• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Telangana CM

 వేతన వాయిదా సరే, ఏపి మూడు రాజధానులు, తెలంగాణా కొత్త సచివాలయం సంగతేమిటి !

31 Tuesday Mar 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, employees, History, NATIONAL NEWS, Opinion, Pensioners, Telangana

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, AP CM YS Jagan, Government Employees wage deferment, KCR, Telangana CM

KCR, KTR extend wishes to YS Jagan for landslide victory in AP ...

ఎం కోటేశ్వరరావు
ఉద్యోగుల వేతనాల కోత పెట్టవద్దు, ఉద్యోగాలను రద్దు చేయవద్దు అని ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని కంపెనీలను కోరారు. ఎంత మంది దయగల యజమానులు దాన్ని అమలు జరుపుతారో చూడాల్సి ఉంది. అనేక మంది ప్రధాని, ముఖ్య మంత్రుల సహాయ నిధులకు విరాళాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప తమ సంస్ధలలో వేతనాలు, ఉద్యోగాల గురించి ఏమి చెబుతున్నారో మనకు తెలియదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత అంటూ మంగళవారం నాడు తెలంగాణా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. తీరా ప్రభుత్వ ఉత్తరువును చూసే ఎంతశాతం వేతనాల చెల్లింపువాయిదా వేస్తున్నారో దానిలో పేర్కొన్నారు. కోతకు వాయిదాకు తేడా ఉంది. కోత విధిస్తే తిరిగి రాదు, వాయిదా అయితే వస్తుంది. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి చెల్లించే వేతనాలకు ఇది వర్తిస్తుందని, తదుపరి ఉత్తరువులు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ఎన్నినెలలు అన్నది చెప్పకపోవటంతో పాటు వాయిదా వేసిన వేతన మొత్తాలను ఎప్పుడు, ఎలా తిరిగి చెల్లించేది కూడా సదరు ఉత్తరువులో లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది.
విపత్తు సమయాలలో అలాంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సిబ్బంది ప్రతినిధులతో చర్చించి విధి విధానాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తే అదొకతీరు. లేనపుడు ఏకపక్ష నిర్ణయంగానే పరిగణించాల్సి ఉంది. వేతనాలతో పాటు పెన్షన్లు కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ, శాసనమండలి, అన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల మొత్తం వేతనాల్లో 75శాతం, అఖిలభారత సర్వీసు తరగతికి చెందిన వారికి 60శాతం, ఇతర ఉద్యోగులలో నాలుగవ తరగతికి చెందిన వారికి మినహా మిగిలిన వారందరికీ 50శాతం, నాలుగవ తరగతి వారికి పదిశాతం వేతన చెల్లింపు వాయిదా ఉంటుంది. పెన్షన్లలో కూడా ఇదే శాతాలలో వాయిదా ఉంటుంది. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు సైతం ఎలాంటి మినహాయింపు లేదు.
ఆర్ధిక పరిస్ధితి అంతా సజావుగా ఉంది అని ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మార్చినెల 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 1,42,492 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 1,82,914 కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈలోగా ఉద్యోగుల వేతనాల్లో సగాన్ని వాయిదా వేయాల్సిన అగత్యం ఏమి వచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. ఇంతకంటే తీవ్ర పరిస్ధితిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ ఒక్క నెల సగం వేతనం ఇస్తామని, మిగిలిన సగం మొత్తాన్ని పరిస్ధితి మెరుగుపడిన తరువాత సర్దుబాటు చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ఉద్యో గుల సంఘనేత ఒకరు చెప్పారు. తెలంగాణాలో నిరవధికంగా వేతన వాయిదాను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వెల్లడించినదాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నందున తాము సీఎం సూచనకు అంగీకరించామని వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే జీతం రెండు విడతలుగా ఇస్తామని సీఎం చెప్పినట్టు సూర్యనారాయణ వివరించారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతం నిధులు సర్దుబాటు అనంతరం ఇస్తామని తెలిపారని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలుగా భావించబడుతున్నవారితో అయినా ఎందుకు సంప్రదించలేదన్నది ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌ అయినా తెలంగాణా అయినా ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, పెన్షనర్లను తాత్కాలికంగా అయినా ఇబ్బందులకు గురి చేశారని చెప్పక తప్పదు. ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదా మొత్తాలు, ఇతర అవసరాలకు వేసుకున్న కుటుంబ బడ్జెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి సలహాదారులు, ఉన్నత అధికారులకు తెలియదా ? వాయిదా వేసిన వేతన మొత్తాల మేరకు కూడా రిజర్వుబ్యాంకు నుంచి రుణం లేదా అడ్వాన్సు తెచ్చుకోలేని దుస్ధితిలో ప్రభుత్వాలు ఉన్నాయా లేక వడ్డీ భారాన్ని ఉద్యోగుల మీద మోపే ఎత్తుగడ అనుకోవాలా ?
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందుగా అసోం ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలనుంచి కొంత మినహాయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో ఆర్ధిక మంత్రి చర్చలు జరిపి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిరోధ చర్యల్లో నిమగమైన వారికి వేతన మినహాయింపు వర్తింప చేయరాదని కోరినట్లు ఉద్యోగ సంఘనేతలు ప్రకటించారు.వేతనాన్ని పది నుంచి ఇరవై శాతం వరకు మార్చినెలకు మినహాయిస్తారు. ఆ మొత్తానికి నాలుగున్నరశాతం వడ్డీతో తరువాత ఉద్యోగులకు చెల్లిస్తారు.
మరో రాష్ట్రం మహారాష్ట్రలో ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60శాతం, ఒకటి, రెండవ తరగతి అధికారుల వేతనాల్లో 50, మూడవ తరగతి ఉద్యోగులకు 25శాతాన్ని మినహాయిస్తారు, ఇతరులకు ఎలాంటి మినహాయింపులేదు. వీటిని చూసినపుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్‌జివోలు, ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితం అవుతారన్నది స్పష్టం. పెన్షనర్ల సంగతి చెప్పనవసరం లేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది చివరిలో నిధులకు కటకటను ఎదుర్కొంటాయి. అందుకు గాను ముందుగానే బిల్లుల చెల్లింపు, కొత్తగా పనుల మంజూరు, వాహనాల కొనుగోలు వంటి కొన్ని చర్యలను ప్రకటించటం సర్వసాధారణం. ఇప్పుడు ఆర్ధిక సంవత్సరం ఆరంభమే ఉద్యోగుల వేతనాల వాయిదాతో ప్రారంభమైంది. ఇది మంచి సూచిక కాదు. తెలంగాణాలో ప్రస్తుతం రెండు విడతల కరవు భత్యం బకాయి ఉంది, ఇప్పటికే ప్రకటించిన మేరకు పిఆర్‌సి డిసెంబరు వరకు వెలుగు చూసే అవకాశం లేదు. మధ్యంతర భృతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇతర దేశాల్లో ఉద్యోగులు, కార్మికుల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. లాటిన్‌ అమెరికాలోని పరాగ్వేలో ప్రభుత్వ రంగ సిబ్బందికి మూడునెలల పాటు వేతనాల కోతను ప్రకటించారు. దేశాధ్యక్షుడు పొందుతున్న వేతనానికి మించి ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉన్నతాధికారులెవరికీ వేతనాలు చెల్లించకూడదన్నది వాటిలో ఒకటి.దేశంలో ప్రకటించిన కనీస వేతనాల కంటే ఐదు రెట్లు ఎక్కువ పొందే వారికి పదిశాతం, పది రెట్లు పొందేవారికి 20శాతం వేతన కోత విధిస్తారు.ప్రజారోగ్యవ్యవస్ధను మెరుగుపరచే పేరుతో ఈ కోత విధించారు.

Telangana government lifts ban on transfer of employees till June ...
సింగపూర్‌లో కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి జాతీయ వేతన మండలి కొన్ని సూచనలు చేస్తూ ఆయా రంగాలలో ముందున్నవారు నమూనాగా నిలవాలని కోరింది. ఉద్యోగుల వేతనాల కోత చర్యలకు ముందు కంపెనీలు యాజమాన్య పొదుపు సంగతి చూడాలన్నది సూచనలలో ఒకటి. యూనియన్లతో వేతన సంప్రదింపులకు ముందు కంపెనీల పరిస్ధితి గురించి అన్ని విషయాలు వివరించాలి. అన్ని చర్యల తరువాతే ఉద్యోగుల తొలగింపు ఉండాలని ప్రభుత్వం కంపెనీలకు చెప్పాలి. ముందు కంపెనీలు వేతనేతర ఖర్చు తగ్గించాలి. మానవ వనరులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తే ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ప్రభుత్వ సాయాన్ని పొందాలి. మూడవదిగా వేతన కోతలుండాలి. తక్కువ వేతనాలు పొందేవారి మీద నామమాత్ర ప్రభావం పడాలి. వేతనాలు పెరిగే కొద్దీ కోతలు పెరగాలి. తప్పనిసరి అయితే ఉద్యోగుల తొలగింపు బాధ్యతాయుత పద్దతిలో జరగాలి.
ఈ నేపధ్యంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పాలకులు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకొని ఉండాల్సింది. ముందుగా ప్రభుత్వ శాఖలలో దుబారా తగ్గింపు చర్యలు ప్రకటించాలి. వాటి గురించి ఉద్యోగ సంఘాలు, సామాజిక, రాజకీయ, ప్రజాసంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొని ఉంటే కరోనాపై ఏకోన్ముఖ పోరాటం చేస్తున్న సందేశం జనంలోకి వెళ్లి ఉండేది. తెలంగాణాలో అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చయ్యే కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం ఇంతవరకు విరమించుకోలేదు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అయినా ఆ పని చేసి ఉంటే గౌరవ ప్రదంగా ఉండేది. కొత్త అసెంబ్లీ, శాసనమండలి భవనాలు, కొత్త హైకోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు కూడా అలాంటివే. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఉద్యోగులకు వేతనాలకే డబ్బు లేని స్ధితిలో మూడు రాజధానుల ప్రతిపాదనలను రద్దు చేసుకొని ప్రతిష్టకు పోకుండా వివాదం నుంచి గౌరవ ప్రదంగా బయట పడేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది.
ప్రభుత్వాలు తీసుకొనే వేతన చెల్లింపు వాయిదా చర్యవలన ఉద్యోగులు తాత్కాలికంగా ఇబ్బంది పడినా బకాయిలను తరువాతైనా పొందుతారు. కానీ ప్రయివేటు రంగంలోని వారి పరిస్ధితి ఏమిటి ? అంత పెద్ద ప్రభుత్వాలే వాయిదాలు వేస్తుంటే మేము వాయిదాలు పని చేయని రోజులకు అసలు చెల్లించలేము అంటే కార్మికులు, ఉద్యోగులకు దిక్కేమిటి ? సాధారణ రోజుల్లోనే కనీస వేతనాలు అమలు జరపని సంస్ధల మీద ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు పని చేయని కాలానికి వేతనం ఇప్పించే చిత్త శుద్ధి పాలకులకు ఉందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మామాా అల్లుళ్ల బడ్జెట్ల మతలబు ఏమిటి !

08 Sunday Mar 2020

Posted by raomk in Current Affairs, Economics, History, Opinion, Others, Telangana

≈ Leave a comment

Tags

T Harish Rao, Telangana Budget 20-21, Telangana CM

Image result for harish rao budget

ఎం కోటేశ్వరరావు
రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత గత బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెడితే వచ్చే ఏడాది బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి టి హరీష్‌ రావు ప్రవేశపెట్టారు. వారిద్దరూ మేనమామ-మేన అల్లుళ్లన్న సంగతి తెలిసిందే. ఇద్దరి బడ్జెట్లకు ఏమైనా తేడా ఉందా ? రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అన్నది ఒక్కసారి విహంగ వీక్షణం చేద్దాం.
ఆర్ధిక మంత్రులు అంటేనే అంకెల గారడీ ఆటగాళ్లు. ఈ వర్ణనలో కొత్త దనం ఏమీ లేదు గానీ గారడీ జరిగిందనే చెప్పాలి. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయాల్సి వస్తే బడ్జెట్‌లో పెరుగుదల పెద్దగా లేదు. ఖర్చు చూస్తే గతం కంటే తగ్గిందన్న పచ్చినిజాన్ని చెప్పకతప్పదు. గతేడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో 1,82,017 కోట్ల రూపాయలను ప్రతిపాదిన కెసిఆర్‌ తరువాత వాస్తవ బడ్జెట్‌ పేరుతో 1,46,492 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఆ మొత్తాన్ని 1,42,152 కోట్లుగా సవరించిన అంచనాగా పేర్కొన్న హరీష్‌ రావు తన బడ్జెట్‌ 1,82,914 కోట్లుగా ప్రతిపాదించారు. దీనిలో వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తారో ఏడాది తరువాత గానీ తెలియదు.2018-19 సంవత్సర బడ్జెట్‌ను 1,74,454 కోట్లుగా ప్రతిపాదించి దాన్ని 1,61,223 కోట్లకు సవరించారు, దాన్నింకా సవరించి తాజా తాత్కాలిక లెక్కల ప్రకారం ఖర్చు చేసిన మొత్తం 1,57,150 కోట్ల రూపాయలు. అందువలన మార్చినెలతో ముగిసే బడ్జెట్‌ ఖర్చు 1,42,152 కోట్ల కంటే తక్కువే ఉంటుంది తప్ప పెరిగే అవకాశం లేదు. అంటే అంతకు ముందు ఏడాది కంటే కనీసం 20వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గిపోయినట్లే. ఇది అభివృద్ధి అని పాలకులకు అనుగుణ్యంగా ఎవరైనా పొగడకపోతే సన్నాసుల భాష రంగంలోకి వస్తుంది.
తగ్గింపు, కోతలు దేనికి ఉంటాయంటే సంక్షేమ కార్యక్రమాలకు పెడితే జనం ఓట్లు వేయరు గనుక ఆస్ధుల సృష్టికి తోడ్పడే పెట్టుబడి వ్యయాలకు కోత పెడుతున్నారు. అది ఎంతకాలం అంటే ఎంతకాలం సాగితే అంతకాలం .2017-18లో పెట్టుబడి వ్యయం ఖరారైన లెక్కల ప్రకారం రూ.57,768 కోట్ల రూపాయలైతే, తరువాత అది గణనీయంగా పడిపోయింది. 2018-19 బడ్జెట్‌ అంచనా రూ.48,999 కోట్లు కాగా సవరించిన మొత్తం రూ.42,196 కోట్లు, 2019-20 బడ్జెట్‌ ప్రతిపాదన రూ.35,436 కోట్లు కాగా సవరించిన ఖర్చు రూ.13,165 కోట్లు మాత్రమే. అయినా వచ్చే ఏడాది దాన్ని రూ.22,061 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే రాబోయే సంవత్సరం కూడా కాంట్రాక్లర్ల నుంచి ప్రజాప్రతినిధులు కమిషన్లు పొందే అవకాశాలు మరింత తగ్గిపోతాయనే చెప్పాలి. ఎన్నికల్లో వారు పెట్టిన పెట్టుబడులను రాబట్టుకొనేందుకు ఏ ఇతర మార్గాలు వెతుక్కుంటారో చూడాలి. నిధులు లేకపోతే పనులు జరగవు, కాంట్రాక్టర్లు ఉండరు, కమిషన్లు ఉండవు. సంక్షేమ పధకాలకు కేటాయిస్తున్నందుకు సంతోషించాలా, ఆస్ధుల కల్పన నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసించాలా ?
రాబడులు పరిమితం అయి, పెట్టుబడి వ్యయాన్ని మరింతగా కుదించిన తరువాత సంక్షేమ పధకాలకే కోత. రెండు పడక గదుల ఇండ్ల గురించి కొండంత రాగం తీసిన కెసిఆర్‌ ఆచరణలో వైఫల్యం కావటానికి కారణమిదే. అందుకే ఈ బడ్జెట్‌లో కూడా స్వంత ఇంటి స్ధలం ఉన్నవారిని కట్టుకొనేందుకు ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. లేని వారికి ఇండ్ల స్ధలం ఎందుకు ఇవ్వరు ? అయితే పెట్టుబడి వ్యయం బడ్జెట్‌ కేటాయింపుల్లో తగ్గుతున్నప్పటికీ నీటి పారుదల మరికొన్ని రంగాలలో అప్పులు తెచ్చి పెట్టుబడి వ్యయంగా ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులకు వడ్డీ చెల్లింపు ఉండదు, బయటి నుంచి తెచ్చే అప్పులకు వడ్డీ అదనం. ఇది వినియోగదారుల మీద లేదా అంతిమంగా ప్రభుత్వం మీద భారంగా మారనుంది. ఈ ధోరణి పెరిగితే రాబోయే రోజుల్లో వినియోగ చార్జీల మోత మోగటం లేదా ఎత్తి పోతల వంటి పధకాలు నామమాత్రం కావటం లేదా మూతపడటం తప్ప మరొక మార్గం ఉండదు.
స్వంత డబ్బా కొట్టుకోవటంలో పాలకులకు మించిన వారు మరొకరు ఉండరు. తెలంగాణా అందుకు మినహాయింపు కాదు, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామంటారు. కొన్ని కీలక రంగాలలో కేటాయింపులే తక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు గ్రామీణాభివృద్ధిని తీసుకుంటే 2019-20 బడ్జెట్‌లో కేటాయింపు 3.5శాతం అయితే అంతకు ముందు సంవత్సరంలో వివిధ రాష్ట్రాల సగటు 6.1శాతంగా ఉంది.ఇదే విధంగా విద్యకు 7.5 అయితే రాష్ట్రాల సగటు 15.9, ఆరోగ్యానికి 4శాతం అయితే రాష్ట్రాల సగటు 4.5శాతంగా ఉంది. పెన్షన్ల వంటి వాటికి అదనంగా ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. హరీష్‌ రావు ప్రసంగంలో చెప్పినదాని ప్రకారం గత ఐదు సంవత్సరాలలో స్వంత రాబడి సగటు పెరుగుదల రేటు 21.5శాతం ఉంటే ఫిబ్రవరి నెలలో 6.3శాతానికి పడిపోయింది. ఈ పూర్వరంగంలో వచ్చే ఏడాది బడ్జెట్‌ లోటును రూ.33,191 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని పూడ్చుకోవాలంటే ఉన్న అవకాశాలేమిటి? అప్పులు తీసుకురావటం, కెసిఆర్‌ చెప్పినట్లు విద్యుత్‌ ఛార్జీలు, మరోసారి ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపు, ఇంకా తన పొదిలో ఏమున్నాయో తెలియదు. మరో మార్గం ప్రభుత్వ ఆస్తులు అవి భూములు లేదా మిగిలిన ప్రభుత్వరంగ సంస్దల అమ్మకం వలన గానీ రాబట్టుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాని ప్రకారం పన్ను ఆదాయాన్ని 71వేల కోట్ల నుంచి 85వేల కోట్లుగానూ, పన్నేతర ఆదాయం 12 నుంచి 30వేల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఈ మొత్తాలను పైన పేర్కొన్న వనరుల నుంచి సేకరిస్తారు. ఇప్పటికే తెలంగాణాలో జనం తప్పతాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వారి నుంచి ఈ ఏడాది రూ.12,600 కోట్లను రూ.16,000 కోట్లకు పెంచనున్నారు. ఇది తాగుడును మరింతగా పెంచటం లేదా మద్యం రేట్లను పెంచటంద్వారాగానీ రాబడతారు.
ఇక వృద్ది విషయానికి వస్తే ప్రభుత్వం చెబుతున్న సీన్‌ కనిపించటం లేదు. 2016 మార్చి నుంచి 2019 మార్చినెల వరకు మూడు సంవత్సరాలలో జిఎస్‌డిపి వృద్ధి రేటు వ్యవసాయం, వస్తూత్పత్తి, సేవారంగాలలో 14,2,14.3,15శాతాల చొప్పున ఉంది. వ్యవసాయ రంగంలో 17.3 నుంచి 10.9శాతానికి పడిపోయింది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఆ రంగంలో దిగజారుడు ఆందోళన కలిగించేదే.

Image result for harish rao budget
రుణభారం ఏటేటా పెరుగుతున్నది. 2017-18లో అన్ని రకాల ప్రభుత్వ రుణాల మొత్తం రూ. 1,52,190 కోట్లు కాగా 2020-21నాటికి ఆ మొత్తం 2,29,205 కోట్లుగా చూపారు. ఇవి గాక మిషన్‌ కాకతీయ, భగీరధ వంటి పధకాలకు తీసుకున్న అప్పులు మరో 40వేల కోట్లు అదనం. ఇతర సంస్దలు తీసుకున్నవాటిని కూడా చేర్చితే ఇంకా పెరుగుతాయి. దీనికి అనుగుణ్యంగానే చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా పెరుగుతుంది. వివిధ పధకాలకు కేటాయింపులు ఘనంగా జరిపినా చివరికి వాటిలో ఖర్చు చేసేదెంత అన్నది ప్రతి బడ్జెట్‌లోనూ ప్రధానమైన ప్రశ్నగా ముందుకు వస్తున్నది. ఆదాయరాబడి గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు గనుక ఈ బడ్జెట్‌కు అదే ప్రశ్నను మరింత గట్టిగా వేయాల్సి ఉంటుంది.
భజన చేయు విధము తెలియండీ భక్తులారా అన్నట్లుగా రెండు బడ్జెట్లకు కొట్టచ్చినట్లు కనిపించే మార్పు ఏమంటే కెసిఆర్‌ భజన. గత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మామ తన గురించి తాను పొగడుకోలేరు. దాన్ని భర్తీ చేయాలి, గనుక ఈ ఏడాది గవర్నర్‌ ప్రసంగంలో , ఆర్ధిక మంత్రి ప్రసంగంలోనూ అసలు, వడ్డీతో సహా భజన చేయించుకున్నారు. బడ్జెట్‌ ప్రసంగ పాఠం 79 పేజీల్లోనూ అంతకంటే ఎక్కువగానే కెసిఆర్‌ను ఆకాశానికి ఎత్తారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తగ్గిన కారు వేగం – వేగిరంగా కెటిఆర్‌ పట్టాభిషేకం !

26 Sunday Jan 2020

Posted by raomk in Current Affairs, History, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KTR, Telagana politics, Telangana CM, Telangana Municipal Election Results

Image result for kcr, ktr
ఎం కోటేశ్వరరావు ,
తెలంగాణాలో పట్టణ స్ధానిక సంస్ధల ఎన్నికలలో ప్రధాన అధ్యాయం ముగిసింది. ఎన్నికల చట్టం లేదా నిబంధనావళిలో ఉన్న లొసుగును ఆధారం చేసుకొని ఓటింగ్‌ హక్కు ఉన్న ఎక్స్‌ అఫిసియో సభ్యులైన ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలు ఫలితాలు వెలువడిన తరువాత అధికార పార్టీకి అవసరమైన చోట ఓటు వేసేందుకు వీలుగా తాము ఎక్కడ ఓటు వేయబోయేది తెలియ చేశారు. సరే క్యాంపు రాజకీయాల గురించి చెప్పనవసరం లేదు. అధికార పార్టీలో ముఠా తగాదాలను సర్దుబాటు (అది ఎలా అన్నది అందరికీ తెలిసిందే) కోసం క్యాంపులను నిర్వహిస్తే తమ వారిని లేదా తమకు మద్దతు ఇచ్చే వారిని ఎక్కడ పాలకపార్టీ తన్నుకుపోతుందో అన్న భయంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా పరిమితంగా అయినా క్యాంపులను నిర్వహించకతప్పలేదు.
ఇప్పుడు అధికార తెరాస సాధించిన విజయం కంటే యువరాజు కెటిఆర్‌ పట్టాభిషేకం ఎప్పుడు జరగనుందా అన్న అంశమే ఎక్కువగా రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారా ? హంగ్‌ ఏర్పడిన చోట ఏమి జరగనుందో అన్న స్ధానిక ఉత్సుకత తప్ప మున్సిపల్‌ చైర్మన్లు, చైర్‌ పర్సన్స్‌, కార్పొరేషన్ల మేయర్‌ ఎన్నికల అనంతరం అసలైన చర్చ కెటిఆర్‌ ముఖ్యమంత్రిగా ఎప్పుడు కానున్నారో అన్నదే అసలైన ఆసక్తి అనటం అతిశయోక్తి కాదు. ఆయనకు బ్రహ్మరధం పట్టటం అప్పుడే ఆరంభమైంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోపే ఆ పని చేస్తారా లేక తరువాతనా అన్నది తప్ప పట్టాభిషేకం ఖాయం అన్నది స్పష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.
దవోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య వేదిక సమావేశాల్లొ కెటిఆర్‌ పాల్గొని అక్కడ పలువురు కార్పొరేట్ల ప్రతినిధులను కలసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు మీడియా పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చింది. దేశంలో ఆర్ధిక మాంద్యం ఏర్పడిన స్ధితిలో ప్రతి కార్పొరేట్‌ సంస్ద ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. రెండవది కేంద్రంలోని బిజెపి సర్కార్‌ సామాజిక విభజన, అశాంతికి కారణమయ్యే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతోంది. ఈ పూర్వరంగంలో పెట్టుబడులు ఏమేరకు వస్తాయన్నది ప్రశ్నార్ధకమే. పక్కనే ఉన్న ఆంధ్రప్రదే శ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా దవోస్‌ వెళ్లి ఆర్భాటం చేసి వచ్చే వారు. అయినా ఆంధ్రప్రదే శ్‌కు వచ్చింది వట్టిస్తరి, మంచినీళ్లు మాత్రమే.
గత చరిత్రలో ఒక రాజు లేదా యువరాజు పట్టాభిషేకం సమయంలో దేశ పరిస్ధితులు, ఇరుగు పొరుగు రాజుల కదలికలు తదితర అంశాల గురించి మదింపు వేసేవారు. ఇప్పుడు రాజులు, రాజ్యాలు లేకపోయినా రాజకీయ పార్టీలలో వారసత్వాలు ప్రారంభమై కొనసాగుతున్న విషయం దాస్తే దాగేది కాదు. ప్రాంతీయ పార్టీలలో అది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రారంభంలో ఏ లక్ష్యంతో, ఏ వాగ్దానాలతో ప్రారంభమైనా కొంత కాలం తరువాత అవి కుటుంబ పార్టీలుగా మారిపోవటం అన్ని రాష్ట్రాలలో చూస్తున్నదే. ఈ కారణంగానే కెటిఆర్‌ పట్టాభిషేకం గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఒక విజయాన్ని పోల్చవలసి వచ్చినపుడు ఏదో ఒక ప్రాతిపదికను తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఎవరైనా విబేధిస్తే చేయగలిగిందేమీ లేదు.
2019లో గ్రామీణ స్థానిక సంస్థలైన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయాలు సాధించింది. మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులను టిఆర్‌ఎస్‌ దక్కించుకుంది. 537 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టిఆర్‌ఎస్‌ 448 స్థానాలు (83.42 శాతం) దక్కించుకుంది. కాంగ్రెస్‌ కేవలం 75 స్థానాలు (13.96 శాతం), బిజెపి 8 స్థానాలు (0.14శాతం) దక్కించుకోగలిగాయి.
రాష్ట్రంలో మొత్తం 5,817 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు (ఎంపిటిసి) ఎన్నికలు జరగగా, టిఆర్‌ఎస్‌ 3,556 స్థానాలు (61.13) దక్కించుకుంది. కాంగ్రెస్‌ 1,377 స్థానాలు (23.67 శాతం), బిజెపి 211 స్థానాలు (3.62 శాతం) గెలుచుకోగలిగాయి. మొత్తం 537 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు గాను, టిఆర్‌ఎస్‌ 431, కాంగ్రెస్‌ 72, బిజెపి 6 చోట్ల ఎంపిపిలుగా గెలిచారు.
2016లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ఘనమైన రికార్డు విజయం సాధించింది. 150 వార్డులకు గాను, టిఆర్‌ఎస్‌ పార్టీ 99 స్థానాలు, తన మిత్రపక్షమైన ఎంఐఎం 44 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రెండు, బిజెపి 4, టిడిపి 1 స్థానం పొందాయి. జిహెచ్‌ఎంసి చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇన్ని స్థానాలు దక్కించుకోవడం, ఎవరితో పొత్తు లేకుండానే మేయర్‌ స్థానం దక్కించుకోవడం అదే మొదటి సారి.
2018 డిసెంబర్లో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించి, 88 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 28.43 శాతం ఓట్లు పొంది, 19 స్థానాలు గెలుచుకుంది. బిజెపి 6.98 శాతం ఓట్లు మాత్రమే పొంది, కేవలం ఒకే సీటుకు పరిమితం అయింది. ఎంఐఎం 2.71 శాతం ఓట్లు పొంది, 7 స్థానాలు గెలుచుకుంది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా, బిజెపి ప్రభావం కనిపించినా తెలంగాణలో మాత్రం టిఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగింది. 17 లోక్‌ సభ స్థానాలున్న తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ 41.71 శాతం ఓట్లు సాధించి 9 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 29.79 శాతం ఓట్లతో 3 స్థానాలు, బిజెపి 19.65 శాతం ఓట్లతో 4 స్థానాలు, ఎంఐఎం 2.8 శాతం ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం అసెంబ్లీతో పోలిస్తే ఐదుశాతం తగ్గగా కాంగ్రెస్‌ ఒకశాతం ఓట్లను పెంచుకుంది. బిజెపి అసాధారణంగా పన్నెండుశాతానికి పైగా ఓట్లు పెంచుకుంది. అయితే అది తరువాత జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. లోక్‌సభలో వచ్చిన ఓట్లకు అనుగుణ్యంగా గ్రామీణ ఎన్నికల్లో దానికి సీట్లు రాలేదు.

Image result for kcr, ktr
గ్రామీణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల తీరు తెన్నులతో పోల్చితే కారు వేగం బాగా తగ్గింది. ఇది యువరాజుకు రుచించని వ్యవహారమే. వంది మాగధులకు వాస్తవాలతో పని ఉండదు కనుక భజన చేస్తారు, ఒక కోణాన్ని చూపి బొమ్మ మొత్తం అదే విధంగా ఉందని మనల్ని నమ్మమంటారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి తెరాసకు 41.14శాతం, కాంగ్రెస్‌కు 19శాతం, బిజెపికి 17.80శాతం, మజ్లిస్‌కు 4.17 రాగా ఇతరులకు 17.86 శాతం వచ్చాయి.

మున్సిపాలిటీల వారీ పార్టీల ఓట్లశాతాలు
పార్టీ         50శాతంపైన 40-50 30-40 20-30 10-20 10శాతం కంటే తక్కువ
తెరాస          28            71      20       0       1          1
కాంగ్రెస్‌         1             10      35     30     26         18
బిజెపి            0              3        4     14     40         59
మజ్లిస్‌           0              0        2       1      2          40
ఇతరులు       1              2       11     17     48        41
పురపాలక సంఘాలలోని 2727 వార్డులలో తెరకు 1579 అంటే 57.87శాతం, కాంగ్రెస్‌కు 541(19.80) ఇతరులు 300(11.01) బిజెపి 236(8.61) మజ్లిస్‌ 71(2.60) సీట్లు వచ్చాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే కరీంనగర్‌ మినహా తొమ్మిదింటిలో 325 స్ధానాలకు గాను తెరాస 152(47.38) బిజెపి 66(20.30), ఇతరులు 49(15.07) కాంగ్రెస్‌ 41(12.61) మజ్లిస్‌ 17(5.29) తెచ్చుకున్నాయి. మున్సిపల్‌, కార్పొరేషన్ల ఫలితాలను కలిపి చూస్తే తెరాసకు 52.62, కాంగ్రెస్‌కు 16.2, బిజెపికి 14.45 శాతం వచ్చాయి. గ్రామీణ ఎన్నికల్లో మండల ప్రాదేశిక నియోజక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే తెరాస సీట్ల శాతం 61.13 నుంచి 52.62కు పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ బలం 23.67 నుంచి 16.2కుతగ్గింది, మరోవైపు బిజెపి 3.62 నుంచి 14.45శాతానికి పెంచుకుంది, ఇదే సమయంలో బిజెపి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని లోక్‌సభ ఎన్నికల నుంచీ చెబుతున్న బిజెపి ఆ స్ధితిలో లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. పార్టీ 2727 మున్సిపల్‌ స్ధానాల్లో 2025 చోట్ల పోటీ చేసింది. 120 పురపాలక సంఘాలకు గాను 45, తొమ్మిదింటిలో రెండు కార్పారేేషన్లలో అసలు ఖాతాయే తెరవలేదు. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం పొందలేకపోయింది. ఆ పార్టీ తాము గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ప్రాంతాలకు బదులు ఇతర చోట్ల అనూహ్య ఫలితాలను పొందింది. పార్టీ ఎంపీలు ఉన్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లలో దానికి ఆశించిన ఫలితాలు రాలేదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ లేదా కాంగ్రెస్‌ అభ్యర్ధులతో కుమ్మక్కు అయిన కారణంగానే కాస్త మెరుగైన సీట్లు సీట్లు వచ్చినట్లు చెబుతున్నారు. నిజాంపేట కార్పొరేషన్‌లోని 33 స్ధానాలకు గాను, తెరాస 26 గెలుచుకుంది. గతంలో సిపిఎం ప్రతినిధులు సర్పంచ్‌లుగా ఉన్న ప్రగతి నగర్‌ ప్రస్తుతం నిజాంపేట కార్పొరేషన్‌లో భాగం. అక్కడ ప్రగతి నగర్‌ అభివృద్ధి కమిటీ పేరుతో పోటీ చేసిన వారు ఆరుగురు విజయం సాధించారు, ఆ ప్రాంతంలోని మరొక వార్డులో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు.
ఆర్‌టిసి సిబ్బంది సమ్మెను అవకాశంగా తీసుకొని ప్రయాణీకులపై ప్రభుత్వం భారం మోపింది. ఇప్పుడు పురపాలక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విలేకర్లతో మాట్లాడుతూ త్వరలో పన్నులు పెంచనున్నట్లు ప్రకటించారు. హైదరాబాదు, ఇతర కార్పొరేషన్లలో కొనసాగుతున్న అనారోగ్యం, అద్వాన్న పరిస్ధితులను చూసిన తరువాత మిగతా ప్రాంతాలలో కూడా పన్నుల బాదుడు తప్ప జనానికి ప్రయోజనాలు అనుమానమే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌టిసి కార్మిక సమ్మె- అడ్డం తిరిగిన సర్కార్‌ – ముందుకు తెచ్చిన సవాళ్లు !

16 Saturday Nov 2019

Posted by raomk in Current Affairs, employees, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

adamant government, challenges before working class, KCR warning to RTC staff, Telangana CM, TSRTC staff strike

Image result for tsrtc staff strike- adamant government - challenges before working class
ఎం కోటేశ ్వరరావు
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ(టిఎస్‌ఆర్‌టిసి) సిబ్బంది సమ్మె నలభై మూడు రోజులు దాటి ఇప్పటికే కొత్త రికార్డు నమోదు చేసింది. ఇంతకాలం హైకోర్టు, కార్మికులు, సామాన్య జనాన్ని తప్పుదారి పట్టించిన సర్కార్‌ అంతిమంగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అసలు విషయం బయట పెట్టింది. కార్మికులతో చర్చించేదేమీ లేదు, ఆర్టీసీ నష్టాల్లో ఉంది, డిమాండ్లను అంగీకరించేది లేదు. విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినా తిరిగి ముందుకు తీసుకువచ్చే అవకాశం వుంది. జెఎసి రాజకీయ పార్టీలతో చేతులు కలిపింది.ఇలా సాగింది(ఇది రాసే సమయానికి వివరాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు).
చరిత్రాత్మక ఈ సమ్మె పట్ల అనుసరించిన వైఖరి తమ ఖ్యాతిని పెంచుతుంది అనుకుంటే కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ నిరభ్యంతరంగా తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం. శనివారం నాడు ఆర్‌టిసి యూనియన్ల నేతలపై ప్రభుత్వం నిర్బంధాన్ని మరింతగా పెంచింది. సమ్మెపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు నవంబరు 18వ తేదీకి వాయిదా వేసింది. అంటే మరో రెండు రోజులతో 45 రోజులకు చేరనుంది. ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలిసింది కనుక కోర్టు అభిప్రాయాన్ని బట్టి తదుపరి ఏమి జరగునుందో తెలుస్తుంది తప్ప ముందుగా జోశ్యం చెప్పలేము.ముగ్గురు పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో మధ్యవర్తుల కమిటీ వేసి సమ్మె అంశాలను వారికి నివేదించాలన్న హైకోర్టు సూచనకు 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. మరోవైపు 14వ తేదీన సమావేశమైన ఆర్‌టిసి జెఏసి తమ డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని మిగిలిన అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మిక సంఘాలు పందొమ్మిదవ తేదీ వరకు ఆందోళన కార్య క్రమాలను ప్రకటించారు. అన్ని గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు, ఇందిరాపార్క్‌ వద్ద జేఏసీ నేతల దీక్ష , అన్ని డిపోల వద్ద నిరసన దీక్షలు.. 19న హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్‌ బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్‌ని కలుస్తామని, ఎన్‌హెచ్‌ఆర్సీ అపాయింట్‌మెంట్‌ కోరామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచించినట్లుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి మధ్యవర్తిత్వ కమిటీ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తినపుడు పరిష్కారం కోసం ఉన్నత స్థాయి మధ్యవర్తిత్వ కమిటీని వేయాలని పారిశ్రామిక వివాదాల చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి అఫిడవిట్‌ను అడ్వకేట్‌ జనరల్‌ న్యాయస్థానానికి సమర్పించారు. ఆ చట్టంలోని పదో సెక్షన్‌ ప్రకారం దీనిపై లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ఈ వివాదంపై దాఖలైన వ్యాజ్యాల్లో కోర్టు విచారణ చేస్తున్నందున ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.పిటిషనర్ల తరఫు న్యాయవాది ‘శివారావ్‌ శాంతారావ్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేసే అధికారాలు ఈ న్యాయస్థానానికి ఉంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాల ఆర్టీసీ సమ్మెపై, బస్సు రూట్ల ప్రయివేటీకరణపై రెండు వ్యాజ్యాలను ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏజీ వాదిస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఎస్మా కింద చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీని ఎస్మా కిందకు చేర్చుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉందని ఏజీ బదులిచ్చారు. ఆర్టీసీ సేవలు ప్రజోపయోగం కిందకు వస్తాయని చెప్పారు. వాటికి భంగం కలిగించిన వారిపై ఎస్మా కింద చర్యలు చేపట్టవచ్చన్నారు. ఆర్టీసీ సమ్మె ఎస్మా కిందకు రాదని కార్మిక సంఘాల న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి బదులిచ్చారు. టీఎస్‌ ఆర్టీసీని ఆర్టీసీ యాక్టు 1950, ఏపీ పునర్‌విభజన చట్టం-2014లోని సెక్షన్‌ 3 కింద ఏర్పాటు చేశామని ఏజీ కోర్టుకు వివరించారు.

ఈ వాదనలను ధర్మాసనం తొలుత తోసిపుచ్చింది. ”ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏపీఎస్‌ ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉందని, టీఎస్‌ ఆర్టీసీని కేంద్రం గుర్తించడం లేదని గతంలో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. ఆర్టీసీని విభజించాలంటే ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 47ఏ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర అనుమతి లేకుండా ఏర్పాటు చేయడానికి వీల్లేదు” అని న్యాయస్థానం ప్రస్తావించింది. రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయని, ఈ చట్టం ప్రకారమే ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలను రెండు రాష్ట్రాల మధ్యన పంచవచ్చని ఏజీ సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ నుంచి సాంకేతికంగా వేరు పడనప్పటికీ బస్సులను చట్ట ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజించారన్నారు.

Image result for tsrtc staff strike- adamant government - challenges before working class
చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ ఆర్టీసీని ఏర్పాటు చేశామని, అలాంటి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పారు. టీఎసఆర్టీసీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. ఏజీ వాదనలు విన్న ధర్మాసనం తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌ తరుపున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదించారు.1994లో ‘సిండికేట్‌ బ్యాంక్‌ వర్సెస్‌ అదర్స్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమా? కాదా? అని తేల్చే అధికారం హైకోర్టుకు లేదని చెప్పారు. దాన్ని లేబర్‌ కోర్టే తేల్చాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సమస్యను లేబర్‌కోర్టుకు రిఫర్‌చేస్తే నిర్ణీత కాలంలో సమస్యకు పరిష్కారం చూపగలదా? అని ఏజీని ఉద్దేశించి ప్రశ్నించింది. ఇది ముఖ్యమైన సమస్య అయినందున లేబర్‌కోర్టు కూడా ఎక్కువ సమయం తీసుకోదని హైకోర్టుకు నివేదించారు.
ఆర్‌టిసి సిబ్బంది సమ్మెపై హైకోర్టులో ఇన్ని రోజులు విచారణ జరగటమే ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆర్‌టిసికి సంబంధించి కోర్టుకు నివేదించిన తప్పుడు లెక్కలను చూసిన తరువాత అసెంబ్లీకి సమర్పించే బడ్జెట్‌ అంకెలు, సభలో మంత్రులు చేసే ప్రకటనలు, చెప్పే సమాచార విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది. ఆర్‌టిసికి రావాల్సిన బకాయిల గురించి అసెంబ్లీకి ఒక సమాచారం, హైకోర్టుకు ఒక సమాచారం ఇవ్వటం, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరులకు ఎవరికి వారు తమకు అనుకూలమైన భాష్యాలు చెప్పేందుకు వీలుగా లోపాలతో కూడిన వాటిని తయారు చేయటం వంటి అనేక అంశాలు యావత్‌ ప్రజానీకానికి కనువిప్పు కలిగించాయి.
మేక పిల్లను తినదలచుకున్న తోడేలు మాదిరి ఆర్‌టిసిని దెబ్బతీయటానికి తద్వారా దానికి ఉన్న విలువైన ఆస్ధులను కాజేయటానికి రాష్ట్ర ప్రభుత్వ నేతలు యత్నిస్తున్నారనే అభిప్రాయం మరింత బలపడింది.ఈ సమ్మె ఒక్క తెలంగాణాలోని కార్మికవర్గానికే కాదు, దేశవ్యాపితంగా యావత్‌ కార్మికులకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నది. సవాళ్లను ముందుకు తెచ్చింది. గత పాలకుల హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్ధులను అప్పనంగా నీకిది నాకది అన్న పద్దతిలో కారుచౌకగా ఆశ్రితులకు అప్పగించారు. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఎక్కడి కక్కడ ఆశ్రితులకు కట్టబెట్టేందుకు మిగిలి ఉంది ఆర్‌టిసి ఒక్కటే అన్నది తేలిపోయింది. సచివాలయాన్ని వేరే చోటకు తరలించి ఆ స్దలాన్ని కూడా అన్యాక్రాంతం చేసే అజెండా అలాగే ఇంకా ఉందనుకోండి.
దేశంలో అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానాలను మరింత ఉథృతంగా అమలు జరిపేందుకు కేంద్ర పాలకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాలలోని మెజారిటీ బిజెపి పాలిత ప్రభుత్వాలు లేదా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీల పాలకులు గానీ వాటికి వ్యతిరేకం కాదు.పోటీ, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే సాకుతో ఆర్‌టిసి రూట్లలో ప్రయివేటు బస్‌లను తిప్పేందుకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టంలో తెచ్చిన మార్పును ఉపయోగించుకొని ఆర్‌టిసిని దెబ్బతీసేందుకు పూనుకున్న తొలి ప్రభుత్వంగా తెలంగాణా టిఆర్‌ఎస్‌ సర్కార్‌ చరిత్రకెక్కింది.దీనికి కేంద్ర బిజెపి సర్కార్‌ పరోక్ష సాయం తక్కువేమీ కాదు.
సమ్మె నోటీసుపై చర్చలు ప్రారంభమైన తరువాత వాటి ఫలితం ప్రతికూలంగా ఉంటే ఏడు రోజుల వరకు సమ్మెకు వెళ్లకూడదన్న నిబంధనతో కార్మికులపై వేటు వేసేందుకు ఉన్నత అధికార యంత్రాంగం వేసిన ఎత్తుగడను కార్మిక సంఘాలు పసిగట్టలేకపోయినట్లు స్పష్టం అవుతోంది. అక్టోబరు ఐదు నుంచి సమ్మెకు పిలుపు ఇస్తే నాలుగవ తేదీన చర్చల ప్రహసనాన్ని ప్రభుత్వం నడిపింది. మరుసటి రోజు నుంచి సమ్మెలోకి వెళ్లటంతో ఏడు రోజుల నిబంధనను ముందుకు తెచ్చి సమ్మె చట్టవిరుద్దమని తొలి నుంచి సర్కార్‌ వాదించింది. అందుకే దాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించాలని పదే పదే డిమాండ్‌ చేసింది.
విభజించి పాలించు అన్న బ్రిటీష్‌ రాజనీతిని తెలంగాణా సర్కార్‌ ఈ సందర్భంగా ప్రదర్శించింది. ఎన్‌జిఓలు, టీచర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, కార్మికులు సంఘీభావంగా ఆందోళనలోకి రాకుండా చేసింది. నిజానికి వారంతా ముందుకు వచ్చి ఉంటే సమ్మె ఇన్ని రోజులు జరిగి ఉండేది కాదు. ఒకవైపు ఎన్నడూ లేని రీతిలో సంపూర్ణ సమ్మె జరుగుతుండగా పది పన్నెండు రోజుల్లో పిఆర్‌సి నివేదిక ఇమ్మని ముఖ్యమంత్రి కమిషన్‌ను ఆదేశించిట్లు ప్రకటించారు. బండి గుర్రం నోటికి చిక్కెం కట్టి కళ్ల ముందు గడ్డి కట్టను ఉంచటం తప్ప వేరు కాదు. దానిలో ఉద్యోగులకు ఏమేరకు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో చూడాల్సి ఉంది.

Image result for tsrtc staff strike- adamant government -kcr
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి విద్యార్ధులను కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు అప్పగించారు. త్వరలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు కూడా రానున్నాయి. వైద్యరంగంలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేసి రోగులను కార్పొరేట్‌ జలగల పాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రయివేటు బస్‌ ఆపరేటర్ల విషయంలో చేసిన వాదనల ప్రకారం కార్పొరేట్ల మధ్య పోటీ ఏర్పడి విద్యా, వైద్య సంస్ధలలో వసూలు చేసే మొత్తాలు తగ్గాలి. ఎక్కడా తగ్గకపోగా జనం రుణగ్రస్తులు కావటానికి కారణాలలో ఈ రెండు రంగాలు కూడా చేరాయి. ఇప్పుడు ఆర్‌టిసిని నిర్వీర్యం చేసి ప్రయివేటు ఆపరేటర్లపాలు చేస్తే జరిగేది కూడా ఇదే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయివేటు మోజుల్లో జనం పడితే అంతిమంగా నష్టపోయేది తామే అని ఏ మాత్రం జనానికి అవగాన ఉన్నా ప్రభుత్వం మీద ఇంకా వత్తిడి పెరిగి ఉండేది.

ఇది రాస్తున్న సమయానికి ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఏమౌతుంది అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా తయారైంది. తాము ఏ ఒక్క డిమాండ్‌ను అంగీకరించేది లేదని ప్రభుత్వం తన ఆఖరి మాటగా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.ఇప్పటివరకైతే కార్మికులను సమ్మె విరమించాలని కోర్టు వైపు నుంచి ఎలాంటి సూచనలు వెల్లడి కాలేదు. ఇది వారి కోర్కెలు సమంజసమైనవే అని కోర్టు భావిస్తోందని అనుకొనేందుకు ఆస్కారమివ్వవచ్చు. తమను కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టటం కూడా చూశాము. మొండి వైఖరిని కూడా చూసింది. కోర్టు ముందు ఉన్న వివాదం ఏదైనప్పటికీ ఇది 50వేల మంది కార్మికులు, రోజువారీ ప్రయాణించే దాదాపు కోటి మంది ప్రయాణీకుల వ్యవస్ధ కనుక తనకున్న ప్రత్యేక అధికారాలతో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుందా ? సమ్మె విరమించమని కార్మికులకు సూచిస్తుందా లేక మూడో మార్గం దేన్నయినా ఎంచుకుంటుందా అన్నది చూడాలి. తాజా పరిణామాలపై సిబ్బంది సంఘాల జెఎసి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి వుంది.
డజన్ల సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలు లేదా ఆవేదనతో మరణించటం ఒక ఆందోళనకరమైన అంశం.ఫ్యూడల్‌ సమాజానికి చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు, అంతరించి పోతున్న చేతివృత్తుల కుటుంబాల నుంచి వస్తున్న వారికి పూర్తిగా కార్మికవర్గ లక్షణాలు, ఆలోచనలు వెంటనే రావు. ఇది ఒక సంధి సమయం. తెలంగాణా రాష్ట్ర సాధన ఆందోళన సమయంలో ఆత్మాహుతుల ఉదంతాలు దీనికి పురికొల్పాయా లేక పాలకుల మీద విపరీతమైన భ్రమలు పెట్టుకొని హతాశులై ఇలాంటి తీవ్రచర్యలకు పాల్పడ్డారా అన్న అన్నది పరిశోధించాల్సి ఉంది. పోరాటం తప్ప ఆత్మహత్యలు కార్మికవర్గ లక్షణం కాదు. కార్మిక సంఘాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి కార్మికులు, ఉద్యోగులను ఆమేరకు చైతన్యవంతం చేసేందుకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిణామం ముందుకు తెచ్చింది.

Image result for adamant kcr
కార్మికుల న్యాయమైన సమస్యలపై చివరి ఆయుధంగానే కార్మికులు సమ్మెకు దిగుతారు. ఆర్‌టిసి చరిత్రలో సూపర్‌వైజర్‌లు తొలిసారిగా సమ్మెకు దిగితే, చిన్నా పెద్దా, గుర్తింపు పొందిన, లేని యూనియన్లన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మెకు దిగటం ఒక మంచి పరిణామం. కార్మికులు కూడా నాయకత్వంపై విశ్వాసం ఉంచి నిలబడ్డారు. ప్రభుత్వ బెదిరింపులు, ప్రలోభాలను ఖాతరు చేయలేదు. ప్రపంచ చరిత్రను, మన దేశ చరిత్రను చూసినపుడు గానీ కార్మికుల సమ్మెలన్నీ జయప్రదం కాలేదు. అనివార్యమై రాజీ పడి విరమించాల్సి వచ్చినా ఒక సంస్ధ లేదా ఒక తరగతి కార్మికులు నిరాశా నిస్పృహలకు గురైనా అది తాత్కాలికమే. నిరంకుశమైన యాజమాన్యాలు కార్మికులను పీల్చిపిప్పి చేస్తున్నంత కాలం కార్మికుల ఆందోళనలకు అంతం ఉండదు. ప్రతి సమ్మె విజయం లేదా వైఫల్యం కూడా భవిష్యత్‌లో అదే సంస్ధ లేదా ఇతర సంస్ధల కార్మికులకు అనేక పాఠాలు నేర్పుతుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ప్రపంచంలో మంచి భూస్వామి, మంచి వ్యాపారి, మంచి పెట్టుబడిదారుడు, మంచి కార్పొరేట్‌ సంస్ధ, పాలకవర్గ పార్టీలలో మంచి పాలకుల కోసం వెతకటం నేతి బీరలో నెయ్యి కోసం దేవులాడినట్లే !
ఆర్‌టిసి కార్మికుల సమ్మె సందర్భంగా ముఖ్య మంత్రి కెసిఆర్‌ యూనియన్లకు, కార్మికులు సంఘటితం కావటానికి ఎంత బద్ద వ్యతిరేకో స్పష్టంగా చెప్పారు. యూనియన్లను లేకుండా చేస్తానని అన్నారు. చరిత్రలో ఇలాంటి యూనియన్‌ విచ్చిన్నకులు కాలగర్భంలో కలసి పోయారు. ఈ పరిణామం తరువాత పాలకపార్టీ నేతలతో అంటకాగితే తమకేదో మేలు జరుగుతుందని ప్రలోభపెట్టేవారిని కార్మికవర్గం అంతతేలికగా విశ్వసించదు. అధికారపార్టీకి చెందిన వారు కూడా కార్మికుల దగ్గరకు వచ్చి యూనియన్లుపెట్టి ఉద్దరిస్తామని చెప్పేందుకు వెనుకాడే స్ధితి వస్తుంది. పాలకపార్టీల మీద కార్మికవర్గంలో భమ్రలు తొలగటానికి ఈ సమ్మె నాంది. ఆర్‌టిసి సమ్మె జయప్రదమైతే ఇతర కార్మికులు, ఉద్యోగులు మరింత వేగంగా తమ సమస్యల మీద పోరు బాట పడతారు. ఒక వేళ విఫలమైతే కాస్త విరామం వచ్చినా మరింత జాగరూకతతో వ్యవహరించి పోరుబాట ఎక్కటం తప్ప మరొక దగ్గర మార్గం ఉండదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెలంగాణా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం అవుతోందా !

04 Saturday Mar 2017

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KODANDARAM, midterm elections, Telagana politics, Telangana, Telangana CM, trs

Image result for is telangana going for midterm elections

ఎం కోటేశ్వరరావు

   తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ రంగంలో అనూహ్య చర్యలకు తెరలేవనున్నదా అనే అనుమానం కలగక మానదు. అవలోకిస్తే రెండు దృశ్యాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.ఒకటి తెరాస అధికారానికి వచ్చి మూడో సంవత్సరం పూర్తి కావస్తున్నా నిర్ధిష్టంగా ఫలానా పని చేశామని చెప్పుకొనేందుకేమీ లేకపోవటంతో అధికారపక్షంలో ఆందోళన, ప్రతిపక్షాలలో ఆశలు మొలకలెత్తటం, కొంత అస్పష్టంగానే వున్నప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తిగాక ముందే ఏదో ఒక సాకుతో నాలుగో సంవత్సరం ప్రారంభంలోనే అధికారపక్షం మధ్యంతర ఎన్నికలకు వెళ్ల నుందా అన్నది మరొకటి. రెండు దృశ్యాలూ ఒకదానికొకటి సంబంధం కలిగివున్నాయి.

    తాజాగా ప్రత్యక్షంగా అధికారపక్షానికి, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు మధ్య టిజాక్‌( తెలంగాణా జెఎసి) నేత కోదండరాం లేదా తెరాస ప్రచారం చేస్తున్నట్లు కోదండరాం రెడ్డి కేంద్ర బిందువుగా వున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు నాయకుడిగా కోదండరాంను తెరమీదకు తెచ్చిన సారధి కెసిఆర్‌ ఇప్పుడు తన సైనికులతో కోదండరాంపైనే ప్రచార దాడి చేయిస్తున్నారు. తామేమీ చేశామో చెప్పుకొనేందుంకటే ప్రత్యర్ధులపై విరుచుకుపడటానికే అధికారపక్షం, దాని మద్దతుదార్లు, అధికారానికి దగ్గరై ఫలాలను అందుకోవాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి.పంచ రంగులలో తాము చూపిన బంగారు తెలంగాణా గురించి చెబుతున్నప్పటికీ ఆ నగ తయారీ ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పటం లేదు. అంతకంటే ఎక్కువగా కోదండరాం కులం గురించి, ఒక కులానికి చెందిన నేతలందరూ ఒక్కటవుతున్నారనేదానిపైనే కేంద్రీకరించి మాట్లాడుతున్నారు.

     ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కులం తురుఫు ముక్కలతోనే తన లేదా తమ కుటుంబ పట్టును పదిల పరుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు రాజ్యాంగ బద్దంగా వున్న షెడ్యూలు కులాలు, తెగల వుప ప్రణాళికలకు తిలోదకాలిచ్చి దానిని నీరు గార్చేందుకు చేయాల్సిందంతా చేస్తూనే మరోవైపు కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల, వేల కోట్ల కేటాయింపులు, సంక్షేమం గురించి ఆకాశంలో వెండి మబ్బులను చూపుతున్నారు. కన్నతల్లికి కాస్తంత కూడు పెట్టని కొడుకు పినతల్లికి బంగారు తొడుగులు చేయిస్తా అన్నట్లుగా దళితులకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి పదవే ఇవ్వకపోతే పోయారు వాగ్దానం చేసిన భూమి గురించి మాట్లాడటం లేదు. అలాంటిది బిసిలు, అందులోనూ అత్యంత వెనుకబడిన బీసీలంటూ వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులనే ఎండమావులను చూపి వాటి వెంట పరిగెత్తించాలని చూస్తున్నారు. దళితుల గురించి మాట్లాడటం మాని వెనుకబడిన తరగతుల గురించి జపం చేస్తున్నారు. ఎంత ఎక్కువగా వాగ్దానాలు చేస్తే అంత ఎక్కువగా భ్రమలు పెంచి అంతే స్ధాయిలో నిరసనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలియనంత అమాయకుడు కాదు కెసిఆర్‌. అయినా చట్టపరంగా ఇంకా ఎన్నికలు రెండు సంవత్సరాలు వుండగానే ఇంతగా వాగ్దానం చేస్తున్నారంటే కొత్త రాజకీయ ఎత్తులకు తెరలేవనున్నదని భావించకతప్పదు.

    ఇంతకాలం తమ వేతనాలు పెంచాలనిఅందోళన చేసిన కాంట్రాక్టు లెక్షరర్లు, అంగన్వాడీలు, విఆర్వోలు, ఇతర చిరుద్యోగుల డిమాండ్లకు తలొగ్గి కొంతమేరకు వేతనాలు పెంచుతున్నారు. అనివార్యమై కొన్ని పోస్టులను రెగ్యులర్‌ చేసేందుకు నిర్ణయించారు.ఇవన్నీ ఆయా తరగతుల పోరాట ఫలితాలు తప్ప మరొకటి కాదు. ఎవరి సంగతి వారు చూసుకోవటం ముఖ్యమనే వాతావరణం ఆవరించి వున్న నేటి పరిస్థితులలో తమ సంగతేమిటన్నది నిరుద్యోగుల ప్రశ్న. భారత్‌ను ఆక్రమించిన తెల్లవారు దేశం వదలి వెళితే మన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి యావత్‌ దేశం ఆశోపహతులైనట్లే, వుమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ‘ఆంధ్రావలస పాలకులు’ పోయి తెలంగాణా స్వంతపాలకులు అధికారానికి వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించిన వారు కూడా అదే మాదిరి పాలకులు మారారు తప్ప పాలనా పద్దతులు మారలేదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు. మిషన్‌ భగీరధ, సింగరేణి, ఆర్టీసి వంటివాటిలో సంవత్సరాల తరబడి పనికి తగ్గ వేతనాలు లేకుండా పని చేసిన వారిలో ఓ పద్నాలుగువేల మందిని క్రమబద్దీకరించటం అభినందించదగినదే. మిగిలిన వన్నీ గతంలో మాదిరి సాధారణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన, చేపట్టనున్న బండి గుర్రానికి గడ్డి చూపుడు వ్యవహారం తప్ప మరొకటి కాదు. హైదరాబాదు మహానగరంలో ముఖ్య మంత్రి వుండటానికి లేదా గృహకార్యాలయ ఏర్పాటుకు భవనాలే లేవా ? కానీ అలాంటివేమీ లేనట్లుగా ఆఘమేఘాల మీద గతంలో వున్న వాటిని పడగొట్టి పూర్వపు రాజులు, దొరల మాదిరి పెద్ద గడీని కట్టించటానికి చూపిన శ్రద్ధ వుద్యోగ నియామకాలలో కనిపించటం లేదన్నదే నిరుద్యోగుల ఫిర్యాదు. అనేక మంది వయసు మీరిపోయి అనర్హులుగా మారిపోతున్నారు. లేదూ మినహాయింపులు ఇచ్చినా ఒక వేళ వారు వుద్యోగం పొందినా వారికి పెన్షన్ల వంటివి లేవు. ఎవరి పెన్షన్‌కు వారు చెల్లించుకోవాలి. ఆ మొత్తంలో కొంత షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడితే లాభం వస్తే ఎంత ఇస్తారో ఇంకా తెలియదు గానీ నష్టం వస్తే అసలుకే మోసం.

    ఈ పూర్వరంగంలోనే కోదండరాం నాయకత్వంలోని జెఎసి నిరుద్యోగ సమస్యపై ప్రదర&శనకు పిలుపు ఇచ్చింది. ఒక ర్యాలీ జరిగినంత మాత్రాన చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వచ్చే ముప్పు వుండదు. అయినప్పటికీ నా పాలనను ఎత్తి చూపటమా అన్న భావోద్వేగానికి లోనై లేదా కొందరు చెబుతున్నట్లు దొరతనపు అహం గానీ మొత్తానికి సహించలేక ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం, అసాధారణ రీతిలో కోదండరాంను, ఇతరులను అరెస్టు చేయటం అనేక మందిని ఆశ్చర్యపరచింది. ఏట్లో వుండగా ఓడ మల్లయ్య ఓడ దిగింతరువాత బోడి మల్లిగాడన్నట్లుగా కెసిఆరన తయారైనట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ప్రత్యేక తెలంగాణా కోసం ఆందోళనలు నిర్వహించి విద్యారు&ధలు, నిరుద్యోగులకు అనేక ఆశలు చూపిన కెసిఆర్లో ఎంతలో ఎంత మార్పు !

    తెలంగాణా రాష్ట్ర సమితి నాయకత్వంలో వెల్లడవుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఆ పార్టీ బలహీనతకు రుజువు. వారి వాదనల ప్రకారం తెలంగాణా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు వారి నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదు. ఐదు నెలల పాటు నాలుగువేల కిలోమీటర్ల దూరం జరిపే మహాజన పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం శ్రీకారం చుట్టినపుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వుక్రోషం వెలిబుచ్చారు. పాదయాత్ర చేపట్టటానికి ఆ పార్టీకి నైతిక హక్కు లేదని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలాంటి వారిని అసలు తమ ప్రాంతాలకు రానివ్వవద్దని జనానికి పిలుపు ఇచ్చారు. తమ యాత్ర ప్రభుత్వానికి, అధికారపక్షానికి వ్యతిరేకం కాదని దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల సమస్యలను తెలుసుకొని వారిని చైతన్యపరచటానికి తప్ప మరొకటి కాదని సిపిఎం స్పష్టం చేసింది. తనపాలనను ఎవరూ ఎత్తి చూపవద్దన్న పెత్తందారీ భావజాలంతో ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదని అనేక మంది అప్పుడు భావించారు. ఒక జాతీయ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనను సిపిఎం వ్యతిరేకించింది.తెలంగాణాను వ్యతిరేకించిన ఇతర పార్టీలలోని నేతలను, అసలు నిజాంపాలనకు మద్దతు పలికి భారతదేశంలో విలీనాన్నే వ్యతిరేకించిన వారి వారుసులందరినీ తనలో చేర్చుకున్న టిఆర్‌ఎస్‌కు ఇతరులను విమరి&శంచే నైతిక హక్కు ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర సమైక్యత, విభజన అన్నది ఇప్పుడు ముగిసిన అంశం. దాని గురించి రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకత్వం జనంలో లేదని సజావుగా సా సిపిఎం మహాజన పాదయాత్ర నిరూపించింది. రాజకీయాలకు అతీతంగా ఆ యాత్రకు సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు ఇతర అనేక సంస్ధల వారు మద్దతు తెలిపారు. తెరాస మద్దతుదారులు కూడా తమనేతల రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. ఒక వేళవారా పని చేసి వుంటే పాదయాత్ర మరింతగా జయప్రదం అయి వుండేది. చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా అధికార మత్తులో మునిగిపోయారని అధికారపక్షం గురించి జనంలో ఆలోచన ప్రారంభయ్యాకనే సిపిఎం పాదయాత్ర చేపట్టింది, ఆ కారణంగానే దాన్ని వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి పిలుపును జనం కూడా పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారపక్షం గ్రహిస్తుందా ?

    ‘ఆంధ్రావలసపాలన’ అంతం కాగానే లక్షలాది వుద్యోగాలను కల్పిస్తామని, ప్రభుత్వ వుద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి హడావుడి చేసిన విషయాన్ని యువతకు ఏ కోదండరామో, మరొక ప్రతిపక్ష పార్టీయో గుర్తు చేయనవసరం లేదు. తెలంగాణా యువత మరీ అంత అమాయకంగా లేదు. మూడవ సంవత్సరం పూర్తి కావస్తున్నా వట్టిస్తరి-మంచి నీళ్ల మాదిరి ప్రకటనలు తప్ప నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వుద్యోగాల ఖాళీలను భర్తీ చేయటానికి, అవసరమైన చోట కొత్త వుద్యోగాలను కల్పించటానికి కావాల్సింది చిత్త శుద్ది తప్ప రాజ్యాంగ సవరణ, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం లేదే. అటువంటి చిత్త శుద్ది లోపించిన కారణంగానే టిజాక్‌ నాయకుడు కోదండరాం నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. తెలంగాణా ఆందోళనలో భాగస్వాములైన అనేక మంది తెరాసకు దూరంగా వుంటున్నారు. అదే సమయంలో అధికారం కారణంగా అవకాశవాదులు దగ్గర అవుతున్నారు.

  తెలంగాణాలో వున్న నిరుద్యోగులతో పోల్చితే వుద్యోగఅవకాశాలు పరిమితంగా వున్నాయి. హైదరాబాదు ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలకు ఒక ప్రధాన కేంద్రంగా మారినప్పటికీ ఆ రంగంలో లభించే వుద్యోగాలకు దేశంలోని ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణా వాసులకే పరిమితం కాదు, రిజర్వేషన్లు లేవు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొన్ని మూతపడటం తప్ప కొత్తవి రావటం లేదు. కొత్త పెట్టుబడులు పెట్టటం కేంద్ర ప్రభుత్వ అజండా నుంచి ఎప్పుడో రద్దయింది. వుమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమలేవీ పెట్టలేదు. పోనీ వారు ‘వలస పాలకులు’ అనుకుంటే స్వరాష్ట్ర పాలకులు తెరాస వారు కూడా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ఓలా, వుబేరన వంటి అంతర్జాతీయ దిగ్గజాలు హైదరాబాదు నగరాన్ని చుట్టేస్తున్నాయి. దీంతో ఆటోలకు కొంత మేర గిరాకీ తగ్గిపోయింది. ఇదే సమయంలో తమ ఆదాయాలు పడిపోతున్నాయని ఓలా, వుబేరన టాక్సీ సిబ్బంది సమ్మెకు దిగినపుడు ప్రభుత్వం వారికే మాత్రం సాయపడలేదు. పరోక్షంగా యజమానుల కొమ్ము కాసింది. త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అది కూడా ఆటో, టాక్సీ రంగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయటం అనివార్యం. ఈ పూర్వరంగంలో యువతలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలలో వుద్యోగాలు, గౌరవ ప్రదమైన వేతనాల గురించి ఆశలు పెరగటం తప్పు, అత్యాశమే కాదు. వారిని ఎంతగా భ్రమలలో ముంచితే అంతగా అసంతృప్తి పెరుగుతుందని గ్రహించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనకు ప్రయత్నించి అనేక మంది గతంలో విఫలమయ్యారు.కెసిఆర్‌ నాయకత్వం సఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్యపై తెరాస, దానికి వెన్నుదన్నుగా వున్న మీడియా పెద్దలు కోదండరాం ఆందోళన విఫలమైందని సంతోషపడితే పడవచ్చు. కోదండరాం కాకపోతే మరొకరు, మరొకరు వస్తారు తప్ప ఆగిపోదు.

    ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు తన కుమారుడికి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేందుకు ప్రారంభం నుంచి పావులు కదుపుతున్నారు. అధికారం చుట్టూ తిరిగే పాలక రాజకీయాలలో ఇది సహజం. గడువు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల గడువుంది. అయినప్పటికీ కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయన్నట్లుగా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎవరు అధికారంలో వున్నప్పటికీ ఒక బలమైన సామాజిక వర్గం చక్రం తిప్పిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. కెసిర్‌ ఆ వర్గంతో అమీ తుమీ తేల్చుకోవాలనే ఎత్తుగడతో వున్నట్లు కనిపిస్తోంది. అందుకు అవసరమైన ఇతర వెనుకబడిన, మైనారిటీ సామాజిక సామాజిక వర్గాలను కూడగట్టే వైపు పావులు కదుపుతున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఇటీవలి కాలంలో కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాగ్దానాలు చేస్తున్నారు. దళితులలో గణనీయంగా వున్న ఒక వర్గాన్ని కూడగట్టుకొనేందుకు రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు తప్ప అంతకు మించి చేసిందేమీ లేదు. వర్గీకరణను వ్యతిరేకించే మరో బలమైన తరగతిని దూరం చేసుకొనేందుకు అటు కేంద్రంలోని బిజెపి సిద్దంగా లేదు. ఎన్నికల రాజకీయాలలో దేనికైనా ఓట్ల లాభ నష్టాలే ప్రాతిపదిక. బీసి కులాలతో ములాఖత్‌లు నడుపుతున్న కెసిఆర్‌ కుల వృత్తులను పునరుద్దరిస్తామనే వాగ్దానాలతో వందల కోట్ల కేటాయింపుల గురించి రెండు సంవత్సరాల ముందుగానే వాగ్దానాలు కుమ్మరిస్తున్నారంటే వాటి భ్రమల నుంచి వారు బయటపడక ముందే ఎన్నికలకు పోవటం అనివార్యం. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగుల వుపాధికి తప్ప మరొకందుకు పనికిరావని గతంలో స్పష్టం చేసిన అనేక కార్పొరేషన్లకు ఇటీవల జరుపుతున్న నియామకాలు ఓట్ల వలతప్ప మరొకటి కాదు. చిన్నా చితకా కలిపి మరో ఐదారువేల పోస్టులలో తమ మద్దతుదార్లను నియమించేందుకు కసరత్తు మొదలైందని వార్తలు. ఇలాంటి వన్నీ ఎన్నికల ముందే చేస్తారు తప్ప మరొకటి కాదన్నది కూడా మరో అనుభవం. పదవులు రాని వారిలో అసంతృప్తి పెరిగి అది సంఘటితం కాక ముందే ఎన్నికలకు పోవాలి తప్ప ఆలస్యం చేస్తే నష్టమే.

    వీటన్నింటినీ చూస్తున్నపుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలకు తెరలేచిందని చెప్పవచ్చు. దానికి కోదండరాం నిరుద్యోగ ఆందోళన పిలుపు నాంది అయితే రానున్న నెలల్లో పరిణామాలు ఏ మలుపులు తిరుగుతాయన్నది చూడాల్సి వుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అటు కేంద్రంలో బిజెపి రాజకీయాలు, కార్యాచరణను కూడా ప్రభావితం చేస్తాయి. అది తెరాసమీద కూడా ఏదో ఒక ప్రభావం చూపకపోదు. నరేంద్రమోడీ బలహీనపడే పరిణామాలు వస్తే చంద్రశేఖరరావు వంటి వారిని మచ్చిక చేసుకుంటారు. లేదు తమకు ఎదురు లేదు అనుకుంటే మరొక విధంగా జరుగుతుంది. ఏదైనా పరిణామాలు వేగం పుంజుకుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Telangana police must immediately proceed on the registered cases against the Vice Chancellor:CPI(M)

24 Thursday Mar 2016

Posted by raomk in AP, BJP, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Telangana

≈ Leave a comment

Tags

CPI(M), Hyderabad Central University, K CHANDRA SEKHRA RAO, KCR, SITARAM YECHURY, students, Telangana, Telangana CM, University of Hyderabad (UoH)

full text of the letter addressed by CPI(M)
General Secretary, Sitaram Yechury addressed to the Telangana Chief
Minister, Shri K Chandrasekar Rao  on the brutal attack on students and
faculty members of Hyderabad Central University.

Shri Chandrasekar Rao Garu,

I have tried in vain to contact you over telephone the whole day today.
Several messages have been left with your staff, but there has been no
response.  Having thus failed, I am writing this letter.

I am writing this letter with a sense of anguish and anger.  I am
particularly agonized at writing this letter to you on the martyrdom day of
Shahid Bhagat Singh.

The brutal police attack against students and other sections of the academic
community in the Hyderabad Central University yesterday has been followed up
by another round of attack today.  Continuing the manner with which the
students were dealt with by the Telangana police yesterday, the police today
have reportedly mounted yet another attack inside the campus.  The manner in
which the girl students were attacked by the male police with  the liberal
usage of foul language against them is reprehensible.

Following the stoppage of water connection, access to wifi, food supplies to
the hostel messes, the students themselves organized the preparation of food
for the hostel inmates.  Today, all these facilities were attacked by the
police and the Vice Chancellor has reportedly shut down the hostels.

Most of us in the country are aghast at the manner in which such brutal
assault is mounted on the university community by the Telangana police in
one of the premier Central universities of our country.

The Vice Chancellor who proceeded on leave following the tragic suicide of
Rohith Vemula was booked under charges of aiding and abetting this suicide
by creating the circumstances leading to this tragedy.  Instead of
proceeding against the Vice Chancellor on this case, the Telangana police
has resorted to such brutality against the students.

The students were protesting against the return of this Vice Chancellor and
demanding that the case against him must be proceeded with.  It is clear
that the police action under the sanction of the state government was to
facilitate the return of this Vice Chancellor.

Further, we are informed that the first decision taken by the Vice
Chancellor upon the return was to defer the meeting of the Academic Council
on Thursday (March 24), which was convened by the in-charge Vice Chancellor
to discuss the setting up of an anti-discrimination committee on the campus,
to ensure adequate representation of SCs and STs  on various committees of
the university and to consider the proposal to increase the non-NET
fellowship from Rs. 8,000 to Rs. 25,000 per month on parity with the Junior
Research Fellowship in the country. The in-charge Vice Chancellor has
reportedly pleaded that he had no knowledge  of the Vice Chancellor
returning to assume charge of the university.

The Telangana government, under your stewardship, has been vocal in
announcing that it champions the interests of the overwhelming bulk of the
state’s population that comes from SC/ST and various Other Backward Classes
and the marginalized sections.  Surely, your government and administration
cannot concur with these latest decisions of this Vice Chancellor.  Yet, it
is the Telangana police, under the remit of your government, that has
spearheaded this brutal attack against the university and the students.
This has happened as the university community continues to remain
traumatized over the tragic suicide of Rohith Vemula and the circumstances
created on the campus leading to such a tragedy.

Instead of proceeding, I repeat, against the Vice Chancellor on the basis of
the case registered against him, your government has discharged this
responsibility of mounting this attack against this university community.
It is being reported in the media that 28 students, who are victims of this
brutal lathicharge, have now been remanded  into custody and lodged at the
Central Jail.

In the fitness of living up to your own  proclamations and assurances, the
arrested students must be released immediately and the cases against them
must be dropped.  The Telangana police must immediately proceed on the
registered cases against the Vice Chancellor.  As this is a Central
University, we are demanding of the Central Government that their appointed
Vice Chancellor be removed forthwith.

Yours sincerely

(Sitaram Yechury)

General Secretary, CPI(M)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: