచంలో అత్యధిక వడ్డీ రేటు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనాలో 34.45 శాతం (మే 2016) వుంది. అక్కడ వృద్ధి రేటు గతేడాది 2.1శాతం. పక్కనే వున్న అమెరికాలో వడ్డీ రేటు 0.50 శాతమే అక్కడా వృద్ధి రేటు రెండు శాతం వరకు వుంది. స్వీడన్‌, డెన్మార్క్‌, స్విడ్జర్లాండ్‌లలో ఎవరైనా బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే వారే 0.5,0.65,0.75శాతం చొప్పున బ్యాంకులకు ఎదురు వడ్డీ చెల్లించాలి. మరి అక్కడ అభివృద్ధి లేదా ? అంతెందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌లో వడ్డీ రేటు 5.5శాతం కాగా వృద్ధి రేటు 4.8శాతం వుంది. ఇంకా ఇలాంటి వివరాలను పేర్కొంటే బుర్ర బద్దలు అవుతుంది. ఈ దేశాలన్నీ పెట్టుదారీ విధానాన్ని అనుసరిస్తున్నవే. మరి ఈ వడ్డీ రేట్లేమిటి ? కొన్ని దేశాలలో బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చి జనం డబ్బు ఎందుకు దాచుకుంటున్నారు? వారికి పెట్టుబడి అవకాశాలు లేవా ? అభివృద్ధి రేటులో ఇంత వ్యత్యాసం ఏమిటి ? ఎందుకీ ప్రయాస అంటారా ?

     వడ్డీ రేటు తగ్గింపు, తదితర విధానాలపై విబేధాలు, ఆరోపణలు, అవమానాల కారణంగానే రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అసాధారణరీతిలో తాను పొడిగింపును కోరుకోవటం లేదని, తనపని తాను చూసుకుంటానని బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది.చరిత్రలో అనేక మంది గవర్నర్లు వచ్చారు, పోయారు. బహుశా ఇలాంటి పరిస్ధితి ఎవరి విషయంలోనూ తలెత్తి వుండదు. కొద్ది వారాల ముందు రాజన్‌ ఈ ప్రకటన చేసి వుంటే నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల జాబితాలో దీనిని కూడా చేర్చి వుండేది లేదా సుబ్రమణ్యస్వామి వంటివారి చేత ప్రకటనలు చేయించి వుండేదేమో ? వడ్డీ రేటుకు, అభివృద్ధి రేటుకూ సంబంధం లేదని చెప్పేందుకే పైన అన్ని వివరాలను పేర్కొని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. నరేంద్రమోడీ చెప్పినట్లుగా గుజరాత్‌ మోడల్‌ లేదూ, అభివృద్దీ లేదు దాన్ని అంగీకరించటానికి పాలక కూటమికి ధైర్యమూ లేదు, ఈ రోజు కాకున్నా రేపయినా జనం అడుగుతారు. ఇదిగో రఘురామ్‌ రాజన్‌ కారణంగానే ఇదంతా జరిగింది, దాన్ని సరిదిద్దటానికి మూడు సంవత్సరాలు పట్టింది, మరోసారి మాకు అవకాశం ఇస్తే మాజిక్‌ చూపిస్తాం అని 2019ఎన్నికలలో సాకు చెప్పేందుకే ఇంతా చేశారా ? ఏమో గత 24 సంవత్సరాలలో ప్రతి గవర్నర్‌కూ రెండవ సారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం రాజన్‌ పట్లనే ఇలా ఎందుకు వ్యవహరించింది? దీని వలన ప్రభుత్వానికి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి? సమాధానం లేకపోగా మంచిది కొత్త గవర్నర్‌ను చూస్తాం అని ఆర్ధిక మంత్రి జైట్లీ తాపీగా చెప్పారు.

    ఒకటి మాత్రం స్పష్టం. వచ్చే రిజర్వుబ్యాంకు గవర్నర్‌ తమకు తాన తందానా పలకాలన్న సందేశాన్ని మోడీ సర్కార్‌ స్పష్టంగా పలికింది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలన్నింటినీ తన పార్టీ కార్యకర్తలతో నింపుతోంది. టీవీ సీరియల్స్‌లో గుడ్డి పాత్రల వంటి చిన్నా చితకా అనుభవ తప్ప పెద్ద అనుభవం లేని గజేంద్ర చౌహాన్‌ను ప్రతిష్టాత్మక పూనా ఫిల్మ్‌ఇనిస్టిట్యూట్‌కు అధిపతిగా చేసిన విషయం తెలిసిందే. అదే బాటలో మరో చౌహాన్‌ రంగం మీదకు వచ్చారు. ఈయనకు ఆ పరిమిత అనుభం కూడా లేదు. తాజాగా జాతీయ ఫ్యాషన్‌ టెక్నాలజీ సంస్ధ అధిపతిగా 68 సంవత్సరాల మాజీ క్రికెటర్‌ చేతన చౌహాన్‌ను నియమించింది. ఈ సంస్థ అధిపతులుగా సుప్రసిద్ద విద్యావేత్త, శాస్త్రవేత్త, సాంకేతికవేత్త, ప్రొఫెషనల్‌ను నియమించాలని చట్టంలో స్పష్టంగా వుంది.దాన్ని పక్కన పెట్టి పార్టీ కార్యకర్తను అందలమెక్కించారు.దీనిపై సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ చర్యను పరిహసిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో అధిపతిగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను వేస్తారేమో అన్నది వాటిలో ఒకటి. ఇవన్నీ చూస్తే రేపు ఏ బిజెపి కార్యకర్తనో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా నియమించినా చేసేదేమీ లేదు. ఎందుకంటే ఆర్ధికవేత్త సుబ్రమణ్య స్వామి ఎలాగూ మార్గదర్శనం చేసేందుకు వున్నారు కదా !

    ప్రతి దేశ రిజర్వు బ్యాంకు నెలా లేదా రెండు నెలలు, లేదో ఒక నిర్ణీత వ్యవధిలో తన విధాన సమీక్ష చేసుకొని వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాల ప్రకారం ద్రవ్యోల్బణ రేటు వస్తువులు, సేవల ధరల పెరుగుదల తీరుతెన్నులను ప్రతిబింబిస్తుంది. సాధారణ సూత్రం ప్రకారం వడ్డీరేటు తక్కువ వుంటే ఎక్కువ మంది అప్పుచేస్తారు, ఆ సొమ్ముతో వస్తువులను కొంటారు, అది ఆర్ధికవ్యవస్ధ పురోగతికి దారితీస్తుంది.ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మనదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం వరకు వాయిదాల మీద ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొనే వారికి వడ్దీ రాయితీ గురించి వల విసిరే వారు. ఇప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువుల కొనుగోలుకు అప్పులిస్తున్నారు. అంటే కంపెనీలే వస్తువు ధరలో వడ్డీని కూడా కలుపుతాయి అది వేరే విషయం. వడ్డీ రేట్లు పెరిగితే జనం తమ సొమ్మును పొదుపు చేసుకోవటం ఎక్కువ చేసి వస్తు కొనుగోలు తగ్గిస్తారు.అది ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే కాదు, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అందువలన వడ్డీరేటు తగ్గింపు, పెంపుదల అనేది ఆర్ధిక వ్యవస్థను సమతూకంలో వుంచే సాము గరిడీ వంటిది.

    టీవీ సీరియల్స్‌లో బ్రేక్‌ మాదిరి ఇక్కడొక చిన్న పిట్ట కధ చెప్పాలి. ఒక పెద్దమనిషి కారణాలేమైనా ఇద్దరిని వివాహం చేసుకున్నాడట. పెద్ద భార్య జుట్టు నెరిసింది, భర్త జుట్టులో నలుపు తెలుపూ రెండూ వున్నాయి. అందుకని ఆమె నల్ల వెంట్రుకలను పీకివేసేదట. చిన్న భార్య తన జుట్టు నలుపు కనుక తన భర్త జుట్టులో వున్న తెల్ల వెంట్రుకలను నిర్ధాక్షిణ్యంగా తీసివేసేదట. చివరికి ఏమైందో చెప్పక్కర లేదు. ఆర్ధిక వ్యవస్థలో కూడా విరుద్ధ శక్తులు విధానాన్ని తమవైపు వుండేట్లు చూసుకుంటాయి. కరెన్సీ విలువనే చూడండి. విలువ ఎక్కువగా వుంటే దిగుమతి చేసుకొనే వస్తువులు చౌకగా వస్తాయి.తక్కువగా వుంటే మన వస్తువుల ధరలు అంతర్జాతీయ విపణితో తక్కువగా వుండి ఎగుమతులు పెరుగుతాయి. అందువలన ఒకరు మన రూపాయి విలువ తగ్గించాలని కోరితే, మరొకరు పెంచాలని కోరతారు. వడ్డీ రేటు కూడా ఇంతే.

   ఇక రఘురామ రాజన్‌ విషయానికి వస్తే ఆయన పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు తప్ప వ్యతిరేకించే ఆర్ధికవేత్త కాదు. అందువలన ఆయన కొనసాగితే సామాన్య జనానికి ఏదో మేలు జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు, జరగాల్సిన కీడు ఇప్పటికే జరిగింది కనుక జనానికి పెద్దగా నొప్పి కూడా వుండదు. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తమ ప్రభుత్వం పాలన ముగిసిన తరువాత ఎన్నికలలో దేశం వెలిగిపోతోంది అని ప్రచారం చేసుకుంది. నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ ప్రధాని కనుక పాలన చేపట్టిన మరుసటి రోజు నుంచే వెలిగి పోతోందని ప్రచారం ప్రారంభించారు. మన రిజర్వుబ్యాంకు గవర్నర్లలో రాజన్‌ పిన్న వయస్కుడు. నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావం వుందని చెబుతారు. అమెరికాలో వుండి వచ్చారు కనుక అక్కడి మాదిరి ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు అనుకున్నారేమో. నరేంద్రమోడీ సర్కార్‌ అతిశయోక్తులను భరించలేక అంధుల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అని పరోక్షంగా చురక అంటించారని అంటున్నారు.దాని మీద ఎవరు ఎలా విరుచుకుపడిందీ దేశం చూసింది. అప్పుడే రాజన్‌కు మరొక అవకాశం రాదని చాలా మంది అనుకున్నారు. ఆ తరువాతే శిఖండి మాదిరి నోటి తుత్తర సుబ్రమణ్య స్వామిని రంగంలోకి దించారు. ఇదంతా పొమ్మనకుండా పొగబెట్టటం అని తెలియనంత అమాయకంగా రాజన్‌ లేరు కనుక ఆయన కూడా అసాధారణ రీతిలో పదవీ విరమణకు 80 రోజుల ముందుగానే ఒక బహిరంగ లేఖ రాసి తానేమిటో ప్రదర్శించుకున్నారు. ఇదంతా లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా రాజన్‌ తప్పుకునే అవకాశాన్ని మోడీ సర్కార్‌ సృష్టించి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. అలా జరిగితే సలహాదారులకు పనేముంటుంది?

    ఇప్పుడు ప్రభుత్వ పరిస్ధితి ఒకరకంగా ఇరకాటంలో పడింది.ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో ప్రారంభమైన ఇప్పడప్పుడే పరిష్కారమయ్యే సూచనలు కనిపించటం లేదు. ఈ స్ధితిలో మోడీ జనంలో ఎన్నో ఆశలు కల్పించారు. దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ రోజులు గడిపి తానేదో అద్బుతదీపాన్ని తెస్తున్నట్లు హడావుడి చేశారు. రాబోయే రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌ ప్రతి చర్యను రాజన్‌ హయాంతో పోల్చుతారు. రాజన్‌ అయినా మరొకరైనా మన జీవనాడులను చేజిక్కించుకున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ గీచిన పరిధులలో మాత్రమే పనిచేయాల్సి వుంటుంది. దానికి భిన్నంగా వెళ్లే అవకాశం లేదు.

     ప్రపంచీకరణలో భాగంగా మన ఆర్థిక వ్యవస్థను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులకు తెరిచారు. ఫోర్టుపోలియో పెట్టుబడులు అంటే వడ్డీ వ్యాపారుల వంటి వారు. మన ప్రభుత్వం తీసుకొనే రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా వుంటే మన రుణపత్రాలు(బాండ్లు) కొంటారు. లేకపోతే ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడకు వెళ్లిపోతారు. మనకు ఆ రూపంలో విదేశీ మారక ద్రవ్యం రాకపోతే మన విదేశీ చెల్లింపులు ప్రమాదంలో పడతాయి, బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన రోజులు వస్తాయి. అందువలన రిజర్వు బ్యాంకు గవర్నరు లేదా వడ్డీ రేటు విధానం గురించి మోడీ సర్కార్‌ ఎంతగా వివాదం లేదా ప్రచారం చేస్తే అంతగా జనం దృష్టి వాటిమీద పడుతుంది. పర్యవసానాలపై స్పందన కూడా ఎక్కువగానే వుంటుంది.

   విజయమాల్య వంటి రుణ ఎగవేతదారులు గత రెండు సంవత్సరాల కాలంలో పెరిగారు, అలాంటివారిపై చర్యలకు వాణిజ్యబ్యాంకులను రాజన్‌ కదిలించారని కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే కావూరి సాంబశివరావు వంటి ఎందరో బిజెపిలో చేరిన రుణ ఎగవేతదారుల వత్తిడి కూడా నరేంద్రమోడీ మీద వుందా ? రాబోయే రోజుల్లో ఇలాంటి అంశాలన్నీ అజెండాలోకి వస్తాయి. పశ్చిమ దేశాల పరిణామాలను చూస్తే ఆర్ధిక సంక్షోభ భారాలను సామాన్య జనం మీద నెట్టటం కనిపిస్తోంది. దానికి అయా దేశాలలో వున్న రిజర్వుబ్యాంకులు సాధనాలుగా పనిచేస్తున్నాయి. అందువలన మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు మరింతగా కట్టబెట్టాలన్నా, జనంపై భారాలు మోపాలన్నా రిజర్వుబ్యాంకు విధానాలు ముఖ్యం. అందువలన కొత్త గవర్నర్‌గా ఎవరిని తెస్తారు ? ఇప్పటి కంటే మౌలిక మార్పులు ఏం చేస్తారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘గుడ్డి వాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే మహరాజు’

20 Wednesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

'In the land of the blind the one-eyed man is king', Modi Sarkar, Narendra Modi Failures, Raghu ram rajan, RBI, Rbi governer

ఎం కోటేశ్వరరావు

    నిజం చెబితే నిష్ఠూరమాడతారు. నిష్టూర మంటే నిజానికి మీరు మాట్లాడింది చాలా బాగో లేదు అని మర్యాదగా కోపగించుకోవటమే. మన రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలపై మన తెలుగింటి ఆడపడుచు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అదే చేశారు. ఇంతకీ రిజర్వుబ్యాంకు రాముడు అన్నదేమిటి ? గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న సామెతను వుపయోగించి మన ఆర్ధిక వ్యవస్ధ గురించి గొప్పలు చెప్పుకుంటున్నవారి గాలి తీశారని కొందరు అంటుంటే, కాదు మన స్ధితి గురించి వినమ్రంగా తనదైన శైలిలో చెప్పారు తప్ప అది ప్రభుత్వానికో , మోడీకో వ్యతిరేకం కాదని మరికొందరు భాష్యం చెబుతున్నారు. వరుస వైఫల్యాలు సంభవిస్తున్న పూర్వరంగంలో రాజన్‌ వ్యాఖ్య సహజంగానే మోడీ భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ‘2019లో బిజెపి తిరిగి అధికారాన్ని పొందాలంటే అదృష్టం పట్ల వ్యామోహాన్ని వదులు కోవాలి’ అనే శీర్షికతో ‘మేం మితవాదులం ‘ అని సగర్వంగా చెప్పుకొనే మోడీ భక్తుడైన ఎస్‌ మురళీధరన్‌ అనే వ్యాసకర్త ‘స్వరాజ్య’ పత్రికలో ఈనెల 19న రాశారు. రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలకు మురళీనాదానికి సంబంధం వుందా ?

    ‘మోడీ ప్రభుత్వం పతాక పధకాలుగా ప్రారంభించిన పంటల బీమా పధకం, ఇ మండి(ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ యార్డులు), మేక్‌ ఇన్‌ ఇండియా వంటి ఇతర పధకాలకు దాదాపు ఎలాంటి సన్నాహాలు లేకుండా మొదలు పెట్టారు. చివరకు అవి విఫలం కావటానికే ఎక్కువ అవకాశాలున్నాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు. మన ఎన్నికల అవనికలో పునశ్చరణగా జరుగుతున్నట్లుగా చంద్రుడు, చుక్కలను తీసుకు వచ్చి చేతుల్లో పెడతామని చెప్పటం ద్వారా 2019 ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ వ్యతిరేకతను తెచ్చుకోవచ్చు’. ఇవి ఏ ప్రతిపక్ష పార్టీనో మరొకరో కాదు స్వయంగా మురళీధరన్‌ రాసిన మాటలు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాక ముందే మరో మూడు సంవత్సరాల తరువాత జరిగే ఎన్నికలలో సంభవించబోయే పరిణామాల గురించి ఆయన భక్తులు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే రఘరామ్‌ రాజన్‌ మాట్లాడినదానిలో తప్పేమన్నా వుందా ? నిర్మలా సీతారామన్‌ వంటి మోడీ సైనికులకు మండ కుండా వుంటుందా ?

   మామ తిట్టినందుకు కాక తోడల్లుడు తొంగి చూసినందుకు కోపం వచ్చిందన్న కొత్త సామెతను ప్రచారంలో పెడదాం. మురళీధరన్‌ మోడీ ప్రభుత్వానికి మామ అనుకుందాం. సదరు మామ చెప్పిన అంశాల సారం ఇలా వుంది. ‘ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. రాజకీయాలలో ఒక వారమే దీర్ఘకాలం అనుకుంటే ప్రభుత్వం ఎటు వైపు పయనిస్తోందో చెప్పటానికి రెండు సంవత్సరాలు చాలు. గాలిలో గడ్డి పరకలు దిశను తెలియచేసినట్లే తన విధానాలు, కార్యక్రమాల గురించి సమర్ధనీయం కాని ఆశాభావం, అదృష్టాన్ని నమ్ముకొనే విపరీత వ్యామోహంతో వున్నట్లు కనిపిస్తోంది.

   ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ మార్కెట్లనే చూద్దాం. అది మంచి ఆలోచనే కానీ మనం దానికి అనువుగా వున్నామా ? ఒక వస్తువును దుకాణానికి చేర్చాలంటే మార్కెటింగ్‌ వ్యక్తులకు తొడతొక్కిడిగా వుంటుంది, అంతకంటే ముందు అదే పరిస్ధితి వుత్పాదక కేంద్రాలలో వుంటుంది.అలాగే మౌలిక సదుపాయాలు లేకుండా ఏ ప్రభుత్వమూ పధకాలను ప్రారంభించకూడదు. మన దేశంలో 15శాతానికే ఇంటర్నెట్‌ అందుబాటులో వుంది. వంద కోట్ల సెల్‌ఫోన్లు వున్నాయనుకుంటే ఇరవై కోట్ల మందే స్మార్ట్‌ ఫోన్లను వాడుతున్నారు. ఇది సానూకూల చిత్రం.

   వ్యవసాయ వుత్పత్తులకు ఒక సమీకృత మార్కెట్‌ అంటే వుత్పత్తి జరిగే చోట శీతల గిడ్డంగులతో పాటు వాటిని అవసరమైన చోటికి చేరవేయటానికి శీతల సదుపాయం వున్న రవాణా వాహనాలు కావాలి. ఇవేమీ లేకుండానే మరొక ప్రారంభానికి నాంది పలికారా ? పంటల బీమా పధకం కూడా ఇలాగే ప్రారంభించారు. వ్యవసాయ రంగంలోని అన్ని అనర్ధాలకు సబ్సిడీతో కూడిన పంటల బీమా పధకం సర్వరోగనివారిణి కాదనే వైపు మోడీ ప్రభుత్వం ఆలోచించలేదు. మాయలాడిని చూసి మోసపోయిన ప్రేమికుడి మాదిరి బీమా సొమ్మును నిరాకరిస్తే రైతు ఆగ్రహోదగ్రుడు అవుతాడు.

    తాను అధికారానికి వచ్చిన వందరోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల వంతున వేస్తానని బాధ్యతా రహితంగా 2014 ఎన్నికలలో మోడీ వాగ్దానం చేయటంతో ఈ ధోరణి ప్రారంభమైంది. అది ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు చెప్పిన మాట అని తెలిసినప్పటికీ రంధ్రాన్షేషణ చేసే టీవీ యాంకర్ల మొదలు వాక్చాతుర్యం గల ప్రతిపక్షాల వరకు మోడీ ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని నానాయాగీ చేస్తున్నారు. మేకిన్‌ ఇండియా నినాదం కూడా ఇలాంటిదే. గత రెండు సంవత్సరాలలో వచ్చిన ఎఫ్‌డిఐలో ఎక్కువ భాగం వుత్పాదకేతర ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వాణిజ్యరంగంలోకే వచ్చింది.   విదేశాంగ విధానంలో కూడా అదృష్టాన్ని నమ్ముకొనే వ్యామోహంతో వున్నారు. వాజ్‌పేయి ఎన్నో కలలతో లాహోర్‌కు బస్సులో వెళితే మోడీ దాన్ని అధిగమించి దిగజారి పాకిస్థాన్‌ ప్రధాని కుటుంబ కార్యక్రమానికి ఎలాంటి ఆహ్వానం లేకుండానే ఆకస్మికంగా వెళ్లారు.’ ఇదే విమర్శను ఏ సిపిమ్మో, కాంగ్రెసో చేసి వుంటే స హించలేక ఈ పాటికి సంఘపరివార్‌ మీడియా సైన్యం రెచ్చిపోయి నానా యాగీ చేసి వుండేది.

    నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయాలలో వాణిజ్య లోటు తగ్గింపు గురించి చెప్పుకొంటోంది. లోటు తగ్గిన మాట నిజం. మోడీ అధికారానికి వచ్చిన వెంటనే మేకిన్‌ ఇండియా నినాదమిచ్చారు. కానీ అప్పటి నుంచి మన దేశంలో తయారైన సరకులు ఎగుమతులు తగ్గిపోయాయి. వరుసగా గత పదహారు నెలలుగా తగ్గుతున్నట్లు తాజాగా ప్రభుత్వమే ప్రకటించింది.మరో ఏడాది పాటు ఇలాగే వుండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.ఈ వివరాలు వెల్లడి అయిన సమయంలోనే గత తొమ్మిది నెలల్లో తొలిసారిగా మార్చినెలలో చైనా ఎగుమతులు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మన దిగుమతుల ఖర్చు కూడా తగ్గింది. దీనిలో మోడీ ఘనత వుందా? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా మన బిల్లుతగ్గింది తప్ప మరొకటి కాదు. ప్రపంచ మార్కెట్లో తగ్గిన మేరకు వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు పన్నులు పెంచి జనాన్ని బాదుతున్నారు. చైనా ఈ రోజు ప్రపంచంలో అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. మన దేశంలోని కొందరు త్వరలో దానిని అధిగమించబోతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 12శాతం కాగా మనది 1.7 మాత్రమే. దీనిని 2020 నాటికి ఐదుశాతానికి పెంచాలని అనుకుంటున్నట్లు నరేంద్రమోడీ చెబుతున్నారు.అంటే మరో నాలుగు సంవత్సరాలలో మన ఎగుమతులు మూడు రెట్లు పెరగాలి. అందుకే మురళీధరన్‌ చెప్పినట్లు వాస్తవాలకు దూరంగా నరేంద్రమోడీ సర్కార్‌ అదృష్టంపై వ్యామోహం పెంచుకొని ఎదురు చూస్తున్నది.

     రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ గతవారంలో వాషింగ్టన్‌ నగర పర్యటన సందర్భగా మార్కెట్‌ వాచ్‌ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్‌ ఆశాజనక కేంద్రంగా వుందని ఐఎంఎఫ్‌తో సహా అనేక సంస్ధలు వర్ణించిన విషయాన్ని విలేకరి ప్రస్తావించి దాని రహస్యం ఏమిటని అడిగారు. దానిపై రాజన్‌ స్పందిస్తూ ‘ మేము సంతృప్తి చెందాల్సిన కేంద్రానికి చేరాలంటే మేము ఇంకా ప్రయాణించాల్సి వుంది.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్నువాడే మహారాజు అని మేము చెబుతూ వుంటాం, మేము దానికి అతి దగ్గరలో వున్నాం’ అన్నారు. చైనాతో పోలిక గురించి అడగ్గా సంస్కరణల ప్రారంభంలో చైనా కంటే భారత్‌ పదేళ్లు వెనుక వుంది. రెండు ఆర్ధిక వ్యవస్థలలోనూ ఆ తేడా కనిపిస్తుంది.మేము వారితో పోలిస్తే నాలుగు నుంచి ఐదోవంతు మధ్య వున్నాం, మేం కొన్ని సరైన చర్యలు తీసుకుంటే కొంత కాలానికి వారిని మేము చేరుకోగలం అన్నారు. వారు ఇప్పుడున్న స్ధాయికి చేరుకోవటానికి వారు అనుసరించిన మంచి విధానాలు అసాధారణమైనవి, కాబట్టి మేం కూడా మంచి విధానాలను రూపొందించి వారి మాదిరే అమలు జరపాల్సి వుంది. ఇతరులు నడిచిన బాటను మేం అనుసరించాలని లేదు, దాని అర్ధం బాగా కష్టపడాల్సి వుంది’ అన్నారు.

    రాజన్‌ చేసిన వ్యాఖ్యలను అన్వయించటాన్ని బట్టి ఏ విధంగా అయినా వుపయోగించవచ్చు. రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా వున్న వ్యక్తి మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఆలా వ్యాఖ్యానించి వుంటారని అనుకోలేము. సాధించిన దానికి సంతృప్తి చెందటం లేదనే సానుకూల అర్ధంలో కూడా కావచ్చు. అనేక సందర్బాలలో నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించిన రాజన్‌ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురౌతున్నట్లు వార్తలు వచ్చాయి.గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్ను వాడే మహారాజు అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ అతిగా స్పందించినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు అలాంటి వాటిని వుపయోగించుకోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కేంద్ర మంత్రి ఆ విధంగా స్పందించటం అంటే ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న విమర్శలను తట్టుకొనే సహనం కోల్పోతున్నారనటానికి సూచన ఇది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !
  • తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !
  • ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !
  • సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !
  • అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 236 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: