• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Supreme Court of India

సుప్రీం కమిటీపై కందకు లేని అనుమానం కాషాయదళాలకెందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపై మద్దతుదార్ల మండిపాటు !

05 Sunday Mar 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, Narendra Modi Failures, RSS, Saffron gang, Supreme Court of India



ఎం కోటేశ్వరరావు


తప్పనిసరి పరిస్థితి ఏర్పడి తప్పు చేసినట్లు ఒక వేళ గౌతమ్‌ అదానీ అంగీకరించినా అతని మద్దతుదారులైన కాషాయదళాలు మాత్రం ఒప్పుకొనేట్లు కనిపించటం లేదు. అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే చైర్మన్‌గా ఎస్‌బిఐ మాజీ చైర్మన్‌ ఓ ప్రకాష్‌ భట్‌, ఇన్ఫోసిస్‌ సహ ప్రారంభకుడు నందన్‌ నీలెకని, ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌ఐడి చైర్మన్‌గా, గతంలో ఐసిఐసిఐ, బ్రిక్స్‌ బాంకు, ఇన్ఫోసిస్‌ చైర్మన్‌గా పని చేసిన కెవి కామత్‌, ప్రముఖ లాయర్‌ సోమశేఖర సుందరేశన్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జెపి దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని నిజం వెల్లడౌతుందని అదానీ ఒక ప్రకటనలో స్పందించారు. కానీ కందకు లేని అనుమానం కత్తిపీటకు వచ్చినట్లు సుప్రీం కోర్టు కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందా అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే నేషనలిస్ట్‌ హబ్‌ అనే మీడియా పోర్టల్‌ ప్రశ్నించింది.సభ్యులుగా ఉన్నవారికి గతంలో ఆర్థికనేరాలకు పాల్పడినవారు కొందరితో ఉన్న సంబంధాలివి, మోడీని విమర్శించే సంస్థలతో కాంగ్రెస్‌తో సంబంధాలు అంటూ ఇలాంటి వారు తటస్థంగా ఉండి నివేదిక ఇస్తారా అన్న అనుమానాలను రేకెత్తించింది. దాని మీద ఇవ్వరు ఇవ్వరు అంటూ వెంటనే స్పందనలు.


దేశంలో ఇప్పుడు జరుగుతున్న తీరు తెన్నులను బట్టి జనం ప్రతిదాన్నీ అనుమానిస్తున్నపుడు ఏ కమిటీని వేసినా దానిలో ఉన్నవారిని అనుమానించటం సహజం. తానెలాంటి తప్పు చేయలేదని అదానీ తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పటికీ, నరేంద్రమోడీ మద్దతుగా ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా పక్కన పెట్టేసి హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికను స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు నమ్మారు. తమ వాటాలను తెగనమ్ముకొన్నారు.నెల రోజులు దాటినా జరిగిన నష్టంలో మార్పు లేదు. అడ్డగోలుగా పెంచి పెద్దచేసినా, ఇబ్బందులు వచ్చినపుడు నరేంద్రమోడీ కూడా అదానీని కాపాడలేరని కూడా స్టాక్‌మార్కెట్‌ మదుపుదార్లలో ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో సంఘపరివార్‌ సంస్థ సుప్రీం కమిటీ మీద అనుమానాలను ఎందుకు రేకెత్తించినట్లు ? భీమకొరేగాం కేసులో మాదిరి దర్యాప్తు సంస్థే స్టాన్‌స్వామి, ఇతరుల కంప్యూటర్లలో తప్పుడు సమాచారాన్ని చొప్పించి దాన్నే సాక్ష్యంగా చూపేందుకు చూసిన దారుణం తెలిసిందే. అదానీ కంపెనీల్లో అలాంటిదానికి అవకాశం లేదు.వివరాలను ఇప్పటికే ధ్వంసం చేయగా మిగిలిన వాటి నుంచే అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ కమిటీ నిర్ధారిస్తుంది. లేదూ ఒకదానికొకటి పొంతనలేని సమాచారం ఇస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టుకు అందిస్తుంది. సెబీ కూడా దర్యాప్తు జరుపుతున్నది. ఒక నియంత్రణ సంస్థగా సెబీ తీరు తెన్నుల వైఫల్యం గురించి కూడా సుప్రీం కమిటీ విచారణ జరుపుతుంది. తమ కమిటీకి సహకరించాలని సెబీని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కమిటీలో వెలుగుచూడనివి సెబీ నివేదికలో లేదా సెబీలో రానివి సుప్రీం కమిటీ నివేదికలో చోటు చేసుకోవచ్చు. ఆ రెండు నివేదికలూ బహిర్గతమైన తరువాత గతంలో దర్యాప్తు జరిపిన హిండెన్‌బర్గ్‌ లేదా ఆ రంగంలో నిపుణులైన వారు లేవనెత్తే అంశాలను కూడా సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఇంత జరగాల్సి ఉండగా ఇంకా ఆలూలేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమా అన్నట్లుగా సంఘపరివార్‌ మీడియా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు ? హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నింటినీ సుప్రీం కోర్టు కమిటీ విచారించటం లేదు. మన దేశంలో తిమ్మినిబమ్మిని చేసినట్లు వచ్చిన ఆరోపణల మీదనే అది పరిశీలన జరుపుతుంది. విదేశాల్లోని డొల్లకంపెనీలు, నిధుల మళ్లింపు వంటి వాటి మీద ఏదైనా అనుమానం వచ్చే సమాచారం దొరికితే దాన్ని సుప్రీం కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది.సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా మీడియా ఎక్కువ చేసి రాస్తున్న వార్తల వలన స్టాక్‌ మార్కెట్‌ ప్రభావితమై మదుపర్లు నష్టపోతున్నందున అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం గురించి వార్తలపై నిషేధం విధించాలన్న పిటీషన్‌దారుల్లో ఒకరైన ఎంఎల్‌ శర్మ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. సహేతుకమైన వాదనలు వినిపించండి తప్ప నిషేధాన్ని అడగవద్దని చెప్పింది.


ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్‌చేసిన జెపిసికి మోడీ సర్కార్‌ అంగీకరించి ఉంటే సుప్రీం కోర్టు కమిటీ ఉందేదీ కాదు, దాని మీద నేషనలిస్ట్‌ హబ్‌కు సందేహాలు లేవనెత్తే అవకాశం వచ్చి ఉండేది కాదు. జెపిసి పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దానిలో అత్యధికులు అదానీని కంటికి రెప్పలా కాపాడుతున్న బిజెపి లేదా మిత్రపక్షాల సభ్యులే ఉంటారు.అయినా మోడీ ఎందుకు నిరాకరించినట్లు ? ఏ పార్టీ మంది ఎందరని కాదు, ఎవరెందరున్నా అడిగిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వలేదని సభ్యులు రాస్తారు. మెజారిటీ ఒక నివేదికను ఆమోదించినా,దానితో విబేధించేవారు కూడా మరొక నివేదికను ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ రెండూ బహిరంగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు అదానీని కాపాడేందుకు పూనుకున్నది, ఎవరు అక్రమాలను వెలికి తీసేందుకు చూసిందీ యావత్‌ ప్రపంచానికి తెలుస్తుంది. గతంలో నరేంద్రమోడీకి ఉందని చెప్పిన 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేక కాదు, ఈ కారణంగానే భయపడ్డారు.


సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల మీద వత్తిడి తీసుకురారా, బెదిరించరా అంటే ఈ దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అదీ ప్రభుత్వం వైపు నుంచే ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ముంచుకు వస్తున్న ముప్పు అదే ! తమ ముందు దాఖలైన కేసుల్లో సుప్రీం నోటీసులు ఇచ్చిన తరువాత గానీ కేంద్రం కదలలేదు.కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ తమ ప్రతిపాదనలను ఒక మూసివేసిన కవరులో పెట్టి సుప్రీం కోర్టుకు అందించింది. దాని అర్దం ఏమిటి ? మేము చెప్పిన వారితో చెప్పినపద్దతుల్లో విచారణ జరిపించాలని సుప్రీంను ప్రభుత్వం ఆదేశించటమే.పారదర్శక విచారణ జరగాలంటూ సదరు కవరును సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిజానికి కేంద్రానికి అంతకంటే అవమానం మరొకటి లేదు, బహుశా ఈ పరిణామాన్ని ఊహించి ఉండరు. ఇంతకీ ఆ కవరులో నరేంద్రమోడీ సర్కార్‌ రాసిన అంశాలేమిటి అన్నది ఇప్పటి వరకు వెల్లడికాలేదు. ఇక అవకాశాలు లేవు.తరువాత అవి లీకైనా కేంద్రం తోసిపుచ్చే అవకాశం ఉంటుంది.


కొన్ని సందర్భాల్లో కేసుల స్వభావాన్ని బట్టి కోర్టులు ప్రభుత్వాలు, ఏజన్సీలను కోరిన సమాచారాన్ని సీల్డు కవర్‌లో అందించాలని అడుగుతాయి. అదానీ కంపెనీలదంతా బహిరంగం అయినపుడు విచారణ రహస్యంగా జరగాల్సిన అవసరం ఏముంది ? కమిటీ విచారణ అంశాలు, పరిధి గురించి పిటీషనర్లకు తెలియాల్సి ఉన్నందున ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తిరస్కరించి ఒక కమిటీని తానే ఏర్పాటు చేసింది. గతేడాది నవంబరులో కేరళ టీవీ ఛానల్‌ మీడియా వన్‌ కేసులో కేంద్ర ప్రభుత్వ సీల్డుకర్‌ను సుప్రీం తిరస్కరించింది. కక్షిదారు వాటిని చూడకుండా అవకాశాన్ని నిరోధించటమే అవుతుందని పేర్కొన్నది. నిబంధనల ప్రకారం ఒక అంశాన్ని రహస్యమని భావించి సీల్డు కవర్‌లో ఉంచాలని ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు గనుక నిర్ణయిస్తే ప్రజా ప్రయోజనం పేరుతో దాన్ని చూసేందుకు, కాపీ కావాలని కోరేందుకు అవకాశం లేదు. మాజీ మంత్రి పి చిదంబరం అరెస్టయిపుడు బెయిలు కేసులో ఇడి సమర్పించిన సీల్డు కవర్‌ మీద ఆధారపడిన ఢిల్లీ హైకోర్టును 2019లో సుప్రీం కోర్టు తప్పు పట్టింది.తమ మనస్సులను సంతృప్తిపరచుకొనేందుకు న్యాయమూర్తులకు సీల్డు కవర్‌లోని అంశాలను చూసేందుకు అధికారం ఉన్నపుడు కోర్టు విచారణలో వాటిలో కనుగొన్న వాటిని నమోదు చేయకూడదని పేర్కొన్నది.రాఫెల్‌ విమానాల కొనుగోల వివరాలు రహస్యం అని ప్రభుత్వం చెప్పటాన్ని కోర్టు అంగీకరించింది.2జి స్పెక్ట్రం కేసులో కూడా అదే జరిగింది.


ప్రతి వ్యవస్థ తాము చెప్పినట్లు నడవాలని, తమ కనుసన్నలలో మెలగాలని దేశంలోని మితవాద శక్తులు కోరుకుంటున్నాయి.ఈ కారణంగానే తమకు నచ్చని తీర్పులు, పని తీరును అవి సహించలేకపోతున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలదా లేక కొంత మంది అధికారులదా నిర్ణయాధికారం అంటూ జడ్జీల కొలీజియం విధానంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేదు. దేశ వ్యతిరేకులకు సుప్రీం కోర్టు ఒక పనిముట్టుగా మారిందంటూ హిందూత్వ అనుకూల శక్తులు ధ్వజమెత్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక(హిందీ) పాంచజన్య సంపాదకీయంలో దీన్నే పేర్కొన్నది.సుప్రీం కోర్టు ప్రజలు చెల్లించిన పన్నులతో నడుస్తున్నది.భారత్‌కు అనుకూలమైన భారత చట్టాల ప్రకారం నడుచుకొనేందుకు మన ప్రయోజనాలకు అనుగుణంగా నడిచేందుకు ఏర్పాటు చేసినదే సుప్రీం కోర్టు.అలాంటి దానిని దేశ వ్యతిరేకులు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారని పాంచజన్య మండిపడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ అదానీ ఎంత లబ్ది పొందితే చైనాకు అంత నష్టం అని పేర్కొన్నది. చౌకబారుతనం తప్ప ఆర్థికంగా అసలు చైనాకు భారత్‌కే పోలికలేదు, ఇంక అదానీ ఎంత ! అదానీ సంపదను సృష్టించాడు.భారత పురోగమనంలో భాగస్వాములైన వారి మీద దాడి చేయకూడదని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ పేర్కొన్నారు.


మితవాద శక్తులలో సహనం ఇప్పటికే నశించి మైనారిటీల మీద తెగబడుతున్న తీరుతెన్నులు తెలిసిందే.చివరికి అది ఆర్‌ఎస్‌ఎస్‌ మీదకు కూడా మళ్లుతున్నది. నయా ఇండియా అనే పత్రికలో శంకర్‌ సహారా అనే రచయిత ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి రాసిన వ్యాసంలో హిందువుల ప్రయోజనాలను రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేయాల్సినంత చేయటం లేదంటూ ధ్వజమెత్తారు.” లాఠీలను పంచుతూ హిందువుల్లో ఉన్న వీరత్వాన్ని పొగిడే సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముస్లిం దురాక్రమణకు వ్యతిరేకంగా నేరుగా పోరాడాలంటూ సంఫ్‌ు పుట్టింది.పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉంది.వాస్తవానికి అంతకు ముందుకంటే మరింత దిగజారింది. ఇలా ఉండగా మూడోవంతు దేశంలో హిందువులు తగ్గారు.దేశాన్ని విభజించి రెండు హిందూ వ్యతిరేక దేశాలను ఏర్పాటు చేశారు. చివరికి మిగిలిన స్వదేశంలో కూడా హిందువులు చట్టపరంగా రెండవ తరగతి పౌరులుగా మారారు.విద్య,దేవాలయాలను వారి నుంచి లాగివేసుకున్నారు. ఇలాంటివి బ్రిటిష్‌ వారి ఏలుబడిలోనూ జరగలేదు.కానీ ఈ సమస్యల మీద పోరాటాలకు దూరంగా ఉండటమే కాదు సంఘపరివార్‌ నేతలు నోరు విప్పటం కూడా మానుకున్నారు.బాధ్యతల్లో ఉన్న సంఫ్‌ు నాయకులు, కార్యకర్తలూ వారి విధానాలు లేదా కార్యకలాపాలను అధికారికంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకోవటం లేదు. దానికి బదులు (ఉదాహరణకు గోల్వాల్కర్‌, సుదర్శన్‌,మధోక్‌, వాజ్‌పాయి) ఏ సర్‌ సంఫ్‌ు సంచాలక్‌ లేదా అగ్రనేతల ప్రకటనలు, కార్యాచరణలనైనా వారి వ్యక్తిగత ఆలోచన లేదా ఆచరణ అంటున్నారు తప్ప సంఫ్‌ుకు చెందినవిగా చెప్పటం లేదు, మరి అలాంటపుడు సంఫ్‌ు భావజాలం, పని ఏమిటి ?” అని శంకర్‌ సహారా ప్రశ్నించారు.


పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న దేశాల్లో దాన్ని కాపాడేందుకే న్యాయ,శాసన,కార్యనిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. వాటి మౌలిక స్వభావం అదే. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుంటాయి. అంత మాత్రాన దేశంలో ఉన్న వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులుగా పరిగణించనవసరం లేదు. చట్టబద్దమైన పాలన జరపాలి, నిబంధనల మేరకు వ్యాపార,పరిశ్రమలు నడపాలి, ఇలా ప్రతి విభాగానికి కొన్ని నిబంధనలను పెట్టుబడిదారీ విధానాల్లో కూడా పెట్టుకుంటారు. వాటిని ఉల్లంఘిస్తే కోర్టులు తప్పు పట్టినంత మాత్రాన అది మౌలికంగా వ్యవస్థను తిరస్కరించినట్లు కాజాలదు. అనేక మంది పెట్టుబడిదారులు పోటీ పడినపుడు అధికారంలో ఉన్న పాలకులు లేదా అధికారులు కొందరికి అనుకూలంగా ఉంటున్నకారణంగానే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు వాటిని బయట పెడతారంటే కొందరు నిజాయితీపరులైన వారు లేదా పోటీలో నష్టపోకపోయినా అవకాశం పొందని వారు అన్నది తెలిసిందే. అందువలన తాము బలపరుస్తున్నవారికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు లేదా ఆదేశాలు జారీ చేస్తే వాటిని మితవాద శక్తులు వ్యతిరేకించటం అంటే తామనుకున్నదాన్ని పొందలేకపోవటం తప్ప అవి కోర్టులకు పూర్తిగా వ్యతిరేకం అనో కోర్టులు పురోగామి వైఖరితో ఉంటాయనో అర్ధం కాదు.కోర్టుల మీద భ్రమలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు.


నయా ఇండియా పత్రికలో ఆర్‌ఎస్‌ఎస్‌పై శంకర్‌ సహారా మండిపాటు దాని మద్దతుదార్లలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని వెల్లడిస్తున్నది.జర్మనీ, అనేక దేశాల్లో హిట్లర్‌ మూకలు యూదుల పట్ల అనుసరించిన వైఖరిని మన దేశంలో ముస్లింలపట్ల ఇంకా పూర్తిగా ఎందుకు అనుసరించటం లేదన్న దుగ్గ సంఘపరివార్‌ శ్రేణుల్లో పెరుగుతున్నదని శంకర్‌ వాదనల తీరు వెల్లడిస్తున్నది. తమ అజెండాతో ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని తటపటాయిస్తున్నారు, మత విద్వేషాన్ని ఇంకా ఎక్కిస్తే తప్ప అమలు జరపటం సాధ్యం కాదని సంఘపరివార్‌ భావిస్తున్నది, అందుకే ఆ కార్యక్రమాన్ని మరింతగా వేగిరపరుస్తున్నది తప్ప వైదొలగలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపన : సుప్రీంకోర్టుకైనా నరేంద్రమోడీ చెబుతారా, కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ?

11 Saturday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, HINDENBURG, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, RSS, SEBI, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దేశం మొత్తాన్ని కుదిపివేసినా, ప్రపంచంలో మన కంపెనీల విశ్వసనీయత మీద అనుమానం తలెత్తినా, మదుపర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నా దేశ అత్యున్నత పార్లమెంటులో అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మోడీ తీరు తెన్నులను గమనించిన వారు నోరు విప్పుతారని ఏ ఒక్కరూ ఆశించలేదన్నది కూడా పచ్చినిజం. ఎవరి స్టైల్‌ వారిది, తగిన తరుణం వచ్చినపుడు ఎవరి పద్దతిలో వారు స్పందిస్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయని అపర ప్రజాస్వామికవాది ఇప్పుడు సుప్రీం కోర్టుకైనా ఏదైనా నివేదిస్తారా ? లేక దేశభద్రతకు సంబంధించిన అంశం కనుక కోర్టుకు చెప్పలేం అని ఠలాయిస్తారా ? లేదా విచారణ, సూచనల కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ? చూద్దాం !


శుక్రవారం నాడు సుప్రీం కోర్టు ముందు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీ అనే ఇద్దరు న్యాయవాదులు ఒక దావా వేశారు. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అమెరికా కేంద్రంగా ఉన్న హిండెన్‌బర్గ్‌ సంస్థ కుట్రలో భాగంగా విడుదల చేసిన పరిశోధన నివేదిక మదుపర్లకు భారీ నష్టం కలుగ చేసినందున సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విడి విడిగా కేసులు దాఖలు చేశారు.దీన్ని స్వీకరించిన కోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకుంటామని వివాదం తలెత్తిన నేపధ్యంలో నియంత్రణ విధానం, తీసుకున్న చర్యల గురించి ఆరోజుకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)ని ఆదేశించింది. ప్రభుత్వం, సెబీని సంప్రదించి భవిష్యత్‌లో ఇలాంటి ఉదంతం పునరావృతం కాకుండా నియంత్రణ వ్యవస్థలను ఎలా పటిష్ట పరచాల్సిందీ, క్రమబద్దీకరణ చట్టాలు, మార్కెట్ల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన మార్పులు అవసరమైతే దాని కోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుతో సహా ఒక నివేదికను అందచేయాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోరింది.కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఒక కమిటీని వేయవచ్చని కూడా చెప్పింది. తాము దీని గురించి ఏదైనా చెబితే మార్కెట్‌ ప్రవృత్తి, మదుపుదార్ల విశ్వాసం మీద ప్రభావం చూపవచ్చని కోర్టు పేర్కొన్నది. భారత మదుపుదార్ల ప్రయోజనాలను ఎలా కాపాడాలన్నదే నిజంగా తమ తాపత్రయమని కోర్టు పేర్కొన్నది. బంతి ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ చెప్పనవసరం లేదు.


జరిగిన పరిణామాలపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని,హిండెన్‌ బర్గ్‌ నివేదిక దేశ స్టాక్‌ ఎక్సేంజ్‌ను కుదిపివేయటమే కాదు, దేశంలోని వాణిజ్యవేత్తలను అనుసరిస్తున్న పద్దతులను కూడా ప్రశ్నార్ధకంగా మార్చిందని పిటీషనర్లు పేర్కొన్నారు.నియంత్రణలు లేకుండా ప్రభుత్వ రంగ బాంకులు రుణాలు ఇవ్వటం తీవ్ర ఆందోళనకరమైన అంశమని, బడా కార్పొరేట్లకు ఐదు వందల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే రుణాలపై పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని కూడా కోరారు. ఈ పిటీషన్‌ మీద విచారణ ఎలా జరుగుతుందో, ఏమి తేలుస్తారో చెప్పలేము గానీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకొనేందుకు వీలుగా సుప్రీం కోర్టు సూచించినట్లుగా ఒక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తే కథకంచికే. కోర్టు అందుకు అంగీకరిస్తే దాని నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు గానీ ఇది నరేంద్రమోడీ-అదానీ ప్రయోజనం కోసం దాఖలైన పిటీషన్‌ అనుకొనేందుకు అవకాశం ఉంది.


ప్రపంచంలో హిండెన్‌బర్గ్‌ వంటి షార్ట్‌ సెల్లర్స్‌, వారి లీలలు కొత్త కాదు. ఇలాంటి వారు ఉండటం మార్కెట్‌కే మంచిదని సమర్ధించేవారు ఉన్నారు. అదానీ కంపెనీల మీద ఇప్పుడు కాకుండా మరోఐదేండ్ల తరువాత గనుక ఇలాంటి నివేదిక వచ్చి ఉంటే ఇంకా పెద్ద ముప్పు వచ్చి ఉండేదని అనేక మంది అనుకుంటున్నట్లుగా మీరాయె ఎసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిఐఓ రాహుల్‌ చద్దాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది.” రానున్న 5-10 సంవత్సరాల్లో భారత్‌ గనుక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే మన కంపెనీలలో ఎక్కువ భాగం మరింతగా తనిఖీకి గురికావచ్చు. దీన్ని గతంలో చూశాము. కొంత మంది షార్ట్‌ సెల్లర్స్‌ చైనా కంపెనీల గురించి నివేదికలు రాశారు. కొన్ని నివేదికలు వాస్తవమే, కొన్ని సంచలనం కలిగించాయి.మార్కెట్‌ దాన్ని పెద్ద అంగలు వేయటంగా చూసింది. ఎక్కడైతే నివేదికలు వాస్తవమో అక్కడ స్టాక్స్‌ ప్రభావితం అయ్యాయి. అదానీ గ్రూపు విషయానికి వస్తే ఎక్కువ మంది మదుపుదార్లు ప్రైవేటు సంభాషణల్లోనే మాట్లాడుతున్నారు. ప్రముఖంగా ప్రస్తావించిన కొన్ని అంశాలను చూస్తే ఒక విధంగా చెడ్డలో మంచిగా చూస్తున్నారు. ఇప్పుడు గాకుండా ఐదేండ్ల తరువాత ఈ సమస్య తలెత్తివుంటే పెద్ద వ్యవస్థాపరమైన ముప్పుగా ఉండేది. దీన్నుంచి ప్రతివారూ పాఠం నేర్చుకున్నారని అనుకుంటున్నాను ” అని చద్దా చెప్పారు. ఇటీవల తాను ఐరోపా వెళ్లినపుడు ప్రతి చోటా మదుపర్లు తనను అదానీ ఉదంతం గురించి అడిగితే పైన చెప్పుకున్న అంశాలనే వివరించాల్సి వచ్చిందని, ఇంత జరిగాక తానైతే ఆచితూచి పెట్టుబడులు పెడతానని కూడా చెప్పారు.


సంస్థాగత మదుపర్ల ఆలోచన ఎలా ఉందో చూశాము. ఎంతసేపూ షార్ట్‌ సెల్లర్లు, వారి వెనుక ఉన్న కుట్ర సిద్దాంతాల చుట్టూ చర్చను తిప్పేందుకు చూస్తున్నారు.హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ కంపెనీ ఎఫ్‌పిఓ పేరుతో రు.20వేల కోట్లను సేకరించేందుకు వాటాలను జారీ చేసింది. చిన్న చిన్న మదుపుదార్లెవరూ ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా కొందరు రంగంలోకి దిగి వాటిని కొని అదానీ పరువు నిలిపేందుకు చూశారు. అలా ఎల్‌ఐసి కూడా మూడు వందల కోట్ల మేరకు దరఖాస్తు చేసిందని వార్తలు. వాటిని స్టాక్‌ఎక్సేంజ్‌లో పెడితే కొన్నవారంతా చేతులు కాల్చుకొనేవారే. కానీ అదానీ ఆ అమ్మకాలను రద్దు చేసి ఆదుకున్న తన మిత్రులను రక్షించారు. ఇదొక పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ జరపాలి.అస్థిరపరిస్థితి ఉన్నపుడు అదానీ కోసం ముందుకు వచ్చిన వారెవరు అన్నది బహిరంగం కావాల్సి ఉంది.


ఇక షార్ట్‌ సెల్లర్స్‌ అంటే ఎవరు అన్న ఆసక్తి చాలా మందిలో కలిగింది. అమరావతి ప్రాంత రైతులతో అగ్రిమెంటు చేసుకొని భూములు కొనుగోలు చేసి చేతులు కాల్చుకున్నవారి సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన రంగంలోకి తేవటంతో భూముల ధరలు ఢమాల్‌ అన్నాయి. దాంతో ఒప్పందాలు చేసుకున్న వారు రైతులకు పెద్ద మొత్తంలో ఇచ్చిన బయానా సొమ్మును వదులుకొని లావాదేవీలను రద్దు చేసుకున్నారు. అదే అదనుగా ధరలు తగ్గటంతో కొందరు చౌకగా కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్ల వద్ద కొందరు ఒక కంపెనీ వాటాలను అరువు తెచ్చుకుంటారు. వాటిని మార్కెట్‌లో ఉన్న ధరల కంటే కారుచౌకగా తెగనమ్ముతారు. దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ (తక్కువ ధరలకు అమ్మకం) అంటారు. దాంతో ఆ కంపెనీలో ఏదో గోల్‌మాల్‌ జరిగిందని ఇతరులు కూడా మరింత నష్టపోకుండా చూసుకుందామని అమ్మకాలకు పాల్పడతారు. వాటి విలువ పడిపోతుంది.ఆ ఒక్క కంపెనీ వాటాల ధరలే కాదు, స్టాక్‌ మార్కెట్లో ఇతర కంపెనీల ధరలూ పతనం కావచ్చు. దాన్ని ఆసరా చేసుకొని అదే షార్ట్‌ సెల్లర్స్‌ భారీగా అదే కంపెనీ లేదా ఇతర కంపెనీల వాటాలను తక్కువ ధరలకు కొని పెద్ద మొత్తంలో లాభాలు పొందిన ఉదంతాలతో పాటు చేతులు కాల్చుకున్నవారు లేకపోలేదు. స్టాక్‌ మార్కెట్లో ఇదొక ఖరీదైన జూదం. షార్ట్‌ సెల్లర్స్‌కు వాటాలను అరువుగా ఇచ్చిన బ్రోకర్లకు ఎలాంటి నష్టమూ ఉండదు.లేదూ కొంత మంది బ్రోకర్లే షార్ట్‌ సెల్లింగ్‌కూ పాల్పడి జూదమాడవచ్చు.ఈ షార్ట్‌ సెల్లర్స్‌ ఎలాంటి వారంటే ప్రధాన పట్టణాల బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కొంత మంది ఆటో, టాక్సీ వాలాలు వచ్చిన వారిని ఎక్కించుకొని కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా పగలంతా పడిగాపులు పడి ఎవరైనా అమాయకులు దొరికితే దోచుకొనే ఒక సినిమాలో నిక్కర్‌ నారాయణ పాత్రను గుర్తుకు తెస్తారు.


ఇలాంటి జూదాన్ని స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ సంస్థలు నిషేధించవచ్చుకదా అని కొందరు అడగవచ్చు.ప్రపంచంలో చైనాతో సహా ఎక్కడా స్టాక్‌మార్కెట్లలో అలా జరగలేదు.అనుమతిస్తూనే ఉన్నారు. భారీ ఎత్తున అమ్మకాలకు దిగినపుడు స్టాక్‌ ధరలు పతనమైతే ఒక పరిమితి దగ్గర కొద్దిసేపు అమ్మకాలను నిలిపివేస్తారు. అది భారీ ఎత్తున నిర్ణీత పరిమితికి మించి పెరుగుతున్నపుడు కూడా అదే పని చేస్తారు. పూర్తిగా నిషేధించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరిగినపుడు లేని నిషేధాలు పతనమైనపుడు ఎలా పెడతారు? గతంలో కేతన్‌ పరేఖ్‌ అనే నేరస్తుడు ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణం జరిగింది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. వైస్‌ జగన్‌మోహనరెడ్డి సాక్షి పత్రిక, టీవీ కంపెనీలో పది రూపాయల విలువగల వాటాలను వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారిని మీరెందుకు అలా కొన్నారని ప్రశ్నిస్తే మేం వ్యాపారులం, లాభాలు వస్తాయనే అంచనాతో కొన్నాం, ఒక వేళ రాలేదనుకోండి నష్టపోయేది మేమే కదా మాకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకు అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాని వెనుక ఆసలు కథ ఏమంటే అదే వ్యాపారులు రాజశేఖరరెడ్డి సర్కార్‌ నుంచి భారీ మొత్తంలో లబ్ది పొందారని దానికి బల్లకింద గాక బల్లమీదనే బహిరంగంగా చట్టపరంగానే అలా ప్రతిఫలం చెల్లించారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. వాటి మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి.దీన్నే నీకది నాకిది అంటారు. హిండెన్‌బర్గ్‌ ఉదంతంపై సోమవారం నాడు లేదా తరువాత సుప్రీం కోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.


షార్ట్‌ సెల్లర్లు ఒక్క అదానీ కంపెనీ మీదనే తొలిసారిగా కుట్ర చేసినట్లు, దాన్ని దేశం మీదనే జరిగిన దాడిగా, దానివెనుక చైనా ఉన్నదని ఆరోపిస్తూ కుహనా జాతీయభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.హిండెన్‌బర్గ్‌ కంపెనీ ఉంది అమెరికాలో, దానికి నిజంగా చైనా మద్దతు ఇస్తే అమెరికా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? చైనా బెలూన్ను కూల్చివేసి అమెరికాను రక్షించినట్లు చెబుతున్న ప్రభుత్వం హిండెన్‌బర్గ్‌ మీద విచారణకు ఆదేశించి చైనా పాత్రను వెల్లడించేందుకు,తన మిత్రదేశంగా భావిస్తున్న భారత్‌ను, అదానీని బహిరంగంగా సమర్ధించలేక విమర్శించలేక ఎక్కాతిక్కా స్థితిలో ఉన్న జిగినీ దోస్తు నరేంద్రమోడీని రక్షించేందుకు జో బైడెన్‌ ఎందుకు పూనుకోలేదు ? 2021లో చైనా ప్రభుత్వం తమ టెక్నాలజీ సంస్థలపై చర్య తీసుకున్నపుడు షార్ట్‌ సెల్లర్స్‌ భారీ ఎత్తున లబ్ది పొందారు. ఆ ఏడాది ఒక్క జూలై నెలలోనే ఎనిమిది బిలియన్‌ డాలర్లు పోగేసుకున్నారు. అలాంటి సొమ్ముతో ఎంచుకున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేసి షార్ట్‌ సెల్లింగ్‌కు పాల్పడి లబ్దిపొందేందుకు చూశారు. ఇది నిరంతర ప్రక్రియ. అలీబాబా కంపెనీల షేర్లను మార్కెట్‌ కంటే పదమూడుశాతం తక్కువకు అమ్మి పతనం కాగానే అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసి లాభాలు పొందారు. అలాంటి వారికి ఒక దేశం, ఒక కంపెనీ, దేశభక్తి లాంటివేమీ ఉండవు.అప్పుడు అలీబాబా కంపెనీ కూడా అదానీ మాదిరే కొత్త షేర్లను అమ్మచూపితే ప్రభుత్వం అడ్డుకున్నది. ఇక్కడ నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి పని చేయకున్నా అదానీ తోక ముడిచిన సంగతి తెలిసిందే.2021 జూలైలోనే చైనాలోని ఆన్‌లైన్‌ సరకుల విక్రయ కంపెనీ పిండూడూ కూడా షార్ట్‌ సెల్లర్ల దాడికి గురైంది.వారు పెద్ద మొత్తంలో లబ్ది పొందారు. అప్పుడు చైనా ప్రభుత్వం లేదా పాలకపార్టీ దాన్ని తమ దేశం మీద దాడిగానో దాని వెనుక భారత్‌ లేదా అమెరికా ఉందనో ఆరోపించలేదు. టెక్నాలజీ కంపెనీలపై చైనా సర్కారు తీసుకున్న చర్యలు కొనసాగింపుగా తదుపరి గేమింగ్‌ కంపెనీలపై ఉంటాయని పుకార్లు పుట్టించి షార్ట్‌ సెల్లర్లు లబ్ది పొందారు. ఇలా ప్రతిదేశంలో అచిరకాలంలోనే తారా జువ్వలా ఎదిగిన కంపెనీలన్నింటినీ షార్ట్‌ సెల్లర్లు ఎంచుకొని లబ్ది పొందుతున్నారు. ప్రభుత్వ మద్దతుతో అదానీ వంటి వారు, పాలకుల పక్కన చేరి లెక్కలను తిమ్మినిబమ్మిని చేసిన సత్యం కంప్యూటర్స్‌ మాదిరి కంపెనీలకు లేని విలువను సృష్టించి జనం నెత్తిన చేతులు పెట్టదలచుకుంటే ఇలాంటి షార్ట్‌ సెల్లర్స్‌ అలాంటి కంపెనీల మీద కన్నేసి దెబ్బతీసి లబ్ది పొందుతారు. దివాలా తీసేది అమాయకపు మదుపుదార్లు మాత్రమే. మహా అయితే అదానీ వంటి వారు 2014లో ఎక్కడ ఉన్నారో తిరిగి అక్కడకు పోతారు, వారికి వచ్చే నష్టం ఉండదు. అంతే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మత తటస్థ దేశంలో విద్వేష వాతావరణం ఉందన్న సుప్రీం కోర్టునూ తప్పు పడతారా !

22 Saturday Oct 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, cbi, Hate crime, Hate-Speech, Narendra Modi, Narendra Modi Failures, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


కుటుంబంలో లోపాలు ఉంటే సర్దుకుపోవాలి, ఎవరైనా పరువును బజారుకు ఈడుస్తారా ? అలాగే దేశం గురించి వేలెత్తి చూపే విధంగా విదేశాలకు అవకాశమిచ్చే రీతిలో ప్రవర్తించవచ్చా ! నిజమే, ఎవరు ఏ సందర్భంలో ఎందుకు చెప్పినా ఎప్పుడైనా ఆలోచించాల్సిన అంశమే. ఈ సుభాషితం ముందుగా ఎవరికి వర్తింప చేయాలి ? ఎవరు పాటించాలి ? భారతీయులందరూ ఆలోచించాల్సిన అంశం. తమ మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ముస్లింలు విమర్శిస్తుండగా, ఈ మతం వారు తమ మతం మీద జీహాద్‌ ప్రకటించారని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని హిందూమత పెద్దలుగా చెప్పుకొనే వారు ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద భారత్‌ అంటే మధ్య యుగాల నాటి మతవిద్వేష భూమిగా ప్రపంచం భావించేట్లు చేస్తున్నారనే భావం రోజు రోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో లేదా స్వదేశంలో విమర్శలకు అవకాశం కల్పిస్తున్నదెవరు ? ఏం చెబుతున్నారు ? ఆచరణలో ఏం చేస్తున్నారు ?


ఇటువంటి స్థితిలో 2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. దాఖలైన ఒక కేసు ఏమౌతుంది అన్నది పక్కన పెడితే కోర్టు చేసిన పరిశీలన ఎంతో కీలకమైనది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాల ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాల గురించి జర్నలిస్టు షాహిన్‌ అబ్దుల్లా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


సుప్రీం కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ జనావళిని, విశ్లేషకులను ఆకర్షించకుండా ఉంటాయా ? మన పత్రికలను చదవరా,టీవీలను చూడరా ? ఇప్పటికే విద్వేష ప్రసంగాలు మన దేశానికి పెద్ద మరకను అంటించాయి. దీనికి కారకులు ఎవరు అంటే మెజారిటీ, మైనారిటీ మతాలకు చెందిన ఓటు బాంకు పార్టీలు, నేతలు, కుట్రదారులు, ఉన్మాదులు, వారి ప్రభావానికి లోనై తప్పుదారి పట్టినవారు తప్ప సామాన్యులు కాదు. విద్వేష వాతావరణం ఏర్పడటానికి ఎవరిది ఎంత భాగం అంటే జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంటే అంత అన్నది స్పష్టం. ఫిర్యాదును చూస్తుంటే దేశంలో విద్వేష వాతావరణం వ్యాపించినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొన్నది. పిటీషనర్‌ తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ విద్వేష ప్రసంగాల గురించి ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు కేసులున్నాయని, నిరోధ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అక్టోబరు తొమ్మిదిన ఢిల్లీలో జరిగిన ఒక సభలో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టినందున కోర్టును ఆశ్రయించినట్లు సిబల్‌ చెప్పారు. ఢిల్లీలో ముస్లింలు చేసినట్లుగా చెబుతున్న ఒక హత్య గురించి విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన జన అక్రోశ్‌ నిరసన సభలో బిజెపి ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ప్రసంగిస్తూ పేరు ప్రస్తావించకుండానే ముస్లింలను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపు ఇచ్చినట్లు దరఖాస్తుదారు పేర్కొన్నారు. పిటీషన్‌పై వాదన ప్రతివాదనల సందర్భంగా అలాంటి పిలుపులు హిందువులకు వ్యతిరేకంగా కూడా ఇస్తున్నారని, ఉభయపక్షాలు అందుకు పాల్పడుతున్నట్లు కోర్టు పేర్కొన్నది. ముస్లింలు కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు కదా అని పేర్కొన్నది.దాని మీద సిబల్‌ స్పందిస్తూ వారిని మినహాయించాలని అనుకుంటున్నారా ? ఎవరు అలాంటి విద్వేష ప్రసంగాలు చేసినా సహించకూడదు అని చెప్పారు. ఒక సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఒక తరహా ప్రకటనను నొక్కి వక్కాణించాలని తాము చూడటం లేదని, తమకు ఆ సంగతి తెలుసునని కోర్టు పేర్కొన్నది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఢిల్లీలో ఆమ్‌ అద్మీ పాలన ఉన్నా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విద్వేష ప్రసంగాలు జనాభా దామాషా ప్రకారం చూసినా హిందూ ఉన్మాదులు చేస్తున్నవే ఎక్కువ. ఎవరూ ఫిర్యాదులు చేయకున్నా పోలీసులు తమకు తామే కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత కోర్టు చెప్పిందంటే మన దేశంలో ఉన్న పరిస్థితి గురించి వేరొకరెవరో వేలెత్తి చూపాల్సిన అవసరం ఉందా ? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాలకు ఇలాంటి ఆదేశాలు ఎన్నడైనా జారీ చేసిన ఉదంతం ఉందా ? ఎవరు సమాధానం చెబుతారు ! ఇలాంటి పరిస్థితి రావటం మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని అభిశంసించటమే.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. అలాంటి ప్రభుత్వం గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. పదకొండు మంది దోషులు పెరోలు, శిక్ష పడక ముందే జైల్లో ఉన్నారనే పేరుతో సంవత్సరాల తరబడి వెలుపలే ఉన్నారు. గడువు తీరిన తరువాత జైలుకు వచ్చినా ఇదేమిటని అడిగిన వారు లేరు. కారణం వారంతా బిజెపికి చెందిన వారు, అక్కడున్నది వారి ప్రభుత్వమే గనుక. వారిలో ఒకడు పెరోలు మీద వచ్చి ఒక మహిళ మర్యాదకు భంగం కలిగించాడంటూ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అతడిని విడుదల చేయ కూడదని పోలీసుల డైరీలో రాసినా ఖాతరు చేయకుండా విడుదల చేశారు. మరొకరిని విడుదల చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని బిల్కిస్‌ కుటుంబాన్ని అడగ్గా కూడదని చెప్పినప్పటికీ విడుదల చేశారు, ఇతరుల గురించి అసలు అలా అడగనూ అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విడుదలకు మెరుపువేగంతో కదిలింది. గుజరాత్‌ సర్కార్‌ 2022 జూన్‌ 28న కేంద్రానికి లేఖరాస్తే జూలై 11న అనుమతి మంజూరైంది. ఏ కారణంతో విడుదలకు కేంద్రం అనుమతించిందో గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించలేదు. సిపిఎం నాయకురాలు సుభాషిణీ ఆలీ నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాహిత కేసును దాఖలు చేశారు. ఆమెకు ఈకేసుతో ఎలాంటి సంబంధమూ లేదని మూడవ పక్షపు కేసును స్వీకరించకూడదని గుజరాత్‌ ప్రభుత్వం వాదించింది.నవంబరు 29న కేసు విచారణకు రానుంది.


చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. అనేక చోట్ల ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖైదీలను విడుదల చేశారు. ఈ నేరగాండ్లకు దానితో నిమిత్తం లేకుండా అదే రోజున వదిలారు. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ, సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని సిబిఐ కోర్టు జడ్జి పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పాలకులు, వాతావరణం ఉన్నపుడు ఎవరో బదనాం చేసేందుకు చూస్తున్నారని గగ్గోలు పెట్టటం అంటే దొంగే దొంగని అరవటం తప్ప వేరు కాదు. విదేశాల్లో స్పందిస్తే జాతి దురహంకారం అని, దేశీయంగా స్పందించిన వారిని దేశద్రోహులు మరొకపేరుతో నిందిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉచితాలు – అనుచితాల చర్చ : కార్పొరేట్లకు కట్టబెడుతున్నది ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !

31 Wednesday Aug 2022

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ 2 Comments

Tags

BJP, Freebies, Narendra Modi Failures, subsidies, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


ఎన్నికల తరుణంలో ఓటర్లకు ఉచితాలను అందిస్తామని వాగ్దానాలు చేయకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శక సూత్రాలను జారీ చేయాలని బిజెపి నేత, లాయర్‌ అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల ప్రణాళికల్లో చేసే వాగ్దానాలను అక్రమాలుగా పరిగణించలేమని 2013లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తాజా పిటీషన్‌, దాన్ని సవాలు చేస్తూ మరికొందరు కక్షిదారులుగా చేరటంతో వాటిని సమీక్షించేందుకు ముగ్గురు జడ్జీలతో సుప్రీం కోర్టు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఉచితాల వలన మన దేశం కూడా శ్రీలంక మాదిరి అవుతుందంటూ అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు. నిజమే, శ్రీలంక మాదిరి ఏ దేశమూ మారకూడదు. వారు చెప్పనిదీ, శ్రీలంక అసలు కారణం ఏమంటే ధనికులు, కార్పొరేట్లకు పన్నులు తగ్గించటం.దివాలా కారణంగానే ఎరువులను దిగుమతి చేసుకోలేక ఆ బలహీనతను దాచి పెట్టి సేంద్రియ సాగుపేరుతో చేసిన పిచ్చి పనికి ఆ రంగం కూడా దెబ్బతిన్నది.


గతంలో కాంగ్రెస్‌ పాలకులు అనుసరించిన, వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బిజెపి నేత నరేంద్రమోడీ విధానాలు ఇలాగే కొనసాగితే మన దేశం కూడా శ్రీలంకగా మారేందుకు రోజులు దగ్గరపడుతున్నాయని గ్రహించటం అవసరం. బడ్జెట్‌ అంటే దేశంలో వచ్చే రాబడి, సంపదలను అందరికీ సమంగా పంచటం, కొత్త రాబడిని సృష్టించేందుకు పెట్టుబడులు పెట్టటం.నిజంగా అలా జరుగుతోందా ? జరిగితే జనాలకు ఉచితాలతో పని లేదు, ఎవరూ దేహీ అంటూ చేతులు చాచరు. రైతులు సాగును వదలి సంవత్సరాల తరబడి నిరవధిక ధర్నా చేయనవసరం లేదు. విధాన పరంగా కాంగ్రెస్‌-బిజెపి దొందూ దొందే, బిజెపి దేశానికి ఇస్తున్న బోనస్‌ ఏమిటంటే మతోన్మాదాన్ని రేకెత్తించటం. అసలు పేదలకు ఉచితాలను అందిస్తే , నగదు బదిలీ చేస్తే దేశ ఖజానా దివాలా తీస్తుందా, పన్ను చెల్లింపుదార్ల సొమ్ము వృధా అవుతుందా ? కాస్త ఆలోచిద్దాం. పేదలకు నేరుగా ఇచ్చే సొమ్మును వారు మార్కెట్లో ఏదో ఒక వస్తువు లేదా సేవ కొనుగోలుకు వెచ్చిస్తారు సమాజానికి తోడ్పడతారు తప్ప కార్పొరేట్ల మాదిరి పన్ను స్వర్గాల్లో, విదేశాల్లో సంపదలను కూడబెట్టుకోరు.


ఉచితాలతో దేశం కుదేలవుతుందని చెబుతున్న అశ్వనీ ఉపాధ్యాయ(47) పుట్టక ముందే దేశంలో మూడు సార్లు 1957-58, 1965-66, 1972-73 ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం వచ్చింది. తరువాత 1991లో వచ్చింది. అప్పుడేమీ ఉచితాలు లేకున్నా ఇలా ఎందుకు జరిగిందో కొంత మంది తెలిసి కూడా చెప్పరు. మరికొందరు తెలివిగలవారు వారికంటే ఘనులు. చరిత్ర చాట భారతం, సిద్దాంతాలు రాద్దాంతాలు వినే ఓపిక ఎవరికి ఉంది చెప్పొద్దు అంటారు. మొత్తం మీద గతాన్ని గురించి ప్రస్తావించకూడదు.దీన్ని అంగీకరించాలా? రోజూ చర్చలో ఉన్న ఉచితాలు-అనుచితాలు, సంస్కరణలు, నూతన విధానాలు గతంతో నిమిత్తం లేకుండా ఆకాశం నుంచి ఊడిపడితే ఓకే వాటి గతాన్ని చర్చించనవసరం లేదు. అలాకాదే మరి !


దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా ? పార్లమెంటులో 2017జూలై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004-05 కస్టమ్స్‌, ఎక్సైజ్‌, కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95వేల కోట్ల రూపాయలు. తరువాత అది ఏటేటా పెరుగుతూ నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014-15లో ఐదు లక్షల 54వేల కోట్లకు చేరింది. వీటిలో రాష్ట్రాలు ఇచ్చిన భూమి, విద్యుత్‌, అమ్మకపు పన్ను, ఇతర రాయితీలు లేవు. అవి కూడా వేలు, లక్షల కోట్లలోనే ఉంటాయి. అంటే ఇంతేసి మొత్తాలను ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం అప్పనంగా కార్పొరేట్లకు అప్పగించింది. లేనట్లైతే ఆ మొత్తం ఖజానాకు చేరి జనాల సంక్షేమానికి లేదా పెట్టుబడుల ద్వారా దేశ సంపదల వృద్ధికి తోడ్పడేది కదా ? మరి ఈ ఉచితాలు-అనుచితాల గురించి వాటిని తమ జేబులోని సొమ్ము మాదిరి ఇచ్చిన ప్రభుత్వాల గురించి ఎవరూ ప్రశ్నించలేదే ! తమ ప్రభుత్వం వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఇస్తున్న ప్రోత్సాహం అని గొప్పలు చెప్పుకొనేందుకు, ఇంతేసి మొత్తాలను ఇస్తున్నాం రండహౌ అని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ పత్రాల్లో వీటి గురించి కోల్పోయిన రాబడి శీర్షికతో పేజీలకు పేజీలు కేటాయించింది.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత సరికొత్త పద్దతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు.2014-15లో కస్టమ్స్‌, ఎక్సైజ్‌ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రు.4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రు.1,48,442 కోట్లుగా పేర్కొన్నారు. దీని అర్ధం ఖజానాకు మోడీ గారు రు.2,87,314 కోట్లు మిగిల్చినట్లా ? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 2014-15లో ఎక్సైజ్‌ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రు.99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రు.1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020-21నాటికి రు.3,72,970 కోట్లకు చేర్చారు. మరుసటి ఏడాది కొంత మేరకు తగ్గించటంతో రు.3,63,365కు తగ్గింది. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గాస్‌ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు.అశ్వనీ ఉపాధ్యాయ వంటి వారు వీటిని గురించి ఎందుకు పట్టించుకోలేదు ? అసలు జరిగిందేమిటి ?


ఉచితాలు, సంక్షేమ పధకాలను వ్యతిరేకిస్తున్నవారు గానీ సమర్ధిస్తున్నవారు గానీ ఇవెందుకు ఉనికిలోకి వచ్చిందీ తెలుసుకోవాలి.దేశంలో 1991లో ఎగువున ఉన్న పదిశాతం మంది జనాభాకు దేశ రాబడిలో 35శాతం ఉండగా అది 2014నాటికి 57శాతానికి పెరిగింది. సంస్కరణల పేరుతో కాంగ్రెస్‌ ఏలినా, ఆరేండ్లు బిజెపి వాజ్‌పాయి అధికారంలో ఉన్నా జరిగింది ఇది. కొందరికి సంపద పెరిగితే ఏడుపు ఎందుకు, సంపాదించటం చేతకాక అంటారు కొందరు ? నిజమే ఏడవాల్సిన పనిలేదు. దేశ జనాభాలో 50శాతం మందికి ఇదే కాలంలో వస్తున్న రాబడి 20.1 నుంచి 13.1శాతానికి దిగజారింది. మరి దీనికి వారి ఖర్మ అనుకోవాలా ? చేతకాని అసమర్ధులని భావించాలా ? 2022 ప్రపంచ అసమానతల సూచిక ప్రకారం మన దేశంలోని ఎగువ ఒకశాతం చేతిలో 22శాతం సంపద చేరింది. దేశంలో మైనారిటీ తీరిన వారి సగటు సంపాదన ఏడాదికి రు.2,04,200 కాగా దిగువ 50శాతం మంది సగటు రాబడి రు.53,610, ఇక ఎగువ పదిశాతం మందికి రు.11,66,520 ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొన్నది. తొలిసారిగా మన దేశంలో అసమానత నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పిఎల్‌ఎఫ్‌ఎస్‌) 2019-20 ప్రకారం ఎగువన ఉన్న పదిశాతం మంది కార్మికుల్లో నెలకు ఇరవై ఐదువేలు సంపాదించేవారు ఉన్నారు. వారిలో కూడా ఎగువన ఉన్న ఒక శాతం రాబడి మొత్తంలో 6-7శాతం కాగా, పదిశాతం మంది మూడోవంతు పొందుతున్నారు. మరి దేశంలో కష్టపడనిది ఎవరు ? అందరికీ ఎందుకు పెరగలేదు ? పేదల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది కనుక వారిలో అసంతృప్తి ప్రబలితే తమకు మొదటికే మోసం వస్తుందేమోనని ఉపశమన పరిచేందుకు తెచ్చినవే ఉచితాలు, సంక్షేమ పధకాలు. అధికారం కోసం ఒక పార్టీ కంటే మరొక పార్టీ ఎక్కువ ఇస్తానని చెప్పి ఓట్లను కొల్లగొట్టవచ్చు తప్ప సంక్షేమ పధకాలను ఎత్తివేసే పరిస్థితి లేదు.


ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అమెరికా.అక్కడ కూడా దారిద్య్రంలో లేదా అల్పాదాయం ఉన్న కుటుంబాలు ఫుడ్‌స్టాంప్స్‌ పేరుతో ప్రతి నెలా అర్హతలను బట్టి ప్రతినెలా 250 నుంచి 1,316 వరకు డాలర్ల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది.దీన్నే రూపాయల్లో చెప్పాలంటే ఇరవై వేల నుంచి లక్షా ఐదువేల వరకు ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఈ కార్యక్రమం 1939లో మొదలు పెట్టి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అక్కడ 2020లో 33 కోట్ల మంది జనాభా ఉంటే పేదరికంలో ఉన్న వారు.3.72 కోట్లని అధికారికంగానే చెప్పారు. వారందరూ ఫుడ్‌స్టాంప్స్‌కు అర్హులే. మన దగ్గర చౌక దుకాణాల్లో సబ్సిడీ బియ్యం ఇస్తారు, అక్కడ కూపన్లతో ఆహారానికి సంబంధించిన జాబితాలోని వస్తువులను కొనుక్కోవాల్సి ఉంటుంది.కొన కూడని వస్తువుల జాబితా కూడా ఉంటుంది కనుక దుకాణదారు వాటిని విక్రయిస్తే ఆ కూపన్లు వాటికి చెల్లవు. అమెరికాలో పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోయారు, దేన్నీ ఉచితంగా ఇవ్వకూడదని చెప్పే అమెరికా పేదలకు డాలర్లు ఎందుకు ఇస్తున్నట్లు ? వాటిని ఉచితాలుగా పరిగణించాలా అమెరికా పాలకుల అసమర్ధతకు చెల్లిస్తున్న పరిహారంగా చూడాలా ? మన దేశంలో ఉపాధిహమీ పధకం కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకం వలన తమ పొలాల్లో పని చేసేందుకు కూలీలను దొరక్కుండా చేస్తున్నారని, సబ్సిడీ బియ్యాన్ని అమ్ముకుంటున్నారంటూ ఏడ్చేవారు ఆ పధకాలను అనుచితమైనవిగానే వర్ణిస్తారు.


జనంలో అసంతృప్తి తలెత్తుతున్నపుడు అధికారం కోసం అర్రులు చాచేవారు ఇతరులను విమర్శిస్తూనే తమ అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు అనివార్యంగా సబ్సిడీ, సంక్షేమ పధకాలను అనుసరిస్తారనేందుకు తాజా నిదర్శనం ప్రధాని నరేంద్రమోడీ. సరిగ్గా 2019లోక్‌ సభ ఎన్నికలకు ముందు 2018 డిసెంబరు నుంచి కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించి మూడు విడతలుగా పదకొండు కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరువేలు నేరుగా బాంకుల్లో వేస్తున్నారు. ఇప్పటికి పదకొండు విడతలు అందించారు.ధరల పెరుగుదలకు దారి తీసిన కారణాల్లో ప్రధానమైనదిగా చమురుపై సెస్‌ల పెంపుదల ఒకటి.జనానికి ఉపశమనం కలిగించటం కంటే అదెక్కడ తన ఓటు బాంకుకు గండికొడుతుందో అన్న భయంతో ఎలాంటి ఆందోళనలు తలెత్తక ముందే సెస్‌లను కొంత మేరకు తగ్గించటంతో పాటు తమ పాలిత రాష్ట్రాల్లో వాట్‌ను కొంత మేరకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం చేసిన త్యాగం అని పేరు పెట్టారు. అంతర్జాతీయ ధరలను బట్టి ప్రతి రోజు చమురు ధరల తగ్గింపు లేదా పెంపు అన్నది ఒక విధానంగా చెప్పారు. ఏప్రిల్‌ ఆరు నుంచి వాటి ధరలను స్థంభింప చేశారు. సదరు విధానం నుంచి వైదొలిగినట్లా లేక మరొకటా ? ఉచిత విద్యుత్‌, రైతాంగ రుణాల రద్దు, వివిధ సంక్షేమ కార్యక్రమాలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తాలు కూడా త్యాగాల కిందకు రావా? అవి ఏటేటా పెరుగుతుంటే ఎంతకాలం భరించాలని కొందరు అంటున్నారు. అందుకే విధానాల గురించి చర్చ జరగాలి, కొన్ని రాష్ట్రాలు ఎందుకు అమలు జరుపుతున్నాయి, కొన్ని ఎందుకు అమలు జరపటం లేదు ?


విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఉచితాల గురించి హితవు చెప్పారు.అలాంటి వాటిని పెంపొందించే ధోరణికి అడ్డుకట్ట వేస్తూ ప్రతిన పూనాలని అన్నారు. ఉచితాలు దేశ హితం కోసం కాదు, దేశాన్ని వెనక్కు నెడతాయి. రాజకీయాల్లో స్వార్ధం ఉంటే ఎవరైనా వచ్చి పెట్రోలు, డీజిలు ఉచితంగా ఇస్తామని చెబుతారు. ఇలాంటి స్వార్ధం వలన నిజాయితీగా పన్ను చెల్లించేవారి మీద భారం పడుతుంది. ఇది విధానం కాదు, అనైతికం అంటూ మాట్లాడారు. ఇదే మోడీ గారు తన ఏలుబడిలో చేస్తున్నదేమిటి ? ప్రోత్సాహకాలు, పన్ను ఎక్కువగా ఉంటే ఎగవేత ఎక్కువగా ఉంటుందంటూ కార్పొరేట్లకు పన్ను తగ్గించి ఏటా కొన్నిలక్షల కోట్ల రూపాయలను కట్టబెడుతున్నారు. ఇది ఉచితమా అనుచితమా ? జనానికి రావాల్సిందాన్ని ధనికులకు మళ్లించటమా ? 2014-21 సంవత్సరాలలో కార్పొరేట్‌ పన్ను 30 నుంచి 18శాతానికి తగ్గించారు. పోనీ దీన్ని సదరు కంపెనీలు తిరిగి పెట్టుబడులుగా పెట్టాయా ? అలాంటి దాఖలాల్లేవు. పెట్టి ఉంటే దేశ వృద్ది రేటు 8 నుంచి కరోనా ముందు నాలుగు శాతానికి ఎందుకు దిగజారినట్లు ? కొత్తగా ప్రవేశపెట్టిన పధకం ప్రకారం కొత్తగా పెట్టే సంస్థలకు కార్పొరేట్‌ పన్ను 15శాతానికి పరిమితం చేశారు. ఎవడబ్బ సొమ్మునీ రామచంద్రా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గుజరాత్‌ హిందూత్వ రేపిస్ట్‌ ఫైల్స్‌ – నేరగాళ్లు సంస్కార బ్రాహ్మలన్న బిజెపి !

26 Friday Aug 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Gujarat, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ 1 Comment

Tags

Bilkis Bano gangrape, BJP, CPI()M, Gujarat hindutva rapist files, Kushboo Sunder, Narendra Modi Failures, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


ఆ పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావటంతో కోర్టు జీవితకాల శిక్ష విధించింది. బేటీ పఢావో-బేటీ బచావో అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ స్వంత రాష్ట్రం, మోడీ కనుసన్నలలో నడిచే గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం సత్పవర్తనపేరుతో స్వాతంత్య్రదినోత్సవం రోజున స్వేచ్చ నిచ్చి వారిని సభ్య సమాజంలోకి వదిలింది. అదే రోజు నరేంద్రమోడీ మహిళా సాధికారత గురించి కూడా ఎర్రకోట మీద నుంచి ఆజాదీ కా అమృత మహౌత్సవ ప్రవచనాలు పలకటం కొసమెరుపు. ఖైదీల విడుదలకు ఏకగ్రీవ సిఫార్సు చేసిన పదిమంది కమిటీలో ఇద్దరు బిజెపి మహిళలు కూడా ఉన్నారు. జైలు నుంచి వెలుపలికి రాగానే నేరస్తులకు పూలదండలు వేసి, మిఠాయిలు పంచి ఘనమైన స్వాగతం పలికారు. కొందరు మహిళలైతే వారికి వీర తిలకాలు దిద్దారు. విశ్వగురువుల ఏలుబడిలో మనపుణ్య భారత దేశం ఎలా మారుతోందో కదా ! ఆహా మేకిన్‌ ఇండియాలో ఎలాంటి సరకు తయారవుతోంది !


ఇదంతా గోద్రా బిజెపి ఎంఎల్‌ఏ సికె రావుల్జీ సమక్షంలో జరిగినట్లు వార్తలు. అంతే కాదు ” వారు బ్రాహ్మలు, బ్రాహ్మలకు మంచి సంస్కారం (విలువలు) ఉంటుందని తెలిసిందే. కొంత మంది దుష్ట వాంఛ ప్రకారం వారిని శిక్షించాలని వారి మీద నేరాన్ని నెట్టి ఉండవచ్చు ” అని కూడా సదరు గౌరవనీయ ఎంఎల్‌ఏ సెలవిచ్చారు. దీని మీద దేశమంతటా తీవ్ర అభ్యంతరాలు, నిరసన వెలువడినా ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా అతన్ని కనీసం మందలించిన వారు కూడా లేరు. ఇదంతా ఒక ఎత్తయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే వారిని విడుదల చేశారంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అసెంబ్లీలో చెప్పారు.
2002లో జరిగిన గోద్రా మారణకాండలో భాగంగా జరిగిన దుండగాల్లో బిల్కిస్‌ బానుపై సామూహిక అత్యాచారం, మూడు సంవత్సరాల కుమార్తెతో సహా 14 మంది కుటుంబ సభ్యుల హత్యకేసులో ముంబై సిబిఐ కోర్టు 2008 జనవరి 21న నిందితులకు శిక్ష విధించింది. దాన్ని హైకోర్టుకూడా నిర్ధారించింది. ఈ కేసులో ఏడుగురు బిల్కిస్‌ బాను కుటుంబ సభ్యులను హతమార్చారు. మరో ఏడుగురు బంధువులను కూడా చంపారని బిల్కిస్‌ చెబుతుండగా వారు కనిపించటం లేదని పోలీసులు చెప్పారు. వారి ఆచూకీ ఇంతవరకు లేదు.దారుణం జరిగినపుడు 21 ఏండ్ల బిల్కిస్‌ ఐదు నెలల గర్భవతిగా ఉంది. తమ శిక్షను తగ్గించాలని నేరస్తులు దాఖలు చేసిన పిటీషన్ను విచారించిన సుప్రీం కోర్టు సదరు వినతిని పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వానికి సూచింది. దాన్ని అవకాశంగా తీసుకొని విడుదల చేశారు.


అత్యాచార నేరగాండ్లను విడుదల చేయాలని తాము ఆదేశించలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణ గురువారం నాడు చెప్పారు. నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై స్పందిస్తూ ” నిర్దేశిత విధానం ప్రకారం శిక్షను తగ్గించే వినతిని పరిశీలించండి అని మాత్రమే కోర్టు చెప్పింది.దాని మీద బుర్రను ఉపయోగించారా లేదా అన్నదాన్ని చూడాల్సి ఉంది. విధానం ప్రకారం అనేక మందికి ప్రతి రోజు శిక్షలు తగ్గిస్తున్నారు. ” అన్నారు. రెండు వారాల తరువాత తదుపరి విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ ప్రభుత్వం, పదకొండు మంది నేరస్తులను కక్షిదారులుగా చేస్తూ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.
బిల్కిస్‌ బాను కేసులో నేరగాండ్ల శిక్ష తగ్గించి విడుదల చేసిన అంశాన్ని మహారాష్ట్ర శాసన మండలిలో ఎన్‌సిపి ప్రస్తావించింది.ఈ అంశాన్ని సభలో చర్చించాల్సిన అవసరం లేదని బిజెపి నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ చెబుతూ పద్నాలుగేండ్ల శిక్షను గడిపిన తరువాత వారిని విడుదల చేశారు.నేరగాండ్లు నేరగాండ్లే వారిని సన్మానించటం తప్పు, అలాంటి వాటిని సమర్ధించకూడదు అన్నారు. ఆ కేసులో నిందితులకు శిక్షలు విధించిన మాజీ జడ్జి ఉమేష్‌ సాల్వీ మాట్లాడుతూ శిక్ష తగ్గింపు చట్టబద్దమే కానీ వారికి తగ్గించటం తగని పని అన్నారు. బిల్కిస్‌ బాను కావచ్చు, మరొకరు కావచ్చు రాజకీయాలు, భావజాలాలు, కాలాలకు అతీతంగా వారికి మద్దతునివ్వాలి. నిందితులకు శిక్షను తగ్గించటం మానవత్వం, స్త్రీత్వాలకే అవమానం అని బిజెపి నాయకురాలు కుషఉ్బ ట్వీట్‌ చేశారు.


ఈ కేసులో నిబంధనలకు తమకు అనువైన భాష్యం చెప్పి నేరగాండ్లను బిజెపి ప్రభుత్వ విడుదల చేసిందన్నది విమర్శ. వచ్చిన వార్తల ప్రకారం 1992 విధానం ప్రకారం తమ శిక్షను తగ్గించాలని నేరగాండ్లు గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరారు. 2014లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మానభంగం,హత్య ఉదంతాలలో శిక్షను తగ్గించకూడదంటూ గుజరాత్‌ సర్కార్‌ తిరస్కరించింది. తరువాత వారు గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లగా శిక్ష విధించింది బాంబే హైకోర్టు గనుక తమ పరిధిలోకి రాదని పిటీషన్‌ కొట్టివేసింది.తరువాత వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేరం జరిగింది 2002లో అప్పటికి 1992 శిక్ష తగ్గింపు నిబంధనలు అమల్లో ఉన్నందున ఇలాంటి కేసుల్లో గతంలో అనుసరించిన వాటిని పరిగణనలోకి తీసుకొని వారి అర్జీపై గుజరాత్‌ ప్రభుత్వమే మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నది కొందరి భాష్యం. ఆమేరకు గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశీలన కమిటి నిర్ణయం మేరకు విడుదల చేశారని సమర్ధిస్తున్నారు. గురువారం నాడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ బుర్రను(వివేకాన్ని) ఉపయోగించారా లేదా అన్నదాన్ని చూడాల్సి ఉంది అన్న మాటలను గమనించాలి. నిజంగా సుప్రీం కోర్టు శషభిషలకు తావు లేకుండా తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ పిటీషన్ను పరిష్కరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వానికి సూచించటాన్ని అవకాశంగా తీసుకొని నేరగాండ్లను విడుదల చేశారన్నది స్పష్టం. సిపిఎం నేత సుభాషిణీ ఆలీ మరికొందరు సుప్రీం కోర్టులో విడుదల నిర్ణయాన్ని సవాలు చేసినందున అసలేం జరిగింది, సుప్రీం ఏం చెప్పింది అన్నది విచారణలో వెల్లడికానుంది.


ఈ ఉదంతంలో బిజెపి ఎంఎల్‌ఏ సికె రావుల్జీ తీరును పార్టీ ఇంతవరకు తప్పు పట్టనందున ఆ పార్టీ ఎలాంటిదో వెల్లడించింది. రేపిస్టులు బ్రాహ్మలని వారికి మంచి విలువలు ఉంటాయని చెప్పారు. శిక్షా కాలంలో వారు సత్ప్రవర్తనతో మెలిగారని కూడా కితాబు నిచ్చారు. సదరు ఎంఎల్‌ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలోని ఇద్దరు బిజెపి ఎంఎల్‌ఏలలో ఒకరు. పదకొండు మంది రేపిస్టులలో ముగ్గురు బ్రాహ్మలు కాగా ఐదుగురు ఓబిసి, ఇద్దరు ఎస్‌సి, ఒక బనియా ఉన్నట్లు ది ప్రింట్‌ పత్రిక విలేకర్లు వెల్లడించారు. ఎవరు ఏ కులస్తులన్నది పేర్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ కులంవారు ఎందరన్నది కాదు, వారు చేసిన దుర్మార్గం ఏమిటన్నది కీలకం. కాశ్మీరులోని కధువా ఉదంతంలో రేపిస్టులకు బిజెపి ఎంఎల్‌ఏలు, మంత్రులు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో ప్రభుత్వమే నిందితులకు రక్షణ ఇచ్చిందనే విమర్శలు వచ్చాయి.


బిల్కిస్‌ కేసును విచారించిన మాజీ జడ్జి ఉమేష్‌ సాల్వీ ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ” ఎవరైనా హిందూత్వ గురించి మాట్లాడేవారు ఇలాంటి నీచమైన నేరానికి పాల్పడ్డవారిని ఈ విధంగా సత్కరిస్తారా ? అది హిందూత్వను నిందించటమే.అది కానట్లయితే, రాజకీయపక్షాలకు అలాంటి ఉద్దేశ్యం లేనట్లైతే వ్యవస్థ శిక్షించిన వారి పట్ల అలా ప్రవర్తించరు. నేరగాండ్లు నేరానికి పాల్పడలేదని చెప్పటమే, న్యాయవ్యవస్థ మీద తిరుగుబాటు చేయటమే. ఈ పదకొండు మంది నేరగాండ్లకు స్వాగతం పలకటం తగనిపని.కొంత మంది ఇది హిందూత్వలో భాగం అనుకుంటున్నారు లేదా ఒక హిందువుగా ఇలా చేశారు.అది తప్పు.కొంతమంది వారు బ్రాహ్మలని చెబుతున్నారు, అలా చెప్పటం సరైంది కాదు. వారు కమిటీ గురించి ఏమి చెబుతారు ?దాన్లో సభ్యులు బిజెపి నుంచి కాంగ్రెస్‌ నుంచి ఎవరైనా కావచ్చు తేడా ఏముంటుంది.తొలుత వారు మానవమాత్రులుగా ఉండాలి, అది ముఖ్యం. ఈ కేసును విచారించిన జడ్జిని వారేమైనా అడిగారా ? అలాంటిదేమీ లేదని నేను చెప్పగలను.కేసును విచారించింది సిబిఐ, అలాంటి ఉదంతాలలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సలహా కోరాలి.వారాపని చేశారా, నాకు తెలియదు, కోరి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పింది ? శిక్షను తగ్గించేటపుడు ప్రభుత్వం బాధితురాలిని అదే విధంగా నేరానికి పాల్పడిన వారినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విధంగా చేశారని నేను అనుకోవటం లేదు. విడుదలైన నేరస్తులు అపరాధ భావన వెలిబుచ్చారా లేదా క్షమాపణ కోరారా ? వారు తమకు స్వాగతం పలకటాన్ని, పూలదండలు వేయటాన్ని అంగీకరించారు. దీన్ని చూస్తుంటే వారు చేసిందేమిటో, అపరాధభావంతో ఉన్నట్లు కనిపించటం లేదు.” అన్నారు.


శిక్ష తగ్గింపు మీద సిఫార్సు కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఒక పెద్ద ప్రహసనం. పది మంది కమిటికీ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షుడు. పంచమహల్‌ జిల్లా ఎస్‌పి, గోద్రా జిల్లా జడ్జి, గోద్రా జైలు సూపరింటెండెంట్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, బిజెపికి చెందిన ఎంఎల్‌ఏలు సికె రావుల్జీ, సుమన్‌ బెన్‌ చౌహాన్‌, గోద్రా తాలుకా బిజెపి నేత సర్దార్‌ సింV్‌ా బారియా, గోద్రా బిజెపి మహిళానేత వినితాబెన్‌ లీలీ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవన్‌ సోనీ ఉన్నారు. ఈ కమిటీ ఏకగ్రీవంగా నేరగాండ్ల విడుదలకు సిఫార్సు చేసింది.
2012నాటి నిర్భయపై జరిగిన అత్యాచారం,హత్య కేసులో దేశం పెద్ద ఎత్తున స్పందించింది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష పడింది.బిల్కిస్‌ బానుపై అత్యాచారం, నేరగాండ్ల విడుదలపుడు నిర్భయ మాదిరి నిరసన, స్పందన ఎందుకు వెల్లడికాలేదని అనేక మంది ప్రశ్నిస్తున్నారు.బిల్కిస్‌ బాను ఒక మైనారిటీ మతానికి చెందినవ్యక్తిగా చూడాలా లేక ఒక మహిళగా పరిగణించాలా అన్న ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. దేశంలో ముస్లిం విద్వేషాన్ని తీవ్రంగా రెచ్చగొడుతున్న పూర్వరంగంలో ఇలాంటి ప్రశ్న తలెత్తటం సహజం.తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్చ ఉండాలని కోరుతున్న వారిలో కొందరు హిజబ్‌,బుర్ఖాలను ధరించే స్వేచ్చ తమకు ఉండాలని కోరుతున్న మహిళల డిమాండ్‌ను వ్యతిరేకిస్తుండటం ఒక సామాజిక వైరుధ్యమే కాదు, ఆందోళనకర పరిణామం.హిందూ బాలికలవైపు ముస్లిం కుర్రాళ్లు కన్నెత్తి చూసినా సరే ముస్లిం మహిళలపై అత్యాచారాలు చేసి కడుపులు చేయాలంటూ రెచ్చిపోయిన సాధ్వి విభానంద గిరి, ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపురిలో ముస్లిం మహిళలపై అత్యాచారాలు జరపాలంటూ బహిరంగంగా పిలుపు ఇచ్చిన మహంత భజరంగ మునిదాస్‌లు స్వేచ్చగా తిరుగుతున్న పవిత్ర నేల ఇది. కోర్టులో శిక్షలు పడిన నేరగాండ్లు సంస్కారవంతులని కితాబులిచ్చిన పాలకులు ఏలుతున్న గడ్డ ఇది.తోటి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నేరగాండ్లకు శిక్ష తగ్గించాలన్న బిజెపి శీలవతుల సంస్కారంతో భారత మాత మురిసిపోతున్నదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నోటి దూల నూపుర్‌ శర్మకు సుప్రీం చివాట్లు – బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ !

02 Saturday Jul 2022

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Narendra Modi Failures, nupur sharma fringe comments, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి ó(ఆమెను తాత్కాలికంగా నిలిపి ఉంచారు తప్ప పూర్తిగా తొలగించలేదు గనుక ఇంకా ఆ పదవిలో ఉన్నట్లే ) నూపుర్‌ శర్మకు జూలై ఒకటవ తేదీన సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై వివిధ రాష్ట్రాలలో దాఖలైన కేసులన్నింటినీ ఒక్కటిగా చేసి ఢిల్లీలో విచారించాలని ఆమె చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు సూర్య కాంత్‌, జెపి పార్దీవాలాతో కూడిన వేసవి సెలవుల బెంచ్‌ నూపుర్‌ వినతిని విచారించింది. ఆమె నోటి దూల దేశమంతటా నిప్పు రాజేసింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తతలకు ఆమెదే పూర్తి బాధ్యత అని సుప్రీం కోర్టు చెప్పింది. దేశంలో మహమ్మద్‌ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలతో దేశంలో రగిలించిన ఆవేశాలకుగాను దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పాలన్నది. సుప్రీం కోర్టు నుంచి ఇలాంటి ప్రతిస్పందనను ఎవరూ ఊహించి ఉండరు. నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు జడ్జీలు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనేట్లు ఆదేశించాలని అజయ గౌతమ్‌ అనే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణకు దరఖాస్తు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అలాంటి వ్యాఖ్యలు చేసినందున ఆమెకు న్యాయం జరగకపోవచ్చని ఆరోపించారు. తన పిటీషన్‌ కాపీని రాష్ట్రపతికి కూడా పంపుతానని అతను పేర్కొన్నాడు.


గ్యానవాపి మసీదు అంశం కోర్టు విచారణలో ఉన్నందున ఒక అజెండాను ముందుకు తేవాలని తప్ప దాని మీద టైమ్స్‌ నౌ ఛానల్‌ చర్చ ఎందుకు నిర్వహించింది అని కోర్టు ప్రశ్నించింది. మే 27వ తేదీన సదరు ఛానల్‌ చర్చలో నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్రవివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ” చౌకబారు ప్రచారం కోసం, రాజకీయ అజెండా లేదా దుర్మార్గమైన కార్యకలాపాల కోసం ఆమె మాట్లాడి ఉండాలి. ఆమె వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె అలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? దేశమంతటా ఆవేశాలను రగిలించేందుకు ఆమె మాట్లాడిన తీరు కారణం, దేశంలో జరుగుతున్నదానికి ఈ మహిళదే ఏకైక బాధ్యత. ఆమె ఎలా రెచ్చగొట్టిందీ చర్చను మేము చూశాము. తరువాత లాయర్నని ఆమె చెప్పుకుంది ఇది సిగ్గుచేటు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ” అని బెంచ్‌కు అధ్యక్షత వహించిన జస్టిస్‌ సూర్య కాంత్‌ అన్నారు.


నూపుర్‌ శర్మ తరఫు న్యాయవాది మణీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ చర్చ సందర్భంగా నవికా కుమార్‌ మాట్లాడిన దానికి స్పందనగా నూపుర్‌ శర్మ మాట్లాడినట్లు చెప్పగా అయితే చర్చను నిర్వహించిన వారి మీద కూడా కేసు నమోదు చేయాలని కోర్టు అన్నది.అలాంటి ఉద్దేశ్యం యాంకర్‌కు లేదు. చర్చలో మరొకరు పదే పదే శివలింగం కాదు కేవలం ఫౌంటెన్‌ చెప్పారు అని మణిందర్‌ సింగ్‌ అన్నారు. తన కక్షిదారుకు ప్రాణహాని ఉన్నందున కేసులన్నింటినీ ఒకేచోట విచారించాలని మణీందర్‌ సింగ్‌ కోరారు. ” అమెకు ముప్పు ఉన్నదా లేక దేశ భద్రతకే ఆమె ముప్పు తెచ్చారా ? ఉదయపూర్‌లో జరిగిన దురదృష్టకర హత్యకు ఆమె మాటలే కారణం ” అని జస్టిస్‌ పార్దీవాలా అన్నారు. నూపుర్‌ శర్మ తన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పారని, వెనక్కు తీసుకున్నారని న్యాయవాది చెప్పగా ” దేశానికి క్షమాపణ చెప్పేందుకు ఆమె టీవీ స్టూడియోకు వెళ్లాలి. వెనక్కు తీసుకోవటం కూడా చాలా ఆలస్యమైంది. అది కూడా మనోభావాలు గాయపడితే అనే షరతులతో కూడి ఉంది. రెచ్చగొట్టేందుకు వీరేమీ మతపరమైన వారు కాదు.” అని కోర్టు పేర్కొన్నది.


నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించటం గురించి జస్టిస్‌ సూర్య కాంత్‌ మాట్లాడుతూ ” నూపుర్‌ పిటీషన్‌ ఆమె పొగరును వెల్లడిస్తున్నది. దేశంలోని మెజిస్ట్రేట్‌లు ఆమెకు చాలా చిన్నవారిగా కనిపిస్తున్నారు. ఆమె ఒక పార్టీ అధికార ప్రతినిధైతే ఏమిటి ? తన వెనుక అధికారం ఉందని, దేశంలోని చట్టాలతో నిమిత్తం లేకుండా ఏమైనా మాట్లాడగలనని ఆమె అనుకుంటున్నారు. కేవలం ఒక జాతీయ పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన క్షోభను కలిగించే అంశాలు మాట్లాడేందుకు లైసన్సు ఇవ్వరాదు. కోర్టులో ఉన్న అంశం గురించి ఆమె ఎందుకు మాట్లాడారు ” అని జస్టిస్‌ సూర్య కాంత్‌ ప్రశ్నించారు. ఈ అంశంలో ఢిల్లీ పోలీసుల తీరును కూడా కోర్టు ప్రశ్నించింది.పోలీసులు ఏమి చేశారు ? మా నోరు తెరిపించవద్దు అని సున్నితంగా కోర్టు మందలించింది.వివిధ రాష్ట్రాల నుంచి నిరంతరం వస్తున్న బెదిరింపులతో తన ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్‌ శర్మ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.


దేవుడు నైవేద్యం ఆరగించడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే ఎక్కడో ఒక చోట జరిగిన దాని మీద వివిధ రాష్ట్రాల్లో కేసులు పెట్టి ఏండ్లతరబడి తిప్పే అంశం బిజెపికి చెందిన నూపుర్‌ శర్మకు, అందునా లాయర్‌ గనుక ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు.కాషాయ దళాలు ప్రత్యేక శిక్షణతో ఉంటాయి.నీవు నేర్పిన విద్యఏనీరజాక్షా అన్నట్లుగా మిగతావారూ ప్రారంభించారు. బహుశా ఆ దృశ్యాలు కనిపించి తన మీద ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీలోనే విచారించాలని కోరి ఉండవచ్చు. నూపుర్‌ శర్మ గురించి సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యల నేపధ్యంలో కట్టుకథలకు, వక్రీకరణకు మారుపేరైన కాషాయదళాల నిర్వహణలోని వెబ్‌సైట్‌ ఓపి ఇండియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. నూపుర్‌ శర్మ దరఖాస్తును విచారించి తిరస్కరించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు జెబి పార్దీవాలా. సదరు న్యాయమూర్తి గతంలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏగా, 1980-90లో గుజరాత్‌ స్పీకర్‌గా పని చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నది. నిజానికి ఆ పదవిలో ఉన్నది పార్దీవాలా తండ్రి బి పార్దీవాలా. పదవిలో ఉన్నది 1990 జనవరి 19 నుంచి మార్చి 16వరకు మాత్రమే, 86 ఏండ్ల వయస్సులో 2015లో మరణించారు. ఉద్రేకపడితే విచక్షణ ఎగిరిపోతుంది. జెబి పార్దీవాలా 2022 మే 9వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. అన్నీ సక్రమంగా ఉంటే ఇప్పుడున్న వారిలో సీనియారిటీ ప్రకారం 2028 మే నెలలో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది రెండు సంవత్సరాల మూడు నెలలపాటు కొనసాగుతారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినపుడు ఇచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించిన అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వాటిని వెనక్కు తీసుకున్నారని ఇప్పుడు అదే న్యాయమూర్తి శుక్రవారం నాడు నూపుర్‌ శర్మ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం వచ్చే రీతిలో ఒపిఇండియా కథనం ఉంది.


దానిలో పేర్కొన్నదాని ప్రకారం పటేల్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్లు కల్పించాలన్న పిటీషన్‌ విచారణ సందర్భంగా ” ఈ దేశాన్ని నాశనం చేసింది లేదా సరైన దారిలో ముందుకు పోయేందుకు ఆటంకం కలిగించిన రెండు అంశాల పేర్లు చెప్పమని ఎవరైనా నన్ను అడిగితే రిజర్వేషన్లు, అవినీతి అని చెబుతా. ఆరున్నర దశాబ్దాల తరువాత రిజర్వేషన్లు కావాలని అడిగితే ఏ పౌరుడికైనా సిగ్గు చేటు. మన రాజ్యాంగాన్ని రూపొందించినపుడు పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. కానీ దురదృష్టం కొద్దీ స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్నట్ల ” పార్దీవాలా అన్నట్లు, దాంతో జడ్జి పదవి నుంచి తొలగించాలని 58 మంది రాజ్యసభ ఎంపీలు 2015లో పిటీషన్‌ దాఖలు చేసినపడు తన పదజాలాన్ని వెనక్కు తీసుకున్నట్లు పేర్కొన్నది. ఇక్కడ గమనించాల్సింది నిజంగా ఓపి ఇండియా రాసినట్లే జరిగిందా మరొకటా అన్నది కాదు. నూపుర్‌ శర్మ మీద సుప్రీం కోర్టు బెంచ్‌ జడ్జీలు చేసిన వ్యాఖ్యలు కూడా రిజర్వేషన్ల మీద చేసిన అంతటి తీవ్రమైనవైతే ఇప్పుడు కూడా బిజెపి, భుజాలు మార్చుకోకుండా దాన్ని మోస్తున్న పార్టీల ఎంపీలందరూ అలాంటి పిటీషన్‌ పెట్టమనండి.


నూపుర్‌ శర్మ నోటి దూల కలిగించిన పరిస్థితి గురించి దేశంలో ఉన్న అనేక మంది మనస్సులో ఉన్న మాటలనే సుప్రీం జడ్జీలు చెప్పారు.దాంతో బిజెపి, దాని అభిమానులకు అన్నింటికీ మించి నూపుర్‌ శర్మ చేసింది సరైనదే అని వాదించే, నమ్ముతున్నవారికి శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది. సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు చేసిన వా ఖ్యల మీద ” మీడియా నేడు మౌనంగా ఉంది. వారి నోళ్లు మూసుకున్నారు.నూపుర్‌ శర్మ కేసులో ఎవరూ న్యాయమూర్తుల మాటల మీద బహిరంగంగా మాట్లాడటం లేదు. ఇది నిజంగా చెడురోజు ” అంటూ ఒపి ఇండియా సంపాదకులలో ఒకరైన నూపుర్‌ జె శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా మాట్లాడటం నూపుర్‌ శర్మకు బరితెగించి మద్దతు ఇవ్వటం తప్ప వేరు కాదు.ఆమె నోటి దూల పర్యవసానాలే ఉదయపూర్‌లోని ఒక సాధారణ దర్జీ ప్రాణాలు తీసేందుకు దారి తీసిందని సుప్రీం కోర్టే చెప్పింది. ఇలా చెప్పటమంటే హంతకులను సమర్ధించినట్లు కాదు. దర్జీ ఉదంతం మర్చిపోక ముందే మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో మరొకరు ఆమె నోటి దూలకు బలైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు దాన్ని నిగ్గుతేల్చాల్సి ఉంది. అమిత్‌ మెడికల్‌ స్టోర్స్‌ దుకాణదారు ఉమేష్‌ ప్రహ్లాదరావు కోహ్లే (54) జూన్‌ 21 రాత్రి 10-10.30 మధ్య హత్యకు గురైనాడు. ఆ వెనుకే వస్తున్న కుమారుడు సంకేత్‌, కోడలు ఉమేష్‌ను ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. పోలీసులు చెబుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం ఉమేష్‌ వాట్సాప్‌ గ్రూపులో నూపుర్‌ శర్మకు మద్దతుగా పెట్టిన లేదా ఫార్వర్డ్‌ చేసిన పోస్టు తన ఖాతాదారులైన ముస్లింలు ఉన్న గ్రూపులో కూడా పెట్టాడు. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఒకడు మహమ్మద్‌ ప్రవక్తను కించిపరిచిన వారు చావాల్సిందే అని పోలీసులతో చెప్పినట్లు ఒక అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన తండ్రి అలాంటి వాడు కాదని తాను కూడా అదే కథనాన్ని విన్నట్లు, డబ్బుకోసమైతే తన తండ్రిని చంపలేదని మాత్రం తాను చెప్పగలనని కుమారుడు చెబుతున్నాడు. పోలీసులు స్పష్టంగా దేన్నీ చెప్పలేదు.


న్యాయమూర్తుల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆదేశించాలన్న దరఖాస్తు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంది. దాన్ని ఏమి చేస్తారన్నది ఆసక్తికర అంశం. ఒక వేళ దరఖాస్తు దారు కోరికను మన్నిస్తే కొత్త సమస్యలకు దారి తీస్తుంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మౌఖికంగా ఏమీ మాట్లాడేందుకు వీలుండకపోవచ్చు. దీన్ని అంగీకరిస్తే గతంలో సుప్రీంతో సహా వివిధ కోర్టులలో చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కొత్త పిటీషన్లు, కేసులు దాఖలు కావచ్చు.


పాత కేసుల పేరుతో ఎలా వేధించవచ్చో ఆల్ట్‌ న్యూస్‌ జర్నలిస్టు మహమ్మద్‌ జుబేర్‌ ఉదంతం వెల్లడించింది. 2018లో చేసిన ఒక ట్వీట్‌ మీద దాఖలు చేసిన కేసులో గతనెలలో జుబేర్‌ను అరెస్టు చేసి నాలుగు రోజుల పాటు కస్టడీకి పంపారు. ఒక ట్వీట్‌ మీద ఢిల్లీ పోలీసులు నాలుగు సంవత్సరాలుగా విచారణ చేస్తూనే ఉన్నారట. ఒక వేళ అరెస్టు చేయాల్సినంత పెద్ద నేరమైతే అప్పుడే చేసి ఉండాలి. ఇంతకూ మతపరమైన మనోభావాలను గాయపరచినట్లు ఆరోపించిన జుబేర్‌ ట్వీట్‌లో ఉన్నదేమిటి ? ఒక పాత హిందీ సినిమాలో ఒక హౌటల్‌ మీద హనుమాన్‌ హౌటల్‌ అని రాసి ఉన్న ఉన్న చిత్రాన్ని తీసుకొని దాని కింద ” 2014కు ముందు హనీమూన్‌ హౌటల్‌ 2014 తరువాత హనుమాన్‌ హౌటల్‌ ” అని ట్వీట్‌ చేశారు. దాని మీద హనుమాన్‌ భక్త అనే పేరుతో ఉన్న ఒక ట్విటర్‌ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారట. హనుమంతుడు బ్రహ్మచారి, ఇలా రాయటం హిందువులను నేరుగా అవమానించటమే కనుక చర్యతీసుకోవాలని సదరు ట్వీట్టర్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడట. అసలు ఫిర్యాదీ చిరునామా లేకుండా కేసు ఎలా పెడతారని జుబేర్‌ కోర్టులో ప్రశ్నిస్తే చిరునామా లేకుండా ట్వీటర్‌ సంస్థ ఖాతా తెరవదు కదా అని ప్రభుత్వ ప్లీడర్‌ సమాధానం. అది ఊరూపేరులేని ట్విటర్‌ ఖాతా కావచ్చు. ప్రపంచమంతటా అలాంటి నకిలీ ఖాతాలు ఉన్నపుడు ఆ సాకుతో కేసు పెట్టవచ్చు. తమకు నచ్చని లేదా లొంగని వారిని ఎలా వేధించే పరిస్థితి దేశంలో ఉందో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. అంతే కాదు ఒక చిన్న కేసును సంవత్సరాల తరబడి పరిష్కరించలేని అసమర్ధత మన పోలీసు శాఖలో ఉందని ఎవరన్నా అన్నా ఉడుక్కోనవసరం లేదు. అనేక పాత సినిమాలు, విమర్శనాత్మక గ్రంధాలలో అనేక అంశాలు ఉన్నాయి. అవి మా మనోభావాలను దెబ్బతీశాయని కేసులు పెడతారా ? వాటన్నింటినీ విచారిస్తారా ? ఎక్కడికి పోతున్నదీ అసహనం ? దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నామని పాలకులు చెప్పేదానికి అర్ధం ఇదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై అయ్యో పాపం అని కూడా నరేంద్ర మోడీ అనలేరా !

08 Friday Oct 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Lakhimpur Kheri killings, Narendra Modi, Navjot Singh Sidhu, Supreme Court of India, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు మూడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై బిజెపి నేతల వాహనాలను ఎక్కించి నలుగురిని దారుణంగా హత్య చేశారు. ఆ వాహనాల్లో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అషిష్‌ మిశ్రా ఉన్నాడా, అతనే స్వయంగా వాహనాన్ని రైతుల మీద ఎక్కించాడా లేక వాహనంలో ఉండి డ్రైవర్‌ను అందుకు పురికొల్పాడా అన్నది ఇప్పటివరకు వివాదాస్పద అంశంగా ఉంది. ఆ సమయంలో తన కుమారుడు అక్కడ లేడని కేంద్ర మంత్రి నమ్మబలుకుతున్నారు. దారుణ, గర్హనీయ ఉదంతం జరిగింది తమ ఏలుబడిలోని రాష్ట్రం, పోలీసులు, పాలకులూ తమ వారే, కేసులో ఇతర నిందితులు ఎవరైనా మంత్రిగారి కొడుకు ఉన్నందున పోలీసు కస్టడీ అయినా, రిమాండ్‌లో ఉన్నా ఇతర సాధారణ నిందితుల మాదిరి పోలీసు మర్యాదలేమీ ఉండవు, మంచిగానే చూసుకుంటారు. అయినా అక్టోబరు మూడున ఉదంతం జరిగితే ఇది రాస్తున్న సమయానికి కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. లేదా మంత్రిగారు అమాయకుడని చెబుతున్న తన కుమారుడిని పోలీసులకు అప్పగించలేదు. చట్టాన్ని అమలు జరపాల్సిన వారు, దాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసిన వారి తీరూ ఇలా ఉంది.

ఆరోగ్యం సరిగా లేని కారణంగా గురువారం నాడు తన కుమారుడు పోలీసుల ఎదుట హాజరుకాలేదని, శనివారం నాడు వెళతాడని మంత్రి అజయ మిశ్రా చెప్పారు. అమాయకుడని మరోసారి చెప్పారు. కాగా శనివారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలనే నోటీసును శుక్రవారం నాడు పోలీసులు కేంద్ర మంత్రి ఇంటి గోడకు అంటించారు. రుజువులు లేకుండా వత్తిడి తెచ్చినంత మాత్రాన ఎవరి మీదా ఎలాంటి చర్యలూ ఉండవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. పార్టీ వైఖరికి భిన్నంగా రైతు ఉద్యమం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై స్పందించిన బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ, మాజీ మంత్రి, వరుణ్‌ తల్లి అయిన మేనకా గాంధీని బిజెపి కేంద్ర కార్యవర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మరణించిన జర్నలిస్టు రామన్‌ కాశ్యప్‌ కుటుంబాన్ని శుక్రవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూ నిందితులను అరెస్టు చేసేంత వరకు తాను అక్కడే మౌన వ్రత దీక్ష చేయనున్నట్లు ప్రకటించి ప్రారంభించారు.


విశ్వగురువుగా భజంత్రీలు కీర్తిస్తున్నారు గనుక నిజమే అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే లఖింపూర్‌ ఖేరీ ఉదంతం తన స్థాయికి తగినదని భావించలేదా లేక ఇంకా పెద్దవి జరిగితే తప్ప స్పందించరో గానీ మొత్తం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పలేదు. ఈ ఉదంతం అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చిందని బహుశా యంత్రాంగం మోడీగారికి నివేదించి ఉండకపోవచ్చు. రాజును బట్టే కదా బంట్లు . అనూహ్యమైన ఈ పరిణామాన్ని బిజెపి పెద్దలు ఊహించి ఉండరు.అందుకే షాక్‌లో ఉన్నారు, గుక్క తిప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారానికి కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎలాగైనా తిరిగి గద్దెను దక్కించుకొనేందుకు పధకాల మీద పధకాలను రచిస్తున్న వారి జాబితాలో వేరే ఉంటాయి తప్ప ఇలాంటి మెడకు చుట్టుకునే దారుణాలు ఉండవు. రైతు ఉద్యమం మీద నిరంతరం బురద చల్లటం, ఎద్దేవా చేయటం, అసహనానికి గురై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఇలాంటివి జరగటం సాధారణం. నేను ప్రజాప్రతినిధిని గాక ముందు మనిషిగా ఉండి ఉంటే రెండు నిమిషాల్లో తేల్చేసి ఉండేవాడిని అని ఒక సారి రౌడీ షీటరుగా నమోదైన అజయమిశ్రా సెప్టెంబరు 25న ఆప్రాంతంలోనే మంత్రి వేషంలో ఉండి చెప్పారంటే ఏమనుకోవాలి. ఇదే సమయంలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ వంటి జాతి రత్నాలు తక్కువ తినలేదు. సమూహాలుగా ఏర్పడి కర్రలు తీసుకొని తిరగండి, జైలుకు పోవటం గురించి ఆలోచించవద్దని బిజెపి కార్కకర్తలకు కర్తవ్యబోధ చేశారంటే పుత్రరత్నాలు వాహనాలను జనం మీదకు నడపటం లేదా నడిపించటంలో ఆశ్చర్యం ఏముంది.

లఖింపూర్‌ ఖేరీ కేసు ఏమౌతుంది. అనేక కేసులు ఏమయ్యాయో ఇది కూడా అదే అవుతుంది. కేసు గురించి కాదు, పాలకపార్టీ ప్రమాదకర పోకడల గురించి తీవ్రంగా ఆలోచించాలి. సుప్రీం కోర్టుకు రాసిన లేఖలను తీసుకొని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేత్రత్వంలోని బెంచ్‌ కేసును విచారణ జరుపుతోంది. ఇంకా ఎందుకు మంత్రి పుత్రరత్నాన్ని అరెస్టు చేయలేదని ప్రశ్నించాల్సి వచ్చింది. ఇతర కేసుల్లో ఇలాంటి విచారణకు ఉన్నత న్యాయస్ధానానికి అవకాశం ఉంటుందా అంటే కచ్చితంగా ఉండదు. చిత్రం ఏమంటే సుప్రీం కోర్టు కేసు చేపట్టినట్లు తెలిసిన తరువాత కూడా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆషిష్‌ మిశ్రాను అరెస్టు చేయలేదు. ఏం చేస్తారో చూద్దామనో లేక సుప్రీం కోర్టు అయితే ఏంటి అన్న వైఖరో తెలిదు. ఇతర హత్యకేసుల్లో కూడా మీరు ఇలాగే పని ప్రవర్తిస్తారా అని కోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. తాను పోలీసుల ముందుకు రావటానికి మరింత సమంయం కావాలని ఆషిష్‌ మిశ్రా కోరాడని శనివారం ఉదం పదకొండు గంటల వరకు వ్వధి ఇచ్చినట్లు, అప్పటికీ రాకపోతే అరెస్టు వారంటు జారీ చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.ఎంతైనా యోగుల పాలన గనుక నిందితుల మనోభావాలను గౌరవించటంగా దీన్ని భావించవచ్చు.

కేసును ఈనెల 20కి వాయిదా వేసినందున మరో పది రోజుల పాటు ఏదో ఒక సాకుతో పోలీసులు కాలం గడపవచ్చు. లేదా కోర్టును సంతృప్తిపరచేందుకు అరెస్టు చూపవచ్చు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగిన ఢిల్లీలో ఉదంతంలో కుట్రదారైన బిజెపికి చెందిన నటుడు దీప్‌ సిద్దు తమ కళ్ల ముందునుంచే వెళుతున్నా అడ్డగించని పోలీసులు అతగాడిని పదిహేను రోజుల తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఉదంతాలలో ప్రభుత్వ వ్యతిరేకుల మీద మోపిన కేసుల్లో పోలీసులు ఎంత వేగంగా అరెస్టులు చేశారో చూశాము. కానీ లఖింపూర్‌ ఖేరీ ఉదంతంలో నిదానమే ప్రదానం అన్నట్లుగా యోగి సర్కార్‌ ఉంది. సమస్య సున్నితత్వం కారణంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదదని, కేసులో ఉన్న వ్యక్తుల కారణంగా సిబిఐ గురించి ఏమీ చెప్పనప్పటికీ అది పరిష్కారం కాదని,ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధికారులతో దర్పాప్తు సరిగా జరగదని, ఉన్న సాక్ష్యాలను నాశనం చేయకూడదని ప్రధాన న్యామూర్తి ఎన్‌వి రమణ అన్నారంటే కేసు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. బిజెపికి ఈ సున్నితత్వం అర్దం అవుతుందా ?


పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ” ఈ ఉదంతం సాయంత్రం మూడు గంటల సమయంలో జరిగింది.ఆషిష్‌ మిశ్రాతో పాటు 15-20 మంది ఆ వాహనాలలో ఉన్నారు. నిరసన తెలుపుతున్న బబీర్‌పూర్‌ వద్దకు మూడు వాహనాల్లో వచ్చారు. ఆషిష్‌ మిశ్రా తన మహింద్రా తార్‌ వాహనంలో ఎడమవైపు కూర్చున్నాడు.రోడ్డుకు రెండు వైపులా ఉన్న రైతుల మీదకు వాహనాలను పోనిచ్చిన తరువాత రైతుల మీద కాల్పులు జరిపాడు. గుర్విందర్‌ సింగ్‌ అనే రైతు కాల్పుల కారణంగా అక్కడికక్కడే మరణించాడు. వాహనాలు బోల్తాపడిన కారణంగా పక్కనే ఉన్నవారు గాయపడ్డారు. తరువాత ఆషిష్‌ కాల్పులు జరుపుతూ చెరకు తోటలవైపు వెళ్లి అక్కడ దాక్కున్నాడు.” అని ఉంది. ఇలాంటి తీవ్రనేరారోపణ చేసిన కేసుల్లో ఇతరులైతే అరెస్టుకు మీనమేషాలు లెక్కిస్తారా ? అయితే తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ నేరారోపణ చేసే సమయానికి దానిలో మార్పులు చోటు చేసుకోవని చెప్పలేము. మంత్రి కుమారుడి కాల్పుల కారణంగా మరణించినట్లు చెబుతున్న గుర్విందర్‌ సింగ్‌ పోస్టు మార్టంలో తుపాకి గాయాల ప్రస్తావన లేదు. దాంతో కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు రెండోసారి చేసినా అదే మాదిరి ప్రస్తావన లేని అంతకు ముందు నివేదికే ఇచ్చారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు ఇది జరిగిందనే అనుమానాలు రావటం సహజం.


ఈ దారుణకాండలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు, ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మీదే కేసులు కూడా పెట్టారు. అంటే ప్రజాస్వామ్యం సంగతి రాముడెరుగు బాధిత కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా తెలిపేందుకు యోగి అంగీకరించరన్నది స్పష్టం. ఇది హత్రాస్‌ ఉదంతంలో కూడా జరిగింది. చివరికి పోలీసులే అంత్యక్రియలను కూడా ఎలా చేశారో చూశాము. మంత్రి అనుచరుల కార్ల మీద రైతులు దాడి చేసినపుడు అవి బోల్తాపడి రైతులు మరణించారని ముందు చెప్పారు. తరువాత కార్లను ఎక్కిస్తున్న వీడియో బయటకు రావటంతో వేరే కథలు వినిపిస్తున్నారు. కార్లను రైతుల మీద నడిపించినపుడు నిజంగా మంత్రి కుమారుడు ఉంటే ఆగ్రహించిన రైతులు అతన్ని ప్రాణాలతో బతకనిచ్చి ఉండేవారా అని ఎదురుదాడి చేస్తున్నారు. కారు డ్రైవరు, మరో ఇద్దరు బిజెపి కార్యకర్తల మాదిరి చంపివుండేవారు కదా అని తర్కిస్తున్నారు. అయితే అతను ఆ సమయంలోవేరే చోట ఉన్నట్లు చెప్పటం తప్ప ఇంతవరకు ఎలాంటి ఆధారాలను ఈ వాదన చేస్తున్న మంత్రిగానీ, అనుచరులుగానీ వెల్లడించలేదు.


లఖింపూర్‌ ఖేరీ ఉదంత రాజకీయ పర్యవసానాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు సిబిఐ లేదా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా తేలుతుందన్నది అనుమానమే.ఆలస్యం జరిగినా లేక మంత్రి కుమారుడి ప్రమేయం లేదని చెప్పినా లేదా విధిలేక అతగాడే దారుణానికి కారకుడని తేలినా బిజెపి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పది నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమం ఈ ఉదంతంతో మరోమలుపు తిరిగింది. మరణించిన రైతుల కర్మకాండలు ముగిసేలోగా నిందితులను అరెస్టు చేయాలని, మంత్రిని తొలగించాలని కోరుతున్నారు. మంత్రిని తొలగిస్తే తప్పిదాన్ని అంగీకరించినట్లు లేకపోతే తమ వారిని రక్షించుకొనేందుకే బిజెపి పూనుకున్నదనే సందేశం రైతుల్లోకి వెళుతుంది. అన్నింటికీ మించి రాబోయే రోజుల్లో ప్రతి చోటా బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాల సందర్భంగా రైతుల ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ చెప్పినట్లు బిజెపి కార్యకర్తలు కర్రలు తీసుకొని దాడులకు దిగితే, మరిన్ని లఖింపూర్‌ ఖేరీ ఉదంతాలు జరిగితే ఏం జరుగుతుందో చెప్పలేము.


లఖింపూర్‌ ఖేరీ దారుణం జరిగి 48 గంటలు కూడా గడవక ముందే అక్కడి నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని లక్నో నగరానికి అక్టోబరు 5వ తేదీన ఎన్నికల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, మూడు రోజుల అజాదీ కా అమృత మహౌత్సవం ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. ఉపన్యాసం చేశారు.ఎన్నికల పధకాల్లో భాగంగా నయా భారత్‌కా నయా ఉత్తర ప్రదేశ్‌ పేరుతో 75 పధకాలను ప్రధాని ప్రారంభించారు. దేశాన్ని కుదిపివేసిన లఖింపూర్‌ ఉదంతం ప్రస్తావనే చేయలేదు. ఆ కార్యక్రమం ఎంతో ముందుగానే రూపొందించి ఉండవచ్చు, వాయిదా వేస్తే భిన్నమైన రాజకీయ సంకేతాలు వెళతాయని దాన్ని కొనసాగించి ఉండవచ్చు. తమ మంత్రి, అతని కుమారుడి నిర్వాకం కారణంగా జరిగిన ఉదంతం మంచి చెడ్డలను ప్రస్తావించకపోవచ్చు గానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి చెందిన ఎనిమిది విలువైన ప్రాణాలు పోతే కుటుంబాలకు సానుభూతి ప్రకటన చేస్తే సొమ్మేం పోతుంది. మరణించిన వారిలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, మంత్రి కారు డ్రైవర్‌, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారుగా. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రాణాలకు లేదా ?
.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పదివేల కోట్ల కోసం కక్కుర్తి – స్వయంగా పరువు తీసుకున్న ప్రధాని మోడీ !

09 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science

≈ Leave a comment

Tags

#Modi’s vaccine policy, BJP, Modi’s Vaccine U-Turn, Narendra Modi Failures, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

కరోనా బాధితుల పట్ల రాష్ట్రాలకు బాధ్యత లేదా, అసలు వైద్యం, ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కదా, అన్నీ కేంద్రమే చేయాలంటే సాధ్యమేనా అంటూ జనం చెవుల తుప్పు వదిలేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపి పెద్దలు తమ టూల్‌కిట్‌లోంచి ఒక ప్రచార ఆయుధాన్ని ప్రయోగించారు. జనానికి రాజ్యాంగం గురించి బోధ చేయటంతో పాటు ప్రతిపక్షాల మీద దాడికి కత్తులు, కటార్లు, మొరటు బాంబులు, విషపూరిత ఆయుధాలను సిద్దం చేసుకున్న భక్తులందరినీ విశ్వగురువు, దేవుడు లేదా దేవదూత నరేంద్రమోడీ దారుణంగా దెబ్బతీశారు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వాక్సిన్‌ వేయించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని నాటకీయ పద్దతుల్లో స్వయంగా ప్రకటించారు. దాంతో ఆయుధాలన్నింటినీ ఎక్కడికక్కడ పడవేసి పాలాభిషేకాలు, పాదాభిషేకాలు చేయటంతో పాటు భజన ప్రారంభించారు. భక్తుల హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో ఇవి లేదా వీటికి అనుబంధ అంశాలు మాత్రమే ఉంటాయి. పరిమిత ప్రయోజనం కోసమే వారిని తయారు చేస్తారు. ఇది విశ్వజనీన సత్యం.

గతంలో ప్రకటించిన వాక్సిన్‌, ధరల విధానం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అయితే నరేంద్రమోడీ ప్రకటించిన తాజా విధానానికి ముందు అలాంటి సమావేశం జరిగినట్లుగానీ, కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగానీ ఎలాంటి సమాచారం లేదు. రాజ్యాంగం ప్రకారం విధానపరమైన నిర్ణయాలు ఫెడరల్‌ వ్యవస్ధలో మంత్రివర్గం తీసుకోవాలి. అధ్యక్ష తరహా వ్యవస్ధలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకొని తరువాత మంత్రివర్గఆమోదానికి పెడతారు. ఇక్కడ నరేంద్రమోడీ గారు చేసిందేమిటి ? పెద్ద నోట్ల రద్దు అంటే రహస్యం కనుక ఆకస్మికంగా చేశారని అనుకుందాం. వాక్సిన్‌ విధానం అలాంటిది కాదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చీమకుట్టలేదు. సుప్రీం కోర్టు స్వయంగా పూనుకున్న తరువాత కూడా స్పర్శలేనట్లుగానే వ్యవహరించారు. తీరా గట్టిగా నిలదీసి కేటాయించిన 35వేల కోట్లు ఏం చేశారో చెప్పాలంటూ గడువు పెట్టటంతో మరోదారి లేకపోయింది. మోడీ స్వయంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్ణయాన్ని ప్రకటించేశారు. మంత్రులను రబ్బరు స్టాంపులుగా మార్చివేశారు. తొలుత ప్రకటించిన దానికీ దానికీ మంత్రి వర్గ ఆమోదం లేదు, దీనికీ అవసరం ఏముంది అంటారా ?

తామేం చేసినా ప్రశ్నించేవారు లేరు, ఉండకూడదు, ప్రతిపక్షాలను లెక్కచేయాల్సిన అవసరం లేదు అనే యావలో పడిన బిజెపి పెద్దలకు ఈ మధ్య వాస్తవ పరిస్ధితులు అర్ధం కావటం లేదు. కరోనా రెండవ దశ నిర్లక్ష్యంతో తలెత్తిన పరిస్ధితి మీద వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఉంటే వాక్సిన్‌ విధానంలో ఇంత షాక్‌ తగిలి ఉండేది కాదు. నిజానికిది కరోనా కంటే పెద్ద దెబ్బ. సుప్రీం కోర్టు వాక్సిన్‌ విధానం గురించి ఇలా నిలదీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. గతంలో చేసిన నిర్ణయాలకే విధానం అనే ముద్రవేసి కోర్టుకు సమర్పించి ఉంటే రాజ్యాంగబద్దమా కాదా అన్నది చూస్తాం తప్ప విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని న్యాయమూర్తులు చెప్పి ఉండేవారేమో ! కానీ ఇది ఎవరో వేసిన కేసు కాదు, స్వయంగా చేపట్టిన అంశం. యాభై ఆరు అంగుళాల గుండె పిరికిబారినట్లుంది. లేకపోతే కోట్లాది భక్తులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రుల పరువు తీస్తూ ఇలాంటి ప్రకటన ఎందుకు చేస్తారు అన్న అనుమానాలు కలగటం సహజం కాదంటారా ?

మరి ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించాలా వద్దా ? స్వాగతించాల్సిందే. కేంద్రమే వాక్సిన్‌ బాధ్యత చేపట్టాలని, మూడు ధరల విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేసిన వారు తప్పకుండా ఆ పని చేస్తారు, చేశారు.అయితే స్వాగతించటానికి – భజన చేయటానికి తేడా ఉంది. బిజెపి ముఖ్యమంత్రులకు భజన చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అలా చేస్తే జనం దృష్టిలో మరింత పలుచన అవుతారు. నలభైఅయిదు సంవత్సరాల లోపు వారికి వాక్సిన్‌ గురించిన నిర్ణయం రాష్ట్రాలకే వదలి వేయాలని డిమాండ్‌ చేశారని చెబుతున్న బిజెపి ముఖ్యమంత్రులు, ఆ వాదనలతో కొండెక్కి కూర్చున్నవారు ఏ నోటితో స్వాగతిస్తారు, ఏ ముఖాలతో దిగివస్తారు ? కేంద్ర వాక్సిన్‌ విధానం గురించి విమర్శలు చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ నాలుగుసార్లు ఏలుబడిలో ఉన్న మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వారం రోజుల క్రితం ఏం మాట్లాడారు ? ” ఎంతో చక్కటి, పక్కాగా ఉన్న కేంద్ర వాక్సిన్‌ విధానాన్ని రాష్ట్రాల వత్తిడి మేరకే కేంద్రం మార్చింది. ముఖ్యమంత్రులందరూ ఒక దగ్గరకు వచ్చి కేంద్రీకృత విధానం కావాలని ప్రధానిని కోరితే ఆయన కూడా పరిశీలిస్తారు.రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నపుడు కేంద్రం కూడా ఒకే రకమైన విధానాన్ని తీసుకురాలేదు, అందుకే రాష్ట్రాలకు వదిలిపెట్టింది ” అన్నారు. మా వాక్సిన్‌ మేం కొనుక్కుంటాం అని బిజెపి ముఖ్యమంత్రులు చెప్పారు. కాదు కేంద్రమే మొత్తంగా ఇవ్వాలి లేదా సేకరించి ఒకే ధరకు రాష్ట్రాలకు ఇవ్వాలి తప్ప ద్వంద్వ ధరలేమిటని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చెప్పారు. ఎద్దు-దున్నతో అరక కడితే ఏమౌతుంది. ఎండ ముదిరే కొద్దీ ఎద్దు నీడవైపు లాగుతుంది-దున్న ఎండవైపు మొగ్గుతుంది. అలాగే భిన్న వైఖరుల మధ్య ఏకాభిప్రాయం ఎలా సాధ్యం ? అప్పుడు కేంద్రం ఏమి చేయాలి, ధర చెల్లించగలిగిన రాష్ట్రాలు కొనుక్కోవచ్చు, మాకంత శక్తిలేదు అని అన్నవారికి మేమే ఇస్తామని చెప్పాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కేంద్ర ప్రభుత్వ పధకం దాన్ని అమలు జరపాలా లేదా అన్నది రాష్ట్రాలకే వదలి వేసినట్లు వాక్సిన్‌ విషయంలో ఎందుకు చేయలేకపోయింది. దురుద్ధేశ్యాన్ని కడుపులో పెట్టుకొని కొన్ని రాష్ట్రాల పేరుతో ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరి ఇప్పుడు ఆ పక్కా పధకం ఏమైంది ? రాష్ట్రాలతో సంప్రదించకుండానే ప్రధాని ఏకపక్షంగా ఎలా ప్రకటించారు. మేమే కొనుక్కుంటాం అన్న రాష్ట్రాల మనోభావాలను గాయపరచి, ముఖ్యమంత్రులను అవమానించినట్లు కాదా ?

ఐదూండ్లు కాదు కదా సూదిమొన మోపినంత కూడా ఇచ్చేది లేదన్న రారాజు మాదిరి గత కొన్ని వారాలుగా భీష్మించిన విశ్వగురువు ఆకస్మికంగా అందరికీ మేమే వేయిస్తాం అని ఎందుకు చెప్పారు? ఇది వైఫల్యాన్ని అంగీకరించటమే, పోనీ ఆ చెప్పిందైనా సక్రమంగా ఉందా ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా లేదూ ! పోయిన పరువును తిరిగి తెచ్చుకొనే యత్నమన్నది ఏకాభిప్రాయం. అంటే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా ? రారాజు దిగి వచ్చారు సరే, మంచిదే , మళ్లా 25శాతం ప్రయివేటు ఆసుపత్రులద్వారా వేయించుకోవచ్చనే పితలాటకం ఏమిటి ? ఫార్మా, కార్పొరేట్‌ మాఫియాకు లాభాలు చేకూర్చే ఎత్తుగడ అనే విమర్శలను ఎందుకు భరిస్తున్నారు. వారిచ్చే నిధుల ముందు విమర్శలు ఒక లెక్కా ?

ఉచితంగా ఇస్తామనే ప్రకటన హుందాగా చేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు, ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు. ప్రధాని స్వయంగా రాష్ట్రాల మీద నెపం మోపారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్ప ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేవీ వాక్సిన్‌ సేకరణ తమకు వదిలేయాలని అడగలేదు. చివరకు బిజెపి భాగస్వామిగా ఉన్న బీహార్‌ నుంచి కూడా అలాంటి డిమాండ్‌ లేదు. సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఊపిరి సలుపుకోలేక తప్ప చిత్తశుద్ది లేదు.గతంలో వాక్సిన్‌ వేసి నందుకు వంద రూపాయల సేవా రుసుం ప్రయివేటు ఆసుపత్రులు తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు దాన్ని 150కి పెంచారు. ఇంతలోనే ఇంత పెంపుదల ఎందుకు ? అదనపు ఖర్చులు ఆసుపత్రులకు ఏమి వచ్చాయి ?

నరేంద్రమోడీ దిగిరావటం వాక్సిన్‌కంటే ముందే ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌ కుంభమేళాను మధ్యలో ఆపివేయాలనటం అదే కదా ? అంతకు ముందు అనేక మంది కరోనా నిబంధనలను ఉల్లంఘించి లక్షలాది మందిని సామూహిక స్నానాలకు అనుమతించటం ప్రమాదకరం అని హెచ్చరిస్తే పెడచెవిన పెట్టారు. మొరటుగా ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు జనాన్ని మునగమని చెప్పారు. తీరా కొందరు అఖారాలు మరణించటం, కరోనా సోకటం, మీడియాలో వార్తలు రావటంతో విధిలేక ప్రధాని మోడీ జోక్యం చేసుకొని నిలిపివేయించారు.

కరోనా మొదటి తరంగం సమయంలో జనానికి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టారు, రెండోసారి వాటి ఊసే లేదు. లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదలివేసి పర్యవసానాలకు బాధ్యత తమదేమీ లేదన్నట్లు వ్యవహించారు. అందుకే రెండో సారి దీపాలు వెలిగించటం, గ్లాసులు,కంచాలు మోగించటం వంటి పిలుపులకు దూరంగా ఉన్నారు. కానీ వాక్సిన్‌ భారాన్ని రాష్ట్రాల మీద మోపాలన్న ఎత్తుగడ పారకపోగా వికటించింది.మోడీ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అని అతిశయోక్తులు పలికి మునగ చెట్టు ఎక్కించిన వారికి కరోనా రెండవ దశ తీవ్రతను గుర్తించటంలో వైఫల్యాన్ని చూసి దిమ్మతిరిగినోట మాట రావటం లేదు.

ఆత్మనిర్భర పాకేజ్‌ కింద మేడిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు వ్యాక్సిన్లు తయారు చేసి దేశ ప్రజలకు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇది వాస్తవమా ? కోవాగ్జిన్‌ ఒక్కటే మన దేశంలో తయారు చేసిందని జనానికందరికీ తెలిసిందే. అనేక మంది అది స్వదేశీ అని మరొక వ్యాక్సిన్‌ వేసుకోము అని ఆలస్యం చేసిన వారు కూడా ఉన్నారు. కోవీషీల్డ్‌ విదేశీ ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారీ, కంపెనీ అనుమతితో ఇక్కడ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అయినా రెండు వాక్సిన్లు ఇక్కడే రూపొందించినట్లు చెప్పటం భావ్యమేనా ? జనాన్ని మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ?

వాక్సిన్ల విముఖతను విడనాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి కాషాయ దళాలు చెబుతున్నదేమిటి ? ఆవు పేడ పూసుకొని మూత్రం తాగితే కరోనా అంటదనే వీడియోలను ప్రపంచమంతా చూసింది. తాజాగా బిజెపి ఎంపీ, అలనాటి హీరోయిన్‌ హేమమాలిని కరోనా నుంచి రక్షణకు హౌమాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందే అనేక మంది చేశారు. స్ఫూర్తికోసం ప్రధాని దీపాలు వెలిగించమని కోరితే దాంతో కరోనాను నాశనం చేయవచ్చని ప్రచారం చేసిన ప్రబుద్దులు ఉన్నదేశం మనది, గో కరోనా గో కరోనా అంటూ భజనలు చేయించిన పెద్దలున్నారు. గంగలో మునిగితే కరోనా అంటదు అని ప్రబోధించిన వారి గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలన్నింటీని ప్రోత్సహించటంలో అన్ని మతాలూ ఒకటిగానే ఉన్నాయి, ప్రోత్సహించాయి.జనాభా రీత్యా చూస్తే వాక్సిన్‌కు విముఖత చూపితే ఎక్కువగా నష్టపోయేది నూటికి 80శాతంగా ఉన్న మతానికి చెందిన వారే. మరి హిందూత్వ శక్తులు ఇంతగా మూఢత్వాన్ని ఎందుకు ఎక్కించినట్లు ? ఇప్పుడు ఒక్క మాటతో దాన్ని పోగొట్టుకోమంటే అంత తేలికగా మత్తు దిగుతుందా ?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలు దిమ్మతిరిగేట్లు చేస్తే , ఉత్తర ప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు సామాన్యమైనవి కాదు. ప్రధాని వారణాసి జిల్లాలోనే బిజెపి బొక్కబోర్లా పడింది. రాష్ట్రాల నుంచి డిమాండ్‌ వచ్చిన కారణంగానే వికేంద్రీకరణ విధానాన్ని ప్రకటించామని, ఇప్పుడు కొన్ని అనేక రాష్ట్రాలు తిరిగి కేంద్రీకరణ విధానాన్ని డిమాండ్‌ చేస్తున్నాయని మోడీ చెప్పారు.మీడియాలో కొన్ని తరగతులు కూడా ఈ డిమాండ్‌ గురించి ప్రచారం చేశాయి. ఇతర దేశాలు పని ప్రారంభించక ముందే మన దేశంలో శాస్త్రవేత్తలు, తయారీదార్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. ఇది అతిశయోక్తి, అర్ద సత్యం తప్ప ప్రధాని నోటి నుంచి రావాల్సింది కాదు.

గత కొద్ది వారాలుగా చర్చలను చూసినపుడు కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉంది. దేశంలో వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు లేక సీరం సంస్ద ఉత్పత్తి నిలిపివేసిన విషయం తెలుసు, భారత్‌బయోటెక్‌ ఉత్పత్తి సామర్ధ్యం తక్కువనీ తెలిసినా రాష్ట్రాలు వాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని, అవసరమైతే దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర పెద్దలు ఎలా భావించారు.ఇతర వాక్సిన్ల తయారీకి అవసరమైన పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం తాత్సారం చేసింది. విదేశీ కంపెనీలు వాక్సిన్ల సరఫరాకు పెట్టిన షరతులకు అంగీకరించటమా లేదా అన్నది నిర్ణయించాల్సింది కేంద్రం అయినపుడు దిగుమతులు ఎలా చేసుకుంటాయని భావించారు. కొన్ని రాష్ట్రాల టెండర్లకు ఎలాంటి స్పందన లేదని తెలిసి కూడా కేంద్రం ఏమీ తెలియనట్లు వ్యవహరించిందా లేదా ? ఒకే వాక్సిన్‌కు వివిధ ధరలకు అనుమతించిన విధాన హేతుబద్దతు ఏమిటి ? మిగతా దేశాల మాదిరి తగినంత ముందుగా వాక్సిన్ల కోసం కేంద్రం ఎందుకు ఆర్డర్లు పెట్టలేదు. ప్రభుత్వ రంగంలోని వాక్సిన్‌ తయారీ సంస్ధల గురించి ముందుగానే ఎందుకు కేంద్రం పరిశీలన జరపలేదు. కరోనా మహమ్మారి ప్రారంభమై ఏడాది గడచిన తరువాత దాన్ని జాతీయ సమస్యగా చూడాలా, రాష్ట్రాల పరిధిలో ఆరోగ్య సమస్యగా పరిగణించాలా అన్న చర్చ కేంద్రం వైపు నుంచి ఎందుకు జరపలేదు. ఆరోగ్యం గురించి రాజ్యాంగంలో ఉంది తప్ప మహమ్మారులను ప్రత్యేక అంశంగా పరిగణించాలని పేర్కొనలేదా ? జాతీయ విపత్తుల యాజమాన్య చట్టానికి అర్దం ఏమిటి ?

గతేడాది కరోనా పేరుతో 21లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి ప్రకటించామని ఊరూ వాడా ప్రచారాన్ని ఎలా అదరగొట్టారో చూశాము. నరేంద్రమోడీ గడ్డం ఎందుకు పెంచుతున్నారో తెలియనట్లుగానే ఆ పాకేజి ఏమిటో దాని వలన సామాన్య జనానికి కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. అన్ని లక్షల కోట్లు ప్రకటించినపుడు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు పెట్టి వాక్సిన్లు వేయించలేని దుస్ధితిలో మోడీ సర్కార్‌ ఉందా ? వాక్సిన్లకోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. పద్దెనెమిదేండ్లు పైబడిన అందరికీ వేస్తే అదనంగా మరో పదివేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఈ మాత్రం భరించలేని స్ధితిలో కేంద్రం ఉందా ? లేదూ పిల్లలకూ వేస్తే మరొక పదివేల కోట్లు అవుతుంది, మరొక అంచనా ప్రకారం 80వేల కోట్లతో అందరికీ వేయించ వచ్చు, 138 కోట్ల మందికి ఆ మాత్రం ఖర్చు చేయలేరా ? ఐదులక్షల కోట్ల జిడిపి లక్ష్యమైనా, మరొకటైనా దేనికోసం ? అంబానీ, అదానీలకు కట్టబెట్టటానికా ? ఎందుకీ కక్కుర్తి పనులు ? ఇంతచిన్న తర్కాన్ని కూడా సలహాదారులు,మంత్రులు ఆలోచించే స్ధితిలో లేరా లేక చెబితే వినే పరిస్ధితి లేదా ? మోడీ సర్కార్‌ను తెరవెనుక నుంచి నడుపుతున్న సంఘపరివార్‌ మేథావులకు సైతం ఇది ఎందుకు తట్టలేదు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ, బిజెపిని వణికిస్తున్న ” టూల్‌కిట్లు ” -సరఫరాదారుగా న్యాయవ్యవస్ధ ?

04 Friday Jun 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP dangerous toolkits, Congress Toolkit case, Judiciary Activism, Supreme Court of India, Toolkits


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ ఏడు సంవత్సరాల ఏలుబడిలో అన్నీ విజయాలే అన్న మాటలు జనానికి ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. వంది మాగధులు కూడా పొగిడేందుకు వెనుకా ముందూ చూశారు. ఏడు సంవత్సరాలకు ముందు- ఏడు సంవత్సరాల తరువాత ఏమిటని ఎవరైనా పోల్చుకున్నారా ? కాస్త నిదానంగా ఆలోచించండి. కాంగ్రెస్‌ గురించి 2014కు ముందు బిజెపి మీడియా వారికి, పార్టీ ప్రచారదళాలకు ఇచ్చిన టూల్‌కిట్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే పార్టీని టూల్‌కిట్లు గజగజ వణికిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏడేండ్ల నరేంద్రమోడీ పాలనలో మిగతావన్నీ దిగజారుతుంటే ఇవి ఏటికేడు పెరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం స్వయంగా బిజెపి పార్టీ, సర్కార్‌ తయారు చేస్తున్నవే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, చర్యలను విమర్శించటం దేశద్రోహంగా భావిస్తున్న రోజుల్లో ఈ టూల్‌కిట్లకు న్యాయవ్యవస్ధలో వెలువడుతున్న తీవ్ర వ్యాఖ్యలు మరింతగా పదును పెడుతున్నాయా అనిపిస్తోంది. ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వ పరువు తీశారంటూ దిశ రవి అనే యువతి మీద రైతు ఉద్యమం గురించి టూల్‌కిట్‌ కేసు వేశారు. వివాహ సమయాల్లో పెళ్లికూతుళ్లకు పంపే మేకప్‌కిట్‌ గురించి, సుత్తీ, రెంచీలు, స్క్రూడ్రైవర్ల వంటి చిన్న పరికరాలు ఉండే దానిని టూల్‌ బాక్సు, కిట్‌ అంటారని తెలుసుగానీ మీడియా టూల్‌కిట్‌లో ఏముంటాయో తెలియక, ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారో అని చాలా మంది మధనపడ్డారు. కానీ బిజెపి వారు దిశ రవి కేసుతో తెలియని వారికి అవేమిటో తెలియ చేశారు.జనానికి విజ్ఞానం పంచారు.


తరువాత తమ నేత నరేంద్రమోడీ, ప్రభుత్వాన్ని బదనామ్‌ చేసేందుకు కాంగ్రెస్‌ టూల్‌కిట్లను పంపిణీ చేసిందని బిజెపి నేతలు ఆరోపించారు. చివరికి అది వారికే ఎదురు తన్నింది, పరువు తీసింది. దాంతో దాని వ్యూహకర్తలకు చెప్పుకోరాని చోట దెబ్బ తగిలింది. మా పేరుతో బిజెపి రూపొందించిన టూల్‌కిట్‌ అని కాంగ్రెస్‌ ఎదురు కేసు పెట్టింది. దాంతో కాంగ్రెస్‌ టూల్‌కిట్‌కు సంబంధించి బిజెపి నేతలు చేసిన ట్వీట్లకు మానిప్యులేటెడ్‌ మీడియా(మోసపుచ్చే సమాచారం) అని ట్విటర్‌ కంపెనీ ముద్రవేసి దేశ, విదేశీయులకు ఒకటూల్‌ కిట్‌ అందించింది. దీని అర్ధం ఏమంటే బిజెపి వారు చేసే ట్వీట్లు మోసపుచ్చేవి సుమా మీరు జాగ్రత్త అని చెప్పటమే. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడటం అంటే ఇదే. ఆ ముద్రను చెరిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ కంపెనీ మీద పోలీసులతో దాడి చేయించి భయపెట్టింది. ఇది మరింత పరువు తీసింది.


ఏడు సంవత్సరాలకు ముందు బిజెపి టూల్‌కిట్‌లో గుజరాత్‌ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, అచ్చేదిన్‌ వంటివి ఎన్నో ఉన్నాయి. అధికారానికి వచ్చిన తరువాత మేక్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా తోడయ్యాయి. ఏడు సంవత్సరాల తరువాత చూస్తే టూల్‌కిట్‌లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అన్నింటికంటే చిత్రం ఏమంటే ప్రపంచానికి, ప్రతిపక్షాలకు, ప్రచార, ప్రసార సాధనాలకు స్వయంగా ప్రభుత్వంతో పాటు కొన్ని సందర్భాల్లో న్యాయవ్యవస్ధ కూడా టూలుకిట్లు ఎలా అందించగలదో దాదాపు ప్రతి రోజూ చూస్తున్నాం.దిశ రవి ఒక సాధారణ యువతి, ఏమీ చేయలేదని కేసు దాఖలు చేశారు గానీ న్యాయమూర్తుల మీద కూడా పెడతారా ?


లోపభూయిష్టమైన వెంటిలేటర్లతో రోగుల మీద ప్రయోగాలు చేయవద్దని, వాటిని తాము అంగీకరించబోమని బొంబాయి హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇదీ కరోనా వైఫల్యాల టూల్‌కిట్టులో చేరింది. ఇదే వ్యాఖ్యను ప్రతిపక్ష పార్టీలు గనుక చేసి ఉంటే ఈ పాటికి కాషాయ దళాలు ఎలా రెచ్చిపోయి ఉండేవో తెలిసిందే. పిఎం కేర్‌ నిధులకు దాతలు ఉదారంగా నిధులు ఇస్తే వాటితో పనికి రాని వెంటిలేటర్లు కొనుగోలు చేయటం వెనుక అవినీతి, అక్రమాలు లేవంటే ఎవరైనా నమ్ముతారా ? అలాంటి నాసిరకం పరికరాలను రోగులకు అమర్చితే వారి ప్రాణాలు హరీమంటే దాన్ని హత్య అనాలా, స్వర్గానికి పంపారనుకోవాలా ? ఆ పుణ్యం ప్రధాని మోడీ ఖాతాలోనే వేయాలి, ఎందుకంటే ప్రధాని పేరుతోనే కదా కొనుగోలు చేస్తున్నది ! బొంబాయిహైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు అర్దం ఏమిటి ? మరట్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలకు నాసిరకం వెంటిలేటర్ల సరఫరా గురించి వచ్చిన వార్తల మీద ప్రజాప్రయోజన వ్యాజ్య విచారణ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరట్వాడా ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు పంపిన 150 వెంటిలేటర్లలో 113 లోపభూయిష్టమైనవని బయటపడింది. మిగిలిన 37ను ఆసుపత్రుల వారు అసలు రవాణా చేసిన డబ్బాల నుంచి బయటకు తీయనేలేదు. మే 28వ తేదీన ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. వెంటిలేటర్లను మామూలుగా పని చేసేట్లు చూస్తామని, వేటిలో అయినా లోపాలుంటే తొలగిస్తామని పేర్కొన్నది. అయితే ప్రధాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డిఆర్‌ కాలే మే 29వ తేదీన ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వెంటిలేటర్ల పనితీరు నమోదు చేసిన అంశాలను కోర్టుకు సమర్పిస్తూ మరమ్మతులు చేసిన తరువాత కూడా అవి సరిగా పని చేయటం లేదని పేర్కొన్నారు. సిబ్బందికి వాటిని పని చేయించటం తెలియదన్న కేంద్ర వాదనను తిప్పికొట్టారు. వాటిని గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతి సిఎన్‌సి అనే కంపెనీ సరఫరా చేసింది. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వైద్యులను పంపి పరిశీలించిన తరువాత లోపాలుంటే తయారీదారును బాధ్యులను చేస్తామని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తాము పూర్తిగా సంతృప్తి చెందేంత వరకు వాటిని వినియోగించబోమని అలాంటి వాటితో తీవ్ర ముప్పు ఉంటుందని మహారాష్ట్ర న్యాయవాది చెప్పారు. ఈ వాదనల తరువాత న్యాయమూర్తులు పైన పేర్కొన్న వ్యాఖ్యలను చేశారు. ఇది ప్రతిపక్షాల విమర్శలకు ప్రాతిపదిక అవుతుందా లేదా ? ఈ ఆయుధాన్ని ఎవరిచ్చారు, దానికి మూలం ఎవరు ? దీన్ని కుంభకోణం అనక ఏమంటారు ?


కేంద్ర ప్రభుత్వ వాక్సినేషన్‌ విధానం గురించి సాక్షాత్తూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన విషయాన్ని చెప్పుకోనవసరం లేదు. మూడు ధరల విధానం గురించి ప్రతిపక్షాలు విమర్శించాయంటే రాజకీయం అనుకుందాం, సుప్రీం కోర్టు సంగతేమిటి ? దేశంలో వేస్తున్న వాక్సిన్‌ ధరలు-విదేశాల్లో వాటి ధరలను పోలుస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించిందా లేదా ? వాక్సిన్లకోసం 35వేల కోట్లు కేటాయించినట్లు మోడీ సర్కార్‌ పెద్ద ప్రచార ఆయుధంగా వాడుకుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో చెప్పాలని నిలదీసింది. ఇప్పటి వరకు వాక్సిన్లను ఏ రోజు ఎన్ని కొన్నారో చెప్పమంది, ఆ మొత్తంతో 18-45 సంవత్సరాల వయస్సు వారికి వాక్సిన్లు ఎందుకు వేయకూడదో వివరించాలంది ? ఈ వివరాలన్నింటినీ సుప్రీం కోర్టు ముందు కూడా మూసిపెడుతుందా ? అంతకు ముందు ప్రతిపక్షాలు ఇదే డిమాండ్‌ చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. ఇది మీడియా, ప్రతిపక్షాలకు, అన్నింటికీ మించి అంతర్జాతీయంగా నరేంద్రమోడీ ప్రతిష్టను దెబ్బతీసే ఆయుధం కాదా ? అంతకు ముందు ఆక్సిజన్‌ సరఫరా విధానం లేదంటూ తానే ఒక కమిటీని వేసిన తీరు తెలిసిందే. మోడీ, బిజెపి విమర్శకులకు ఇవన్నీ బహిరంగంగా అందుతున్న ఆయుధాలు కావా ? టూల్‌ కిట్స్‌ కాదా ?వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేసిన వ్యాఖ్యలన్నింటినీ గుదిగుచ్చి చూస్తే తేలుతున్నదేమిటి ? గతంలో కాంగ్రెస్‌ తన విధానాలు, తీరుతెన్నులతో తానే ప్రతిపక్షాలకు టూల్‌కిట్లు అందించింది. ఇప్పుడు బిజెపి అదే బాటలో నడుస్తున్నది.

వాక్సిన్‌ విధానం గురించి రాష్ట్రాలు తీసుకోవాల్సిన వైఖరుల గురించి కేరళ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రాసిన లేఖలు కూడా టూల్‌కిట్లే. వాటి తయారీకి ముడి పదార్దాన్ని అందించిది నరేంద్రమోడీ సర్కారే కదా ! ప్రతిపక్షాలు బహిరంగంగా విమర్శిస్తాయి, బిజెపి ముఖ్యమంత్రులు లోలోపల కుమిలిపోతారు. పది సంవత్సరాల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరంలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన తీర్మానం పేరు ” మన సమాఖ్యవాదానికి పెను ముప్పు యుపిఏ ”. దానిలో ఏమి రాశారు ? రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నది, గవర్నర్లను రాజకీయకీయ ఏజంట్లుగా పని చేయిస్తున్నది. కాంగ్రెసేతర రాష్ట్రాలు చెబుతున్నదానిని ఆమోదించటం లేదు. ఇలా సాగింది, దానిలో నూటికి నూరు పాళ్లు వాస్తవం ఉన్నది.

కానీ ఇప్పుడు అదే నరేంద్రమోడీ చేస్తున్నది ఏమిటి ? ఆ కాంగ్రెస్‌ చెప్పుల్లోనే కాళ్లు దూర్చి అంతకంటే ఎక్కువ చేస్తున్నారా లేదా ? ఇదీ టూలుకిట్టే, ప్రతిపక్షాలకు ఇచ్చిందెవరు ? కేరళ గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని చదవకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ చేస్తున్న రాజకీయం చూస్తున్నాం. మహారాష్ట్ర గవర్నర్‌ రాజకీయాన్ని ఎలా రక్తి కట్టించారో చూశాము. తమ ఆదేశాలను ఖాతరు చేయలేదని బెంగాల్‌ ప్రధాన కార్యదర్శిని కేంద్రానికి రావాలని ఫర్మానా జారీ చేశారు. ప్రధాని మోడీ తమ మాటలు వినటం లేదని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత సొరేన్‌ బహిరంగంగానే చెప్పారు. మంత్రులను పక్కన పెట్టి తమ రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కేంద్ర మంత్రి మాట్లాడటం ఏమిటంటూ తమిళనాడు సర్కార్‌ ఆ సమావేశాన్నే బహిష్కరించింది. వైద్య, ఆరోగ్య విషయాలు రాష్ట్రాలకు సంబంధించినవి అని బిజెపి నేతలు ఎలుగెత్తి చాటుతున్న సమయంలోనే ఇది జరిగింది. విద్య రాష్ట్రాల అంశం కాదా ? కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ చేసిందేమిటి ? డిఎంకెకు టూల్‌కిట్‌ అందించట కాదా ?


కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో దాదాపు అందరూ ముస్లింలే ఉన్నారు. గుజరాత్‌ వివాదాస్పద బిజెపి రాజకీయ నేత ప్రఫుల్‌ పటేల్‌ను దాని సామంతుడిగా నియమించి అక్కడ చిచ్చు పెట్టారు. చివరికి స్ధానిక బిజెపి నేతలకే అది నచ్చక అనేక మంది పార్టీకి రాజీనామా చేశారు. జిఎస్‌టి నుంచి కోవిడ్‌-19 అత్యవసరాలను మినహాయించాలా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్రాల మంత్రులు కమిటీలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. ఇవన్నీ ప్రతిపక్షాలకు బిజెపి అందించిన టూల్‌కిట్స్‌ కాదా ?


సుప్రీం కోర్టు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు కేంద్రంలో ఉన్న బిజెపి లేదా రాష్ట్రాలలో ఉన్న బిజెపి, ఇతర పార్టీలకు చురకలు, అభిశంసనల వంటివే. అయితే గతంలో ఇదే న్యాయవ్యవస్దలో వెలువడిన తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను మరచిపోకూడదు. భారత్‌, అమెరికా, చైనా, పాకిస్ధాన్‌ రాజ్యాంగాలు ఏవైనా అక్కడ ఉన్న న్యాయవ్యవస్ధలు పాలకవర్గాలకు అనుకూలంగా పని చేసేవే అనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. చైనాలో కార్మికవర్గ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ వర్గానికి అనుకూలంగా అక్కడి వ్యవస్ధ ఉంటుంది. మిగతా దేశాలలో పాలకవర్గాలు పెట్టుబడిదారులు కనుక వాటికి అనుకూలంగా న్యాయవ్యవస్దలు ఉంటాయి. కొన్ని అంశాల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం అంటే పుట్టి మునుగుతుంది జాగ్రత్త పడమనే హెచ్చరిక అని ఎందుకు అనుకోకూడదు. గాంధీ పుట్టిన దేశంలోనే గాడ్సే కూడా పుట్టాడు. అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా పొగిడిన నోటితోనే ఆ రాజ్యాంగాన్నే దెబ్బతీసే శక్తులను భక్తితో కొలిచే ప్రబుద్దులను చూస్తున్నాము.

న్యాయవ్యవస్ధకు మొత్తంగా దురుద్దేశ్యాన్ని ఆపాదించటం లేదు. పాలనా విధానాలకు అనుగుణ్యంగా వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అందువలన ఆ వ్యవస్ధలోని వారి తీరు తెన్నులను విమర్శనాత్మకంగా చూడక తప్పదు. పైన చెప్పుకున్న న్యాయమూర్తుల వ్యాఖ్యలు, కోర్టుల నిర్ణయాలు నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూడకపోతే ఇబ్బందుల్లో పడతాము. రాజ్యాంగ పదవుల్లో, రక్షణలతో ఉన్న వారు రాజకీయ నేతలను పొగడటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి. పదవీ విరమణ చేయగానే ఎంపీ నామినేషన్‌ పోస్టును తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి గొగోరు న్యాయవ్యవస్ధకు, సమాజానికి ఎలాంటి సందేశమిచ్చారు. సుప్రీం కోర్టు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా 2020లో అంతర్జాతీయ న్యాయ సమావేశంలో మాట్లాడుతూ ” ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాతీయ ప్రశంసలు పొందిన దార్శనికుడు, ప్రపంచ దృష్టితో ఆలోచిస్తూ స్ధానికంగా పని చేసే బహుముఖ ప్రజ్ఞాశాలి ” అని ప్రశంసలు కురిపించారు. ఆ సమావేశంలో ఇరవై దేశాలకు చెందిన న్యాయమూర్తులు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఉన్నారు.( అలాంటి ప్రజ్ఞాశాలి కరోనా విషయంలో ఏం చేశారో యావత్‌ ప్రపంచం చూస్తున్నది) ఒక స్వతంత్ర వ్యవస్ధలో ఉన్నత స్ధానంలో ఉన్న వారే అలా పొగిడి ఎలాంటి సందేశాన్ని జనానికి పంపినట్లు ? అంతకు ముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉండి తరువాత పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎంఆర్‌ షా చెప్పిందేమిటి ? ” మోడీ ఒక ఆదర్శం, ఒక హీరో ” అన్నారు.


అధికారంలో ఉన్న వారిని పొగడటం ప్రయోజనాలు పొందటం నరేంద్రమోడీ హయాం కంటే ముందే కాంగ్రెస్‌ పాలనలోనే ప్రారంభమైంది.1980 ఎన్నికల్లో విజయం సాధించగానే ఇందిరా గాంధీని పొగుడుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పిఎన్‌ భగవతి ఒక లేఖ రాశారు. అత్యవసర సమయాల్లో పౌరుల ప్రాధమిక హక్కులను తీసివేయవచ్చని ఒక హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ కేసులో మెజారిటీ తీర్పు ఇచ్చిన వారిలో భగవతి ఒకరు . ఆ కేసులో జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా అసమ్మతి తీర్పు రాశారు. దానికి గాను ఆయనకు రావాల్సిన ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కలేదు. దానికి నిరసనగా ఆయన న్యాయమూర్తి పదవికి 1977లో రాజీనామా చేశారు. మరోవైపున ముగ్గురు న్యాయమూర్తుల సీనియారిటీని పక్కన పెట్టి భగవతిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. రాజకీయ నేతలను పొగిడే న్యాయమూర్తులకు ఇవన్నీ తెలియవా, ప్రభావితం చేయవా ? అలాంటి వారు పక్షపాతం లేని తీర్పులు ఇస్తారంటే జనం నమ్ముతారా ? న్యాయవ్యవస్ధ మీద నమ్మకం ఉంటుందా ? ఇప్పటికే మూడు రాజ్యాంగ వ్యవస్ధలోని కార్యనిర్వాహక వ్యవస్దను, శాసనవ్యవస్ధలను ఎలా నీరుగారుస్తున్నారో చూస్తున్నాము. న్యాయవ్యవస్ధను కూడా తమ అదుపులోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం ప్రారంభమైంది. పురుషులందరు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా న్యాయమూర్తులలో కూడా తేడాలున్నాయని ముందే చెప్పుకున్నాము. అదే పాలకులకు నచ్చదని కరోనా వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న న్యాయమూర్తుల మీద మింగా కక్కలేకుండా ఉన్న పాలకులను చూస్తున్నాము. తమ పీఠాలకు ముప్పు అనుకుంటే న్యాయవ్యవస్దను కూడా ఎలా దిగజారుస్తారో లాటిన్‌ అమెరికాతో సహా అనేక దేశాల్లో చూశాము. అలాంటి పరిస్ధితే మన దేశం కూడా రానుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్నాబ్‌ గోస్వామి బెయిలు వ్యవహారం : న్యాయవ్యవస్ధ తీరుతెన్నులపై మరో వివాదం !

14 Saturday Nov 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Arnab-Goswami-bail, JUDICIARY, Kunal Kamra, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు
వివాదాస్పద ప్రముఖ జర్నలిస్టు ఆర్నాబ్‌ గోస్వామి బెయిలు మంజూరు తీరు తెన్నులపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ విదూషకుడు(కమెడియన్‌) కునాల్‌ కమ్రా తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని శుక్రవారం నాడు ప్రకటించారు. మరోవైపున కుమ్రాపై చర్య తీసుకోవాలని కోరుతూ అనేక మంది న్యాయవాదులు, న్యాయ విద్యార్ధులు సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. దీంతో సర్వోన్నత న్యాయస్ధానం వాటిని ఏమి చేయనుందనే ఆసక్తి దేశంలోనూ, వెలుపలా నెలకొన్నది. కునాల్‌ చేసిన వ్యాఖ్యలపై కోర్టు దిక్కార చర్యలు తీసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ అనేక మంది చేసిన వినతికి అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సమ్మతి తెలిపిన ఒక రోజు తరువాత కునాల్‌ తన వైఖరిని బహిరంగంగా వెల్లడించారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవటం లేదా క్షమాపక్షణ గానీ చెప్పేది లేదన్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదుగానీ ఈ ఉదంతం మరోమారు సుప్రీం కోర్టు జనం నోళ్లలో నానేందుకు దారితీసింది. ఆర్నాబ్‌ వ్యవహారం వెనక్కు పోయి సుప్రీం కోర్టు-భావ ప్రకటనా స్వేచ్చ అంశం ముందుకు వచ్చింది. మీడియా విస్తరణ కారణంగా ఎన్నడూ లేని విధంగా సామాన్యులలో సైతం ఈ అంశాలు చర్చకు దారితీయనున్నాయి.


ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, తీర్పుల గురించి వెలువడుతున్న వ్యాఖ్యలు, విమర్శల మీద సామాజిక, సంప్రదాయ మాధ్యమాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదించకూడదు గానీ వారిచ్చిన తీర్పులపై మంచి చెడ్డల చర్చ, విమర్శలు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అంశాలు, తీర్పులు, బెయిలు మంజూరు సందర్భాలలో కొందరు న్యాయమూర్తుల తీరుతెన్నులు, వ్యాఖ్యలు ఆ హద్దును కూడా చెరిపి వేస్తున్న నేపధ్యంలో ఈ అంశాలను చూడాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్చ పరిధి,పరిమితుల మీద మరింతగా మరోమారు స్పష్టత రానుంది.
ఆర్నాబ్‌ గురించేగాక ఇతరుల వ్యక్తిగత స్వేచ్చ అంశాలపై సుప్రీం కోర్టు మౌనాన్ని విమర్శించకుండా వదలకూడదు కనుక నా వైఖరిలో ఎలాంటి మార్పులేదని కునాల్‌ మరోమారు స్పష్టం చేశారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు, జమ్మూ-కాశ్మీర్‌ ప్రత్యేక హౌదా రద్దు,ఎన్నికల బాండ్ల చట్టబద్దత లేదా ఇతర అనేక ముఖ్య అంశాలకు సమయాన్ని,దృష్టి సారించాల్సి ఉందని కూడా సుప్రీం కోర్టుకు సూచన చేశారు. సుప్రీం కోర్టు,న్యాయమూర్తులకు సంబంధించిన ధిక్కార అంశాలపై చర్యలు తీసుకోవాలని మూడవ పక్షం కోరేందుకు నిబంధనల ప్రకారం తొలుత అటార్నీ జనరల్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో ధైర్యంగా, అడ్డగోలుగా ఉన్నత న్యాయస్దానాన్ని, దాని న్యాయమూర్తులను విమర్శించవచ్చని జనాలు నమ్ముతున్నారు, అయితే అది ధిక్కార చట్టానికి పరిమితుల్లోనే ఉంటుందని వాటిని దాటితే శిక్ష అనుభవించాల్సి వస్తుందని అర్ధం చేసుకోవాల్సిన సమయమిదని అటార్నీ జనరల్‌ వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ఎవరికీ పేచీ లేదు, విబేధించటం లేదు. తీర్పులు, వాటిని వెలువరిస్తున్న న్యాయమూర్తుల తీరుతెన్నులు ఇటీవలి కాలంలో లేవనెత్తుతున్న అంశాల సంగతేమిటన్నది జనాల ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఈ అంశాన్ని విస్మరించగలమా ?


దేశ ఉన్నత న్యాయస్ధానం స్వతంత్రమైనది మరియు నిష్పాక్షికమైనది కాదు, కనుక దాని న్యాయమూర్తులు కూడా అంతే అనటం మొత్తం వ్యవస్ధ మీద తీవ్రమైన నింద మోపటమే, అయితే మరోవైపు అది పాలక బిజెపి కోర్టు అని, బిజెపి ప్రయోజనాలకే కోర్టు ఉన్నదని ఆరోపిస్తున్నారంటూ అటార్నీ జనరల్‌ కునాల్‌ ట్వీట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో జస్టిస్‌ ఎన్‌వి రమణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల మీద తీవ్రమైన ఫిర్యాదులే చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి, సిఎం ప్రధాన సలహాదారు మీద కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకొనేందుకు అనుమతి కోరిన న్యాయవాదికి రాసిన లేఖలో ఈ అంశం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నందున తాను అనుమతి ఇవ్వటం లేదని, ఎవరైనా నేరుగా చర్యలకు ఉపక్రమించవచ్చని అటార్నీ జనరల్‌ చెప్పిన విషయం తెలిసిందే. అక్టోబరు ఆరవ తేదీతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సలహాదారు అజరు కల్లం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఐదు వారాలు గడిచినా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ లేఖను ఏమి చేసిందీ తెలియదు.దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదును బహిర్గతం చేయటం, అది సంచలనం సృష్టించినదాని మీద ఏ చర్య తీసుకుంటారన్నది జనంలో సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంది.

జర్నలిస్టు ఆర్నాబ్‌ గోస్వామి తన రిపబ్లిక్‌ టీవీ స్టూడియో కోసం చేయించుకున్న పనికిగాను డబ్బు ఎగవేశారన్న ఆవేదనతో ఆర్కిటెక్ట్‌ అనవ్‌ నాయక్‌ 2018లో ఆత్మహత్యచేసుకున్నాడు. ఆ సందర్భంగా రాసిన లేఖలో ఆర్నాబ్‌ చెల్లించాల్సిన డబ్బు గురించి ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఆత్మహత్యకు ఆర్నాబే బాధ్యుడనే ఆరోపణను గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బిజెపి-శివసేన ప్రభుత్వం తిరస్కరించి కేసును మూసివేసింది. ఇటీవల శివసేన-కాంగ్రెస్‌-ఎన్‌సిపి సంకీర్ణ కూటమి ప్రభుత్వం దానిని తిరిగి విచారణకు చేపట్టి అర్నాబ్‌ను అరెస్టు చేసింది. బోంబే హైకోర్టు ఈ కేసులో బెయిల్‌ను తిరస్కరించి సెషన్స్‌ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే ఆర్నాబ్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టారు.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇద్దరు సభ్యులు సుప్రీం కోర్టు బెంచ్‌ విచారించి బెయిలు మంజూరు చేసింది.హైకోర్టును తప్పు పడుతూ వ్యక్తిగత స్వేచ్చ రక్షణకు హైకోర్టులు తమ పరిధిని వినియోగించాలని న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. తన జర్నలిజాన్ని లక్ష్యంగా చేసుకొని అరెస్టు చేశారని ఆర్నాబ్‌ కోర్టులో చేసిన వినతిని గమనంలో ఉంచుకొని చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు.


సుప్రీం కోర్టు తీరు తెన్నులపై సీనియర్‌ అడ్వకేట్‌ దుష్యంత దవే వ్యాఖ్యానిస్తూ వేలాది మంది పౌరులు జైల్లో ఉండి తమ కేసులను విచారించాలని వారాలు, నెలల తరబడి వేచి చూస్తుండగా ఆర్నాబ్‌ దరఖాస్తును వెంటనే చేపట్టటం తీవ్రంగా కలచివేసేదిగా ఉందని పేర్కొన్నారు. కునాల్‌ కమ్రా మీద కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతి ఇచ్చిన అటార్నీ జనరల్‌ చర్య దురదృష్టకరం, ప్రతికూల ఫలితాలనిస్తుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో న్యాయమూర్తులను బుద్ధిహీన వృద్దులు, ప్రజాశత్రువులు అని మీడియా వర్ణించినా అక్కడి సుప్రీం కోర్టు పట్టించుకోలేదు. కమ్రా మీద కోర్టు ధిక్కరణ చర్యకు ఉపక్రమిస్తే సుప్రీం కోర్టు అపహాస్యం పాలవుతుంది.బలవంతంగా గౌరవాన్ని పొందలేరు అని పేర్కొన్నారు.
కునాల్‌ కమ్రా మీద చర్య తీసుకోనట్లయితే సామాజిక మాధ్యమంలో ఉన్న మిలియన్ల మంది తమకు లేదా అభిమానించే వారికి తీర్పులు అనుకూలంగా రానట్లయితే న్యాయమూర్తులు, కోర్టుల మీద బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయటం మొదలు పెడతారని ఏజి అనుమతి కోరిన వారిలో ఒకరైన న్యాయవాది రిజ్వాన్‌ సిద్ధికీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పతాకం ఎగురుతూ కాషాయ రంగుతో ఉన్న సుప్రీం కోర్టు భవన చిత్రాన్ని పోస్టు చేస్తూ కోర్టు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అటార్నీ జనరల్‌కు న్యాయవాదులు రాసిన లేఖల మీద కునాల్‌ కమ్రా వ్యాఖ్యానిస్తూ దీన్ని కోర్టు ధిక్కరణ అని వర్ణించవద్దు,భవిష్యత్‌లో రాజ్యసభ స్ధాన ధిక్కరణ అని చెప్పండి అంటూ ట్వీట్‌ చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా రంజన్‌ గొగోరు పదవీ విరమణ చేసిన తరువాత రాజ్యసభకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.
ఈ దేశ సుప్రీం కోర్టు దేశంలో అత్యంత పెద్ద జోక్‌. ” జాతీయ ప్రాధాన్యత కలిగిన ” అంశాలపై సుప్రీం కోర్టు వేగంగా స్పందిస్తున్న తీరును చూస్తే కోర్టులలో మహాత్మాగాంధీ బొమ్మలను తొలగించి హరీష్‌ సాల్వే(అర్నాబ్‌ న్యాయవాది) చిత్రాలను పెట్టాలి. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ముందుగా వచ్చిన మొదటి తరగతి ప్రయాణీకులకు తొలుత మద్యం అందించే విమాన సహాయకుడి మాదిరి డివై చంద్రచూడ్‌ ఉన్నారు. అసలు ఎప్పుడూ విమానం ఎక్కని వారు లేదా సీట్లలో కూర్చోనివారిని వదలివేస్తారు. వెన్నెముక ఉన్న న్యాయవాదులందరూ సుప్రీం కోర్టు లేదా దాని న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడేముందు గౌరవనీయ అని సంబోధించటం మానుకోవాలి. చాలాకాలం క్రితమే ఆ భవనం నుంచి గౌరవం నిష్క్రమించింది. అని కునాల్‌ చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు.


అటార్నీ జనరల్‌ తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమంలో పెద్ద చర్చకు తెరలేపింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మీద చర్యకు తిరస్కరించినపుడు ఇంత వివాదం కాలేదు. టీవీ యాంకర్‌గా అర్నాబ్‌ గోస్వామి అత్యంత వివాదాస్పదుడు, ఏకపక్షంగా వ్యవహరించటం గురించి తెలిసినవారందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ చర్చలో అతని కంటే న్యాయవ్యవస్ధ మీద కేంద్రీకృతం కావటం గమనించాల్సిన అంశం. జర్నలిజానికి సంబంధం లేని ఒక నేరంతో ప్రమేయం ఉన్న కేసులో వ్యక్తిగత స్వేచ్చ గురించి సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ స్పందనకు మూలం. సాధారణంగా ఒక బెయిలు దరఖాస్తును వేగంగా పరిష్కరిస్తే ప్రశంసలు సహజం, అర్నాబ్‌ విషయంలో దానికి భిన్నంగా జరిగింది.
హత్రాస్‌ అత్యాచారం, హత్య ఉదంతంలో వార్తలు సేకరించేందుకు ఆ గ్రామం వెళుతున్న జర్నలిస్టు సిద్దికీ కప్పన్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసుల అక్రమంగా నిర్బంధించారు. అతన్ని విడుదల చేయాలన్న హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జర్నలిజానికి సంబంధం లేని కేసులో జర్నలిస్టు ఆర్నాబ్‌కు వెంటనే బెయిలు మంజూరు చేసింది. ఆర్నాబ్‌ పిటీషన్‌లో ఉన్న లోపాలను కూడా పట్టించుకోకుండా కోర్టు ప్రారంభమైన వెంటనే బెంచ్‌ మీద పెట్టారు.
సుప్రీం కోర్టులో బెయిలు దరఖాస్తులు ఎన్ని పరిష్కారం కాకుండా ఉన్నాయి ? ఒక దరఖాస్తు పరిష్కారానికి సగటున ఎంతవ్యవధి తీసుకుంటారు అంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తానని ఒకరు ట్వీట్‌ చేశారు. కొందరు వ్యక్తుల దరఖాస్తులను అత్యవసరంగా తీసుకోవాల్సిన మరియు వ్యక్తిగత స్వేచ్చలకు రక్షణ కల్పించాల్సిన నేపధ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు అవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణుడైన ఆర్నాబ్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ మనుస్మృతి ప్రకారం ఉద్దావ్‌ థాకరేను చంపివేయమని అదృష్టం కొద్దీ డివై చంద్రచూడ్‌ ఆదేశాలు జారీ చేయలేదు అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. బిజెపి+ఆర్‌ఎస్‌ఎస్‌+ఎన్నికల కమిషన్‌+సిబిఐ+ఐటి+ఇడి+న్యాయవ్యవస్ధ+ మీడియా+ఫేస్‌బుక్‌లతో మహాకూటమి ఉందని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఒక ట్వీట్‌ ఉంది.


సుధా భరద్వాజ 807 రోజులు, ఆసిఫ్‌ సుల్తాన్‌ రెండు సంవత్సరాలు, షజ్రీల్‌ ఇమామ్‌ 286, మీరన్‌ హైదర్‌ 223, ఇష్రాత్‌ జహాన్‌ మరియు ఖాలిద్‌ షఫీ 255, ఆసిఫ్‌ తన్హా 178, దేవాంగ కలితా మరియు నటాషా నర్వాల్‌ 171, ఉమర్‌ ఖాలిద్‌ 58, కిషోర్‌ చంద్ర వాంగ్‌ఖెమ్‌ 30 రోజుల నుంచి జైల్లో బెయిలు దరఖాస్తులతో ఉన్నారు అని ఒకరు ట్వీట్‌ చేశారు. వీరంతా నేరాలు చేశారని, వీరిని ఆర్నాబ్‌ను ఒకే గాటన కట్టటం ఏమిటని కొందరు ప్రశ్నించారు. నేరం రుజువు కానంత వరకు ఎవరూ దోషులు కానప్పుడు కొందరికి సంవత్సరాల తరబడి బెయిలు నిరాకరణ, ఆర్నాబ్‌కు అంతవేగంగా ఎలా ఇచ్చారనేదే ప్రశ్న. ఎనభైనాలుగు సంవత్సరాల పార్కిన్సన్‌ వ్యాధిగ్రస్తుడైన స్టాన్‌ స్వామి బెయిల్‌ పిటీషన్‌ ఇరవై రోజులు ఆలశ్యం చేసిన కోర్టు ఆర్నాబ్‌ విషయంలో అంతవేగంగా కదలటాన్ని ఎలా సమర్ధించుకుంటుంది ? రిపబ్లిక్‌ టీవీలో నిత్యం విద్వేష పూరిత ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్నాబ్‌ వ్యక్తిగత స్వేచ్చకు ఇతరులకు వివక్ష ఎందుకు ?


ఇటీవలి కాలంలో కొన్ని బెయిలు ఉత్తరువుల తీరు తెన్నులు విమర్శకు గురికావటం ఆర్నాబ్‌ వ్యవహారంతో ఆరంభం కాలేదని గ్రహించాలి. బిజెపి మాజీ ఎంపీ అయిన సోమ్‌ మరాండీ మరొక ఐదుగురికి ఒక కేసులో బెయిలు మంజూరు చేస్తూ వారంతా 35వేల రూపాయల చొప్పున పిఎం కేర్‌ నిధికి జమచేయాలని, ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. పిఎం కేర్‌ నిధి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర చెప్పటంతో వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కరోనా పోరులో భాగంగా ఆరోగ్యసేతు యాప్‌ను కోట్లాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నది కూడా తెలిసిందే. ఇదే రాష్ట్రంలో సామాజిక మాధ్యమంలో ముస్లింలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయిన రిచా భారతి ఐదు గ్రంధాలయాలకు ఖురాన్‌ పంపిణీ చేయాలని బెయిలు షరతుగా ఒక మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. బెయిలు రాజ్యాంగంలోని హక్కుల నిబంధనల మేరకు ఇవ్వాలా లేక న్యాయమూర్తుల విచక్షణ మేరకా అన్నది ప్రశ్న.

యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించిన జెఎన్‌యు మాజీ విద్యార్ధి నేత కన్నయ్య కుమార్‌ మీద మోపిన కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా రాణి 27పేజీల సుదీర్ఘ బెయిలు ఉత్తరువు జారీ చేశారు. సాధారణంగా బెయిలు ఉత్తరువులు చిన్నవిగా ఉంటాయన్నది తెలిసిందే. అతని మీద మోపిన నేరం రుజువుకాక ముందే తుది తీర్పు మాదిరి బెయిలు ఉత్తరువులో అసందర్భంగా అనేక అంశాలను పేర్కొన్నారు. కన్నయ్య కుమార్‌ మీద సంఘపరివార్‌ శక్తులు చేసిన ప్రచారంలోని అనేక అంశాలలోని జాతి వ్యతిరేక ధోరణులు, సరిహద్దులను సిపాయిలు కాపాడటం-వాటికి భావ ప్రకటనా స్వేచ్చను జోడించటం వంటివన్నీ బెయిలు ఉత్తరువులో చేసుకున్నాయి.అన్నింటికీ మించి పదివేల రూపాయలను జెఎన్‌యు చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే విధంగా బిజెపి నేత స్వామి చిన్మయానందపై వచ్చిన అత్యాచార కేసులో బెయిలు సందర్భంగా కూడా అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి 25పేజీల ఉత్తరువులో బాధితురాలి మీద అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేశారు.
ఆరు సంవత్సరాల క్రితం పూనాలో మోషిన్‌ షేక్‌ అనే ఐటి ఇంజనీర్‌ను ముగ్గురు హత్య చేశారు.వారికి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. హతుని తప్పిదం ముస్లిం కావటం, ఆకుపచ్చ రంగుచొక్కా ధరించటం, గడ్డం పెంచుకోవటం, నిందితులకు గతంలో ఎలాంటి నేర చరిత లేదు. మతం పేరుతో వారిని రెచ్చగొట్టినట్లుగా దాంతో వారు నేరానికి పాల్పడినట్లుగా కనిపిస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు.మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. దేశంలో ఫలానా రంగు చొక్కా ధరించకూడదని, గడ్డం పెంచుకోకూడదనే నిబంధనలేవీ లేవు. రెచ్చగొట్టటం లేదా రెచ్చిపోవటం అనేది ఎటు నుంచి ఎటు జరిగినా ఉత్తిపుణ్యానికే జరగవు. ఈ కేసులో నిందితులు వివాదాస్పద, విద్వేషాలను రెచ్చగొడుతుందన్న విమర్శలు ఉన్న హిందూ రాష్ట్రీయ సేన సభలో ఉపన్యాసాలు వినేందుకు వెళ్లారన్నది వెల్లడైంది.


మావోయిస్టు సానుభూతి పరులనే పేరుతో హత్యవంటి తీవ్రనేర ఆరోపణలు లేకపోయినా, కుట్ర ఆరోపణలతో చక్రాల కుర్చీ ఉంటే తప్ప కదల్లేని అనారోగ్యంతో ఉన్న సాయిబాబా వంటి వారితో పాటు ఎనిమిది పదుల వయసున్న వరవరరావు వంటి వృద్దులకు కోర్టులు బెయిలు నిరాకరిస్తున్నాయి. గుజరాత్‌ మారణకాండలో నరోదా పాటియా ఉదంతంలో శిక్ష పడిన బిజెపి నేత మాయా కొడయానీకి అనారోగ్యం పేరుతో బెయిలు మంజూరు చేశారు. ఆ మారణకాండలోనే 33 మందిని సజీవంగా దహనం చేసిన సరదార్‌పైరా ఉదంతంలో శిక్షపడిన 13మందికి అసాధారణరీతిలో బెయిలు మంజూరు చేస్తూ గుజరాత్‌ వెలుపల సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇలాంటి ఉదంతాలలో బెయిలు నిందితులు ఎవరో చెప్పనవసరం లేదు. ఆర్నాబ్‌ గోస్వామి వ్యవహారం బహిరంగ రహస్యం. అతని అరెస్టుకు నిరసనగా బిజెపి నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాశ్మీరులో కథువా, హత్రాస్‌ ఉదంతాలలో నిందితులు నిర్దోషులు అంటూ అదే బిజెపి నేతలు వెనుక వేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కనుకనే కోర్టులు, న్యాయమూర్తులు ఎవరికోసం ఉన్నాయి, ఎవరికోసం పని చేస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు తలెత్తుతున్నాయి. న్యాయవ్యవస్ధ కూడా దోపిడీ వర్గపు కనుసన్నలలోనే నడుస్తుందని ప్రపంచంలోని కమ్యూనిస్టుల సాధారణ అభిప్రాయం. దీనితో ఏకీభవించవచ్చు, తిరస్కరించవచ్చు. ఐదు దశాబ్దాల క్రితం దేశ రాజ్యాంగం మీద తమకు విశ్వాసం లేదంటూ తుపాకి పట్టిన నగ్జల్స్‌ కోర్టుల మీద విశ్వాసం లేదని తమపై మోపిన కేసుల సందర్భంగా చెప్పారు. ఒక అయిడియా మీ జీవితాన్నే మార్చి వేస్తుందన్నట్లుగా నేడు వెలువడుతున్న తీర్పులు, వాటి తీరుతెన్నులు కమ్యూనిస్టులు చెప్పేపని లేకుండానే, వారితో విబేధించేవారితో సహా అనేక మందికి న్యాయవ్యవస్ధ మీద విశ్వాసం పోతోంది. అందువలన తిరిగి దాని మీద విశ్వాసాన్ని పునరుద్దరించాలంటే ఎక్కడ ప్రారంభించాలి? విత్తు ముందా -చెట్టు ముందా ? కునాల్‌ కమ్రా వంటి వారిని శిక్షించా లేక అలాంటి వారి వ్యాఖ్యలకు తావివ్వని తీర్పులు, న్యాయమూర్తుల తీరుతోనా ? కునాల్‌ మీద కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు. గతంలో ప్రశాంత భూషణ్‌ మీద వచ్చిన కేసుకు దీనికి ఎంతో తేడా ఉంది. దాఖలైన కేసును విచారణకు చేపడితే మీడియా, ఇతర అన్ని రంగాలలో మరింత తీవ్రమైన చర్చకు దారి తీయటం అనివార్యం. ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించినట్లు అది ప్రతికూల ఫలితాల నిస్తుందా లేక అటార్నీ జనరల్‌ వంటి వారు చెబుతున్నట్లు సానుకూల ఫలితాలనిస్తుందా ? మరి కొంత మందికి న్యాయవ్యవస్ధల మీద విశ్వాసాన్ని పోగొడుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !
  • అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !
  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: