• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Suharto’s Purge

అమెరికా కనుసన్నలలో ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత !

19 Thursday Oct 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

Anti-Communist Massacre, cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, Sukarno, US hand in 1960s Indonesia Anti-Communist Massacre

ఎం కోటేశ్వరరావు

పీడకుల నుంచి పీడితులను కాపాడి సమసమాజాన్ని స్ధాపించే మహత్తర కృషిలో కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు అభిమానులు ప్రపంచంలోని అనేక దేశాలలో చిందించిన రక్తం, చేసిన ప్రాణత్యాగాలు మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో ఇండోనేషియా కమ్యూనిస్టులకరు. దేశంలో అంతర్యుద్ధం చెలరేగి కమ్యూనిస్టులు ఆయుధాలు చేపట్టి పీడకులపై పోరు సల్పినపుడు వారిని చంపివేశామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకుంటే దాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు.ఎలాంటి తిరుగుబాటు, పోరు లేకుండానే యాభై రెండు సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, వారి కుటుంబసభ్యులు, సానుభూతిపరులని అనుమానం వున్న వారిని అక్కడి సైన్యం వూచకోత కోసింది. సైన్యానికి మహమ్మదీయ పేరుతో వున్న ఒక సంస్ధను కూడా తోడు చేసి వారికి ఆయుధాలిచ్చి హత్యాకాండకు కమ్యూనిస్టులను గుర్తించటం, హత్య చేయటానికి వుపయోగించుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద మానవహక్కుల పరిరక్షకులమని చెప్పుకొనే అమెరికన్లకు ఈ దారుణ మారణకాండ వారి ఎరుకలోనే జరిగిందని, హత్యాకాండ పట్ల హర్హం వ్యక్తం చేస్తూ నివేదికలు పంపిన విషయాన్ని మంగళవారం నాడు అమెరికా ప్రభుత్వమే స్వయంగా వెల్లడించిన పత్రాలు తెలిపాయి. ఆ వూచకోతలో అమెరికా, దాని మద్దతుదారుగా వున్న బ్రిటన్‌ వూచకోతను సాగించేందుకు ఇచ్చిన తోడ్పాటును ఈ పత్రాలు నిర్ధారించాయి. ఇవి అమెరికాకు ఇబ్బందిలేని రీతిలో జాగ్రత్తగా ఎంపిక చేసి బహిర్గతపరచినవని గమనించాలి. పూర్తి సమాచారం తెలియాలంటే సిఐఏతో సహా మిగిలిన అన్ని పత్రాలను విడుదల చేయాల్సి వుంది. ఆ సమయంలో కమ్యూనిస్టుల తిరుగుబాటు, అధ్యక్షుడిగా వున్న ఇండోనేషియా జాతీయవాది సుకర్ణో ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు జరిపిన తప్పుడు ప్రచార బండారాన్ని ఇవి బయట పెట్టాయి. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే పధకంలో భాగంగా అమెరికా కనుసన్నలలో జరిగిన కుట్రలో మిలిటరీ జనరల్‌ సుహార్తో నాయకత్వంలో సుకర్ణోను బందీని చేసి ఆయన పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

1965ా66 సంవత్సరాలలో జరిపిన ఈ వూచకోతకు సంబంధించి జకర్తాలోని అమెరికా రాయబారకార్యాలయంలో వున్న 39 రహస్య పత్రాలను విడుదల చేశారు. ఇండోనేషియా వూచకోత వాస్తవాలను వెల్లడించాలని అక్కడి పౌరహక్కుల సంస్దలు, చరిత్రకారులు గతకొద్ది సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్‌కు ఇవి కొంత మేరకు వుపయోగపడతాయి. అసలైన నిందితులను బోనులో నిలబెట్టేందుకు ఇంకా ఎంతో చేయాల్సి వుంటుంది. తన ప్రయోజనాలకు హానిలేవు అనుకున్న పత్రాలను మాత్రమే అమెరికా విడుదల చేస్తుంది అనే విషయాన్ని సదా గమనంలో వుంచుకోవాలి. నేషనల్‌ సెక్యూరిటీ అర్కైవ్స్‌ పేరుతో వున్న ఒక సంస్ధ ద్వారా ఇలాంటి పత్రాలను విడుదల చేస్తారు.

‘1965ా66లో ఇండోనేషియాలో జరిగిన సామూహిక హత్యల గురించి అమెరికా అధికారులకు వివరంగా తెలుసునని కొత్తగా విడుదల చేసిన పత్రాలు స్పష్టం చేశాయి. ‘ ఇది 20శతాబ్దంలో జరిగిన ఒక దారుణమైన కిరాతకాన్ని చరిత్రగా నమోదు చేయటానికే కాదు, ఎప్పుడో జరగాల్సిన బాధితుల బాధానివారణ దిశగా కూడా అన్ని పత్రాలను విడుదల చేయాలని’ నేషనల్‌ సెక్యూరిటీ సంస్ధ ఆసియా డిప్యూటీ డైరెక్టర్‌ ఫెలిమ్‌ కినే వ్యాఖ్యానించారు. 1965 నుంచి 1968 వరకు జరిగిన పరిణామాలకు సంబందించి దాదాపు 30వేల పేజీలున్న 39 పత్రాలను విడుదల చేశారు. వాటిలో టెలిగ్రాములు, లేఖలు, రహస్య వర్తమానాలు, పరిస్ధితి గురించి మదింపు నివేదికల వంటివి వున్నాయి.

గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా నియంత సుహార్తో మరణించిన తరువాత అక్కడ పౌర ప్రభుత్వాలు ఏర్పడి నప్పటి నుంచి కమ్యూనిస్టులపై జరిపిన మారణకాండ వివరాలను బయటపెట్టాలని ఏదో ఒక రూపంలో అక్కడ ఆందోళన కొనసాగుతున్నది. అదే సమయంలో ఆవివరాలను ఏమైనా సరే బయటపెట్టకూడదని మిలిటరీ తీవ్ర వత్తిడి తెస్తున్నది. సుహార్తో మరణానంతరం పౌరపాలకులే అధికారంలో వున్నప్పటికీ తెరవెనుక మిలిటరీదే అధికారం. నిషేధిత కమ్యూనిస్టు పార్టీని తిరిగి పునరుద్దరించే యత్నాలు జరుపుతున్నారనే పేరుతో మిలిటరీ ప్రోద్బలంతో గతం నుంచి మిలిటరీతో సంబంధాలున్న మహమ్మదీయ సంస్ధ వారసులు కొత్త పేరుతో ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎర్రరంగు టీ షర్టు వేసుకున్నా కమ్యూనిస్టు అనే అనుమానంతో పోలీసులు పట్టుకొని విచారణ జరుపుతున్నారు. కమ్యూనిస్టు సాహిత్యం అమ్మేవారిని కూడా పోలీసు స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. నాటి వూచకోతకు సంబంధించి బంధువులకు న్యాయ సహాయం అందించేందుకు ఒక హాలులో ఏర్పాటు చేసిన సమావేశం కమ్యూనిస్టుల మీటింగ్‌ అంటూ ముస్లిం మతోన్మాదులతో దానిపై దాడి చేయించారు. అదే విధంగా కమ్యూనిస్టుపార్టీని పునరుద్దరించకూడదనే పేరుతో తలపెట్టిన ప్రదర్శనలో జనం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పాతికవేల మంది వరకు పోలీసులు రక్షణగా పాల్గన్నారు. యువతరానికి చరిత్రను తెలియ చెప్పాలనే పేరుతో కమ్యూనిస్టులను హత్యచేయటాన్ని సమర్ధిస్తూ మిలిటరీ తరఫున తీసిన చిత్రాన్ని ప్రతిఏటా సెప్టెంబరు 30 టీవీలు, ఇతర చోట్ల ప్రదర్శించేవిధంగా మిలిటరీ చర్యలు తీసుకొంటోంది. వాస్తవాలను చెప్పే డాక్యుమెంటరీల ప్రదర్శనలను అడ్డుకుంటోంది. ఈ పూర్వరంగంలో పరిమితమైన సమాచారాన్నే వెల్లడించినప్పటికీ ఈ పత్రాల విడుదల హక్కుల వుద్యమానికి మరింత వూపు తెస్తాయి. ఇప్పటికీ కమ్యూనిస్టులను హతమార్చటాన్ని అధికారికంగా సమర్ధిస్తూనే వున్నారు. మరణించిన వారు కనీసంగా ఐదు నుంచి పదిలక్షల మంది వరకు వుంటారని అంచనా. ఇంతకాలం గడిచినా తమవారి అదృశ్యం గురించి ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులకు రక్షణ లేదు.ఇండోనేషియాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తిరుగుబాటులో భాగంగా 1965 సెప్టెంబరు 30న ఆరుగురు మిలిటరీ జనరల్స్‌ను కమ్యూనిస్టులు హత్య చేశారనే ఆరోపణతో మిలిటరీ మారణకాండకు పాల్పడింది. నిజానికి ఆ జనరల్స్‌ను కుట్రలో భాగంగా సుహార్తోయే చంపించారన్నది బహిరంగ రహస్యం. వారు కమ్యూనిస్టు అనుకూల మిలిటరీ అధికారులనే అభిప్రాయం కూడా వుంది.

సిఐఏ ద్వారా పధకాన్ని రూపొందించటం ఐదువేల మంది ప్రముఖ కమ్యూనిస్టుల వివరాలు, మిలిటరీకి ఆయుధాలు,ముస్లింమతోన్మాదులకు శిక్షణ, నిధులు అందచేసిన అమెరికా ప్రభుత్వ పాత్ర వివరాలు ఇంకా బయటకు రావాల్సి వుంది. 1990లో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చిన అమెరికా రాయబారకార్యాలయం ఒక అధికారి తనంతటతానే ఒక జాబితాను రూపొందించి ఇచ్చినట్లు అంగీకరించింది. సామూహిక మారణకాండ గురించి నాటి అమెరికా అధికారులు ఎంత సంతోషంగా వర్తమానం పంపారో మచ్చుకు చూడవచ్చు.’ రెండున్నర వారాలలో లక్షమందిని నమ్మశక్యంగాని రీతిలో ఆమీట వూచకోత కోసింది’ అని జకర్తాలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రధమ కార్యదర్శి మారీ వాన్స్‌ ట్రెంట్‌ పంపిన వర్తమానంలో వుంది. 1966లో సిఐఏ అధికారి ఎడ్వర్డ్‌ మాస్టర్స్‌ ఒక వర్తమానంలో ‘బందీలుగా పట్టుకున్న కమ్యూనిస్టుల’ సమస్య గురించి చర్చించారు. ‘ కమ్యూనిస్టు ఖైదీలను వురితీయటం లేదా పట్టుకోక ముందే వారిని చంపివేయటం ద్వారా అనేక ప్రాంతాలు ఈ సమస్యను విజయవంతంగా అధిగమించాయి. దానిలో ముస్లిం యువజన బృందాల కర్తవ్యం ఏమంటే వారికి సహాయం అందచేయటం’ అని పేర్కొన్నాడు. నిజానికి ఈ పత్రాలను 2001లోనే సిద్ధం చేశారు గాని, 16 సంవత్సరాల తరువాత మంగళవారం నాడు విడుదల చేశారు. ‘ మాకు నిజంగా తెలియదు వాస్తవ సంఖ్య లక్షో పదిలక్షలో తెలియదని పేర్కొన్న 1966 ఏప్రిల్‌ నాటి ఒక వర్తమానం విడుదల చేసిన వాటిలో వుంది. సుకర్ణోను గద్దె దించితే ఇండోనేషియాకు అమెరికా సాయం అందచేస్తుంది అనే ఒక వర్తమాన పత్రం కూడా వీటిలో వుంది. మిలిటరీ నియంత సుహార్తో తన అధికారాన్ని సుస్ధిరం చేసుకున్నారని నిర్ధారించుకున్న తరువాత 1966 మార్చి నెల నుంచి అమెరికా సాయం ప్రారంభమైంది.

ఈ పత్రాలను విడుదల చేయాలంటూ 2015లో అమెరికా సెనెట్‌లో ఒక బిల్లును ప్రతిపాదించిన టామ్‌ వుడాల్‌ పత్రాల విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ ‘ దారుణమైన నేరాలకు పాల్పడిన సమయంలో ఇండోనేషియా ప్రభుత్వానికి తోడ్పడిన తీరును కూడా ఎంతగానో ఇవి వెల్లడిస్తాయి. ఇండోనేషియాలో ఈ హత్యల వెనుక వున్న వారు అనేక మంది ఎలాంటి శిక్షలు లేకుండా ఇప్పటికీ జీవించి వున్నారు. బాధితులు, వారి వారసులను వెనక్కు నెట్టారు, గుర్తింపు లేకుండా పోయింది.దీనిలో అమెరికా తన పాత్ర గురించి ఘర్షణ పడాలి, దాన్ని అంగీకరించటం ద్వారానే భవిష్యత్‌ మానవహక్కుల రక్షణ గురించి గట్టిగా మాట్లాడగలం ‘ అన్నారు. మహమ్మదీయ సంస్ధ పేరుతో వ్యవహరించిన మతోన్మాదులు మిలిటరీతో చేతులు కలిసి మసీదులలో ప్రార్ధనల సందర్భంగా కమ్యూనిస్టులు దైవ ద్రోహులని వారిని ఎక్కడ బడితే అక్కడ కోడి మెడ కోసినట్లు కోసి చంపాలని పిలుపు ఇచ్చారంటూ అమెరికన్లు పంపిన వర్తమానాలలో వున్నాయి. ‘ మాకు ఈ విషయాల గురించి బాధితుల మౌఖిక సంభాషణల ద్వారా సాధారణంగా తెలుసు, కానీ ఇప్పుడు ఇప్పుడు విడుదల చేసిన సమాచారం మంచి చెడ్డలన్నింటినీ వెల్లడించటం గొప్ప విషయం అని బ్రిటీష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ చరిత్ర అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జాన్‌ రోజా వ్యాఖ్యానించారు.

నెదర్లాండ్స్‌ వలస రాజ్యంగా వున్న ఇండోనేషియా స్వాతంత్య్ర వుద్యమానికి నాయకత్వం వహించిన వారిలో సుకర్ణో ఒకరు. ఆయన జాతీయవాదులు, కమ్యూనిస్టుల అనుకూల వైఖరిని కలిగి వుండేవారు.1945లో ఏర్పడిన స్వతంత్ర ఇండోనేషియాకు ఆయన తొలి అధ్యక్షుడు. అలీనోద్యమ నేతల్లో ఒకరు. తొలిరోజుల్లో జాతీయవాదిగా వున్నప్పటికీ 1960 దశకం నాటికి ఆయన కమ్యూనిస్టుల పట్ల మరింత సానుకూల వైఖరిని తీసుకున్నారు. ఇది అమెరికాకు కంటగింపు అయింది. అప్పటికే అమెరికన్లు వియత్నాంపై దాడులు చేస్తూ మారణకాండ సాగిస్తున్నారు. ఇండోనేషియాలో అతి పెద్ద కమ్యూనిస్టుపార్టీ వుంది. ఇస్లామిక్‌ దేశాలలో పెద్దదైన ఇండోనేషియా ఏ క్షణంలో అయినా కమ్యూనిస్టు దేశంగా మారిపోయే అవకాశం వుందని అమెరికా భయపడింది. అదే అక్కడి కుట్రలకు నాంది. దానిలో భాగంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టేందుకు తెరలేపారు. దీనితో పాటు ఇతర విద్రోహ చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు రైతాంగ గెరిల్లాల వ్యవస్ధను కూడా తయారు చేసేందుకు పూనుకున్న తరుణంలో సిఐఏ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులసామూహిక హత్యాకాండకు పధకరచన సాగిందని, దాని గురించి సూచాయగా తెలిసినప్పటికీ అధ్యక్షుడు సుకర్ణో మద్దతు వున్నందున కమ్యూనిస్టులు తీవ్రతను వూహించలేక, తగిన సన్నద్దులు కాలేకపోయారని,కుట్రను తిప్పికొట్టలేకపోయారని కూడా ఒక అభిప్రాయం వుంది. సుకర్ణోకు కమ్యూనిస్టుల నుంచి ముప్పు ఏర్పడిందనే పేరుతో ఆయనను గృహనిర్బంధం చేసి మిలిటరీ జనరల్‌ సుహార్తో అధ్యడిగా ప్రకటించుకొని హత్యాకాండను సాగించాడు. 1970లో సుకర్ణో కిడ్నీ వ్యాధితో మరణించినట్లు ప్రకటించారు.

అమెరికా వెల్లడించిన పత్రాలలో సమాచారం వూచకోత దోషులను వెల్లడించకపోయినప్పటికీ అనేక విషయాలను అధికారికంగా నిర్ధారించింది. ఇండోనేషియా సామాజిక, రాజకీయ వ్యవస్ధలో సంభవించబోయే మార్పులను ఇవి ఎంతో కొంత మేరకు ప్రభావితం చేస్తాయి. మిలిటరీ, సామ్రాజ్యవాదుల పాత్ర గురించి వాస్తవాలను తెలుసుకొనే ఆసక్తిని కలుగచేస్తాయి. ప్రజాస్వామిక, ఇప్పటికీ రహస్యంగానే వున్న వామపక్ష శక్తులు మరింత చురుకుగా పని చేస్తాయనటం నిస్సందేహం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచాన్ని వదలని కమ్యూనిస్టు బూచి !

23 Saturday Sep 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, communist, communist manifesto, Indonesian Communist Party (PKI)., specter of communism, Suharto’s Purge

ఎంకెఆర్‌

‘ఒక భూతం ఐరోపాను తరుముతోంది, అదే కమ్యూనిస్టు భూతం’ అంటూ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు 1848 ఫిబ్రవరిలో వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది. అంటే కమ్యూనిస్టు ప్రణాళికకు ముందే కమ్యూనిజం గురించి ఐరోపా పాలకవర్గం భయపడటం ప్రారంభమైతే ఇప్పుడు అది ప్రపంచం వ్యాపితంగా పాలకవర్గాలను వణికిస్తోంది. కమ్యూనిజాన్ని భూస్తాపితం చేశాం, అదింక పైకి లేవదు అని పాతికేండ్ల క్రితం ప్రగల్బాలు పలికిన వారే తమ నీడను చూసి తామే భయపడుతున్నారు. సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకొని బరిలోకి దిగామని జబ్బలు చరుచుకుంటున్న అమెరికాలోనే మూల మూలల నుంచి అవును నేను సోషలిస్టును అని సగర్వంగా రొమ్ము విరుచుకుంటూ ముందుకు వస్తున్న వారిని చూసి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. సోషలిజం, కమ్యూనిజం మంచిదే కానీ వాటిని అమలు జరిపే కమ్యూనిస్టులు ఈ రోజుల్లో లేరు అనే వారు ఎందరో అయితే అమెరికన్ల ప్రచార ప్రభావంతో ప్రపంచానికి కమ్యూనిజం పనికిరాదు అని చెప్పేవారు కూడా వున్నారు.

సెప్టెంబరు 18వ తేదీన జకర్తాలోని ఒక భవనంలో నిషేధిత కమ్యూనిస్టు పార్టీని పునరుద్ధరించేందుకు సభ జరుపుతున్నారంటూ వందలాది మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు గుమికూడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. ఇంతకూ ఏమిటా సమావేశం ? ఐదు దశాబ్దాల క్రితం ఇండోనేషియా మిలిటరీ లక్షలాది మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను, అనుమానం వచ్చిన వారిని హత్య చేసింది. వారి కుటుంబవారసులు, మానవ హక్కుల కార్యకర్తలు నాటి హత్యాకాండ గురించి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, నేరస్థులను శిక్షించాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి బాధిత కుటుంబాలకు న్యాయ సలహాలను అందచేసేందుకు జరుగుతున్న సమావేశమది. దాన్ని పాలకపార్టీ, మిలిటరీ కనుసన్నలలో పనిచేసే ఇస్లామిక్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుతో వున్న శక్తులు కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ సభగా చిత్రించి దాడికి ప్రయత్నించాయి. వారిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ వుత్తుత్తి కేసులతో జరిపే ఒక తతంగం తప్ప వేరు కాదు.

కమ్యూనిస్టులను వూచకోత కోసి, పార్టీని సిషేధించి నామ రూపాలు లేకుండా చేసి ఐదు దశాబ్దాలు గడిచినా ఇండోనేషియా పాలకవర్గాన్ని కమ్యూనిస్టు బూచి వదలటం లేదు. ఎప్పుడు ఏ వైపు నుంచి కమ్యూనిస్టులు తిరిగి రంగంలోకి వస్తారో అన్న భయం వారిని నిదురపోనివ్వటం లేదు. అక్కడ పేరుకు పౌర పాలన అయినప్పటికీ పెత్తనమంతా వుక్కు పాదాలదే. అడుగడుగునా వారి పాద ముద్రలు కనిపిస్తుంటాయి. వీధుల్లో ఎవరైనా ఎర్రరంగు చొక్కా ధరించి కనిపిస్తే మ్యూనిస్టుకిందే లెక్క. మిలిటరీ పోలీసులు నిర్ధారించుకొని కానీ వదలరు. ‘కమ్యూనిస్టుల విద్రోహం’ పేరుతో నిర్మించిన ప్రచార సినిమా ప్రదర్శనలు ఈనెల 30న దేశమంతటా జరిగేట్లు చూడాలని మిలిటరీ ఆదేశాలిచ్చిందంటే అక్కడ వున్నది ఏ తరహా పాలనో అర్ధం చేసుకోవచ్చు. భారీ ఖర్చుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చాలా కాలం క్రితం నిర్మించిన ఆ సినిమాను ప్రతి ఏటా 30వ తేదీన టీవీలో ప్రసారం చేస్తారు. కమ్యూనిస్టులను హతమార్చేందుకు అమెరికా సిఐఏ భాగస్వామ్యంతో ఇండోనేషియా మిలిటరీ జరిపిన కుట్రలో భాగంగా 1965 సెప్టెంబరు 30న కొంతమంది మిలిటరీ అధికారులను హత్య చేసి వారిని తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టులు చంపివేశారని ప్రచారం చేశారు. దాన్ని సాకుగా చూపి లక్షలాది మంది కమ్యూనిస్టులు, అభిమానులు, కమ్యూనిస్టులనే పేరుతో అనేక మంది చైనా జాతీయులను వూచకోత కోశారు.

వర్తమాన తరాలకు సరైన చరిత్రను తెలిపేందుకు ఆ సినిమాను విధిగా ప్రదర్శించేట్లు చూడాలని కోరిన మాట నిజమే అని సైనికాధికారులు నిర్ధారించారు. దానిలో కమ్యూనిస్టులు దేవుడిపై విశ్వాసం లేని దుష్టులని, అందుకే వారు సైనికాధికారులను చంపివేశారని, కనుక వారి మీద నిషేధం విధించటం సరైనదేనని చెప్పేందుకు ఆ చిత్రాన్ని నిర్మించారు.

నాటి హత్యా కాండ గురించి బహిరంగంగా చర్చించటాన్ని అధికారికంగా నిషేధించారు. సోమవారం నాటి సమావేశంలో బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం అందచేసే అంశం గురించి చర్చించారు. అక్కడి నిబంధనంల ప్రకారం మూడు వందలు అంతకు మించి ఎక్కువ మంది గుమి కూడా సమావేశాలకు మాత్రమే అనుమతి తీసుకోవాలి. ఈ సమావేశానికి 50 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. అయినపప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ జరపతలపెట్టిన ఒక సమావేశాన్ని కూడా అంతకు ముందు జరగనివ్వలేదు. ప్రభత్వం ఎంతగా అణచివేతలకు పాల్పడుతున్నప్పటికీ అక్కడ వున్నది పౌర ప్రభుత్వం కనుక విధిలేని పరిస్ధితులలో పరిమితంగా అయినా కొంత చర్చకు అవకాశం కల్పించక తప్పటం లేదు. 2012,14 సంవత్సరాలలో హత్యాకాండపై రెండు డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించారు, 2016లో ప్రభుత్వమే బాధితులు, వారి కుటుంబాల అభిప్రాయాలను వినేందుకు రెండు రోజుల పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సామూహికంగా ఖననం చేసినట్లు పేర్కొన్న ప్రాంతాలలో నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది కంటితుడుపు చర్యగానే మిగిలి పోయింది. తాజా పరిణాలను చూసినపుడు దేశంలో భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం లేదని, నియంత సుహార్తో రోజులను గుర్తుకు తెస్తున్నారని ఇండోనేషియన్‌ ఇండిపెండెంట్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ ప్రతినిధి అరిఫ్‌ బంబానీ వ్యాఖ్యానించారు. గతేడాది కాలంలో జర్నలిస్టులపై దాడులు రెట్టింపయ్యాయని చెప్పారు.

మలేషియా ప్రచురణ సంస్ధ తకుల్‌ సెటాక్‌ జకర్తాలో గతేడాది అక్టోబరులో నిర్వహించిన ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకం వుండటంపై మిలిటరీ, పోలీసు అధికారులు ఏడు గంటల పాటు నిర్వాహకులను ప్రశ్నించారు. మ్యూనిస్టు సాహిత్యం విక్రయించటాన్ని ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని ప్రచారం చేయటంగా పరిగణించి శిక్షలు విధిస్తారు.

తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత సోషలిస్టు, కమ్యూనిస్టు చిహ్నాలను కూడా జన జీవితం నుంచి తొలగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధకు ప్రత్యామ్నాయంగా తిరిగి పునరుద్ధరించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నకొద్దీ దాని నుంచి దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక దాడితో పాటు, గత చిహ్నాలను కూడా అంతర్ధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వూహించని పరిణామం కాదు. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా తూర్పు ఐరోపాలోని అల్బేనియాను తొలుత ఇటాలియన్‌ ఫాసిస్టులు, తరువాత నాజీలు అక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని ఎదుర్కొనేందుకు నడుం కట్టిన కమ్యూనిస్టుపార్టీ ఇతర జాతీయవాదులను కూడా ప్రతిఘటనలో భాగస్వాములను చేసేందుకు 1942 సెప్టెంబరు 16న ఒక సమావేశాన్ని పెజా అనే గ్రామంలోని మైస్లిం పెజా అనే వ్యక్తి ఇంట్లో జరిగింది. చరిత్రలో దానిని పెజా సమావేశం అని పిలిచారు.అల్బేనియా విముక్తిలో అదొక చారిత్రాత్మక ఘట్టం. దీనిని పురస్కరించుకొని ఈ ఏడాది ఆరోజున జరిగిన ఒక కార్యక్రమంలో పిల్లలు ఆ సమావేశంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం గురించి విన్న ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ నేత లుజిమ్‌ భాషా గత కమ్యూనిస్టు ప్రభుత్వ చిహ్నాలన్నింటినీ నిషేధించాలని అందుకు గాను జర్మనీ, ఇతర దేశాలలో మాదిరి ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశాడు. దేశంలో కొంత మంది ఇప్పటికీ ఎన్వెర్‌ హోక్సా, కమ్యూనిస్టు పాలన గురించి బెంగతో వున్నారని, ఈ జబ్బు నయం చేయటానికి పైపూతలు చాలవని పేర్కొన్నాడు. ప్రభుత్వ నిధులతో కమ్యూనిస్టుల హయాంలో జరిగిన నేరాల పరిశోధన పేరుతో ఏర్పాటు చేసిన సంస్ధ కమ్యూనిస్టుల పాలనలో నిర్మించిన సినిమాల ప్రదర్శన నిషేధం గురించి ఒక ముసాయిదా బిల్లు తయారు చేసే పనిలో వుంది. ఒక్కసారిగా అన్నింటిపై నిషేధం అంటే ఎదురుతన్నే అవకాశం వుందని అందువలన సినిమాకు ముందు దాని గురించి చెబుతూ పెద్ద ఆర్భాటాలు లేకుండా చూడాలని సంస్ధ నిర్వాహకుడు చెప్పాడు. అయితే ఈ ప్రతిపాదనలు బహిర్గతం కాగానే కమ్యూనిజంతో విబేధించే వారు కూడా గత చరిత్రను తుడిచి వేయటాన్ని అంగీకరించబోమని కొందరు పేర్కొన్నారు. గతేడాది జరిపిన ఒక సర్వేలో 42శాతం మంది కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా గురించి సానుకూలంగా స్పందించారు.

పూర్వపు సోషలిస్టు దేశాలలో కమ్యూనిస్టుచిహ్నాలను పూర్తిగా చెరిపివేయాలన్నది ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఆ పని చేస్తే ప్రస్తుతం అధికారంలో వున్న పాలకుల ప్రజాస్వామ్య వ్యతిరేకలక్షణాన్ని స్వయంగా బయట పెట్టుకున్నట్లు అవుతుందని తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తే యువతరంలో కమ్యూనిజం గురించి ఆసక్తి పెరిగే ప్రమాదం వుందన్న కోణం నుంచి పూర్తిగా చెరిపి వేయాలనటాన్ని వ్యతిరేకిస్తున్నారు కొందరు. తూర్పు ఐరోపా దేశాలన్నీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినవే. కమ్యూనిస్టుపార్టీ చిహ్నాలను లేకుండా చేయటం అంటే ఆ ఘనచరిత్రను తుడిచి వేయటమే. వుక్రెయిన్‌లో 2015లో చేసిన రెండు చట్టాల ప్రకారం కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించటమే గాక, ఎవరైనా కమ్యూనిస్టు పాలకులు చేసిన పనులను నేరాలుగా ఎలా చెబుతారని ప్రశ్నించటాన్ని కూడా నేరంగా ఆ చట్టంలో పొందుపరిచారు. హంగరీలో 2000 సంవత్సరంలో కమ్యూనిస్టు, ఫాసిస్టు చిహ్నాలను నిషేధించటంపై కోర్టులలో అనేక సార్లు సవాలు చేసిన వుదంతాలున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టుల వూచకోతపై చర్చలు తప్ప క్షమాపణ లేదన్న ఇండోనేషియా సర్కార్‌

18 Monday Apr 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

1965 Symposium, cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, US, victims of 1965

 

ఎంకెఆర్‌

1965-66లో జరిగిన మరణాలపై చర్చలు తప్ప క్షమాపణ చెప్పేది లేదని సోమవారం నాడు ఇండోనేషియా సర్కార్‌ ప్రకటించింది. ఆ సంవత్సరాలలో ఐదులక్షల మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు, అనుమానం వున్న వారిని, కొంత మంది సైనిక అధికారులను హత్య కావించిన వుదంతంపై వారి వారసులతో సర్దుబాటు పేరుతో రెండు రోజుల జాతీయ సెమినార్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సభను ప్రారంభించిన హోంమంత్రి లహుట్‌ పంజైటన్‌ మాట్లాడుతూ గతంతో శాంతిని కోరుకుంటున్నాం తప్ప జరిగినదానికి క్షమాపణ చెప్పేది లేదని చెప్పారు.’ క్షమాపణ చెప్పేంత బుద్దిహీనులం కాదు మేము, ప్రతిదానికీ ప్రభుత్వం క్షమాపణ చెబుతుందని మీరు అనుకోవద్దు, దేశం హితం కోసం మంచి ఏమిచేయాలో మాకు తెలుసు.గతంలో జరిగిన ముఖ్యంగా 1965లో జరిగిన మానవ హక్కుల దుర్వినియోగం కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం కోరుకుంటోంది, అదెంతో సంక్లిష్టతతో కూడుకున్నదని తెలుసు’ అన్నారు.

‘ప్రపంచ వ్యాపితంగా ఎన్నో దేశాలు నిజనిర్ధారణ కమిషన్లు వేశాయి, అవి గతంలో జరిగిన అత్యాచారాలను వెల్లడించాయి. ఇలాంటి విషయాలెప్పుడూ క్లిష్టంగానే వుంటాయి అది ఇండోనేషియాలో ఎందుకు సాధ్యం కాదు, ఇప్పుడు కావలసింది వాస్తవాల వెల్లడి ‘ అని మానవహక్కుల నిఘా సంస్ధ డైరెక్టర్‌ కెన్నెత్‌ ప్రశ్నించారు. మానవహక్కుల కోర్టును ఏర్పాటు చేసి నేర విచారణ జరపాలని ఇండోనేషియా మానవ హక్కుల కమిషన్‌ 2012లోనే సిఫార్సు చేసింది. వూచకోతకు పురికొల్పినవారెవరూ నేడు లేరని, నాటి వుదంతాల గురించి సాక్ష్యం చెప్పేవారెవరూ లేరని, ఎంతో సమయం వృధా అవుతుందనే సాకులతో ప్రభుత్వం దానిని తిరస్కరించింది.

ఈ సెమినార్‌ సందర్భంగా కమ్యూనిస్టుల వూచకోతను సమర్ధించే మాజీ జనరల్స్‌, ప్రభుత్వ అధికారులు ఊచకోత వాస్తవాలను వెల్లడించి, దోషులను శిక్షించాలని కోరుతున్న మానవ హక్కుల కార్యకర్తలు, బాధితుల కుటుంబ సభ్యులు, మారణ కాండ నుంచి తప్పించుకున్న వారిలో కొంత మంది సెమినార్‌ జరిగే ప్రాంగణం వెలుపల గుమికూడి తమ వాదనలను వినిపించారు.

హత్యాకాండకు పాల్పడిన వారిగా ఆరోపణలున్న అనేక మంది నేడు ప్రభుత్వ వున్నత పదవులలో వున్నారని, అందువలన వారిని శిక్షించటం అంతసులభం కాదంటూ, అయితే మానవ హక్కుల వుల్లంఘన సమస్యను పరిష్కారించాల్సి వుందని ప్రభుత్వం గుర్తించింది, కోర్టు వెలుపల వివాదాలను పరిష్కరించుకోవాలన్నది ప్రభుత్వ అభిమతమని మంత్రి చెప్పారు. గతంలో ఈ వుదంతాలపై రూపొందించిన సినిమాలను బలవంతంగా నిషేధించటం భద్రతా కారణాలతో పాటు ప్రజా జీవనంలో వున్న ప్రముఖుల వత్తిడి కూడా తోడైందని భవిష్యత్‌లో అటువంటి పరిస్ధితి వుండదని మంత్రి అన్నారు. అందరూ చెబుతున్నట్లు మరణించిన వారు లక్షలలో లేరంటూ సైనిక జనరల్స్‌ చెబుతున్న కధలను పునరుద్ఘాటించారు.

రిటైర్డ్‌ జనరల్‌ సింటోంగ్‌ పంజాయిటిన్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టుల కోసం వేటాడారని, హత్యకు గురైన వారు కేవలం 80వేల మందే అన్నారు.తాను పనిచేసిన ఆర్మీ కమాండో రెజిమెంట్‌ను సెంట్రల్‌ జావాలో ఏర్పాటు చేశారని, తమకు ముస్లిం యువకులతో కూడిన అసోర్‌ యూత్‌ అండ్‌ మహమ్మదీయ సంస్ధకు చెందిన వారు తోడ్పడిన మాట వాస్తవమని చెప్పారు. కమ్యూనిస్టులం కాదని చెప్పిన వారిని వెంటనే విడుదల చేశారన్నారు. మానవ హక్కుల న్యాయవాది టోడంగ్‌ ముల్యా మాట్లాడుతూ ఊచకోతకు గురైన వారి సంఖ్య గురించి చెబుతున్న వాటిని తాము అంగీకరించటం లేదన్నారు. భయంతో అనేక మంది దేశం వదలి వెళ్లారని వారు తిరిగి వచ్చిన తరువాత అనుమానంతో వుద్యోగాలలోకి తీసుకొనేందుకు తిరస్కరించారని చెప్పారు. నాటి ప్రభుత్వమే విదేశాలలో విద్య కోసం పంపిన విద్యార్ధులు దేశంలోకి తిరిగి రావటానికి అనుమతించలేదని అందువలన వాస్తవాలను మరుగుపరచవద్దని కోరారు.మిలియన్ల మందిపట్ల వివక్షను ప్రదర్శించారని, మానవ హక్కుల వుల్లంఘన తీవ్రంగా జరిగిందని, వాటిని న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తారా మరొక పద్దదా అన్నది సమస్య కాదని, చరిత్ర చరిత్రగానే వుంటుందని, అది బయటకు రావాలని తరువాతే సర్దుబాటు, పునరావాసం లేదా పరిహారం గురించి మాట్లాడుకోవచ్చన్నారు.

ఈ సెమినార్‌ను వ్యతిరేకిస్తున్నట్లు పంచశీల ఫ్రంట్‌ అనే సంస్ధ ప్రకటించింది. ఇదంతా కమ్యూనిస్టు సిద్దాంతాన్ని తిరిగి పునరుజ్జీవింప చేయటానికి, కమ్యూనిస్టులను హత్య చేసినందుకు ప్రభుత్వంతో క్షమాపణలు చెప్పించే యత్నమిదని ఆరోపించింది. 1945 నాటి రాజ్యాంగం ప్రకారం కమ్యూనిస్టుపార్టీ, మార్క్సిజం లేదా లెనిజం నిషేధించబడ్డాయని సంస్ధ చైర్మన్‌ సిద్దికి విలేకర్ల సమావేశంలో చెప్పాడు.ఈ సెమినార్‌లో పాల్గొనేవారిలో 85-90శాతం కమ్యూనిస్టుపార్టీ సానుభూతిపరులే వున్నారని ఆరోపించాడు. కమ్యూనిస్టు పార్టీ తప్పేమీ లేదని నిర్ధారించేందుకు, పార్టీ సభ్యుల కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప చేసేందుకు చేస్తున్న యత్నంగా వున్నందున తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాడు.అనేక మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, వారి వారసులు ప్రస్తుతం పార్లమెంట్‌, ప్రాంతీయ మండళ్లూ, స్దానిక సంస్ధలలో ప్రతినిధులుగా వున్నారని కూడా సిద్దికి చెప్పాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత నిజాలను దాచవద్దు

17 Sunday Apr 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ 1 Comment

Tags

cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, US, victims of 1965

ఎంకెఆర్‌

    1965లో కమ్యూనిస్టుల వూచకోతకు సంబంధించిన వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించవద్దని ఇండోనేషియా మానవ హక్కుల కార్యకర్తలు, మేథావులు, చరిత్రకారులు డిమాండ్‌ చేశారు.ఐదు లక్షల మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను సామూహిక హత్య చేయించిన మిలిటరీ నియంత సుహార్తో ఆ దుర్మార్గాన్ని మరుగుపరచేందుకు తన జీవితకాలంలో తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ దుర్మార్గుడి పతనం తరువాత నాటి ఘటనలకు సంబంధించి వాస్తవాలను బయట పెట్టాలనే డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. దీంతో వత్తిడికి తట్టుకోలేని ప్రభుత్వం నాటి దమనకాండను తక్కువ చేసి చూపేందుకు, విచారం వెలిబుచ్చి వాస్తవాలను మరుగు పరచేందుకు పూనుకుందని అనేక మంది భావిస్తున్నారు.

    ఇండోనేషియా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1965 నాటి ఘటనలపై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సెమినార్‌ను హోంమంత్రి లుహుత్‌ పంజైతన్‌ సోమవారం నాడు ప్రారంభిస్తారు. 1965-66 సంవత్సరాలలో ఐదు నుంచి పదిలక్షల మంది కమ్యూనిస్టులు, పార్టీ సానుభూతిపరులు, చైనా జాతీయులను హత్య కావించటమో, నిర్భంధ శిబిరాలలో చిత్రహింసలకు గురిచేయటమో చేశారు. అమెరికా సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన మిలిటరీ అధికారి సుహార్తో కొంత మంది మిలిటరీ జనరల్స్‌ను హత్య చేయించి అందుకు కమ్యూనిస్టుపార్టీ బాధ్యురాలంటూ నిందవేసి దేశ వ్యాపితంగా దమనకాండకు పూనుకున్నాడు. ఆదంతా నాటి అధ్యక్షుడు సుకర్ణో ఆదేశాల మేరకే జరిగిందని ప్రపంచాన్ని నమ్మించాడు.

    సెమినార్‌ నిర్వాహకులలో ఒకరైన రిటైర్డ్‌ మిలిటరీ జనరల్‌ అగస్‌ మాట్లాడుతూ గతంలో జరిగినదానిని పునరావృతం కానివ్వబోమని,అయితే వాటిని మరిచి పోరాదని అన్నారు. నాటి ఊచకోతలో మరణించిన కమ్యూనిస్టుల- హత్యకు గురైనట్లు చెబుతున్న సైనిక జనరల్స్‌, ఇతర బాధిత కుటుంబాల పిల్లల మధ్య చర్చలకు, సర్దుబాటు చేసేందుకు ఏర్పడిన ఒక సంస్ధను అగస్‌ నిర్వహిస్తున్నారు. నాడు జరిగిన కుట్రలో మిలిటరీ జనరల్‌గా వున్న అగస్‌ తండ్రి కూడా మరణించాడు. సెమినార్‌లో చర్చలు.సర్దుబాట్లకు ప్రయత్నం చేసినందువలన ప్రయోజనం వుండదని అసలు ఏం జరిగిందన్నది వెల్లడి కావాలని, ప్రభుత్వం దేన్నీ దాచకూడదని అనేక మంది కోరుతున్నారు. ఊచకోతపై గతేడాది హేగ్‌ నగరంలో ప్రజా విచారణ నిర్వహించిన మానవ హక్కుల లాయర్‌ నూర్‌సియాబానీ కాట్‌జసుంగ్‌కానా ఈ సెమినార్‌ను స్వాగతిస్తూ జాతీయ చర్చకు, సర్దుబాటుకు దోహదం చేస్తుందని అయితే అందుకు గాను ముందుగా నిజాలను వెల్లడించాలని అన్నారు.

    న్యూయార్క్‌, జకర్తాలోని మానవ హక్కుల బృందాలు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ 1965 నాటి హంతకులు, అమెరికా ప్రభుత్వం మధ్య వున్న సంబంధాలు ఎలాంటివో బయట పెట్టాలని డిమాండ్‌ చేశాయి. 1998లోనే నియంత సుహార్తో పాలన అంతమైనా మానవ హక్కుల వుల్లంఘనకు సంబంధించిన వివరాలను ఇంతవరకు ప్రభుత్వం బయటకు రానివ్వటం లేదు. ఆ హత్యాకాండలో మిలిటరీతో పాటు ఇస్లామిక్‌ సంస్ధలకు చెందిన వారు కూడా భాగస్వాములయ్యారు. వారిలో కొందరు ఇప్పటికీ సజీవులుగా వున్నారు. వారి వివరాలు బయటకు వస్తే వారిని విచారించి శిక్షించాలనే వుద్యమం తలెత్తుతుందని పాలకులు, మిలిటరీ భయపడుతున్నది.

    జాతీయ సెమినార్‌కు సన్నాహంగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ఏర్పాటు చేసిన సమావేశాన్ని ముస్లిం తీవ్రవాదులుగా వున్న వారు అడ్డుకున్నారని సంస్ధ అధ్యక్షుడు బిజో అంటుంగ్‌ చెప్పారు. తమ సభ్యులు జకర్తా నగరానికి చేరుకోక ముందే మిలిటరీ గూఢచారులు వారిని విచారించారని కూడా వెల్లడించారు. బాధితులకు చెందిన వారు ఎక్కడ మీటింగ్‌ పెట్టినా ప్రభుత్వం ముఖ్యంగా మిలిటరీ బెదిరింపులకు దిగుతున్నదని బిజో వెల్లడించారు. సెమినార్‌లో వాస్తవాలను వెల్లడిచేయకపోతే ఎవరు హంతకులు, ఎవరు బాధితులో, ఎవరికి పునరావాసం కల్పించాలో ఎలా తెలుస్తుందని సెటా పరిశోధనా సంస్ధకు చెందిన అహమ్మద్‌ ఫనానీ రోజ్‌యిదీ ప్రశ్నించారు. నిందితులను కప్పి పుచ్చి బాధితులకు వూరట కల్పిస్తే ప్రయోజనం ఏముందని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. 1965 నాటి వాస్తవాలకు సంబంధించి అమెరికా వద్ద వున్న సమాచారాన్ని తెప్పించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం పూనుకోవాలని అనేక మంది డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం వుందని ఒకవైపు చెబుతున్నప్పటికీ దానికి ప్రభుత్వం, మిలిటరీ, అధికార యంత్రాంగంలోని కొన్ని శక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన కూడా వున్నదని వార్తలు వస్తున్నాయి. వియత్నాంపై దురాక్రమణ తీవ్రంగా సాగుతున్న సమయంలో ఇండోనేషియాలో బలంగా వున్న కమ్యూనిస్టు పార్టీతో నాటి అధ్యక్షుడు సుకర్ణో సఖ్యతగా వుండటంతో మరో ఆగ్నేయాసియా దేశం కమ్యూనిస్టుల ప్రభావంలోకి వెళుతుందేమో అన్న భయంతో అమెరికాయే మిలిటరీ జనరల్‌ సుహార్తోను వుపయోగించి కుట్ర చేసి కమ్యూనిస్టుల వూచకోతకు తెరలేపిందనే అభిప్రాయం కూడా వుంది. అమెరికా వద్ద వున్న ఫైళ్లు, వుత్తర ప్రత్యుత్తరాలను బయట పెడితే అసలేం జరిగిందనే వాస్తవాలు బయటకు వస్తాయి. అమెరికా తన వద్ద వున్న సమాచారంలో తనకు హాని కరం కాని వాటిని బహిర్గతం చేస్తున్నప్పటికీ ఇండోనేషియా వూచకోత వంటి వాటిని ఇంతవరకు వెల్లడించలేదు.

    ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్వంతంగా దర్యాప్తును ప్రారంభించింది.అయితే అది చేసిన సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.రెండు రోజుల పాటు జరిగే సెమినార్‌లో ఎనిమిది అంశాల గురించి చర్చిస్తారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఎరుపే కాదు, సుత్తీ కొడవలి అన్నా భయపడుతున్న పాలకులు

07 Saturday Nov 2015

Posted by raomk in Current Affairs, Left politics

≈ Leave a comment

Tags

Indonesia, Suharto’s Purge

అమ్మా ! అమ్మా !! ఈ బొమ్మ ఎంతో బాగుంది కదూ

ఏం బాబూ పెద్ద వాడివైనా నీ కింకా బొమ్మల పిచ్చి పోలేదా పద పద !

కాదమ్మా నా చిన్నపుడు ఇలాంటి బొమ్మలు రాలేదు , దీనిపై సుత్తీ కొడవలి బొమ్మలున్నాయి, ఎందుకలా వేశారు.
అవి చైనా మేడ్‌, అవి కమ్యూనిస్టు చిహ్నాలు అని చెబుతుండగానే తీసుకోండి సార్‌ పెద్ద ఖరీదేం కాదు అని షాపతను అంటూ వుండగానే బిలబిల మంటూ మిలిటరీ వచ్చి అక్కడున్న బొమ్మలను స్వాధీనం చేసుకొని షాపువాడిని బలవంతంగా జీవులో ఎక్కించుకు చక్కా పోయారు. వారికి ఏం జరిగిందో అర్ధం కాలేదు, ఆ బొమ్మలను ఎందుకు తీసుకుపోయారో, వాటిలో ఏమైనా వజ్రాలు, గట్రా పెట్టి స్మగ్లింగ్‌ చేస్తున్నారా అని పరిపరి విధాలా అనుకుంటుండగానే పోలీసులు మైకులో హెచ్చరికలు ప్రారంభించారు. సుత్తీ కొడవలి చిహ్నం వున్న బొమ్మలను అమ్మినా, వాటిని ఎవరైనా కొన్నా వారిని అరెస్టు చేస్తామన్నది వాటి సారాంశం.

ఇదేదో కథలా అనిపిస్తున్నా నిజం. ఇండోనేషియాలోని యోగ్యకర్తా అనే పట్టణంలో మిలిటరీ సుత్తీ, కొడవలి చిహ్నాలు వున్న చైనా తయారీ బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లు జకర్తా గ్లోబ్‌ అనే పత్రిక శుక్రవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. ఆ చిహ్నాలు చూసిన పిల్లలు కమ్యూనిస్టు ఆశయాల గురించి తెలుసుకుంటారని, వాటిని అమ్మటం, కొనటం ద్వారా పిల్లల్లో కమ్యూనిస్టు బీజాలు వేసినట్లు అవుతుందని అధికారులు భావించి అలాంటి బొమ్మలను నిషేధించినట్లు తెలిపింది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ కవలెరీ తుమాది దీని గురించి చెబుతూ ఈ బొమ్మలను అమ్ముతున్నవారిలో ఎక్కువ మందికి ఆ బొమ్మల వెనుక వున్న అర్ధం తెలియదని, అయితే కొంత కాలానికి మన పిల్లలు ఆ చిహ్నాలకు ఆకర్షితులు అవుతారని అదే జరిగితే తరువాత వారి మెదళ్లలో ఆ భావాలు కూడా ప్రవేశిస్తాయని ఆ మిలిటరీ అధికారి వ్యాఖ్యానించాడు. బొమ్మలకు ఆర్డర్లు ఇచ్చే వ్యాపారులు దీని గురించి ఎరిగి వుండాలని చెప్పాడు.

1965-66 సంవత్సరాలలో ఇండోనేషియాలో దాదాపు ఐదు లక్షల మంది కమ్యూనిస్టులు, అభిమానులను జనరల్‌ సుహార్తో నాయకత్వంలోని మిలిటరీ తిరుగుబాటుదారులు నిర్ధాక్షిణ్యంగా హత్యచేసిన విషయం తెలిసినదే. ఆ వుదంతం జరిగి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా దానిపై చర్చ, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిన పూర్వరంగంలో ఇండోనేషియా మిలిటరీ ఈ చర్య తీసుకోవటం ద్వారా అది ఎంత భయపడుతున్నదో అర్ధం అవుతోంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వుబుద్‌ రైటర్స్‌ మరియు రీడర్స్‌ ఫెస్టివల్‌(పుస్తక ప్రదర్శన) సందర్భంగా గతనెలలో 15 కార్యక్రమాలను జరగకుండా అధికారులు అడ్డుకున్నారు. నిఘా సిబ్బందిని దింపి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఆరాతీశారు. కమ్యూనిస్టుల ఊచకోత గురించి సమాచారాన్ని ప్రచురించిన జావాలోని ఒక విశ్వవిద్యాలయ పత్రిక కాపీలను మొత్తం స్వాధీనం చేసుకొని వాటిని పాఠకులకు అందకుండా నాశనం చేశారు. సుహార్తో కాలం నాటి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా మిలిటరీ, పోలీసులు కమ్యూనిస్టుల ఊచకోత గురించి చర్చ జరగకుండా సమాచారాన్ని జనానికి అందకుండా అప్రకటిత నిషేధాన్ని అమలు జరుపుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: