• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: VHP

బిజెపి ఎన్నికల లబ్దికోసం బాంబు దాడులు : ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ పాపనివేదన !

03 Saturday Sep 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

An Ex RSS worker Confession, BJP, Hindutva groups, Nanded bomb blast case, Rashtriya Swayamsevak Sangh, RSS Duplicity, RSS pracharak, VHP


ఎం కోటేశ్వరరావు


గతంలో ఎన్నికల తరుణంలో ప్రవేశపెట్టే వాటికి పత్రికలు ఎన్నికల బడ్జెట్‌ అనే శీర్షికలు పెట్టేవి, ఇప్పుడు బడ్జెట్లతో పని లేకుండానే జిఎస్‌టి మండలి భారాలు మోపుతోంది. పాలకపార్టీలు కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో జనాలకు ఉపశమనం కలిగించేది లేకపోయినా ఆ ఏడాదికి భారాలు మోపకుండా చూసేవారు. ఎన్నికలంటే ఇప్పుడు దేశంలో ఏ అనర్ధం జరుగుతుందో లేదా ఏ దుర్మార్గం తలపెడతారో దాన్ని ఏ పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో అని జనాలు ఆలోచిస్తున్నారంటే కొందరికి అతిశయోక్తిగా ఉండవచ్చు గానీ, నిజం. ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అలాంటి అభిప్రాయం బలపడుతున్నది. ఎన్నికలలో బిజెపి గెలిచేందుకుగాను హిందూత్వ సంస్థలు 2000 దశకంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి వంటివి అనేక బాంబు పేలుళ్లు జరిపినట్లు మహారాష్ట్రకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ కార్యకర్త యశ్వంత షిండే 2022 ఆగస్టు 29న నాందేడ్‌ సెషన్స్‌ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. గతంలో కూడా కొందరు మాజీలు ఇలాంటి అంశాలనే వెల్లడించిన సంగతి తెలిసిందే.


నాందేడ్‌ బాంబు పేలుడు కేసులో తనను సాక్షిగా చేర్చాలని, తాను 1990 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తో కలసి పని చేశానని యశ్వంత్‌ పేర్కొన్నాడు. నాందేడ్‌ జిల్లాలో బాంబులు తయారు చేస్తుండగా పేలి 2006లో విశ్వహిందూ పరిషత్‌కు చెందిన భజరంగ్‌ దళ్‌ కార్యకర్తతో సహా ఇద్దరు మరణించారు. ఔరంగాబాద్‌ జిల్లాలోని ఒక మసీదు మీద దాడి చేసేందుకు బాంబులు తయారు చేస్తుండగా మరణించిన వారిలో ఒకడైన హిమాంశు పన్సే తనకు తెలుసునని దీర్ఘకాలం హిందూత్వ వాతావరణంలో కలసి ఉన్నామని షిండే అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ సూచనల మేరకు 1999లో హిమాంషుతో పాటు ఏడుగురిని జమ్మూలో మిలిటరీ జవాన్లతో ఆధునిక ఆయుధాలు ఉపయోగించటంలో శిక్షణ ఇప్పించేందుకు తీసుకు వెళ్లినట్ల్లు కూడా పేర్కొన్నాడు.( దీని గురించి స్పందించాలని అనేకసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు పెట్టినా ఇంద్రేష్‌ కుమార్‌ స్పందించలేదని స్క్రోల్‌ వెబ్‌సైట్‌ పేర్కొన్నది.1998లో శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయం వద్ద ఇంద్రేష్‌ కుమార్‌, సీనియర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ దివంగత శ్రీకాంత్‌ జోషితో యశ్వంత షిండే కలసి ఉన్న ఫొటోను కూడా అది ప్రచురించింది ) నాలుగు సంవత్సరాల తరువాత 2003లో పూనేలోని సింహగాద్‌ సమీపంలో బాంబుల తయారీ శిక్షణ కేంద్రానికి తాను, పన్సే హాజరైనట్లు షిండే అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఆ కాంపు ప్రధాన నిర్వాహకుడు, మూలకారకుడైన మిలింద్‌ పరండే ఇప్పుడు విశ్వహిందూ పరిషత్‌ జాతీయ నిర్వాహకుడిగా ఉన్నట్లు, కాంపులో ప్రధాన శిక్షకుడి పేరు మిథున్‌ చక్రవర్తి అని చెప్పారని, తరువాత తాను తెలుసుకుంటే అతని అసలు పేరు రవిదేవ్‌ ఆనంద్‌ అని ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ విశ్వహిందూ పరిషత్‌ నేతగా ఉన్నట్లు షిండే పేర్కొన్నాడు.


శిక్షణా కేంద్రంలో జరిగినదాన్ని వర్ణిస్తూ ఇలా పేర్కొన్నాడు.” మిథున్‌ చక్రవర్తి ఉదయం పదిగంటలకు వచ్చేవాడు, వివిధ బృందాలకు రెండు గంటలపాటు శిక్షణ ఇచ్చేవాడు. బాంబుల రూపకల్పనకు అవసరమైన మూడు నాలుగు పేలుడు పదార్దాలు, పైప్‌ల ముక్కలు, వైర్లు, బల్బులు, గడియారాలు ఇలా ఏవి అవసరమైతే వాటిని ఇచ్చేవారు. శిక్షణ తరువాత ఒక వాహనంలో సమీపంలోని నిర్ణీత అడవికి తీసుకు వెళ్లి బాంబులు ఎలా పేలేదీ పరీక్షించేవారు. శిక్షణ పొందిన వారు గోతులు తవ్వి వాటిలో బాంబులు, టైమర్లు పెట్టి పైన మట్టి దాని మీద పెద్ద రాళ్లు పెట్టేవారు. బాంబులు విజయవంతంగా పేలితే రాళ్లు చాలా దూరంలో ముక్కలుగా పడేవి.( షిండే పేర్కొన్న అంశాల గురించి స్పందించేందుకు పరండే గానీ ఆనంద్‌ వైపు నుంచీ గానీ ఉలుకూ పలుకూ లేదని స్క్రోల్‌ పేర్కొన్నది.) శిక్షణ తరువాత హిమాంషు మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంతంలో మూడు పేలుళ్లు జరిపాడు. ఔరంగాబాద్‌లో పెద్ద పేలుళ్లు జరిపేందుకు పధకం వేసి బాంబులను రూపొందిస్తుండగా 2006లో నాందేడ్‌లో అవి పేలి అతని ప్రాణాలు పోయాయి. అంతకు ముందు హిమాంషు నుంచి వేరు పడేందుకు తాను ప్రయత్నించినట్లు షిండే తన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. నాందేడ్‌ పేలుళ్ల కేసు మీద దర్యాప్తు జరిపిన సిబిఐ ఇదొక విడి సంఘటన తప్ప సంఘటిత చర్యల్లో భాగం కాదంటూ 2013లో ఒక చిన్న ఉదంతంగా పేర్కొన్నది. కానీ షిండే దాన్ని సవాలు చేశారు. సంఝౌతా రైలు పేలుడు కూడా కుట్రలో భాగమేనని, మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్‌ ధావడే తదితరులు కూడా తమతో పాటు బాంబుల తయారీ శిక్షణ పొందిన కాంపులో ఉన్నాడని చెప్పాడు. వీటిలో నాందేడ్‌ కేసు ఒక చిన్న భాగం మాత్రమే అన్నాడు.


పరండే ఎత్తుగడల గురించి తాను ప్రస్తుత అధిపతి మోహన్‌ భగవత్‌తో సహా అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో చెప్పానని, వారు పట్టించుకోలేదని, ఇవన్నీ చూసిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి నేతలందరూ ఉగ్రవాద చర్యలను సమర్ధిస్తున్నట్లు నిర్దారణకు వచ్చానని, 2014లో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత ఇంకా ప్రోత్సహిస్తున్నారని షిండే చెబుతున్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ సంగతులన్నీ ఇప్పుడెందుకు చెబుతున్నారన్న ప్రశ్నకు ప్రాణహానితో పాటు తన హృదయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉందని, హిందూత్వ భావజాలాన్ని గట్టిగా నమ్మినందున సంస్థకు చెడ్డపేరు వస్తుందనే కారణంతో మౌనంగా ఉన్నానని, ఇప్పుడు సంస్థ చెడ్డవారి చేతుల్లో పడిందని, బాగు చేయాలని అనేక మందిని కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని, అధికారం కోసం దేశాన్ని చీల్చుతున్నారని అందుకే శుద్ది చేయాలని భావించి ముందుకు వచ్చానని 49 సంవత్సరాల షిండే చెప్పాడు. తాను పదమూడు-పద్నాలుగు సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ సభ్యుడిగా కొనసాగుతున్నట్లు చెప్పాడు. సంస్థ కార్యకర్తగా 1999లో షిండే ముంబై భజరంగ్‌ దళ్‌ అధిపతిగా పని చేశాడు. తొమ్మిది సంవత్సరాల పాటు కాశ్మీరులో ఉన్నాడు. అఫిడవిట్‌ దాఖలు చేసే ముందు అమిత్‌ షాకు లేఖ రాశానని స్పందన లేదన్నాడు.నాయకుల తీరుతో ఆశాభంగం చెందినా సంఘపరివార్‌లో అనేక మంది భరిస్తున్నారని తాను నిజం చెబుతున్నట్లు వారంతా గుర్తిస్తారని అన్నారు.


వివిధ మతాల ఉగ్రవాద సంస్థలు, మాఫియా ముఠాల చేతులలో ఒకసారి చిక్కుకున్న తరువాత అందునా నేరపూరిత చర్యల్లో పాల్గొన్నవారు వాటి నుంచి వెలుపలికి రావటం అంత తేలిక కాదు. భన్వర్‌ మేఘవంశీ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దళితుడిగా సంఘపరివార్‌లో తాను ఎదుర్కొన్న వివక్షను వెల్లడిస్తూ ఏకంగా ఒక పుస్తకమే రాశారు. సానుకూల వైఖరితో ఉండాలని తోటివారు చెప్పారే తప్ప కులవివక్ష, అంటరానితనం అవొక సమస్యలుగా, చర్చించదగినవిగా కనిపించలేదన్నారు. హిందూత్వ కోసం తన జీవితాన్నే అర్పించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ తన ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు బాబరీ మసీదు కరసేవకులు తిరస్కరించారని, భిల్వారా జిల్లా సేవా భారతి నేతగా, ఇరవై సంవత్సరాలు సంఘపరివార్‌ సంస్థల్లో ఉన్నప్పటికీ తనతో పని చేసిన వారు సమాజంలో అసమానతలు తెలిసిందే, వాటిని మనం పోగొట్టలేము. ఇక్కడ మనమే కాదు సాధు, సంతులు, ఇతరులున్నారు, తక్కువ కులానికి చెందిన వారి ఇంట్లో మనం వారికి ఆహారం పెడితే వారికి ఆగ్రహం కలగవచ్చు, వెళ్లిపోవచ్చు కూడా అని చెప్పారని పేర్కొన్నారు. బాబరీ మసీదు కూల్చివేత సందర్భంగా జరిగిన పరిణామాలను పేర్కొంటూ అప్పుడు తనకు అయోధ్య కంటే ఆత్మగౌరవం ముఖ్యం అనిపించిందని, ఆర్‌ఎస్‌ఎస్‌ వంచకుల నుంచి తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించిన తరువాత తన కుటుంబం,గ్రామం నుంచి కరసేవకు ఎవరూ వెళ్లనప్పటికీ ఇతరులను నిరోధించలేకపోయినట్లు పేర్కొన్నాడు. మేఘవంశీ 1990లో కరసేవకు వెళ్లి పోలీసు దెబ్బలు తిని జైలు పాలైనప్పటికీ తరువాత మసీదు కూల్చివేతకు దూరంగా ఉన్నారు. ముస్లింలను అవమానించటంలో తొలుత తానూ ఉత్సాహపడినప్పటికీ తరువాత తగ్గానని అన్నారు.


పాతిక సంవత్సరాల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేసిన కేరళకు చెందిన సుధీష్‌ మిన్నీ దాని కుట్రలను వెల్లడిస్తూ రాసిన అంశాలు ఒక పుస్తకంగా వచ్చిన అంశం తెలిసిందే.ఐదు సంవత్సరాలపుడు బాలగోకులం పేరుతో సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో ఆ సంస్థలో చేరిన సుధీష్‌ తరువాత అంచలంచెలుగా ప్రచారక్‌గా ఎదిగాడు. చిన్నతనంలో తమను కబడ్డీ ఆడిస్తూ ఎదుటి జట్లకు ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టు పేర్లు పెట్టి విద్వేషాన్ని రెచ్చగొడుతూ వారి మీద గెలవాలని ఉద్భోధించేవారని సుధీష్‌ పేర్కొన్నారు. శిక్షణా శిబిరాల్లో కూడా ఇదే విధంగా నూరిపోశారని అన్నారు. వేదగణితం, యోగ పేరుతో ఆకర్షించి అక్కడ కూడా అదే చేస్తారని చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు ఇద్దరికి పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ నిధులు అందచేసిందని మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితుడైన దయానంద పాండే 2009లో పోలీసులకు చెప్పాడు. 2008లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత శ్యాం ఆప్టేను కలిసేందుకు పూనా వెళ్లినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి మోహన భగవత్‌, ఇంద్రేష్‌ కుమార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌లో ముస్లింల విభాగ నేత) పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు ఆప్టే చెప్పినట్లు పాండే పేర్కొన్నాడు. దీని గురించి విన్న లెప్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌ అభినవ భారత్‌ పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారిద్దరినీ అంతమొందించాలని కెప్టెన్‌ జోషి అనే అతన్ని కోరినట్లు, జోషి ఆపని చేయలేకపోవటంతో ఆప్టేకు కోపం వచ్చిందని పాండే పోలీసులకు చెప్పాడు. కల్నల్‌ పురోహిత్‌, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మాలెగావ్‌ పేలుళ్ల కుట్ర సూత్రధారులని వెల్లడించాడు.


సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేల్చివేత కుట్రలో స్వామి అసిమానంద పోలీసుల ముందు అంగీకరించిన అంశాలు కాంగ్రెస్‌ ఎత్తుగడలో భాగమని 2011లో బిజెపి ఆరోపించింది. 2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేల్చివేత కేసులో ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ కార్యకర్త కమల్‌ చౌహాన్‌ 2012లో విలేకర్లతో మాట్లాడుతూ తాను బాంబులు పెట్టానని వెల్లడించాడు. దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తోసి పుచ్చింది. ఎన్‌ఐఏ సిబ్బంది కొట్టిన కారణంగా ఎవరైనా అలా చెప్పి ఉండవచ్చు తప్ప తమకు సంబంధం లేదని అన్నది. దీనిలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఏ పార్టీ అయినా తన పాత్రను అంత తేలికగా అంగీకరించదు. ఇలాంటి స్వచ్చంద ప్రకటనల వెనుక వత్తిడి, ప్రలోభాలు, బెదిరింపులు,పోలీసుల దెబ్బలుంటాయని ఆరోపిస్తారు.


” మత మార్పిడులు : ఒక మాజీ క్రైస్తవుని పాప నివేదన ” అనే శీర్షికతో ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 2021 డిసెంబరు 29న ఒక వార్తను ప్రచురించింది. హిందూమతానికి ముప్పు వచ్చింది, దేశంలో మనం మైనారిటీలుగా మారుతున్నాం దీన్ని అరికట్టాలంటూ అనేక మందిని హిందూత్వవాదులుగా సంఘపరివార్‌ దళాలు మార్చుతున్నాయి. నేరాలకు పురికొల్పుతున్నాయి. అదే విధంగా క్రైస్తవమతాన్ని పుచ్చుకొని ఏసుక్రీస్తును ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయంటూ మతానికి చెందిన వారు కూడా మతమార్పిడులకు పాల్పడుతున్నారు. హిందూ సమాజంలో మీ పట్ల వివక్ష ఉంది మా మతంలో చేరితే సోదరులుగా చూస్తామంటూ ఇస్లాం కూడా దళితులను మతమార్పిడికి ప్రోత్సహించింది. అలా మారినవారిలో పరివర్తన కలిగితే మతాల పేరుతో చేసిన అక్రమాలను వెల్లడించవచ్చు. లేదా తమను ఎలా మార్చిందీ వివరించవచ్చు. అవి వాస్తవాలని ఆర్గనైజర్‌ పత్రిక, ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తున్నది. అదే తమ సంస్థల నుంచి వెలుపలికి వెళ్లిన వారు వెల్లడించిన అంశాలు అవాస్తవాలని కొట్టి వేస్తున్నది. తమ వారి మీద వత్తిడి,ప్రలోభాలు వున్నట్లు చెబుతున్న సంఘపరివార్‌ సంస్థలు తమ పత్రికలో ప్రచురించిన పాపనివేదన ప్రకటించిన వారి వెనుక కూడా అలాంటివే ఉన్నట్లు చెబుతాయా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రామాలయం – రావణ కాష్టం !

26 Monday Nov 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Ram Statue, Ravana kashtam, Siva Sena, VHP

Image result for ram statue in ayodhya

ఎం కోటేశ్వరరావు

రావణుడి భార్య మండోదరి శాపానికి భయపడిన దేవతలు ఆమె నిత్య సుమంగళిగా వుండేందుకు గాను రావణుడి చితిని శాశ్వతంగా మండుతూనే వుండేట్లు ఏర్పాటు చేశారట. ఒక సమస్య ఎడతెగకుండా సాగుతూ వుంటే దాన్ని రావణకాష్టంతో మన పెద్దలు పోల్చారు. రావణుడిని తప్పుడు పద్దతుల్లో హతమార్చిన రాముడికి ఆలయాన్ని కడతా మంటున్న సంఘపరివార్‌, దానితో పోటీబడుతున్న ఇతర మతోన్మాద శక్తులు ఇప్పుడు రామాలయాన్ని కూడా అలాగే మార్చినట్లు ఈ పాటికే చాలా మందికి అర్ధం అయింది. ఆదివారం నాడు అయోధ్యలో రామాలయాగ్నికి విశ్వహిందూపరిషత్‌, శివసేన, ఇతరులు రానున్న రోజుల్లో మరింత ఆజ్యాన్ని పోస్తామని ప్రకటించారు.బాబరీ మసీదు స్ధల వివాదంపై సత్వరమే కోర్టు తీర్పు రాకుండా న్యాయమూర్తులను కాంగ్రెస్‌ బెదిరించిందంటూ ప్రధాని నరేంద్రమోడీ ఇదే సమయంలో ఎన్నికల సభల్లో ఆరోపించారు. వారికి అంత సీను వుంటే మూడు ముక్కలు చేసి ఒక ముక్కను ముస్లింలకు రెండు ముక్కలను హిందువులకు ఇవ్వాలని 2010లో తీర్పు చెప్పిన అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులనే ప్రభావితం చేసి వుండేవారు ఏదీ దొరక్క ఆధారం లేని ఈ సాకును ప్రధాని ఎంచుకున్నారన్నది స్పష్టం. మరో విధంగా చెప్పాలంటే హిందూత్వశక్తులు ప్రకటించిన ఆందోళనకు మద్దతు తెలపటమే.

హిందూత్వ సంస్ధలు ప్రకటించినట్లుగా మరోసారి రామాలయ నిర్మాణాన్ని వుత్తరాదిన ముందుకు తెస్తున్నారు. దక్షిణాదిన శబరిమల అయ్యప్ప పేరుతో ఒక ఒక అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. బిజెపి మతోన్మాదంతో కాంగ్రెస్‌ కూడా పోటీపడుతూ ఓట్ల కోసం రెండు సమస్యల్లోను మతాన్ని ముందుకు తెస్తోంది. మతోన్మాద బిజెపిని ఎదిరించాలంటే కాంగ్రెస్‌ను కలుపుకోవాలని సలహాలు ఇస్తున్న వారు ఒకసారి అవలోకనం చేసుకోవటం మంచిది. అయోధ్య, అయ్యప్ప రెండు ఆందోళనల నిర్వాహకులూ ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ శక్తులే. గతంలోనూ తాజాగా శివసేన కూడా వారితో పోటీ పడుతోంది.ఆదివారం నాడు అయోధ్యలో నిర్వహించిన ధర్మ సభ సందర్భంగా రాష్ట్ర బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలను అమలు చేసింది. శివసేననేత వుద్దావ్‌ థాకరే నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.

దేశంలో మత లేదా మతోన్మాద శక్తులు అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. వారు కోరుకున్నది ఒకటి వస్తున్న ఫలితం మరొకటి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఒక వైపు వ్యతిరేకిస్తూ ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. తమ ఆందోళన అసలు లక్ష్యం సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అని బిజెపి నేత బాహాటంగా చెప్పాడు. అయోధ్య, శబరిమల రెండు చోట్లా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారి గురించి జనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

శబరిమల వుదంతంలో కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసి తాము అనుకున్నదానికి వ్యతిరేకంగా వచ్చే సరికి అయ్యప్పను వీధుల్లోకి లాగుతున్నారు. వయస్సులో వున్న ఆడవారు తనను చూడకూడదని అయ్యప్ప చెప్పటాన్ని తాము స్వయంగా విన్నామన్నట్లుగా మాట్లాడుతున్న వారు మరోవైపు అదే వయస్సులో వున్న మహిళలను ముందుకు తెచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే తాము కోరుకున్న విధంగా కేంద్రం ఒక చట్టాన్ని చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని రామమందిరం నిర్మించాలంటున్నారు. తాము కోరుకున్నది తప్ప కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇవ్వబోయే తీర్పులను కూడా తాము అంగీకరించేది లేదని రాజ్యాంగమూ, కోర్టులు, చట్టాలను తాము పట్టించుకొనేది లేదని ప్రకటించే వుగ్రవాద సంస్ధలకూ వీటికి తేడా ఏమిటో జనం ఆలోచించాలి.

పరిష్కారమైన శబరిమల కేసును తిరిగి వివాదంగా మార్చ చూస్తున్నది మతశక్తులు. తీర్పు రాక ముందే బాబరీ మసీదు స్ధల తీర్పు ఎలా వుండాలో నిర్దేశిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సదరు స్ధలం ముస్లింలదే అని తీర్పు వచ్చే అవకాశం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్ధలు భావిస్తున్నాయా? అందుకే ప్రత్యేక చట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయా? కేంద్రంలో పూర్తి మెజారిటీ వున్న బిజెపి ప్రభుత్వం వుండగా నాలుగున్నర సంవత్సరాల పాటు వేచి వుండి ఆ డిమాండ్‌ను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చినట్లు ? బాబరీ మసీదు స్థల వివాద కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించారా? స్ధల వివాద కేసులో వున్న అప్పీళ్లు జనవరిలో విచారణకు వస్తాయని, ఆ లోగా విచారించి తేల్చాల్సిన అత్యవసరమేమీ లేదని, వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం, అఖిల భారత హిందూమహాసభ తదితరులు చేసిన వినతిని నవంబరు రెండవ వారంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు ఆ కేసు తేలదని స్పష్టమై పోయింది. అసలింతకీ ఆ కేసు ఏమిటి? దాని మీద వచ్చే తీర్పు పర్యవసానాలేమిటి? అసలు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు, ఆ స్ధలం పూర్తిగా తమదే అని త్వరలో రామాలయ నిర్మాణ తేదీని ప్రకటిస్తామని విశ్వహిందూ పరిషత్‌ నేతలు ప్రకటించారు. అంటే కరసేవ ముసుగులో బాబరీ మసీదును కూల్చివేసినట్లుగా యోగి సర్కార్‌ మద్దతుతో వివాదాస్పద స్ధలంలో రామాలయ నిర్మాణం చేపడతారా ?

సుప్రీం కోర్టులో నడుస్తున్న వివాదం ఆస్ధి పరమైనది. అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు స్దలాన్ని సేకరించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేసిన కేసులో ఇస్లాం మతావలంబనలో మసీదులు తప్పనిసరేమీ కాదని సుప్రీం కోర్టు 1994లో చెప్పింది.ఈ తీర్పును కూగా గమనంలోకి తీసుకొని 2010లో అలహాబాద్‌ హైకోర్టు 2.77 ఎకరాల బాబరీ మసీదు స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక ముక్కను ముస్లింలకు, ఒక ముక్కను నిర్మోహీ అఖారాకు, మూడో ముక్కను రామాలయానికి ఇవ్వాలని చెప్పింది. ఆ తీర్పును ముస్లిం సంస్ధలు సవాలు చేశాయి. 1994 సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించాలన్న వినతిని ఇటీవల సుప్రీం కోర్టు 2-1 మెజారిటీతో తిరస్కరించింది. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తి అశోక్‌ భూషణ్‌ ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఆ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొనగా మరో న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ విబేధించి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. 1994నాటి తీర్పు మతానికి సంబంధించింది కాదని భూసేకరణ సంబంధమైనదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పగా సమగ్ర పరిశీలన లేకుండానే నాటి తీర్పు ఇచ్చారని అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆ కేసులో చేసిన వ్యాఖ్యలు అలహాబాద్‌ హైకోర్టును ప్రభావితం చేశాయని అన్నారు. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించకుండా న్యాయమైన నిర్ణయానికి రాలేరని ముస్లిం సంస్ధల ప్రతినిధులు వాదిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 27న 1994నాటి తీర్పును పునర్విచారణకు తిరస్కరించిన సుప్రీం కోర్టు తమ విచారణ వాస్తవాలపైనే ఆధారపడి వుంటుందని, గత తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విచారణను వేగంగా నిర్వహించాలని హిందూ సంస్ధలు చేసిన వినతిని నవంబరు 12న సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరిలో చేపడతామని పేర్కొన్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని అనేక మంది ముఖ్యంగా హిందూ సంస్ధలు భావించాయి. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత జరపాలని గతేడాది డిసెంబరులో న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

ఈ పూర్వరంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంఘపరివార్‌ సంస్ధలు, శివసేన రంగంలోకి దిగాయి. ఆదివారం నాటి ధర్మ సభ ఆఖరిదని తరువాత ఇంకెలాంటి సభలు వుండవని తదుపరి కార్యాచరణ రామాలయ నిర్మాణమే అని విశ్వహిందూపరిషత్‌ ప్రకటించింది. ప్రతి సారీ ఎన్నికల ముందు రామాలయ నిర్మా ణాన్ని లేవనెత్తి అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారని ఎంతకాలమిలా జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తారని శివసేన నేత వుద్దావ్‌ రెచ్చగొడుతున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువలన ధర్మ సభ తరువాత ఈ శక్తులు ఎన్ని అధర్మాలకు, అరాచకాలకు పాల్పడతాయో చెప్పలేము. 1992 డిసెంబరు ఆరు నాటి బాబరీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి బిజెపి సీనియర్‌ నేతలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఓట్ల రాజకీయం గాకపోతే ఇంతకూ విశ్వహిందూపరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరి మీద ఆందోళనలకు దిగుతున్నట్లు? అటు కేంద్రంలోనూ ఇటు అత్యధిక రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వుంది. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోంది. ఎవరు అడ్డుకున్నారు ?నెపాన్ని కోర్టులు, న్యాయమూర్తుల మీద, కాంగ్రెస్‌ మీద మోపే యత్నం తప్ప బాబరీ మసీదు వివాదంలో కోర్టు తీర్పులు చెల్లవు, ప్రభుత్వం చేసేదే అంతిమ నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసినా అడ్డుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు. హిందూత్వ సంస్ధలు చేసే ఆందోళన దేశమంతటినీ మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించే వారిని లేపలేము. తన ప్రభుత్వ అన్ని రకాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని అనేక మంది పరిశీలకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.నేతల మాటల తూటాలను చూస్తే అవి ఎన్నికల్లో ఓట్లగాలం అన్నది స్పష్టం.

మతోన్మాద రాజకీయాల్లో బిజెపితో పోటీ పడుతున్న శివసేన నేత వుద్దావ్‌ ధాక్రే భార్య, కుమారుడితో సహా వచ్చి అయోధ్యలోని బాబరీమసీదు స్ధలంలోని వివాదాస్పద రాముడి విగ్రహాన్ని సందర్శించారు. మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ తేవాలని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రామాలయ నిర్మాణ అవకాశాలను చూస్తామంటున్నారు మీరు, గత నాలుగు సంవత్సరాలలో ఎన్నింటిని చూశారు, ఈ ప్రభుత్వం నిర్మాణం చేయకపోతే తరువాత ఎవరు చేస్తారు, ప్రభుత్వ ఏర్పాటు కాదు మందిరాన్ని త్వరగా నిర్మించాలి అని వుద్ధావ్‌ థాక్రే వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఆఖరి పార్లమెంటు సమావేశాలివే, అందువలన ఆర్డినెన్స్‌ తీసుకురండి, ఏమైనా చేయండి సాధ్యమైనంత త్వరలో ఆలయ నిర్మాణం చేయండి. నేను రామ్‌లాలా విగ్రహదర్శనానికి వెళితే ఒక జైల్లో ప్రార్ధనలకు వెళ్లినట్లుగా వుంది తప్ప మరొక విధంగా నాకు అనిపించలేదు. నాకు ఎలాంటి చాటు మాటు అజెండా లేదు, రామాలయాన్ని ఎపుడు కడతారని ఈదేశ హిందువులు అడుగుతున్నారు, ఎంతకాలం వేచి వుండాలి, కనుచూపు మేరలో మందిరం కనిపించటం లేదు,ఎప్పుడు దాన్ని చూస్తాము అని ధాకరే ప్రశ్నించారు. హిందువులింకేమాత్రం మౌనంగా వుండరు, కచ్చితంగా ఏ తేదీన నిర్మాణాన్ని ప్రారంభిస్తారో చెప్పండి, దాన్ని మీ నుంచి తెలుసుకొనేందుకే నేను ఇక్కడకు వచ్చాను అన్నారు. శివసేన అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బిజెపితో కలసి అధికారాన్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే.

రామాలయ ఆందోళనలో శివసేన పాత్ర లేదు, రామలాల విగ్రహాలను క్షణకాల సందర్శనకు వుద్ధావ్‌ ధాక్రేకు ఎలాంటి సమస్య లేదు, కానీ బాలాసాహెబ్‌ థాక్రే బతికి వుంటే వుద్ధావ్‌ చేస్తున్న వాటిని నిరోధించి వుండేవాడు, ధర్మసభ ఏర్పాటులోనూ శివసేనకు ఎలాంటి పాత్ర లేదు బాలాసాహెబ్‌ బతికి వుంటే విశ్వహిందూపరిషత్‌కే మద్దతు ఇచ్చి వుండేవాడు అని యుపి వుపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు. రామాలయ సమస్యను శివసేన ఎలా హైజాక్‌ చేస్తుంది, వుత్తరాది వారి మీద దాడి చేసి వారిని వెళ్లగొట్టిన జనాలు వారు, మానవాళికి సేవచేయాలనే మానసిక స్ధితి కూడా లేని వారు రాముడిని ఎలా సేవించగలరు అని బిజెపి ఎంఎల్‌ఏ సురేంద్ర సింగ్‌ శివసేన నేత మీద విరుచుకుపడ్డారు. ఎన్నికలున్నందున ప్రతివారూ అయోధ్య వెళుతున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా వుద్దావ్‌ థాక్రేను వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు. ఒక వైపు వారు బిజెపి స్నేహితులు మరొకవైపు తాము రామాలయ నిర్మాణం పట్ల ఆసక్తితో వున్నామని, ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తున్నట్లు చెబుతూ జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయలేరు అని కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

కేసు సుప్రీం కోర్టులో వుంది. దాని తీర్పు కోసం వేచి చూడాలి లేదా ఏకాభిప్రాయాన్ని సాధించాలి, ప్రభుత్వానికి చాలా స్ధలం వుంది. సరయూ నదీ తీరంలో రామాలయాన్ని నిర్మించవచ్చు. వివాదాస్పద స్ధలం గురించి ఎలాంటి చర్చలు వద్దు అని ప్రగతిశీల సమాజవాది పార్టీ (లోహియా) నేత శివపాల్‌ యాదవ్‌ అన్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎవరిదంటే నరేంద్రమోడీది అని చెబుతారు.182 మీటర్ల వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ రాజకీయాల్లో మోడీతో పోటీ పడుతున్న యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అంతకంటే పెద్దదైన 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని నెలకొల్పి రికార్డును తన పేరుతో నెలకొల్పాలని చూస్తున్నారు. ఆదివారం ధర్మ సభకంటే ముందు ఒక రోజు హడావుడిగా విగ్రహ ప్రకటన చేయటం గమనించాల్సిన అంశం. విగ్రహాన్ని 50 మీటర్ల ఎత్తు దిమ్మె మీద ఏర్పాటు చేస్తారు. విగ్రహం 151 మీటర్లు కాగా మరో 20 మీటర్ల గొడుగు దాని మీద ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎక్కడ, ఎంత ఖర్చుతో ఏర్పాటు చేస్తారో వివరాలు వెల్లడించలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆవులు-దళితులు-ఓట్లు మధ్యలో తొగాడియా

15 Monday Aug 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

BJP, cows, dalits, Narendra Modi, praveen togadia, RSS, VHP, votes

Massive Dalit rally in Una, Muslims also participate, Dalits vow not to pick dead cows

దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఆగస్టు 15న గుజరాత్‌లోని వునాలో నిర్వహించిన పెద్ద బహిరంగ సభలో ఒక భాగం

సత్య

   చచ్చిన ఆవుల చర్మాలు తీస్తున్న తమపై చేస్తున్న దాడులకు నిరసనగా ఆ వృత్తికి స్వస్తి చెబుతామంటూ కళేబరాలను వదలి వేస్తున్నారు ఒకవైపు దళితులు. మరోవైపు వట్టి పోయిన వాటినే గాక పాలిచ్చే అవులను కూడా అమ్ముకోకుండా చేస్తూ నష్టపరుస్తున్నందుకు నిరసనగా  వట్టిపోయిన ఆవులను అధికార కూటమి ఎంఎల్‌ఏల ఇండ్ల ముందు వదలి వేస్తామని పంజాబ్‌ రైతులు హెచ్చరికలు జారీ చేశారు. ఆవులతో పాటు గో సంరక్షకులకు గుర్తింపు కార్డులివ్వాలని హర్యానా ఆవుల కమిషన్‌ ప్రతిపాదించింది. గోనంరక్షుల ముసుగులో దుకాణాలు తెరిచారని, ఎనభై శాతం వరకు నకిలీలున్నారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్‌ అధినేత ప్రవీణ్‌ తొగాడియా రుసురుసలాడుతున్నారు. ప్రధాని చెప్పిన సమాచారం ఎవరిచ్చారో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. సంరక్షకులను నిరాశపరిచారు, అవమానపరిచారంటూ ధ్వజమెత్తారు. కావాలంటే నా మీద దాడులు చేయండి తప్ప నా దళిత సోదరుల మీద కాదంటూ కొద్ది రోజుల క్రితం గొప్పనటన ప్రదర్శించిన నరేంద్రమోడీ సోమవారం నాడు మరొక అడుగు ముందుకు వేశారు. వేలాది సంవత్సరాల మన నాగరిక చరిత్రలో మహాభారత భీముడి నుంచి భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ వరకు మన సమాజం ఎంతో సుదీర్ఘ ప్రయాణం సాగించిందని ప్రధాని నరేంద్రమోడీ తన ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు.

    సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే దళితుల ఓట్ల వేటలో భాగంగా భీ-భీ ప్రాసకోసం పడిన పాట్లు తప్ప మరొకటి కాదు. మహాభారతం కంటే ముందుదైన రామాయణ కాలంలో నాగరికత లేదా ? ప్రధాని ప్రసంగం రాసిన వారికి ఈ మాత్రం తెలియదా అని ఎవరైనా అనుకోవచ్చు. పోనీ ప్రాసకోసం ఆ పెద్దమనిషి రాస్తే ఇన్నేండ్లుగా రామ భజన చేస్తున్న నరేంద్రమోడీకి ఆమాత్రం తెలియదా, ముందుగానే చదువుకోరా ? సలహాదారులకు కూడా తట్టలేదా ? బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా భాషలో చెప్పాలంటే మేడంటే మేడా కాదూ, రెండంటే రెండూ కాదు అన్నట్లుగా అవసరార్దం చెప్పే అనేక మాటల్లో ఇదొకటి ( జుమ్లా ). మొత్తానికి వచ్చే ఏడాది జరిగే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆవులు-దళితులు- ఓట్ల రాజకీయం మహా రంజుగా నడుస్తున్నది. మధ్యలో ప్రవీణ్‌ తొగాడియా తగులుకున్నాడు.

punjab, punjab cows, punjab cow vigilantes, punjab protests, punjab gau rakshaks, punjab protests, ludhiana protests, dairy farmers protest, india news, punjab news

   ఆవు కమిషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లోని లూధియానా జిల్లా జగ్రాన్‌లో ప్రదర్శన జరుపుతుననష్ట్ర& పాడి రైతులు

    పంజాబ్‌ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం గోసేవ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ పాడి రైతుల నాశనానికి వచ్చిందంటూ దానిని రద్దు చేయాలని ప్రోగ్రెస్‌ డెయిరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. పాలిచ్చే ఆవుల వ్యాపారాన్ని కూడా దెబ్బతీసేందుకు గో సంరక్షకులు కుమ్మక్కు కావటంపై కూడా దర్యాప్తు జరపాలని పాల రైతుల అసోసియేషన్‌ అధ్యక్షుడు దల్జిత్‌ సింగ్‌ తన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గోసేవ కమిషన్‌ రూపొందించిన నిబంధనలను చూస్తే ఆవుల అమ్మకం, రవాణా అసాధ్యం అవుతుందని, గోరక్షకుల పేరుతో వున్నవారు వ్యాపారులను భయకంపితులను చేస్తున్నారని తెలిపారు. కమిషన్‌ చర్యల పట్ల నిరసనగా పంజాబ్‌లో అతి పెద్ద మార్కెట్‌ వున్న జగ్రాన్‌ పట్టణంలో వందలాది మంది పాల రైతులు, వ్యాపారులు, రవాణా సిబ్బంది గురువారం నాడు ప్రదర్శన జరిపారు. వట్టిపోయిన ఆవులను స్ధానిక శాసన సభ్యుడు ఎస్‌ ఆర్‌ కెలెర్‌ ఇంటి ముందు కట్టి వేసి వాటిని ఆయనకు బహుమానంగా ఇస్తున్నామని ప్రభుత్వం వసూలు చేస్తున్న ఆవు పన్నుతో వాటి ఆలనా పాలనా చూడాలని కోరుతూ నినాదాలు చేశారు.

   గోసేవ కమిషన్‌ నిర్వాకంతో లక్షాపాతికవేల రూపాయలున్న పశువుల ధర 50-60వేలకు పడిపోయిందని, నిరభ్యంతర పత్రం వుంటే తప్ప పశువులను కొనుగోలు చేసే అవకాశం లేనందున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారెవరూ వుండరని దీంతో రాబోయే రోజుల్లో మరింతగా ధరలు పడిపోతాయని దల్జిత్‌ సింగ్‌ చెప్పారు. గోసేవ కమిషన్‌ అండ చూసుకొని శివసేన, భజరంగదళ్‌, గోరక్షదళాల పేరుతో వున్నవారు వేధింపులకు పాల్పడుతున్నందున అసలు కమిషన్నే ఎత్తివేయాలని కోరుతున్నట్లు చెప్పారు. వేధింపుల గురించి నిర్ధిష్ట ఫిర్యాదులు చేసినా ముఖ్యమంత్రితో సహా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. బయటకు వెళ్లే అవకాశం లేని కారణంగా వట్టిపోయిన ఆవుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. గోరక్షకుల పేరుతో వున్నవారు ఆవుకు రెండు వందలు లేదా లారీకి రెండువేల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి.

     ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చిన మాదిరిగా ఆవులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని హర్యానా బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది.ఆవులతో పాటు వాటి సంరక్షకులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. గోరక్షక దళానికి పోలీసు శాఖ గుర్తింపు కూడా ఇప్పించాలని తలపెట్టినట్లు హర్యానా ఆవుల కమిషన్‌ పేర్కొన్నది. ఇప్పటికే గోరక్షక దళం పేరుతో వున్నవారు తమకు తామే గుర్తింపు కార్డులు ఇచ్చుకున్నారు. వాటికి అధికారిక ముద్ర వేయనున్నారు. హర్యానాలో దళితుల రక్షణకు ప్రత్యేక అధికారి లేరు గానీ గోవుల రక్షణ విభాగానికి ఐజి స్ధాయి అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆవుల సంరక్షణకు 2010లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఒక కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.దానికి ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాం మంగ్లా అధ్యక్షుడిగా వున్నారు. గోవుల రక్షణ విభాగం ఐజి భారతీ అరోరా మాట్లాడుతూ కొందరు దున్నలు, బర్రెల రవాణాను కూడా అడ్డుకొని డబ్బు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. ఎక్కువ మంది అత్యుత్సాహంతో, ఆవేశంతో వున్నారని చెప్పారు. గుర్తింపు కార్డుల గురించి చెబుతూ కొన్ని గోరక్షక దళాలు నిజమైనవే అయినప్పటికీ ఎక్కువభాగం కాదని అందువలన గుర్తింపు కార్డులు ఇవ్వదలచుకుంటే పోలీసు తనిఖీ తరువాత జారీ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఎలాంటి గుర్తింపు లేకుండానే దాడులకు పాల్పడుతున్న ఈ శక్తులకు నిజంగానే అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వటం మంటే వారు చేస్తున్న బలవంతపు వసూళ్లకు చట్టబద్దత కల్పించటం తప్ప మరొకటి కాజాలదు.

    విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ప్రవీణ్‌ తొగాడియా-నరేంద్రమోడీ గుజరాత్‌లో సంఘపరివార్‌కు జంట నాయకులుగా పని చేసిన చరిత్ర వుంది. గో రక్షకులలో 80శాతం నకిలీలేనని ప్రధాని వ్యాఖ్యానించటం ద్వారా వారిని అవమానించారని, వేధింపులకు గురిచేయటమేనని తొగాడియా ధ్వజమెత్తారు. దళితుల ఓట్లకు దెబ్బతగుల కుండా చూసేందుకు ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి దిగిన నేపధ్యంలో గో రక్షకులందరూ నిజాయితీపరులేనని తొగాడియా కితాబు నివ్వటం గమనించాల్సిన అంశం. ఒకరు పిర్ర గిల్లితే మరొకరు జోల పాడటం అంటే ఇదే. ప్రధాని వ్యాఖ్యలతో సాధు, సంతులు విలపిస్తున్నందున తాను మాట్లాడక తప్పటం లేదని తొగాడియా చెప్పారు.దళితులపై దాడులకు గో సంరక్షణకు ముడి పెట్టటం హిందూ సమాజాన్ని చీల్చేందుకు ఒక కుట్ర అని ఆరోపించారు.

    ఇలా అయితే మన దేశంలో ఆవులు అంతరిస్తాయని బీహార్‌కు చెందిన 92 ఏండ్ల మహిళ అన్నారని, మీరు మౌనంగా ఎందుకున్నారని లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ప్రశ్నించారని తొగాడియా చెప్పారు. ‘మీకు(ప్రధాన మంత్రి) ఎనభైశాతం మంది గోరక్షకులు నేరగాళ్లు, మోసగాళ్లు మరియు పాపులు ఎందుకంటే వారంతా హిందువులు కనుక ‘ అని తొగాడియా వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ ‘ ప్రధాన మంత్రి గారూ మీరు గో సంరక్షకుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. దానికి ఆధారం ఎక్కడ ? మీ దగ్గర వుంటే దయచేసి బయట పెట్టండి, ఆవులు కటిక వారి చేతిలో వధ అవుతున్నాయి మీరు ఎక్కువ భాగం ప్లాస్టిక్‌ తిన్న కారణంగా మరణిస్తున్నట్లు చెప్పారు. కటిక వారి తీవ్రమైన నేరాన్ని మాఫీ చేశారు, ప్రధాన మంత్రి అబద్దాలు చెబుతున్నారని చెప్పాలని నేను కోరుకోవటం లేదు, ఎందుకంటే ఆయన నాకూ ప్రధానే, అయితే ఆయన ప్రసంగం తరువాత నేను అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాను, వారిలో ఏ ఒక్కరూ కూడా అలాంటి సమాచారం ఆయనకు ఇచ్చామని నాకు చెప్పలేదు. కాబట్టి ఆయనకున్న సమాచార వనరు ఏమిటో బయట పెట్టాల్సిన బాధ్యత ప్రధానిదే ‘అన్నారు. ప్రధాని ప్రకటనను ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించిన తరువాత మీరు ఇలా మాట్లాడటం ఏమిటి అన్న ప్రశ్నకు ‘నేను ఎంతో బాధ్యతా యుతంగా మాట్లాడానని ‘ అని మాత్రమే జవాబిచ్చిన తొగాడియా నరేంద్రమోడీ తన బాల్య స్నేహితుడు అని కూడా వెల్లడించారు. (అయితే ఇద్దరూ కలిసి టీ అమ్మారా అని అడగకండి, మోడీ కంటే ఆరు సంవత్సరాలు చిన్న అయిన తొగాడియా క్యాన్సర్‌ వైద్య నిపుణుడు) ఆవుల వధ, దొంగరవాణా నిరోధం, గొడ్డు మాంస ఎగుమతుల నిరోధం గురిచి ప్రధాని కార్యాలయంలో రోజంతా పనిచేసే సహాయ కేంద్రాన్ని ప్రారంభించినపుడు తాను చేసిన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్రమోడీ వుపసంహరించుకోవాలని కూడా తొగాడియా డిమాండ్‌ చేశారు.దేశమంతటా గోవధను నిషేధిస్తానని వాగ్దానం చేసిన ప్రధాని దానిని నిలుపుకోకుండా గోరక్షకులపై విరుచుకుపడి లక్షలాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచారు. బగోవధను ఆపమని ఒక సలహా ఇస్తారని అనుకున్నాం కానీ ప్రధానీ మీరు హృదయాలను గాయపరిచారు… మన గోవులను మనం రక్షించుకోలేకపోతే ఇంక ఆత్మహత్యలు చేసుకోవటం మంచిది, ఇంతటి అవమానం గతంలో ఎన్నడూ జరగలేదని గోరక్షకులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారికి మద్దతుగా గోరక్షకులు, వారి కుటుంబాలు నిలబడాలని తొగాడియా పిలుపునిచ్చారు.

     నిజానికి తొగాడియా విమర్శలు, నరేంద్రమోడీ హెచ్చరికలు రెండూ కూడా లాలూచీ కుస్తీ తప్ప వేరు కాదు. ఎందుకంటే అటు దళితులు ఓట్లతో పాటు వెర్రెక్కిన మతశక్తులు కూడా వారికి అవసరమే కదా ! ఈ కారణంగానే తొగాడియా వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. బిజెపి జాతీయ ప్రతినిధి సిద్ధార్ధ నాధ్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రధాని ఏం చెప్పారో దేశం దాన్నే అనుసరించాలి అని ముక్తసరిగా వ్యాఖ్యానించారు. సంఘపరివార్‌లో ప్రవీణ్‌ తొగాడియా సాదా సీదా కార్యకర్తేమీ కాదు, ఆయన చేసిన తీవ్ర విమర్శలకు నరేంద్రమోడీ లేదా ఆయన అంతరంగంగా పరిగణించబడే నాయకులైనా స్పందింకపోతే నరేంద్రమోడీ అబద్దాల కోరుగా మిగిలిపోతారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మాండ్యలో మతశక్తులకు శృంగ భంగం

17 Sunday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhajarangdal, BJP, karnataka, love jihad, Mandya, RSS, RSS game, VHP

లవ్‌జీహాద్‌ ముసుగులో రాజకీయం చేస్తున్న బిజెపి, సంఘపరివార్‌

ఎం కోటేశ్వరరావు

    లవ్‌ జీహాద్‌ పేరుతో సంఘపరివార్‌ శక్తులు సమాజంలో మతపరమైన చీలికలు తెచ్చేందుకు, మెజారిటీ మత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు చాలా కాలంగా వినపడుతున్న విషయం తెలిసిందే. లవ్‌ జీహాద్‌ అంటే హిందూ మతానికి చెందిన బాలికలను వివాహం పేరుతో ముస్లిం యువకులు ఆకర్షించి వారిని మతమార్పిడి చేస్తున్నారనే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలోని మైసూరు సమీపంలోని మాండ్యకు చెందిన రెండు కుటుంబాలు తమ బిడ్డలకు మతాంతర వివాహం చేయటాన్ని సహించలేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మత శక్తులు, వక్కలిగ కులశక్తులు శనివారం నాడు జిల్లా బంద్‌కు ఇచ్చిన పిలుపును జనం పట్టించుకోలేదు. మాండ్య పట్టణానికి చెందిన అషిత(28), ఆమె చిన్ననాటి నుంచి స్నేహితుడు, పొరుగున వున్న షకీల్‌ (28) వివాహం సందర్బంగా ఆదివారం సాయంత్రం ఏడున్నరకు మైసూరులో విందు ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన సంఘపరివార్‌ శక్తులు మాండ్యలో అషిత నివాసం ముందు వివాహ వ్యతిరేక ప్రదర్శన చేశారు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించటంతో శనివారం నాడు లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకం అనే పేరుతో మాండ్య జిల్లా బంద్‌కు పిలుపునిచ్చి అభాసు పాలయ్యారు.ఈ వివాహానికి వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తూ మత, కుల శక్తుల వైఖరిని ఖండించాయి. వధూవరుల, తలిదండ్రులు రక్షణ కల్పించమని ఎలాంటి వినతి చేయనప్పటికీ తామే ముందు జాగ్రత్త చర్యగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    భజరంగదళ్‌, బిజెపి కార్యకర్తలు పోలీసు డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు.వారి గురించి పట్టించుకోని ఇరు కుటుంబాల వారు వివాహ ఏర్పాట్లు కొనసాగించారు. శుక్రవారం నాడు పసుపు, శనివారం నాడు మెహందీ క్రతువులను నిర్వహించారు. వధువు తండ్రి, పిల్లల డాక్టర్‌ నరేంద్రబాబు పత్రికలవారితో మాట్లాడుతూ ‘నేను పూర్తిగా లౌకిక వాదిని. దేవుడు అంటే ఒక శక్తి(బలం) అని నమ్మేవాడిని, ఆచారాల పట్ల నాకు విశ్వాసం లేదు. వివాహంలో హిందూ లేదా ముస్లిం సంప్రదాయాలను పాటించటం లేదు. దేవుడి ముందు ఒక కార్యక్రమం వుంటుంది. తరువాత మైసూరులో విందు ఏర్పాటు చేశాము ‘ అని చెప్పారు. ‘వరుడు షకీల్‌ తండ్రి ముక్తార్‌ అహ్మద్‌, నేను 50 సంవత్సరాలుగా స్నేహితులం. మా ఇంటి సమీపంలోనే ముక్తార్‌ వ్యాపారం చేస్తాడు. నా కంటే ముక్తార్‌ రెండు సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ మేం ఇద్దరం కలిసే స్కూలుకు వెళ్లాము. నా కుమార్తె అషిత, ముక్తార్‌ రెండవ కుమారుడు షకీల్‌ చిన్నతనం నుంచి స్నేహితులు, పియుసి నుంచి ఎంబియే వరకు కలిసే చదువుకున్నారు. హెచ్‌ ఆర్‌లో ఎంబిఏ చదివిన తరువాత అషిత ఎంఎస్‌ చేయటం కోసం ఇంగ్లండ్‌ వెళ్లింది. షకీల్‌ కూడా మార్కెటింగ్‌లో ఎంబియే చదివాడు. మాండ్యలోనే వుంటూ తన తండ్రి చేస్తున్న బియ్యం, బెల్లం వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు, డక్కన్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ అనే సంస్ధకు యజమానిగా వున్నాడు. తనకు వివాహం చేసుకోవాలని లేదని మా కుమార్తె చాలా కాలంగా చెబుతోంది. అయితే తరువాత తాను షకీల్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. మేమందరం సంతోషంగా అంగీకరించాం. మా వైపు మరియు షకీల్‌ తరఫు బంధువులు కూడా సంతోషంగా వున్నారు. ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా వివాహం ఆగదు. వివాహం అంటే రెండు హృదయాల కలయిక దానిని నెవరూ వేరు చేయలేరు.’అని కూడా అషిత తండ్రి చెప్పారు.

   ఈ వివాహాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భజరంగ దళ్‌ నేత సిటి మంజునాధ మాట్లాడుతూ ఈ వివాహం పట్ల తమకు అభ్యంతరం లేదని అయితే తాము లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నామని, అషిత మతం మార్చేందుకుగాను ఆమెకు ఖురాన్‌ నేర్పుతున్నారని ఆరోపించాడు. తాము మత మార్పిడులకు వ్యతిరేకం తప్ప వివాహానికి కాదన్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా అనేక మంది వక్కలిగ కులపు అమ్మాయిలు లవ్‌జీహాద్‌కు గురయ్యారని ఆరోపించాడు. అషిత ఇప్పటికే మతంతో పాటు పేరు కూడా మార్చుకుందని తమకు తెలిసిందని, అబ్బాయే ఎందుకు మతం మార్చుకోకూడదు లేదా వివాహం తరువాత ఎవరి మతాన్ని వారు ఎందుకు అనుసరించకూడదని మాత్రమే తాము చెబుతున్నామన్నారు.

    ఇది వ్యక్తిగత వ్యవహారాలను మతపరంగా నియంత్రించేందుకు పూనుకోవటం తప్ప మరొకటి కాదు. మేజర్లయిన స్త్రీ,పురుషులు తమ వివాహం, మతం కలిగి వుండటం లేదా లేకుండా వుండటం అన్నది వారి వ్యక్తిగత వ్యహారం తప్ప బిజెపి, సంఘపరివార్‌ చెప్పినట్లు నడవాలనటం నిరంకుశ ధోరణులకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. దీన్ని సహిస్తే ఇలాంటి శక్తులు మరింతగా పేట్రేగి పోతాయి. దేశంలోని అనేక ప్రాంతాలలో హిందూ మతానికే చెందినప్పటికీ దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన యువకులను అగ్రవర్ణాలవారని చెప్పుకొనే కుటుంబాల యువతులను వివాహం చేసుకుంటే వారిని హత్య చేయటానికి కూడా వెనుకాడని వుదంతాలు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. అందువలన భజరంగదళ వంటి కాషాయతాలిబాన్లు ముస్లిం లేదా క్రైస్తవ మతాల వారినే కాదు, హిందూ మతంలో కులాంతర వివాహాలను కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే మనువాద వ్యవస్ధను సజీవంగా వుంచాలని ప్రయత్నిస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు.జనాన్ని మతపరంగా చీల్చి తమ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నించే ఇలాంటి శక్తులను వ్యతిరేకించి ధైర్యంగా తమ బిడ్డలకు మతాంతర వివాహం చేస్తున్న అషిత,షకీల్‌ తలిదండ్రులు ఎంతైనా అభినందనీయులు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వివేకానంద స్వామికీ తప్పని కుల వివక్ష !!

12 Tuesday Jan 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Hinduism, Swami Vivekananda, VHP

Swami Vivekananda, National Youth Day, Parliament of World's Religions

సత్య

రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమోదించిన తమ రాజ్యాంగం గురించి అమెరికన్లు ఏమనుకుంటున్నారు? పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో కేవలం 51శాతం మందే రాజ్యాంగానికి ఓటు వేస్తామని ప్రకటించారు. పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ అమెరికా అనే సంస్ధ జరిపిన సర్వేలో 22శాతం మంది తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పగా మరో 27శాతం ఎటూ చెప్పలేమని అన్నారు. అంతకు ముందు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా జరిగిన సమయంలో అనేక మంది తమ రాజ్యాంగంలోని అంశాలు కమ్యూనిస్టు మానిఫెస్టోలోని వని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తమ రాజ్యాంగం గురించి అమెరికన్లు ఇప్పుడే మనుకుంటున్నారు ?

హక్కుల బిల్‌ అంటే (బిల్‌ ఆఫ్‌ రైట్స్‌) స్వంత ఇల్లు కలిగి వుండే హక్కు అని ప్రతి ముగ్గురిలో ఒకరు, సమాన పనికి సమానవేతనాన్ని గ్యారంటీ చేసేదని నలుగురికి ఒకరు, ప్రభుత్వంలోని మూడు శాఖలు అని 31శాతం, ఏ ఒక్కశాఖనూ గుర్తించలేని వారు 32శాతం, 5-4గా వున్న సుప్రీం కోర్టు తీర్పులను పార్లమెంట్‌ లేదా దిగువ కోర్టుల పరిశీలనకు తిప్పిపంపటంగా 28శాతం అనుకుంటున్నారట. ఈ సర్వే గత ఆగస్టులో జరిగింది. అన్నింటి కంటే విచిత్రం ఏమంటే పదిమందిలో ఒకరు పెంపుడు జంతువును కలిగి వుండే హక్కుకు గ్యారంటీ అని భావించటం.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాసుకున్న రాజ్యాంగానికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు, ఆచరణలో అది అమలు జరగనపుడు జనంలో ఇలాంటి అభిప్రాయాలే ప్రబలుతాయి. ఈ రోజు అమెరికాలో వాడు గాకపోతే వీడు, వీడు గాకపోతే వాడు అన్నట్లు అటు డెమోక్రాట్లు లేదా ఇటు రిపబ్లికన్లుగానీ అమెరికా రాజ్యాంగ స్ఫూర్తిని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన ఘనులు. నైతికంగా ఏమాత్రం తగనివారు.

అలాగే ఈ రోజు మన దేశంలో వివేకానందుడు ఎవరు అంటే ఆయన కూడా సంఘపరివార్‌కు చెందిన తొగాడియా, యోగి ఆదిత్యనాధ్‌, సాధ్వి రితంబరి తదితర మతోన్మాద స్వాములు, సాధువులు, సాధ్వుల కోవకు చెందిన మరో స్వామీజీ అని చెప్పే ప్రమాదం లేకపోలేదు. ఒక్కశాతం కూడా నైతిక అర్హతలేని సంఘపరివార్‌ శక్తులు ఆయన బొమ్మలను వుపయోగించుకొని వూరూ వాడా ప్రచారం చేసిన కారణంగా ఆయన కూడా వారి భావజాలపు వ్యక్తి కానట్లయితే వారెందుకు అంతగా భుజానికెత్తుకుంటారు, కనుక ఆయన గురించి పెద్దగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని భావించేవారెందరో వున్నారంటే అతిశయోక్తికాదు. వివేకానందుడు ఒక విధంగా సంఘసంస్కర్తల పరంపరకు చెందిన వారని చెప్పవచ్చు.అందువలన ఇతర సంస్కర్తల మాదిరే ఆయనకూ పరిమితులు వుంటాయి.

వివేకానందుడు వివిధ అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే అసహనం అందునా పరమత అసహనం కొంత మందిలో నరనరానా జీర్ణించి వున్న స్ధితిలో ఒక వేళ ఆయనే తిరిగి వచ్చి మాట్లాడితే మైనారిటీ మతాలను సంతృప్తిపరచేందుకు చూస్తున్న కాషాయం ధరించిన కుహనా హిందువు అని ట్యాగ్‌ తగిలించినా ఆశ్చర్యం లేదు. ‘ పశ్చిమ దేశాల వారు భారత్‌ నుంచి ఒక విషయం తప్పక నేర్చుకోవాలి అదేమంటే సహనం. సారం ఒకటే అయినందున అన్ని మతాలూ మంచివే.’ అని అమెరికాలోని బ్రూక్లిన్‌ ఎథికల్‌ సొసైటీ సందర్శన సందర్బంగా వివేకానందుడు చెప్పారు. క్షుద్ర పూజలు హిందూమతంలో భాగం కాదని కూడా చెప్పారు. కానీ నేడు ఎక్కడ చూసినా క్షుద్రపూజలు చేయని, చేయించని స్వామీజీలు ఎవరో చెప్పండి. ఎవరైనా చివరికి ఆ వివేకానందుడే వచ్చి అభ్యంతరం చెప్పినా ముందు గూండాలతో గెంటేయిస్తారు, సాధ్యంగాకపోతే మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆందోళనలు చేయించి పోలీసుల చేత బయటకు నెట్టిస్తారు. భారత్‌లో మహిళలు అంతగా వున్నత స్ధాయిల్లోకి రాకపోవటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు వివిధ యుగాలలో దుర్మార్గులైన దురాక్రమణదారులు ఒక పెద్ద కారణమైతే భారతీయుల స్వయంకృతం కూడా పాక్షికంగా దానికి దోహదం చేసిందన్నారు.మహిళలను శబరిమల దేవాలయంలోకి అనుమతించకపోవటంపై సోమవారం నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా వివేకానందుడు హర్షించి వుండేవాడు.(మనం ఎక్కడున్నాం ! నికితా అజాద్‌కు జేజేలు !! https://vedikaa.com/2015/12/22/open-letter-to-devaswom-chief-sabrimala/) మనం స్వయం కృతంతో మహిళలపై విధించిన అర్ధంలేని ఆంక్షలలో అదొకటి. మతం ఆధారంగా తప్పించి రాజ్యాంగం ప్రకారం మహిళల ఆలయ ప్రవేశాన్ని నిషేధించజాలరని సుప్రీం కోర్టు పేర్కొన్నది. రుతుక్రమంలో వున్న మహిళలు దేవాలయ ప్రవేశం చేయకూడదని, అలా చేస్తే పవిత్రతకు భంగం అని హిందూమతం ఎక్కడ చెప్పిందన్నది ప్రశ్న.

హిందూ మత పవిత్రతను పరిరక్షించేందుకు పవిత్ర భారత భూమి నుంచి ఎవరూ బయటికి పోగూడదని, వెళ్లిన వారిపై శాస్త్రాలు ఆంక్షలు విధించినట్లు కొందరు టీకా తాత్పర్యం చెబుతున్నారు. వేల సంవత్సరాలనాడే భారత్‌ నుంచి హిందూమతం ప్రాచ్య రాజ్యాలుగా పిలిచే తూర్పు ఆసియా ప్రాంతానికి విస్తరించినట్లు మనకు తెలుసు.ఇదంతా దాదాపు రెండు వేల సంవత్సరాల పూర్వమే జరిగిందన్నది చరిత్ర. దాదాపు అన్ని దేశాలలో హిందూ దేవాలయాలు, పురాణ ఇతిహాసాలు ఏదో ఒక రూపంలో అక్కడ ఇప్పటికీ ప్రచారంలో వున్నాయి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో వుండే జనాభాలో 90శాతం మంది హిందువులే. అక్కడ రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన మతాలలో హిందూ ఒకటి. హిందూమతం పుట్టినప్పటి నుంచి నిజంగా ఈ ఆంక్షలు వుండి వుంటే సముద్రాలు దాటి అంతదూరం ఎలా వెళ్లి వుండేది?

హిందూ మతానికి సంబంధించి అనేక అంశాలు తిరోగమనంగా వున్నాయి. వాటిని వదిలించుకొని పురోగమించాలి. సాటి మనిషిని మనిషిగా గుర్తించని ఏ మతమైనా కాలగతిలో అదృశ్యం కావాల్సిందే. హిందూ మతం గొప్పతనం గురించి చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశాలలో గొప్పగా ప్రసంగించారని కీర్తించబడుతున్న వివేకానందుడు అక్కడ ఈ మతంలోని తిరోగమన అంశాలను చెప్పి వుండుంటే పరిస్ధితులు మరొక రకంగా వుండి వుండేవి? ఆ మత ఛాందసానికి తానే గురి అవుతానని అమెరికా వెళ్లటానికి ముందు వివేకానందుడు ఊహించి వుండడు. ఆశ్చర్యంగా వుంది కదూ !!

మత నిషేధాలను వుల్లంఘించి సముద్రయానం ద్వారా విదేశీ ప్రయాణం చేసినందుకు నాటి బెంగాలీ కులీనులు ఆయనను అంటరాని వాడిగా పరిగణించారు. 1897లో అమెరికా నుంచి కొల్‌కతా తిరిగి వచ్చినపుడు ఏం జరిగిందో శైలేంద్రనాధ్‌ ధార్‌ రాసిస వివేకానందుడి జీవిత చరిత్ర వివరించింది. 1897 మార్చి 21న స్వామి 40 సంవత్సరాల పాటు నివసించిన దక్షిణేశ్వర్‌లోని కాళీ మాత ఆలయ సందర్శనకు ఖేత్రి మహారాజుతో కలసిపెద్ద పరివారంతో వచ్చాడు. ఆ సందర్బంగా జరిగిన వుదంతంపై తరువాత పత్రికల్లో పెద్ద వివాదమైంది. మహారాజులు, స్వామి వంటి పెద్దలు వచ్చినపుడు ముందుగా తెలియచేయటం, ఆలయ యజమాని బాబు త్రిలోక్యనాధ్‌ బిస్వాస్‌ స్వయంగా వచ్చి ఆహ్వానించటం అక్కడి సంప్రదాయం. ఆలయ సందర్శన వివాదంపై ది వంగాభాషీ అనే పత్రిక స్వామి, ఆయన అనుచరులను ఆలయం నుంచి బయటకు పంపించారని రాసింది. దీనిపై త్రిలోక్యనాధ్‌ స్పందిస్తూ ‘స్వామి, రాజాను ఆహ్వానించాల్సిందిగా నేను ఎవరినీ ఆదేశించలేదు, స్వయంగా రాలేదు. ఒక విదేశానికి వెళ్లి ఇంకా తనను తాను హిందువును అని చెప్పుకొనే వారితో కలవాలని ఏమాత్రం భావించలేదు, వివేకానంద, ఆయన అనుచరులు ఆలయం వదలి వెళ్లేటపుడు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని అనుచరులతో చెప్పాను. మీరు పత్రికలో రాసినట్లుగా దేవతను సాయంత్రం పునరాభిషేకం (శుద్ధి) చేసిన మాట అక్షరాలా నిజం’ అని పేర్కొన్నారు.(దళితులు ఎక్కడైనా ఆలయ ప్రవేశం చేసినపుడు తరువాత ఆలయాన్ని శుద్ధి చేస్తున్న తీరు ఇప్పటికీ జరుగుతున్నది)

ఈ వుదంతంపై రాణి రాసమణీ కుటుంబ సభ్యులొకరు ఒక పత్రికకు లేఖ రాస్తూ త్రిలోక్యనాధ్‌ ఆలయయజమానిగా చెప్పుకొనటాన్ని అభ్యంతర పెట్టారు. తానే యజమానినని త్రిలోక్య తిరుగు జవాబు ఇచ్చారు. స్వామి వ్యతిరేక పత్రికలు ఈ వివాదాన్ని ఏదో రూపంలో కొనసాగించాయి. స్వామి పాత స్నేహితులుగా వున్నవారు కూడా తరువాత కాలంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. వారిలో ఒకరైన డాక్టర్‌ బర్రోస్‌ చికాగోలో స్వామిని సమర్ధించి కొల్‌కతా వచ్చిన తరువాత వివేకానందుడు నిజమైన హిందువు కాదని, అమెరికాలో హిందూయిజం గురించి మాట్లాడలేదని పేర్కొన్నాడు. వివేకానందుడి జీవిత చరిత్రలో ప్రస్తావించిన ఈ అంశం మంచి చెడ్డలను పక్కన పెడితే వివేకానందుడికి కూడా బహిష్కరణ తప్పలేదన్నది వాస్తవం. అయితే ఈ వివాదం, తనకు జరిగిన అవమానం, వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని వివేకానందుడు పెద్దగా పట్టించుకోలేదని జీవిత చరిత్ర రచయిత పేర్కొన్నారు. అందుకు దృష్టాంతంగా 1897 మే 30వ తేదీన రాసిన ఒక లేఖలోని అంశాలను పేర్కొన్నారు.’మత కర్మకాండలు శూద్రులకు వుద్దేశించినవి కావని మన శాస్త్రాలు చెప్పాయి. ఆహార విషయంలో వివక్ష, విదేశీ ప్రయాణంపై ఆంక్షలతో నాకు నిమిత్తం లేదు మరియు అవన్నీ నావరకు పనికిమాలినవి. నేను శూద్రుడిని మరియు మ్లేచ్ఛుడిని, ఈ సూత్రాల పాటింపు గురించి నేనెందుకు ఆందోళన చెందాలి? హిందూ సమాజంలోని అంటరానివారు మరియు మ్లేచ్ఛుల ఆహారం తీసుకోవటం నాకు సంబంధించిన విషయం.’ అని పేర్కొన్నారు.

వివేకానందుడిని స్వదేశంలో బహిష్కరించారంటూ డాక్టర్‌ బర్రోస్‌, మరికొందరు క్రైస్తవ మిషనరీలు విదేశాలలో కూడా చేస్తున్న ప్రచారం ఆయన దృష్టికి వచ్చింది. దాని గురించి మేరీ హేల్‌కు రాసిన లేఖలో ‘ ఒక సన్యాసిగా నాకు ఒక కులం అంటూ వుంటే కదా పోవటానికి అని ప్రశ్నిస్తూ నేను ఎలాంటి కులాన్ని పోగొట్టుకోలేదు కానీ సముద్రప్రయాణాన్ని వ్యతిరేకించేవారు నేను ఒక పశ్చిమ దేశానికి పోవటం గురించి కకావికలయ్యారు. మరోవైపు నేను సన్యాసిగా మారటానికి ముందు నా కులానికి చెందిన ఒక ప్రముఖ రాజు గారు నేను అమెరికా నుంచి వచ్చి ఆశ్రమంలో ప్రవేశించే ముందు నా గౌరవార్ధం పెద్ద విందు ఇచ్చారు. దానిలో ఆ కులానికి చెందిన పెద్ద వారందరూ వున్నారు. నేను బయట వీధులలోకి వెళ్లినపుడు శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు అవసరమై వుండి వుంటే అది నిజంగా బహిష్కరణ అయివుండేది అని పేర్కొన్నారు.

ఇంత జరిగాక కూడా హిందూ సమాజానికి నిజమైన ప్రతినిధులుగా చెప్పుకొనే వారిలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారణంగానే తరువాత అంబేద్కర్‌ వంటి వారు మనువాద హిందూ వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. అందువలన వివేకానందుడి జీవితంలోని అనేక అంశాలపై మరో కోణంలో విశ్లేషణ జరపాల్సి వుంది. సముద్ర ప్రయాణంపై వున్న ఆంక్షలను ఖాతరు చేయకపోవటం, దిగువతరగతి కులాలనే బడేవారితో కలసి భోజనం చేయటంలోనూ, మ్లేచ్ఛులుగా పక్కన పెట్టాలని ఆదేశించిన వారితో కలసి సభలు, సమావేశాల్లో పాల్గొనటం వంటి వాటిని ఆచరించిన వివేకానంద స్వామి సమాజంలో పురోగామి బాటలో తీసుకున్న నిర్ణయాలుగానే భావించాలి. తమను హిందువులుగా చెప్పుకున్నవారందరినీ హిందూ మతోన్మాదులుగా చూడాల్సిన అవసరం లేదు. ఆ పేరుతో వున్మాదాన్ని రెచ్చగొట్టేవారికి, ఇతరులకు వున్న తేడాను గమనించాలి. ఆ రీత్యా వివేకానంద స్వామిని మనం నిత్యం చూసే కరడు గట్టిన తిరోగమన, పరమత ద్వేషాన్ని నిత్యం నూరిపోసే విశ్వహిందూ స్వామీజీలు, సాధ్వుల సరసన పెట్టి చూడాల్సిన అవసరం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Vishwa Hindu Parishad Decides To Set Up Temple For Lord Ram In Every Village

11 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Ram temple, VHP

PTILUCKNOW — With Ayodhya Ram Temple issue bouncing back to the centre stage of Uttar Pradesh politics ahead of the 2017 Assembly polls, VHP has decided to construct temples in every village across the country.”The organisation has decided to set up a temple of Lord Ram in every village,” spokesman of Vishwa Hindu Parishad (VHP) Sharad Sharma said today.He said from April 15 — Ram Navami — the organiation would start a seven-day-long Ram Mahotsava.”During this period Lord Ram will be worshipped in every village,” he told .Sharma said the target is to reach 1.25 lakh villages.

“We had been observing Ram Mahotsava in the past and the organisation has already reached 70,000-75,000 villages pan India,” he said.

Sharma said that during Ram Mahotsava, statues of Lord Ram would be worshipped.

“Whether it is a statue or picture it will be installed at a place after worship,” he said.

The Ayodhya Ram temple issue is pending before the Supreme Court but it is again in focus in UP politics ahead of Assembly elections next year.

​BJP leader Subramanian Swamy recently exuded confidence that work on the construction of the Ram Temple in Ayodhya would start before the year-end. He, however, made it clear that the temple would not come up through a movement but only after the court verdict, which he hoped would come by August-September, and with the mutual consent of Muslim and Hindu communities.

Asked if raising the Ram temple issue was linked to Uttar Pradesh Assembly elections in early 2017, he said, “Ram should not be linked with elections. Ram is a matter of faith for Hindus and construction of the temple at Ayodhya is a commitment of every Hindu.”

“It’s a matter of faith for crores of Hindus in the country and we want to realise the dream of our patron late Ashok Singhal,” Sharma said when asked about Swamy’s comment.

Singhal had died on November 17 at the age of 89.

Ruling Samajwadi Party in Uttar Pradesh has said that no temple would be allowed to be built at the disputed site in Ayodhya without the court’s permission.

Senior SP leader and minister Shivpal Singh Yadav said not a single brick would be allowed to move without the court’s nod. In December last year two trucks of stones arrived in the temple city almost six months after VHP announced its nationwide drive to collect stones for construction of Ram temple in Ayodhya.

“Two trucks of stones have been unloaded at Ram Sewak Puram, a VHP property in Ayodhya, and Shila Pujan (praying of the stones) has been performed by Mahant Nritya Gopal Das, the president of Ram Janam Bhumi Nyas,” Sharma said. “Now, the time has come for the construction of Ram Mandir in Ayodhya. Lot of stones have arrived in Ayodhya. And now the arrival of stones will continue. We have signals from Modi government that Mandir construction would be done now,” Das had claimed.

Asserting its resolve to build the Ram temple, the VHP had in June last year announced a nationwide drive to collect stones for construction of the temple and had also asked the Muslim community not to pose any hindrance.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

IT IS POLITICAL STONE THAT VHP IS TAKING TO AYODHYA: HINDU MAHASABHA

22 Tuesday Dec 2015

Posted by raomk in Communalism, Current Affairs, NATIONAL NEWS, Others, RELIGION

≈ Leave a comment

Tags

AYODHYA, HINDU MAHASABHA, POLITICAL STONE, VHP

New Delhi, 22 Dec 2015: Two days after media reports about first lot of stones having reached Ayodhya allegedly for construction of Ram Temple, Hindu Mahasabha has come out opposing the move and termed it as ‘political stone’ that Vishwa Hindu Parishad is taking there.

Addressing a press conference in Delhi on Tuesday, Swami Chakrapani, National President, Akhil Bharat Hindu Mahasabha, said: “It is political stone that (they are taking to Ayodhya). I want to tell VHP, Sangh Parivar and BJP to stop searching for political stone.”

Swami Chakrapani said he believes in law and wants Ram Temple under the law not through communal politics.

“Even before the verdict (of Allahabad High Court) came, I had said in 2010 that I can never support construction of a temple on dead bodies. I demanded fast-track court for the (Babri Masjid-Ram Janmabhoomi) case so that judgment can come fast. Leave aside the stone and bricks of Vishwa Hindu Parishad. It is their internal politics. If verdict comes in our favour today we will construct the temple with gold, leave aside stone. But that should be done under the law” he said.

“Leave aside the issue of stone (being sent to Ayodhya). It is political stone that (they are taking to Ayodhya). I want to tell VHP, Sangh Parivar and BJP to stop searching for political stone.”

Swami Chakrapani also condemned the alleged blasphemous remarks of a person called Kamlesh Tiwari.

“I was saddened with remarks of Kamlesh Tiwari about Prophet Muhammad. I felt sad as much as I was when Aamir Khan disrespected gods and goddesses in PK film. We opposed him and asked our office to find about his details. We found he was removed from our organisation in 2008. If he were with it today, I would have removed him. He does not deserve to be called Hindu. Similarly if a Muslim disrespects other’s religion cannot be Muslim,” said Swami.

Sharing the dais with leaders from Muslim, Sikh and Christian communities including Maulana Tauqeer Raza Khan, Swami Chakrapani demanded a strong anti-blasphemy law in the country.

“There is a need for religious communities – Hindus, Muslims, Christians, Sikhs – to take a vow that they would not allow anyone to hurt other’s religion. We demand strong anti-blasphemy law and such people should be strongly punished.”

“Such people are of no worth. They make such statement for which they can’t get respect even in their family, leave aside the society. It becomes an issue between Hindus and Muslims and the man becomes hero. We should not allow this thing to happen. It is the duty of us religious leaders to join hands and stop such people,” he said.

No indication from PM on Ram temple: VHP

The Vishwa Hindu Parishad (VHP) has said that there was no indication from Prime Minister Narendra Modi on the construction of Ram temple in Ayodhya.

In a statement on Monday, VHP general secretary Champat Rai said: “VHP is of the view that Ram Mandir at Ayodhya should be built through an act of parliament. VHP has always respected the court and have faith in it.”

“Time has come for the construction of Ram Mandir in Ayodhya. Lot of stones arrived. And now the arrival of stones will continue. We have signals from Modi government that the construction of temple would be done now,” media reports had quoted Mahant Nritya Gopal Das, president of Ram Mandir Nyas, as saying.

“Reports published in media are false. Arrival of stones is a common practice and since 1990, thousands of trucks full of stones have arrived and kept at Ramghat Karyashala after fretwork (nakkashi),” Rai said.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: